వికీవ్యాఖ్య
tewikiquote
https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.6
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీవ్యాఖ్య
వికీవ్యాఖ్య చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
సద్దామ్ హుసేన్
0
6164
26525
23178
2026-06-15T17:44:15Z
CommonsDelinker
22
Removing [[:c:File:Iraq,_Saddam_Hussein_(222).jpg|Iraq,_Saddam_Hussein_(222).jpg]], it has been deleted from Commons by [[:c:User:Abzeronow|Abzeronow]] because: per [[:c:Commons:Deletion requests/File:Iraq, Saddam Hussein (222).jpg|]].
26525
wikitext
text/x-wiki
సద్దామ్ హుసేన్ ఇరాక్ దేశ మాజీ అధ్యక్షుడు, 1979 జూలై 16 నుండి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్ ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్, 2003 లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబర్ 30 న ఉరితీయబడ్డాడు.
<ref>https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B1%8D_%E0%B0%B9%E0%B1%81%E0%B0%B8%E0%B1%87%E0%B0%A8%E0%B1%8D</ref>
== వ్యాఖ్యలు ==
*ఇరాక్ ను వదులుకోకుండా మా [[ఆత్మ]]లను, మన పిల్లలను, మా కుటుంబాలను [[త్యాగము|త్యాగం]] చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అమెరికా తన ఆయుధాలతో ఇరాకీల సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయగలదని ఎవరూ అనుకోరు.<ref>https://www.brainyquote.com/authors/saddam-hussein-quotes</ref>
*అల్లాహ్ మన పక్షాన ఉన్నాడు. అందుకే దురాక్రమణదారుడిని కొడతాం.
*[[రాజకీయం]] అంటే మీరు ఒక పని చేయబోతున్నామని, మరొకటి చేయాలనుకుంటున్నారని చెప్పినప్పుడు. అప్పుడు మీరు చెప్పినది, అనుకున్నది చేయరు.
*నువ్వెవరివి, నువ్వెవరివి?... నాకు తెలియాలి.
*ఎవరైతే దేవుని మార్గంలో పోరాడతారో వారే విజయం సాధిస్తారు.
== మూలాలు ==
{{reflist}}
{{wikipedia}}
[[వర్గం:పురుషులు]]
[[వర్గం:1937 జననాలు]]
[[వర్గం:2006 మరణాలు]]
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
7wqg0y5xbhnaqm6ol1s0k7iknb2qwoa
ఆధునిక భారతీయ చిత్రకళ
0
6991
26523
26522
2026-06-15T17:27:26Z
Veera.sj
1008
/* వ్యాఖ్యలు */ ** నైవేలి తులి (22:06 - 22:48)
26523
wikitext
text/x-wiki
[[File:Raja Ravi Varma - Mahabharata - Shakuntala.jpg|thumb|భారతీయ పౌరాణిక పాత్రలను పాశ్చాత్య శైలిలో, మానవ రూపాలలో, అప్పటి వరకూ భారతీయ చిత్రకళలో లేని తైలవర్ణాలతో చిత్రీకరించటంతో అతని అద్భుత ప్రతిభను ప్రశంసించిన వర్గం ఒకటైతే, పాశ్చాత్య శైలిని అనుకరించటం భారతీయ చిత్రకళకు అవమానమని విమర్శించిన వర్గం మరొకటి]]
'''[[w:ఆధునిక భారతీయ చిత్రకళ|ఆధునిక భారతీయ చిత్రకళ]]''' సాంప్రదాయిక [[w:భారతీయ చిత్రకళ|భారతీయ చిత్రకళ]] పై పాశ్చాత్య ప్రభావాలకు ప్రతిస్పందనగా ఏర్పడిన ఒక అధునాతన చిత్రకళా శైలి.
== వ్యాఖ్యలు ==
* వలస పాలన వచ్చిన తర్వాత (సాంఘిక అవసరాలకు, వ్యక్తిగత భావోద్వేగాలకు మధ్య ఉండే సమతౌల్యతను) కొనసాగించటంలో ఒక పెద్ద విరామం వచ్చింది. ఆ విరామం వల్ల వచ్చిన ప్రభావాలనే భారతీయ కళాకారులు గత నూరేళ్లుగా ఎదుర్కొంటూ, దానికి తగినట్టు తమ పనిని మార్చుకుంటూ వచ్చారు
** దూరదర్శన్ ప్రసారం చేసిన '''The Paintings of India''' శీర్షిక -, ''Development of the Modern Idiom Part -I'' అనే లఘుచిత్రంలో రంజిత్ హొస్కోటే (03:20 - 03:36)({{Cite web|url=https://www.youtube.com/watch?v=Pnjt34Mpr6A&list=PLPahQu0Yh9xDgnKMM1wq7hP9J7xULD4vP&index=4|title=The Paintings of India - Development of the Modern Idiom Part -I|last=National|first=Doordarshan|date=|website=youtube.com|url-status=live|access-date=10 May 2026}})
* ఒకప్పుడు చిత్రకళలో సామాజిక అవసరాలు, వ్యక్తిగత వ్యక్తీకరణ—ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన సమతుల్యం ఉండేది. ఆ సమతుల్యం… సామ్రాజ్యవాదం వచ్చిన తర్వాత పూర్తిగా దెబ్బతింది. సాంప్రదాయిక కళాశాలలు/శిక్షణా విధానాలు చెదిరిపోయాయి; కొత్తగా వచ్చిన రూపాలు మాత్రం చారిత్రక నేపథ్యం లేకుండా వచ్చాయి. ఈ మార్పు వలన, భారతీయ చిత్రకారుడు ఒకరకంగా తటస్థుడు అయిపోయాడు. ఒక వైపు—తన ఆలోచనలు, తన కళాత్మక భావనలను సూత్రీకరించే వ్యవస్థ ఏదీ లేకపోవడం; మరో వైపు—తన భావనను వ్యక్తపరచాలనే బలమైన తపన ఉన్నా, దానికి స్ఫూర్తి అయిన సంప్రదాయం, గతం ఏదీ లేకపోవడం వల్ల భారతీయ కళాకారుడు అంతులేని అయోమయంలో చిక్కుకున్నాడు.
** యశోదర దాల్మియా ((03:36 - 04:31)
* సాధారణంగా ఆధునిక భారతీయ చిత్రకళా చరిత్రను చెప్పేటప్పుడు మనం అబనీంద్రనాథ్ ఠాగూర్ నుండి ప్రారంభిస్తాం—ఆయన మొదలుపెట్టిన ఉద్యమం తర్వాత ‘[[w:బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్|బెంగాల్ స్కూల్]]’గా ప్రసిద్ధి చెందింది. కానీ...చరిత్ర పుటలను ఇంకాస వెనక్కి తిరగేసి చూస్తే...అంటే పదొమ్మిదో శతాబ్దం మధ్యకాలానికి, అదే భారతదేశంలో మొదటి కళాశాలలు ఏర్పడిన సమయానికి. ఎందుకంటే ఆ కాలంలోనే ఒక కొత్త సామాజిక, వృత్తిపరమైన కళా వర్గం—కళాకారుల కొత్త తరగతి—పుట్టుకొచ్చింది. అంటే, అప్పటి వరకు ఉన్న కళాకారులకు పూర్తిగా భిన్నమైన, మధ్యతరగతిలోనే నిపుణులైన కళాకారుల సమూహం రంగంలోకి వచ్చింది. మొదట్లో వీరిలో చాలామంది ఆయిల్ పెయింటింగ్, అకాడెమిక్ రియలిజం వంటి పాశ్చాత్య శైలులను అభ్యసించినవారే. అయినప్పటికీ, ఆ కాలపు కళా ప్రపంచాన్ని వీరే ప్రధానంగా నడిపించారు. దక్షిణంలో [[w:రాజా రవి వర్మ|రాజా రవి వర్మ]] వంటి వ్యక్తి—జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందిన వ్యక్తి—మనకు వెంటనే గుర్తుకు వస్తాడు. అదే సమయంలో, ఈ తొలి పాశ్చాత్య-శైలి అకాడెమిక్ కళాకారుల్లో చాలామంది ఆధునిక భారతదేశానికి ‘జాతీయ కళ’ అనే వర్గాన్ని నిర్మించాలనే ప్రయత్నంలో కూడా సమానంగా పాల్గొన్నారు. భారతీయ అంశాలను చిత్రీకరించడం, భారతీయ కళారాధకులలో ఒక కొత్త రకమైన రసవత్తరమైన కళను వ్యాపింపజేయటం—ఇవన్నీ వారి ఆసక్తులలో భాగం.
** తపతి గుహ-ఠాకుర్తా (06:35 - 08:03)
* ...ప్రాథమికంగా రవివర్మ పాశ్చాత్య శైలిని ఉపయోగించి భారతీయ పురాణాలలో నిక్షిప్తమైన ధార్మిక భావాలు, రంగులు, వస్త్రాలు, ఆచార-సాంప్రదాయాలు, [[రామాయణం]], మహాభారతం, వంటి ఇతిహాసాలు, భారతీయ సంస్కృతిలో నాటుకుపోయిన ఇతర కథలను [[చిత్రలేఖనం|చిత్రకళ]] లోకి తీసుకువచ్చాడు. అయితే, తను ఉపయోగించిన శైలి మాత్రం, భారతీయ సాంప్రదాయనికి పూర్తిగా భిన్నమైనది.
** నైవేలి తులి (08:41 - 9:10)
* రవివర్మ పాశ్చాత్యులు అధికారంలో ఉన్నప్పుడు పని చేస్తూ, సామ్రాజ్యవాద వ్యవస్థలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవటానికి ప్రయత్నించాడు. అతను ఏ విషకోరలకు బలి కాలేదు, వారి ప్రభావానికి అతని కళ బానిస కాలేదు. తైలవర్ణ చిత్రకళ అనే ఒక సరిక్రొత్త మాధ్యమాన్ని తన ఇష్టంతోనే నేర్చుకుని దానిని తాను ఎలా అర్థం చేసుకొన్నాడో ఈ ప్రపంచానికి తన చిత్రకళ ద్వారా తెలిపాడు. పంథొమ్మిదవ శతాబ్దపు చివరి రోజుల్లో చిత్రకళలో సంభవిస్తోన్న మహత్తర మార్పులకు అవగతం చేసుకొని కళా రూపాంతరం అనే బృహత్కార్యాన్ని చేపట్టాడు. ఐరోపా చిత్రకళతో సేవలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని, అతడి ప్రజ్ఞాపాటవాలను వినియోగించి చిత్రకళారంగంలో అతిపెద్ద చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టాడు
** గీతా కపూర్ (09:50 - 10:31)
* రవి వర్మకు ప్రతిస్పందనగా, ఆయన ప్రోత్సహించిన చిత్రకళా ధోరణికి వ్యతిరేకంగా, అబనీంద్రనాథ్ ఠాగూర్, ఆనంద కుమారస్వామి, ఎర్నెస్ట్ బిన్ఫీల్డ్ హేవెల్ ల త్రయం కలిసి [[w:బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్|బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్]] ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. భారతీయ సాంప్రదాయ చిత్రకళ అయిన అజంతా చిత్రాలను, భారతీయ సూక్ష్మచిత్రకళా సంప్రదాయాలైన [[w:మొఘల్ చిత్రకళ|మొఘల్ చిత్రకళ]], పహారీ సూక్ష్మచిత్రకళ వంటి వాటిని స్ఫూర్తిగా పరిగణించి, ఈ శైలి పురాణం–ధర్మం వంటి విషయాలను చిత్రకళా సారాంశాలుగా పరిగణించినా, ఇందులోని రేఖానిర్మాణం, రంగులను వినియోగించే తీరు, దృశ్యం యొక్క కూర్పు వంటి అంశాలు రవి వర్మ శైలికి పూర్తి భిన్నంగా — వినూత్నంగా ఏర్పరచటం జరిగింది..
** నైవేలి తులి (11:25 - 12:11)
* (బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనబడే ఈ) కొత్త కళా ఉద్యమం (Academic Realism అనే) ఈ పాశ్చాత్య ప్రభావాన్ని ఏ మాత్రం అనుకరణాత్మకమైనది కాదని, సామ్రాజ్యవాద ప్రభావితమైనదని, కళా సౌందర్య విలువ లేనిదని ముద్రలు వేసి పూర్తిగా తిరస్కరించటానికి ప్రయత్నించలేదు. అబనీంద్రనాథ్ మరియు ఆయన తొలి దశ శిష్యులు చేయాలనుకున్నది — ఒక కొత్త జాతీయ కళను పునర్నిర్మించడం. అయితే వారి ప్రధాన ఆందోళన పాశ్చాత్య అకాడెమిక్ విధానాల నుండి బయటపడటం, మరియు వారు ‘ఆదర్శవాద ఆధ్యాత్మిక కళ’గా భావించిన కొత్త శైలిని నిర్మించడం. అబనీంద్రనాథ్ ఉద్యమంలో కళాకారుల సమూహాన్ని నిర్మించడంపై సమానమైన ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక క్రొత్త శైలిని ఏర్పరచాలనే సంకల్పం ఉంది; జాతీయ భావంతో కూడుకొన్న ఈ సరికొత్త కళ అనే ప్రాజెక్టు ఒక వ్యక్తి చేత సాధ్యం కాదని ఆయన నమ్మాడు. దానికి ఒక ఉద్యమం కావాలి, దానికి అనుచరులు కావాలి అని గుర్తించాడు. ఇక్కడే ఒక విరోధభావం ఉత్పన్నమవుతుంది — నిజమైన భారతీయ కళ అంటే ఇదే - అనిపించేలా ఒక నిర్ధిష్ట రూపకల్పనను విస్తృతంగా వ్యాప్తి చేయటం పైనే ఆ కాలంలో ఈ బెంగాలీ శైలి కళాఉద్యమం యొక్క విజయం ఆధారపడి ఉండేది. ఈ బలమే, తర్వాత ఈ ఉద్యమం యొక్క ప్రధాన బలహీనతగా కూడా మారింది. నిజమైన భారతీయ కళ - అనే భావన పునరావృత్తం అవుతూ ఉండటం, ఒక విధమైన సూత్రీకృత రూపంలోకి మారిపోవటంతో తర్వాతి తరం యొక్క ఆధునిక భారతీయ చిత్రకళాకారులు ఈ భావన నుండి నిదానంగా దూరం అవ్వటం మనం చూశాము.
** తపతి గుహ-ఠాకుర్తా (13:28 - 28:43)
* 1920లో కళాభవన్ స్థాపించబడినప్పుడు, అది జాతీయవాద కళా ఉద్యమం లో ఒక ప్రధానమైన విరామాన్ని సూచించింది. నిజానికి, జోరాసాంకో (రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క) ఇంట్లో అభివృద్ధి చెందిన భారతీయ శైలి, చిత్రకళలో ఉన్న ప్రతిబంధకాలు, అత్యంత సాంప్రదాయబద్ధమైన స్వభావం అని కళకు ఉండే అడ్డుగోడ పట్ల రవీంద్రనాథ్కు ఉన్న అసంతృప్తియే ఆయనను ఈ కొత్త కళా కేంద్రాన్ని స్థాపించడానికి ప్రేరేపించింది. ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం — కళను ప్రకృతితో, దైనందిన జీవితంతో, ముఖ్యంగా ఆయన చెప్పినట్లుగా జీవించి ఉన్న జానపద మరియు గ్రామీణ సంప్రదాయాలతో మళ్లీ అనుసంధానించడం. ఇది ఆధునిక భారతీయ కళా ఉద్యమంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది, ఎందుకంటే భారతీయ కళ తన ప్రాచీన, శాస్త్రీయ మూలాల నుండి లేదా మధ్యయుగ సభా సంప్రదాయాల నుండి దూరమై, చుట్టూ ఉన్న జీవన సంప్రదాయాలను — దైనందిన జీవితాన్ని — కళగా చూడడం ప్రారంభించింది. 1920ల నాటికి, అతీత తత్వవాదం, ఆదర్శవాదం వంటి భావాలపై చర్చ తగ్గి, భారతీయ కళను పునరుజ్జీవింపజేయడం, భారతదేశపు ఆత్మను కళలోకి తీసుకురావడం వంటి ఆలోచనలు ముందుకు వచ్చాయి. ఎందుకంటే వారు కనుగొన్న ‘జీవించి ఉన్న భారతదేశం’ అనేది గ్రామీణ భారతదేశమే.
** తపతి గుహ-ఠాకుర్తా (15:42 - 28:43)
* బెంగాల్ స్కూల్ నుండి పుట్టిన ఉద్భవించిని ప్రముఖ కళాకారులలో ఒకరు నందలాల్ బోస్ — ఈయన ఆధునిక భారతీయ చిత్రకళక్లోని అత్యుత్తమ కళాకారుల్లో ఒకరు. ఆయన మొదట అభనింద్రనాథ్ టాగోర్ శిష్యుడిగా ప్రారంభించి, తరువాత రవీంద్రనాథ్ ఆయనను శాంతినికేతన్ కు ఆహ్వానించినప్పుడు, ఆయన దృష్టికి యొక్క వైశాల్యం పెరిగింది. అక్కడి గ్రామీణ వాతావరణం, కళాకారుడి దైనందిన జీవితం, సాధారణ ప్రజల జీవన విధానం, అలాగే ప్రకృతి — ఇవన్నీ ఆయనకు సహజమైన ప్రేరణలుగా మారాయి.
** నైవేలి తులి ((17:55 - 18:24)
* నందలాల్ బోస్ ఆధునిక కళాకారుడి భావజాలాన్ని జానపద సంప్రదాయాలతో మళ్లీ అనుసంధానించే ప్రయత్నంలో నిజంగా అగ్రగామిగా నిలిచాడు. ఈ అనుసంధానికి ప్రధాన మలుపు (19)30వ దశకంలో వచ్చింది. 1938లో హరిపుర కాంగ్రెస్ సభ కోసం చిత్రలేఖనం చేయమని ఆహ్వానించినపుడు, ఈ పరిణామం చోటు చేసుకొంది. దైనందిన గ్రామ జీవితం నుండి గ్రహించబడ్డ వివిధ పాత్రలను నందలాల్ బోస్ ఒక వెల్లువ లాగా చిత్రీకరించాడు. ఆ చిత్రపటాలలో అతని యొక్క ముద్ర/శైలి ప్రస్ఫుటంగా కనబడేలా రూపకల్పన చేశాడు. వాటిని మనం ఇప్పుడు చూస్తే మాత్రం అవి మనకు ఆ నాటి గ్రామీణ ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబించగలిగే ఆధునిక కళాఖండాల లాగా కనబడతాయి
** తపతి గుహ ఠాకుర్తా (18:25 - 28:43)
* ఆధునిక భారతీయ చిత్రకళలో జామిని రాయ్ కూడా ప్రాధాన్యం కలిగినవాడే. భారతీయ జానపద/ఆదివాసీ చిత్రకళా సంప్రదాయాల వైపు తిరిగి వెళ్ళాలని సంకల్పించడమే అతనికి ఈ ప్రధాన స్థానాన్ని సంపాదించి పెట్టింది. కాలిఘాట్ మరియు ఇతర జానపద శైలుల నుండి స్ఫూర్తిని పొంది ఆయన వినియోగించే రంగులు/రేఖలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని రుఫొందించుకొని కళకు నూతన భాష్యాన్ని పలికాడు. ఆయనకు సంబంధంలేని, పూర్తిగా భిన్నమైన క్రైస్తవ ఇతివృత్తాలు, బైబిల్ అధ్యయనం వంటి అంశాలను, 1940లలో చిత్రీకరించి తన నూతన శైలిని స్పష్టం చేసాడు. తన ఇతివృత్తాలను దూరమైనా, ఇలాంటి అన్య ఇతివృత్తాలను కూడా తాను ఒక కొత్త శైలిలో చిత్రీకరించగలడని, వాటికి ప్రాతినిధ్యం వహించగలడని, తెలుసుకొన్నాడు.
** నైవేలి తులి (19:55 - 20:42)
* జామిని రాయ్ తో బాటు, గగనేంద్రనాథ్ కూడా కొంతవరకు తనకంటూ ప్రత్యేకంగా ఒక శైలిగల కళాకారుడు. ఏ ఒక్క సమూహాన్ని, భావనను, ఉద్యమాన్ని అనుసరించకుండా, అనేకమంది కళాకారులను ప్రోత్సహించి, పెంపొందిచిన నిజమైన కళాభిమాని. 1920లలోనే పాశ్చాత్య కళను ప్రేరణామూలంగా పరిగణించిన తొలి భారతీయ ఆధునిక చిత్రక్రారులలో గగనేంద్రనాథ్ కూడా ఒకరు. రవీంద్రనాథ్ ఠాగూర్ తో కలిసి విదేశాలకు వెళ్ళాడు. జర్మన్ ఎక్స్ప్రెషనిస్టుల ప్రభావం, భారీ వుడ్ కట్ ప్రదర్శనలు, ఇవన్నీ ఆ కాలంలో క్యూబిజం వైపు దృష్టి మరల్చాయి. క్యూబిజం అప్పట్లో అత్యంత ముఖ్యమైన కళా ఉద్యమం అయినప్పటికీ భారతదేశంలోకి అది అంత త్వరగా చేరలేదు.
** నైవేలి తులి (20:42 - 21:31)
* 1940ల ప్రారంభంలో, యూరోపియన్ మాడర్నిజం పట్ల భారతీయ కళా ప్రపంచంలో ఒక కొత్త ఆసక్తి పుట్టుకొచ్చింది. ఆ మార్పు ఆసాంతంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి [[అమృతా షేర్-గిల్]]. పాశ్చాత్య ప్రభావాన్ని స్వాగతించిన ఆమె, భారతీయ కళలో అప్పటివరకు కనిపించని పోస్ట్–ఇంప్రెషనిస్టు రంగుల భావన, ఆకృతుల విన్యాసాన్ని తీసుకువచ్చింది. 1930ల చివర్లో ఆమె ఒక ప్రతీకాత్మక వ్యక్తిగా ఎదిగి, అనేకమంది కళాకారులను రంగుల వినియోగం, నిర్మాణం గురించి అధ్యయనం చేయడానికి స్ఫూర్తినిచ్చింది. ఈ విధంగా ఆమె [[ఆధునిక భారతీయ చిత్రకళ]]కు ఒక దృఢమైన పునాదిని వేసింది.
** నైవేలి తులి (22:06 - 22:48)
{{Wikipedia}}
[[వర్గం:భారతీయ చిత్రకళ]]
iu2rben7ufy52kiy94xekhalg0ezdjb
26524
26523
2026-06-15T17:34:50Z
Veera.sj
1008
ముల్క్ రాజ్ ఆనంద్ (22:50 - 23:03)
26524
wikitext
text/x-wiki
[[File:Raja Ravi Varma - Mahabharata - Shakuntala.jpg|thumb|భారతీయ పౌరాణిక పాత్రలను పాశ్చాత్య శైలిలో, మానవ రూపాలలో, అప్పటి వరకూ భారతీయ చిత్రకళలో లేని తైలవర్ణాలతో చిత్రీకరించటంతో అతని అద్భుత ప్రతిభను ప్రశంసించిన వర్గం ఒకటైతే, పాశ్చాత్య శైలిని అనుకరించటం భారతీయ చిత్రకళకు అవమానమని విమర్శించిన వర్గం మరొకటి]]
'''[[w:ఆధునిక భారతీయ చిత్రకళ|ఆధునిక భారతీయ చిత్రకళ]]''' సాంప్రదాయిక [[w:భారతీయ చిత్రకళ|భారతీయ చిత్రకళ]] పై పాశ్చాత్య ప్రభావాలకు ప్రతిస్పందనగా ఏర్పడిన ఒక అధునాతన చిత్రకళా శైలి.
== వ్యాఖ్యలు ==
* వలస పాలన వచ్చిన తర్వాత (సాంఘిక అవసరాలకు, వ్యక్తిగత భావోద్వేగాలకు మధ్య ఉండే సమతౌల్యతను) కొనసాగించటంలో ఒక పెద్ద విరామం వచ్చింది. ఆ విరామం వల్ల వచ్చిన ప్రభావాలనే భారతీయ కళాకారులు గత నూరేళ్లుగా ఎదుర్కొంటూ, దానికి తగినట్టు తమ పనిని మార్చుకుంటూ వచ్చారు
** దూరదర్శన్ ప్రసారం చేసిన '''The Paintings of India''' శీర్షిక -, ''Development of the Modern Idiom Part -I'' అనే లఘుచిత్రంలో రంజిత్ హొస్కోటే (03:20 - 03:36)({{Cite web|url=https://www.youtube.com/watch?v=Pnjt34Mpr6A&list=PLPahQu0Yh9xDgnKMM1wq7hP9J7xULD4vP&index=4|title=The Paintings of India - Development of the Modern Idiom Part -I|last=National|first=Doordarshan|date=|website=youtube.com|url-status=live|access-date=10 May 2026}})
* ఒకప్పుడు చిత్రకళలో సామాజిక అవసరాలు, వ్యక్తిగత వ్యక్తీకరణ—ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన సమతుల్యం ఉండేది. ఆ సమతుల్యం… సామ్రాజ్యవాదం వచ్చిన తర్వాత పూర్తిగా దెబ్బతింది. సాంప్రదాయిక కళాశాలలు/శిక్షణా విధానాలు చెదిరిపోయాయి; కొత్తగా వచ్చిన రూపాలు మాత్రం చారిత్రక నేపథ్యం లేకుండా వచ్చాయి. ఈ మార్పు వలన, భారతీయ చిత్రకారుడు ఒకరకంగా తటస్థుడు అయిపోయాడు. ఒక వైపు—తన ఆలోచనలు, తన కళాత్మక భావనలను సూత్రీకరించే వ్యవస్థ ఏదీ లేకపోవడం; మరో వైపు—తన భావనను వ్యక్తపరచాలనే బలమైన తపన ఉన్నా, దానికి స్ఫూర్తి అయిన సంప్రదాయం, గతం ఏదీ లేకపోవడం వల్ల భారతీయ కళాకారుడు అంతులేని అయోమయంలో చిక్కుకున్నాడు.
** యశోదర దాల్మియా ((03:36 - 04:31)
* సాధారణంగా ఆధునిక భారతీయ చిత్రకళా చరిత్రను చెప్పేటప్పుడు మనం అబనీంద్రనాథ్ ఠాగూర్ నుండి ప్రారంభిస్తాం—ఆయన మొదలుపెట్టిన ఉద్యమం తర్వాత ‘[[w:బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్|బెంగాల్ స్కూల్]]’గా ప్రసిద్ధి చెందింది. కానీ...చరిత్ర పుటలను ఇంకాస వెనక్కి తిరగేసి చూస్తే...అంటే పదొమ్మిదో శతాబ్దం మధ్యకాలానికి, అదే భారతదేశంలో మొదటి కళాశాలలు ఏర్పడిన సమయానికి. ఎందుకంటే ఆ కాలంలోనే ఒక కొత్త సామాజిక, వృత్తిపరమైన కళా వర్గం—కళాకారుల కొత్త తరగతి—పుట్టుకొచ్చింది. అంటే, అప్పటి వరకు ఉన్న కళాకారులకు పూర్తిగా భిన్నమైన, మధ్యతరగతిలోనే నిపుణులైన కళాకారుల సమూహం రంగంలోకి వచ్చింది. మొదట్లో వీరిలో చాలామంది ఆయిల్ పెయింటింగ్, అకాడెమిక్ రియలిజం వంటి పాశ్చాత్య శైలులను అభ్యసించినవారే. అయినప్పటికీ, ఆ కాలపు కళా ప్రపంచాన్ని వీరే ప్రధానంగా నడిపించారు. దక్షిణంలో [[w:రాజా రవి వర్మ|రాజా రవి వర్మ]] వంటి వ్యక్తి—జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందిన వ్యక్తి—మనకు వెంటనే గుర్తుకు వస్తాడు. అదే సమయంలో, ఈ తొలి పాశ్చాత్య-శైలి అకాడెమిక్ కళాకారుల్లో చాలామంది ఆధునిక భారతదేశానికి ‘జాతీయ కళ’ అనే వర్గాన్ని నిర్మించాలనే ప్రయత్నంలో కూడా సమానంగా పాల్గొన్నారు. భారతీయ అంశాలను చిత్రీకరించడం, భారతీయ కళారాధకులలో ఒక కొత్త రకమైన రసవత్తరమైన కళను వ్యాపింపజేయటం—ఇవన్నీ వారి ఆసక్తులలో భాగం.
** తపతి గుహ-ఠాకుర్తా (06:35 - 08:03)
* ...ప్రాథమికంగా రవివర్మ పాశ్చాత్య శైలిని ఉపయోగించి భారతీయ పురాణాలలో నిక్షిప్తమైన ధార్మిక భావాలు, రంగులు, వస్త్రాలు, ఆచార-సాంప్రదాయాలు, [[రామాయణం]], మహాభారతం, వంటి ఇతిహాసాలు, భారతీయ సంస్కృతిలో నాటుకుపోయిన ఇతర కథలను [[చిత్రలేఖనం|చిత్రకళ]] లోకి తీసుకువచ్చాడు. అయితే, తను ఉపయోగించిన శైలి మాత్రం, భారతీయ సాంప్రదాయనికి పూర్తిగా భిన్నమైనది.
** నైవేలి తులి (08:41 - 9:10)
* రవివర్మ పాశ్చాత్యులు అధికారంలో ఉన్నప్పుడు పని చేస్తూ, సామ్రాజ్యవాద వ్యవస్థలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవటానికి ప్రయత్నించాడు. అతను ఏ విషకోరలకు బలి కాలేదు, వారి ప్రభావానికి అతని కళ బానిస కాలేదు. తైలవర్ణ చిత్రకళ అనే ఒక సరిక్రొత్త మాధ్యమాన్ని తన ఇష్టంతోనే నేర్చుకుని దానిని తాను ఎలా అర్థం చేసుకొన్నాడో ఈ ప్రపంచానికి తన చిత్రకళ ద్వారా తెలిపాడు. పంథొమ్మిదవ శతాబ్దపు చివరి రోజుల్లో చిత్రకళలో సంభవిస్తోన్న మహత్తర మార్పులకు అవగతం చేసుకొని కళా రూపాంతరం అనే బృహత్కార్యాన్ని చేపట్టాడు. ఐరోపా చిత్రకళతో సేవలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని, అతడి ప్రజ్ఞాపాటవాలను వినియోగించి చిత్రకళారంగంలో అతిపెద్ద చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టాడు
** గీతా కపూర్ (09:50 - 10:31)
* రవి వర్మకు ప్రతిస్పందనగా, ఆయన ప్రోత్సహించిన చిత్రకళా ధోరణికి వ్యతిరేకంగా, అబనీంద్రనాథ్ ఠాగూర్, ఆనంద కుమారస్వామి, ఎర్నెస్ట్ బిన్ఫీల్డ్ హేవెల్ ల త్రయం కలిసి [[w:బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్|బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్]] ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. భారతీయ సాంప్రదాయ చిత్రకళ అయిన అజంతా చిత్రాలను, భారతీయ సూక్ష్మచిత్రకళా సంప్రదాయాలైన [[w:మొఘల్ చిత్రకళ|మొఘల్ చిత్రకళ]], పహారీ సూక్ష్మచిత్రకళ వంటి వాటిని స్ఫూర్తిగా పరిగణించి, ఈ శైలి పురాణం–ధర్మం వంటి విషయాలను చిత్రకళా సారాంశాలుగా పరిగణించినా, ఇందులోని రేఖానిర్మాణం, రంగులను వినియోగించే తీరు, దృశ్యం యొక్క కూర్పు వంటి అంశాలు రవి వర్మ శైలికి పూర్తి భిన్నంగా — వినూత్నంగా ఏర్పరచటం జరిగింది..
** నైవేలి తులి (11:25 - 12:11)
* (బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనబడే ఈ) కొత్త కళా ఉద్యమం (Academic Realism అనే) ఈ పాశ్చాత్య ప్రభావాన్ని ఏ మాత్రం అనుకరణాత్మకమైనది కాదని, సామ్రాజ్యవాద ప్రభావితమైనదని, కళా సౌందర్య విలువ లేనిదని ముద్రలు వేసి పూర్తిగా తిరస్కరించటానికి ప్రయత్నించలేదు. అబనీంద్రనాథ్ మరియు ఆయన తొలి దశ శిష్యులు చేయాలనుకున్నది — ఒక కొత్త జాతీయ కళను పునర్నిర్మించడం. అయితే వారి ప్రధాన ఆందోళన పాశ్చాత్య అకాడెమిక్ విధానాల నుండి బయటపడటం, మరియు వారు ‘ఆదర్శవాద ఆధ్యాత్మిక కళ’గా భావించిన కొత్త శైలిని నిర్మించడం. అబనీంద్రనాథ్ ఉద్యమంలో కళాకారుల సమూహాన్ని నిర్మించడంపై సమానమైన ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక క్రొత్త శైలిని ఏర్పరచాలనే సంకల్పం ఉంది; జాతీయ భావంతో కూడుకొన్న ఈ సరికొత్త కళ అనే ప్రాజెక్టు ఒక వ్యక్తి చేత సాధ్యం కాదని ఆయన నమ్మాడు. దానికి ఒక ఉద్యమం కావాలి, దానికి అనుచరులు కావాలి అని గుర్తించాడు. ఇక్కడే ఒక విరోధభావం ఉత్పన్నమవుతుంది — నిజమైన భారతీయ కళ అంటే ఇదే - అనిపించేలా ఒక నిర్ధిష్ట రూపకల్పనను విస్తృతంగా వ్యాప్తి చేయటం పైనే ఆ కాలంలో ఈ బెంగాలీ శైలి కళాఉద్యమం యొక్క విజయం ఆధారపడి ఉండేది. ఈ బలమే, తర్వాత ఈ ఉద్యమం యొక్క ప్రధాన బలహీనతగా కూడా మారింది. నిజమైన భారతీయ కళ - అనే భావన పునరావృత్తం అవుతూ ఉండటం, ఒక విధమైన సూత్రీకృత రూపంలోకి మారిపోవటంతో తర్వాతి తరం యొక్క ఆధునిక భారతీయ చిత్రకళాకారులు ఈ భావన నుండి నిదానంగా దూరం అవ్వటం మనం చూశాము.
** తపతి గుహ-ఠాకుర్తా (13:28 - 28:43)
* 1920లో కళాభవన్ స్థాపించబడినప్పుడు, అది జాతీయవాద కళా ఉద్యమం లో ఒక ప్రధానమైన విరామాన్ని సూచించింది. నిజానికి, జోరాసాంకో (రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క) ఇంట్లో అభివృద్ధి చెందిన భారతీయ శైలి, చిత్రకళలో ఉన్న ప్రతిబంధకాలు, అత్యంత సాంప్రదాయబద్ధమైన స్వభావం అని కళకు ఉండే అడ్డుగోడ పట్ల రవీంద్రనాథ్కు ఉన్న అసంతృప్తియే ఆయనను ఈ కొత్త కళా కేంద్రాన్ని స్థాపించడానికి ప్రేరేపించింది. ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం — కళను ప్రకృతితో, దైనందిన జీవితంతో, ముఖ్యంగా ఆయన చెప్పినట్లుగా జీవించి ఉన్న జానపద మరియు గ్రామీణ సంప్రదాయాలతో మళ్లీ అనుసంధానించడం. ఇది ఆధునిక భారతీయ కళా ఉద్యమంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది, ఎందుకంటే భారతీయ కళ తన ప్రాచీన, శాస్త్రీయ మూలాల నుండి లేదా మధ్యయుగ సభా సంప్రదాయాల నుండి దూరమై, చుట్టూ ఉన్న జీవన సంప్రదాయాలను — దైనందిన జీవితాన్ని — కళగా చూడడం ప్రారంభించింది. 1920ల నాటికి, అతీత తత్వవాదం, ఆదర్శవాదం వంటి భావాలపై చర్చ తగ్గి, భారతీయ కళను పునరుజ్జీవింపజేయడం, భారతదేశపు ఆత్మను కళలోకి తీసుకురావడం వంటి ఆలోచనలు ముందుకు వచ్చాయి. ఎందుకంటే వారు కనుగొన్న ‘జీవించి ఉన్న భారతదేశం’ అనేది గ్రామీణ భారతదేశమే.
** తపతి గుహ-ఠాకుర్తా (15:42 - 28:43)
* బెంగాల్ స్కూల్ నుండి పుట్టిన ఉద్భవించిని ప్రముఖ కళాకారులలో ఒకరు నందలాల్ బోస్ — ఈయన ఆధునిక భారతీయ చిత్రకళక్లోని అత్యుత్తమ కళాకారుల్లో ఒకరు. ఆయన మొదట అభనింద్రనాథ్ టాగోర్ శిష్యుడిగా ప్రారంభించి, తరువాత రవీంద్రనాథ్ ఆయనను శాంతినికేతన్ కు ఆహ్వానించినప్పుడు, ఆయన దృష్టికి యొక్క వైశాల్యం పెరిగింది. అక్కడి గ్రామీణ వాతావరణం, కళాకారుడి దైనందిన జీవితం, సాధారణ ప్రజల జీవన విధానం, అలాగే ప్రకృతి — ఇవన్నీ ఆయనకు సహజమైన ప్రేరణలుగా మారాయి.
** నైవేలి తులి ((17:55 - 18:24)
* నందలాల్ బోస్ ఆధునిక కళాకారుడి భావజాలాన్ని జానపద సంప్రదాయాలతో మళ్లీ అనుసంధానించే ప్రయత్నంలో నిజంగా అగ్రగామిగా నిలిచాడు. ఈ అనుసంధానికి ప్రధాన మలుపు (19)30వ దశకంలో వచ్చింది. 1938లో హరిపుర కాంగ్రెస్ సభ కోసం చిత్రలేఖనం చేయమని ఆహ్వానించినపుడు, ఈ పరిణామం చోటు చేసుకొంది. దైనందిన గ్రామ జీవితం నుండి గ్రహించబడ్డ వివిధ పాత్రలను నందలాల్ బోస్ ఒక వెల్లువ లాగా చిత్రీకరించాడు. ఆ చిత్రపటాలలో అతని యొక్క ముద్ర/శైలి ప్రస్ఫుటంగా కనబడేలా రూపకల్పన చేశాడు. వాటిని మనం ఇప్పుడు చూస్తే మాత్రం అవి మనకు ఆ నాటి గ్రామీణ ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబించగలిగే ఆధునిక కళాఖండాల లాగా కనబడతాయి
** తపతి గుహ ఠాకుర్తా (18:25 - 28:43)
* ఆధునిక భారతీయ చిత్రకళలో జామిని రాయ్ కూడా ప్రాధాన్యం కలిగినవాడే. భారతీయ జానపద/ఆదివాసీ చిత్రకళా సంప్రదాయాల వైపు తిరిగి వెళ్ళాలని సంకల్పించడమే అతనికి ఈ ప్రధాన స్థానాన్ని సంపాదించి పెట్టింది. కాలిఘాట్ మరియు ఇతర జానపద శైలుల నుండి స్ఫూర్తిని పొంది ఆయన వినియోగించే రంగులు/రేఖలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని రుఫొందించుకొని కళకు నూతన భాష్యాన్ని పలికాడు. ఆయనకు సంబంధంలేని, పూర్తిగా భిన్నమైన క్రైస్తవ ఇతివృత్తాలు, బైబిల్ అధ్యయనం వంటి అంశాలను, 1940లలో చిత్రీకరించి తన నూతన శైలిని స్పష్టం చేసాడు. తన ఇతివృత్తాలను దూరమైనా, ఇలాంటి అన్య ఇతివృత్తాలను కూడా తాను ఒక కొత్త శైలిలో చిత్రీకరించగలడని, వాటికి ప్రాతినిధ్యం వహించగలడని, తెలుసుకొన్నాడు.
** నైవేలి తులి (19:55 - 20:42)
* జామిని రాయ్ తో బాటు, గగనేంద్రనాథ్ కూడా కొంతవరకు తనకంటూ ప్రత్యేకంగా ఒక శైలిగల కళాకారుడు. ఏ ఒక్క సమూహాన్ని, భావనను, ఉద్యమాన్ని అనుసరించకుండా, అనేకమంది కళాకారులను ప్రోత్సహించి, పెంపొందిచిన నిజమైన కళాభిమాని. 1920లలోనే పాశ్చాత్య కళను ప్రేరణామూలంగా పరిగణించిన తొలి భారతీయ ఆధునిక చిత్రక్రారులలో గగనేంద్రనాథ్ కూడా ఒకరు. రవీంద్రనాథ్ ఠాగూర్ తో కలిసి విదేశాలకు వెళ్ళాడు. జర్మన్ ఎక్స్ప్రెషనిస్టుల ప్రభావం, భారీ వుడ్ కట్ ప్రదర్శనలు, ఇవన్నీ ఆ కాలంలో క్యూబిజం వైపు దృష్టి మరల్చాయి. క్యూబిజం అప్పట్లో అత్యంత ముఖ్యమైన కళా ఉద్యమం అయినప్పటికీ భారతదేశంలోకి అది అంత త్వరగా చేరలేదు.
** నైవేలి తులి (20:42 - 21:31)
* 1940ల ప్రారంభంలో, యూరోపియన్ మాడర్నిజం పట్ల భారతీయ కళా ప్రపంచంలో ఒక కొత్త ఆసక్తి పుట్టుకొచ్చింది. ఆ మార్పు ఆసాంతంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి [[అమృతా షేర్-గిల్]]. పాశ్చాత్య ప్రభావాన్ని స్వాగతించిన ఆమె, భారతీయ కళలో అప్పటివరకు కనిపించని పోస్ట్–ఇంప్రెషనిస్టు రంగుల భావన, ఆకృతుల విన్యాసాన్ని తీసుకువచ్చింది. 1930ల చివర్లో ఆమె ఒక ప్రతీకాత్మక వ్యక్తిగా ఎదిగి, అనేకమంది కళాకారులను రంగుల వినియోగం, నిర్మాణం గురించి అధ్యయనం చేయడానికి స్ఫూర్తినిచ్చింది. ఈ విధంగా ఆమె [[ఆధునిక భారతీయ చిత్రకళ]]కు ఒక దృఢమైన పునాదిని వేసింది.
** నైవేలి తులి (22:06 - 22:48)
* భారతీయులను ఆమె (అమృత) చూసింది అన్యుల దృక్కోణంలో అయినా ఆమె కోరిక మాత్రం భారతీయ ఆంతరంగికులతో కలిసి పోవాలనే!
** ముల్క్ రాజ్ ఆనంద్ (22:50 - 23:03)
{{Wikipedia}}
[[వర్గం:భారతీయ చిత్రకళ]]
c27kggb19yz9fq5er8umhj7gutd03ed