వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.23 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk పుట:Sarada Lekhalu Vol 1.pdf/4 104 59158 552035 186679 2026-04-08T09:13:34Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 552035 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{c|2}}</noinclude><center>{{p|fs150}}శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు.</p></center> ఈధన్యజీవిని, తెనుఁగుసీమలయందున్న తనజాతివారికి వివిధవిషయపరిజ్ఞానముఁ గలిగించు నుద్దేశముతో వ్రాసిన వివిధవిషయిక వ్యాసములే యీ, {{p|fs125|ac}}శారద లేఖలు.</p> వీటినిఁ జదువుటకుముం దీ సోదరీరత్నముయొక్క పూర్వవృత్తము నించుక యెరుగుట యప్రస్తుతము కాదు. ఈ కవయిత్రి, పాలపర్తివారింటి యాడపడుచు. తల్లిపేరు హనుమాయమ్మగారు; తండ్రిపేరు శేషయ్యగారు; బ్రాహ్మణులు, నార్వేలవారును భారద్వాజస గోత్రులు. వీరి కాపురస్థలము గుంటూరు మండలమందలి బాపట్ల. ఈ శేషయ్యగారు, బాపట్ల సబ్‌రిజిస్ట్రారు కచ్చేరీలో నొక యుద్యోగిగా నుండి మంచివ్య్వహార దక్షులను ప్రతీతిని గడించిరి. వీరికి రామమూర్తిగారు, నరసింహంగారు, భావనారాయణగారు, ఆంజనేయులుగారు, కృష్ణమూర్తిగారు ననువారు పుత్రులేవురును, సుబ్బలక్ష్మమ్మ, ఈవరలక్ష్మమ్మ, అనసూయమ్మగార్లను వారు పుత్రికలు మూవురును సన్తానము. 'జగమెరిఁగినబాపనయ్య'లగు నీ రామమూర్తిగారు మొదలగు సహోదరవర్గమును గురించి విశేషముగాఁ జెప్పనవ<noinclude></noinclude> hqdxwhmnnetuypd6cup6y8eflbii83a పుట:Sarada Lekhalu Vol 1.pdf/5 104 59159 552036 186777 2026-04-08T09:21:08Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 552036 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{c|3}}</noinclude>సరములేదు. మొదటివారు, 'దర్బారు' పత్రికాధిపతులు; రెండవవారు, 'ధర్మసాధనీ' నేతలు; మూడవవారొక డి॥ బోర్డు హైస్కూలులో నుపాధ్యాయులు; నాలవవారు ప్రకృతి చికిత్సాయోగ సాధకులు; పూర్వము బందరు జాతీయకళాశాలలో నధ్యాపకులుగా నుండినవారు; ఐదవవారు ప్రస్తుతము బాపట్ల పోస్టుమాస్టరుగా నున్నారు. ఇఁక నీ వరలక్ష్మమ్మగారియక్క, అచ్యుతుని వారికోడలు, స్వర్గస్థురాలైనది. ఆమె కిద్దరాడుపిల్లలు. చెల్లెలు, భీమరాజువారి కోడలు; తెనాలిలో నిపుడు మేజస్ట్రీటుగా నున్న శ్రీయుత శ్రీనివాసరావుగారి ధర్మపత్ని. ఈ మనసహోదరి శ్రీమతి వరలక్ష్మమ్మ గారు. 6-10-1896 తేదీని జన్మించెను. ఈయమకు సం 1909 రమునఁ బెండిలియైనది. అత్తవారు కనుపర్తివారు, ఆర్వేలవారు, కాశ్యపసగోత్రులు; బాపట్ల తాల్లూకా పందిళ్లపల్లి గ్రామస్థులును కరణీకోద్యోగులు. ఈమె యత్తగారిపేరు ఆదెమ్మగారు; మామగారిపేరు, రఘుపతిరావుగారు. ఈ రఘుపతిరాయదంపతులు, తమ బిడ్డల విద్యాభివృద్దికొరకుఁ బూర్వాగతమైన యాగ్రామకరణీకమును మానుకొని బాపట్లకు వచ్చిరి. వీరికి నలుగురు పుత్రులును, నొకకొమార్తెయు గలిగిరి. వీరిలో హనుమంతరావుగారు మూడవ కొమారులు. ఈయనయే మన వరలక్మమ్మగారి భర్త. వీ రారోగ్యశాఖ<noinclude></noinclude> e6hy3my2cpstdwygfaozh3dg4ajgkk1 పుట:Sarada Lekhalu Vol 1.pdf/6 104 59160 552037 186780 2026-04-08T09:31:18Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 552037 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{c|4}}</noinclude>(Sanitary dept)లోఁ జాలాకాలము పనిచేసి యందున్నతపదవుల నొందగలయర్హత సంపాదింపఁగోరి యింగ్లండునకు వెళ్లివచ్చిరి (1929) బాల్యమం దనఁగాఁ బెండిలిగాకమున్ను ఈమె, బాపట్లలోనున్న మిషన్ బాలికాపాఠశాలయందు నాలవతరగతి వరకును జదివెను. ఆవెనుక సంఘాచారముచొప్పున బడి మానివేసినను, విద్యాసక్తిమాత్రము విడువకుంట, మన యదృష్టమే యనవచ్చును. ఇంటియందే తన రెండవయన్నగారగు శ్రీయుత నరసింహంగారి నిరంతరసహాయ ప్రోత్సాహముల వలన, నర్సాపురం పరీక్షలు, విజ్ఞానచంద్రికాపరిషత్పరీక్షలు, భక్తిప్రచారిణీ పరీక్షలు మున్నగు వాటియం దుత్తీర్ణయై నర్సాపుర స్వర్ణపధకము, కేసరి స్వర్ణపదకము మొదలగు బహుమానములఁ బడసెను. సహజముగా స్త్రీవిద్యాభిమానులగు సహోదరులందరును జేయుచుండిన సహాయముచే నీయమ యొక వేయిపుస్తకములైననుఁ జదివెను. 'వసుమతి' యను నొక సాంఘికనవలను రచించి స్వర్గస్థురాలగు తనయక్క సుబ్బలక్ష్మమ్మగారి కంకితమిడి యంతటి చిన్నవయసుననే పేరువడెను. అప్పడప్పడే వెలువడసాగిన 'అనసూయ' ఈమెవ్రాతలఁ గండ్లనద్దుకొన్నది, అటుతరువాత 'నాంధ్రపత్రిక,' 'భార్రతి', 'ఆంధ్రలక్ష్మీ ', 'గృహలక్ష్మీ' మొదలగునవి యిూమె వ్రాతల కగ్రస్థానముల నీయసాగినవి, "ప్రపే<noinclude></noinclude> b2sq8yypnyib7ke8bnd8h1evj3o1q2n పుట:Sarada Lekhalu Vol 1.pdf/7 104 59161 552038 186238 2026-04-08T09:47:45Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552038 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|5}}</noinclude>దిరే ప్రాక్తనజన్మవిద్యా" యనుట సమంజసముకదా యిట్టి యెడల! <poem> {{left margin|5em}} "గీ॥ బ్రాహ్మధర్మ ప్రవిష్టుఁడు బ్రహ్మవిదుఁడు సత్యమార్గానువర్తి సుసౌమ్యమూర్తి యాంధ్రసాహితి ననుజాతనైన నాకు సాదరంబున నేర్పిన సజ్జనుండు పరమపావనమెనట్టి పాలపర్తి యన్వయసుధాబ్ధి సోముఁడై యవతరించి ధరను నరసింహమను పేరఁ బరఁగినాఁడు సోదరుండును గురుఁడునై సొరిదినొప్పు మాన్యచరితుఁ డాతనికి నమస్క_రింతు వసుమతీసతి చరితమున్ వ్రాయువేళ ॥" </poem> అని తనకింతయశము గల్గుటకు హేతుభూతుఁడగు నగ్రజన్మునియెడఁ గృతజ్ఞత దెలిపి యామహాశయుం డొసఁగిన శబ్దార్థచంద్రికయను నిఘంటువునే సారెకట్నముగా గ్రహించి యావల గృహిణీపదముఁ జొచ్చినది యీమె. ఇంక నత్తవారింటఁబడి యీచదువంతయు 'గుంటఁబెట్టి గంటకొట్టక' యుండున ట్లీ యువతీమతల్లికి భర్తగారి దన్నుదొరికినది. ఆవిషయమున మనసార నీమె యనిన మాటలే వ్రాయుటలెస్స.<noinclude></noinclude> c0uumaoegmjakoihukr1oshryif1kv1 పుట:Sarada Lekhalu Vol 1.pdf/8 104 59162 552058 186239 2026-04-08T11:34:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 552058 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|6}}</noinclude>"నా విద్యావిషయమున నేను స్వయంకృషిచే నలవర్చుకొన్న దాని కంటె, మాసోదరులు ప్రోత్సహించి నేర్పినదానికంటే, నాభర్తగారి సమ్మతియు సానుభూతియు ముఖ్యముగా ప్రస్తుతింపతగినవి. ఈవిషయ మున వారిఋణము నేనేవిధముగను తీర్చుకొనంజాలను. చదువుటయందును వ్రాయు యందును నా కెంత కుతూహలముండిన నేమి ! వారొక్కమా టతో నిరోధించినచో నాగిపోవలసినదే కదా ! వారెప్పుడు నట్టి ప్రాతి కూల్యత నావిద్యావిషయమున చూపకపోవుట చేతనే నేను, గత పదునారు సంవత్సరములనుండి, వ్యాసములను, లేఖలను, కథలను విరచించి, వివిధపత్రి కల కంపుటకును, సం 1931 రములో స్త్రీ సమాజము నెలకొల్పి దాని యభివృద్ధికై నిరంతరకృషి చేయుటకును, నా పొత్తములను ముద్రించి యాంధ్రమహాజనుల కరకమలముల నర్పించుటకును అవకాశము గల్గినది. కావున పూజ్యులగు నాభర్తగారి సానుభూతి, యన్నిటి దని నేను కృతజ్ఞతతో విన్నపము చేయుచున్నాను.” అని, న ఔనుకదా మరి ! "అ స్త్రీనేదు_గ స్త్రీనేదు పల్లకతొం గోయే” యన్న యట్టి భర్తలే యధికముగా నుండిన యప్పటి పరిస్థితులయం దిట్టి నవోఢలకు భర్తృముఖమునఁ గల్గు నిట్టి విద్యాప్రోత్సాహము సామాన్యమా !! ఈయమం గూర్చియుఁ దత్కృతములకు నీలేఖల గూర్చియు సం॥ 1930 రపు టేప్రిల్ మాసమందును. సం॥ 1988 రపు సెప్టెంబరు మాసమందును వెలువడిన 'గృహలక్ష్మి' దిలకింత్రుగాక ! , మరి యీమెవ్రాసిన 'విశ్వామిత్ర ' మొదలగు నితర గ్రంథములఁ జదువుదుమేని “ఈమెశైలి రెండుమూడు రీతుల<noinclude></noinclude> 2ddo5vka1zlp7aeip7mgykip7evnp1y పుట:Sarada Lekhalu Vol 1.pdf/9 104 59163 552069 186240 2026-04-08T11:42:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 552069 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|7}}</noinclude>నుండు”నని తెలియఁగలము. వాటిలో నీలేఖలయందున్నది "సొగసైన వాడుక భాష ఔను "సొగసైన వాడుక భాష యే. ఇది సజీవము. సమలంకృతము. కాలము సనుసరించి నూతనముగ నొక తెనుఁగు వ్యాకరణము రచియింపఁ గలఁచు వారికిది ప్రప్రధమాధారము. ఈమె పద్దెములనుగూడ వ్రాయఁగలదు కాని గద్యరచనయందే మక్కువ యెక్కువ. 'చచ్చి చెడి' యల్లిన చేపలబుట్ట"కంటె శ్రమలేక యల్లిన చక్కని చిక్కనిచాప, బహుతరోపయోగకరమనుట సరసు పెరుగు !! 66 ఇంకా నిందలి విషయములు హిస్టరీ, జాగ్రఫీలూ యిండ్లలో గుట్లు” గావు! ఈనాటి విద్యాధికుల తీవ్రతర తర్కోప తర్కముల కాస్పదములై యొప్పుచున్న రాజకీయ సాంఘిక నైతిక మతాది మహత్తరవిషయములు. అవియు స్త్రీల కెంతవరకు సంబంధించియుండునో అంతవరకు నిష్పా క్షికముగ, నిర్వక్రముగఁ బరిశీలింపఁ బడి ప్రాగ్పశ్చమములకుఁ గర్మసిద్ధాన్త సమన్వయముఁ జేయుచున్నవి. ఐనదానికినిఁ గాని దానికిని బురుషనిందసేయుట యను చకార్యమిందు మందున కై నఁ గానరాదు. ఆర్యావర్తమందు 'ఆనాడువలె నీనాడు నుండవలసిన గృహలక్ష్మీస్వరూప మిందు సమగ్రముగాఁ జిత్రితమైయున్నది. వివిధవర్ణనలతో సరసాలంకార శోభితమై వ్యంగ్యప్రధానమై<noinclude></noinclude> c625ae24h6nr3toilj89fs0yzx7jsic పుట:Sarada Lekhalu Vol 1.pdf/10 104 59164 552070 186241 2026-04-08T11:43:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 552070 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|8}}</noinclude>యొప్పుచున్న యీ లేఖాసమామ్నాయ మొక యుత్తమ కావ్య మనుటకు సందేహములేదు. నిజమైన హిందూమతము, నిజమైన హిందూగృహిణి, కల్పిత శారదాస్వరూపనామకమై 'గృహలక్ష్మీ' ముఖమునఁ బల్కు నిట్టిముద్దుమాటలు నాలించి యానందింపఁ జాలని వారుండఁజాలరనుట నిక్కువము. ప్రతితల్లియుఁ బ్రతి పిల్లయు నీపొ త్తముఁ జదివి తీరవలయును. ఇట్టి కవయిత్రికి సర్వేశ్వరుఁడు సమస్తవిభవములనిచ్చి సంరక్షించుఁగాత !!! గృహలక్ష్మీకార్యాలయం, ఎగ్మూరు, మద్రాసు, 1 2 34 ఇట్లు, హరిదాసు పసుమర్తి కృష్ణమూర్తి-<noinclude></noinclude> 5r2bhaqrtxj4g6nevh9pco0lrw347a2 పుట:Sarada Lekhalu Vol 1.pdf/11 104 59165 552071 188565 2026-04-08T11:43:58Z శ్రీరామమూర్తి 1517 552071 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>"శారద లేఖల”ను గుఱించి నా యభి ప్రాయము (రాయసం వెంకటశివుఁడు, గుంటూరు.) తా ఆంగ్ల సారస్వతమున స్త్రీహృదయ మంతగ ప్రస్ఫుటమగుచుండ లేదని యొక శతాబ్దము క్రిందట ఇంగ్లీషు రచయిత జాను స్టువర్టుమిల్లు మొఱపెట్టెను. -ప్రస్తు తాంధ్రవాఙ్మయమున నట్లే స్త్రీ రచనావిషయిక మగు కఱవు మిక్కుటముగనున్నది. మనదేశమున నిదివఱకు పురుషుఁడే, స్త్రీ స్వభావమునుగుఱించి పుస్తకరచన చేసెను; స్త్రీల హక్కులను గూర్చి సభలలోఁ బ్రసంగించెను; వార్తాపత్రికలలో వ్యాసరాజములు `వ్రాసెను. ఇపుడు స్త్రీలు ముందడుగువేసి, తమ సంగతులు ప్రస్తావించుకొనుచున్నారు. శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ గారు శారద లేఖలు తెనుఁగు సారస్వతమందలి యీ కొఱఁతను గొంత తీర్చుచున్నవి. ఆంగ్ల విద్య నేర్చి సట్టపరీక్షలందు జయమండుకున్నను, వరలక్ష్మమ్మగారు, పాశ్చాత్య విద్యావిధానముల చొప్పుననె చదువుకొని, ఇంగ్లీషు నభ్యసించిన యువతులకు సామాన్యముగ సాధ్యముగాని పాండిత్య ప్రకర్షయు వివేచనా. శక్తియును సంపాదించి, తేట తెలుఁగున రమ్యగ్రంథరచన యలవఱచు కొనిన సాధ్వీమణి, శారదాకల్పలతల మధ్య నడచిన లేఖలను పేరుతో, శ్రీమతి వరలక్ష్మమ్మ గారు ప్రస్తుత కాలమందలి ముఖ్యవిషయములు చర్చించి లిఖించిన వ్యాసావళియె యిది. ఇవి స్వల్ప సంగతులనియు, ఇవి మహద్విషయ ములనియు, శారద విచక్షణ చేయదు. సంక్రాంతి ముగ్గులవలెనే సరోజినీ<noinclude></noinclude> fw6o1jmukyk03fzbrsr0hqh407de4ii పుట:Sarada Lekhalu Vol 1.pdf/12 104 59166 552072 186243 2026-04-08T11:44:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 552072 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>దేవి యుపన్యాసమును, కన్నప్పకథయు, గౌరవబిరుదములవలెనే శారదా శాసన చర్చయు స్త్రీల నాటకరంగ ప్రవేశమును, శారదకు లేఖావిషయ లగుచున్నవి ! పుస్తకరచనమున ప్రాంతచారి త్రొక్కి పురుషుల యభి ప్రాయము లె చిలుక పలుకులవలె శారద, యేకరువు పెట్టునదికాదు. స్త్రీజన సహజనుగు సదయహృదయత, స్వభావసారళ్యమును, పుస్తకమందలి ప్రతి పుటయందును ప్రతిబింబితమగుచున్నవి. ఆంధ్రవాఙ్మయమున నీపుస్తకమునకు గౌరవస్థాన మొనఁగూర్చుట కిది యొక టియె చాలును. మందున్నను, రెయిలుపయనము చేయుచున్నను, పుణ్యతీర్థ సందర్శనమం దున్నను స్త్రీలసభలోఁ బాల్గొనుచున్నను, శారద యూహలు, పలుకులు హిందూయువిదవియె ! భావమున నెగాక భాషయందును ఈ లేఖావళియం దెల్లెడలను స్త్రీస్వభావము చిప్పిలుచున్నది! 'ఊరుగాయజాడీలకు పచ్చడి బానలకు మాత్రమె గెయిలంలో నొక పెట్టెయు, ఇంటియం దొకగదియు మనకుఁ గావలయును! ఈ మధ్య మన ప్రాంతములనుండి యొక గ్రీ గ్రామమున కుద్యోగ సందర్భమున నేతెంచిరి. వారి సామాను నాలుగైదు బండ్లు నిండియుండెను. మూడ తెచ్చిరి. ప్రాంతమున మంచములు వాడుకొను అభ్యాసములేదు!' అని శారద, తన తెలుఁగు చెలిక త్తెలను మెత్తని యెత్తిపొడుపుమాట అనుచున్నది! కాళ హ స్తిలో దొరకు కొయ్యదువ్వెనలు నల్ల గాజులును 9 ఐ మిగుల ప్రియము. ఈ దువ్వెనలను నిరాకరించి, విదేశపు మెఱుఁగు దువ్వెనల కెగఁబడు తెలుగుమగువలమీఁద్ర, స్వదేశవన్తుప్రియయగు శారద, కోపానల మిట్లు కురియుచున్నది 'మెఱుఁగే మన కనులలో కంపకొట్టుచున్నది. దువ్వెనలకు మెఱుఁగు, గాజులకు మెఱుఁగు, గుడ్డలకు మెఱుఁగు, మొగ ములకు మెఱుఁగు! ఈ విదేశపు మెఱుఁగులు మన మెఱుఁగును రూపుమాపు చున్నవి'' పువ్వులు దుఱుచుకొని, యొడలినిండ నగలు పెట్టు కొని, వన్నెవన్నెల విలువ చీరలు ధరించి, ప్రతి చిన్నహరికథకును తండోప తండములుగ వచ్చెడి బెజవాడ పుర వనితలు' ఇటీవల నచట జరిగిన ఆంధ్ర<noinclude></noinclude> ekqy2gw8yz6ntfobot1xruga8w5z7ea పుట:Sarada Lekhalu Vol 1.pdf/13 104 59167 552073 186244 2026-04-08T11:44:39Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 552073 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>111 అచట మహిళా సభ పై “శీత కన్ను వేయుటకు' శారద మిగుల కనలెను. జరిగిన యింకొక సభలో స్త్రీలు నలు వైపులదిరిగి గలగల మాటలాడుట చూచిన శారదకు, ‘ఆనాఁడు మన స్త్రీల అశిక్షితవ్యవహారము బాగుగ విశదమయ్యెను.” శారదా చట్టము చర్చకువచ్చినప్పుడు, 'ఇచ్చవచ్చినట్లు స్త్రీలు సభలో కేకలు పెట్టిరి. అంతతోఁబోక, వీధిపొడుగునను, _ నోటికి తాళముదీసి, చారలు సాచిరి !' పూర్వాచారమును పేరుతో చెడుగులప లె నే, నవనాగరక పుమునుఁగుతో మేధాశక్తియు వ్యక్తమగుచున్నవి. ప్రజాను మోదమువడసిన ప్రాంత నిర్భయముగ నడయాడు నూతన దురి దురభ్యాసములును, శారదకు ఁగంటక సదృశము ! శార దాశాసన చర్చ సందర్భమున గ్రంథకర్తికిఁగల చక్కని స్వతంత్రబుద్ధి సునిశిత దక్షిణాదినుండి తనతో రెయిలు ప్రయాణము చేసిన తరుణుల నోట నే శారద యీ చర్చ సాగించెను. బాల్య విశ్రాహానర్థముల వాతఁబడిన ము ముగ్గురు ముదితలు చెప్పిన తమ దైన్యవృత్తాంత ములవలన నె యచటి స్త్రీ జనమునకు శారదా చట్టము సమ్మతమయ్యెను. స్త్రీలు నాటకరంగ మెక్కవచ్చునను లక్ష్మీ దేవమ్మ గారి వాదనను, శారద తన దీర్ఘ లేఖా వాక్యముల చే తుత్తునియలు చేసెను. ‘తలిదండ్రు లెవరి కొసఁగిన వారినే పరదైవము గా నెంచి ప్రేమించి గౌరవించెడి హిందూ స్త్రీలు, ఎ, చిత్త మొకనికి శరీర మొకనికి నొసంగుచున్నారని నీవు వ్రాసిన వ్రాత మిక్కిలి యనుచితము * * నీమతమే నిజమగుచో, మన తల్లులు, పుత్రికలు, * * వేయేల భారత మహిళ లెల్లరు, చెడ్డవారే యనవలసి వచ్చును. సోదరీ! మన వివాహ సంస్కారమునందు లోపములున్న సంస్క రింపనగును గాని, నీనాటకరంగ ప్రవేశోద్యమ సమర్థనముకొఱకు, స్త్రీల నెల్లర కట్టగట్టి, యిట్టి హేయమగు నిందకు గుతిసేయుట కడుంగడు సాహసము, అ అక్రమము!'<noinclude></noinclude> pfqs05hzfe70nbgdsfle2gw4cr51ap0 పుట:Sarada Lekhalu Vol 1.pdf/14 104 59168 552074 186245 2026-04-08T11:45:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 552074 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>iv శారదతీవ్రతర్కమునకు లొంగని ప్రతిస్పర్థులవాదమును బూర్తిగ ఖండింపఁగల చమత్కృతి యామె పరిహాసమునకుఁగలదు! 'ఆపద్ధర్మముగా ఈ సంస్కారమునకు (అతిబాల్య వివాహములకు) శాస్త్ర మొప్పినదట! ఎవరి కేవీలు కావ లెనో దాని పాపము, మనశాస్త్రములు చాలమంచివి. కనుగుణ్యమగు నుదాహరణ శ్లోకమునుజూపి పూర్వాచార పరాయణులను రక్షించును. ఆకల్పవృక్షము ప్రాపున వారు చేయని సాహసములేదు. పసి బాలలకు పరిణయము చేసిరి. కసుగందులను గూర్చుండబెట్టి గర్భాధాన మంత్రములు వల్లెవేయించిరి! * * రాళ్లు దేవుళ్ల యన రాసులు మ్రింగనా యని వేమన యోగీంద్రుడు సందేహించినట్టుగానే, యీశిశువివాహములలో దేవుళ్లు రాళ్ళయినారు. లేకున్న, ఆయాస్వాములసన్ని ధానమున దండ్రు లిట్టి యక్రమవివాహములు జరుపఁగ లిగియుందురా?' చావగ నే మగువవాంఛ లేవిధముగా నడుగంటిపోవునో, మగువచావగ నే మగవానికోరిక లావిధముగా నీరిక లెత్తుమండును. భర్తృవిహీన పసిదే యగుగాక యామె వాంఛ అడవిపువ్వులవలె నిరుపయోగముగ రాలిపో వలెను. * * ఆపసిదాని మోమున భస్మ రేఖలును, ఈముసలివాని మోమున చాదుచుక్క యునా!' తలి "మగడు " శారద. తీ దులుపు మనుజులవర్ణ నమునందు __ముఖ్యముగ స్త్రీ స్వభావమును చిత్రించుట యందు__శారదకరము ప్రకృతి కద్దము చూపించుచుండును. పెండ్లిండ్ల' సందర్భమున కొన్ని యేండ్ల క్రిందట దేశమున పెండ్లిండ్లమీఁద పెండ్లిండ్లు జరిగెనుక దా. ఒక యూ రేగింపులో ' పెండ్లికూతురు మూడేండ్లు నిండియు నిండని పసికూన, కట్టుకొనిన క్రొత్తపరికిణి యెత్తియెత్తి కొనుచును, తొడుగుకొనిన పట్టుచొక్కాను పట్టి పట్టి చూచుకొనుచును, బొమ్మల పెండ్లిండ్లలోని బొమ్మవలె కూర్చున్నది. పెండ్లికొడుకో పదేండ్ల వాడు, నిద్రచే తూగుచున్నాడు.' ఇంకొక యూరేగింపులో, 'పిల్లకొక పెద్దచీర చుట్ట పెట్టి, పొడలకమ్మవలె కూర్చుండబెట్టినారు. ఆబాలిక యా<noinclude></noinclude> ewi5nw0ut4apb3fhrzrpe64ogj6366w పుట:Sarada Lekhalu Vol 1.pdf/15 104 59169 552075 186246 2026-04-08T11:45:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 552075 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>* చీరలోపడి, చిక్కములో పిట్టవలె గొట్టుకొనుచున్నది.” . * 'మళయాళ స్త్రీలు సాధారణముగా నగలు ధరింపరు. రంగు వస్త్రములు కట్టరు. వారి కట్టుబట్ట యాఱు మూరలె జారుముడి వై చుకొందురు. * * * కేరళ కాంతలు చక్కగ సహజ దంతధవళిమయు నధరర క్లిమయు కేరళవనితల వదనారవిందములకు చెలువు గూర్చుచుండును. హిందూ స్త్రీలలో కేరళ స్త్రీలే చక్కనివారు.' * దక్షిణ ప్రకృతి సౌందర్యవర్ణనమందు శారద యసమాన ప్రజ్ఞ యని చెప్ప నొప్పును. 'అప్పుడు మధ్యాహ్నమై, సూర్యుఁడు తీక్ష్మముగా నెండగాయు చున్నను, మా బాటల కిరుప్రక్కలనున్న యెడ తెగ ని వృక్షపం క్తుల ఛాయలచే, మే మెండక న్నెఱుఁగని శుద్ధాంతజనముల భాతినైతిమి ! * * కల్పలతా ! ఆపడమటిక నుమల భాగ్య మని చెప్పుదును? సమస్త పాదపములు, -అఖిలల తావితానములు సర్వగుల్మములు, వానిసొత్తు. కుంకుమరాసులు పోసిన టొకచోటను, పసుపుకుప్పలుపోసిన ట్లొక చోటను, నీలాంబరము గప్పిన టొక చోటను, వెల్లమునుఁగు వేసిన టొక చోటను, వివిధ వర్ణపర్ణ విరాజితమై, యాకనుమలయందలి వృక్షవల్లరులు సొంపునింపుచుండెను!' ణ 3 3 3 3 * కాంచీ మధురా రామేశ్వరాది పుణ్య క్షేత్రదర్శనము చేసి వచ్చిన శారదకు మంచిభక్తి చేకూరెనని మనము సంతసింపవచ్చును. కాని యందందు కానవచ్చిన పీడలు నక్రమములు నామె మనస్సువఁ గొంత కలవరము నసహ్యతయును బుట్టించెను. గుళ్లలోని యర్చకుల చర్యలు పొడ ర 'సంపత్తిగల వారికే స్వామిదర్శనముగదా !' యని యాశ్చర్యపడెను.' ‘ఈవిధమున దేవతలు నేడు దౌర్జన్యపరులగు మానవుల చేతిలోఁజిక్కి, భక్త జనసులభులు "గాకున్నారు!' అని యామె, వెత నందెను. ఐనను, ఆమె యా సైక్యబుద్ధిని దృఢపటుచు ననుభవములును లేక<noinclude></noinclude> mczszl3k423c1rakv4w885cc36hrntj పుట:Sarada Lekhalu Vol 1.pdf/16 104 59170 552076 186247 2026-04-08T11:45:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ 552076 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>vi ది పోలేదు.__ నేపాళమునుండి సేతువుచూడవచ్చిన యొక వృద్ధాంగనయందు ద్యోతకమ కమయిన మతవిశ్వాసము పుణ్యకాంక్షయు శారద కద్భుతజనకము లయ్యెను.___ మతసూత్ర మె యావద్భారతీయులను ఐక్యపఱుచుచున్నది. మతము మానవునకు ప్రాణముకంటె నుత్కృష్టము!' అని శారద నిశ్చయము చేసికొనెను. శారద సంతానవతియై, విద్యాభాగ్యములం దింకను వన్నె గాంచి యుండె నేని, ఆ మెయనుభవము మఱింతని స్తరించి యీరచయిత్రి, భాగ్య వతుల బాధ్యతలను, కనిపెంచెడి యిల్లాండ్ర కష్టసుఖములను గూడ బాగుగ విమర్శించి యుండెడిదని పాఠక లోక మాశింపవచ్చును. కాని, యాపరి స్థితులలో మొదలు శారద గ్రంథరచనమునకె మోసము గలిగెడిదేమో ! కావున చదువరులకును సంతృప్తియె శ్రేయోదాయకము. శారదముద్దు పలుకులు, శారద నిష్కపటహృదయము, శారద యవ్యాళ సౌజన్యమును, పాఠకావళి హృదయములు రంజింపఁజేసి, వారినీ లేఖల ద్వితీయ భాగమున కెదురుచూచునట్లు చేయఁజాలియున్నవి 2!<noinclude></noinclude> 57j6d4k7vbw20pag24na7sfhyjvqj6f పుట:Sarada Lekhalu Vol 1.pdf/17 104 59171 552077 186248 2026-04-08T11:46:29Z శ్రీరామమూర్తి 1517 /* పాఠ్యం లేనిది */ 552077 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude></noinclude> asjdw50tygjje8heycvqgy5gt7oq68s పుట:Sarada Lekhalu Vol 1.pdf/18 104 59172 552078 186249 2026-04-08T11:47:07Z శ్రీరామమూర్తి 1517 /* పాఠ్యం లేనిది */ 552078 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude></noinclude> asjdw50tygjje8heycvqgy5gt7oq68s రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు 102 70071 552004 367849 2026-04-08T05:46:59Z Rajasekhar1961 50 /* రచనలు */ 552004 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = పిల్లలమర్రి |అసలుపేరు = పినవీరభద్రుడు |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = పిల్లలమర్రి పినవీరభద్రుడు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== # [[శృంగారశాకుంతలము]] {{small scan link|శృంగారశాకుంతలము.pdf}} # [[జైమినీభారతము]] ==రచయిత గురించిన రచనలు== * [[కవి జీవితములు/పిల్లలమఱ్ఱి పినవీరభద్రయ్య]] dsu73x34voo1ttk5i2nu1v148c002yh పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/45 104 117453 551942 486266 2026-04-07T18:30:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 551942 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 26 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>సర్వకాలసర్వావస్థలయందు నొక్కటెరీతిగానున్న) సమాధిని = ధ్యానమును, చూచి, (పరమాత్మ సర్వవ్యాపకుఁడు గావున ఆయన నెఱింగినయోగి. ఏయేవిషయముల సంకల్పించినను సర్వము సమాధి నాచరించినట్లే యగునని తెలిసికొనవలయును) ప్రహ్లాదుఁడు, ఆశ్చర్యపరతన్ = మిగులనాశ్చర్యము గలిగియుండుటను, ఒందన్ = పొందుచుండఁగా, స్వకృతగీతాదిశాస్త్రభాష్యంబులు ఎల్లన్ = తనచే రచియింపఁబడిన భగవద్గీతాభాష్యము మొదలగునవి యన్నియు, (ఏకోగురుస్వామిచే రచియింపబడిన వ్యాఖ్యానము లేవియును గానరావు. కావునఁ బ్రకృతమున నీకవి శంకరభగవత్పాదులకును ఏకోగురుస్వామికిని అభేదము చెప్పినాఁడని తోచుచున్నది.) ధాత్రిన్ = భూమియందు, వేదతుల్యంబులు ఐ = వేదములతో సమానములై, వెలయుచున్ = ప్రకాశించుచు (లేక, ప్రసిద్ధిఁ జెందుచు), ఉండన్ = ఉండగా, వామదేవ—శుక—అర్జున—వ్యాస—భీష్మ—సదృశుఁడు = వామదేవాదులతో సమానుఁడు అగు, ఏకోజనార్ధనస్వామి = జనార్దనయోగీంద్రుని శిష్యుఁడగు ఏకోగురుస్వామి (కుమారునిపేరుతోఁగూడ తండ్రి పేరును, శిష్యునిపేరుతోఁ గూడ గురువుపేరును కలిసి చెప్పుట కొన్నిదేశములలో నాచారము. ఆంధ్రకావ్యములలోఁ బలుచోట్ల నిట్టి ప్రయోగములను జూడవచ్చును.), వెలసెన్ = ప్రసిద్ధుఁడై యుండెను. '''తా'''. తనవైరాగ్యమును జూచి సిగ్గుపడి సనకసనందనాదులు సత్యలోకమును విడిచివచ్చుటకు సందేహించుచుండ తనభక్తిచేఁ గట్టుబడి భక్తపరాధీనుఁడగు శ్రీకృష్ణుఁడు తనగృహమునందే వసియించి సర్వవిధముల తోడ్పడుచుండఁ ద్రిభువనపావనములని ప్రఖ్యాతిఁ జెందియున్న గంగాదిపుణ్యనదు లన్నియుఁ దన బ్రహ్మజ్ఞానతీర్థమున నోలలాడి మిగులఁ బ్రభావమును సంపాదించుకొనుచుండఁ దారచించిన గీతాభాష్యాదులు వేదములట్లు పరమప్రమాణములై తనరారుచుండ నజ్జనార్ధనయోగీంద్రశిష్యుఁ డగు ఏకోగురుస్వామి వామదేవుఁడు, శుకుఁడు, అర్జునుఁడు, వ్యాసుడు, భీష్ముడు మొదలగువారితో సమానుఁడై ప్రసిద్ధి గాంచెను. (అమ్మహాత్ముని పరబ్రహ్మనిష్ఠను జూచి ప్రహ్లాదుడు సైతము ఆశ్చర్యపడుచుండె ననుట.) {{Telugu poem|type=క.|lines=<poem>ధరలో నారాయణునకు, నరుగతి నేకోజనార్దనస్వామికి శ్రీ నరహరి మహేశగురుఁ డ, చ్చెరువుగ సద్భక్తి మెఱయ శిష్యుం డయ్యెన్.</poem>|ref=26}} '''టీ'''. ధరలోన్ = భూమిపై, నారాయణునకున్ = శ్రీకృష్ణునకు, నరుగతిన్ = అర్జునుని యట్లు, ఏకోజనార్దనస్వామికిన్ = జనార్ధనయోగీంద్రుని శిష్యుఁడగు ఏకోగురుస్వామికి, నరహరి మహేశగురుఁడు = నరహరి మహేశ్వరుఁడను మహాత్ముడు, (ఇచ్చట మహేశ్వరుఁ డనునది నరహరి యనునాతని తండ్రిపేరుగా నుండునని యూహింపవలసియన్నది. అట్లు గాకున్నను యతులకు శివవాచకములను విష్ణువాచ<noinclude><references/></noinclude> 914b7c5g89e66nn1ghvg2wm82e3bw12 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/46 104 117520 551943 486267 2026-04-07T18:37:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 551943 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |పీఠిక |27 }}</noinclude>కములును అగుపదములును ఉపపదములుగ చేర్చుట కలదు. ఉదా:— శివనారాయణతీర్థుఁడు; మొదలగునవి.) అచ్చరువుగన్ = ఆశ్చర్యము కలిగించునట్లుగ, సద్భక్తి మెఱయన్ = మిగుల భక్తితో, శిష్యుండు అయ్యెన్ (భక్తితో నాయేకోగురుస్వామి నాశ్రయించె ననుట.) '''తా'''. శ్రీకృష్ణునికి అర్జునుఁడు శిష్యుఁడైనట్లు ఆయేకోగురుస్వామికి నరహరి మహేశ్వరుఁ డనుమహాత్ముఁడు మిగుల భక్తియుక్తుఁడై శిష్యుఁడయ్యెను. (ఈ గురుశిష్యులు లోకమున కాశ్చర్యము గలిగించుచుండిరనుట.) {{Telugu poem|type=చ.|lines=<poem>అతఁడు సమస్తభూతబహిరంతరనావృతబోధమూర్తి యై వితతసమాధి నుండునెడ వేల్పులు సూచి యితం డయారె యా శతధృతియో రమావరుఁడొ శంకరుఁడో శుకుఁడో యటంచు నద్భుతమును బొందుచుండ బరిపూర్ణత నొప్పె ధరాతలంబునన్.</poem>|ref=27}} '''టీ'''. అతఁడు = ఆనరహరిగురువు, సమస్త...మూర్తి — సమస్తభూత = ఆకాశాది పంచభూతములయొక్కయు, లేక పంచభూతవికారము లగు సకలప్రాణులయొక్కయు, బహిరంతః = లోపల వెలుపల, అనావృత = ఆవరింపఁబడని (అజ్ఞానావరణము లేని), బోధ = అపరోక్షజ్ఞానమే (బ్రహ్మమే తానని యెఱుంగుటయె), మూర్తి ఐ = స్వరూపముగాఁ గలవాఁడై (స్వప్రకాశస్వరూపుఁడై యనుట), వితతసమాధిన్ = ఎక్కువైనదానమునందు (ధ్యాననిష్ఠుఁడై యనుట), ఉండునెడన్ = ఉన్నప్పుడు, వేల్పులు = దేవతలు, చూచి, ఇతండు = ఈయోగి, అయారే = ఆహా, ఆశతధృతియో = ఆ బ్రహ్మయో, రమావఁరుడో = ఆవిష్ణువో, శంకరుఁడో = రుద్రుడో, శుకుఁడో = శుకమహర్షియో, (అగును గాని సామాన్యుడు కాడు; అని అధ్యాహారము.), అటంచున్ = అనుచు, అద్భుతమునున్ = ఆశ్చర్యమును, పొందుచున్, ఉండన్ = ఉండగా, పరిపూర్ణతన్ = సంపూర్ణుఁడై (సర్వగుణములచేత సంపూర్ణుఁడై, లేక, పరబ్రహ్మరూపుఁడై యనుట.), ధరాతలంబునన్ = భూమియందు, ఒప్పెన్ = ప్రసిద్ధి గాంచెను. '''తా'''. సర్వప్రపంచమునకును లోపల వెలుపల నిండియున్నట్టియు, అజ్ఞానావరణము లేనట్టియు, స్వప్రకాశస్వరూపము గలిగి నిర్వికల్పసమాధియందు (ధ్యానించువాఁడు; ధ్యానము, ధ్యానింపఁదగినది అను భేదములు లేనిసమాధియందు) ఉండు నప్పుడు నరహరియోగిని జూచి దేవత లందఱు, 'ఆహా ! యీతఁడు బ్రహ్మయో, విష్ణువో, రుద్రుఁడో, శుకమహర్షియో కాని సామాన్యుఁడు కాఁడు' అని యాశ్చర్యపడుచుందురు. ఇట్లు సర్వభూతములకు నాశ్చర్యకరము లగు సద్గుణసమృద్ధితో ప్రత్యక్షపరబ్రహ్మమో యన నాతఁడు భూమియందుఁ బ్రసిద్ధిఁ జెందియుండెను.<noinclude><references/></noinclude> foixqrmzhqsi7k800qw1fsx9k1bb2bs పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/47 104 117561 551944 486268 2026-04-07T18:45:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 551944 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 28 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ఆనరహరిసద్గురునకు, శ్రీనాగోరామగురుఁడు శిష్యుం డై వి జ్ఞానంబునఁ బ్రత్యక్ష, శ్రీనారాయణుఁ డనం బ్రసిద్ధి వహించెన్.</poem>|ref=28}} '''టీ'''. ఆనరహరి సద్గురునకున్ = నరహరియను గురువునకు, శ్రీ నాగోరామగురుఁడు = బ్రహ్మజ్ఞానవంతుఁడగు నాగోరాముఁ డనువాఁడు, శిష్యుండు ఐ, విజ్ఞానంబునన్ = పరబ్రహ్మమే తానని తెలిసికొనుటయందు, శ్రీ నారాయణుఁడు = లోకోత్తమ మగునారాయణమహర్షి (ధర్మము నశించినప్పుడు దానినుద్ధరించుటకు నారాయణమహర్షి యను పేర నవతరించిన విష్ణువు), అనన్ = అనఁగా, ప్రసిద్ధిన్ = విఖ్యాతిని, వహించెన్ = పొందెను. '''తా'''. నాగోరామగురువనువాఁడు ఆనరహరిగురునకు శిష్యుడై బ్రహ్మజ్ఞానప్రభావముచే నారాయణమహర్షి యొక్క యపరావతారమో యన ప్రసిద్ధిఁజెందెను. {{Telugu poem|type=శా.|lines=<poem>రాజమూర్తులతోడఁ బెంపెసఁగువైరాగ్యోపరత్యాళు లు త్తేజం బొప్ప సహాయు లై మెఱయ నద్దివ్యప్రబోధస్ఫుర ద్రాజాస్య న్వరియించి మోక్షసుఖసామ్రాజ్యంబుతో నొప్పె నా గోజీరామగురుండు పండితులు కోర్కు ల్దీర సేవింపఁగన్.</poem>|ref=29}} '''టీ'''. రాజన్మూర్తులతోడన్ = ప్రకాశించుచున్నయాకారములతో (మనుష్యరూపమును దాల్చియనుట), పెంపు ఎసఁగు = వృద్ధిపొందుచున్న, వై...ఆళులు — వైరాగ్య = ఇహపరలోకములయందు ఇచ్ఛలేకపోవుట (చిత్తవిశ్రాంతి) అనెడు, ఆళులు = చెలులు, ఉత్తేజంబు = అధికమగు తేజస్సు, ఒప్పన్ = ప్రకాశింపఁగా (సకలలోకములయందును ప్రసిద్ధి కలుగునట్లు), సహాయులు ఐ = సహాయభూతురాండ్రై, మెఱయన్ = ప్రకాశింపఁగా (వైరాగ్యము, ఉపరతి యనియెడు చెలికత్తెలతోఁ గూడినఅనుట), అద్ది...స్యన్ — అద్దివ్య = ఆ యుత్తమమైన, ప్రబోధ = బ్రహ్మజ్ఞాన మనియెడు, స్ఫురత్ = ప్రకాశించుచున్న (సౌందర్యముగల), రాజస్యన్ = స్త్రీని, వరియించి = వివాహమాడి, నాగోరామగురుండు = నాగోరామగురువు, పండితులు = విద్వాంసులు (లేక బ్రహ్మజ్ఞానులు), కోర్కుల్ దీరన్ = కోరినకోర్కులు సిద్ధించుటకై, సేవింపఁగన్ = సేవించుచుండగా, మోక్ష...తోన్ — మోక్షసుఖ = బ్రహ్మానంద మనియెడు, సామ్రాజ్యంబుతోన్ = చక్రవర్తిత్వముతో (పరమానందమే రాజ్యమనుట), ఒప్పెన్ = ప్రకాశించుచుండెను. '''తా'''. ఆ నాగోరామగురువు వైరాగ్యోపరతులు చెలికత్తియలుగాఁ గలిగి, జగత్ప్రసిద్ధిఁ చెందియున్న బ్రహ్మజ్ఞానమను నుత్తమకాంతను వివాహమై, మోక్షసుఖ మనియెడు సామ్రాజ్యమునకు ప్రభువై బ్రహ్మవేత్త లగువారలకోర్కుల నెఱవే<noinclude><references/></noinclude> 7lvchsxalv4x3vx5v4361ml53bli1d6 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/48 104 117597 551945 486269 2026-04-07T18:54:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 551945 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |పీఠిక |29 }}</noinclude>ర్చుచు తత్త్వార్థమును బలుమాఱు వివరించి, సంశయముల నెల్లఁ దొలఁగించి జ్ఞానమును దృఢము చేయుచు సుప్రసిద్ధుఁడై యుండెను. {{Telugu poem|type=క.|lines=<poem>ఆనాగోరామునకున్ శ్రీనారాయణున కజునిచెలువున భక్తుం డై నెగడె నెల్లదిక్కులఁ, గోనేరుగురుండు తత్త్వకోవిదుఁ డగుచున్.</poem>|ref=30}} '''టీ'''. ఆనాగోరామునకున్ = ఆనాగోరామగురువునకు, శ్రీనారాయణునకున్ = శ్రీవిష్ణునకు, అజునిచెలువునన్ = బ్రహ్మవలె ("నారాయణం పద్మభవం వసిష్ఠం" అని వేదాంతవిద్యాసంప్రదాయమునకు మొదటి గురువు విష్ణువు; ఆయనకు శిష్యుఁడు బ్రహ్మదేవుఁడు; ఆయనకు వసిష్ఠుఁడు అని చెప్పఁబడియున్నది. దాని ననుసరించి ఇచ్చట నీయుపమానము ప్రయోగింపఁబడిన దని తెలిసికొనునది.), కోనేరుగురుండు = కోనేరుఁ డనుగురువు, భక్తుండు ఐ (శిష్యుఁడై యనుట), తత్త్వకోవిదుఁడు అగుచున్ = తత్త్వజ్ఞానముకలవాఁడై, ఎల్లదిక్కులన్ = అన్నిదిక్కులయందును, నెగడెన్ = ప్రసిద్ధి వొందెను. '''తా'''. శ్రీమన్నారాయణమూర్తికి బ్రహ్మదేవుఁడు శిష్యుఁ డైనట్లు అనాగోజీరామగురువునకుఁ గోనేరుగురువు శిష్యుఁ డయ్యెను. బ్రహ్మవేత్తలలో నుత్తముఁడై త్రిలోకములయందుఁ బ్రసిద్ధిఁ గాంచెను. {{Telugu poem|type=శా.|lines=<poem>ఆకాశీతలసేతుమధ్యకలితజ్యాధీశ్వరోద్యచ్ఛిర శ్శ్రీకోటీరమణిప్రభార్చితనిజాంఘ్రిద్వంద్వపంకేరుహుం డాకాశాదిసమస్తతత్త్వసముదాయాతీతవిశ్వేశుఁ డై శ్రీకోనేరుగురుండు మోక్షవరలక్ష్మీకాంతుఁడై రంజిలెెన్.</poem>|ref=31}} '''టీ'''. ఆ...పంకేరుహుండు — ఆకాశీతలసేతుమధ్య = కాశీక్షేత్రము మొదలు సేతువువఱకుఁ గల మధ్యదేశమునం దంతటను, కలిత = ప్రకాశించుచున్న, జ్యా అధీశ్వర = ప్రభువులయొక్క, ఉద్యత్ = ప్రకాశించుచున్న, శిరః = శిరస్సులయందలి, శ్రీకోటీర = కాంతిగల కిరీటములయందలి, మణి = రత్నములయొక్క, ప్రభా= కాంతులచేత, అర్చిత = పూజింపఁబడిన (అలంకరింపఁబడినది అనుట), నిజ = స్వకీయమైన, అంఘ్రిద్వంద్వపంకేరుహుండు = కమలములవంటి పాదములు గలవాఁడును (సకలప్రభువుల చేతను నమస్కరింపఁబడువాడు), ఆకాశ...విశ్వేశుఁడు — ఆకాశాది = ఆకాశము మొదలగు, సమస్త = సకలములైన, భూతసముదాయ = పంచభూతములయొక్కయు వానివలనఁ బుట్టిన సకలప్రాణులయొక్కయు సమూహమును, అతీత = అతిక్రమించినవాడును, విశ్వేశుఁడు = ప్రపంచమును నియమించువాఁడును ఐ, మోక్ష...కాంతుఁడు — మోక్ష = మోక్షమనియెడు, వరలక్ష్మీ = లక్ష్మి,<noinclude><references/></noinclude> jk0e10vgqdxkeb19yjpfkvgrqoxz72h పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/49 104 117634 551946 486241 2026-04-07T19:00:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 551946 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 30 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>(మోక్షలక్ష్మికి), కాంతుఁడు = ప్రియుఁడు — భర్త ఐ, ఆకోనేరుగురుండు = ఆకోనేరుఁ డను గురువు, రంజిలెన్ = ప్రకాశించుచుండెను. '''తా'''. ఆకోనేరుగురువు కాశీరామేశ్వరమధ్యదేశమునం దున్నసకలప్రభువులచేతను సాష్టాంగముగా నమస్కరింపఁబడుచు ఆకాశాదిసమస్తప్రపంచమునకును అతీతుఁడై శుద్ధపరబ్రహ్మరూపుఁడై సర్వదా మోక్షసుఖము ననుభవించుచుఁ దేజరిల్లుచుండెను. పరబ్రహ్మము షడధ్వాతీతుఁ డయినను తత్త్వాధ్వాతీతుఁడనిమాత్రము ఈపద్యమునఁ జెప్పుటకు హేతువేమన: తత్త్వాధ్వము కడపటి యైదధ్వములయుత్పత్తికిని గారణమగుటచే నిట్లు చెప్పబడెను. {{p|ac|fwb}}షడధ్వములవివరణము</p> మంత్రాధ్వము పదాధ్వము వర్ణాధ్వము తత్వాధ్వము భువనాధ్వము కళాధ్వము అని అధ్వములు అఱువిధములు, అందు — 1. మంత్రాధ్వము: సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము, హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అని పదునొకండు విధములు. 2. పదాధ్వము: మహాదేవ సద్భావేశ్వర మహాతేజ యోగాధిపతి ముంచముంచ ప్రథమప్రథమ సర్వసర్వ భవభవ భవోద్భవ సర్వభూత సుఖప్రద సర్వసాన్నిధ్యకఠబ్రహ్మ విష్ణురుద్రపర అనార్చితానార్చిత అస్తుతాస్తుత పూర్వస్థితి సాక్షిసాక్షి తురుతురు పతంగపతంగ పింగపింగ జ్ఞానజ్ఞాన శబ్దశబ్ద సూక్ష్మసూక్ష్మ శివ సర్వసర్వ ఓం నమశ్శివ ఓం నమోనమ నమశ్శివ ఓం నమరూపి అరూపి ప్రథమప్రథమ తేజస్తేజ జ్యోతిర్యోతి అరూప జనగ్ని అధూమ అభస్మ అనాది నా బానా ధూధూధూ ఓంభూః ఓం భువః ఓగ్ంసువః అనిధన నిధన నిధనోద్భవ శివసర్వ పరాపరాత్మ భువనేశ్వర ధ్యానహార ఓంనమశ్శివ సర్వప్రభు శివ ఈశానమూర్ధ్ని తత్పురుషవక్త్ర అఘోరహృదయ వామదేవగుహ్య సద్యోజాతపాద ఓంనమః గుహ్యాతిగుహ్య గోప్త అనిధన సర్వయోగాధీకృత సర్వవిద్యాధిప జ్యోతిరూప పరమేశ్వర పరమేశ్వర అచేతనాచేతనా వ్యోమ్నిన్ వ్యోమ్నిన్ వ్యోమ్నివ్యాపిన్ వ్యాపినివ్యోమవ్యాపిని వ్యోమరూప సర్వవ్యాపిని శివానంత అనాథ అనాశ్రితధ్రువ శాశ్వతయోగ పీఠసంస్థిత నిత్యయోగి ధ్యానహార ఆద్యోంకారములని ఎనుబదియొకటి. 3. వర్ణాధ్వము: అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం ఌం ౡం ఏం ఐం ఓం ఔం అం అః; కం ఖం గం ఘం ఙం చం ఛఁ జం ఝం ఞం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం అని ఏబదియొకవిధము. {{nop}}<noinclude><references/></noinclude> 64x0gm927f7013xjgq2wou7h8aopuar పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/50 104 117668 551947 486247 2026-04-07T19:03:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 551947 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |పీఠిక | 31}}</noinclude>4. తత్వాధ్వము:- పృథివి ప్రకృతి బుద్ధి అహంకారమన శ్శోత్రత్వక్ చక్షుర్జిహ్వాఘ్రాణ వాక్ పాణి పాద పాయు గుహ్య శబ్ద స్పర్శ రూప రసగంధ ఆకాశ వాయువహ్ని జల మాయ కాల నియతి కాలా విద్యా రాగ పురుష, సదాశివ ఈశ్వర శుద్ధవిద్య శివశక్తులనుతత్త్వములు ముప్పదియాఱు. లేక, భూతపంచక జ్ఞానేంద్రియపంచక కర్మేంద్రియపంచక ప్రాణపంచకశబ్దాది పంచకములును నాదిచతుష్టయమును శరీరత్రయమును అవస్థాత్రయమును అజ్ఞానమును, ఇవియే ముప్పదియాఱు తత్త్వములు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణశబ్దాది విషయపంచకములు మానసాది చతుష్టయమును గూడి యిరువదినాలుగుతత్త్వములు. పైఁ జెప్పిన ముప్పదియాఱు తత్త్వములును షడ్భావవికార షట్కౌౌశికషడూర్మి అరిషడ్వర్గములును, జీవత్రయ గుణత్రయ కర్మత్రయములును, వచనాదానగమనవిసర్గానందములును, సంకల్పాధ్యవసాయాభిమానావధారంబులు, వైచిత్య్రాదిచతుష్టయమును, దిగ్వాగార్కాది చతుర్దశేంద్రియాధిష్ఠానాదిదేవతలును అనునవి యన్నియుఁ గూడి తొంబదియాఱు తత్త్వములు. 5. భువనాధ్వము:- భద్రకాళివీరభద్ర త్రిలోచననభ లిప్సువివాహసంవాహ త్రిదశేశ్వరత్య్రక్ష విభుశంభుదంష్ట్రవజ్రఫణీంద్ర, ఉదుంబరగ్రసన మారుతాసనక్రోధన అనంత వృషధర వృషబలిప్రియ భూతపాల జ్యేష్ఠ శర్వసురేశ్వర వేదపారగజ్ఞానభూసర్వజ్ఞ ఈశానవిద్యాధిప ప్రకామదప్రసాద శ్రీధర రత్నధర లక్ష్మీధర జటాధర సౌమ్యధర ధన్యరూప విధీశ మేఘవాహన కపర్దిపంచశిఖ పంచాంతకక్షయాంతక తీక్ష్ణ సూక్ష్మవాయువేగ లఘు శీఘ్రసునాదమేఘనాదజలాంతక దీర్ఘబాహు జయభద్ర, శ్వేత మహాబల పాశహస్త ఆతిబలబల దంష్ట్రలోహిత ధూమ్ర విరూపాక్ష ఊర్ధ్వకేక భయాంతకక్రూరదంష్ట్రదంష్ట్రి మారణ నిరృతి ధర్మపతి అధర్మపతి వియోక్తసంయోక్తకర్త విధాతధాతహర మృత్యు ధర్మఅక్షయాంతక భస్మాంతక వజ్రబాహుదహనజ్వలనహరఘాతుక పింగళహుతాశన అగ్నిరుద్ర త్రిదశాధిప పినాకిశాన్త అవ్యయ విభూతి వివర్ధన వజ్రదేహబుధఅజక పాలీశ రుద్ర విష్ణు బ్రహ్మ హాటకేశ్వర కూశ్మాండ కాలాగ్నిరుద్ర శ్రీకర్ణఔమకౌమారవైష్ణవ బ్రాహ్మ్య భైరవకృత అకృతస్థలేశ్వర సుబ్రాహ్మ్య పాజేశసౌమ్య ఇంద్రగాంధర్వ యక్షరాక్షసపైశాచ సుస్థలేశ్వర శంఖకర్ణకాలాంజన మండలేశ్వర మహాండ ద్విరండ సకలాండస్థాణు స్వర్ణాక్ష భద్రకర్ణగోకర్ణ మహాలయ అవిముక్త రుద్రకోటివస్త్రాపద భీమేశ్వర మహేంద్ర అట్టహాస విమలేశ్వర నఖిల నాఖిల కురుక్షేత్ర గయాక్ష మహాభైరవకేదార శ్రీశైల మహాకాశ మధ్యమేశ్వర అమ్రాదికేశ్వర జలేశ్వర హరిశ్చంద్ర ఆకులేశ్వర డుండిముండి భారభూతి ఔషధిపుష్కరనైమిశ , అమరేశ్వర అంగుష్టమాత్రార్క ఈశాన ఏకేక్షణ ఏకపింగళ ఉద్భవ అభవ వామదేవ మహాద్యుతి శిఖేద ఏకవీర క్రోధ చండ శూర పంచాంతక సంవర్తజ్యోతిష మహాక్రోధ మహా<noinclude><references/></noinclude> b2rrwukddny3fhz640rkxbvrqvxx1e9 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/51 104 117698 551948 486270 2026-04-07T19:09:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 551948 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh|32 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude> చండ ఏకశివ అనంత అజ ఉమాపతి ప్రచండ ఏకపాద ఈశాన భవ ఉగ్ర భీమ అనంతసూక్ష్మ శివోత్తమ ఏకనేత్రి ఏకరుద్ర త్రిమూర్తి శ్రీకంఠ శిఖండి వామ జేష్ఠరాద్రి కాళ కలవికర్ణ బలవికర్ణ బలప్రమధన సర్వభూతదమన మనోన్మని అనాశ్రిత అనాధున అనంత వ్యోమరూపవ్యాపిని ఊర్ధ్వగామిని రోచిద మోచిక దీపిక ఇందిర శాంత్యతీతశాంతి విద్యాప్రతిష్ఠనివృత్తి అని భువనములు ఇన్నూటయిరువదినాలుగు. కళాధ్వము:- నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, శాంత్యతీతమని కళలు ఐదు. ఈ పంచకళలలో మంత్ర పద వర్ణ తత్త్వభువనములును, ఈతత్త్వములలో భువనములు చేరియున్నవి. వీనివిశేషవివరణము కైవల్యనవనీత ప్రథమప్రకరణమున అఱువదియొకపద్యమునం జూడవలెను. మఱియు సర్వసమయమంత్రములును సప్తకోటిభేదములు కలవై ఉండఁగా, మంత్రాధ్వమందు పదునొకండు మంత్రములు మాత్రము చెప్పుటకు హేతు వేమనిన: పరమశివుని పంచముఖములయందే సకలాగమమంత్రములును పుట్టుటచేత సద్యోజాతాదిపంచమంత్రములును ఆమంత్రములకు ముఖ్యములయిన షడంగదేవతామంత్రములును చేరి పదునొకండుమంత్రములని చెప్పఁబడెను. మఱియు — శ్లో. 'మకారం మననందైవ త్రకారంత్రాణముచ్యతే, మననత్రాణ మిత్యాహు ర్మంత్ర మిత్యభిధీయతే.' అనున్యాయముచేత పరబ్రహ్మము మననమునకును రక్షణమునకును విలక్షణమగుటవలన మంత్రాధ్వాతీతమును సర్వదేశవ్యాపకత్వము గలుగుటవలన పదాధ్వాతీతమును అవర్ణమగుటవలన వర్ణాధ్వాతీతమును సర్వతత్త్వవిలక్షణ మగుటవలన తత్వాధ్వాతీతమును సర్వస్వామి యగుటవలన భువనాధ్వాతీతమును నిష్కళ మగుటవలన కళాధ్వాతీతమును అగును. {{Telugu poem|type=శా.|lines=<poem>ఆకోనేరుగురూత్తముం గొలిచి దివ్యాధ్యాత్మయోగంబు దా శ్రీకల్యాణగుణప్రసిద్ధుఁ డగుచున్ శ్రీమన్మహాదేవలో కైకాచార్యుఁడు సంగ్రహించె నతిసౌఖ్యం బొప్ప సాందీపనిన్ శ్రీకృష్ణుండు భజించి విద్య నొనరం జేకొన్న చందంబునన్.</poem>|ref=32}} '''టీ'''. శ్రీకృష్ణుండు, సాందీపనిన్ = సాందీపనియను గురువును, భజించి = సేవించి, విద్యలు = అఱువదినాలుగువిద్యలను, ఒనరన్ = ఒప్పునట్లుగా, చేకొన్నచందంబునన్ = గ్రహించిన విధమున, శ్రీమన్మహాదేవలోకైకాచార్యుడు = బ్రహ్మవేత్త యగుమహాదేవుఁ డను లోకగురువు, ఆకోనేరుగురూత్తమున్ = ఆకోనేరుగురుశ్రేష్ఠుని, కొలిచి = సేవించి, తాన్ = తాను, శ్రీ...ప్రసిద్ధుఁడు- శ్రీ = మోక్షసమృద్ధి గల, కళ్యాణగుణ = శాంతి, ఇంద్రియనిగ్రహము మొదలగు సద్గుణములతో, ప్రసి<noinclude><references/></noinclude> ag0gfjmmqszbzyi0es6ahr72jdbb1yv పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/52 104 117735 551949 371380 2026-04-07T19:13:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 551949 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |పీఠిక |33 }}</noinclude>స్థుఁడు అగుచున్ = ప్రసిద్ధిఁచెందుచు, అతిసౌఖ్యంబు = అధికమగునానందము (లేక మోక్షసుఖము), ఒప్పన్ = కలుగునట్లుగా, దివ్యాధ్యాత్మయోగంబున్ = ఉత్తమ మగుజీవబ్రహ్మైక్యమును (లేక దానికి సాధనఁమగు రాజయోగమును), సంగ్రహించెన్ = తెలిసికొనెను. '''తా'''. శ్రీకృష్ణమూర్తి సాందీపని సేవించి అఱువదినాలుగు విద్యలను గ్రహించినట్లు బ్రహ్మవేత్తయగు మహాదేవుండను గురువరుండు మనోనిగ్రహము, ఇంద్రియనిగ్రహము మొదలగు సమస్తసద్గుణములకు నిధియైన యాకోనేరుగురువు నాశ్రయించి జీవబ్రహ్మైక్యమును దెలిసికొనుటకు ముఖ్యసాధన (సుఖసాధన) మగురాజయోగమును గ్రహించి బ్రహ్మానందమును గైకొనియెను. {{p|ac|fwb}}చతుష్షష్టికలావివరణము</p> అఱువదినాలుగు విద్యలు:- శ్లో. ఇతిహాసాగమౌ చైవ కావ్యాలంకారనాటకమ్, గాయకత్వం కవిత్వం చ కామశాస్త్రం దురోదరం దేశభాషాలిపిజ్ఞానం లిపికర్మచవాచకం, సర్వాణి చావధానాని స్వరశాస్త్రం చ శాకునం, సాముద్రికం రత్నశాస్త్రం రథాశ్వగజకౌశలం, మల్లశాస్త్రం సూదకర్మ భూరుహాణాం చ దోహదం, గంధనాదో ధాతునాదః ఖనివాదో రసస్యచ, జాలవాదోగ్నిసం స్తంభో ఖడ్గస్తంభో జలస్య చ వాచస్తంభో (?) వశ్యాకర్షణమోహనం, విద్వేషణోచ్చాటనం చ మారణం కాలవంచనం, పరకాయప్రవేశశ్చ పాదుకాసిద్ధి రేవ చ, వాక్సిద్ధి ర్ఘుటికా సిద్ధిరైంద్రజాలిక మేవచ, అంజనం పరదృష్టే స్తు వంచనం స్వరవంచనం, మణిమంత్రౌషధీనాం సిద్ధయ శ్చోరకర్మ చ, చిత్రలోహాశ్మమృద్దారువేణు చర్మాంబర క్రియాః, అదృశ్యకరణం దండకరణం మృగయానిధిః, వాణిజ్యం పాశుపాల్యం చ కృషి రాననకర్మచ, లాదకుక్కుటమేషాదియుద్ధకారకకౌశలం, చతుష్షష్టికలా స్త్వేతాః కలావిద్భిః ప్రకీర్తితాః. {{p|ac|fwb}}చతుర్దశవిద్యలు</p> పదునాలుగువిద్యలు:- శ్లో. 'అంగాని వేదా శ్చత్వారో మీమాంసాన్యా యవిస్తరః, పురాణం ధర్మశాస్త్రం చ విద్యా హ్యేతా శ్చతుర్దశ.' {{p|ac|fwb}}అష్టాదశవిద్యలు</p> పదునెనిమిది విద్యలు:-శ్లో. ఆయుర్వేదో ధనుర్వేదో నీతిశాస్త్రార్థశాస్త్రయోః, వేదాం గాని చ వేదాని మీమాంసా న్యాయవిస్తరః ధర్మశాస్త్ర పురాణం చ విద్యా హ్యష్టాదశా యితి. {{Telugu poem|type=సీ.|lines=<poem>అఖిలభూతంబుల నాడించుమాయను సొంపుగా నెవ్వఁ డాడింపుచుండు</poem>|ref=}}<noinclude><references/></noinclude> jt38wzj9xd3y07mrdt2nfmnj339zjhk పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/53 104 117756 551950 371604 2026-04-07T19:19:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 551950 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 34 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem></poem>|ref=}}గురుజనంబుల కెల్ల గురువులై తగుహరి హరుల కెవ్వఁడు గురు వగుచు నుండు వివిధలోకంబుల వెలిగించి వెలుఁగుల మించి యెవ్వఁడు వెలిగించు చుండుఁ బ్రభువుల కెల్ల సత్ప్రభువైన బ్రహ్మకుఁ బ్రభుఁడౌచు నెవ్వఁడు పరఁగుచుండు {{Telugu poem|type=తే.|lines=<poem>సగుణనిర్గుణరూపుఁడై నెగడుచుండు నమ్మహాదేవగురువరు నభినుతింప సకలనిగమాగమాంతశాస్త్రంబు లోప వనఁగ మముఁబోంట్లకు నుతింప నలవి యగునె?</poem>|ref=33}} '''టీ'''. ఎవ్వఁడు = ఏమహానుభావుఁడు, అఖిలభూతంబులన్ = సమస్తజీవులను, ఆడించుమాయనున్ = శరీరాదులయందు ఆత్మ యనుబుద్ధిని గలిగించి భ్రమింపఁజేయునట్టిమాయను, సొంపుగాన్ = అందముగ, ఆడించుచున్ ఉండున్ = నటింపఁజేయుచుండునో (సర్వకార్యములయందు ప్రవర్తింపఁజేయుచుండునో), ఎవ్వఁడు, గురుజనంబుల కెల్లన్ = గురువులగువారలకందఱకును, గురువులు ఐ = ఆచార్యులై (లేక జనకులై), తగుహరిహరులకున్ = ఒప్పునట్టివిష్ణురుద్రులకు, గురువు అగుచుఁన్ = ఆచార్యుఁడై (లేక జనకుఁడై), ఉండున్ = ఉండునో, ఎవ్వఁడు, వివిధలోకంబులన్ = సకలవిధము లగుప్రపంచములను, వెలిగించువెలుఁగులన్ = ప్రకాశింపఁజేయు సూర్యచంద్రాగ్నులను, మించి = అతిశయించి (సూర్యాదులకంటె నధిక మగు ప్రకాశముగలవాఁడై యనుట), వెలిగించుచున్ ఉండున్ = ప్రకాశింపఁజేయుచుండునో (పరబ్రహ్మము యొక్క ప్రకాశమువలననే చంద్రుడు సూర్యుఁడు అగ్ని మొదలగు తేజస్సులు ప్రకాశించుచున్నవి యని భావము), ఎవ్వఁడు= ఏమహానుభావుఁడు, ప్రభువులకున్ ఎల్లన్ = ఇంద్రుఁడు మొదలగు లోకపాలకులకందఱికిం గూడ, సత్, ప్రభువు = అధిపతి, అయినబ్రహ్మకున్ = అగునట్టిహిరణ్యగర్భునకు, ప్రభుఁడుఅగుచున్ = నియామకుఁడై (ఆధికారియై), పరఁగుచున్ ఉండున్ = ప్రకాశించుచుండునో (ఇట్లు చెప్పుటచే, బ్రహ్మ విష్ణువు రుద్రుఁడు ఈశ్వరుఁడు సదాశివుఁడు అనునట్టి పంచభూతసృష్టికర్త లందఱకును నియామకుడు అనినట్లయ్యెనని తెలిసికొనునది), ఎవ్వఁడు, సగుణ...డై — సగుణ = శాంతి మొదలగు సద్గుణములతోఁ గూడి (ఉపాసనచేయుటకుఁ దగినదియై, చిత్తశుద్ధిని గలిగింప సాధనమైనట్టియు) నిర్గుణ = గుణము లేవియును లేనిదై (నిర్వికల్పముగ ధ్యానించుటకుఁ దగినదియై యుండునట్టియు), రూపుఁడు ఐ = రూపములు గలవాఁడై, నెగడుచుండున్ = ప్రకాశించుచుండునో, అమ్మహాదేవ గురువరున్ = అట్టి<noinclude><references/></noinclude> 0nz3fexhyb5xrunqt4y98fp8eot1qxh 551951 551950 2026-04-07T19:20:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 551951 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 34 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>గురుజనంబుల కెల్ల గురువులై తగుహరి హరుల కెవ్వఁడు గురు వగుచు నుండు వివిధలోకంబుల వెలిగించి వెలుఁగుల మించి యెవ్వఁడు వెలిగించు చుండుఁ బ్రభువుల కెల్ల సత్ప్రభువైన బ్రహ్మకుఁ బ్రభుఁడౌచు నెవ్వఁడు పరఁగుచుండు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సగుణనిర్గుణరూపుఁడై నెగడుచుండు నమ్మహాదేవగురువరు నభినుతింప సకలనిగమాగమాంతశాస్త్రంబు లోప వనఁగ మముఁబోంట్లకు నుతింప నలవి యగునె?</poem>|ref=33}} '''టీ'''. ఎవ్వఁడు = ఏమహానుభావుఁడు, అఖిలభూతంబులన్ = సమస్తజీవులను, ఆడించుమాయనున్ = శరీరాదులయందు ఆత్మ యనుబుద్ధిని గలిగించి భ్రమింపఁజేయునట్టిమాయను, సొంపుగాన్ = అందముగ, ఆడించుచున్ ఉండున్ = నటింపఁజేయుచుండునో (సర్వకార్యములయందు ప్రవర్తింపఁజేయుచుండునో), ఎవ్వఁడు, గురుజనంబుల కెల్లన్ = గురువులగువారలకందఱకును, గురువులు ఐ = ఆచార్యులై (లేక జనకులై), తగుహరిహరులకున్ = ఒప్పునట్టివిష్ణురుద్రులకు, గురువు అగుచుఁన్ = ఆచార్యుఁడై (లేక జనకుఁడై), ఉండున్ = ఉండునో, ఎవ్వఁడు, వివిధలోకంబులన్ = సకలవిధము లగుప్రపంచములను, వెలిగించువెలుఁగులన్ = ప్రకాశింపఁజేయు సూర్యచంద్రాగ్నులను, మించి = అతిశయించి (సూర్యాదులకంటె నధిక మగు ప్రకాశముగలవాఁడై యనుట), వెలిగించుచున్ ఉండున్ = ప్రకాశింపఁజేయుచుండునో (పరబ్రహ్మము యొక్క ప్రకాశమువలననే చంద్రుడు సూర్యుఁడు అగ్ని మొదలగు తేజస్సులు ప్రకాశించుచున్నవి యని భావము), ఎవ్వఁడు= ఏమహానుభావుఁడు, ప్రభువులకున్ ఎల్లన్ = ఇంద్రుఁడు మొదలగు లోకపాలకులకందఱికిం గూడ, సత్, ప్రభువు = అధిపతి, అయినబ్రహ్మకున్ = అగునట్టిహిరణ్యగర్భునకు, ప్రభుఁడుఅగుచున్ = నియామకుఁడై (ఆధికారియై), పరఁగుచున్ ఉండున్ = ప్రకాశించుచుండునో (ఇట్లు చెప్పుటచే, బ్రహ్మ విష్ణువు రుద్రుఁడు ఈశ్వరుఁడు సదాశివుఁడు అనునట్టి పంచభూతసృష్టికర్త లందఱకును నియామకుడు అనినట్లయ్యెనని తెలిసికొనునది), ఎవ్వఁడు, సగుణ...డై — సగుణ = శాంతి మొదలగు సద్గుణములతోఁ గూడి (ఉపాసనచేయుటకుఁ దగినదియై, చిత్తశుద్ధిని గలిగింప సాధనమైనట్టియు) నిర్గుణ = గుణము లేవియును లేనిదై (నిర్వికల్పముగ ధ్యానించుటకుఁ దగినదియై యుండునట్టియు), రూపుఁడు ఐ = రూపములు గలవాఁడై, నెగడుచుండున్ = ప్రకాశించుచుండునో, అమ్మహాదేవ గురువరున్ = అట్టి<noinclude><references/></noinclude> p3vxmtzh3idnelpas5yznlspqfqd66o 551952 551951 2026-04-07T19:21:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 551952 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 34 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>గురుజనంబుల కెల్ల గురువులై తగుహరి హరుల కెవ్వఁడు గురు వగుచు నుండు వివిధలోకంబుల వెలిగించి వెలుఁగుల మించి యెవ్వఁడు వెలిగించు చుండుఁ బ్రభువుల కెల్ల సత్ప్రభువైన బ్రహ్మకుఁ బ్రభుఁడౌచు నెవ్వఁడు పరఁగుచుండు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సగుణనిర్గుణరూపుఁడై నెగడుచుండు నమ్మహాదేవగురువరు నభినుతింప సకలనిగమాగమాంతశాస్త్రంబు లోప వనఁగ మముఁబోంట్లకు నుతింప నలవి యగునె?</poem>|ref=33}} '''టీ'''. ఎవ్వఁడు = ఏమహానుభావుఁడు, అఖిలభూతంబులన్ = సమస్తజీవులను, ఆడించుమాయనున్ = శరీరాదులయందు ఆత్మ యనుబుద్ధిని గలిగించి భ్రమింపఁజేయునట్టిమాయను, సొంపుగాన్ = అందముగ, ఆడించుచున్ ఉండున్ = నటింపఁజేయుచుండునో (సర్వకార్యములయందు ప్రవర్తింపఁజేయుచుండునో), ఎవ్వఁడు, గురుజనంబుల కెల్లన్ = గురువులగువారలకందఱకును, గురువులు ఐ = ఆచార్యులై (లేక జనకులై), తగుహరిహరులకున్ = ఒప్పునట్టివిష్ణురుద్రులకు, గురువు అగుచుఁన్ = ఆచార్యుఁడై (లేక జనకుఁడై), ఉండున్ = ఉండునో, ఎవ్వఁడు, వివిధలోకంబులన్ = సకలవిధము లగుప్రపంచములను, వెలిగించువెలుఁగులన్ = ప్రకాశింపఁజేయు సూర్యచంద్రాగ్నులను, మించి = అతిశయించి (సూర్యాదులకంటె నధిక మగు ప్రకాశముగలవాఁడై యనుట), వెలిగించుచున్ ఉండున్ = ప్రకాశింపఁజేయుచుండునో (పరబ్రహ్మము యొక్క ప్రకాశమువలననే చంద్రుడు సూర్యుఁడు అగ్ని మొదలగు తేజస్సులు ప్రకాశించుచున్నవి యని భావము), ఎవ్వఁడు= ఏమహానుభావుఁడు, ప్రభువులకున్ ఎల్లన్ = ఇంద్రుఁడు మొదలగు లోకపాలకులకందఱికిం గూడ, సత్, ప్రభువు = అధిపతి, అయినబ్రహ్మకున్ = అగునట్టిహిరణ్యగర్భునకు, ప్రభుఁడుఅగుచున్ = నియామకుఁడై (ఆధికారియై), పరఁగుచున్ ఉండున్ = ప్రకాశించుచుండునో (ఇట్లు చెప్పుటచే, బ్రహ్మ విష్ణువు రుద్రుఁడు ఈశ్వరుఁడు సదాశివుఁడు అనునట్టి పంచభూతసృష్టికర్త లందఱకును నియామకుడు అనినట్లయ్యెనని తెలిసికొనునది), ఎవ్వఁడు, సగుణ...డై — సగుణ = శాంతి మొదలగు సద్గుణములతోఁ గూడి (ఉపాసనచేయుటకుఁ దగినదియై, చిత్తశుద్ధిని గలిగింప సాధనమైనట్టియు) నిర్గుణ = గుణము లేవియును లేనిదై (నిర్వికల్పముగ ధ్యానించుటకుఁ దగినదియై యుండునట్టియు), రూపుఁడు ఐ = రూపములు గలవాఁడై, నెగడుచుండున్ = ప్రకాశించుచుండునో, అమ్మహాదేవ గురువరున్ = అట్టి<noinclude><references/></noinclude> 2coyq2qp8mul2wkoi4yk79ooa3thja9 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/54 104 117795 551953 486600 2026-04-07T19:26:20Z దేవీప్రసాదశాస్త్రి 4290 551953 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |పీఠిక | 35}}</noinclude>మహాదేవాచార్యుని, అభినుతింప = స్తోత్రము చేయుటకు, సకల...బులు — సకల = సమస్తములైన, నిగమ = వేదముల యొక్కయు, ఆగమ— కామికము మొదలగు నిరువదియెనిమిది యాగమములయొక్కయు, అంత = తుదలు (వేదములకు అంతములగు నుపనిషత్తులును, ఆగమములకంతము లగుచరా, క్రియా, యోగ, జ్ఞాన, పాదము లను నాల్గింటియందుఁ జెప్పఁబడు షడధ్వములతోఁ గూడిన కర్మసాదాఖ్య కర్తృసాదాఖ్య అమూర్తిసాదాఖ్య మూర్తిసాదాఖ్య శివసాధాఖ్య మహాసాదాఖ్యములును), శాస్త్రంబులు = బ్రహ్మసూత్రములు మొదలగు వేదాంతశాస్త్రములును, ఓపవు = సమర్థములు కావు (ఈ పద్యమున మహాదేవాచార్యునకును పరబ్రహ్మమునకును అభేదమునుజెప్పెను), అనినన్ = అని చెప్పఁగా, మముబోంట్లకున్ = మాయట్టి యల్పజ్ఞులకు, నుతింపన్ = స్తోత్రము చేయుటకు, అలవి అగునెె = శక్యమగునా? '''తా'''. ఆమహాదేవాచార్యుఁడు సకలజీవులను సంసారభ్రాంతిలోఁ జిక్కించి త్రిప్పునట్టి మాయను దన చేఁ జిక్కించుకొని త్రిప్పుచున్నాడు. గురువు లని చెప్పదగువారల కందఱకు నాచార్యులై సకలజగత్తులకును గారణభూతులై యుండు హరిహరులకుఁ గూడ జ్ఞానోపదేశకుఁడై కారణభూతుఁడై యున్నాడు. నానావిధము లగు ప్రపంచములనుగూడ నపరిమితమగుశక్తితోఁ బ్రకాశింపఁజేయు సూర్యాదులకు కూడఁ గాంతి నొసంగుచున్నాఁడు. ఇంద్రుఁడు యముఁడు మొదలగు సమస్తలోకపాలకులకునుగూడ నాజ్ఞాపించుచు వారల కధిపతి యై యున్న చతుర్ముఖునకుఁ గూడ బ్రభువై యున్నాడు. ఆయాచార్యుని రూపము సగుణమై ఉపాసకుల ననుగ్రహించుచుండును. నిర్గుణమై నిర్వికల్పముగ ధ్యానింపఁబడుచు, నపరోక్షజ్ఞానమునకు విషయమై మోక్షమునుగోరువారి దయఁ జూచుచుండును. ఇట్టి మహాప్రభావసంపన్నుఁ డగు నాగురుశ్రేష్ఠుని వేదాంతములో నుపనిషత్తులు గాని ఆగమాంతము లగు షడధ్వసహితము లైన కర్మసాదాఖ్యము మొదలగునవిగాని బ్రహ్మసూత్రము మొదలగు శాస్త్రములు గాని వర్ణింపనేరవు. ఇట్లుండ నమ్మహాత్ముని వర్ణింపనే నెంతవాఁడను? '''అవ'''. ఇట్లు విద్యావంశమును వర్ణించి మిగుల సంక్షేపముగ జన్మవంశమును వర్ణించుచున్నాఁడు — {{Telugu poem|type=తే.|lines=<poem>అమ్మహాదేవగురుచరణారవింద వరపరాంగాంశభజనతత్పరుఁడఁబరశు రామపంతులకులజాత రామమంత్రి మౌళితిమ్మాంబికాప్రియాత్మజుఁడ నేను.</poem>|ref=34}} '''టీ'''. ఆ...రుఁడన్ — అమ్మహాదేవగురు = కోనేరుగురునకు శిష్యుఁడైన యమ్మహాదేవాచార్యునియొక్క, చరణారవింద = పాదపద్మముయొక్క, వర = శ్రేష్ఠమైన,<noinclude><references/></noinclude> rcfwmpmjt0ct8mvshh3a7xcgz09o7vn పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/55 104 117808 551954 371605 2026-04-07T19:31:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 551954 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 36 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>పరాగ= రేణువు యొక్క, అంశ = అల్పభాగమును (స్వల్ప మగుపాదధూళిని), భజన = సేవించుటయందు, తత్సరుఁడన్ = ఆసక్తి గలవాఁడను. (ఆమహాదేవాచార్యుని శిష్యుఁడను అనుట.) పరశు...జుఁడన్ = పరశురామపంతుల కులమందుఁ బుట్టిన (ఈకవియింటి పేరు పరశురామపంతులవారు), రామమంత్రిమౌళి = మంత్రులలో నుత్తముఁడగు రామయ్య అనువానికిని, తిమ్మాంబికా = తిమ్మాంబ యనునామెకును, ప్రియాత్మజుఁడన్ = ప్రియపుత్త్రుఁడను, (ఈకవి పేరు లింగమూర్తి, గురుమూర్తి) అయిన నేను, '''తా'''. కోనేరుగురుశిష్యుఁ డగునామహాదేవాచార్యునకు శిష్యుఁడనై పరశురామపంతుల రామయ్యకును దిమ్మాంబికకును పుత్త్రుఁడ నై యున్న నేను. (ఈ పద్యము షష్ఠ్యంతములతోను వాని కావలనుండు వచనములోను జేర్చి యేకవాక్యముగా నన్వయించుకొనవలయును.) {{Telugu poem|type=క.|lines=<poem>శ్రీరామనామమంత్రా, కారునకు ససంగ నిర్వికారునకు మహా కారునకు నిర్జితాహం, కారున కజ్ఞానభూమికాదూరునకున్.</poem>|ref=35}} '''టీ'''. శ్రీరా...నకున్ — శ్రీరామ = రామునియొక్క, నామ = పేరు గలిగినట్టియు, మంత్ర = తారకమంత్రమే, ఆకారునకున్ = స్వరూపముగాఁ గలిగినట్టియు, (రామ దేవతా స్వరూపుఁడైనట్టియు, తారకమంత్రరూపుఁ డైనట్టియు) అ... నకున్ — అసంగ = ప్రపంచ వికారములతో సంబంధము లేనట్టియు, నిర్వికారునకున్ = షడ్వికారములు లేనట్టియు (అస్తి = కలఁడు, జాయతే = పుట్టుచున్నాఁడు, వర్ధతే = వృద్ధిఁ జెందుచున్నాఁడు, విపరిణమతే = మార్పునొందుచున్నాఁడు, అపక్షీయతే = క్షీణించుచున్నాడు. నశ్యతి = నాశనమును జెందుచున్నాఁడు అని చెప్పుటకు వీలైనస్థితులు ఆఱును వికారము లనఁబడును.), మహాకారునకున్ = సర్వవ్యాపక మైన (లేక విరాట్పురుషరూపమైన) ఆకారము గలిగినట్టియు (ఇచ్చట మహోంకారునకు అని పాఠాంతరము గలదు. అప్పుడు "పూజనీయమైన ఓంకారమే స్వరూపముగాఁ గలవాఁడు" అని యర్థము), ని...నకున్ — నిర్జిత = జయింపఁబడిన, అహంకారునకున్ = అహంకారము గలిగినట్టియు, అ ...నకున్ — అజ్ఞానభూమికా = ఏడువిధము లగు అజ్ఞానభూమికలకు, దూరునకున్ = దూరమైనట్టియు (అజ్ఞాన భూమికలు లేనట్టియు.) '''తా'''. శ్రీరామస్వరూపుఁడును, తారకమంత్రమే యాకారముగఁ గలవాడును, ప్రపంచముతోఁ గాని, యందలివికారముతోఁ గాని సంబంధము లేనివాఁడును, గర్భస్థుఁడగుట పుట్టుట వృద్ధిఁజెందుట మార్పునొందుట (లేక, ముసలితనము నొందుట) క్షీణించుట చచ్చుట యనియెడు నాఱువికారములు లేనివాఁడును, విరాట్పురుషరూపుఁడును, అహంకారమును జయించినవాఁడును, అజ్ఞానభూమికలయందుఁ జిక్కుఁబడనివాఁడును. {{nop}}<noinclude><references/></noinclude> sslnf8paepe3wey9erz0co3h9ktox2r 551955 551954 2026-04-07T19:32:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 551955 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 36 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>పరాగ= రేణువు యొక్క, అంశ = అల్పభాగమును (స్వల్ప మగుపాదధూళిని), భజన = సేవించుటయందు, తత్పరుఁడన్ = ఆసక్తి గలవాఁడను. (ఆమహాదేవాచార్యుని శిష్యుఁడను అనుట.) పరశు...జుఁడన్ = పరశురామపంతుల కులమందుఁ బుట్టిన (ఈకవియింటి పేరు పరశురామపంతులవారు), రామమంత్రిమౌళి = మంత్రులలో నుత్తముఁడగు రామయ్య అనువానికిని, తిమ్మాంబికా = తిమ్మాంబ యనునామెకును, ప్రియాత్మజుఁడన్ = ప్రియపుత్త్రుఁడను, (ఈకవి పేరు లింగమూర్తి, గురుమూర్తి) అయిన నేను, '''తా'''. కోనేరుగురుశిష్యుఁ డగునామహాదేవాచార్యునకు శిష్యుఁడనై పరశురామపంతుల రామయ్యకును దిమ్మాంబికకును పుత్త్రుఁడ నై యున్న నేను. (ఈ పద్యము షష్ఠ్యంతములతోను వాని కావలనుండు వచనములోను జేర్చి యేకవాక్యముగా నన్వయించుకొనవలయును.) {{Telugu poem|type=క.|lines=<poem>శ్రీరామనామమంత్రా, కారునకు ససంగ నిర్వికారునకు మహా కారునకు నిర్జితాహం, కారున కజ్ఞానభూమికాదూరునకున్.</poem>|ref=35}} '''టీ'''. శ్రీరా...నకున్ — శ్రీరామ = రామునియొక్క, నామ = పేరు గలిగినట్టియు, మంత్ర = తారకమంత్రమే, ఆకారునకున్ = స్వరూపముగాఁ గలిగినట్టియు, (రామ దేవతా స్వరూపుఁడైనట్టియు, తారకమంత్రరూపుఁ డైనట్టియు) అ... నకున్ — అసంగ = ప్రపంచ వికారములతో సంబంధము లేనట్టియు, నిర్వికారునకున్ = షడ్వికారములు లేనట్టియు (అస్తి = కలఁడు, జాయతే = పుట్టుచున్నాఁడు, వర్ధతే = వృద్ధిఁ జెందుచున్నాఁడు, విపరిణమతే = మార్పునొందుచున్నాఁడు, అపక్షీయతే = క్షీణించుచున్నాడు. నశ్యతి = నాశనమును జెందుచున్నాఁడు అని చెప్పుటకు వీలైనస్థితులు ఆఱును వికారము లనఁబడును.), మహాకారునకున్ = సర్వవ్యాపక మైన (లేక విరాట్పురుషరూపమైన) ఆకారము గలిగినట్టియు (ఇచ్చట మహోంకారునకు అని పాఠాంతరము గలదు. అప్పుడు "పూజనీయమైన ఓంకారమే స్వరూపముగాఁ గలవాఁడు" అని యర్థము), ని...నకున్ — నిర్జిత = జయింపఁబడిన, అహంకారునకున్ = అహంకారము గలిగినట్టియు, అ ...నకున్ — అజ్ఞానభూమికా = ఏడువిధము లగు అజ్ఞానభూమికలకు, దూరునకున్ = దూరమైనట్టియు (అజ్ఞాన భూమికలు లేనట్టియు.) '''తా'''. శ్రీరామస్వరూపుఁడును, తారకమంత్రమే యాకారముగఁ గలవాడును, ప్రపంచముతోఁ గాని, యందలివికారముతోఁ గాని సంబంధము లేనివాఁడును, గర్భస్థుఁడగుట పుట్టుట వృద్ధిఁజెందుట మార్పునొందుట (లేక, ముసలితనము నొందుట) క్షీణించుట చచ్చుట యనియెడు నాఱువికారములు లేనివాఁడును, విరాట్పురుషరూపుఁడును, అహంకారమును జయించినవాఁడును, అజ్ఞానభూమికలయందుఁ జిక్కుఁబడనివాఁడును. {{nop}}<noinclude><references/></noinclude> c3h38s30m9p9lewroi7us4m5nlqg1nb 551956 551955 2026-04-07T19:32:55Z దేవీప్రసాదశాస్త్రి 4290 551956 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 36 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>పరాగ = రేణువుయొక్క, అంశ = అల్పభాగమును (స్వల్ప మగుపాదధూళిని), భజన = సేవించుటయందు, తత్పరుఁడన్ = ఆసక్తి గలవాఁడను (ఆమహాదేవాచార్యుని శిష్యుఁడను అనుట), పరశు...జుఁడన్ = పరశురామపంతుల కులమందుఁ బుట్టిన (ఈకవియింటి పేరు పరశురామపంతులవారు), రామమంత్రిమౌళి = మంత్రులలో నుత్తముఁడగు రామయ్య అనువానికిని, తిమ్మాంబికా = తిమ్మాంబ యనునామెకును, ప్రియాత్మజుఁడన్ = ప్రియపుత్త్రుఁడను, (ఈకవి పేరు లింగమూర్తి, గురుమూర్తి) అయిన నేను. '''తా'''. కోనేరుగురుశిష్యుఁ డగునామహాదేవాచార్యునకు శిష్యుఁడనై పరశురామపంతుల రామయ్యకును దిమ్మాంబికకును పుత్త్రుఁడ నై యున్న నేను. (ఈ పద్యము షష్ఠ్యంతములతోను వాని కావలనుండు వచనములోను జేర్చి యేకవాక్యముగా నన్వయించుకొనవలయును.) {{Telugu poem|type=క.|lines=<poem>శ్రీరామనామమంత్రా, కారునకు ససంగ నిర్వికారునకు మహా కారునకు నిర్జితాహం, కారున కజ్ఞానభూమికాదూరునకున్.</poem>|ref=35}} '''టీ'''. శ్రీరా...నకున్ — శ్రీరామ = రామునియొక్క, నామ = పేరు గలిగినట్టియు, మంత్ర = తారకమంత్రమే, ఆకారునకున్ = స్వరూపముగాఁ గలిగినట్టియు, (రామ దేవతా స్వరూపుఁడైనట్టియు, తారకమంత్రరూపుఁ డైనట్టియు) అ... నకున్ — అసంగ = ప్రపంచ వికారములతో సంబంధము లేనట్టియు, నిర్వికారునకున్ = షడ్వికారములు లేనట్టియు (అస్తి = కలఁడు, జాయతే = పుట్టుచున్నాఁడు, వర్ధతే = వృద్ధిఁ జెందుచున్నాఁడు, విపరిణమతే = మార్పునొందుచున్నాఁడు, అపక్షీయతే = క్షీణించుచున్నాడు. నశ్యతి = నాశనమును జెందుచున్నాఁడు అని చెప్పుటకు వీలైనస్థితులు ఆఱును వికారము లనఁబడును.), మహాకారునకున్ = సర్వవ్యాపక మైన (లేక విరాట్పురుషరూపమైన) ఆకారము గలిగినట్టియు (ఇచ్చట మహోంకారునకు అని పాఠాంతరము గలదు. అప్పుడు "పూజనీయమైన ఓంకారమే స్వరూపముగాఁ గలవాఁడు" అని యర్థము), ని...నకున్ — నిర్జిత = జయింపఁబడిన, అహంకారునకున్ = అహంకారము గలిగినట్టియు, అ ...నకున్ — అజ్ఞానభూమికా = ఏడువిధము లగు అజ్ఞానభూమికలకు, దూరునకున్ = దూరమైనట్టియు (అజ్ఞాన భూమికలు లేనట్టియు.) '''తా'''. శ్రీరామస్వరూపుఁడును, తారకమంత్రమే యాకారముగఁ గలవాడును, ప్రపంచముతోఁ గాని, యందలివికారముతోఁ గాని సంబంధము లేనివాఁడును, గర్భస్థుఁడగుట పుట్టుట వృద్ధిఁజెందుట మార్పునొందుట (లేక, ముసలితనము నొందుట) క్షీణించుట చచ్చుట యనియెడు నాఱువికారములు లేనివాఁడును, విరాట్పురుషరూపుఁడును, అహంకారమును జయించినవాఁడును, అజ్ఞానభూమికలయందుఁ జిక్కుఁబడనివాఁడును. {{nop}}<noinclude><references/></noinclude> 9ib908f0j0u3kope8p79eabzlzg6a9s పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/56 104 117833 551957 486938 2026-04-07T19:51:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 551957 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |పీఠిక |37 }}</noinclude>{{p|ac|fwb}}అజ్ఞానభూమికావివరణము</p> బీజజాగ్రము, జాగ్రము, మహాజాగ్రము, జాగ్రత్స్వప్నము, స్వప్నము, స్వప్నజాగ్రము, సుషుప్తి అని అజ్ఞానభూమిక లేడు. 1 అందు నామరూపరహితాఖండపరిపూర్ణసచ్చిదానందపరబ్రహ్మమందు జగత్సృష్టికి కారణముగఁ గలిగిన తెలివియే బీజాజాగ్రము; 2 అవిభక్తమగు నాతెలివికి ముందు లేని భేదము సూక్ష్మముగఁగలిగి ప్రపంచాభిముఖమగు టజాగ్రము; ఆలోకవాసన ప్రబలుట మహాజాగ్రము; 4 జాగ్రద్దశయందు చూడనివి సంకల్పించి, నిష్ప్రయోజకముగ మనోరాజ్యమేలుట జాగ్రత్స్వప్నము; 5 ఆజాగ్రమందు కల్పితస్వరూపములఁ జూచుట స్వప్నము; 6 మఱచినదానిఁ దలఁచుట స్వప్నజాగ్రము; 7 ఆత్మప్రతిబింబముగాఁ దోఁచుచున్న జగద్విషయము సుఖమని దాన మునుఁగుట సుషుప్తి. {{Telugu poem|type=క.|lines=<poem>ధీరునకు భక్తజనమం, దారునకు నిరంతరాత్యుదారునకు నిరా ధారునకు నిఖలజగదా, ధారునకు ననాద్యఖండితశరీరునకున్.</poem>|ref=36}} '''టీ'''. ధీరునకున్ = ఆత్మానాత్మజ్ఞానముగలిగినట్టియు, భక్తి...నకున్ — భక్తజన = భక్తులగువారికి (శిష్యు లగువారికి), మందారునకున్ = కల్పవృక్షమువంటివాఁ డగునట్టియు (తత్వార్థమును జక్కఁగ నుపదేశించి బ్రహ్మానందానుభవము నొసఁగునట్టియు అనుట), నిరం...నకున్ — నిరంతర = ఎప్పుడును, అత్యుదారునకున్ = మిగుల దానము చేయునట్టియు (మహాత్యాగి యైనట్టియు), నిరాధారునకున్ = వేఱొకపదార్థము తన కాధారముగ లేనట్టియు, సకలజగదాధారునకున్ = సమస్తప్రపంచమునకు ఆధారభూతుఁ డైనట్టియు, అనా...నకున్ — అనాది = పుట్టుక లేనట్టియు, అఖండిత = నాశనము లేనట్టియు, శరీరునకున్ = శరీరముగలవాఁడును. '''తా'''. స్వయముగ సంపూర్ణమగు పరబ్రహ్మజ్ణానము గలిగి కల్పవృక్షమువలె నాశ్రితు లగుశిష్యులఁ గృతార్థులఁ జేయుచు, మహాత్యాగియై యుండువాఁడును, తాను మఱియొకయాధారము నపేక్షింపక స్వతంత్రుఁ డై నిలిచి తనయందు సకలప్రపంచమును స్థిరముగ నిలుపుకొని యుండువాఁడును, ఉత్పత్తవినాశములు లేనివాఁడును. {{p|ac|fwb}}మహాత్యాగిలక్షణము</p> {{Telugu poem|type=క.|lines=<poem>జనియును మృతియును ధర్మం, బు నధర్మము సౌఖ్యదుఃఖములు లేవని నె మ్మనమునఁ దలంచు నెవ్వం, డనఘమతీ యతఁడపో మహాత్యాగి ధరన్.</poem>|ref=}} {{Telugu poem|type=క.|lines=<poem>వ్యాపకునకుఁ ద్రిశరీరా, లేపకునకు నిర్జితావలేపకునకు ధీ దీపకునకు సచ్చిత్సుఖ, రూపకున కనంతవిశ్వరూపాత్మునకున్.</poem>|ref=37}}<noinclude><references/></noinclude> ij083c4oihzl889e38vlen7fy79h8um పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/57 104 117848 551958 371694 2026-04-07T19:59:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 551958 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 38 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>'''టీ'''. వ్యాపకునకు = సర్వమును వ్యాపించియున్నవాఁడును, త్రి....నకున్ — త్రిశరీర = స్థూలసూక్ష్మ కారణశరీరములను (లేక శరీరములయందు), అలేపకునకున్ = సంబంధము లేనివాఁడును, నిర్జిత అవలేపకునకున్ = జయింపఁబడిన గర్వము గలవాఁడును (ఇచ్చట గర్వమని చెప్పుటచే, సర్వవిధము లగుదుర్గుణములును గూర్చియుఁ జెప్పునట్లె యని యూహించునది), ధీ దీపకునకున్ = తనజ్ఞానశక్తిచే బుద్ధిని ప్రకాశింపఁ జేయువాఁడును, సత్ చిత్ సుఖరూపకునకు = సచ్చిదానందస్వరూపుఁడును, ఆ...నకున్ — అనంత = తుదిలేని, విశ్వ = ప్రపంచమే, రూప = స్వరూపముగాఁ గల పరబ్రహ్మమే, ఆత్మునకున్ = శరీరముగాఁ గలవాఁడును, (పరబ్రహ్మరూపుఁడును అనుట.) '''తా'''. సకలలోకములను వ్యాపించి, స్థూలసూక్ష్మకారణశరీరములతో (వాని వికారములతో) సంబంధపడక గర్వము మొదలగు సకలదుర్గుణములను జయించి యుండువాఁడును, తనజ్ఞానశక్తిచే బుద్ధిని బ్రకాశింపఁజేయువాఁడును, సచ్చిదానందస్వరూపుడును, సకలప్రపంచమయుఁడును అయినపరబ్రహ్మమే తానై యుండువాఁడును. {{Telugu poem|type=క.|lines=<poem>శ్రీమద్దత్తాత్రేయమ, హామునిసదృశునకు శ్రీమహాదేవగురు స్వామికిఁ దతసర్వాంత, ర్యామికి విజ్ఞానభూమికారామునకున్.</poem>|ref=38}} '''టీ'''. శ్రీ మ...నకున్ — శ్రీమత్ = సంపద్యుక్తుఁడైన, దత్తాత్రేయ మహాముని = దత్తాత్రేయుఁడను యోగీశ్వరుతోడ (వైదికసంప్రదాయము నశించినకాలమున దానిని మరల నుద్ధరించుటకై యత్రి మహామునికి దత్తాత్రేయుఁ డనుపేర విష్ణువు జన్మించెనని యొకగాథ కలదు), సదృశునకున్ = సమానుఁ డైనవాఁడును, తత... కిన్ — తత = విస్తారమైన, సర్వ = సమస్తమునకును (నానావిధము లగు సకలప్రపంచమునకును అనుట), అంతర్యామికిన్ = లోపలనుండి నియమించినవాడును, (అనఁగా: ప్రతిభూతములను వాని వాని కార్యములయందుఁ బ్రవర్తింపఁజేయువాఁడును), వి...కున్ — విజ్ఞానభూమికా = ఏడుజ్ఞానభూమికలే, ఆరామునకున్ = విహారస్థానములుగా గలవాఁడును (జ్ఞాననిష్ఠుఁడు ననుట), అగు, శ్రీమ...కిన్ — శ్రీ = శోభాయుక్తుఁడైన (లేక బ్రహ్మజ్ఞానవంతుఁ డైన), మహాదేవగురుస్వామికిన్ = ఆచార్యస్వామి యగుమహాదేవునకు. '''తా'''. అత్రిమహాముని దత్తాత్రేయరూపముతో నవతరించిన శ్రీమన్నారాయణునితో సమానుఁడును, సకలలోకములకు నంతర్యామిస్వరూపుఁడును, జీవబ్రహ్మైక్యసమాధినిష్ఠుఁడును ఆచార్యులలో నుత్తముఁడు నగు మహాదేవాచార్యునకు. {{p|ac|fwb}}జ్ఞానభూమికావివరణము</p> శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్త్వాపత్తి, సంసక్తినామిక, పదార్థభావని, తుర్యగ అని జ్ఞానభూమిక లేడు. అందు శుభేచ్ఛ యనఁగా; బహుజన్మార్జితసుకృత<noinclude><references/></noinclude> 8547646gm3cenyul5m0is3w12ufg9o4 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/58 104 117887 551959 371778 2026-04-07T20:03:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 551959 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |పీఠిక |39 }}</noinclude>పరిపాకమువలన కాకతాళీయన్యాయముగ దైవికముచేత జ్ఞానముగలవాఁడై, “ఆయ్యో నేనేల మూఢుఁడ నయితిని? ఈయపార సంసారసాగరమెట్లుదాఁటఁగల' నని పరితపించి సజ్జనుల చేరువఁ జేరి వారి యపారకరుణాపూరసేవనంబున దురాపంబు లగుతాపంబులు తీఱి పిమ్మట వారల యుపదేశబలంబున సత్కర్మాచరణమును వేదాంతశాస్త్రపరిజ్ఞానమును ఇహపరలోకభోగ విరక్తియుఁగలిగి మోక్షము నపేక్షించుట. విచారణయనఁగా : అద్వైతశాస్త్రపరిజ్ఞానంబును సత్సంగమంబును వైరాగ్యంబును గలిగి బ్రహ్మమెయ్యది యని విచారించుట. తనుమానసయనఁగా; ఈరెండు భూమికలసాధన పూర్ణముగఁ గలిగి దారుణము లగు విషయేంద్రియముల త్రిప్పులోఁ దగులక; మనసును క్షీణింపఁజేయుట. దీనికి అసంగమమని మఱియొకపేరు గలదు, ఆయసంగమము సామాన్యమని విశేషమని ద్వివిధము. మఱియు నది సామాన్యవిశేషభేదములచేత నాల్గు విధములు. అందు సామాన్యాసంగమమనఁగా; శబ్దాదివిషయములయందు నేను కర్తను భోక్తను గురువును శిష్యుఁడను బాధ్యుఁడను బాధకుఁడను గాను. సుఖదుఃఖము లీశ్వరాధీనములు, యోగవియోగభోగరాగాదులు కాలవశములని యెంచి దేనియం దాశలేకయుండుట. సామాన్యసామాన్యాసంగమమనఁగా, సంచితకర్మములచేత లభ్యములైన సుఖదుఃఖములయందు ప్రియాప్రియములు లేక, వానినంటకముందు విచారించిన వేదాంత మహావాక్యార్థనిశ్చయమందుఁజేరుట. విశేషాసంగమ మనఁగా సత్సహవాసమువలనను, అపరోక్షజ్ఞానమువలనను, పురుషప్రయత్నమువలనను, జ్ఞానశాస్త్రములసంగతాభ్యాసమువలనను, పరమవస్తువు కరతలామలకమై కనఁబడుచుండఁగా, సంసారసాగరోత్తారకమై, పరతత్త్వస్థితిఁజెంది, సకలమునీశ్వరాధీనమనుటను, కర్మమే సుఖదుఃఖములకుఁ గారణమగుటను మాని మౌనియై పరమశాంతిగలిగియుండు విశేషవిశేషాసంగమ మనఁగా, బాహ్యాభ్యంతరములను ఊర్ధ్యాధఃప్రదేశములను దిక్కులను ఆకాశమును స్థావరజంగమజంతువులను చీకటి వెలుతురులను చిజ్జడములను సకలవస్తువులను అవస్థానుభవములను వేఱుగాఁ జూడక అఖండాకారముగఁ జూచుచు చిత్తవిశ్రాంతి గలిగి నిస్సంకల్పుఁడై ముందుదర్శించిన యాత్మయందు మనస్సు కరుగుట. ఈమూఁడు భూమికలలో దేనినైన నభ్యాసముచేయుతఱిని మృతులైనయోగులు దేవవిమానములయందు దేవతాస్త్రీలతో కూడి స్వర్గవైకుంఠకైలాసాది పుణ్యలోకములయందు సకలదివ్యభోగములు చిరకాల మనుభవించినవెనుక, శ్లో. "శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో హి జాయతే, అథవా యోగినా మేవ కులే భవతి ధీమతాం.” అను గీతావచనప్రకారముగ భూలోకంబున శ్రీమంతులయింటఁ బుట్టి పూర్వము తాను విడిచిన నెలవునఁ జేరి క్రమముగా నావల్ల భూమిక నెక్కును, మూఁడు భూమికలవఱకు జన్మము గలదు. తక్కిన భూమికలయందు జన్మము లేదు. సత్త్వాపత్తి యనఁగా, ఈ మూఁడుభూమికల నభ్యసించి యింద్రియార్థములయం దాశ<noinclude><references/></noinclude> rpkh13zfkqyzkqxuh55dnbtjr0czwf6 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/59 104 117892 551960 486946 2026-04-07T20:08:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 551960 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh|40 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>మాని శుద్ధాంతరంగుఁడయి యితర సంకల్పములు లేక బ్రహ్మనిష్ఠ గలిగి యుండుట. సంసక్తినామిక యనఁగాఈ నాల్గు భూమికలయభ్యాసమువలన విషయసంగమగుణత్రయసంగమంబులు లేక బ్రహ్మనిష్ఠయందు పట్టుదప్పక యుండుట, పదార్థభావన యనఁగా, ఈయైదుభూమికల యభ్యాసవిశేషముచేత అంతరబహిర్మధ్యదృశ్యములు లేక స్వాత్మారాముఁడయి బ్రహ్మము నేననుట. తుర్యగ యనఁగా; ఈయాఱుభూమికల మార్గముల నెఱిఁగి యేమిట భేదములేమిఁ దెలిసి పరబ్రహ్మమాత్రముగా నుండుట. దీనిలో మొదటి మూఁడుభూమికలు జగద్వ్యాపారము గలవి గనుక జాగ్రదవస్థయగును. నాల్గవభూమికయందు నామరూపములుగల జగత్తుస్వప్నమువలె తోఁచును గాన అది స్వప్నావస్థయగును. ఇట్టి యనుభవము గలవాడే బ్రహ్మవిదుఁడు. ఐదవభూమిక నిర్వికల్పమై సుషుప్తివలె సుఖముగా జగము తోఁచుటవలన అది సుషుప్త్యవస్థయగును. అట్టి యనుభవముగల యోగమే బ్రహ్మావిద్వరుఁడు. ఆఱవభూమిక సర్వవాసనాక్షయ మైనది గనుక గగనమున మునిఁగిన ఘటమువలె బాహ్యాభ్యంతరములులేనిదై సముద్రమున మునిఁగినకుండవలె లోపల వెలుపల, పరిపూర్ణమై జగము, పరమాత్మ ప్రకాశముగాఁ దోఁచుటవలన, అదియే తురీయావస్థ, ఇట్టి అనుభవము గలవాఁడే బ్రహ్మవిద్వరీయుఁడు. ఇదియే జీవన్ముక్తి, సప్తమభూమిక అవాఙ్మానసగోచరము, దానిని బ్రహ్మ విష్ణు రుద్ర జీవ శూన్య కాల ప్రధానాదినామములచే పెక్కండ్రు, పెక్కుగతులఁ బేర్కొందురు. అది నామరూపములు లేనిదైనను కల్పితనామరూపములచేఁ జెప్పఁబడును. ఇట్టి యనుభవముగల యోగియే బ్రహవిద్వరిష్ఠుఁడు; అదియే విదేహముక్తి. {{Telugu poem|type=వ.|lines=<poem>సమర్పితంబుగా నొనర్పం బూనిన శ్రీసీతారామాంజనేయసంవాదం బను వేదాంతగ్రంథమునకుఁ గథాప్రారంభం బెట్టి దనిన.</poem>|ref=39}} '''టీ'''. సమర్పితంబుగాన్ = సమర్పణము చేసి (కృతియిచ్చి), నాయొనర్పం బూనిన = నేను రచించుటకుఁ బూనుకొన్న, శ్రీసీతారామాంజనేయసంవాదం బను వేదాంతగ్రంథంబునకున్ = శోభాయుక్త మగుసీతారామాంజనేయసంవాద మనుపేరు గల యద్వైతగ్రంథమునకు, కథాప్రారంభంబు = కథయొక్క యారంభము (లేక క్రమము = గ్రంథమునందలి విషయములు విచారించుట), ఎట్టిది అనినన్ = ఏవిధమైన దనఁగా. '''తా'''. ఇట్లు గురుపరంపర నభివర్ణించి, పరశురామపంతుల రామయామాత్య పుత్త్రుడగు నేను (లింగమూర్తి గురుమూర్తి యనువాఁడను) నాగురువగుమహాదేవాచార్యునకుఁ గృతి యిచ్చి సీతారామాంజనేయసంవాద మనుపేరు గల యొకయద్వైతగ్రంథమును రచియింప నుపక్రమించితిని. దానియందలి విషయముల నీక్రిందఁ క్రమక్రమముగా వివరించెదను. {{nop}}<noinclude><references/></noinclude> 40d8hyoft9u3ekjjwf76kat2t2or2wz పుట:Cheppulu Kudutu Kudutu....pdf/11 104 118880 552033 373535 2026-04-08T08:37:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552033 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>కర్ణాటకకు చెందిన మాదిగలలో 'జంబు' అనే పూజారి జాతి ఉంది. వారికి లౌకికులతో వివాహసంబంధాలు లేవు. అందరూ ఇచ్చిన దానిమీదనే ఆధారవడి జీవిస్తారు. వారసత్వంగా వచ్చే పూజారిత్వంతో పెద్ద పూజారి తరచుగా పల్లెలు తిరుగుతాడు. తన అనుయాయూలకు బోధలు చేన్తుంటాడు. తెగ పెద్ద కాలక్రమంగా పూజారి పెద్ద అయాడని గ్రహించటం కష్టంకాదు. తెగ చెల్లాచెదురవుతూండగా దూరప్రాంతాలకు వలస పోయినవారి మీద పూజారుల వారసత్వం పట్టు కోల్పోయింది. జనాభా లెక్కలలో మాదిగల ఉపకులాలుగా చెప్పబడే జాంబవులు, జాంబవంతులు ఆది జాంబవుడికి దగ్గరి వారసులయుంటారు. “మాదిగల పితామహుడు” రామునికి యుద్ద విషయాలలో గౌరవనీయుడైన సలహాదారుడని పురాణగాథ చెపుతుంది. గొప్ప నంన్కృతిక ఇతిహసమైన రామాయణాన్ని ఆది జాంబవుడి చిహ్నాలకోసం తిరగేశాను. కవి ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుని గురించి చెపుతాడు. బహుశా ఆయన ఆదిమాదిగ అయిన ఆదిజాంబవుడయుండాలి. కవిత్వపు ముసుగులో ఇతర వీరులతో సమానం చేయటానికి జాంబవంతుడు గౌరవప్రదంగా చెప్పబడ్డాడు. అతని భావాలు సుదీర్ఘంగా వివరించబడ్డాయి. రామునికి యుద్ధంలో సహాయపడిన వీరులను చెప్పుటపుడు రామాయణ కవి వారిని దృశ్యమానం చేసేందుకు వారి రాజ చిహ్నాలతో వారిని నంభోదించాడు. వానరులు, ఎలుగుబంట్లుగా చెప్పబడినవారు బహుశా ఆ జంతువులను పూజించి ఉండేవారయుండాలి. ద్రవిడ రాజవంశాలకు వారి ధ్వజాలుగా జంతువులు ఉండటం వల్ల చేరులకు ఏనుగులు, పల్లవులకు పులులు, జాంబవంతుని తెగకు ఎలుగుబంటి ధ్వజం కావడం వల్ల చేరులకు ఏనుగులు, పల్లవులకు పులులు, జాంబవంతుని తెగకు ఎలుగుబంటి ధ్వజం కావటం వల్ల కవి ఆ విధంగా వారిని సంభోదించి ఉండవచ్చు. దండకారణ్యం బుందేల్‌ఖండ్‌కి దక్షిణంగా కృష్ణానది వరకూ విస్తరించి ఉండవచ్చు. ఈ రోజున మాదిగలు చెల్లాచెదరుగా వ్యాపించి ఉన్న ప్రాంతంలోనే ఆనాడు రాముడి సైన్యం పోగయింది. రామాయణం కథా నాయకుడు రాముడు ఓథ్‌కి చెందిన రాజకుమారుడు. ఆయన్ని వనవాసానికి పంపాక, తన సారధిని నగర నరిహద్దులలో వదిలేశాక దండకారణ్యంలో ప్రవేశించాడు. రాముని మీద భక్తిశ్రద్ధలు గల భార్య సీత, ఆర్య స్త్రీలలో అందగత్తె ఆయనని అనునరించింది. బర్త మీద అనురాగంతో అరణ్యవాసంలోని కష్టాలను భరించింది. ఈనాటి సిలోనును ఆనాడు పాలించే రాక్షసుల ప్రభువు రావణుడు వచ్చి ఆమెను తీనుకుపోయాడు. రాముడు పత్నీ వియోగంతో కృంగిపోయి ఆ ప్రాంతంలోని బలమైన తెగల నాయకులని కలిని నీతని రక్షించటంలో సహాయం కోరాడు. వానరుల పెద్ద అయిని సుగ్రీవుడు అందరిలోకి శక్తిమంతుడైన మిత్రుడు. కాని, ఇతరులు కూడా ఉన్నారు. వారిలో ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుడు సుప్రసిద్ధుడు. సీత రక్షణకోసం అందరితోనూ కూడిన గొప్ప సైన్యం బయలుదేరింది. వారు దక్షిణం వైపు సాగి సముద్రాన్ని చేరుకుని ఆగిపోయారు. రాముని మనోహరమైన భార్య సీతను రావణుడు చెరపట్టి ఉంచిన లంక అవతలి ఒడ్డున ఉంది. సముద్రం ఒడ్డున బలవంతులైన వానరులు నిలబడి ఈ అగాధాన్ని దాటాలని గ్రహించారు. వాళ్ళు కలవరపడ్డారు “వానర వీరులారా! మీమీ శక్తులను ప్రదర్శించండి. లంఘించండి!” అంటూ మహా సేనాధిపతి సుగ్రీవుడు అజ్ఞాపించాడు. అనేకమంది గట్టిగా చెప్పారు. కాని ఎవరూ ఆ ఘనకార్యాన్ని చేయటానికి ముందుకు రాలేదు. చివరకు జాంబవంతుడు అన్నాడు “ఒకప్పుడు నాకు లంఘించే శక్తి గొప్పగా ఉండేది. నేను వృద్దుడినయిపోయాను. నా శక్తులు ఉడిగిపోయాయి. నేనిప్పుడు లంఘించలేను.” మహాజ్ఞాని అయిన జాంబవంతుడు అన్నాడు. “కాని సేనాధిపతి ఆజ్ఞాపించినవుడు ఆయన గౌరవాన్ని కాపాడటం సేవకుల విధి.” జాంబవంతుని సలహా ఫలించింది. చిట్టచివరికి వానర శ్రేష్టుడైన హనుమంతుడు అతని ధైర్యమూ ప్రతిష్టా గుర్తుచేయగా సముద్రాన్ని లంఘించటానికి సిద్ధమయాడు. బలవంతుడైన రావణుని భవనం నుంచి ఎంతో శక్తియుక్తులతో పరాక్రమంతో సీత రక్షించబడింది. రాక్షస వీరులతో బాటు రావణుడు నేలకొరిగాడు. మాదిగలకు నంబంధించిన ఇతర గాథలన్నింటిలోనూ అవమానాలు, అణచివేతలూ ఉంటాయి. “ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుడు” ఆది జాంబవంతుడితో సహా ఉన్నత స్థానంలోనే ఉంటారు. వారిని ఎవరూ తక్కువ చేయరు. వారి ఆదిమకీర్తిలో వారికి సముచిత స్థానం ఎప్పుడూ ఉంటుంది. వారి వారసులు మాత్రం పూర్తిగా వెలివేయబడ్డారు!<noinclude><references/> {{rule}} {{rh|చెప్పులు కుడుతూ..కుడుతూ...తెలుగు మాదిగల గాథలు|10|}}</noinclude> 3erord5h7pqnmu9mxkrsnq096mcbex3 పుట:Cheppulu Kudutu Kudutu....pdf/8 104 160042 551924 551921 2026-04-07T11:59:12Z శ్రీరామమూర్తి 1517 551924 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సాయంజేస్తుంది". అనుకున్నారు శూద్రులు. ఇలా తెగల మధ్య ఉండే పోటీ స్వభావం క్రైస్తవానికి బలమైన జోడిగా పనిచేసింది. మాదిగలు నిస్సందేహంగా చాలా పురాతన జాతి. ద్రవిడుల కన్న ముందుగానే భారతదేశాన్ని నివాసం చేసుకొన్న కోలారియన్ తెగ సంతతివారు అయుండవచ్చు. దక్షిణభారతదేశంలో ఆదిమజాతులలో మాదిగలు ఒకరు. ద్రవిడ జాతులు దపదపాలుగా వచ్చికూడా ఉండవచ్చు. బహుశ మాదిగలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తొలి ద్రవిడ దండయాత్రీకులయి ఉండవచ్చు. ఈవాదానికి ఆధారంగా కొన్ని వాస్తవాలను చూపిస్తా. మాదిగల గాధలు, సంప్రదాయాలలో ద్రవిడ జాతుల కుటుంబం పోలికలు కనిపిస్తాయి. వారి వాడలలో అదేవిధమయిన స్వయం నిర్ణయాధికారాలున్న ప్రభుత్వం చిన్న రూపంలోనైనా కనిపిస్తుంది. ద్రవిడ గ్రామీణ సమూహాలలో ఈ స్వయంపరిపాలనాపద్దతి ముఖ్యమైన లక్షణం. వారు ద్రవిడ జాతులకు ముందువారని చెప్పే వాదానికి ఆధారంగా నాకు ఇంతకన్న బలమైన రుజువులు లభించలేదు. ద్రవిడులు జాతి మూలాలకు సంబంధించి మేధావులు ఒక అంగీకారానికి వచ్చి వుంటే మానవజాతి కుటుంబంలో మాదిగల స్థానాన్ని నిర్ణయించటంలో ముందుకు వెళ్ళగలిగేవారం. కాని మనకు అనేక విరుద్ధ వాదాలు ఎదురవుతున్నాయి. పుర్రె లక్షణాలను బట్టి బ్లూమెన్ బాచ్, హెకెల్ యిద్దరూ ద్రవిడులు కకేషియన్‌లు కారు, మంగోలియనులూ కారు. ఆ రెండు జాతుల మధ్యలోని వారు అని కనుగొన్నారు. హెకెల్‌వాదం ప్రకారం ద్రవిడులు దక్షిణంవైపునుంచి భారత్‌లోకి వచ్చారు. ప్రస్తుతం హిందుమహాసముద్రంలో మునిగిపోయిన మానవుని తొలి భూమిగా ఆయన భావించే లెమూరియా ఖండం నుంచి వచ్చారు. డాక్టర్ లోగస్ శరీరధర్మశాస్త్రం ప్రకారం ద్రావిడులలో ఇండో - ఆఫ్రికన్ మూలాలు కనుగొన్నారు. స్కితియన్స్ రాకముందే భారతదేశంలో ఓ నీగ్రో జాతి వ్యాపించి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ కాడ్‌వెల్ శాస్త్ర పరీక్షను ఉపయోగించారు. ఆయన ద్రవిడులు ఉత్తరం వేపు నించి వచ్చారని అంటాడు. ద్రవిడ భాషా చిహ్నాలు వారి మార్గాన్ని తెలుపుతాయని అంటారు. ఆర్యులకు ముందే స్కితియన్‌లు వచ్చారు. ద్రవిడభాషలకు స్కితియన్ భాషా సమూహాలకు దూరపు సంబంధం ఉంది. అందువల్ల ద్రవిడులు స్కితియన్ జాతివారని ఆయన వాదిస్తారు. ఏమైనా ద్రవిడుల జాతి మూలాలు పూర్తిగా నిర్ధారించబడలేదు. ఇండో ఆర్యులు శుద్ధంగా కాకేషియన్ జాతివారని పండితులు అంగీకరించారు. బహుశా క్రీ॥పూ॥3000 ప్రాంతంలో ఇండో జర్మన్ జాతిలో సంస్కృతం మాట్లాడే ఒక శాఖ ఉత్తరం నుండి భారతదేశంలో ప్రవేశించారు. ఉత్తర భారతంలో యుద్ధాలు, దండయాత్రలు వారిని ముందుకు నడిపాయి. పురాతన ఋషులు ఋగ్వేద శ్లోకాలలో వేదాలలోని యుద్ధదేవుడిని ఇలా ప్రార్ధిస్తారు - 'ఓ ఇంద్రా! నీ ఆయుధం మాటలేని దస్యులను ఛేదించుగాక! సరిగ్గా మాట్లాడలేని ప్రజలను యుద్ధంలో వధించుగాక.” ఆ తరువాత కాలంలో ఇండో ఆర్యులు దక్షిణంగా వెళ్ళడం మొదలయినపుడు వారి చేతుల్లో ఆయుధాలు లేవు. పెదాలపై ఇంద్రునికి ప్రార్ధనలు లేవు. వాళ్ళు శాంతి జిత్తులను ఉపయోగించారు. ఆర్య ఋషులు దక్షిణపు అరణ్యాలలో నివాసం ఏర్పరచుకున్నారు. ద్రవిడులకి శిక్షకులుగా, స్నేహితులుగా అయారు. పురాతన ద్రవిడుల గురించి తెలుసుకోటానికి ఈ ఆర్య ద్రవిడ సంబంధాలకు ముందు ఎలాంటి ఆధారాలు లేవు. ద్రవిడులకు గల అనేక వనరుల కారణంగా గర్విష్టులయిన ఆర్యులు వారిని నిర్లక్ష్యం చేయలేకపోవటమన్నది సందేహాతీతమైనది. అపారమైన సంపద ఉంది. భద్రమైన నగరాలలో నివశిస్తున్నారు. ఆయుధాలతో యుద్ధం చేస్తున్నారు. రాజులు పరిపాలిస్తున్నారు. అంతస్సంబంధాలు గల నాలుగు భాషలను ద్రవిడులు మాట్లాడేవారు. అవి తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం. ఆర్యుల ప్రభావం పడకముందు వారికి సాహిత్యం ఉందా అన్నది సందేహాస్పదం. శుద్ధమైన భావాలలో వారు వెనకబడి ఉండవచ్చుగాని, మిగిలిన అన్ని రకాల భావాలను వ్యక్తీకరించటానికి తగినన్ని సాధనాలు వారి భాషలకు ఉన్నాయి. వారు అనుభవంమీద ఆధారపడ్డ ప్రజలు. వలస వచ్చిన ఆర్యులు ద్రవిడ భాషలను నేర్చుకోవలసి వచ్చింది. స్థానిక భాషలలో సంస్కృతపదాలను ప్రవేశపెట్టడంతో తృప్తిపడవలసి వచ్చింది. ఈ రెండు జాతుల సామాజిక వ్యవస్థలలో చాలా అంతరం ఉంది. ఉత్తరాదికి చెందిన ఆర్యులు దక్షిణాది వలసలు ఆరంభించకముందే కుల వ్యవస్థ ఆర్యులలో పాదుకొంది. హెచ్చుతగ్గులకు సంబంధించి ద్రవిడులకు తెలిసిన భేధం ఒక్కటే. పాలకులు, ప్రజలు. ఈ భేదం అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉన్నదే. బలమై బ్రాహ్మణ వారసత్యం ఆర్యులదైతే ద్రవిడుల పూజారులు స్వతస్సిద్ధంగా తమ మంత్ర తంత్రాలతో అందరి మన్ననలనూ పొందినవారు. ఆర్యులు చనిపోయిన వారిని దహనం చేసేవారు. విధవలలో పునర్వివాహం నిషేధించారు. మాంసాహారాన్ని రక్తం చిందటాన్ని అసహ్యించుకునేవారు. అందుకు బదులుగా ద్రవిడులు చనిపోయినవారిని ఖననం చేసేవారు. విధవలు పునర్వివాహం చేసుకొనేవారు. అన్ని రకాల మాంసాలు తినేవారు. రక్తం చిందకుండా, మద్యం విరివిరిగా వాడకుండా వారి పండగలు జరిగేవికావు. ఈ రెండు జాతులూ కలుసుకున్న కొత్తలో వారి ధార్మిక విధానాలలో శతృత్వం ఉండి ఉండవచ్చు. కొత్తగా నివాసాలు ఏర్పరచుకొన్న బ్రాహ్మణీయులు అతిశయోక్తులు నిండిన ప్రాచీనభాషలో ఈనేక నిందలు వేశారు. "ఆస్తికులు సర్వసంగ పరిత్యాగులు అయిన ఋషుల చెవులలో భయంకరమైన శబ్దాలు చేసిన అవిశ్వాసులైన ప్రాణులు అన్నారు. ఆశ్రమ ప్రాంతాలలోని<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ కుడుతూ తెలుగు మాదిగల గాథలు|7|}}</noinclude> gxu3uys9ghcsjjjq8lgm9oyscqb3602 552006 551924 2026-04-08T05:53:56Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 552006 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>సాయంజేస్తుంది". అనుకున్నారు శూద్రులు. ఇలా తెగల మధ్య ఉండే పోటీ స్వభావం క్రైస్తవానికి బలమైన జోడిగా పనిచేసింది. మాదిగలు నిస్సందేహంగా చాలా పురాతన జాతి. ద్రవిడుల కన్న ముందుగానే భారతదేశాన్ని నివాసం చేసుకొన్న కోలారియన్ తెగ సంతతివారు అయుండవచ్చు. దక్షిణభారతదేశంలో ఆదిమజాతులలో మాదిగలు ఒకరు. ద్రవిడ జాతులు దపదపాలుగా వచ్చికూడా ఉండవచ్చు. బహుశ మాదిగలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తొలి ద్రవిడ దండయాత్రీకులయి ఉండవచ్చు. ఈవాదానికి ఆధారంగా కొన్ని వాస్తవాలను చూపిస్తా. మాదిగల గాధలు, సంప్రదాయాలలో ద్రవిడ జాతుల కుటుంబం పోలికలు కనిపిస్తాయి. వారి వాడలలో అదేవిధమయిన స్వయం నిర్ణయాధికారాలున్న ప్రభుత్వం చిన్న రూపంలోనైనా కనిపిస్తుంది. ద్రవిడ గ్రామీణ సమూహాలలో ఈ స్వయంపరిపాలనాపద్దతి ముఖ్యమైన లక్షణం. వారు ద్రవిడ జాతులకు ముందువారని చెప్పే వాదానికి ఆధారంగా నాకు ఇంతకన్న బలమైన రుజువులు లభించలేదు. ద్రవిడులు జాతి మూలాలకు సంబంధించి మేధావులు ఒక అంగీకారానికి వచ్చి వుంటే మానవజాతి కుటుంబంలో మాదిగల స్థానాన్ని నిర్ణయించటంలో ముందుకు వెళ్ళగలిగేవారం. కాని మనకు అనేక విరుద్ధ వాదాలు ఎదురవుతున్నాయి. పుర్రె లక్షణాలను బట్టి బ్లూమెన్ బాచ్, హెకెల్ యిద్దరూ ద్రవిడులు కకేషియన్‌లు కారు, మంగోలియనులూ కారు. ఆ రెండు జాతుల మధ్యలోని వారు అని కనుగొన్నారు. హెకెల్‌వాదం ప్రకారం ద్రవిడులు దక్షిణంవైపునుంచి భారత్‌లోకి వచ్చారు. ప్రస్తుతం హిందుమహాసముద్రంలో మునిగిపోయిన మానవుని తొలి భూమిగా ఆయన భావించే లెమూరియా ఖండం నుంచి వచ్చారు. డాక్టర్ లోగస్ శరీరధర్మశాస్త్రం ప్రకారం ద్రావిడులలో ఇండో-ఆఫ్రికన్ మూలాలు కనుగొన్నారు. స్కితియన్స్ రాకముందే భారతదేశంలో ఓ నీగ్రో జాతి వ్యాపించి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. డాక్టర్ కాడ్‌వెల్ శాస్త్ర పరీక్షను ఉపయోగించారు. ఆయన ద్రవిడులు ఉత్తరం వేపు నించి వచ్చారని అంటాడు. ద్రవిడ భాషా చిహ్నాలు వారి మార్గాన్ని తెలుపుతాయని అంటారు. ఆర్యులకు ముందే స్కితియన్‌లు వచ్చారు. ద్రవిడభాషలకు స్కితియన్ భాషా సమూహాలకు దూరపు సంబంధం ఉంది. అందువల్ల ద్రవిడులు స్కితియన్ జాతివారని ఆయన వాదిస్తారు. ఏమైనా ద్రవిడుల జాతి మూలాలు పూర్తిగా నిర్ధారించబడలేదు. ఇండో ఆర్యులు శుద్ధంగా కాకేషియన్ జాతివారని పండితులు అంగీకరించారు. బహుశా క్రీ॥పూ॥3000 ప్రాంతంలో ఇండో జర్మన్ జాతిలో సంస్కృతం మాట్లాడే ఒక శాఖ ఉత్తరం నుండి భారతదేశంలో ప్రవేశించారు. ఉత్తర భారతంలో యుద్ధాలు, దండయాత్రలు వారిని ముందుకు నడిపాయి. పురాతన ఋషులు ఋగ్వేద శ్లోకాలలో వేదాలలోని యుద్ధదేవుడిని ఇలా ప్రార్ధిస్తారు-'ఓ ఇంద్రా! నీ ఆయుధం మాటలేని దస్యులను ఛేదించుగాక! సరిగ్గా మాట్లాడలేని ప్రజలను యుద్ధంలో వధించుగాక.” ఆ తరువాత కాలంలో ఇండో ఆర్యులు దక్షిణంగా వెళ్ళడం మొదలయినపుడు వారి చేతుల్లో ఆయుధాలు లేవు. పెదాలపై ఇంద్రునికి ప్రార్ధనలు లేవు. వాళ్ళు శాంతి జిత్తులను ఉపయోగించారు. ఆర్య ఋషులు దక్షిణపు అరణ్యాలలో నివాసం ఏర్పరచుకున్నారు. ద్రవిడులకి శిక్షకులుగా, స్నేహితులుగా అయారు. పురాతన ద్రవిడుల గురించి తెలుసుకోటానికి ఈ ఆర్య ద్రవిడ సంబంధాలకు ముందు ఎలాంటి ఆధారాలు లేవు. ద్రవిడులకు గల అనేక వనరుల కారణంగా గర్విష్టులయిన ఆర్యులు వారిని నిర్లక్ష్యం చేయలేకపోవటమన్నది సందేహాతీతమైనది. అపారమైన సంపద ఉంది. భద్రమైన నగరాలలో నివశిస్తున్నారు. ఆయుధాలతో యుద్ధం చేస్తున్నారు. రాజులు పరిపాలిస్తున్నారు. అంతస్సంబంధాలు గల నాలుగు భాషలను ద్రవిడులు మాట్లాడేవారు. అవి తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం. ఆర్యుల ప్రభావం పడకముందు వారికి సాహిత్యం ఉందా అన్నది సందేహాస్పదం. శుద్ధమైన భావాలలో వారు వెనకబడి ఉండవచ్చుగాని, మిగిలిన అన్ని రకాల భావాలను వ్యక్తీకరించటానికి తగినన్ని సాధనాలు వారి భాషలకు ఉన్నాయి. వారు అనుభవంమీద ఆధారపడ్డ ప్రజలు. వలస వచ్చిన ఆర్యులు ద్రవిడ భాషలను నేర్చుకోవలసి వచ్చింది. స్థానిక భాషలలో సంస్కృతపదాలను ప్రవేశపెట్టడంతో తృప్తిపడవలసి వచ్చింది. ఈ రెండు జాతుల సామాజిక వ్యవస్థలలో చాలా అంతరం ఉంది. ఉత్తరాదికి చెందిన ఆర్యులు దక్షిణాది వలసలు ఆరంభించకముందే కుల వ్యవస్థ ఆర్యులలో పాదుకొంది. హెచ్చుతగ్గులకు సంబంధించి ద్రవిడులకు తెలిసిన భేధం ఒక్కటే. పాలకులు, ప్రజలు. ఈ భేదం అన్ని ఆదిమ సమాజాలలోనూ ఉన్నదే. బలమై బ్రాహ్మణ వారసత్యం ఆర్యులదైతే ద్రవిడుల పూజారులు స్వతస్సిద్ధంగా తమ మంత్ర తంత్రాలతో అందరి మన్ననలనూ పొందినవారు. ఆర్యులు చనిపోయిన వారిని దహనం చేసేవారు. విధవలలో పునర్వివాహం నిషేధించారు. మాంసాహారాన్ని రక్తం చిందటాన్ని అసహ్యించుకునేవారు. అందుకు బదులుగా ద్రవిడులు చనిపోయినవారిని ఖననం చేసేవారు. విధవలు పునర్వివాహం చేసుకొనేవారు. అన్ని రకాల మాంసాలు తినేవారు. రక్తం చిందకుండా, మద్యం విరివిరిగా వాడకుండా వారి పండగలు జరిగేవికావు. ఈ రెండు జాతులూ కలుసుకున్న కొత్తలో వారి ధార్మిక విధానాలలో శతృత్వం ఉండి ఉండవచ్చు. కొత్తగా నివాసాలు ఏర్పరచుకొన్న బ్రాహ్మణీయులు అతిశయోక్తులు నిండిన ప్రాచీనభాషలో ఈనేక నిందలు వేశారు. "ఆస్తికులు సర్వసంగ పరిత్యాగులు అయిన ఋషుల చెవులలో భయంకరమైన శబ్దాలు చేసిన అవిశ్వాసులైన ప్రాణులు అన్నారు. ఆశ్రమ ప్రాంతాలలోని<noinclude><references/> {{rule}} {{rh|చెప్పులు కుడుతూ...కుడుతూ...తెలుగు మాదిగల గాథలు|7|}}</noinclude> o108y7ka4y77eqq9752ah2i1ifl8nte పుట:Cheppulu Kudutu Kudutu....pdf/9 104 160043 552008 551923 2026-04-08T05:55:29Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 552008 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>దట్టమైన అడవులలో దాక్కుని ఈ భయానకమైన ప్రాణులు భక్తులను భయపెట్టడంలో ఆనందించేవారు యజ్ఞాలు చేసేటప్పుడు వచ్చేవారు, భాండాలని, పుష్పాలని, సమిధలని ఎత్తుకుపోయేవారు. యజ్ఞ సామాగ్రిని మైలపరిచేవారు. రక్తంతో ఆహారాలను ప్రసాదాలను కలుషితం చేసేవారు- అన్నారు. తెగలు, జాతుల కలయిక, సంప్రదాయాలు మత పద్దతుల సమ్మిశ్రణంతో కూడిన ఆధునిక హిందూత్వానికి అది శైశవదశ. అప్పుడు మాదిగలు వారి వంతు వారు అనుభవించారు. వారి మాతంగి సంప్రదాయంతో వారు బాగా వెనుకబడిపోయారు. వృత్తి ద్వారా చర్మకారులైన మాదిగలు అస్పృశ్య (పరియా) తెగలలో చిట్టచివరివారయిపోయారు. అయినప్పటికీ ఈనాటి వారి ధార్మిక సామాజిక ఆచార వ్యవహారాలలో వేలాది సంవత్సరాల భారతదేశపు వేళ్ళు కనిపిస్తాయి. కనక క్రైస్తవానికీ, ఈ ప్రాచీన తెగకీ తొలికలయిక చాలా ప్రత్యేకమైనది.<noinclude><references/> {{rule}} {{rh|చెప్పులు కుడుతూ...కుడుతూ...తెలుగు మాదిగల గాథలు|8|}}</noinclude> 89nhsfy2ez9fr7sgh39aa91rrlhgi4j పుట:Cheppulu Kudutu Kudutu....pdf/10 104 160044 551930 467865 2026-04-07T14:00:32Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 551930 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}'''2. తెగ నాయకుని ఆచారాలు'''</p> {{Largeinitial|ఆ}}దిజాంబవుడిని తమ మూలపురుషునిగా మాదిగలు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన 'మాదిగల పితామహుడు' ప్రపంచం ఆరంభానికి ఆరునెలల ముందే వెలసినవాడు. ఆర్యుల దండయాత్రలతో భారతదేశంలో 'ప్రపంచం మొదలయింది. అప్పుడున్న ఆదివాసులలో ఈ మానవుడు 'అది మాదిగ' ఒకరు. అప్పటికి ఆది జాంబవుడు చాలా గొప్పవాడు. ఏది ఏమైనప్పటికీ యుద్ధం చేయాలనుకున్నప్పుడు శ్రీరాముడు మొట్టమొదటిసారి అతని దగ్గరికి వెళ్ళి పెద్దవానిగా సలహా అడిగి ఆతర్వాత అతను చెప్పింది చేశాడు. ఆర్యులు మొట్టమొదటిసారి ఈ భూమి పుత్రులతో సంబంధం పెట్టుకున్నారు. ఆనాటికి ఆయన ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, ఆదిజాంబవుడికి ఆతర్వాత అవమానాల దశ ఆరంభమైంది. ఆయన ఉన్నత స్థానం నుండి పడిపోయాడు. ఆ రోజులలో కామధేనువు అనే సమస్త సంపదలు యిచ్చే ఆవు ఉండేది. వెల్లమను అనే బాలుడు ఈ గోవును మేపుతుండేవాడు. ఆవు పాలు యిచ్చేది. ఈ నేలమీద ఆదివాసీలు పూజించే శక్తిస్వరూపమైన ఆదిశక్తి స్వయంగా దేవతలకి కామధేనువు పాలు తాగటానికి అనుమతించింది. వెల్లమనుకి ఆ పాలని రుచిచూడాలని కోరిక పుట్టింది. కాని దేవుళ్ళు " ఏవిధంగానూ నువ్వు అందులో వాటా అడగటానికి వీల్లేదు” అన్నారు. అతనికి కోరిక తగ్గలేదు. ఒక రోజు జబ్బు చేసినట్టుగా పడుకున్నాడు. దేవతలు పాలు తాగి వదలిన పాత్రను దొంగతనంగా తీసుకుని అందులో నీళ్ళు పోసి దాన్ని తాగాడు. 'పాలే ఇంత రుచిగా ఉంటే మాంసం యింకెంత రుచిగా ఉంటుందో” అనుకున్నాడు. కామధేనువుకి అతని చెడ్డ ఆలోచనలు తెలిసిపోయాయి. తన మాంసం తినాలన్న ఆలోచన ఎవరికైనా కలిగేసరికే కామధేనువు తన శక్తులన్నీ కోల్పోయి మరణించింది. దేవుళ్ళు జరిగిందంతా విన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి కామధేనువు చనిపోవటం చూశారు. వాళ్ళు ఆదిజాంబవుడి దగ్గరకు వెళ్ళారు. "నువ్వు మనందరిలోనూ గొప్పవాడివి. కనక నువ్వు దీన్ని నాలుగు భాగాలు చెయ్యాలి అన్నారు. ఆయన ఆ విధంగా చేశాడు. తనకొక భాగం ఉంచుకుని బ్రహ్మ, విష్ణువు, శివుడికి తలో భాగం యిచ్చాడు. వాళ్ళు తమ భాగాలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతలో వాళ్ళు తిరిగి వచ్చి “మాకు ఆవు తిరిగి కావాలి అన్నారు. వాళ్ళు మూడు భాగాలు తెచ్చి, ఆది జాంబవుడి భాగాన్ని అడిగారు. ఈలోగా ఆ బాలుడు, వెల్లమను, ఒక ముక్కను తీసి ఉడకబెడుతున్నాడు. అది కుండలో ఉడుకుతుండగా, ఆ మాంసంలోని ఒక చిన్న ముక్క పైకి లేచి నిప్పులో పడింది. అతను దాన్ని ఎత్తి, ఊదుతూండగా అతని నోటి తడి మాంసానికి తగిలింది. దాన్ని తిరిగి కుండలో వేశాడు. ఆదిజాంబవుడు తన భాగాన్ని తీసుకుని తతిమా మూడు భాగాలలో కలిపి ఒక కొత్త ఆవును సృష్టించటం మొదలుపెట్టాడు. కాని పాపం! ఉడికి, ఊదబడిన ముక్కను దాని స్థానంలో పెట్టలేకపోయాడు. కామధేనువు అంతకు పూర్వంలా లేదు. దాని మెడ దగ్గర అంతకు ముందున్న మాంసం పోవడంతో చర్మం వేళ్ళాడుతోంది. అన్ని విధాల అది తగ్గిపోయింది. ఎంతో గొప్పగా రెండు తలలతో ఉండే కామధేనువు ఈనాటి ఆవు పరిమాణానికి దిగజారిపోయింది. 'ఆదిజాంబవుడు తన ఉన్నత స్థానం నుంచి కిందకి వచ్చి మన కింద ఉండాలి' అన్నారు దేవుళ్ళు. ఆ విధంగా అతని అవమాన దశ ఆరంభమైంది. తనకోసం ఆదిజాంబవుడు ఒక బావిని తవ్వుకుంటే వెల్లమాను మరొబావిని తవ్వుకొన్నాడు. వారమధ్య కులభేదం పుట్టింది. మాదిగల పితామహుని గాథ అది. అయితే ఎవరి ప్రమేయం వల్ల ఇంత తీవ్రమైన మార్పు వచ్చిందో ఆ బాలుడు వెల్లమను ఎవరు? అస్పృశ్యులలో వల్లువలు అనే పూజారి కులం ఉంది. బ్రాహ్మణ ఋషులకు మాత్రమే తెలిసిన పూజా శాస్త్రాలను పోలిన విద్యను ఈనాటికీ వారు ఎంతో శ్రద్ధగా రక్షించుకున్నారు. సంస్కృతశాస్త్రాల చిహ్నాలు అందులో కనబడుతుంటాయి. ఆదివాసీ తెగలతో ఆర్యులు స్నేహపూర్వకంగా ఉండి వారి ఆశ్రమాలలో విద్యాభోదన చేస్తున్న రోజులకు అవి తార్కాణాలు. కుల భావాలు విభేధాలు ఏర్పడుతున్నప్పుడు కొత్త పాతల మధ్య 'వల్లువలు' ఒక గొలుసులా ఉండి ఉంటారు. ఆ బాలుడు వెల్లమాను దేవుళ్ళకి పాలు సమర్పించాలి. దేవుళ్ళను అభిమానించి, ఆ పాలు తాగేందుకు ఆదిశక్తి అనుమతించింది. అంటే ఆర్యులు ఆదివాసుల భావన స్వంతం చేసుకొని, వారి ఆచారవ్యవహారాలలో కలిపేసుకొనిపోతున్నప్పుడు ఆ అనుమతి లభించింది. కాని ఆ బాలుడు వెల్లమాను దేవుళ్ళ పానీయంలో వాటా తీసుకోవటంతోటే అయోగ్యుడు అయిపోయాడు. మాంసం మీద కోరిక అతని మనసులో నిండిపోయింది. ఇది ఆర్యులకీ, ద్రవిడులకీ మధ్య ఉన్న తీవ్రమైన వివాదం. ఎందుకంటే ద్రవిడులు మాంసం తింటారు. అది వారి మధ్య తొలి స్నేహ సంబంధాలను అల్లకల్లోలం చేసింది. ఈ మార్పుకి కారణం సామాజికంగా వారి మధ్య పొసగకపోవటం. ఆది జాంబవుడి గుర్తులకోసం అనేక గ్రంధాలను వెదికాను. నాకు అనేకం లభించాయి. పురాణ కాలం నుంచి ఆయన వారసులు మన రోజుల వరకూ ఆయన్ను తీసుకువచ్చారు.<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ కుడుతూ తెలుగు మాదిగల గాథలు|9|}}</noinclude> m7dxjavttvox86cvcn3m1bdh8f70ozq సూచిక:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf 106 161308 551989 463312 2026-04-08T05:36:03Z Rajasekhar1961 50 551989 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[ధమ్మపదము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:కిళాంబి రంగాచార్యులు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా=చెన్నై |సంవత్సరం=1927 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 4ps8v9hnw8pjeohr00z5dtdjcmq1p11 పుట:Cheppulu Kudutu Kudutu....pdf/12 104 163350 552018 467889 2026-04-08T06:19:38Z Rajasekhar1961 50 552018 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Saiphani02" /></noinclude>{{p|fs200|ac}}'''3. మాతంగుల రాజు'''</p> {{Largeinitial|మా}}దిగలు ఒకప్పుడు ఒక తెగ అయుంటే, వారిని పాలిస్తున్న తెగనాయకుడు కావ్యాలలోనూ, ఇతిహాసాలలోనూ ప్రముఖుడైనప్పుడు చారిత్రక శాసనాలలో ఎక్కడో ఒకచోట ఏదోవిధంగా ప్రస్తావించబడాలి. కాని చారిత్రాత్మకంగా నిస్సందేహమనిపించే ఆధారం ఏదీ ఎక్కడా లభించలేదు. ఏమైనా ఇదేమంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఆర్యులు వచ్చి ఆశ్రమాలు ఏర్పరుచుకొని ద్రవిడుల భాషలను కేవలం గ్రంధాలకే కుదించే నాటికి ద్రవిడులలో సాహిత్యం లేదు. జ్ఞానులైన రుషులు కాలపట్టికలు రాయడంలో ఆసక్తి కనబరచి ఉంటే, వారు నివాసాలు ఏర్పరచుకుంటున్న ప్రాంతంలోని తెగలతో ఎలా వ్యవహరించినదీ గ్రంధస్తం చేసివుంటే ప్రాచీన భారతదేశ చరిత్ర ఇన్ని ఊహలకు కల్పనలకు నెలవు అయివుండేదికాదు. మత విషయాలమీద, అభౌతిక విషయాలమీద, స్మృతులమీద, రెండు గొప్ప సంస్కృత ఇతిహాసాల మీద ఆర్యుల జ్ఞానం విద్య వెచ్చింపబడ్డాయి. చారిత్రక సమాచారం చాలావరకు వీటినుంచే సేకరించాలి. నిష్పాక్షికంగా కొన్ని సంఘటనలను పరిశీలించటానికి, అవి జరిగాయని నిశ్చయించటానికి కవిత్వపు అతిశయోక్తులతోనూ మత అవసరాలకోసమూ రాసిన ఈ గ్రంధాలు సరిపోవని మనం గుర్తించుకోవాలి. అయినా భారతదేశపు పురాతన వాసులు వారి తరువాత తరాలవారు తమని గుర్తుంచుకోవాలి అనే మానవ సహజమైన ఆకాంక్షకు అతీతులు కారు. వారు చేసిన కార్యాలను తమ వారసులకు అందించటానికి చాలా శాశ్వతమనుకున్న ఒక పద్దతి అనుసరించారు. శిలాఫలకాలమీద, తామ్రఫలకాలమీద జ్ఞాపకార్థంగా నిలబెట్టిన రాళ్ళమీదా, విగ్రహాల పీఠాల మీదా, దేవాలయాల గోడల మీదా స్తంభాలమీదా వాళ్ళు తమ పేర్లను, విజయాలను, శతృవుల పరాజయాలను చెక్కారు. రాజవంశాల చరిత్ర, చరిత్రలోని నగ్నసత్యాలు తెలుసుకోదలిచిన విద్యార్థికి యివి చాలావరకు విశ్వసనీయమైన ఆధారాలు. ఇతర తెగలతో బాటు ఒక తెగగా మాదిగలను గుర్తించాలంటే ఏదైనా శాసనాల మీద ఒక ఆధారం లభించితే ఊహాపోహలతో నిండిన చరిత్ర నుండి బయటపడి కొంతవరకూ గట్టి పునాది లభించి ఉండేది. ఈ రకమైన ఆధారం ఒకటి నాకు లభించిందనకుంటున్నాను. అది క్రీ॥శ॥ 634వ సంవత్సరం నాటిది. చాళుక్య వంశానికి చెందిన మంగలీసుడు అనే రాజు తొలి ద్రవిడ రాజవంశాలకు చెందిన కచ్చరులను జయించినప్పటిది. కర్ణాటకలో అయిహాలవద్ద దేవాలయం బయట గోడమీద శిలాఫలకం మీద చెక్కబడిన శాసనంలో ఈ వాక్యాలు ఉన్నాయి. "అతని తమ్ముడు మంగలీసుని గుర్రాలు తూర్పు పడమర సముద్రాలు కట్టలమీద దడికట్టాయి. అతడి సైన్యాలు రేపిన ధూళితో భూమ్యాకాశాలూ సమస్త దిక్కులూ నిండిపోయాయి. అటువంటి మంగలీసుడు రాజు అయాడు. మాతంగ జాతి అనే అంధకారాన్ని తళతళలాడే కత్తులు అనే దివిటీలతో చెల్లాచెదురు చేశాడు. యుద్ధరంగమనే పెళ్ళిపందిరిలో కచ్చురుల అదృష్టదేవత అయిన అందాల భామను భార్యగా చేసుకున్నాడు.” మాదిగల పూర్వీకుల ప్రస్తావన ఆ వాక్యంలో ఉంది అనాలంటే మాతంగ అన్న పదానికి వివరణ మీద ఆధారపడాలి. ఈ పదానికి అనేక అర్ధాలున్నాయి. ఇది "తక్కువ కులానికి చెందిన ఒక తెగ"గా కనిపిస్తుంది. మాదిగ అన్న పదం ప్రాచీనమైన మాతంగ అన్న పదం నుంచి వచ్చినదేనని పండితులు అంగీకరిస్తారు. అంతేగాక, మాదిగలలో ఒక పెద్ద ఉపకులము మాతంగి అని పిలవబడుతోంది. కర్ణాటకకు చెందిన మాదిగలు తమని తాము 'మాతంగి మక్కళు' అంటారు. అంటే అర్థం 'మాతంగి బిడ్డలు'. అయితే ఈ పదం "ఒక ఏనుగు"ని కూడా సూచిస్తుంది. పద్దెనిమిదేళ్ళ క్రితం ఈ శాసనాన్ని కనుగొని వివరించిన ప్లీట్ దాన్ని "అంతగా బలంలేని ఒక ఆదివాసీ కుటుంబం" అని అర్ధం చెప్పాడు. ఆ తర్వాత కొన్ని ఏళ్ళు గడిచాక తన కృషిని తిరిగి వివరిస్తూ ఆయన అన్నాడు. ఈ శ్లోకాన్ని తిరిగి పరిశీలిస్తే 'మాతంగ' అన్న పదం సందర్భాన్నిబట్టి తీసుకుంటే "కచ్ఛవుల ఏనుగులు" అని చెప్పటానికి వాడబడిందని నేను అనుకుంటున్నాను.” ఆ విధంగా ఆ శాసనంలో మాదిగల ప్రస్తావన ఉందని ఊహించటం సందేహాస్పదంగా మారిపోయింది. సంప్రదాయాల వేపు పురాణగాథల వేపు మరలక చేయగలిగిందేమీలేదు. అవి సామాజిక రాజకీయమార్పులను అర్ధం చేసుకోటానికి కొన్ని ఆధారాలు యిస్తాయి. భారతదేశంలో జ్ఞాపకాలను భద్రపరిచే అసాధారణమైన శిక్షణ ఉంది. తమ తండ్రుల నుంచి విన్నవాటిని తమ బిడ్డలకు అందజేస్తారు. మరెక్కడా లేనంతగా పురాణ గాథలు విశ్వసనీయంగా ఉంటాయి. వృత్తి గాయకులు కూడా ప్రజల మధ్యకు వెళ్ళి గడచిన రోజుల్లో జరిగిన వాటిని కవితామయంగా పాడి వినోదపరుస్తారు. ఆ విధంగా గతం పూర్తిగా మరుగున పడిపోకుండా వర్తమానానికి చేరింది. సంస్కృత గాథలలో మాతంగరాజుకి సంబంధించి కొన్ని గొప్ప కావ్య ప్రసక్తులు కనిపిస్తాయి. అవి ఆదివాసుల పట్ల ఆర్యుల వైఖరికి కొన్ని సూచనలు ఇస్తాయి. ఆ వర్ణనలు ప్రాగ్భాషలో అతిశయోక్తులు నిండి ఉన్నప్పటికీ ఒక అనాగరిక ఆదివాసీ తెగ విశిష్టలక్షణాలు వివరిస్తాయి. క్రీ॥శ॥ 606 ప్రాంతాలలో జీవించిన బాణభట్టుడు<noinclude><references/> చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు 11</noinclude> nqyj8e1fkhnisyohquegzrcwcwn3fuf 552032 552018 2026-04-08T08:15:33Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 552032 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs200|ac}}'''3. మాతంగుల రాజు'''</p> {{Largeinitial|మా}}దిగలు ఒకప్పుడు ఒక తెగ అయుంటే, వారిని పాలిస్తున్న తెగనాయకుడు కావ్యాలలోనూ, ఇతిహాసాలలోనూ ప్రముఖుడైనప్పుడు చారిత్రక శాసనాలలో ఎక్కడో ఒకచోట ఏదోవిధంగా ప్రస్తావించబడాలి. కాని చారిత్రాత్మకంగా నిస్సందేహమనిపించే ఆధారం ఏదీ ఎక్కడా లభించలేదు. ఏమైనా ఇదేమంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఆర్యులు వచ్చి ఆశ్రమాలు ఏర్పరుచుకొని ద్రవిడుల భాషలను కేవలం గ్రంధాలకే కుదించే నాటికి ద్రవిడులలో సాహిత్యం లేదు. జ్ఞానులైన రుషులు కాలపట్టికలు రాయడంలో ఆసక్తి కనబరచి ఉంటే, వారు నివాసాలు ఏర్పరచుకుంటున్న ప్రాంతంలోని తెగలతో ఎలా వ్యవహరించినదీ గ్రంధస్తం చేసివుంటే ప్రాచీన భారతదేశ చరిత్ర ఇన్ని ఊహలకు కల్పనలకు నెలవు అయివుండేదికాదు. మత విషయాలమీద, అభౌతిక విషయాలమీద, స్మృతులమీద, రెండు గొప్ప సంస్కృత ఇతిహాసాల మీద ఆర్యుల జ్ఞానం విద్య వెచ్చింపబడ్డాయి. చారిత్రక సమాచారం చాలావరకు వీటినుంచే సేకరించాలి. నిష్పాక్షికంగా కొన్ని సంఘటనలను పరిశీలించటానికి, అవి జరిగాయని నిశ్చయించటానికి కవిత్వపు అతిశయోక్తులతోనూ మత అవసరాలకోసమూ రాసిన ఈ గ్రంధాలు సరిపోవని మనం గుర్తించుకోవాలి. అయినా భారతదేశపు పురాతన వాసులు వారి తరువాత తరాలవారు తమని గుర్తుంచుకోవాలి అనే మానవ సహజమైన ఆకాంక్షకు అతీతులు కారు. వారు చేసిన కార్యాలను తమ వారసులకు అందించటానికి చాలా శాశ్వతమనుకున్న ఒక పద్దతి అనుసరించారు. శిలాఫలకాలమీద, తామ్రఫలకాలమీద జ్ఞాపకార్థంగా నిలబెట్టిన రాళ్ళమీదా, విగ్రహాల పీఠాల మీదా, దేవాలయాల గోడల మీదా స్తంభాలమీదా వాళ్ళు తమ పేర్లను, విజయాలను, శతృవుల పరాజయాలను చెక్కారు. రాజవంశాల చరిత్ర, చరిత్రలోని నగ్నసత్యాలు తెలుసుకోదలిచిన విద్యార్థికి యివి చాలావరకు విశ్వసనీయమైన ఆధారాలు. ఇతర తెగలతో బాటు ఒక తెగగా మాదిగలను గుర్తించాలంటే ఏదైనా శాసనాల మీద ఒక ఆధారం లభించితే ఊహాపోహలతో నిండిన చరిత్ర నుండి బయటపడి కొంతవరకూ గట్టి పునాది లభించి ఉండేది. ఈ రకమైన ఆధారం ఒకటి నాకు లభించిందనకుంటున్నాను. అది క్రీ॥శ॥ 634వ సంవత్సరం నాటిది. చాళుక్య వంశానికి చెందిన మంగలీసుడు అనే రాజు తొలి ద్రవిడ రాజవంశాలకు చెందిన కచ్చరులను జయించినప్పటిది. కర్ణాటకలో అయిహాలవద్ద దేవాలయం బయట గోడమీద శిలాఫలకం మీద చెక్కబడిన శాసనంలో ఈ వాక్యాలు ఉన్నాయి. "అతని తమ్ముడు మంగలీసుని గుర్రాలు తూర్పు పడమర సముద్రాలు కట్టలమీద దడికట్టాయి. అతడి సైన్యాలు రేపిన ధూళితో భూమ్యాకాశాలూ సమస్త దిక్కులూ నిండిపోయాయి. అటువంటి మంగలీసుడు రాజు అయాడు. మాతంగ జాతి అనే అంధకారాన్ని తళతళలాడే కత్తులు అనే దివిటీలతో చెల్లాచెదురు చేశాడు. యుద్ధరంగమనే పెళ్ళిపందిరిలో కచ్చురుల అదృష్టదేవత అయిన అందాల భామను భార్యగా చేసుకున్నాడు.” మాదిగల పూర్వీకుల ప్రస్తావన ఆ వాక్యంలో ఉంది అనాలంటే మాతంగ అన్న పదానికి వివరణ మీద ఆధారపడాలి. ఈ పదానికి అనేక అర్ధాలున్నాయి. ఇది "తక్కువ కులానికి చెందిన ఒక తెగ"గా కనిపిస్తుంది. మాదిగ అన్న పదం ప్రాచీనమైన మాతంగ అన్న పదం నుంచి వచ్చినదేనని పండితులు అంగీకరిస్తారు. అంతేగాక, మాదిగలలో ఒక పెద్ద ఉపకులము మాతంగి అని పిలవబడుతోంది. కర్ణాటకకు చెందిన మాదిగలు తమని తాము 'మాతంగి మక్కళు' అంటారు. అంటే అర్థం 'మాతంగి బిడ్డలు'. అయితే ఈ పదం "ఒక ఏనుగు"ని కూడా సూచిస్తుంది. పద్దెనిమిదేళ్ళ క్రితం ఈ శాసనాన్ని కనుగొని వివరించిన ప్లీట్ దాన్ని "అంతగా బలంలేని ఒక ఆదివాసీ కుటుంబం" అని అర్ధం చెప్పాడు. ఆ తర్వాత కొన్ని ఏళ్ళు గడిచాక తన కృషిని తిరిగి వివరిస్తూ ఆయన అన్నాడు. ఈ శ్లోకాన్ని తిరిగి పరిశీలిస్తే 'మాతంగ' అన్న పదం సందర్భాన్నిబట్టి తీసుకుంటే "కచ్ఛవుల ఏనుగులు" అని చెప్పటానికి వాడబడిందని నేను అనుకుంటున్నాను.” ఆ విధంగా ఆ శాసనంలో మాదిగల ప్రస్తావన ఉందని ఊహించటం సందేహాస్పదంగా మారిపోయింది. సంప్రదాయాల వేపు పురాణగాథల వేపు మరలక చేయగలిగిందేమీలేదు. అవి సామాజిక రాజకీయమార్పులను అర్ధం చేసుకోటానికి కొన్ని ఆధారాలు యిస్తాయి. భారతదేశంలో జ్ఞాపకాలను భద్రపరిచే అసాధారణమైన శిక్షణ ఉంది. తమ తండ్రుల నుంచి విన్నవాటిని తమ బిడ్డలకు అందజేస్తారు. మరెక్కడా లేనంతగా పురాణ గాథలు విశ్వసనీయంగా ఉంటాయి. వృత్తి గాయకులు కూడా ప్రజల మధ్యకు వెళ్ళి గడచిన రోజుల్లో జరిగిన వాటిని కవితామయంగా పాడి వినోదపరుస్తారు. ఆ విధంగా గతం పూర్తిగా మరుగున పడిపోకుండా వర్తమానానికి చేరింది. సంస్కృత గాథలలో మాతంగరాజుకి సంబంధించి కొన్ని గొప్ప కావ్య ప్రసక్తులు కనిపిస్తాయి. అవి ఆదివాసుల పట్ల ఆర్యుల వైఖరికి కొన్ని సూచనలు ఇస్తాయి. ఆ వర్ణనలు ప్రాగ్భాషలో అతిశయోక్తులు నిండి ఉన్నప్పటికీ ఒక అనాగరిక ఆదివాసీ తెగ విశిష్టలక్షణాలు వివరిస్తాయి. క్రీ॥శ॥ 606 ప్రాంతాలలో జీవించిన బాణభట్టుడు<noinclude><references/> {{rule}} {{rh|చెప్పులు కుడుతూ...కుడుతూ...తెలుగు మాదిగల గాథలు|11|}}</noinclude> qnxfxj2xk2x5raxny7pbx4eny9at407 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/228 104 171150 551941 482996 2026-04-07T16:46:48Z Ramesam54 3001 551941 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>________________ ప్రథమాశ్వాసము. 209 ఇంద్రియములగా, నిగ్రహించి జయించి, ప్రాణములతో = ప్రాణవా యువులతో, మానసముక్=మనస్సును, కూర్చించేర్చి, వానితోడు = అ ప్రాణముల తోను, మనసుతోను, హంసయనఁగ హంసయనెడు, ఒప్పున క్షరద్వయంలు = ఒప్పుచున్న రెండక్షరములను, యోజించి = చేర్చి, సంతకము ఎల్లప్పుడును, భజింపన "లయుఁ" = జపింపవలయును. అది ఎట్లంటేని ఆజపించుట యెట్లనఁగా. తా. మొట్టమొదట నింద్రియములు వానివానివృత్తులనుండి మరలించి వానితోఁ ప్రాణములఁ జేర్చి యందు మనసును సంధించి (అనఁగాఃనన్నిఁటి శీకా ముగఁ జేసి) యా. ప్రాణమనస్సులతోఁగూడ హం, స అను రెండక్షరములను జేర్చి సర్వకాలములయం దును సేవింపవలయును. (ధ్యానింపనలయును అమట. ఇదియే హంసతత్త్వానుభావము, ఇదియే ఆజసాగాయత్రి.) ఆవ. సంక్షేపముగాఁ జెప్పఁబడిన హంసతత్త్వానుభవమును (లేక, హంసమంత్రి జపప్రకారమును) విస్తరించుచున్నాఁడు,— సీ. అనిశంబు పద్మాసనాసీనుఁడై చూపు లనరంగ నాసికాగ్రమున నిలిపి యిద్రియంబుల నెల్ల నిట్టట్టు నీక మదిచేకఁ దీరముగా గురియఁబట్టి ప్రాణాదిన విధవర్నంబులను వికా రము లంట కుండఁ జొక్కముగ నునిచి కామరాగాది సంకల్ప వర్ణనము గా స్వాంతంబు నరసి నిశ్చలముఁ జేసి తే. యనిలమానసములతోడ హంసమంత్ర సమరం గూర్చి జపించుచు సంకమీఁద హృదయనభమున బిందువు గదల కుండఁ బెంగా నాకళల వీక్షింపవలయు. 168 టీ. ఆనికంబు=ఎల్లప్పుడు, పద్మాసనాసీనుఁ డైయి పద్మాసనమునఁ గూర్చుండి, చూ పులు, అమరంగ = చక్క గ, నాసికాగ్ర మున-ముక్కు కొనయందు, నిలిపిఉం చి, ఇంద్రియంబుల నెళ్లి, ఇట్టట్టుపోనీక చలింపక, మదిచేత మనోబలము చేత, తీరము గాజ్"=నీళ్ఛలనుగా, (లేక దృఢముగా) కుదియఁబట్టి నిర్బంధించి, ప్రాణా.... - ప్రాణాది ప్రాణము మొదలగు, దశవిధవపనంబులక్షా పదివిధము అనవాయువు లన, వికారములుm మార్పులు, అంటకుండ-కలుఁగకుండ, చొక్క ముగ్గనునిచి= కా గుగ నిలిపి, "కాదు,,,ము గాజా కామరాగా - కౌమము రాగము మొదలగు, సంకల్ప ST<noinclude><references/></noinclude> 22tv6he2bgpu9ri8v0djtj8g2wppu7x సూచిక:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf 106 178727 552003 496064 2026-04-08T05:46:26Z Rajasekhar1961 50 552003 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[జైమినీభారతము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు|పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్ |చిరునామా=రాజమండ్రి |సంవత్సరం=1940 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} bmmsnxkwgblc1bpf9npabt2pjfizvqn పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/2 104 178740 551993 496077 2026-04-08T05:39:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551993 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}పీఠిక</p> పిల్లలమఱి వంశజుఁడైన పినవీరభద్ర కవి నియోగిబ్రాహ్మణుడు. తండ్రిపేరు గాదయామాత్యుఁడు. తల్లి నాగాంబ. అన్న పెదవీరన్న. భారతీతీర్థు లితని గురువు. ఈతని గోత్రవిషయమై యీ క్రిందిపద్యమువలన నన్నయభట్టుయొక్క భారద్వాజసగోత్రమని యూహింపవలసియున్నది. {{Telugu poem|type=మ.|lines=<poem>కవులన్ బంకజగర్భసన్నిభుల వక్కాణింతు వల్మీకసం భవునిన్ వ్యాసునిఁ గాళిదాసు బిలహున్ బాణున్ మయూరున్ శుకున్ భవభూతిన్ శివభద్రుమల్హణుని ఘంటామాఘునిం జోరు భా <u>రవి మానన్నయభట్టుఁ</u> దిక్కకవి నెఱ్ఱాప్రగడన్ సోమునిన్.</poem>|ref=}} ఇతని కాలనిర్ణయమును గూర్చి కవిజీవితములలో భారతీతీర్థుల శిష్యుఁ డగుటచే 1300 లగాయితు 1350 వరకు నున్నవాఁడని చెప్పబడియున్నది. ఇతడు భారతీతీర్థుల ప్రియశిష్యుఁ డగుటచే పైకాలమువాడేయని చెప్పవలసియున్నది. ఇతని కవిత నిరుపమానమైఁ దిక్కన సోమయాజి కవనంబును బోలియుండును. ఇతనిని భారతకవులతోఁ బోల్పవచ్చును. ఇతఁడు జైమిని భారతాశ్వమేధపర్వమునుఁ దెలిగించి సాళువగుండ నృపాలున కంకితమిచ్చెను. ఇతఁడు జైమినిభారతమును దెలిగించు విషయమై యొకచిన్నకథ గలదు. సాళువగుండ నృపాలుఁ డొకనాఁడు నిండుపేరోలగంబున నీ చినవీరన్నతో సల్లాపము లాడుచు, {{Telugu poem|type=క.|lines=<poem>నామది నిరతము భారత రామాయణకథలఁ బ్రేమ రంజిలు నందున్ జైమినిభారత మనఁగా భూమి నపూర్వము పురాణముల గణియింపన్.</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ఆపురాణంబుఁ గనఁ దెనుఁగయ్యెనేనిఁ జెప్ప నేర్చిన కవియుఁ బ్రసిద్ధుఁడేని తెనుఁగునుడికారమున మించు గనియనేని కుందనము కమ్మ వలచిన చంద మగును.</poem>|ref=}} అను జైమినిభారతమునుఁ దెలిగింప సమర్ధత గలిగినవా రెవ్వరనగా తదాస్థానపండితులు కొందఱిపేరులు జెప్పుచు పినవీరన్నయే సమర్ధుఁడని నిశ్చయించిది. రాజు కొలది<noinclude><references/></noinclude> tg4df6b3tm5xdq7fr99wrt7kme1rlvu పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/4 104 187842 551964 506185 2026-04-08T01:21:20Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551964 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}ఉపోద్ఘాతము</p> తంజాపురాంధ్రసామ్రాజ్య మంతరించి సుమారు మూఁడుశతాబ్దము లైనప్పటికిని తత్సామ్రాజ్యసంస్థాపనాధురీణులగు నాంధ్రనాయకమహారాజు లాంధ్రభాషాభివృద్ధికై నొనర్చినకృషి కేకైకనిదర్శన మీతంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమనుటలో నతిశయోక్తి గానఁబడదు. తంజావూరులో నాంధ్రనాయకరాజుల యనంతరము మహారాష్ట్రుల పరిపాలన మేర్పడినతర్వాత మహారాష్ట్రరాజులలో నొకఁడైన శరభోజి మహారాజు (1800 – 18832) కాలములో నీ గ్రంథాలయ మత్యంతాభివృద్ధినిఁ గాంచినందున నీగ్రంథాలయమునకు "తంజావూరు మహారాజా శరభోజీ సరస్వతీమహల్ గ్రంథాలయ" మనుపే రేర్పడినది. నాయకరాజు లాంధ్రభాషాభివృద్ధికై జేసిన నిరుపమమగుసేవ మరువరానిది. ముఖ్యముగ స్వర్ణయుగ మన నొప్పు శ్రీ రఘునాథనాయక శ్రీ విజయరాఘవనాయకుల కాలములో నాంధ్రభాషామతల్లి సర్వసౌభాగ్యములతో విలసిల్లినది. పూర్వకవులచే రచింపఁబడిన యనేకగ్రంథములను సేకరించియు, సమకాలికులైన కవులయొక్క గ్రంథములను భద్రపఱచియు, తామే స్వయముగఁ గొన్నిగ్రంథముల రచించియు, కవులఁ గవయిత్రుల గ్రంథనిర్మాణార్థమై ప్రోత్సహించియు నామహామహులు తమజీవితమును సార్థకముఁ జేసిరి. రఘునాథనాయకుని కుమారుఁడగు విజయరాఘవనాయకుని లేఖిని సుమారు యేబదికిఁ బైఁబడిన గ్రంథములను సృష్టించి<noinclude><references/></noinclude> mvviqojzlnjqbj1cgsq6q376wvd9dzk 551965 551964 2026-04-08T01:21:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 551965 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}ఉపోద్ఘాతము</p> తంజాపురాంధ్రసామ్రాజ్య మంతరించి సుమారు మూఁడుశతాబ్దము లైనప్పటికిని తత్సామ్రాజ్యసంస్థాపనాధురీణులగు నాంధ్రనాయకమహారాజు లాంధ్రభాషాభివృద్ధికై నొనర్చినకృషి కేకైకనిదర్శన మీతంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమనుటలో నతిశయోక్తి గానఁబడదు. తంజావూరులో నాంధ్రనాయకరాజుల యనంతరము మహారాష్ట్రుల పరిపాలన మేర్పడినతర్వాత మహారాష్ట్రరాజులలో నొకఁడైన శరభోజి మహారాజు (1800 – 1832) కాలములో నీ గ్రంథాలయ మత్యంతాభివృద్ధినిఁ గాంచినందున నీగ్రంథాలయమునకు "తంజావూరు మహారాజా శరభోజీ సరస్వతీమహల్ గ్రంథాలయ" మనుపే రేర్పడినది. నాయకరాజు లాంధ్రభాషాభివృద్ధికై జేసిన నిరుపమమగుసేవ మరువరానిది. ముఖ్యముగ స్వర్ణయుగ మన నొప్పు శ్రీ రఘునాథనాయక శ్రీ విజయరాఘవనాయకుల కాలములో నాంధ్రభాషామతల్లి సర్వసౌభాగ్యములతో విలసిల్లినది. పూర్వకవులచే రచింపఁబడిన యనేకగ్రంథములను సేకరించియు, సమకాలికులైన కవులయొక్క గ్రంథములను భద్రపఱచియు, తామే స్వయముగఁ గొన్నిగ్రంథముల రచించియు, కవులఁ గవయిత్రుల గ్రంథనిర్మాణార్థమై ప్రోత్సహించియు నామహామహులు తమజీవితమును సార్థకముఁ జేసిరి. రఘునాథనాయకుని కుమారుఁడగు విజయరాఘవనాయకుని లేఖిని సుమారు యేబదికిఁ బైఁబడిన గ్రంథములను సృష్టించి<noinclude><references/></noinclude> brie5logohgpaz3zsi1n98zx53vy8e3 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/5 104 187843 551966 506186 2026-04-08T01:26:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551966 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నది. ఇతని యాస్థానమున స్త్రీలుకూడ కవయిత్రులై యుండిరి. వారలలో నొకతెయే రంగాజమ్మ ఈమె "ఉషాపరిణయ" మను ప్రబంధమును రచించినది. (ఈ ప్రబంధము త్వరలోఁ బ్రచురితము కాగలదు.) ఇట్లాంధ్రనాయకరాజులచేఁ బాలింపఁబడి బహుముఖాదరమునుఁ బొంది వర్ధిల్లిన యీసరస్వతీమహల్ గ్రంథాలయము మహారాష్ట్రరాజుల కాలములో సర్వతోముఖాభివృద్ధిఁ జెంది శోభించినది. బహుగ్రంథకర్తయగు శ్రీ శాహమహారాజే యిందులకుఁ బరమనిదర్శనము. అతిమేధాసంపన్నులగు కవీశ్వరులచే రచింపఁబడిన యపూర్వగ్రంథము లన్నియుఁ దాళపత్రమయము లగుటచే సర్వదుర్లభము లగుటయేకాక యతిప్రాచీనములగు నాగ్రంథములు జర్జరావస్థనుఁ బొందియుండు సమయంబునఁ దద్గ్రంథప్రచురణార్థము ప్రభుత్వమునుండి యార్థికసాహాయ్యము లభించుట యాంధ్రమహాజనులకు ముదావహమైన విషయమగుటయేకాక యాంధ్రనాయకరాజులయొక్క ఆశయసిద్ధికై మన ప్రభుత్వము తోడ్పడుట గర్వించఁదగిన విషయమనుటలో సందేహము లేదు. ప్రభుత్వార్థికసాహాయ్యమునఁ బ్రకటింపఁబడు ప్రముఖగ్రంథములలో నీకుశలవోపాఖ్యాన మొకటి యగుట మన భాగ్యవశ మనియే చెప్పనొప్పును. {{p|ac|fwb}}గ్రంథకర్త</p> ఈకుశలవోపాఖ్యానమును రచించిన కవి రామనార్యుఁడు. ఔభళామాత్యుని కుమారుఁడు. సిద్దన సింగనల యనుజుఁడు,<noinclude><references/></noinclude> 0j3hfebqk38oqasghscxm82pixrn55g పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/6 104 187844 551968 506187 2026-04-08T01:34:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551968 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నియోగిశాఖలో నందవరీక కుటుంబమునకుఁ జెందినవాఁడు. వింజమూరి తిరుమలాచార్యుల శిష్యుఁడని కవి స్వయముగాఁ జెప్పుకొనుచున్నాఁడు. శ్రీరామునకుఁ దనకథను వినుటకంటెఁ దనయుల చరితమును వినుటయం దాసక్తి మెండని యంతర్యామి యగు నీశ్వరుఁడు ప్రబోధింపఁగా నీకవి శ్రీరామాంకితముగాఁ గుశలవోపాఖ్యానమునుఁ జేసెననియుఁ బేర్కొనియున్నాఁడు. ఈకవిని గుఱించిన చారిత్రకాధారములకైఁ జేసిన ప్రయత్నములన్నియు విఫలము లైనవి. ఇతఁ డేకాలమున నెచ్చట నుండెనని తెలిసికొనుటకుఁ దగిన యాధారములు దొఱకలేదు. ఇతని తండ్రియొక్క నామధేయమును గమనించుచో "ఔభళామాత్యుఁడ”నియు, "ఔభళమంత్రి" యనియును నహోబళుఁడను నామమునకు “మంత్రి” యనికాని "అమాత్యుఁడ”నికాని సచివపర్యాయమగు పదమునుఁ జేర్పఁగా “నహోబళమంత్రి" యను నామము జనులయొక్క వ్యావహారికభాణిలో “నౌభళమంత్రి" యని యేర్పడియుండవచ్చును. కాని యీ యౌభళామాత్యుఁ డేరాజు నాశ్రయించియుండెనో విశదము గాకున్నది. కవి తననామధేయము నెఱుకపఱచుచు {{Telugu poem|type=|lines=<poem>"కవి రామనార్యవిఖ్యాతుండ ఘనుఁడఁ గవిరాజమిత్రుండ గౌరవోన్నతుఁడ"</poem>|ref=}} అని చెప్పుకొనెను. మఱియుఁ దన కావ్యము నేరాజునకును నంకిత మొనర్పక శ్రీరామునకు నంకితముఁ జేసెను. ఇట్టి విఖ్యాతప్రజ్ఞుఁడగు కవివర్యునియొక్క కాలస్థానములనుగుఱించి వివరములు తెలియకపోవుట చారిత్రికుల బల<noinclude><references/></noinclude> kkvsmu0lnt0eup3qm4s4mw8u3yqz740 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/7 104 187845 551972 506188 2026-04-08T02:41:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551972 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>హీనతనుఁ జూపుచున్నది. ఈసరస్వతీమహల్ గ్రంథాలయములోని M. 241 నెంబరు గలిగి ప్రకృతపరిష్కరణముదృష్ట్యా “క” సంజ్ఞఁగల తాళపత్రమయమైన కుశలవోపాఖ్యానగ్రంథమందు లభ్యమగు నుపోద్ఘాతమందుఁ గవి తనవంశమునుగుఱించి కొంతఁ దెలియపఱచియున్నాఁడు. కాని యాభాగముకూడ గ్రంథముయొక్క జర్జరావస్థనుబట్టి యసంపూర్ణముగ దొఱకుటయు మన దౌర్భాగ్యమే. ఆభాగ మీక్రిందఁ బొందుపఱుపఁబడియున్నది. {{Telugu poem|type=|lines=<poem>.......................డనారాయణ గౌశిక గోత్రుఁ బ్రాచీన వేదమార్గ........................... పౌత్రుని (సు)గుణతత్పరు నయ్యలార్యుఁ బుత్రుఁ బవిత్రు అంబ............... నిరుపమసత్కృపానిధి వింజమూరి తిరుమలాచార్యుఁ గీర్తింతు ......... .......బ్రహ్మయ చతురాస్యుఁడనఁగ వరకీర్తి నొప్పు నేవరపితామహ......... ............మంత్రి యఖిలనియోగి జనసేవ్యుఁ డెవ్వని జనకుఁడై వెలయు ధాత్రిలో నెవ్వఁ డుత్తము............. గోత్రుఁడై యు...................... ...............................౦డు భూతలంబున సందపురవంశఘనుఁడు అతిలోకనుతునకు నాయతపుణ్యయైన ...........కుఁ దనూభవుఁడైన యతని</poem>|ref=}}<noinclude><references/></noinclude> 4ninf00bw5rkc32l60s1rwyjowfzrty 551973 551972 2026-04-08T02:42:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 551973 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>హీనతనుఁ జూపుచున్నది. ఈసరస్వతీమహల్ గ్రంథాలయములోని M. 241 నెంబరు గలిగి ప్రకృతపరిష్కరణముదృష్ట్యా “క” సంజ్ఞఁగల తాళపత్రమయమైన కుశలవోపాఖ్యానగ్రంథమందు లభ్యమగు నుపోద్ఘాతమందుఁ గవి తనవంశమునుగుఱించి కొంతఁ దెలియపఱచియున్నాఁడు. కాని యాభాగముకూడ గ్రంథముయొక్క జర్జరావస్థనుబట్టి యసంపూర్ణముగ దొఱకుటయు మన దౌర్భాగ్యమే. ఆభాగ మీక్రిందఁ బొందుపఱుపఁబడియున్నది. {{Telugu poem|type=|lines=<poem>.......................డనారాయణ గౌశిక గోత్రుఁ బ్రాచీనవేదమార్గ........................... పౌత్రుని (సు)గుణతత్పరు నయ్యలార్యుఁ బుత్రుఁ బవిత్రు అంబ............... నిరుపమసత్కృపానిధి వింజమూరి తిరుమలాచార్యుఁ గీర్తింతు ......... .......బ్రహ్మయ చతురాస్యుఁడనఁగ వరకీర్తి నొప్పు నేవరపితామహ......... ............మంత్రి యఖిలనియోగి జనసేవ్యుఁ డెవ్వని జనకుఁడై వెలయు ధాత్రిలో నెవ్వఁ డుత్తము............. గోత్రుఁడై యు...................... ...............................౦డు భూతలంబున నందపురవంశఘనుఁడు అతిలోకనుతునకు నాయతపుణ్యయైన ...........కుఁ దనూభవుఁడైన యతని</poem>|ref=}}<noinclude><references/></noinclude> 1bf91lkk2xmur06ceik9bzxf532e0y4 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/8 104 187846 551974 506189 2026-04-08T03:08:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551974 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>అనఘబ్రహ్మయసిద్ధనామాత్యవరుని యనుజుని దుర్గాంకు నగ్రసంభవుని మండితగుణశాలి మాచయప్రోలి గుండయ రామనాంకునకుఁ బుణ్యునకు నరనుత చిలుకలనారయపుత్రి చిరకీర్తినికురుంబ సిరియమాంబకును నెమ్మి రెట్టింప జనించినయట్టి అమ్మకు హృదయేశ్వరుండైన యట్టి వీతకళంకుఁడై విలసిల్లుచున్న మాతండ్రి యౌభళామాత్యు భావింతు అని యిష్టదేవతాప్రార్థనఁ జేసి యినుమడించిన మతి నెసఁగినవాఁడ మార్తుర గెలిచి రామాయణచక్ర వర్తినిఁ గీర్తిమై వర్తించువాఁడ సిద్ధనమంత్రికి సింగనార్యునకుఁ దద్దయు కూరిమితమ్ముఁడౌ ఘనుఁడఁ గవి రామానార్య విఖ్యాతుండ ఘనుఁడఁ గవిరాజమిత్రుండ గౌరవోన్నతుఁడఁ నరయంగ సత్కవి యగుటకు ఫలము హరికీర్తనమెకదా! యని విచారించి కవికులమణి! రామకావ్యంబుఁ జెప్పి రవికులమణియైన రామున కిమ్ము రామచంద్రునకు శ్రీరామాయణంబు ప్రేమంబు మఱియుఁ జెప్పెద రహస్యంబుఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude> b8p5548tnaoyb39s907q8eqhed065qb పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/9 104 187847 551975 506190 2026-04-08T03:13:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551975 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దన పేర్మి వినుకంటెఁ దనయులపేర్మి వినుట తండ్రికీఁ గడువేడుక గాన దశరథసుతునకుఁ దనకథకంటెఁ గుశలవకథమీఁదఁ గుతలంబువేడ్క యనుచు నంతర్యామియగు నీశ్వరుండు నను బ్రబోధించిన నంచితభక్తి శ్రీ యురంబున గల్గి చెన్నొందు నభయ దాయకునకు జగత్త్రయనాయకునకు"</poem>|ref=}} రామనార్యుఁడు కుశలవోపాఖ్యానముఁ గాక మరేగ్రంథమును రచించినట్లు తెలియుట లేదు. అట్లుండిన నీగ్రంథమందు నద్దానిని బేర్కొనకుండునా? ఒకవేళ కుశలవోపాఖ్యానమును విరచించిన పిదప మరేగ్రంథమునైనను రచించెనేమోగాని దానికిఁ దగిన యాధారములు గానరావు. {{p|ac|fwb}}కుశలవోపాఖ్యానము</p> ప్రకృత మాంధ్రభాషామయమైన యీకుశలవోపాఖ్యానము జైమినిభారతములోని యశ్వమేధపర్వాంతర్గతప్రాస్తావికోపాఖ్యానరూపమగు గుశలవచరితమునకు స్వతంత్రానువాదము. ఈ విషయమును విస్పష్టముగఁ గవియే చెప్పియున్నాఁడు. ఆ భాగము లీక్రింద నివ్వఁబడియున్నవి. {{Telugu poem|type=|lines=<poem>"మేఘనీలద్యుతి మెయి నుల్లసిల్లు రాఘవునకును మార్గణలాఘవునకుఁ దెలియ విన్నపముగా ద్విపదరూపమునఁ బలికెదఁ గుశలవోపాఖ్యాన మెలమి</poem>|ref=}}<noinclude><references/></noinclude> tk237koipoddresqd2qtglpa3t7yg8z పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/10 104 187848 551976 506191 2026-04-08T03:20:29Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551976 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నని చెప్పఁబూనితి నారఘూత్తముని మనమున నిల్పి యిమ్మట్కినిట్లంటి."</poem>|ref=}} {{right|కుశలవోపాఖ్యానము (పూర్వభాగము). పద్య. 1-3}} {{Telugu poem|type=|lines=<poem>“సకలంబు సూతుండు శౌనకాదులకుఁ బ్రకటించెనని యంధ్రభాష యొప్పలర శ్రీముకుందార్చనశీలుండు సుకవి రామనార్యుఁడు కవిరాజమిత్రుండు నీకుఁ బ్రియంబుగా నిఖిలైకధామ! కాకుస్స్థకులరామ! కల్యాణరామ! సమధురరీతిమై జైమినిభార తమున విస్తరము విస్తారంబు గతుల నలవడఁ గుశలవోపాఖ్యానకమునఁ బలికితి నీపూర్వభాగంబు వినుము”</poem>|ref=}} {{right|కుశలవోపాఖ్యానము (పూర్వభాగము). పద్య. 704-708}} {{Telugu poem|type=|lines=<poem>"నీకుఁ బ్రియంబుగా నృపసార్వభౌమ! కాకుస్స్థకులరామ! కల్యాణరామ! సమధురరీతిమై జైమినిభార తమున విస్తరము విస్తారంబు గాఁగ నలవడఁ గుశలవోపాఖ్యానకమునఁ బలికితి నుత్తరభాగంబు సరవి</poem>|ref=}}<noinclude><references/></noinclude> b2iwnlqtylb9gaeoiukndon0281pnst పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/11 104 187849 551977 506192 2026-04-08T03:28:05Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551977 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నాచంద్రతారార్క మాచక్రవాళ మాచంద్రతారార్కమై యొప్పుఁగాత."</poem>|ref=}} {{right|కుశలవోపాఖ్యానము (ఉత్తరభాగము). పద్య. 1291-1294}} {{p|ac|fwb}}అనువాదము</p> జైమినిభారతములోని కుశలవచరితము ననువాదము చేయుపట్ల కవి కొన్నిమార్పులనుఁ ప్రవేశపెట్టియున్నాఁడు. శ్రీరాముఁడు రావణాదుల సంహరించి యయోధ్యకు వచ్చి కౌసల్యకు మ్రొక్కఁగాఁ గౌసల్య రాక్షసబాణములచే క్షతగాత్రుఁడైన కుమారునిఁ జూచి మిక్కిచి చింతించుచుఁ దనకరములచే శ్రీరామునిదేహమును స్పృశింప శ్రీరాముఁడు గతక్షతుఁడైనట్లు మూలమునఁ గానఁబడుచున్నది. కాని యనువాదమునందు వేరువిధముగఁ గన్పట్టుచున్నది. జైమినిభారతము (అశ్వమేధపర్వము) {{Telugu poem|type=|lines=<poem>"కౌసల్యాం జననీం పశ్చాన్నమస్కర్తుమగాచ్చ సః। మలినాం పంకదిగ్ధాంగీం రామదంశ్శనలాలసామ్॥ భర్తృదుఃఖపరిక్లిన్నాం హర్షితాం రామదర్శనాత్। దృష్ట్వా పద్మపలాశాక్షం రామం హర్షసమన్వితా॥ పరిరభ్య చిరం తస్థౌ ధనం ప్రాప్యాధనో యథా। స్నాపయంతీ దృగంభోభిః స్నేహేన బహునా సుతమ్॥ విశేషేణ జటాసంతం చిరం స్నానమవర్తయత్। తతో రామం కరాగ్రేణ పస్పర్శ జననీ తథా॥</poem>|ref=}}<noinclude><references/></noinclude> 11d7ykx26qhszgrehqu5u56eoxb2bvs పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/12 104 187850 551981 506193 2026-04-08T04:42:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551981 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem></poem>|ref=}}రాక్షసాస్త్రక్షతం దృష్ట్వా ప్రోవాచ వచనం శుభమ్। వసిష్ఠప్రముఖా రామం వదంతి కిమిదం వచః॥ అచ్ఛేద్యోయమభేద్యోయమక్లేద్యోయం సుతస్తవ। తదిదానీం వృథా మన్యే బాణైర్భిన్నోసి రాఘవ॥ అథవా శివభక్తం త్వామాహుః కేచిన్మునీశ్వరాః। తస్మాద్ధత్తం త్వయా స్థానం బాణానామితి మే మతిః॥ స్పృష్ట్వా తదంగం కౌసల్యా స్వపాణిభ్యాం దయావతీ। ఆనందం పరమం ప్రాప్తా జ్ఞానం లబ్ధ్వేన బ్రాహ్మణః॥ తత్కరస్పర్శతో రామో ముక్తో దుఃఖైస్సుదారుణై। {{right|జైమినిభారతము. అశ్వమేధపర్వము. అధ్యా 25. శ్లో. 11-19.}} {{Telugu poem|type=|lines=<poem>“అరుదైన పతివియోగాగ్నిచేఁ గుంది పరిలిప్తభూరేణుపటలాంగి యగుచు ఇప్పుడు చూతునో యేఁ బుత్రు ననుచుఁ దప్పక యందంద తను వచ్చుత్రోవఁ గనుఁగొను యతిపుణ్యకాంతామతల్లిఁ దనుతరతనువల్లిఁ దమతల్లిఁ గాంచి కడలేనిభక్తితోఁ గడుసంతసమున ముడివడ నందంద మ్రొక్కె; మ్రొక్కుటయుఁ గన్నారఁ గనుఁగొని కడుఁబేదరాలు పెన్నిధిఁ గన్నట్లు బ్రియమందె జనని చేకొని పట్టాభిషేకంబు నీకు నోకుమారక! యింక నుచిత మన్నట్లు నందనుమీఁద నానందబాష్పంబు</poem>|ref=}}<noinclude><references/></noinclude> suf0sxrfqf0uep1angf5g3urvwr4xs2 551982 551981 2026-04-08T04:42:43Z దేవీప్రసాదశాస్త్రి 4290 551982 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>రాక్షసాస్త్రక్షతం దృష్ట్వా ప్రోవాచ వచనం శుభమ్। వసిష్ఠప్రముఖా రామం వదంతి కిమిదం వచః॥ అచ్ఛేద్యోయమభేద్యోయమక్లేద్యోయం సుతస్తవ। తదిదానీం వృథా మన్యే బాణైర్భిన్నోసి రాఘవ॥ అథవా శివభక్తం త్వామాహుః కేచిన్మునీశ్వరాః। తస్మాద్ధత్తం త్వయా స్థానం బాణానామితి మే మతిః॥ స్పృష్ట్వా తదంగం కౌసల్యా స్వపాణిభ్యాం దయావతీ। ఆనందం పరమం ప్రాప్తా జ్ఞానం లబ్ధ్వేన బ్రాహ్మణః॥ తత్కరస్పర్శతో రామో ముక్తో దుఃఖైస్సుదారుణై।</poem>|ref=}} {{right|జైమినిభారతము. అశ్వమేధపర్వము. అధ్యా 25. శ్లో. 11-19.}} {{Telugu poem|type=|lines=<poem>“అరుదైన పతివియోగాగ్నిచేఁ గుంది పరిలిప్తభూరేణుపటలాంగి యగుచు ఇప్పుడు చూతునో యేఁ బుత్రు ననుచుఁ దప్పక యందంద తను వచ్చుత్రోవఁ గనుఁగొను యతిపుణ్యకాంతామతల్లిఁ దనుతరతనువల్లిఁ దమతల్లిఁ గాంచి కడలేనిభక్తితోఁ గడుసంతసమున ముడివడ నందంద మ్రొక్కె; మ్రొక్కుటయుఁ గన్నారఁ గనుఁగొని కడుఁబేదరాలు పెన్నిధిఁ గన్నట్లు బ్రియమందె జనని చేకొని పట్టాభిషేకంబు నీకు నోకుమారక! యింక నుచిత మన్నట్లు నందనుమీఁద నానందబాష్పంబు</poem>|ref=}}<noinclude><references/></noinclude> g5gy9g0dy28ltmkovtnn3k5n5mjnojo పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/13 104 187851 551983 506194 2026-04-08T05:16:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551983 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>చిందంగఁ గౌఁగిటఁ జేర్చి మే నెల్ల బ్రమదంబుతో నిజపాణిపద్మమునఁ జమరి రాక్షసశరక్షతములఁ గాంచి అనఘ! రాఘవ! వసిష్ఠాదిసంయములు ననుఁ జూచి నీప్రియనందనుం డెందు నవిభేద్యుఁ డక్లేశుఁ డఖిలేశుఁ డనుచు వివరించి పలికిరి విమలవాక్యముల వివిధబాణక్షతావృతు నిన్నుఁ జూచి యవి నేఁ డమోఘంబులై తోఁచె నాకు నదిగాఁక మరి నిన్ను నఖిలవేదార్థ విదులు నీమహిమల వివరింపలేరు. అటులయ్యు నీక్రియ నన్న! నీమేనుఁ జటులరాక్షసబాణచయ మెట్లు నాటె నని శోకమునఁ బొంది యట వివేకించి యనియె రాఘవుతోడ నపుడు కౌసల్య శోకార్తిమై మీఁదుఁ జూడక యంటి గాక యమ్మునుల వాక్యము లేల తప్పు రావణాదుల సంగరంబున నోర్చి నీవు వచ్చితిగాన నిజమయ్యె నేఁడు”</poem>|ref=}} {{right|కుశలవోపాఖ్యానము (పూర్వభాగము). పద్య. 43-58}} పైమూలానువాదములను సూక్ష్మముగఁ బరిశీలించినచో మూలములోని భాగము లనువాదములో నెంతమార్పుఁ జెందినదో విశదము కాఁగలదు, శ్రీరాముని దేహమందలి రాక్షసబాణ<noinclude><references/></noinclude> pqmhpjrgz8xiksec5r73h6d2sukw9s2 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/14 104 187852 551984 506195 2026-04-08T05:26:58Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 551984 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తములు కౌసల్యాకరస్పర్శముచేఁ దొలఁగుటను గవి యనువాదముఁ బేర్కొనియుండలేదు. పైఁబడి "శోకార్తిమైమీఁదుఁ జూడక యంటి" ఇత్యాది కౌసల్యావాక్యములకు మూలమున నాధారము లేదు. {{Telugu poem|type=|lines=<poem></poem>|ref=}}“నమస్కృత్య తతో బంధూన్ పప్రచ్ఛ కుశలం చ తాన్। హర్షితో భ్రాతృభిస్సర్వై రయోధ్యాయామువాస సః॥ పాలయన్ పృథివీం సర్వాం సశైలవనకాననామ్। ప్రజాః స్వస్థాహ్యవర్తంత విప్రా వేదపరాయణాః॥ ఆతృప్తేశ్చ పయః పీత్వా వత్సా యత్రోపరేమిరే। గోపాలా దుదుహుస్తత్ర ఘటోధ్నీర్గాశ్శుభాస్తదా॥ ఔషధ్యః ఫలవత్యస్తా దుష్కాలాదేర్వినాశకాః। సరయూతీరమాసాద్య యజ్ఞాన్కుర్వంతి యాజకాః॥ యూపస్తంభాస్సమంతాచ్చ పశుభిరుపశోభితాః। దృశ్యంతే స్థాణుతాం ప్రాప్తా అథ్వరాంతే సముచ్ఛ్రితాః॥ జైమినిరువాచ॥ ఏవం స రామః సుఖితః పృథివ్యాం త్రిభిశ్చ తైరాతృభిరగ్నికల్పైః। రరాజ రాజీవపలాశనేత్రో గుణైస్త్రిభిస్సత్త్వరజస్తమోభిః॥ {{right|జైమినిభారతము. అ. ప. అధ్యా. 25. శ్లో. 20-26}} మూలములోని పైభాగమున కనువాదమును జేయునపుడు చాలభాగములు వదలివేయఁబడి యనేకాంశములు చేర్పఁబడి పూర్తిగ మూలముయొక్కరీతియే మార్చఁబడియున్నది.<noinclude><references/></noinclude> qysxccxrxp980pbv4l9lo9nsw63oue2 551985 551984 2026-04-08T05:27:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 551985 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తములు కౌసల్యాకరస్పర్శముచేఁ దొలఁగుటను గవి యనువాదముఁ బేర్కొనియుండలేదు. పైఁబడి "శోకార్తిమైమీఁదుఁ జూడక యంటి" ఇత్యాది కౌసల్యావాక్యములకు మూలమున నాధారము లేదు. {{Telugu poem|type=|lines=<poem>“నమస్కృత్య తతో బంధూన్ పప్రచ్ఛ కుశలం చ తాన్। హర్షితో భ్రాతృభిస్సర్వై రయోధ్యాయామువాస సః॥ పాలయన్ పృథివీం సర్వాం సశైలవనకాననామ్। ప్రజాః స్వస్థాహ్యవర్తంత విప్రా వేదపరాయణాః॥ ఆతృప్తేశ్చ పయః పీత్వా వత్సా యత్రోపరేమిరే। గోపాలా దుదుహుస్తత్ర ఘటోధ్నీర్గాశ్శుభాస్తదా॥ ఔషధ్యః ఫలవత్యస్తా దుష్కాలాదేర్వినాశకాః। సరయూతీరమాసాద్య యజ్ఞాన్కుర్వంతి యాజకాః॥ యూపస్తంభాస్సమంతాచ్చ పశుభిరుపశోభితాః। దృశ్యంతే స్థాణుతాం ప్రాప్తా అథ్వరాంతే సముచ్ఛ్రితాః॥ జైమినిరువాచ॥ ఏవం స రామః సుఖితః పృథివ్యాం త్రిభిశ్చ తైరాతృభిరగ్నికల్పైః। రరాజ రాజీవపలాశనేత్రో గుణైస్త్రిభిస్సత్త్వరజస్తమోభిః॥"</poem>|ref=}} {{right|జైమినిభారతము. అ. ప. అధ్యా. 25. శ్లో. 20-26}} మూలములోని పైభాగమున కనువాదమును జేయునపుడు చాలభాగములు వదలివేయఁబడి యనేకాంశములు చేర్పఁబడి పూర్తిగ మూలముయొక్కరీతియే మార్చఁబడియున్నది.<noinclude><references/></noinclude> 0bfnms8j3abyxtsx8hte3q80x519qof పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/15 104 187853 552013 506196 2026-04-08T06:10:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552013 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} కుశలవోపాఖ్యానములోని పైభాగమున కనువాద మీరీతినున్నది — {{Telugu poem|type=|lines=<poem>"అని మోదమును బొందె నప్పు డారామ జనపతి యందంద జననికి మ్రొక్కి వినయవాక్యంబులు విలసిల్ల బంధు జనుల సేమంబును సకలంబు లడిగి యనుజులతోఁగూడ నప్పురిఁ జొచ్చి చనుచోట రఘురామచంద్రుపై నడుమ ఘనరత్నతోరణాంకములు గర్జనలు ప్రాసాదములు మేఘపంక్తులు మణులు రాసి కెక్కిన సురరాజగవనులు పసిఁడికుండల మించు ప్రతిసూర్యబింబ విసరంబుమెఱుఁగులు వివిధశస్త్రములు గా నయోధ్యాపురి ఘనపుష్పవృష్టి వానకాలమునాటివడువునఁ గురిసె. జలజాప్తకులుఁ డంత సకలసమ్మదము విలసిల్ల నగరుఁ బ్రవేశించె నెలమి. పట్టాభిషిక్తుఁడై బహుళకీర్తులకు బట్టెన రఘుపతి పరమధర్మమున నవరత్నసింహాసనంబున నుండి యవనిపైఁ దనయాజ్ఞ యనిశంబుఁ జెల్లఁ దనుఁ జేరి పావకత్రయమునుఁ బోలి యనుజులు మువ్వురు నతభక్తిఁ గొలువ నలఁతయుఁ బగయును నపమృత్యుభయము</poem>|ref=}}<noinclude><references/></noinclude> 7hs6tn1s9tm2nn8pnwtsxbp9hl534mb పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/16 104 187854 552027 506197 2026-04-08T07:10:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552027 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గలఁకయుఁ గలహంబు కపటవర్తనము శోకంబు రుజయునుఁ జోరవిగ్రహము లేకుండఁ బ్రజలఁ బాలింపుచు నుండె.”</poem>|ref=}} {{right|కుశలవోపాఖ్యానము (పూర్వభాగము). పద్య. 59-71}} కుశలవోపాఖ్యానము పూర్వభాగమున వర్ణింపఁబడిన సుమారు 85 పద్యములవరకు వ్యాపించిన (72-151, 168-170) వసంతాగమనము, సీతారాములు యారామకేళి, జానకివర్ణన, వనవర్ణన, వర్షాగమనవర్ణన మిత్యాదులు మూలమున మృగ్యములు. ప్రాయికముగ నిందలివర్ణనము లన్నియుఁ గవిచేఁ గల్పితములనియే చెప్పనొప్పును. {{Telugu poem|type=|lines=<poem>"దశవర్షసహస్రాణి రాజ్యం చక్రే స రాఘవః। ప్రజాం న లేభే సీతాయాం పాలయన్పూర్వజస్థితిమ్॥"</poem>|ref=}} అని శ్రీరామునకు సంతతి లేకుండుటనుఁ దెల్పు పైశ్లోకము ననువదించు కవియొక్క లేఖిని యెంతస్వైరముగ సంచరించినదో యీ క్రిందిపద్యములవలనఁ దెలియఁగలదు:— {{Telugu poem|type=|lines=<poem>"అంత భూపాలుఁ డా యవనినందనకు సంతతి లేకున్నఁ జాల చింతించి తనయులు లేని యాతని యన్వయంబు జననంబు వృథగాదె! చర్చించి చూడ నెందును సంతానహీనులు కీర్తిఁ బొంద రిందును నందుఁ బుణ్యాత్ములైన నెలకొన్న వగపులు నిట్టూర్పుగములు బెలయించి వారల పితరులందఱును</poem>|ref=}}<noinclude><references/></noinclude> dpy8ua5d7cbhydnn10j1dst5ojck0o9 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/17 104 187855 552028 506198 2026-04-08T07:18:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552028 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ననురక్తిఁ దమ కుదకాంజలికర్మ మొనరించువాఁ డింక నుర్వి లేఁ డనుచు క్షితిఁ దమవంశవిచ్ఛేదంబుఁ దలఁచి మతిలోనఁ దమయాస మాని తూలుదురు ధారుణిసుతయందుఁ దనయులఁ బడయ నేర నక్కట! వంశనిస్తారకులనుఁ గడు దుష్టదెస నొంది కాకుస్స్థకులము పొడవడంచినజాడఁ బోవలె ననుచు.”</poem>|ref=}} ఇట్లే కవి మూలమున సంగ్రహముగఁ బ్రతిపాదింపఁబడిన భాగముల నతివిస్తరముగఁ జేయుచు విస్తరముగఁ బ్రతిపాదింపఁబడిన విషయములు సంగ్రహింపుచు నచ్చటచ్చట మూలములో లేని విషయములఁ జేర్చుచుఁ గొన్నిచోట్ల మూలములోని విషయముల వదలివేయుచు ననువాదమును సాగించియున్నాఁడు. కుశలవోపాఖ్యానమునఁ గవికల్పితములగు మార్పులలో నవతారికలోని మార్పు ప్రధానమైనది. జైమినిభారతమున జైమినిముని బబ్రువాహనునకును నర్జునునకును నతితీవ్రమగు సమరమును వర్ణింపుచుఁ గుశరాముల యుద్ధమువలె నుండెనని పలుకఁగా జనమేజయుఁడు కుశరాములను గుఱించిన వృత్తాంతమంతయుఁ జెప్పఁగోరుటయుఁ దదనంతరము రాముఁడు వనవాసమును ముగించుకొని యయోధ్యకు మఱలుటాదిగాఁ గుశలవులతో యుద్ధమునందు మూర్ఛిల్ల వాల్మీకి యనుగ్రహమునఁ దెప్పరిల్లి పుత్రాదులతోఁ గూడి యయోధ్యకు వచ్చి యశ్వమేధమును జేయుచుండ వాల్మీకి సీతాదేవిని శ్రీరామున కొప్పగింప నధ్వర<noinclude><references/></noinclude> 125jd9ms08li90sgm802ayw17eplvu4 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/18 104 187856 552029 506199 2026-04-08T07:27:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552029 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మును ముగించి సుఖముగ రాజ్యమేలుటవరకు గల చరిత్రమును జైమిని వర్ణించి చెప్పునట్లున్నది ప్రతిపాద్యము. కాని రామనార్యుఁడు తనయనువాదమునఁ బార్థుఁడునుఁ గర్ణుఁడును దీవ్రమగుయుద్ధముఁ జేయుచుండఁ గుశరాములయుద్ధమువలె నుండెనని వర్ణింప జనమేజయుఁడు కుశరాముల వృత్తాంతము నడుగుటయుఁ దదనంతరము జైమిని కుశలవచరితమును వర్ణించునట్లు బ్రతిపాద్యము సమర్చియున్నాఁడు. జైమినిభారత కుశలవోపాఖ్యానములలోని యవతారికోపసంహారము లీక్రిందఁ బొందుపరుపఁబడియున్నవి. జైమినిభారతములోని యవతారిక :— {{Telugu poem|type=|lines=<poem>జైమినిరువాచ:— "సంగ్రామస్త్వభవద్రాజ న్బబ్రువాహనపార్థయోః। యథా కుశస్య రామస్య వాజిమేధహయే ధృతే॥ జనమేజయ ఉవాచ :— కథం రామః కుశం పుత్రం శమయచ్ఛరవృష్టిభిః। కథంచ తేన పుత్రేణ జితో రామా రణాజిరే॥ రామో నవేత్తి స్వం సూనుమేతన్మే విస్తరాద్వద। యస్మాద్రామకథా విప్ర సర్వపాతకనాశినీ॥ జైమినిరువాచ :— శృణు రాజన్మహాబాహో రామస్య చరితం మహత్। విస్తరేణ యథాపూర్వం పవదతో మే నిశామయ॥"</poem>|ref=}} {{right|జై. భా. అ. ప. అధ్యా. 25. శ్లో॥ 1-4}}<noinclude><references/></noinclude> 7fq9zlo5kmt2644hc6woa0unlw3mfkp 552039 552029 2026-04-08T09:50:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 552039 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మును ముగించి సుఖముగ రాజ్యమేలుటవరకు గల చరిత్రమును జైమిని వర్ణించి చెప్పునట్లున్నది ప్రతిపాద్యము. కాని రామనార్యుఁడు తనయనువాదమునఁ బార్థుఁడునుఁ గర్ణుఁడును దీవ్రమగుయుద్ధముఁ జేయుచుండఁ గుశరాములయుద్ధమువలె నుండెనని వర్ణింప జనమేజయుఁడు కుశరాముల వృత్తాంతము నడుగుటయుఁ దదనంతరము జైమిని కుశలవచరితమును వర్ణించునట్లు బ్రతిపాద్యము నమర్చియున్నాఁడు. జైమినిభారత కుశలవోపాఖ్యానములలోని యవతారికోపసంహారము లీక్రిందఁ బొందుపరుపఁబడియున్నవి. జైమినిభారతములోని యవతారిక :— {{Telugu poem|type=|lines=<poem>జైమినిరువాచ:— "సంగ్రామస్త్వభవద్రాజ న్బబ్రువాహనపార్థయోః। యథా కుశస్య రామస్య వాజిమేధహయే ధృతే॥ జనమేజయ ఉవాచ :— కథం రామః కుశం పుత్రం శమయచ్ఛరవృష్టిభిః। కథంచ తేన పుత్రేణ జితో రామా రణాజిరే॥ రామో నవేత్తి స్వం సూనుమేతన్మే విస్తరాద్వద। యస్మాద్రామకథా విప్ర సర్వపాతకనాశినీ॥ జైమినిరువాచ :— శృణు రాజన్మహాబాహో రామస్య చరితం మహత్। విస్తరేణ యథాపూర్వం పవదతో మే నిశామయ॥"</poem>|ref=}} {{right|జై. భా. అ. ప. అధ్యా. 25. శ్లో॥ 1-4}}<noinclude><references/></noinclude> mjfmlvc59nibveekr5hoz6f05edkzv7 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/19 104 187857 552079 506200 2026-04-08T11:58:05Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552079 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కుశలవోపాఖ్యానములోని యవతారిక :— {{Telugu poem|type=|lines=<poem>"జైమినిచే మున్ను జనమేజయుండు జైమినిభారతసంహిత వినుచు ధర్మజు నశ్వమేధప్రసంగమున ధర్మాత్ముఁడైన యాధరణీశ్వరుండు "<u>పార్థుండు గర్ణుండుఁ బన్ని</u> పోరుటయు వ్యర్థమే ప్రజలెల్ల వసుధఁ గూలుటయుఁ దలఁప నచ్చెరువుగాదా” యన నతఁడు బలికి నాఖండలపౌత్రపౌత్రునకు నిది యేమి రాముండు యెఱిఁగి యాకుశుఁడుఁ గదనంబు సేయరే కమలారివంశ! వినవయ్య యద్భుతవృత్తాంత” మనిన జనమేజయుఁడు పల్కె జైమినిఁ జూచి "రాసి యొండొరులతో రాముండఁ గుశుఁడు చేసిన కయ్యంబుఁ జెప్ప నచ్చెరువు అది యానతిమ్ము నాకంతయుఁ దెలియ మదిఁ గోర్కె కలద"న్న మౌని యిట్లనియె, పూర్వోక్తమగు రామభూపాలుచరిత ముర్వీశ! చెప్పెద నురుభక్తి వినుము.”</poem>|ref=}} {{right|కుశలవోపాఖ్యానము (పూ.భా.) పద్య 15-23}} జైమినిభారతములోని యుపసంహారము :— {{Telugu poem|type=|lines=<poem>"ఉత్థాయ రామో నగరీం ప్రవేశ ససైనికః। విస్మయన్నేవచ హయం ముక్తం వాల్మీకినాచ తమ్॥</poem>|ref=}}<noinclude><references/></noinclude> 2v3wseiyrlfvu3amo1mtdt3438tb7jj రచయిత:మామిడి హరికృష్ణ 102 206315 551992 551737 2026-04-08T05:38:34Z Rajasekhar1961 50 /* రచనలు */ 551992 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = మామిడి |అసలుపేరు = హరికృష్ణ |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = మామిడి హరికృష్ణ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[తెలంగాణ తేజోమూర్తులు]] (2017) * [[గోల్కొండ చరిత్ర]] (2022) * [[తెలంగాణ గిరిజనుల సంస్కృతి]] (2023) * [[శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం]] (2023) * [[శాసనదర్శి: శ్రీ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి శతజయంత్యుత్సవ సంచిక]] (2023) * [[పటం కతలు]] jeo4111ve5b478p9g728034gitmo2qq 551995 551992 2026-04-08T05:40:04Z Rajasekhar1961 50 /* రచనలు */ 551995 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = మామిడి |అసలుపేరు = హరికృష్ణ |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = మామిడి హరికృష్ణ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[తెలంగాణ తేజోమూర్తులు]] (2017) * [[గోల్కొండ చరిత్ర]] (2022) * [[తెలంగాణ గిరిజనుల సంస్కృతి]] (2023) * [[మిత అయ్యల్‌వార్లు (భాష, సాహిత్యం, సామాజికత, సంస్కృతి)]] (2023) * [[శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం]] (2023) * [[శాసనదర్శి: శ్రీ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి శతజయంత్యుత్సవ సంచిక]] (2023) * [[పటం కతలు]] szzmp1va6z7qucetwas5w6zs5hlqy4y 551997 551995 2026-04-08T05:41:20Z Rajasekhar1961 50 /* రచనలు */ 551997 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = మామిడి |అసలుపేరు = హరికృష్ణ |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = మామిడి హరికృష్ణ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[తెలుగు కార్టున్ (తెలుగు భాషపై కార్టూన్‌ల సంకలనం)]] (2017) * [[తెలంగాణ తేజోమూర్తులు]] (2017) * [[గోల్కొండ చరిత్ర]] (2022) * [[తెలంగాణ గిరిజనుల సంస్కృతి]] (2023) * [[మిత అయ్యల్‌వార్లు (భాష, సాహిత్యం, సామాజికత, సంస్కృతి)]] (2023) * [[శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం]] (2023) * [[శాసనదర్శి: శ్రీ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి శతజయంత్యుత్సవ సంచిక]] (2023) * [[పటం కతలు]] o9o2bki97291v5s02x6hus2kvsd9cdy 551998 551997 2026-04-08T05:42:26Z Rajasekhar1961 50 /* రచనలు */ 551998 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = మామిడి |అసలుపేరు = హరికృష్ణ |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = మామిడి హరికృష్ణ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[తెలుగు కార్టున్ (తెలుగు భాషపై కార్టూన్‌ల సంకలనం)]] (2017) * [[తెలంగాణ తేజోమూర్తులు]] (2017) * [[తెలంగాణ రుచులు]] (2019) * [[గోల్కొండ చరిత్ర]] (2022) * [[తెలంగాణ గిరిజనుల సంస్కృతి]] (2023) * [[మిత అయ్యల్‌వార్లు (భాష, సాహిత్యం, సామాజికత, సంస్కృతి)]] (2023) * [[శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం]] (2023) * [[శాసనదర్శి: శ్రీ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి శతజయంత్యుత్సవ సంచిక]] (2023) * [[పటం కతలు]] byx1n3oy8ddr9p0f0vfzqeyrzx8e5f3 552000 551998 2026-04-08T05:44:35Z Rajasekhar1961 50 /* రచనలు */ 552000 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = మామిడి |అసలుపేరు = హరికృష్ణ |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = మామిడి హరికృష్ణ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[తెలుగు కార్టున్ (తెలుగు భాషపై కార్టూన్‌ల సంకలనం)]] (2017) * [[తెలంగాణ తేజోమూర్తులు]] (2017) * [[పటం కతలు]] (2017) * [[తెలంగాణ రుచులు]] (2019) * [[గోల్కొండ చరిత్ర]] (2022) * [[తెలంగాణ గిరిజనుల సంస్కృతి]] (2023) * [[మిత అయ్యల్‌వార్లు (భాష, సాహిత్యం, సామాజికత, సంస్కృతి)]] (2023) * [[శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం]] (2023) * [[శాసనదర్శి: శ్రీ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి శతజయంత్యుత్సవ సంచిక]] (2023) t4jeojac1bwqpzyvko3lg66k8bmchvy పుట:తెలుగు కార్టున్.pdf/43 104 207124 552046 540913 2026-04-08T11:07:53Z Rajasekhar1961 50 552046 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>[[File:తెలుగు కార్టున్ (page 43A crop).jpg|thumb|300px|center]] {{Css image crop |Image = తెలుగు_కార్టున్.pdf |Page = 43 |bSize = 467 |cWidth = 359 |cHeight = 252 |oTop = 305 |oLeft = 63 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> lkkkl0m5pw639dda6l2se6w60vjlqjs 552047 552046 2026-04-08T11:08:28Z Rajasekhar1961 50 552047 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>[[File:తెలుగు కార్టున్ (page 43A crop).jpg|thumb|300px|center]] [[File:తెలుగు కార్టున్ (page 43B crop).jpg|thumb|300px|center]]<noinclude><references/></noinclude> h0fqawt672qmzunca4w7bhhnukit6pj పుట:తెలుగు కార్టున్.pdf/45 104 207126 552049 541025 2026-04-08T11:10:58Z Rajasekhar1961 50 552049 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>[[File:తెలుగు కార్టున్ (page 45 crop).jpg|thumb|300px|centre]]<noinclude><references/></noinclude> bh34dbhdm9ufpgiaw4jpk5mx5golxs7 552050 552049 2026-04-08T11:11:22Z Rajasekhar1961 50 552050 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>[[File:తెలుగు కార్టున్ (page 45 crop).jpg|thumb|500px|centre]]<noinclude><references/></noinclude> lcfhbnqylujwbpo6w4a1rnqf8qc9n1w 552051 552050 2026-04-08T11:12:10Z Rajasekhar1961 50 552051 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude> [[File:తెలుగు కార్టున్ (page 45 crop).jpg|thumb|600px|centre]]<noinclude><references/></noinclude> h4ioizynkc6y9ykqpc6b5px4j14h7nd పుట:తెలుగు కార్టున్.pdf/61 104 207152 552054 540943 2026-04-08T11:20:25Z Rajasekhar1961 50 552054 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> [[File:తెలుగు కార్టున్ (page 61A crop).jpg|thumb|300px|centre]] {{Css image crop |Image = తెలుగు_కార్టున్.pdf |Page = 61 |bSize = 467 |cWidth = 404 |cHeight = 254 |oTop = 297 |oLeft = 38 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 8n49uelv2ctne4iv7nr5ysiu5tcs3bx పుట:తెలుగు కార్టున్.pdf/63 104 207155 552056 540946 2026-04-08T11:23:03Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 552056 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude> [[File:తెలుగు కార్టున్ (page 63 crop).jpg|thumb|500px|center]]<noinclude><references/></noinclude> fpig68b4tfjssoh6rhcoa0a6qodgfir సూచిక:పటం కతలు.pdf 106 209619 551999 551441 2026-04-08T05:43:51Z Rajasekhar1961 50 551999 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=పటం కతలు |భాష=te |సంపుటి= |రచయిత= |అనువాదకులు= |ఎడిటర్=[[రచయిత:మామిడి హరికృష్ణ]] |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా=2017 |సంవత్సరం= |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} plq9isn7wq77m6oncmevgi22r2cpl3q పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/150 104 211328 551933 551919 2026-04-07T15:25:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551933 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''38. దేవులపల్లి వెంకటేశ్వరరావు '''</p>}} {{right|- డా॥ యస్. జతిన్ కుమార్}} లంగాణ ప్రజల సాయుధ పోరాట అగ్రనేతగా, భారత జనతా ప్రజాతంత్ర విప్లవ పంథా రూపకర్తగా, పీడితజన హృదయనేతగా, అశేష శేముషీ దురంధరునిగా, దిగ్ధశాంత కీర్తి కాంతులు వెదజల్లిన వైతాళికమూర్తి, స్ఫూర్తి ప్రదాత శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావుగారు. ప్రపంచ ప్రజల విప్లవోద్యమ ప్రస్థానంలో ఒక మహెూజ్వల ఘట్టంగా గుర్తింపు పొందినది. 1946-1951 మధ్య సాగిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం, ఆ పోరాట స్రష్టగా, ఆ చరిత్ర రచయితగా, విప్లవ తాత్వికునిగా దార్శనికునిగా అనేక రచనలు చేసి, భారత విప్లవకారులు సమైక్యతకోసం శూద్రబద్ధ వైఖరులను రూపొందించిన ద్రష్ట శ్రీ దేవులపల్లి, వ్యవసాయ విప్లవ పురోగమనం కోసం గ్రామీణ పేదలను సంఘటితం చేస్తూ, అకుంఠిత దీక్ష, మహోన్నత నైతిక విలువలు, అపురూపమైన త్యాగశీలత ముప్పేటగా కలిసి సాగిన అత్యంత అరుదైన విప్లవ విరాటమూర్తి కామ్రేడ్ దేవులపల్లి. 17 సంవత్సరాలపాటు అజ్ఞాత రహస్య జీవితము, 5 సంవత్సరాల జైలు జీవితము అనుభవించిన మొక్కవోని దీక్షతో జీవితమంతా విప్లవకారునిగానే జీవించినవాడు. తెలంగాణా వీర పుత్రులలో మొదటిగా ఎన్నదగినవాడు కామ్రేడ్ డివి. నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకాలోని బండమీది చందుపట్ల ఆయన స్వగ్రామం. ఆయన జన్మించినది వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి గ్రామంలో (మాతామహుల ఇంట) 1917 జూన్ మొదటి తారీఖున. అంటే ఈ వేళకు సరిగ్గా వంద సంవత్సరాల క్రితం. ఇది ఆయన శతజయంతి వేళ. ఆయన తండ్రి దేవులపల్లి వరదరావు, తల్లి శ్రీమతి గోపమ్మ. ఒక స్థాయి సంపన్న కుటుంబమే. ప్రాథమిక విద్య నామవరం, తిరుమలగిరి గ్రామాల్లో, మాధ్యమిక విద్య సూర్యాపేటలో, ఉన్నత పాఠశాల విద్య ఖమ్మంలో సాగింది. వరంగల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని, కళాశాల విద్య కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం చేరుకున్నారు. బి.ఎ. చదువుతుండగానే ఆరోజుల్లో సాగిన వందేమాతరం సమ్మెలో పాల్గొనడంతో కాలేజీ నుంచి బహిష్కరింప బడ్డారు. అనేక విద్యాలయాలలో ప్రయత్నించి చివరకు జబల్పూర్ ఆర్ట్స్ కాలేజిలో డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీ చదువుతుండగానే 1937(9)లలో ఆయనకు శ్రీరంగమ్మ గారితో వివాహం జరిగింది. ఇక్కడో ముఖ్యమైన విషయం ఉందికూడా. దేవులపల్లికి చాలా చిన్నతనంలోనే ఒకపరి వివాహం జరిగింది. కొద్ది రోజులలోనే ఆ అమ్మాయి జగన్మోహిని టైఫాయిడ్ జ్వరంతో మరణించింది. అలాగే శ్రీరంగమ్మ గారికి కూడా 5వ సంవత్సరంలోనే వివాహం జరిగింది. అతను<noinclude><references/> {{rh|తెలంగాణ|129| తేజోమూర్తులు }}</noinclude> cldtabm0lzgy4lllgsyu9nbng5um62w పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/151 104 211329 551934 551152 2026-04-07T15:34:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551934 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> సంవత్సరం తిరగకముందే చనిపోయాడు. తనలాగే బాల్యంలోనే వివాహం జరిగి భర్తను కోల్పోయిన స్త్రీని పెండ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో డివి తన తల్లిదండ్రులను, బంధువులను వ్యతిరేకించి శ్రీరంగమ్మ గారిని వివాహమాడారు. వీరికి 1942లో కూతురు క్రాంతి, 1945లో కుమారుడు రుక్మారావు జన్మించారు. ఈ పిల్లల బాధ్యత, చదువు సంధ్యలు, కుటుంబ వ్యవహారాలు, పంటలు, కౌళ్ళు వంటి సమస్యలనేకాక, దీర్ఘకాలం దాంపత్యంలో ఎడబాటు, భర్త యోగక్షేమాల గురించి కనీస సమాచారం. లేని ఆందోళనలు, మధ్యమధ్య పోలీసు దాడులు వంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొని కూడా శ్రీరంగమ్మగారు తన భర్త రాజకీయ జీవితానికి అనేక విధాలుగా సహకరించారు. "వారు నాకొక స్వతంత్రమైన జీవితాన్ని సృష్టించి, సమాజంలో నేనొక వ్యక్తిగా జీవించడానికి తోడ్పడినారు. అని ఆవిడ తన జ్ఞాపకాలలో రాసుకోవడం డివి గారి వ్యక్తిత్వాన్ని మనకు తెలియజెప్పుతుంది. విద్యార్థి జీవితంలోనే ఆయన భవిష్యత్ రాజకీయ జీవితం మొగ్గ తొడగసాగింది. ఖమ్మం హైస్కూలు విద్యార్ధిగానే ఆయన అక్కడ జరిగిన మూడు ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నారు. ఉస్మానియాలో వందేమాతరం సమ్మె అందరూ ఎరిగినదే. బి.ఎ. చదువుతుండగానే జాతీయోద్యమ పరిచయం, కొందరు ప్రముఖ నాయకులను కలుసుకునే అవకాశం లభించింది. సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలంతోను, ఆ సాహిత్యంతోను ఎరుక ఏర్పడింది. (పరిచయ మన అన్ని భావజాలాలు, ఆర్య సమాజ్ వంటి సాంఘిక ఉద్యమాలు, స్వాతంత్య్ర పోరాటాలు ఆయనమీద అంతో యింతో ప్రభావం చూపినా). ఆయన కుశాగ్రబుద్ధితో ఆయా ఉద్యమాల పరిమితులను, లోటుపాట్లను ఆదిలోనే గ్రహించి మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను అభిమానించారు. ప్రజల విముక్తికి, దేశ అభ్యున్నతికి కమ్యూనిస్ట్ వ్యవస్థ నిర్మాణమే మార్గమని నిశ్చయించుకున్నారు. అదే తన జీవిత గమ్యంగా ఎంచుకున్నారు. 1939లో ఆయనకు ఆనాటి కమ్యూనిస్టు పార్టీతో అనుబందం ఏర్పడింది. అప్పటికాపార్టీ నిషేదంలో వుంది. సంస్థానంలో కమ్యూనిస్పార్టీ కార్య కలాపాలు సాగించడమంటే ప్రాణత్యాగానికి సిద్ధపడటమే. అనేక విపత్ కార్యాలను తలకెత్తుకోవడమే. అయినా ఆ కంటకావృతమైన మార్గాన్ని దేవులపల్లి ఎన్నుకొని, ఇక తన జీవితం ఆఖరి క్షణాలవరకు కమ్యూనిస్టు విప్లవకారుడిగానే జీవించారు. 12 జూలై 1984న అసువులు బాసేవరకు కమ్యూనిస్టు పదానికున్న నిజమైన అర్థాన్ని దృఢంగా ఆచరించి చూపారు. కమ్యూనిస్టు ఉద్యమ అగ్రేసర పుత్రునిగా మిగిలిపోయారు. (నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ విప్లవ ప్రయాణంలో ఎనలేని అనుభవాలు, ఎదుర్కొన్న అటుపోట్లు, తవ్వితీసిన గుణపాఠాలు, ఔదార్యందాల్చిన విప్లవ దీపాల కాంతి పుంజాలు ఎన్నో... దేశంలో చరిత్రగమనంలో ఏర్పడుతున్న అనేకానేక మార్పులను సాఫల్యంగా, సమీక్షించుకుంటూ తన విప్లవ చైతన్యాన్ని పదునుపెడుతూ భారత ప్రజలకో దిశానిర్దేశం చేసిన దార్శనికత ఎంతో... మాటల్లో చెప్పలేము.) 1940-50 దశాబ్దంలో తెలంగాణా సమాజంలో అట్టుడుకుతున్న వెట్టి వ్యతిరేక, భూస్వామ్య దోపిడీ వ్యతిరేక భావజాలాన్నంతా వొడిసిపట్టి, రైతుల భూదాహాన్ని పసిగట్టి సాయుధ పోరాట సన్నాహక కృషిని చేశారు. 46-51 మధ్య కాలంలో రైతాంగ ఉద్యమం సాయుధమై విస్తరించగా తాను నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శిగా, ప్రజలనుంచి నేర్చుకుంటూ, ప్రజలకు నేర్పుతూ వర్గపోరాటాన్ని అభివృద్ధి చేశారు. (ఆనాటి పార్టీ, కేంద్రకమిటీల విధానాలలోని వర్గసంకర రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ) తన క్షేత్రస్థాయి అనుభవాలతో, నిశితమైన రాజకీయ పరిజ్ఞానంతో తెలంగాణాలో పార్టీని సరిఅయిన దిశలో నడిపిస్తూ, తెలంగాణా మహోద్యమ చరిత్రకు ప్రాణం పోశారు. (మితవాద, అతివాద, అవకాశవాద రాజకీయాలనుతృణీకరిస్తూ, తెలంగాణాలో పార్టీ ఏర్పాటు, ఉద్యమ పరిణామ క్రమంలో సాయుధపోరాట నిర్వహణ, నెహ్రూ సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడం, పోరాటాన్ని విరమించాలనే తప్పుడు ధోరణులను వ్యతిరేకించడం వంటి సందర్భాల్లో) ఆయన గొప్ప నాయకత్వ పాత్రను నిర్వహించారు. భారత విప్లవానికి భూమి పంపక కార్యక్రమం జోడించడం, దున్నే వానికే భూమిని కేంద్ర నినాదంగా చేయడం, వలంటీరు దళాలను నిర్మించడానికి, అవి గుతుపల సంఘాలుగా నిలబడటానికి, గ్రామ రక్షక<noinclude><references/> {{rh|తెలంగాణ|130| తేజోమూర్తులు }}</noinclude> 5b0sx8cxdqv2j36akjctpkerqg5seuw పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/152 104 211330 551935 551153 2026-04-07T15:44:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551935 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> దళాల ఏర్పాటు, గ్రామ పంచాయితీలు, గ్రామ రాజ్యాల ఏర్పాటు వంటి కార్యక్రమాలకు శ్రీదేవులపల్లి ఆలోచనలే మూలం. దేవరుప్పుల గ్రామంలో వాలంటీరు దళం ఏర్పాటు చేసింది ఆయనే. 1946లోనే భూమి పంపకాన్ని చేపట్టిన ఆద్యుడు ఆయనే. తెలంగాణా సాయుధ పోరాటాన్ని అభివృద్ధి చేసి నడిపించడంలో ఆయన చూపిన చొరవ, ఎరుక, కృషి, బహుముఖమైన ఆయన పాత్ర తగినంతగా గుర్తింపు పొందలేదు. (చివరకు ఆయన రాసిన ఆ పోరాట చరిత్రలో కూడా, చారిత్రక క్రమంలో ఆయా ఉద్యమ ఘట్టాలను, ఘటనలను, వర్ణించారు. విశ్లేషించారు తప్ప పార్టీ నిర్మాణం. ఉద్యమ నిర్మాణం మిలటరీ నిర్మాణం వంటి అంశాలలో కర్ణధారిత్వం వహించిన తన పాత్రను చాలా కొద్దిగానే ప్రస్తావించారు. అయితే చరిత్రను లిఖించే పద్ధతికి ఆయన పుస్తకం ఒక వరవడిని సృష్టించింది). సాయుధ పోరాట విరమణ తర్వాత 1951 నుండి 1968 వరకు నల్లగొండ పార్లమెంటరీ సభ్యునిగా వ్యవహరించారు. ఆ పని ఎంత నిక్కచ్చిగా చేసేవారంటే తన భార్య పిల్లలను కనీసం ఒక్కసారికూడా ఢిల్లీ తీసుకువెళ్ళలేదాయన. ఆ ఛార్జీ డబ్బులతో పార్టీ కార్యకర్తలకు ఏవైన సదుపాయాలు కల్పించవచ్చని ఆలోచించేవారు. ఒకానొక సందర్భంలో ఆయనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు ఆఫీసర్లు వారు నివసిస్తున్న చోటుచూసి డి.వి. గారు యం.పి.గా వుండటమేమిటి? ఈ పాకలో నివసించడం ఏమిటి? అని ఆశ్చర్యానికి లోనయ్యారు (అంతటి నిరాడంబరం, అంత నిజాయితీ, ఆ కర్తవ్య పరాయణత్వం, బాధ్యతాయుత ప్రవర్తన గల నాయకులు కంచు కాగడావేసి వెతికినా కనిపించరు కదా!) అయితే ఆ పార్లమెంటరీ పంథాతో ఆయన రాజీపడలేదు. నల్లగొండ జిల్లా కార్యదర్శిగానూ, 1948 నుండి రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యునిగానూ, ఆతర్వాత కేంద్ర కమిటీ సభ్యునిగానూ, జాతీయ సమితి సభ్యుడిగానూ వ్యవహరించారు. అనేక అంతర్గత పార్టీ పోరాటాలు చేస్తూ వచ్చారు. 1968లో సి.పి.యం. నుండి బయటకు వచ్చారు. 1968-69 కాలంలో 'పోరాట ఉద్యమానికి పునాదులు వేయండి' అనే తక్షణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నక్సల్బరీ మేఘ ఘర్జనను, శ్రీకాకుళం గిరిజన పోరాటాలను నిశితంగా పరిశీలించి తన తెలంగాణా పోరాట అనుభవాలతో (మితవాద, అతివాద ధోరణులకు వ్యతిరేక కేంద్రంగా) సరిఅయిన విప్లవ శిబిరంగా తన ఆలోచనలు విస్తరింపజేస్తూ కామ్రేడ్ నాగిరెడ్డిగారితో కలిసి 1975లో కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం స్థాపించారు. ఆ సంస్థ కేంద్ర కమిటీ కార్యదర్శిగా చివరంటా తన విప్లవ కృషి కొనసాగించారు. ప్రొలిటేరియన్ లైన్, సంకేతం పత్రికల ద్వారా విప్లవ జర్నలిజానికి తలమానిక మనదగ్గ అనేక వ్యాసాలు ప్రచురించారు. (భారత దేశ అభ్యున్నతికి ప్రత్యేకించి తెలంగాణా ప్రాంత అభివృద్ధికి విలువైన సూచనలు చేశారు. తక్షణ అవసరాలు, కరువు పరిస్థితులు, అభివృద్ధిలోని అసమానతలు, ప్రాంతీయ అవసరాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు, సమగ్ర అభివృద్ధిలో ఆయా ప్రాంతాల సమతూకం వంటి అంశాలు ప్రాతిపదికగా తెలుగుజాతి ఐక్యతను కోరుకున్నారు.) అయితే పాలకవర్గాలు తమ అధికార ప్రాబల్యం కోసం, తమ వర్గ స్వార్ధ ప్రయోజనాల కోసం పని చేస్తాయని, కనుక ప్రజాసమూహాల మధ్య, ప్రాంతాల మధ్య వివక్ష, అసమానతలను పెంచిపోషిస్తారు. తప్ప వీరు తెలుగు జాతి ఐక్యతను సాధించలేరని ఘంటాపథంగా చెప్పారు. ఏవిధంగా 'సమైక్యత ప్రజా సమస్యలను దూరం చేయలేదో అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రాలు కూడా ప్రజల మౌలిక సమస్యలు తీర్చలేవని భావించారు. ప్రజా ఉద్యమకారులు పాలక వర్గాలు విసిరే ఎలాంటి వలలోనూ చిక్కుకోకుండా మౌలిక సమస్యలు పరిష్కరించే తమ విప్లవ కార్యాచరణలో నిమగ్నం కావాలని తీవ్రంగా తపన పడేవారు. ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధి ప్రాంత అభివృద్ధికి సంకేతమనీ, ఏదో కొందరు భూస్వాములు, కొందరు ఫ్యాక్టరీ యజమానులు, ధనవంతుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదని నిక్కచ్చిగా వక్కాణించారు). తన విప్లవకర, ఉత్తేజకర జీవితంలో అనేకమార్లు నిర్బంధానికి గురి అయ్యారు. ఆనాటి నిజాం ప్రభుత్వం ముండ్రాయి లంబాడీ రైతాంగపు పోరాట సందర్భంగా ఈయనపై తొలికేసు నమోదు చేసింది. తెలంగాణా పోరాట కాలంలో 1946-52 వరకు రహస్య జీవితం గడిపారు. ఎంతటి అజ్ఞాతముంటే అనేక నెలలపాటు భార్యా పిల్లలను చూడలేనంత, పిల్లలు తండ్రిని గుర్తుపట్టలేనంత, తల్లి, అత్తా మరణించినా అక్కడకు వెళ్లలేనంత, కొడుకు వివాహం కూడా<noinclude><references/> {{rh|తెలంగాణ|131| తేజోమూర్తులు }}</noinclude> fqyop94y4ngpa1h2804js8z7857l57i పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/153 104 211331 551936 551154 2026-04-07T15:49:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551936 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> చూడలేనంత.. అజ్ఞాతం, కానీ ప్రజా ఉద్యమాలకు ప్రతిక్షణం నాయకత్వం వహించే కార్యాచరణ కొనసాగించడం, ఇక బహిరంగ జీవితంలో ఉన్నప్పుడు భారత-చైనా యుద్ధ సమయంలో 1962 నవంబరు నుండి 1963 జులై వరకు, పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా 1964 డిసెంబరు నుండి 1966 మే వరకు జైలు జీవితం. హైదరాబాద్ కుట్రకేసు సందర్భంగా 1969 డిసెంబరు నుండి 1972 మే వరకు జైలు జీవితమే. ఆతర్వాత 1975 జూన్లో అత్యయిక స్థితి విధించేవరకు కఠినమైన బెయిలు జీవితం అది ఎక్కువగా గృహానికే పరిమితమైన సందర్భం. ఆయన బహుశా కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడిపింది, మనవళ్ళతో ఆడుకున్నదీ, ఆప్యాయతలు పంచుకున్నదీ ఈ బెయిలు సందర్భంగానే అనుకుంటా. ఎమర్జెన్సీ ప్రకటనతో తిరిగి రహస్య జీవితమే. నిజాం రాజరికం నుండి భారత ప్రభుత్వం వరకు ఎన్ని పార్టీలు, ప్రభుత్వాలు మారినా ఆయనపై రాజ్యం చేసిన "దాడి” మారలేదు. అలాగే అనేకమంది ఇతర నాయకులు. పాలకుల పట్ల భ్రమలతో కొట్టుకు పోతున్నా ఆయన విప్లవదీక్ష, దృఢచిత్తం, ప్రజాఉద్యమాల పట్ల అంకితభావం ఇసుమంతయినా సడలలేదు. మాజీ పార్లమెంటు సభ్యునిగా అందే పెన్షను తీసుకోవడానికి కూడా నిరాకరించిన ఉదాత్తా ప్రజానేత ఆయన. (ప్రజలమధ్య, ప్రాంతాలమధ్య, రాష్ట్రాల మధ్య, పొరుగుదేశాల మధ్య వివక్ష, దోపిడీ, పెత్తందారీ తనంలేని ఒక స్వతంత్ర ప్రజాతంత్ర వైఖరిని ఆయన ప్రతిపాదించారు.) ప్రజలను దుర్భర దారిద్య్రంలోకి ఈడుస్తున్న భూస్వామ్య దోపిడి లేని రాజ్యాన్ని, దేశ ఆర్థిక జీవనాడులను పీల్చిపిప్పి చేస్తున్న సామ్రాజ్యవాద దోపిడీలేని దేశాన్ని, ప్రజల జవసత్వాలను, శ్రమశక్తిని తమ సంపదలుగా కూడబెట్టుకుంటున్న పెట్టుబడిదారులు లేని సుభిక్షమైన భారతదేశాన్ని ఆయన కోరుకున్నారు. దాని కోసమై ఉద్యమించారు. విప్లవపార్టీని నిర్మించారు. కార్యకర్తలను తయారు జేశారు. ఒక రచయితగా, తాత్వికునిగా సంఘ సంస్కరణాభిలాషిగా, ప్రజా సాంస్కృతికోద్యమ దిక్సూచిగా, దోపిడీ వర్గ విధ్వంసకు నిగా నూతన యుగావిష్కరణ కోసం విప్లవించారు. విప్లవం కోసమే జీవించారు. ప్రజాయుద్ధ వైతాళికునిగా, ఒక నూతన తెలంగాణ సమాజాన్ని, ఒక నూతన భారత దేశాన్ని స్వప్నించి, కృషిచేసిన అగ్ర నాయకునికి శతజయంతి సందర్భంగా వినమ్రంగా అరుణారుణ జోహార్లు.<noinclude><references/> {{rh|తెలంగాణ|132| తేజోమూర్తులు }}</noinclude> 1exphuw7unewtxguoh831f9ygv0kndw పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/154 104 211332 551937 551155 2026-04-07T16:04:16Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551937 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''39. ధవళా శ్రీనివాసరావు '''</p>}} {{right|-పున్న అంజయ్య}} సాహితీ ప్రపంచంలో కొందరు కవిత్వాన్ని కాలక్షేపం కోసం రాస్తే మరికొందరు సమకాలీన సమాజ పరిస్థితుల ప్రాబల్యంతో అనేక వత్తిడులకు లోనైనప్పుడు రాస్తారు. ఇందులో రెండవ కోవకు చెందిన వారు ధవళా శ్రీనివాసరావు. వీరు నల్లగొండ జిల్లా చండూరు మండలం లోని కోటయ్యగూడెం గ్రామంలో 1918 కాళయుక్తినామ సంవత్సరంలో మాఘ బహుళ ఏకాదశినాడు జన్మించారు. చందూరు సాహితీమేఖలకు పట్టుగొమ్మలైన వారిలో వీరొకరు. ఈ సంస్థకు వీరు ప్రధాన కార్యదర్శిగానే కాకుండా ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యకర్తల్లో ముఖ్యులు కూడాను. ఈ కవి తమ గురువులైన అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి వద్ద ఆంగ్ల సాహిత్యం నేర్చుకొని గోల్డ్ స్మిత్, వర్డ్స్ వర్త్, కిట్స్, షెల్లీ వంటి ఆంగ్లకవుల కావ్యాలను చదివి ఉత్తమ రచనకు, ఉపన్యాసానికి కావలసిన కళాదృష్టిని, భాషా పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వీరికి తులనాత్మక పరిశీలనయందు మక్కువ ఎక్కువ. ప్రాచీన పద్ధతిలో ఛందోబద్ధ కవితలను, నవీన ఫక్కీలో మాత్రా ఛందస్సున గేయాలను సమానంగా రాశారు. నిజాం పరిపాలనలో కొన్ని వాస్తవాలను గేయరూపంలో రూపకల్పన చేసి గళంవిప్పి వాటికి జీవం పోశారు. ఆనాడు దాశరథి అగ్నిధార ఐతే ధవళశ్రీ అమృతధార అనేవారు. 1946లో దేశమంతటా చెలరేగిన మత కలహాలనూ, కరువు కాటకాలనూ దృష్టిలో ఉంచుకొని ఈ కవి పడిన ఆవేదన "ఏమి వ్రాయాలి? నేనేమి వ్రాయాలి?" అన్న గేయం వెలువడ్డానికి మూలమయింది. <poem> ఏమి వ్రాయాలి? నేనేమి వ్రాయాలె? నా ఇంటినడుమనే పెను మంటలేరేగ నా తమ్ములే విలయ నాట్యాలు సేయగా నా కూనలీనాడు బాకులకు బలిగాగ నాడు చెల్లెండ్ర మర్యాద దోపిడి సాగ నాతల్లి గుండియలు కోతలు పడ్డాక ౹౹ ఏమి ౹౹</poem> తెలుగు భాషకు అంధయుగం అయిన నిజాం పాలనలో తెలుగు వేషభాషలను కాపాడేందుకు జరిగిన ఉద్యమాలు ఏ జాతి నిర్వహించిన స్వాతంత్ర్యోద్యమాల కంటే ఏ మాత్రం తక్కువవి కావు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావులాంటి వారు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఐతే నల్లగొండ జిల్లాలో మాత్రం ఈ ఉద్యమానికి బీజం వేసినవారు పులిజాల హనుమంతరావు. వీరు<noinclude><references/> {{rh|తెలంగాణ|133| తేజోమూర్తులు }}</noinclude> m803ah9layuxlj3c4ula0lz7amhozi5 పుట:పటం కతలు.pdf/32 104 211586 551986 551715 2026-04-08T05:32:01Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551986 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||15}}</noinclude> తింటారు. కల్లు, సారా త్రాగుతారు. పటం వేసినందుకు ఇచ్చే మిగతా డబ్బులను ముట్టజెప్పి అదేరోజు లేదా తెల్లారి పొద్దున కథకులు తమ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. పటాన్ని చుట్టగా చుట్టడానికి వీలుగా రెండు చివర్లలో రెండు కట్టెలు అమర్చుతారు. కంక కట్టెలు, చేవబారిన తునికి, జిట్రేగి కర్రలను పటం చుట్టడానికి వాడతారు. పటాన్ని క్రమపద్ధతిలో చుట్టి నకాశీ వాళ్లు పటం పట్టుకొని నకాశీవారి ఇంటి గలుము దాటిన తర్వాత కథకుల భుజంపై పటం పెట్టి కొద్ది దూరం వరకు సాగనంపి వస్తారు. కథకులు పటం ఎత్తుకొని తమ ఊరికి వెళతారు. నకాశీ వాళ్లు ఇంటివద్ద కూడా దిష్టి కుంభం పోసిన తర్వాతనే పూజా కార్యక్రమాలను ఏనూటి, డక్కలి, మాసయ్య కళాకారులు చేస్తారు. ఇక్కడ దిష్టికుంభం "పోస్తేనే పటం వేసిన నకాశీ వారికి, వేయించుకున్న కళాకారులకు బరఖత్" ఉంటుందనే నమ్మకం కలదు. '''పటచిత్ర రచన - సమయ పాలన ''' ఒక పటం గీయడానికి ఆరు నెలల నుంచి యాడాది వరకు పడుతుంది. డక్కలి, గౌడజెట్టీలు, ఏనూటి, కాకిపడిగెల వారికి సంబంధించిన కథ, బొమ్మలు ఎక్కువగా ఉండటం వలన ఈ పటాలు గీయడానికి ఎక్కువ సమయం పడుతుంది. మిగతా పటాల కథలు చిన్నగా ఉంటుంన్నందున మూడు నుంచి ఆరు నెలల వరకు పడుతుంది. ఎండాకాలంలోనే పటాలు గీసే పని ఎక్కువగా జరుగుతుంది. మిగతా కాలాల్లో తేమ ఉండటం వలన కొంచెం ఆలస్యం అవుతుంది. '''ప్రతిఫలం ''' పటం గీయడానికి ముందే డబ్బులు ఎంత ఇవ్వాలనే విషయం మాట్లాడుకుంటారు.డబ్బుల నిర్ణయం జరిగిన తర్వాతనే కళాకారులు 'బయానగా' కొంత డబ్బులు ఇచ్చి పటం రాయమని చెపుతారు. పటం అంతా రాయడం పూర్తి అయిన తరువాత మిగిలిన డబ్బులిచ్చి దీవనార్తి పెట్టించుకొని పటం తీసుకుపోతారు. పూర్వకాలంలో ఒక పటం గీయడానికి ఐదు వందల నుండి వేయి రూపాయల వరకు తీసుకునేవారు. పది, పదిహేనేండ్ల క్రితం పటానికి పదివేలు తీసుకునేవారు.<noinclude><references/></noinclude> 9cjn9gi132sa7xxte2lkqknc3kz8n12 పుట:పటం కతలు.pdf/33 104 211587 551988 551716 2026-04-08T05:35:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551988 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|16||పటం కతలు}}</noinclude> కాని ప్రస్తుతం గజాల లెక్కన తీసుకుంటున్నారు. గజం పటం గీస్తే నూటయాభై రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. దీనివలన ఖర్చు ఎక్కువ అవుతున్నందున కథకులు ఎక్కువ బొమ్మలు రాకుండా, ప్రాధాన్యత ఉన్న కొన్ని బొమ్మలను మాత్రమే గీయించుకుంటున్నారు. పటం గీయడానికి ఖర్చు అధికమవుతున్న దృష్ట్యా చాలామంది కళాకారులు పటం వేయించు కోవడం మానేశారు. పూర్వం వేయించుకున్న పటాన్నే జాగ్రత్తగా భద్రపరుచుకొని వాడుకొను చున్నారు. తమ కులంలో ఒకటో, రెండో పటాలు ఉంటే వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. రోజు రోజుకు పటం చెప్పించేవారు తగ్గుతున్నందున ఎక్కడైన, ఎవరైన కథలు చెప్పమన్నప్పుడు, తమ వద్ద పటం లేకుంటే తమ బంధువుల దగ్గరకు వెళ్ళి పటం కిరాయికి తెచ్చుకుంటున్నారు. ఈవిధంగా కిరాయికి తెచ్చుకునే వీలున్నందున కొత్త పటం వేయించుకోవడం లేదు. ప్రస్తుతం నకాశీ వాళ్ళు కాకిపడిగెలు, ఏనూటి, గౌడజెట్టివాళ్ళకు మాత్రమే ఎక్కువగా పటాలు వేస్తున్నారు. కాకిపడిగెల వారికి ఆదరణ బాగుంటున్నందున వారు కిరాయికి తెచ్చుకోకుండా స్వంతంగా పటం వేయించుకుంటున్నారు. నకాషి నాగేశ్వర్ వద్ద మడేలు పురాణానికి సంబంధించిన నకలు ఉంది. కాని దాని చరిత్ర అతనికి తెలియడం లేదు. అంటే మాసయ్యలు పటం వేసుకోక ఎన్ని రోజులవుతుందో అర్థమవుతుంది. {{right|- డా॥ గడ్డం వెంకన్న}}<noinclude><references/></noinclude> mhzltpfgx77n7sfvgwpwzri4mwyhnre పుట:పటం కతలు.pdf/34 104 211588 551994 551717 2026-04-08T05:39:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551994 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 34 |bSize = 450 |cWidth = 350 |cHeight = 81 |oTop = 44 |oLeft = 47 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''2.ఎ అద్దపు పటం కత '''</p>}} జానపద విజ్ఞానంలో కళలు, సాహిత్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తరతరాల చరిత్రను, ఆచారాన్ని, సంప్రదాయాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించడానికి ఇవి దోహదపడుతున్నాయి. జానపద విజ్ఞానం అంటే సాహిత్యమే అనే దశ నుంచి బహుముఖాంశాల సమాహారం వరకు విస్తరించి ఆ దిశలో అధ్యయనాలు జరుగుతున్నాయి. స్వయం సమృద్ధి కలిగిన గ్రామీణ జీవనాన్ని సుసంపన్నం చేస్తున్న కళలు అగ్రభాగాన నిలిచాయి. ఆయా సమాజాల చేత, సమూహాల చేత ఆదరించబడి, వాటి ఔన్నత్యాన్ని చాటుకుంటూ నిలిచాయి. కళనే వృత్తిగా చేసుకొని తరతరాలుగా ఆ కళల్ని పోషించుకుంటూ వస్తున్న సంప్రదాయ వృత్తికళలు తెలంగాణ అంతటా వ్యాపించి ఉన్నాయి. ఇలా<noinclude><references/></noinclude> poml0d8t98japk5bzgw0de5fi180iom పుట:పటం కతలు.pdf/35 104 211589 551996 551718 2026-04-08T05:40:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 551996 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 35 |bSize = 450 |cWidth = 378 |cHeight = 344 |oTop = 23 |oLeft = 47 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 3xy1xpwrycmo1ftskmj1xlbrnmp1gmo పుట:పటం కతలు.pdf/36 104 211590 552001 551719 2026-04-08T05:45:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552001 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||19}}</noinclude> వ్యాపించి ఉన్న కళలు సుమారు వందకు పైగా ఉన్నాయి. సంప్రదాయ వృత్తి కళారూపాల్లో ఉపకులాలుగా ఉంటూ ఒక సమూహానికి సంబంధించిన చరిత్రను, గొప్పతనాన్ని కథల రూపంలో చెప్పే కళాకారులు తెలంగాణలో సుమారు పది వేలమంది వరకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. భారత, భాగవత, రామాయణ ఇతిహాస ఇతివృత్తంతో కూడి ఉన్న కథలతో పాటు భూమి, ఆకాశం, సృష్టి మూలం ఆవిర్భావ విధానం వీరి కథల్లో వస్తువుగా ఉండటం ప్రత్యేకం. సమూహాలకు సంబంధించిన కథలను కుల పురాణాలుగా, త్యాగం కథలుగా పేర్కొనడం జరుగుతుంది. ఆయా కులాల పుట్టుక నేపథ్యాన్ని ఇందులో వివరిస్తూ సృష్టి ఆరంభం నుంచి కులం ఆవిర్భావం వరకు, కులాల పనివిభజన ప్రతిఫలం, పరస్పర సయోధ్య వరకు ఇందులో చెబుతారు. ఇలా కుల పురాణాల్ని చెప్పే కళాకారులు కేవలం తెలంగాణలోనే ఉన్నారు. అష్టాదశ వర్ణాల్లో సుమారు పదిహేను కులపురాణాలు, చరిత్రలు చెప్పే కళాబృందాలు ఉండటం తెలంగాణ ప్రత్యేకత. ఇంతటి ప్రత్యేకతలు కలిగిన ఒక బృందం గురించి ఒక కులపురాణం గురించిన విషయాలను మనం తెల్సుకోవాలి. నాయి బ్రాహ్మణుల కుల పురాణాన్ని చెప్పే అద్దపు కళాకారుల్ని అద్దపు సింగలు, అద్దపోళ్లు, పటమోల్లని పిలుస్తారు. వీరు తాతముత్తాతల నుంచి తమకు హక్కుగా సంక్రమించిన గ్రామాలను త్యాగానికై వెళ్లి వారితోనే సహజీవనం చేస్తూ.. వారిచ్చిన త్యాగం తీసుకొని కథలు చెప్పి మరో ఊరికి వెళ్లడం వీరి పద్ధతి. త్యాగం పొందటానికై వీరికి హక్కు పత్రంగా రాగిసన్నత్ ఉంటుంది. రాగి శాసనంపై వీరి చరిత్రను, వీరు చెప్పే కథను పేర్కొంటూ వీరికి ప్రధాన కులం అందించాల్సిన త్యాగం గురించి ఈ రాగిసన్నల్లో ఉంటుంది. వీరి కట్టడి కలిగిన గ్రామాలకు త్యాగం వెళ్లే హక్కును ఈ రాగిసన్నత్ సూచిస్తుంది. అద్దపువారు నాయిబ్రాహ్మణ కులపురాణాన్ని పటం ఆధారంగా చెప్పడం వల్ల వీరిని పటమోళ్లు అని పిలుస్తారు. ఈ పురాణాన్ని నాయిబ్రాహ్మణ పురాణమనీ, నాభికా పురాణమనీ, దక్ష యజ్ఞమని పిలుస్తారు. అరవై మూరల పొడవు కలిగిన<noinclude><references/></noinclude> 6y3uw4wip08f8fr704mt91n0wbtxddm పుట:పటం కతలు.pdf/37 104 211591 552005 551720 2026-04-08T05:51:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552005 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|20||పటం కతలు}}</noinclude> పటంపై సృష్టి ఆవిర్భావం నుంచి కలియుగం వరకు కులాలు, వృత్తుల ఏర్పాటు వరకు బొమ్మల రూపంలో చిత్రించిన కథ ఉంటుంది. ఈ కథను ఐదురోజుల పాటు చెబుతారు. కథను కాండాలుగా విభజించి చెప్పడం కులపురాణం ప్రత్యేకత. కథ వెసులుబాటు కొరకు చెప్పినా జానపదులు మేధో సంపదకు తార్కాణంగా కాండాలు నిలుస్తాయి. కులపురాణాలు సాధారణంగా ఐదు కాండాలుగా విభజించి ఉన్నట్లే నాయి బ్రాహ్మణ పురాణం కూడా ఐదు కాండాలుగా ఉంటుంది. అవి : 1. ఆదిపురాణం 2. దక్షయజ్ఞం 3. నాభికా పురాణం 4. కలియుగ నిర్మాణం 5. వృత్తుల ఏర్పాటు. ఆదిపురాణాలు, ఆదిశక్తి ఆవిర్భావం, ఏకోనారాయణుని సృష్టి, త్రిమూర్తుల జననం, పంచభూతాల సృష్టి మొదలైన విషయాలతో కూడిన కథ కొనసాగుతుంది. దక్షయజ్ఞంలో శివుడు దక్షుని గర్వమణచడానికి వీరభద్రుని సృష్టించే కథ ఉంటుంది. నాభికా పురాణంలో త్రిమూర్తులకు సేవ చేయడానికై కల్యాణ భక్తున్ని సృష్టించిన కథ ఉంటుంది. ఈ కల్యాణ భక్తుడే నాయిబ్రాహ్మణుడిగా మారే విధానం వరకు ఈ కాండంలో ఉంటుంది. కలియుగ నిర్మాణమనే నాలుగవ కాండంలో దేవతలు తమకు సేవ చేయడానికై కులాలను ఏర్పరిచి వృత్తులను చేసుకొంటూ జీవనం సాగించే విధానాన్ని కథగా చెపుతారు. చివరి కాండంలో ఈ వృత్తులు చేసే పనిని వివరిస్తూ ప్రతిఫలం పొందే కథతో ముగుస్తుంది. '''నాయిబ్రాహ్మణ పురాణం - వివరణ ''' ఆదిశక్తి ఆవిర్భవించి ఏకోనారాయణున్ని సృష్టించిన తర్వాత త్రిమూర్తుల జననం, పంచభూతాలు, సూర్య చంద్రాదులు, నక్షత్ర మండలాలు ఏర్పడతాయి. త్రిమూర్తులు కల్యాణ భక్తుడిని సృష్టించారు. తమ వివాహానికై సహాయం చేయడానికి సహాయకుడిగా ఉన్న ఇతనికి భృగు మహర్షి కూతురైన ఋషిపత్నితో వివాహం జరిపిస్తారు. వీరికి కలిగిన సంతానమే ఋషి పాలకుడు, ధనపాలకుడు, అతిపాలకుడు అన్న ముగ్గురు అన్నదమ్ములు.<noinclude><references/></noinclude> q1onedau0kl81wcsuefb2222fcppufx పుట:పటం కతలు.pdf/38 104 211592 552007 551721 2026-04-08T05:55:03Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552007 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||21}}</noinclude> ఇందులో ధనపాలకుడు జగన్నాధపురం కొండపైన నివసిస్తూ విష్ణు సేవకుడిగా ఉండి కొండోజీగా పిలువబడుతాడు. ఋషిపాలకుడు కైలాసంలో శంకరుని వద్ద ఉంది శిరోవేదన తొలగించి శిరిమంగలిగా మారుతాడు. ఇక అటూ, ఇటూ కాకుండా ఉన్న చిన్నవాడైన అతిపాలకుడు అద్దపువాడుగా మారి ఇరువురికి సంబంధించిన కథను కులపురాణం చెప్పేలా నిర్ణయించబడతాడు. ఇది స్థూలంగా నాయిబ్రాహ్మణుల కులపురాణంలో ఉండే కథ. ఈ పురాణంలోనే వీరి పనిముట్ల ఆవిర్భావ కథను కూడా చెపుతారు. కైలాసగిరిలో ఉండే సిరిమంగలి జగన్నాధపురం వచ్చి కొండోజీతో కలిసి చౌరిపాకం, గౌరిపాకం, అన్నపాకం తయారుచేసి విష్ణు, ఈశ్వరులకు నైవేద్యంగా వాడిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. వండిన బాండువానే అనంతరం మంగలి గిన్నెగా మారుతుంది. దీనికి కులమత బేధం ఉండదు. సురాసురులతో జరుగుతున్న బలమోదకుడనే రాక్షసున్ని కల్యాణ భక్తుడు సంహరించి అతని చర్మంతో కలపను, బొక్కలతో కత్తులు, కత్తెరలను, నాలుకతో తీడుబిళ్లలను తయారుచేసిన వృత్తాంతం కథలో ఉంటుంది. ఈ పనిముట్లను బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుల కల్యాణంలో వాడిన కథ కూడా పురాణంలో భాగం. అందుకు వెనుక పదుం, ముందు ముత్తుం, పన్నెండు మలకలపోలు ధాన్యం, ఐదుకట్టల ఆకులు, సవ్వాసేరు పోకలు ప్రతిఫలంగా పొందుతారు. ఇది వీరి హక్కు. కలియుగంలో అలంకృత నామ సంవత్సరంలో అతిపాలకుడు అద్దపువానిగా మారి పార్వతి వరం వల్ల కంచిలో పటం, కాశీలో శాసనం పొందుతాడు. కొండమంగలి, శిరోమంగలి వద్దకు వెళ్లి వారి వంశచరిత్రను పటం మీది బొమ్మల ఆధారంగా చెప్పి శాసనం ద్వారా పొందాల్సిన హక్కును పొందడం అద్దపువారి విధి. ఇది నాయిబ్రాహ్మణ కులపురాణం. త్యాగంగా పొందే హక్కు గ్రామాలకు మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారి వెళ్లి పటం ద్వారా కులపురాణాన్ని చెపుతారు. కులపెద్ద ఇంటివద్ద గానీ, కూడలిలో గానీ ప్రదర్శన ఉంటుంది. ఒకరోజు సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రదర్శన నిడివి ఉంటుంది. ప్రధాన కథకుడు పటం మీది బొమ్మల ఆధారంగా<noinclude><references/></noinclude> mdpq6g153hyxb7o7ktqcee50sch0atg పుట:పటం కతలు.pdf/39 104 211593 552009 551722 2026-04-08T05:58:16Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552009 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|22||పటం కతలు}}</noinclude> కథ చెపుతూ ఉంటే నలుగురు మద్దెల, తాళాలు, హార్మోనియం వాయిస్తూ వంతపాడుతారు. మధ్యమధ్యలో చిత్రకథలతో ప్రదర్శనకు రక్తికట్టిస్తారు. అనుష్ఠాన సమయంలో ప్రేక్షకులు కట్నకానుకలు చదివిస్తారు. ఐదు కాండాలు పూర్తయిన తర్వాత కులం వారి ఇళ్లపై బలిచల్లి బోనం. చేయడంతో కథ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతిఫలంగా ధాన్యం, డబ్బులు పొందుతారు. నాభికాపురాణం చెప్పే కళాకారులు వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరి మండలం పెర్కేడు, జనగాం జిల్లా పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి, దేవరుప్పుల మండలంలోని శింగరాజుపల్లి, కరీంనగర్ జిల్లాలోని విలాస్నగర్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో కొన్ని బృందాలు ఉన్నాయి. మారుతున్న కాలపు పరిస్థితుల ప్రభావం ఈ కళాకారులపై కూడా కనిపిస్తుంది. ఆదరించి, కథలు చెప్పించే సమూహాలు ఆసక్తి కనపరచకపోవడం వల్ల వీరు వృత్తిపై తమ కుటుంబ పోషణ చేయలేక ఇతర వృత్తితో జీవనం కొనసాగించడం తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, సాంస్కృతిక శాఖ అందిస్తున్న చేయూత కళాకారుల్లో కొత్త ఆశలు చిగురిస్తూ తిరిగి తమ పూర్వవైభవాన్ని పొందే దిశగా, ఆశగా ఉన్నారు. {{right|- డా॥ అన్నావఝుల మల్లికార్జున్}}<noinclude><references/></noinclude> hylfm19u2pdtzxl5ppeat352vu7n0k7 పుట:పటం కతలు.pdf/40 104 211594 552010 551723 2026-04-08T06:02:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552010 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 40 |bSize = 450 |cWidth = 351 |cHeight = 89 |oTop = 39 |oLeft = 45 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''2 బి. నాయీ పటం కత '''</p>}} జానపద పురాణాలల్లో విశిష్టమైనదే కాదు తెలంగాణా పటం కథల్లో అపురూపమైంది నాయీ పటం. సూత సంహితలోని 12వ అధ్యాయం ఆరవ సూత్రం ఆధారంగా ఈ నాయీ పటం కథ చెప్పబడుతూ వస్తున్నది. నాయీ వృత్తి కథాంశంతో ముడిపడి ఉంది. శివలీల వినోదంగా ఈ పటం కథ ప్రదర్శితమౌతుంది. వృత్తి పవిత్రమనే భావనతో "క్షుర” వృత్తిని ఉన్నతీకరించడానికి ఈ పురాణ రచన నిర్మితమైంది. దాని సారాంశం ఏమంటే వృత్తి నీచమనే భావన సామాజికుల్లో ఉత్పన్నం కాకుండా చేయడం అనేదే దీని లక్ష్యం.<noinclude><references/></noinclude> ddry05cmljyxwonmn2b21k6lntcxfit పుట:పటం కతలు.pdf/41 104 211595 552011 551724 2026-04-08T06:03:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552011 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 41 |bSize = 450 |cWidth = 386 |cHeight = 353 |oTop = 30 |oLeft = 38 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 8ysh17avuq46w3ucl4hyzvewsgun8vs పుట:పటం కతలు.pdf/42 104 211596 552012 551725 2026-04-08T06:08:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552012 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||25}}</noinclude> తెలంగాణాలోని వృత్తి పురాణ పటం కథాగానాల్లాగానే ఈ నాయీ పటం కథాగానం జానపద కళారూపాల్లో వేల ఏళ్లనుండి మౌఖిక సంప్రదాయంలోనే కొనసాగుతూ వస్తున్నది. క్షౌర వృత్తి ఆవశ్యకతని, కర్మకాండల పట్ల ప్రజల్లో ఉన్నా విశ్వాసాన్ని ఈ నాయీ పురాణం పటం రూపకంగా ప్రదర్శితం చేస్తుంది. '''పటం మాధ్యమం ''' చారిత్రికంగా వృత్తి ప్రాధాన్యాన్ని ఆధారం చేసుకొని నకాశీ కళాకారుల చేత నాయీ పురాణ చిత్రపటం తయారు చేయించడం జరుగుతుంది. నాయీ పురాణాల్లో చారిత్రకంగా నాభికుని జీవితం పూర్వ పురాణాల్లో చెప్పబడుతూ వస్తున్నప్పటికీ హైందవ పురాణాల్లో సుమంగళి మహాముని నాయీ వంశం మూల పురుషునిగా పటం కథ వివరిస్తుంది. తెలంగాణాలోని పట నిర్మాణాలను పోలి మూడన్నర అడుగుల వెదల్పు 36 అడుగుల పొడువున్న ఈ చిత్రపటంలో నాయీ వంశ చరిత్రతో పాటు గౌడ పురాణం కూడా చెప్పబడడం విశేషం. నాయీ పురాణం చెప్పే కళాకారులు వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం, పెరికేడు గ్రామ నివాసి గాదె వెంకట నర్సు ఆయన కొడుకు మల్లేష్ ఒక బృందంగా ఏర్పడి ఈ పురాణాన్ని చెప్పుతూ వస్తున్నారు. వీరికి వరంగల్, కరీంనగర్ తదితర గ్రామాల్లో గల అనేక నాయీ కుటుంబాల వద్ద మీరాశీ హక్కు కింది త్యాగం అడుక్కునే హక్కు ఉంది. తెలంగాణాలో కనిపించే నాయీ చిత్రపటం ఆశ్రిత కులాల అభిరుచితో రెండు రూపాల్లో నకాశీయుల చేత నిర్మితమైనవి కనిపిస్తాయి. గాదె వెంకట నర్సు వేయించిన చిత్రపటంలో కేవలం పౌరాణికమైన కథాంశంతో కూడుకున్నది ఒకటైతే, చారిత్రక ప్రాధాన్యం కలిగింది మరొకటి. ఈ నాయీ పురాణం పటం కథ ఐదు రోజులు చెప్పబడుతుంది. '''కథా వస్తువు ''' ఉత్పత్తి కులాల కథాంశాలన్నీ శివపురాణం నుండే గ్రహించబడుతూ వస్తున్నాయి. ఈ పురాణాల గురించి, వారి వృత్తుల గురించి పాల్కుర్తి సోమనాధుని<noinclude><references/></noinclude> 243vkeai3onnpaajoa6dhx2w7lwv4lj పుట:పటం కతలు.pdf/43 104 211597 552014 551726 2026-04-08T06:13:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552014 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|26||పటం కతలు}}}</noinclude> 'బసవ పురాణం'లోనూ వివరించ బడ్డాయి. నాయీ పురాణానికి సంబంధించి నాయీ చిత్రపటం మాత్రం శివ పురాణంలోని ఇతి వృత్తాన్నీ క్షుర వృత్తి ప్రాధాన్యాన్ని కథాగానం చేయడం కనబడుతున్నది. దీనిలో ఇతిహాస సంఘటనలు నామమాత్రంగా కనిపించినప్పటికి పురాతత్వాన్ని ప్రతిబింబిస్తున్నది. క్షుర వృత్తికి మూల పురుషుడైన కళ్యాణ భక్తుడే. ఆయన భార్యగా పుట్టిన స్త్రీ ఋషికన్య. వీరభద్రుని చెమటలోంచి మడేలు పుట్టినట్టుగానే అగ్నిలో నుంచి ఈ నాభికుడు ఉద్భవించాడు. ఈ నాయీ పురాణం చిత్రపటం కథలో - :ఆదిశక్తి పురాణం, :నాభిక పురాణం, :పార్వతీ పరిణయం, గౌరీ కళ్యాణం లాంటి అధ్యాయాలు రూపొందాయి. వాటితో పాటు క్షుర వృత్తికి సంబంధించి కొండ మంగళి, సిరి మంగళి, వృత్తి మంగళి లాంటి వృత్తి భేదాలు పేర్కొనబడినాయి. ఐతే, మంగళి, వృత్తి మంగళి లాంటి వృత్తి భేదాలు పేర్కొనబడినాయి. ఐతే మంగళ వాయిద్యమైన నాగస్వరం వాయించే వృత్తిని గురించి ఈ పురాణంలో చెప్పబడలేదు. అలాగే ఈ కులవృత్తితో పాటు నాయీ కులస్తులు నిర్వహించుకుంటూ వచ్చిన ధన్వంతరీ వైద్యం గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. '''పౌరాణిక గాథ ''' నాయీ వృత్తి పుట్టుక, నాయీ కులస్థుల ఆశ్రిత కులం అద్దపు కళాకారుల పుట్టుకలను ప్రధానంగా ఈ చిత్రపటం కథాగానంలో వివరించడం జరిగింది. వృత్తి సంస్కృతి నేపథ్యంగా చెప్పబడే ఈ నాయీ బ్రాహ్మణ పురాణం 'పార్వతీ కళ్యాణం' తో ముడిపడి ఉంది. సనాతనులైన ఉమా మహేశ్వరులకు మైలపోలు తీయడం, పోలుపోయడం<noinclude><references/></noinclude> jqhj66vv2s3wyikvp4gl6g8cq3y6g3f 552015 552014 2026-04-08T06:14:08Z A.Murali 3019 552015 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|26||పటం కతలు}}</noinclude> 'బసవ పురాణం'లోనూ వివరించ బడ్డాయి. నాయీ పురాణానికి సంబంధించి నాయీ చిత్రపటం మాత్రం శివ పురాణంలోని ఇతి వృత్తాన్నీ క్షుర వృత్తి ప్రాధాన్యాన్ని కథాగానం చేయడం కనబడుతున్నది. దీనిలో ఇతిహాస సంఘటనలు నామమాత్రంగా కనిపించినప్పటికి పురాతత్వాన్ని ప్రతిబింబిస్తున్నది. క్షుర వృత్తికి మూల పురుషుడైన కళ్యాణ భక్తుడే. ఆయన భార్యగా పుట్టిన స్త్రీ ఋషికన్య. వీరభద్రుని చెమటలోంచి మడేలు పుట్టినట్టుగానే అగ్నిలో నుంచి ఈ నాభికుడు ఉద్భవించాడు. ఈ నాయీ పురాణం చిత్రపటం కథలో - :ఆదిశక్తి పురాణం, :నాభిక పురాణం, :పార్వతీ పరిణయం, గౌరీ కళ్యాణం లాంటి అధ్యాయాలు రూపొందాయి. వాటితో పాటు క్షుర వృత్తికి సంబంధించి కొండ మంగళి, సిరి మంగళి, వృత్తి మంగళి లాంటి వృత్తి భేదాలు పేర్కొనబడినాయి. ఐతే, మంగళి, వృత్తి మంగళి లాంటి వృత్తి భేదాలు పేర్కొనబడినాయి. ఐతే మంగళ వాయిద్యమైన నాగస్వరం వాయించే వృత్తిని గురించి ఈ పురాణంలో చెప్పబడలేదు. అలాగే ఈ కులవృత్తితో పాటు నాయీ కులస్తులు నిర్వహించుకుంటూ వచ్చిన ధన్వంతరీ వైద్యం గురించి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. '''పౌరాణిక గాథ ''' నాయీ వృత్తి పుట్టుక, నాయీ కులస్థుల ఆశ్రిత కులం అద్దపు కళాకారుల పుట్టుకలను ప్రధానంగా ఈ చిత్రపటం కథాగానంలో వివరించడం జరిగింది. వృత్తి సంస్కృతి నేపథ్యంగా చెప్పబడే ఈ నాయీ బ్రాహ్మణ పురాణం 'పార్వతీ కళ్యాణం' తో ముడిపడి ఉంది. సనాతనులైన ఉమా మహేశ్వరులకు మైలపోలు తీయడం, పోలుపోయడం<noinclude><references/></noinclude> 0qf8n1qtcayj2pdkfa8lrgg55qzitli పుట:పటం కతలు.pdf/44 104 211598 552016 551727 2026-04-08T06:18:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552016 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||27}}</noinclude> లాంటి పనులు నిర్వహించడానికి ఒక మనిషి కావాలి. ఈ పవిత్ర బంధాన్ని ముడివేసే పవిత్రుడైన మనిషి ఒకడు ఉద్భవించాలి. పూర్వం మాగాలి వృక్షం క్రింద తపస్సు చేసుకుంటున్న సుమంగళికి త్రిమూర్తులు ప్రత్యక్షమై యజ్ఞం అగ్నిలోనుంచి ఒక బాలుడిని పుట్టించి వరంగా ప్రసాదించారు. అగ్నిలోంచి పుట్టాడు కాబట్టి అతన్ని అంగారకుడు అన్నారు. పార్వతీ కళ్యాణం కోసం జన్మించాడు కాబట్టి ఆయన్ని కళ్యాణ భక్తుడు అన్నారు. ఏ పేరుతో పిలిచినా కూడా ఆయన నాభికుడే. హైందవ మతానుసారం వివాహం ఒక పవిత్ర కార్యం. ఈ వివాహ నిర్వహణలో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు సమానమైన ప్రాధాన్యం ఉంది. వధూవరుల మైలపోలు తీయడానికి సహాయపడే ఒక పనిమనిషి పుట్టాడు. అతను క్షౌరవృత్తి స్వీకరించాలంటే ముందు అతనికి పెళ్లి కావాలి. తగిన జంటగా భృగు మహర్షి కూతురు ఋషికన్యను తెచ్చి త్రిమూర్తులే పెళ్లి చేస్తారు. ఇక వృత్తి పనిముట్లు సేకరించుకోడానికి దారి వారు చూపారు. ఆ సేకరణలో ఎవరైన అడ్డుపడితే వారిని తొలగించుకోడానికి తమ ఆయుధాలను కూడా ఇచ్చారు. ఐతే కళ్యాణ భక్తుని తండ్రి సుమంగళితో వైరం ఉన్నందువల్ల మంచు పర్వతాల్లో నివసించే రాక్షసులు కళ్యాణ భక్తున్ని చంపాలని చూస్తారు. దివ్యాస్త్రాలు ఉన్నందువల్ల రాక్షసులతో యుద్ధం చేసి వారిని చంపి, వారి శరీర భాగాల నుండే కత్తెర, కత్తి దువ్వెన లాంటి పరికరాలను సేకరించుకుంటాడు. ఇక అద్దం కోసం సూర్యున్ని మెప్పించి, ఆయన కిరణాలతో తయారైన అద్దాన్ని వరంగా పొందుతాడు. '''వధువు అంపకం ''' వైవాహిక వ్యవస్థలో వధువు 'అంపకాలు' ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించు కుంటాయి. తల్లిగారింట్లో పుట్టి, పెరిగి, వివాహం తర్వాత అత్తగారింటికి పోయేటప్పుడు తల్లీదండ్రుల మమకారాలు, నూతన వధువుకి బోధించే సూత్రాలు అనేకం కనిపిస్తాయి. కారడివిలో భృగు మహర్షి తపస్సు ఫలించి, ఋషి కన్య వరంగా పుడుతుంది. ఏకైక సంతానంగా జన్మించిన ఋషికన్యను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు.<noinclude><references/></noinclude> 4bn7reoqak6gu9ozhc6x5s4ry3npjhj పుట:పటం కతలు.pdf/45 104 211599 552020 551728 2026-04-08T06:25:25Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552020 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|28||పటం కతలు}}</noinclude> పుట్టిల్లు తల్లితండ్రి ఆప్యాయతలు తప్ప మరొకటి ఎరుగదు ఋషికన్య. అలాంటి ఆమెను కళ్యాణ భక్తునికి ఇచ్చి పెళ్ళిచేసి, అత్తారింటికి పంపించాలని సిద్ధపడతారు. పాణీగ్రహణం కంటే, మంగళ సూత్రధారణ కంటే కూడా వధువుని అత్తారింటికి పంపించే దృశ్యమే హృదయ విదారకంగా ఉంటుంది. వధువు కూడా తల్లిదండ్రుల అంపకంలో చెప్పిన మాటలనే గుర్తు పెట్టుకుని పుట్టింటికి పేరు తెస్తుంది. <poem> "మనిషి నీడని బోలిన మాదిరిగా నీమొగని వెంట నుంట మంచిదమ్మ చింతనాతికి మంచిదమ్మ, మొగడు ఊరిలో, లేనినాడు నాతిలో ముస్తాబుకాకు, అత్త బెట్టి దోసెడో, బొచ్చెదో కానీ ఈసమంత కూడా ముట్టకమ్మ!” వెలది చాలా తప్పు సుమీ!</poem> అంటూ ఆమెకు తల్లిదండ్రులు అంపకంలో బోధచేస్తారు. '''సాహిత్యాంశాలు ''' నాయీ బ్రాహ్మణ పటం కథాగానంలో అద్భుతమైన గేయ సాహిత్యముంది. అవి యక్షగాన దర్వులతో సంబంధించినవి అయినప్పటికీ శ్రామికుల పదజాలమే మనసులను ఉరకులు వేయిస్తున్నది. అక్కడక్కడ కనిపించే సంస్కృత శ్లోకాలు, గ్రాంథిక మాటలు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి. రచయిత సంగీత సాహిత్య సవ్యసాచి అయినందువల్లే ఈ పటం కథాగానం రసప్లావితమైతుంది. రాక్షస సంహారం సందర్భంగా రాక్షసుడు. <poem> "ఇంతవరకు మనపురమున ఏ నరుడూ రాలేదు, ఎంతటి వాడైనను మీకేమి భయము రాబోదు” అంటూ ప్రమాదాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు.</poem><noinclude><references/></noinclude> 65l4ikowgot6cl78tb2u9sm5elmzll8 పుట:పటం కతలు.pdf/46 104 211600 552023 551729 2026-04-08T06:30:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552023 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||29}}</noinclude> అంతేకాదు, <poem> "పట్టి కొట్టండి ఓ, దానవులారా! దొరక పట్టండిరా ఓ దానవులారా! నరున్ని పట్టండిరా ఓదానవులారా!” అంటూ యుద్ధానికి సిద్ధమౌతారు. అప్పుడు నాభికుడు త్రిమూర్తులిచ్చిన ఆయుధాలను వినియోగించుకుంటాడు. 'ఎకీ ఎకేనా కోదండ చక్రము విడిచే దానవుల పైకి విసిరి వేసే కరములు యురములు తునియలైయ్యి లఐలబామొత్తుకొని సచ్చిరి” అంటూ రాక్షసుల చావును కవి వర్ణిస్తాడు. మరి అప్పుడు నాభికుడు.... "కరకు గోర్లతోటి వాన్ని చెండాడి చెందాడి. వాని యొక్క చర్మంను వరుసగా తీసి" దాన్ని పొది (కలప)గా చేసుకున్నాడట. "వాని మొఖమును వడిగా గుద్ది వాని దంతములు ఐదుపుగా పెరికి దునియాలో లేనట్టి దువ్వెన".... చేసుకున్నాడట. "వాని చేతి వేళ్లని విరిచి.... చిమ్మెట” చేసుకున్నాడట. ఈ నాయీ పురాణ పటం కథలోని సాహిత్యంలో వృత్తి ఔన్నత్యం ఎంతుందో కవి అందంగా వర్ణించాడు. "రాజులకింపగు క్షౌరం చేసెడి తేజము మంగలి వినండయ్యా! ఓ సుజనులారా కనుండయ్యా ౹౹రాజా౹౹ అందమైన బంగారు కలపతో సుందరమైన కత్తెర తీసుకు </poem><noinclude><references/></noinclude> 6r8ft2ly1odxjv6rpko8fci1zhvi6ab పుట:పటం కతలు.pdf/47 104 211601 552024 551730 2026-04-08T06:33:23Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552024 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|30||పటం కతలు}}</noinclude> <poem> గడ్డం తడిపే సబ్బు తీసుకొని ఇందు వచ్చితి. వినందయ్యా సుజనులారా నను కనుండయా॥ అంటూ తన గానంతో రస రమ్యం చేశాడు గాయకుడు.</poem> 12వ శతాబ్దంలో వీరశైవ మతం ప్రభావంతో సమాజ అసమానతలను రూపు మాపాలనే ఆశయంతో వచ్చిన సామాజిక ఉద్యమంలో జానపద కళారూపాలపాత్ర ఎనలేనిది. నాయీ లాంటి సేవా కులాలలో సంగీత సాహిత్య నృత్య ఆశ్రిత కళారూపం చిత్రపటం ప్రదర్శితం కావడం ఆనాటి కళా వైభవాన్నే చాటుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్లీ జానపద కళా రూపాలు ప్రాణం పోసుకోవడం శుభ పరిణామం. {{right|- కట్టా ప్రతిభాగౌడ్}}<noinclude><references/></noinclude> 28nlvkrt68bnn1e97qlrdijx92pnfl4 పుట:పటం కతలు.pdf/48 104 211602 552025 551731 2026-04-08T06:38:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552025 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 48 |bSize = 450 |cWidth = 359 |cHeight = 89 |oTop = 36 |oLeft = 36 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''3. ఏనూటి పటం కత '''</p>}} నపద గిరిజన కళారూపాల్లో పటం కథలు ప్రత్యేకమైనవి. తెలంగాణలో మాత్రమే కనిపించే పటం కథల కళాకారులు మౌఖికంగా ప్రచారంలో ఉన్న కులపురాణాలకు నకాశీ చిత్రకారులతో దృశ్యరూపం కల్పించుకొని పండితులకు పామరులకు కథాంశం అర్థమయ్యేలా కథాగానం చేయటం వీరి ప్రత్యేకత. పటం కథలు ప్రదర్శించే ఆయా కళారూపాల్లో అద్దపువారు నాయీబ్రాహ్మణులకు అద్దపు పురాణం, కూనపులివారు పద్మశాలీలకు మార్కండేయ పురాణం, మాసయ్యలకు రజకులకు మడేలు పురాణం, కాకిపడిగెలవారు ముదిరాజ్లకు భారతం కథలు, పెక్కర్లు కుమ్మరి వారికి గుండ బ్రహ్మాయ్య పురాణం, తెరచీరలు, కొమ్ము మరియు మందహెచ్చులవారు యాదయ్యకు కాటమరాజు కథలు, దక్కలివారు మాదిగలకు జాంబపురాణం, గుర్రపువారు మాల కులానికి భేతాళపురాణం,<noinclude><references/></noinclude> dw53oehhc7me2bba087z153gpgkklnr 552026 552025 2026-04-08T06:41:37Z A.Murali 3019 552026 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 48 |bSize = 450 |cWidth = 353 |cHeight = 81 |oTop = 42 |oLeft = 41 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''3. ఏనూటి పటం కత '''</p>}} నపద గిరిజన కళారూపాల్లో పటం కథలు ప్రత్యేకమైనవి. తెలంగాణలో మాత్రమే కనిపించే పటం కథల కళాకారులు మౌఖికంగా ప్రచారంలో ఉన్న కులపురాణాలకు నకాశీ చిత్రకారులతో దృశ్యరూపం కల్పించుకొని పండితులకు పామరులకు కథాంశం అర్థమయ్యేలా కథాగానం చేయటం వీరి ప్రత్యేకత. పటం కథలు ప్రదర్శించే ఆయా కళారూపాల్లో అద్దపువారు నాయీబ్రాహ్మణులకు అద్దపు పురాణం, కూనపులివారు పద్మశాలీలకు మార్కండేయ పురాణం, మాసయ్యలకు రజకులకు మడేలు పురాణం, కాకిపడిగెలవారు ముదిరాజ్లకు భారతం కథలు, పెక్కర్లు కుమ్మరి వారికి గుండ బ్రహ్మాయ్య పురాణం, తెరచీరలు, కొమ్ము మరియు మందహెచ్చులవారు యాదయ్యకు కాటమరాజు కథలు, దక్కలివారు మాదిగలకు జాంబపురాణం, గుర్రపువారు మాల కులానికి భేతాళపురాణం,<noinclude><references/></noinclude> 0b74aezgowk5dnu4mjdc3xuhpcdll8i పుట:పటం కతలు.pdf/49 104 211603 552040 551732 2026-04-08T10:31:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552040 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 49 |bSize = 450 |cWidth = 458 |cHeight = 404 |oTop = 0 |oLeft = -10 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 0j37tgeg9dsykrzj81lwialj6gcz3kl 552041 552040 2026-04-08T10:33:06Z A.Murali 3019 552041 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 49 |bSize = 450 |cWidth = 362 |cHeight = 135 |oTop = 237 |oLeft = 50 |Location = center |Description = }} {{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 49 |bSize = 450 |cWidth = 458 |cHeight = 404 |oTop = 0 |oLeft = -10 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 3x59y4hki0uwr2am7jv1bs99he54hks 552042 552041 2026-04-08T10:33:56Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552042 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 49 |bSize = 450 |cWidth = 458 |cHeight = 404 |oTop = 0 |oLeft = -10 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> pwpzlnwztdd5wp202ao55bj4jz1elz1 పుట:పటం కతలు.pdf/50 104 211604 552044 551733 2026-04-08T10:58:23Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552044 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||33}}</noinclude> కొర్రాజులు నాయకపోడువారికి పద్మనాయకుల వృత్తాంతం, గౌడ జెట్టీ మరియు ఏనూటివారు గౌడ కులానికి గౌడ పురాణాన్ని ప్రదర్శిస్తారు. ఈ రెండు కళారూపాలు పటం ఆధారంగానే ప్రదర్శించటం విశేషం. మొదట ఏనూటివారు గౌడ కులంలోని అయిదుగురి అన్నదమ్ముల్లో వీరు ఒకరు అయితే పురాణం ప్రకారం అన్నదమ్ముల ధనంపెట్టెల కోసం కులం నుండి విడిపోయినపుడు ఇటు కులానికి, అటు ధనానికి కాకుండా పోయినవారు ఏనూటి వారు. వీరి ప్రస్తావన గౌడ కులం సంస్కృతీ మూలాలు కలిగిన గౌడ పురాణంలో కనిపిస్తుంది. '''గౌడ పురాణం''' కళాకారులు పురాణాన్ని సృష్టి పుట్టుకతో ప్రారంభిస్తారు. ఒక రోజున త్రిమూర్తులు ఇంద్రసభకు వెళ్ళి వస్తుండగా బ్రహ్మనుదుట నుండి విపరీతమైన చెమట వస్తుంది. ఆ చెమటను ఎక్కడా వేయలేక చివరికి పార్వతీదేవి పాలగుండంలో వేయగా ఆ చెమట బిందువునుండి కౌండిన్య మహాఋషి జన్మిస్తాడు. ఆ మహాఋషి పెరిగి పెద్దవాడై సంతానం కోసం శివపార్వతులను వేడుకోగా, ఆదిగౌడ్, అమరగౌడ్, వేదగౌడ్, విప్రగౌడ్, పుంగమగౌడ్ అనే అయిదుగురు వరపుత్రులు జన్మిస్తారు. వీరికి తోడుగా చెల్లెలు నీలాంబరి జన్మిస్తుంది. ఈమెకే సురాభాండేశ్వరి అనే పేరు కూడా ఉంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేస్తుండగా మందర పర్వతం పగిలి కల్పవృక్షం మరియు కామధేనువు జన్మిస్తుంది. ఆ కల్పవృక్షాన్ని వేడుకొమ్మని పరమశివుడు గౌడ కులస్థులను కోరగా, వారు ఆ ప్రకారంగా కల్పవృక్షం నుండి అమృతం తీసి దేవతలకు సమర్పించుకుంటారు. ఇట్లా కొన్ని రోజులు తర్వాత రాక్షసులు నారదుని ద్వారా ఈ విషయం తెలుసుకొని గజాసురుడు మరియు రాక్షసులు కలిసి 33 కోట్ల దేవతల మారువేషంలో వచ్చి అమృతం పోయమని గౌడులను అడుగుతారు. మారువేషంలో వచ్చినది రాక్షసులని గమనించి గౌడులు, దేవతలు చెప్పిన ప్రకారం వారికి అమృతంలేదని చెప్పి పంపిస్తారు.<noinclude><references/></noinclude> 8y3iftg7y574fc6nbu5js4u9py425sw పుట:పటం కతలు.pdf/51 104 211605 552045 551734 2026-04-08T11:03:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552045 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|34||పటం కతలు}}</noinclude> గజాసురుడు అందుకు కోపగించి 66 కోట్ల రాక్షసులను నాలుగు గజఏనుగులుగా చేసి గౌరీవనాన్ని (ఈత, తాటివనాన్ని) నాశనం చేయండని శాసించగా, అవి వనానికి కాపలా ఉన్న ముదిరాజ్ బంటులకు కూడా దొరకక వనాన్ని నాశనం చేస్తాయి. ఈ విషయం తెలుసుకున్న గౌడులు, పరిష్కారం చూపమని పరమశివుణ్ణి వేడుకోగా, అతని కంఠం నుండి కంఠమహేశ్వరున్ని సృష్టించి అతనికి 33 కోట్ల దేవతల బలాన్ని చేకూర్చగా, అతడు గజాసురున్ని, ఆ గజఏనుగులను సంహరించి వనాన్ని రక్షిస్తాడు. ఆ రాక్షసుని పార్థివ శరీర భాగాలతో దేవతలు గౌడ వృత్తికి సంబంధించిన వస్తువులను తయారుచేసి ఇస్తారు. ఆ తర్వాత పరమశివుడు కంఠమహేశ్వరునికి, సురమాంబకు, అలాగే గౌడవారికి పెళ్ళి జరిపిస్తాడు. ఈ అయిదుగురిలోని ఆదిగౌడ్, అమరాగౌడ్, వేదగౌడ్ మరియు విప్రగౌద్ ప్రతిరోజు గౌరీవనానికి వెళ్ళి కల్లు తీసి పుంగమగౌడ్కు ఇవ్వగా, ఇతను బావ కంఠమహేశ్వరుడు, చెల్లి సురమాంబతో కలిసి అమ్ముతాడు. అంతేగాక ఈ ముగ్గురు ప్రతిరోజు 7 కోట్ల జంగములకు అన్నసంతర్పణంతోపాటు, మహాలింగపూజ మరియు దానధర్మాలు చేస్తూ, పుణ్యావంతులుగా పేరుగాంచుతారు. ఇది గిట్టని మిగతా నలుగురు పుంగమగౌడ్, 'కష్టంమాది, పేరు మీకా' అంటూ, మా ధనం పెట్టెలు మాకు పంచుతే మేం కులం నుండి వెళ్ళిపోతామంటారు. అపుడు పూంగమాగౌడ్ “నాకు ధనం కంటే కులము ఎక్కువని, మీకు కులం కంటే ధనమే ఎక్కువ" అంటున్నారు. కాబట్టి, ధనం పెట్టెలు తీసుకొని వెళ్ళిపొమ్మంటాడు. ఆ ప్రకారంగా నలుగురిలో ముగ్గురు ధనం పెట్టెలు తీసుకొని వెళ్ళగా, దీనికి కారణమైన విప్రగౌడ్ యొక్క ధనం పెట్టెను పరమశివుడు మాయం చేస్తాడు. అందుకు అతను పరమశివునితో నేను అటు కులానికి కాకుండా అయ్యాను, ఇటు ధనానికి కాకుండా అయ్యాను, ఎటూకాకుండా ఏనూటి వాడినయ్యానని భృతి చూపెట్టమని వేడుకుంటాడు. శివుడు అనుగ్రహించి గౌడ కులపురాణాన్ని కీర్తిస్తూ, వారిని ఆశ్రయించాలని, వారిచ్చే ప్రతిఫలం మీదనే జీవించాలని, పటం మీద పురాణాన్ని చిత్రించి ఏనూటి వారికిచ్చి దీవిస్తాడు. ఈ పురాణంలో వృత్తికి చెందిన అనేక సాంస్కృతికాంశాలతోపాటు వీరి కులానికి చెందిన మూలపురుషులు అనేక నియమనిష్టలు అనుసరించారని, దేవతలే<noinclude><references/></noinclude> mbvnas4eety3aagvs75qurp3yti306c పుట:పటం కతలు.pdf/52 104 211606 552048 551735 2026-04-08T11:09:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552048 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||35}}</noinclude> తమ వృత్తిని సృష్టించి తమకు వరంగా ఇచ్చారనే సన్నివేశాలు తమ కులానికి, వృత్తిపట్ల ఉన్న ఆత్మనూన్యతా భావాన్ని తొలగించడానికి దోహదం చేస్తుంది. అలాగే వృత్తిలో భాగంగా తాటి ముంజలను కొట్టకూడదని, పాకలు కట్టకూడదని, తాటి గొలకు 'మెరెస్తున్నపుడు మాట్లాడకూడదని వీరు వనానికి వెళ్ళినపుడు పురుగు పుట్ర కుట్టవని, ఇట్లా వృత్తి మనుగడకు 'ఉపయోగపడే అనేకాంశాలను పురాణం తెలియజేస్తుంది. వాటన్నింటిని కళాకారులు దృష్టిలో పెట్టుకొని వీరి వృత్తిపట్ల, వీరి కులానికి చెందిన మూల పురుషులపట్ల భక్తి భావం, గౌరవాన్ని కలిగించేలా ప్రదర్శిస్తారు. కళాకారులు ప్రదర్శనలో గౌడ పురాణాన్ని రెండురోజులు, మూడు నాలుగు రోజుల్లో సురాబాండేశ్వరం, కలకోడి యుద్ధం వంటి కథలను ప్రదర్శించి కాటమయ్య పండుగను జరిపిస్తారు. ఈ కళాకారులు పురాణాన్ని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. కేవలం పటాన్ని మాత్రమే చూపిస్తూ కథాగానం చేస్తే, ఇందుకు ప్రదర్శన నిమిత్తం కళాకారులు అయిదుగురు ఉంటారు. ఇందులో ఒకరు ప్రధాన కథకుడు, అతనికి ఇద్దరు వంతలు, మరో ఇద్దరిలో ఒకరు తల, మరొకరు హార్మోనియమ్ వాయిస్తారు. ఈ రకంగా పూర్వం ఎక్కువగా ప్రదర్శనలిచ్చేవారు కళాకారులు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచినిబట్టి పటాన్ని చూపిస్తూనే యక్షగాన రూపంలో పురాణంలోని పాత్రలను ధరించి ప్రదర్శిస్తున్నారు. ఇందులో స్త్రీ పాత్రలను కూడా మగవారే ధరిస్తారు. ఏనూటి వారికి తరతరాలుగా సంక్రమించిన కట్టడి గ్రామాలు రాగి శాసనం మీద రాసి ఉంటాయి. ఆయా కట్టడి గ్రామాలకు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి త్యాగం కోసం వెళ్ళేముందు కళాకారులు మేళం తయారు చేసుకుంటారు. కథ చెప్పే కళాకారులు అక్కడక్కడ కొద్దిగా ఉన్నప్పటికి "ఏనూటిపటం" ఒకే ఒకటి ఉండటంవల్ల కళాకారులు బృందాన్ని తయారుచేసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటారు. అయినప్పటికి బృందాన్ని తయారు చేసుకొని కట్టడి గ్రామాలకు వెళ్ళి గౌడ కులపెద్దలైన మొదట పెదగౌడ, సారుకోళ్లగౌడను కలిసి గ్రామంలో కథ చెప్పడానికి ఒప్పందం కుదుర్చుకుంటారు.<noinclude><references/></noinclude> kqb0762ba65216n5e8pa67vp7fmlv6g పుట:పటం కతలు.pdf/53 104 211607 552052 551736 2026-04-08T11:13:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552052 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|36||పటం కతలు}}</noinclude> పురాణాన్ని ప్రదర్శించడానికి కళాకారులు కులపెద్దలుగాని రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రదర్శన కూడా కుల పెద్దలు చెప్పినట్టుగానే వారి వీలునుబట్టి పగలుగాని రాత్రిగాని ఏర్పాటు చేస్తారు. కళాకారులు పెదగౌడ ఇంటిలో పటం పూజ నిర్వహించి 33 మూరల పొడవు, కళాకారులు ఉండే గౌడ పురాణం పటాన్ని రంగస్థలం మీద వ్రేలాడదీసి కథను ప్రారంభిస్తారు. ప్రదర్శన యక్షగాన రూపంలో అయితే 12 మంది కళాకారులుంటారు. ఇందులో ఒకరు ప్రధాన కథకుడు. ఇతన్నే బృందనాయకుడని, వీరి మరుగు భాషలో అయితే 'మేటి' అని పిలుచుకుంటారు. ఇతను ప్రదర్శనాద్యంతం ప్రేక్షకులకు రక్తి కట్టించేందుకు తన నైపుణ్యంతో పాత్రలను ప్రవేశపెట్టడం, ప్రేక్షకుల అభిరుచునిబట్టి సందర్భాను గుణంగా హాస్యాన్ని పండించటం, పురాణంపట్ల ప్రేక్షకులకు గౌరవాన్ని పెంచుతూనే, తమను ఆదరించిన కులపెద్దలను సందర్భాన్నిబట్టి పొగుడుతూ మెప్పు పొందుతారు. అంతేగాక ప్రదర్శనలో తప్పులు దొర్లితే కళాకారులను అప్రమత్తం చేయడానికి ప్రేక్షకులకు తెలియకుండా, వీరికి తెలిసిన మరుగు భాషలో మాట్లాడుతూ సరిచేస్తాడు. మధ్య మధ్యలో సందర్భాన్నిబట్టి తన చేతిలోని బెత్తం బరిగెతో పటంమీది బొమ్మలను చూపిస్తాడు. ప్రదర్శనలో ప్రధాన కథకునికి సమానమైన అంతటి పాత్ర హాస్యగాని పాత్ర. పురాణంలోని పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేయడం, వారికి కలిగే సందేహాలను తానే ప్రధాన కథకున్ని అడిగి తీర్చడం, అవసరమైతే దెబ్బలు తింటూ, తిడుతూ సందర్భాన్నిబట్టి ప్రేక్షకులను కూడా తన వేషధారణ మరియు హాస్యంతో ప్రదర్శనలో ప్రయోగిస్తూ రక్తికట్టిస్తాడు. ప్రదర్శన మధ్యలో పాత్రల ప్రవేశం ఆలస్యం జరిగితే హాస్యాన్ని కలిగించే పాటలు, భక్తిపాటలు పాడుతూ ప్రదర్శన కొనసాగిస్తాడు. ఇతన్ని మరుగు భాషలో 'కేకి' అని పిలుచుకుంటారు. బృందంలోని మిగతా వారిలో ఇద్దరు ఒకరు తబల, హార్మోనియమ్ వాయించగా, మిగిలినవారంతా పురాణంలోని పాత్రల వేషాలు ధరించి తాళాలు వాయిస్తూ వంతపాడతారు. కళాకారుల ప్రదర్శనకు దైవత్వాన్ని, పవిత్రతను ఆపాదించడం కోసం ప్రదర్శన ప్రారంభంలో గౌడ కులస్థులందరికీ కాటమయ్య<noinclude><references/></noinclude> bhairz4ilskex87oeag5vsrxbotz5fa పుట:పటం కతలు.pdf/54 104 211610 552053 551747 2026-04-08T11:17:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552053 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||37}}</noinclude> పండుగ అయ్యేంతవరకు నిష్టగా ఉండాలని పూజా కార్యక్రమం నిర్వహించి కంకణాలు కడతారు. అట్లాగే ప్రదర్శనలో కథాప్రారంభం, కంఠమహేశ్వరుని జననం, సురాభాండేశ్వరి వివాహం వంటి సందర్భాల్లో పూజలు నిర్వహించి కులంవారందర్ని భాగస్వామ్యం చేస్తారు. కళాకారులకు ప్రేక్షకులు డబ్బులు చదివిస్తే వారికి దీవనార్తి పెడతారు. అలాగే వారికి భోజనం వసతి కల్పించినవారికి ఒకటికి రెండుసార్లు దీవిస్తారు. కళాకారులు కాటమయ్యపండుగ జరిపించే ముందురోజున గౌడ కులస్థులందరిచేత గ్రామంలో మామిడి తోరణాలు కట్టిచ్చి, గ్రామంలోని దేవతలందరిని పూజించి పసుపు నీళ్ళతో జలాభిషేకం చేయిస్తారు. ఆ తర్వాత గౌడవారంతా ఇంటికి ఒక జలబిందె చొప్పున కాటమయ్య గుడికి డప్పు చప్పుళ్ళతో చేరుకొని పెదగౌడకు సారుకోళ్ళ గౌడకు ప్రాధాన్యత కలిగిస్తూ కాటమయ్యకు, ఏడు తాళ్ళ ఎల్లమ్మకు వనం మైసమ్మకు జలాభిషేకం చేయిస్తారు. కాటమయ్య పండుగ సందర్భంగా గౌడ వారంతా తమ ఇండ్లను అలంకరించుకొని ఇంట్లో బోనం తయారు చేస్తారు. మొదట పెదగౌడ ఇంటిదగ్గరి నుండి 'ఘటం కుండ' (ఇది ప్రధానమైనది. దీని అలంకరణంతా కళాకారులే చేస్తారు. ఇది వనం మైసమ్మ కోసం, వనమంతా బలివల్లే సమయంలో తిరుగుతుంది.) సారుకోళ్ళ గౌడు ఇంటి దగ్గరి నుండి నజరు బోనం బయలుదేరుతుంది. దీనిని కాటమయ్యకు సమర్పించే బోనమని అంటారు. పెదగౌడ్, సారుకోళ్ళ గౌడ్ బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్ళతో బయలుదేరగా, కులస్థులందరూ ఇంటికి ఒక బోనం చొప్పున ఆడవారు ఎత్తుకోగా, మగవారంతా మోకు ముస్తాదులు తీసుకొని ఊరేగింపుగా కాటమయ్య గుడికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో కాటమయ్య నజరు బోనాన్ని, వనం మైసమ్మకు ఘటం కుండను సమర్పించగా, మిగతా వారంతా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆలయంలో కాటమయ్య సురమాంబ పెళ్ళిని కళాకారులు నిర్వహించి, కలకోడి యుద్ధం కథను ఆలయ ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. దీని తర్వాత ఏదుతాళ్ళ ఎల్లమ్మ దగ్గర మేకపోతును మత్తకొలిపి బలిస్తారు. అలాగే వనం మైసమ్మకు, పోతురాజుకు,<noinclude><references/></noinclude> ljb9rhcf7czhbc26255r8voixv3ete6 పుట:పటం కతలు.pdf/55 104 211611 552055 551748 2026-04-08T11:20:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552055 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|38||పటం కతలు}}</noinclude> కళాకారుల పటానికి మేకపోతులను బలిచ్చి, ఆయా వాటిని మాదిగ, చాకలి, మంగలి, బైండ్ల కులాలకు కట్టడి ప్రకారం ఇస్తారు. ఆ తర్వాత ఎల్లమ్మ తల్లి దగ్గర బలిచ్చిన మేక రక్తాన్ని బలిఅన్నంలో కలిపి, ఘటం కుండతోపాటుగా పద్దతి ప్రకారం మొదట మోకు ముస్తాదులకు కళాకారులు కంకణాలు కట్టి బలిరక్తం చల్లుతారు. ఆ తర్వాత బైండ్లవాడు తాటి వనమంతా మరియు గౌడ కులస్థుల ఇండ్ల మీద ఐలి చల్లుతాడు. ఇదంతా కళాకారులు చెప్పినట్టుగా జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా గ్రామంలోని కులాల ఐక్యత కనిపిస్తుంది. పండుగ గౌడ కులానికి చెందినదైనప్పటికి గ్రామంలోని మాదిగ, మంగలి, చాకలి, బైండ్ల కులాల భాగస్వామ్యంతోపాటు గౌడ కులం కూడా ఐక్యంగా ఉండటానికి ఈ పండుగ దోహదం చేస్తుంది. ఇదంతా కళాకారుల గొప్పదనమేనని చెప్పవచ్చు. '''ఇతర ప్రదర్శనలు :''' కళాకారులు పురాణంతోపాటుగా పటం లేకుండా ఇతర నాటకాలను కూడా ప్రదర్శిస్తారు. వీటిలో - :భక్త ప్రహ్లాద :బాలనాగమ్మ, :భద్రసేన విజయం, :చెంచులక్ష్మి. :గరుడాచలం, :శశిరేఖా పరిణయం, :గయోపాఖ్యానం, :లవకుశ<noinclude><references/></noinclude> 0qrk3ren723vnpof51pflky20243gvl పుట:పటం కతలు.pdf/56 104 211612 552057 551749 2026-04-08T11:27:16Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552057 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||39}}</noinclude> మొదలైన నాటకాలను రాగతాళయుక్తంగా ప్రదర్శిస్తారు. అంతేగాక గౌడ కులంలో ఎవరైనా మరణిస్తే ఆ సందర్భంగా కూడా నాటకాలు ఆడతారు. బహుముఖ ప్రజ్ఞావంతులైన కళాకారులు మాట్లాడే మరుగు భాష చాలా ప్రత్యేకమైనది.మరుగు భాషలో కొన్ని 'ఉదాహరణగా డబ్బును కంచికం, కల్లును కడ్డీ, గౌండ్లవారిని కడ్డిగాడు, గౌడజెట్టీని అయితగాడు, పద్మశాలీలను పొగులైతగాళ్ళు, చాకలి వారిని కెందరిగాళ్ళు, షావుకార్లను వెంటిగాళ్ళు, ఆబేలును కురుంగాడు, ఉడతను ఒదంగాడు, కోడిని కుక్కుడు గాడు, మేకను మెసం, కూరను బాడిగం, తబలను దిమ్మిస, మెటం అంటే పటమని, ఇల్లును మెత్తి అని పలుకుతారు. ఇలా ఇవేకాకుండా క్రియా పదాలను కూడా మరుగు భాషలో మాట్లాడతారు. వీరి భాషలో సంస్కృతం 'ఉర్దూ హిందీ పదాలతోపాటు కొన్ని ప్రత్యేకమైన పదాలను ఉపయోగిస్తారు. గౌడ కులాన్ని వీరితోపాటుగా ఆశ్రయించి కథాగానం చేసే గౌడ జెట్టీలకు వీరికి ప్రదర్శనలో బేధసాదృశ్యాలుంటాయి. అయితే పూర్వం గౌడ జెట్టీ కళాకారులు సాధనలు మాత్రమే చేస్తూ గౌడ కులాన్ని ఆశ్రయించేవారని గత కొంతకాలంగా గోత్రాల వారి దగ్గర ప్రదర్శనా విధానం నేర్చుకొని ప్రదర్శిస్తున్నారని వీరి మాటల్లో వినిపిస్తుంది. ఏనూటి వారు కథా ప్రదర్శనతోపాటు, దేవతా విగ్రహాలకు రంగులు వేయడం శిల్పాలు చేయడం ప్రధానంగా చేస్తారు. వీరు ఖాళీ సమయంలో శికారికివెళ్ళి రకరకాల జంతువులను పక్షులను వేటాడతారు. ప్రధాన కులం లేదా పోషకులు ఆదరించకపోవడంతో చాలా పటాలను కళాకారులు అమ్ముకోవటం జరిగింది. చివరికి ఒకే ఒక్క పటం వీరికి మిగిలింది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రస్తుతం ఒకే కళాబృందం మిగిలిపోయింది. ఆదరణలేక దయనీయమైన స్థితిలో ఉన్న కళాకారులను ఆదరించలేకపోతే వారి సంస్కృతి, సాహిత్యం మరుగునపడిపోయే స్థితి ఉంది. కాబట్టి వీరికి బహుళ ప్రాచుర్యం కల్పించి భవిష్యత్తు తరాలకు వీరి సంస్కృతిని అందించాల్సిన అవసరం ఉంది.<noinclude><references/></noinclude> d3awsqerz1xnn9x4o44e6jvle1z8ck5 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.10 (1937).pdf/5 104 211683 551925 2026-04-07T13:25:25Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551925 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}మూగవోయినయదిగొంతు!</p>}} {{Center|{{p|fs125}}శ్రీకొమఱ్ఱాజు వినాయక రావు గారు</p>}} {{p|fs125}}<poem>తెలిచలువయుపల మ్మస్మదీయహృదయ; మాత్మయందున చైతన్య మనుభవింపఁ కొట్టుకొనుచున్న యది కోర్కి గుబురుకొనగ! ఓతరుణశిల్పి! యాలించు; నాతలంపు మనమునం దిడి మన్నించు; తనువు దిద్ది నీ కళాదృష్టితో యులి తాకిఁ వైచి భువన మోహనమూర్తిత్వమును వెలార్చు!</poem></p> {{p|fs125}}<poem>మధుర భావమహాంభోధి మానసమ్ము నాయది, నవక వీశె! యానంద మొదవ గీతికా గంధకౌసుమ కీర్తి కావ్య మాలికా స్వరూప మొసగుమా! రచించి.</poem></p> {{p|fs125}}<poem>మూగవోయినయది గొంతు! సాగి రాదు! మంజు మధుగాన వాహినుల్ మ్రానుపడియె! దివ్యగాయక! గళవీణఁ నవ్యశక్తి వోసి, భావతంత్రుల మీటవోయి! మొరయుఁ అమృత మధురతరంగిత మ్మాళ్మగీతి !</poem</p>> {{rule |6em }}<noinclude><references/></noinclude> 4tppws743jy02286qf0f1cj7vd7st2o 551926 551925 2026-04-07T13:28:29Z Brjswiki 6801 551926 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}మూగవోయినయదిగొంతు!</p>}} {{Center|{{p|fs125}}శ్రీకొమఱ్ఱాజు వినాయక రావు గారు</p>}} {{p|fs125}}<poem>తెలిచలువయుపల మ్మస్మదీయహృదయ; మాత్మయందున చైతన్య మనుభవింపఁ కొట్టుకొనుచున్న యది కోర్కి గుబురుకొనగ! ఓతరుణశిల్పి! యాలించు; నాతలంపు మనమునం దిడి మన్నించు; తనువు దిద్ది నీ కళాదృష్టితో యులి తాకిఁ వైచి భువన మోహనమూర్తిత్వమును వెలార్చు!</poem></p> {{p|fs125}}<poem>మధుర భావమహాంభోధి మానసమ్ము నాయది, నవక వీశె! యానంద మొదవ గీతికా గంధకౌసుమ కీర్తి కావ్య మాలికా స్వరూప మొసగుమా! రచించి.</poem></p> {{p|fs125}}<poem>మూగవోయినయది గొంతు! సాగి రాదు! మంజు మధుగాన వాహినుల్ మ్రానుపడియె! దివ్యగాయక! గళవీణఁ నవ్యశక్తి వోసి, భావతంత్రుల మీటవోయి! మొరయుఁ అమృత మధురతరంగిత మ్మాళ్మగీతి!</poem></p> {{rule |6em }}<noinclude><references/></noinclude> er6iolbzsb2bdw3evkbp5wes22n19ia పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.10 (1937).pdf/11 104 211684 551927 2026-04-07T13:36:52Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551927 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>9 అహంభావము పోయి వినుట, వచ్చినచోటనే కానుకలర్పించుట, యీశుభ గుణములు కొందరిలో కనుపడుట లేదు. సభ వేళకు రాక, ఆలస్యముగా వచ్చి మాకు దర్శ నము వెంటనే కల్పించమనుట ఇట్టిదియే. దోవలో అడ్డుగా నిలుచుట, ఆటంకములు నేర్ప రుచుట మరింత విపరీతము. అహంకారమునకు తోడు, హ్రస్వదృష్టి, ఒకొక్కప్పుడు దుష్టత్వము గూడ. ఆయన సౌకర్యము ఆలోచించకపోవుట, భ క్తిలో మూఢత్వము, తనకై తన గ్రామము నకై కొలదివ్యవధికోరుట, ఇచ్చినవ్యవధిని పెంచమనుట,తృప్తికాలేద నట, స్వార్థము, ముందు తోసికొనవచ్చుట, నీచత్వము గూడ. ఆంగ్లమున మనాపొలి అన్నట్లు, పరులకు లేకుండ తనకు 369 ఒక్కరికే అవిచ్ఛిన్న ఏకైక స్వత్వము గోరుట పరపీడాకరము. మొయిలుచాటున ఉన్నను అంధకారము బాపు మిత్రునివలె, మబ్బులో మణిగియు శాంతినొసంగు చంద్రునివలె, శరీర ములో మెరిగియు ఆహారరసము లొసంగు అంత రింద్రియమువలె, ఆకులలో కాకర కాయవలె కన్నులకు కానపడక, భీరునివలె వెనుక నిల్చి, ధీరుని వలె ధర్మపదము తొలంగక, పంచభూతములవలె ప్రయోజనము గోరక, తల్లివలె బిడ్డలు క్షేమ మునే వాంఛించి మించి సేవచేయుట, శ్రేష్ఠము. కన్ను విసరెడ్డి చూపును, పెదవిదా టెడి పలుకును, కరచరణముల వెల్వడు చర్యను విమర్శించుకొని, సాగువాడు ధన్యుడుగదా ! {{Center|{{p|fs150}}గ్రామస్థుల అజ్ఞానము తొలగించు సాధనములు ఏవి ?</p>}} {{Center|{{p|fs125}}జటావల్లభుల పురుషోత్తము గారు, ఎం. ఏ.</p>}} గ్రంథాలయము దేవాలయమువలె పవిత్రమైన దనియు, ప్రతిదినము గ్రామస్థులు వీనిని దర్శింపవలె ననియు చెప్పుదురు. దీనిని నేను కొంచెము సవరింతును. గ్రంథాలయము దేవాలయమువలె పవిత్రమైనదని చెప్పుట సరి కాదు. ఏలన గ్రంథాలయము కూడ దేవాలయమే. బ్రహ్మవిష్ణుమహేశ్వరు లనియెడి త్రిమూర్తులు హిందువులకు ముఖ్య దైవతములు. వీరి భార్యలు వాణీ, లక్ష్మీ, పార్వతులుకూడ అట్లే పూజ్య దేవతలు ఉమామహేశ్వరులకును, లక్ష్మీ విష్ణువులకును మాత్రమే యాలయములు గలవు కాని వాణీ హిరణ్యగర్భుల కాలయములు లేవు. శ్రోత కర్మలీగు యజ్ఞయాగాదులలో గూడ బ్రహ్మకితర దేవతలకు వలెకాక నోటిలోనే స్తోత్రములు చెప్పబడుచున్నవి. అతనియిల్లాగు సరస్వతికి గూడ అట్లే ఆంతరంగిక పూజను మనము చేయవలసి యున్నది. సరస్వతికి ప్రత్యక్షరూపము గ్రంథము. ఈ గ్రంథములను మనమనస్సులలో నుపాసించుటయే యీమెను మన మారాధించుమార్గము. ఇట్టి ఉపాసమున కవకాశమును గల్గించు గ్రంథరూప సరస్వతి యొక్క యాలయమే గ్రంథాలయము. ఇతర దేవతలయాలయము లెట్టివో ఈ దేవాలయము కూడ అట్టిదే. కాని యిచటి విశేషమేమున, ఇచటికి వచ్చువారు ఫలములను దక్షిణలను నీయనక్కర లేదు. శ్రద్ధయను దక్షిణ నొసగిన చాలును. ఇతర దేవతలవలె కాక యీ<noinclude><references/></noinclude> s8u4zm372jzpz6x0qzrkrwk4e202llr పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.10 (1937).pdf/12 104 211685 551928 2026-04-07T13:54:57Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551928 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవత సద్యఃఫలము నొసగును. ఒక గంటయో రెండుగంటలో మన మీ దేవాలయములో కూర్చుండి ఉపాసన చేయుచో, దానికి తగిన జ్ఞాన ధనము మనకు వెంటనే లభించును. దేవాలయము లేని గ్రామమును కుగ్రామమని మన ప్రాచీనులు చెప్చియున్నారు. నవయుగధర్మమునను సరించి సరస్వత్యాలయము లేని గ్రామమును కుగ్రామమని చెప్పవచ్చును. {{Center|{{p|fs125}}అజ్ఞానమే నీచస్థితికి కారణము</p>}} గ్రంథాలయముల పవిత్రత యితర విధములచే కూడ స్థిరీకృతము కాగలదు. జ్ఞానమును వ్యాపింప జేయుట గ్రంథాలయముల యుద్దేశము. జ్ఞానము కంటెను పవిత్రమైన వస్తువు మరొకటి లేదని గీత చెప్పుచున్నది. 'సహిజ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే'. మానవునకు పూజ్యత నిచ్చు నర్హత అన్నిటిలోను ముందుగ నెన్నదగినది జ్ఞానము. మనువిట్లు చెప్పుచున్నాడు: <poem>“విత్తంబంధుర్వయః కర్మవిద్యాభ వతిపంచమీ ఏ తానిమాన్యస్థానానిగరీ యోయద్యదు త్తరం."</poem> (ధనము, బంధువు, వయస్సు, ప్రవర్తన, విద్య - ఇవి పూజ్య స్థానములు, ఇందుత్తరోత్తమున నున్నది. పూర్వపూర్వమున నున్న దానికంటే గొప్పది) నేటి ప్రపంచములో భారతదేశ మింత నీచస్థితి నాక్రమించి యుండుటకు మనయజ్ఞానమే కారణము. ముప్పదియారు కోట్ల భారతీయులును తమ పతనమును గుర్తించి నాగరిక ప్రపంచము యొక్క యైశ్వర్యాభివృద్ధులను గ్రహించుచో, ఒక్కదినమైనను ఈ దుస్థితియందుండుటకు సమ్మతింపరు. జ్ఞానమునకును భౌతిక శ్రేయస్సునకును ఎంత సంబంధమున్నదో తెల్పువంశము ఒకటి మీకు జ్ఞాపకము చేయుచున్నాను. తమ యధికార కాఠిన్యముచే కార్మికులనణగద్రొక్కి వారివలన బాగుపడు మిల్లు యజమానులు తమ కార్మికులలో విజ్ఞానము వ్యాపింపకుండ జేయుటకై యత్నించుచుందురు. బొంబాయి మిల్లులలోని కార్మికులలో వయోజన విద్యాప్రచారము సాగింప బూనుకొనినవారికి ముందుగ ఈ చిక్కే కల్గినది. కార్మికులలో ప్రబోధము గలుగ జేయు ప్రయత్నములను మిల్లు యజమానులు ప్రతిఘటించుటలో ఆశ్చర్యము లేదు. మన మేగుఱ్ఱమును బండికి గట్టి దానిచే చాకిరి చేయించుకొన గోరుదుమో అగుఱ్ఱమును గంతలు కట్టుట సహజము. విద్యాపచారము గలుగుచో ఆత్మజ్ఞానముదయించును. ఆత్మజ్ఞనము నొందిన వాడు బంధముల నుండి విముక్తు డగును. మన సంఘ విషయములో గూడ ఈజ్ఞానము లేకపోవుటయే గొప్ప యనర్థమునకు కారణముగనున్నది. అగ్రవర్ణముల వారిచే తిట్లను చెప్పుదెబ్బలను తినుటయే తమ ధర్మమనియు, ఈయత్యాచారముల కెదురు తిరుగుటయే మహాదోషమనియు, నిమ్నవర్ణముల వారు భావించుచున్నారు. స్వస్వరూపమును గుర్తింపలేని హేతువుచే ఈ నిమ్నవర్ణములవారు గ్రామములలో పడుచున్న దుస్ధితిని తలచుకొనినపుడు సంఘశ్రేయోభిలాషులకును, విజ్ఞాననిరతులకును, హృదయము తరుగుకొని పోవుననుటలో ఆశ్చర్యము లేదు. {{Center|{{p|fs125}}చదువను, వ్రాయను నేర్చుటే జ్ఞానము రాదు</p>}} సర్వానర్థములకును మూలమైన యీయజ్ఞానమును పారదోల వలెసన్నచో జనసామాన్యముచే గ్రంథములను చదివించుటయే ఏకైక సాధనము కాదు. పెద్దవారిని నేడక్షరములు నేర్చుకొనవలసినదని కోరుటవలన విశేషప్రయోజన ముండదు. చదువురానివారికి గూడ జ్ఞానము<noinclude><references/></noinclude> mmqjmt335abk99puu74omprvomika4u 551929 551928 2026-04-07T13:55:53Z Brjswiki 6801 551929 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవత సద్యఃఫలము నొసగును. ఒక గంటయో రెండుగంటలో మన మీ దేవాలయములో కూర్చుండి ఉపాసన చేయుచో, దానికి తగిన జ్ఞాన ధనము మనకు వెంటనే లభించును. దేవాలయము లేని గ్రామమును కుగ్రామమని మన ప్రాచీనులు చెప్చియున్నారు. నవయుగధర్మమునను సరించి సరస్వత్యాలయము లేని గ్రామమును కుగ్రామమని చెప్పవచ్చును. {{Center|{{p|fs125}}అజ్ఞానమే నీచస్థితికి కారణము</p>}} గ్రంథాలయముల పవిత్రత యితర విధములచే కూడ స్థిరీకృతము కాగలదు. జ్ఞానమును వ్యాపింప జేయుట గ్రంథాలయముల యుద్దేశము. జ్ఞానము కంటెను పవిత్రమైన వస్తువు మరొకటి లేదని గీత చెప్పుచున్నది. 'సహిజ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే'. మానవునకు పూజ్యత నిచ్చు నర్హత అన్నిటిలోను ముందుగ నెన్నదగినది జ్ఞానము. మనువిట్లు చెప్పుచున్నాడు: {{Center|<poem>“విత్తంబంధుర్వయః కర్మవిద్యాభ వతిపంచమీ ఏ తానిమాన్యస్థానానిగరీ యోయద్యదు త్తరం."</poem>}} (ధనము, బంధువు, వయస్సు, ప్రవర్తన, విద్య - ఇవి పూజ్య స్థానములు, ఇందుత్తరోత్తమున నున్నది. పూర్వపూర్వమున నున్న దానికంటే గొప్పది) నేటి ప్రపంచములో భారతదేశ మింత నీచస్థితి నాక్రమించి యుండుటకు మనయజ్ఞానమే కారణము. ముప్పదియారు కోట్ల భారతీయులును తమ పతనమును గుర్తించి నాగరిక ప్రపంచము యొక్క యైశ్వర్యాభివృద్ధులను గ్రహించుచో, ఒక్కదినమైనను ఈ దుస్థితియందుండుటకు సమ్మతింపరు. జ్ఞానమునకును భౌతిక శ్రేయస్సునకును ఎంత సంబంధమున్నదో తెల్పువంశము ఒకటి మీకు జ్ఞాపకము చేయుచున్నాను. తమ యధికార కాఠిన్యముచే కార్మికులనణగద్రొక్కి వారివలన బాగుపడు మిల్లు యజమానులు తమ కార్మికులలో విజ్ఞానము వ్యాపింపకుండ జేయుటకై యత్నించుచుందురు. బొంబాయి మిల్లులలోని కార్మికులలో వయోజన విద్యాప్రచారము సాగింప బూనుకొనినవారికి ముందుగ ఈ చిక్కే కల్గినది. కార్మికులలో ప్రబోధము గలుగ జేయు ప్రయత్నములను మిల్లు యజమానులు ప్రతిఘటించుటలో ఆశ్చర్యము లేదు. మన మేగుఱ్ఱమును బండికి గట్టి దానిచే చాకిరి చేయించుకొన గోరుదుమో అగుఱ్ఱమును గంతలు కట్టుట సహజము. విద్యాపచారము గలుగుచో ఆత్మజ్ఞానముదయించును. ఆత్మజ్ఞనము నొందిన వాడు బంధముల నుండి విముక్తు డగును. మన సంఘ విషయములో గూడ ఈజ్ఞానము లేకపోవుటయే గొప్ప యనర్థమునకు కారణముగనున్నది. అగ్రవర్ణముల వారిచే తిట్లను చెప్పుదెబ్బలను తినుటయే తమ ధర్మమనియు, ఈయత్యాచారముల కెదురు తిరుగుటయే మహాదోషమనియు, నిమ్నవర్ణముల వారు భావించుచున్నారు. స్వస్వరూపమును గుర్తింపలేని హేతువుచే ఈ నిమ్నవర్ణములవారు గ్రామములలో పడుచున్న దుస్ధితిని తలచుకొనినపుడు సంఘశ్రేయోభిలాషులకును, విజ్ఞాననిరతులకును, హృదయము తరుగుకొని పోవుననుటలో ఆశ్చర్యము లేదు. {{Center|{{p|fs125}}చదువను, వ్రాయను నేర్చుటే జ్ఞానము రాదు</p>}} సర్వానర్థములకును మూలమైన యీయజ్ఞానమును పారదోల వలెసన్నచో జనసామాన్యముచే గ్రంథములను చదివించుటయే ఏకైక సాధనము కాదు. పెద్దవారిని నేడక్షరములు నేర్చుకొనవలసినదని కోరుటవలన విశేషప్రయోజన ముండదు. చదువురానివారికి గూడ జ్ఞానము<noinclude><references/></noinclude> m0r0hegfznafnzj7f66z1qa5220r60d పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.10 (1937).pdf/13 104 211686 551931 2026-04-07T14:11:42Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 551931 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కల్గించుటకు గ్రథాలయములు యత్నింపవలసి యున్నవి. ప్రతిదినమునను ఆంధ్రపత్రికను గ్రంథాలయము నెదుట చదువుటయను పద్ధతిని ప్రారంభింపుడు. 'శ్రుత పాండిత్య' మని చెప్పబడునది సామాన్య విషయము కాదు. శివాజీకి అక్షరములు రావను సంగతి మీకు తెలియును. అయిన నేమి! బాల్యముననే అతడు తల్లినుండియు, గురువునుండియు ప్రాచీన భారత వీరుల చరిత్రను మహారాష్ట్ర దేశచరిత్రను, హిందూ ధర్మసారమును, గ్రహించి యుండెను. వ్రాయను చదువను నేర్చిన వారికి కూడ జ్ఞానము మనము చాలచోట్ల చూచుచున్నాము. ఇట్టిస్థితి కంటె జ్ఞానముండి చదువు లేకుండు స్థితియే మంచిది. పురాణపఠనము, ఉపన్యాసములు మున్నగు నెన్నియో సాధనములచే గ్రామస్థులకు శ్రుత పాండిత్యము కలిగింప వచ్చును. {{Center|{{p|fs125}}గ్రంథములపై రుచికల్పించుట గ్రంథాలయ సేవకుల విధి</p>}} ఆధునిక యుగములో లేఖనపఠనములు జ్ఞానమునకు ముఖ్యసాధనములుగ ఏర్పడినవి. కాన వీనికి దోహద మొసగుట తప్పదు. గ్రామస్థులకు చదువు నలవాటు చేయుట మిక్కిలి కష్టముతో గూడినపని. గ్రంథములపైని రుచిగల్గి గ్రంథాలయమునకు వచ్చి గ్రంథములను తీసికొని చదువరు. చదువు కొంత అలవాటయి ననేగాని వారికి గ్రంథములపై రుచి కలుగదు. ఈ యన్యోన్యా శ్రయదోషమును పరిహరించుట కొకమార్గము కలదు. గ్రంథాలయ నిర్వాహకులు గ్రంథముల నింటింటికి తీసికొని వెళ్లి, వానిని చదువు నట్లు గ్రామస్థులను ప్రోత్సహింపవలెను. గ్రంథాలయములు లేని గ్రామములలో గూడ ఇట్లు గ్రంథములను దీసికొని యీయవలసిన బాధ్యత గ్రంథాలయ సేవకులపై కలదు. కెనడాలో గ్రంథాలయములు లేని గ్రామములలో గ్రంథములు నందించుటకై ఒక బస్సు బయలు దేరుచుండును. అది దినమునకు ౨౦ గ్రామములు చుట్టి వచ్చుచుండును. {{Center|{{p|fs125}}ఎట్టి గ్రంథములను చదువవలెను?</p>}} ఈ పశ్న ముఖ్యమైనదే యైనను గ్రామ గ్రంధాలయముల విషయములో మాత్ర మిది మనలను బాధింప నక్కర లేదు. గ్రామస్థుల కెట్టి గ్రంథములపై అభిరుచియుండునో అట్టి గ్రంథములను వారి కంద జేయవలెను. ఆ గ్రంథములు వారిని పాడుచేయునవి కాకున్న చాలును. విద్య యింత తక్కువగనున్న యీ కాలములో ఇట్టి గ్రంథములనే చదువవలెనని చెప్పుట విద్యాప్రచారమున కభ్యంతరముగనే ఉండును. గ్రామములోని ప్రథమిక పాఠశాలలో చదువుకొనినవారు కొన్ని సంవత్సరములలో మరల నిరక్షరాస్యులు గాకుండుటకై వారిచేత ఏదో యొకటి వారి యభిరుచికి తగిన దానిని చదివించు చుండుట అవసరము. వ్రాయను చదువను బాగుగ అలవాటయిన వారిలో పౌరత్వ జ్ఞానమును రాజకీయ ప్రబోధమును గల్గించు గ్రంథములను చదువుటను ప్రోత్సహింపవలసి యున్నది. అక్షరాస్యుల కందరకును వోటు వచ్చి యున్న యీకాలములో ఇట్టి విద్యకావశ్యకత యెంతయో కలదు. అది లేనిచో ప్రజలు తమ వోటధికారమును దుర్విని యోగముచేసి, అనర్హులను శాసన సభలలోనికి పంపెదరు. అదే దేశానర్థముల కన్నిటికిని పునాది.<noinclude><references/></noinclude> m6o0gqhzjoo0kytclqbedtgruvvx6p2 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.10 (1937).pdf/14 104 211687 551932 2026-04-07T14:14:06Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 551932 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}తాలూకా గ్రంథాలయ సేవ</p>}} ప్రజల కీవిధముగ ప్రబోధమును గల్గింప వలసిన బాధ్యత ప్రభుత్వము మీదను స్థానిక సంస్థల విూదను గలదు. కాని మన దురదృష్టముచే సంస్థ లీధర్మమును సరిగ నెర వేర్చుట లేదు. స్వార్థ త్యాగులైన యేకొలది మంది వ్యక్తులో పని చేయవలసి వచ్చుచున్నది. పరిస్థితి యిట్లు న్నను తాడేపల్లిగూడెము తాలూకాలో ఉన్న సుమారు ౧౧౦ గ్రామములలోను ఓం గ్రామ ములలో గ్రంథాలయములు వెలసియున్నవని వినుటవలన నాకమితానందము కల్గినది. సుమా రు నూటికేబది గ్రామములలో గ్రంథాలయ ములున్న తాలూకా యింకొకటి యాంధ్ర దేశ ములో లేదని నా యభిప్రాయము. ఇంత ప్రశంస నీయమగు పని యీ తాలూకాలో జరుగుటకు ముఖ్యకారణ భూతులైన శ్రీ తేతలి సత్య నారాయణగారిని శ్రీ కలిదిండి గంగరాజు గారిని అభినందించుచున్నాను. హేరుటోను భారత దేశ వనౌషధులచే తయారై న లోకో త్తరమగు ఈ సుగంధ తైలము తలకు రాచి మర్దన చేయుట చే శిరోజములు సోగగా 'పెంచి, కాంతి నిచ్చి, కుదుళ్ళ గట్టిపరచును. మెదడునకు చలువ కలుగజేసి, జ్ఞాపకశక్తి వృద్ధి చేయును. తెల్ల వెండ్రుకలను క్రమముగా నల్ల పరచును. నిద్రలేమిని, విచారమును మాన్పును. వేసవికాలపు ఉష్ణోగ్రతచే కలుగు వ్యాధులనుండి కాపాడును. 2 అమూల్యమగు నూచన గ్రామగ్రంథాలయములను గురించి స్నే హితులొకరు ఒక సూచన చేసియున్నారు. అది అమూల్యమైనదని నేను తలచుచున్నాను. గా మస్తులకు తాలూకా ఆఫీసులోను, సబురిజిస్ట్రారు ఆఫీసులోను దొరకుకొన్ని యత్యవసరములైన కాగితములను గ్రామ గ్రంథాలయము వారు సేకరించి యుండవలెనని వారు చెప్పియున్నారు. @ ఇది నిజముగ గా గ్రామస్థుల కపారమైనలాభమును కూర్చగలదు. తరుచుగు లంచములకై సొమ్ము పోయ నవసరములేకుండ పోవును. స్వల్పవ్యయ ముతో అమిత లాభము వచ్చును. గ్రామ గ్రం థాలయోద్యోగి 'గ్రామదినచర్య' అను పుస్త కమునుంచి దానిలో ఏనా డెవరు పుట్టిరో, ఏనా డెవరు చనిపోయిలో ఏనా డెవ లేదావాలో గెలి చిరో మున్నగు నంశములను వ్రాసి యుంచి, ఆ పుస్తకము నందరకు అందుపాటులో ఉంచుచో అది గ్రామమునకు మహోపకారము కాగలదు. అద్భుత చికిత్స డాక్టరు టి. బి. రాజుగారి తామర తై ల ము ఈ తామరమందును ఉపయోగించుటచే మచ్చలు, నివారణ మగును. తామర తీట, చర్మముపై మచ్చలు, కుష్ఠు రాజు డాక్టరు, టి. బి. రాజు, ఆయుర్వేదిక్ కెమికల్ వర్క్సు, ఉండి (పోస్టు), పశ్చిమ గోదావరిజిల్లా. కృష్ణా ఆయు<noinclude><references/></noinclude> t6vwpekm0ftgtcr57m55xcszs7g06wn 552002 551932 2026-04-08T05:45:01Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552002 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}తాలూకా గ్రంథాలయ సేవ</p>}} ప్రజల కీవిధముగ ప్రబోధమును గల్గింప వలసిన బాధ్యత ప్రభుత్వము మీదను స్థానిక సంస్థల విూదను గలదు. కాని మన దురదృష్టముచే ఈ సంస్థ లీధర్మమును సరిగ నెరవేర్చుట లేదు. స్వార్థ త్యాగులైన యేకొలది మంది వ్యక్తులో యీ పని చేయవలసి వచ్చుచున్నది. పరిస్థితి యిట్లున్నను తాడేపల్లిగూడెము తాలూకాలో ఉన్న సుమారు ౧౧౦ గ్రామములలోను ౫౦ గ్రామ ములలో గ్రంథాలయములు వెలసియున్నవని వినుటవలన నాకమితానందము కల్గినది. సుమారు నూటికేబది గ్రామములలో గ్రంథాలయములున్న తాలూకా యింకొకటి యాంధ్ర దేశములో లేదని నా యభిప్రాయము. ఇంత ప్రశంసనీయమగు పని యీ తాలూకాలో జరుగుటకు ముఖ్యకారణ భూతులైన శ్రీ తేతలి సత్యనారాయణగారిని శ్రీ కలిదిండి గంగరాజు గారిని అభినందించుచున్నాను. {{Center|{{p|fs125}}అమూల్యమగు నూచన</p>}} గ్రామ గ్రంథాలయములను గురించి స్నేహితులొకరు ఒక సూచన చేసియున్నారు. అది అమూల్యమైనదని నేను తలచుచున్నాను. గ్రామస్తులకు తాలూకా ఆఫీసులోను, సబురిజిస్ట్రారు ఆఫీసులోను దొరకుకొన్ని యత్యవసరములైన కాగితములను గ్రామ గ్రంథాలయము వారు సేకరించి యుండవలెనని వారు చెప్పియున్నారు. ఇది నిజముగ గ్రామస్థుల కపారమైన లాభమును కూర్చగలదు. తరుచుగు లంచములకై సొమ్ముపోయ నవసరములేకుండ పోవును. స్వల్పవ్యయముతో అమిత లాభము వచ్చును. గ్రామ గ్రంథాలయోద్యోగి 'గ్రామదినచర్య' అను పుస్తకము నుంచి దానిలో ఏనాడెవరు పుట్టిరో, ఏనాడెవరు చనిపోయిలో ఏనాడెవ లేదా వాలో గెలిచిరో మున్నగు నంశములను వ్రాసి యుంచి, ఆ పుస్తకము నందరకు అందుపాటులో ఉంచుచో అది గ్రామమునకు మహోపకారము కాగలదు. {{rule |6em }} అద్భుత చికిత్స డాక్టరు టి. బి. రాజుగారి తామర తై ల ము ఈ తామరమందును ఉపయోగించుటచే మచ్చలు, నివారణ మగును. తామర తీట, చర్మముపై మచ్చలు, కుష్ఠు రాజు డాక్టరు, టి. బి. రాజు, ఆయుర్వేదిక్ కెమికల్ వర్క్సు, ఉండి (పోస్టు), పశ్చిమ గోదావరిజిల్లా. కృష్ణా ఆయు<noinclude><references/></noinclude> ttwzf5g7rh482brsmxz6ae97x6ynmzi పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/267 104 211688 551938 2026-04-07T16:05:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తెలుగు భూమి అనే మరో పత్రికను 1969లో ప్రారంభించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ నాటి ఉద్యమ సమయంలో చాలామంది రచయితలు, నాయకుల లాగానే సమైక్యవాదిగా నిలిచారు. ప్రభాకర్ జీ లాంటి సర్వోదయ...' 551938 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తెలుగు భూమి అనే మరో పత్రికను 1969లో ప్రారంభించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ నాటి ఉద్యమ సమయంలో చాలామంది రచయితలు, నాయకుల లాగానే సమైక్యవాదిగా నిలిచారు. ప్రభాకర్ జీ లాంటి సర్వోదయ మండలి ఆచార్యుల ఆశీస్సులతో సర్వోదయ సాహిత్య ప్రచారాన్ని, భూదానోద్యమ కార్యక్రమాలను వ్యాపిం పజేశారు. ఇప్పటికీ సర్వోదయ మండలి భూదానోద్యమ సంస్థలు తమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తు న్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమి లాగా హిందీ అకాడమీ ఉండాలని చెప్పి ప్రభుత్వం చేత ఏర్పాటు చేయించి దానికి ఉపాధ్యక్షులయ్యారు. హిందీ పుస్తక ప్రచురణలకు ఆర్థిక సాయం, రచయితలకు శిక్షణ శిబిరాలు నిర్వహింపచేశారు. ఒక దశలో రాష్ట్ర హైకోర్టు 1968లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న బడుగు, బలహీన వర్గాల నాయకులందరినీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చి... ఒక కార్యవర్గాన్ని ఏర్పరచి దానికి కాటం లక్ష్మీనారాయణ కన్వీనర్ అయి సుప్రీంకోర్టుకు వెల్లి హైకోర్టు తీర్పు రద్దుచేయించారు. ఈ సందర్భంలోనే లక్షలాది మంది వెనుకబడిన కులాలను సమీకరించి ఒక మహాసభ నిర్వహించారు. దానికి సాక్షాత్తు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వచ్చారు. కాటం వారు సాధించిన ఘన విజయాల్లో ఇది ఒకటి. దేశ స్వాతంత్ర్యోద్యమంలో అన్నివిధాల త్యాగాలు చేసిన దేశభక్తులకు వరం లాంటిది స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పథకం. ఈ పథకాన్ని హైదరాబాద్ వారికీ వర్తింపజేయాలని కేంద్రప్రభుత్వంతో లక్ష్మీనారాయణ గారు చర్చలు జరిపారు. మొదట కేంద్రప్రభుత్వం అంగీకరించ లేదు. మరుసటి రోజు కాటం లక్ష్మీనారాయణ తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుని సత్యాగ్రహం అనే అట్టను మెడకు తగిలించుకుని ప్రధాని నివాసం ముందు నిరాహారదీక్ష చేశారు. ఢిల్లీ పత్రికలు దీన్ని ప్రముఖంగా ప్రచురించాయి. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ లక్ష్మీనారాయణను పిలిపించుకుని ఏమిటి సంగతి అని వివరాలు అడిగారు. సంస్థానాల్లోని స్వాతంత్య్ర సమరయోధులను మీరు గుర్తించకపోవడం కన్నా మాకు అవమానం ఏమున్నది..? బ్రిటిష్ ఆంధ్ర నాయకులు ఒక బ్రిటిష్ వారిమీదనే పోరాడారు. కానీ సంస్థానాల వారు అటు సంస్థానాధి పతులకు వ్యతిరేకం గాను, ఇటు బ్రిటిష్ వారికి వ్యతిరేకం గానూ పోరాడారు. 15 ఆగస్టు మాకు స్వాతంత్య్ర దినం వచ్చినట్టు కాదా ! హైదరాబాద్ విముక్తి జరిగిన సెప్టెంబర్ 17ను స్వాతంత్ర్య దినంగా జరుపుకోమంటారా ? ఒక్క హైదరాబాద్ సంస్థాన ప్రజలే కాదు... అసలు సంస్థానాల ప్రజలు భారతీయులు అవునా.. కాదా... ప్రకటించండి అని సూటిగా, ధైర్యంగా కాటం లక్ష్మీనారాయణ ఇందిరాగాంధీని ప్రశ్నించారు. దీంతో 22 వేలమంది స్థానిక స్వాతంత్ర్య సమరయోధులకు పెన్షన్ సౌకర్యం లభించింది. లక్ష్మీనారాయణ గారు చేసిన మహత్తర కృషి హైదరాబాద్ స్వాతంత్ర్య చరిత్రను ప్రామాణిక పద్ధతిలో గ్రంథస్తం చేయించే కృషిచేపట్టారు. ఆ ప్రమాణికలో వచ్చిందే వెల్దుర్తి మాణిక్యాల రావు గారి 844 పేజీల హైదరాబాద్ స్వాతంత్య్ర సమర చరిత్ర. ఇది ఇప్పటికీ ప్రామాణిక గ్రంథం. చాలా పెద్దఎత్తున సభలను ఒక్కచేతి మీదుగా నిర్వహించడం లక్ష్మీనారాయణ గారి గొప్పతనాల్లో ఒకటి. హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమ చరిత్రను హైదరాబాద్లో అప్పటి రాష్ట్రపతి జైల్సింగ్ చేత ఆవిష్కరింపజేశారు. కాటం లక్ష్మీనారాయణ గారి కుమారులు ప్రముఖ లాయర్ కాటం రమేష్ రాసిన ఆంధ్రదేశ స్వాతంత్య్ర చరిత్రను 1992 భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్లో ఆవిష్క రింపజేశారు. పి.వి.నరసింహారావు, టి. అంజయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, భవనం వెంకట్రావు నలుగురు ముఖ్యమంత్రులతో ఒక పెద్ద సభ నిర్వహించారు. కాటం లక్ష్మీనారాయణ నిర్వహించిన సభల్లో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, పీఠాధిపతులు, స్వాతంత్ర్య సమర యోధులు, దలైలామా లాంటి వారి ఎందరో పాల్గొనేవారు. తన కోసం వీసమాత్రమైనా అడగకపోవడం, సర్వజన శ్రేయస్సు కోసం, విలువల కోసం ఎంతటి వారినైనా నిర్మొహమాటంగా విమర్శించడానికి వెనుకంజ వేయక పోవడం కాటం లక్ష్మీనారాయణ గారి వ్యక్తిత్వంలోని ప్రధాన గుణం. 86 ఏళ్ల పరిపూర్ణ జీవితం గడిపి 25 ఫిబ్రవరి, 2010న అస్తమించారు. అలాంటి వారిని స్మరించుకోవడం స్ఫూర్తిదాయకం. తెలంగాణ (246 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude> gewarrou79x713nap0wneksao116a7d పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/268 104 211689 551939 2026-04-07T16:06:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '70 కేశనకుర్తి వీరభద్రాచారి - కందాళై రాఘవాచార్య కీ. శే. కేశనకుర్తి వీరభద్రాచారి అనగానే నిజామా బాద్లో అన్ని కళల కేంద్రబిందువు అని ప్రతి వారూ స్మరించాల్సిందే! ఆరడుగుల మనిషి - న...' 551939 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>70 కేశనకుర్తి వీరభద్రాచారి - కందాళై రాఘవాచార్య కీ. శే. కేశనకుర్తి వీరభద్రాచారి అనగానే నిజామా బాద్లో అన్ని కళల కేంద్రబిందువు అని ప్రతి వారూ స్మరించాల్సిందే! ఆరడుగుల మనిషి - నల్లని కోటు టై - పొడుగాటి పాతకాలం హీరోలు గుర్తుకు వచ్చే ప్యాంటు నడిమ పాపిట, పొడుగాటి వెంట్రుకలు. చేతిలో ఐదారు పుస్తకాలు! టకటక బూట్లు చప్పుడు వరండాలో! అదిగో చారి సార్ వస్తున్నారు! కాలేజీ విద్యార్థులంతా ఆంగ్ల పాఠం కోసం ఎదురు చూస్తున్న క్షణానికి శుభ సూచకం ఆయన ఆగమనం. గిరిరాజ కాలేజీలో వృత్తిరీత్యా ఆంగ్లో పన్యాసకుడిగా ఉన్నా ఆయన ప్రవృత్తి రీత్యా తెలుగునాట ప్రసిద్ధిపొందారు. ఈ ఎక్కడో భీమవరంలో నివసించి ఉద్యోగరీత్య ఇందూరుకు వచ్చి ఈ జిల్లాను సకళ కళామయంగా పూర్ణ చంద్రుడి వెన్నెల వేదికగా తీర్చిదిద్దారు వారి సారి ఉషశ్రీ - వీరభద్రాచారిగారు కలిసి రాసిన వేంకటేశ్వర కళ్యాణం అప్పటి కళాశాల విద్యార్థులకు తెలుగు ఉపవాచక మైంది. వేదికపై నాటకమైంది. ఇలాంటి సకళ కళల సమా హారమైన కేశనకుర్తి వీరభద్రాచారిసార్ 14-05-1927 శ్రీకాకుళం జిల్లా కొర్ని'లో కేశనకుర్తి అప్పారావు, వరహాలమ్మ దంపతులకు జన్మించారు. మాతో అప్పుడప్పుడు చెప్పేవారు - 12వ యేటనే అనేక నాటికలు రాసి వేసేవాళ్ళమని! అవి రాతప్రతులే ఐనాయిగాని అచ్చు ప్రతులు కాలేదని చింతించేవారు. 1969 సంక్రాంతి 14న నిజామాబాద్లో గొప్ప కవుల వేదిక అవతరించింది. ఈ మకర సంక్రాంతి శుభవేళ ఇందూరులో సాహితీ వికాసం! సరికొత్త ఉదయం! దీనికి వేసింది కేశనకుర్తి వీరభద్రాచారిగారే! ఈ సంస్థ పేరే 'ఇందూరు భారతి రచయితల సమాఖ్య'- వీరికి చేదోడు వాదోడుగా సైబ పరంధాములు, ఆపుకారి సూర్యప్రకాశ్, బద్దూరి మొదలగు యువకిశోరాలు చారిగారిని అనుసరించారు. ఆయనకు ఆలోచన రావడం మేమందరం అమలుపరచడం జరిగిపోయేవి! ఇందూరు భారతి ఆవిర్భావం తరువాత అనేకులు కలం పట్టి కవులైనారు కవయిత్రులైనారు! గొప్పవాళ్ళను ఆహ్వానించి వారితో ప్రసంగాలు ఇప్పించి యువకులకు ప్రేరణ అందేలా చారి సార్ ప్రణాళిక రచించేవారు. దాశరథి కృష్ణమాచార్య, బెజవాడ గోపాలరెడ్డి దేవులపల్లి రామానుజారావు, జగ్గయ్య, నండూరి రామకృష్ణ మాచార్య, నార్ల చిరంజీవి, వానమామలై వరదాచార్యులు, సి.నా.రె. ఇలాంటి పెద్దలను ఆహ్వానించి ఇందూరు భారతిని సుప్రసిద్ధం చేశారు. కవిత్వమే కాకుండా గానం నాట్యం కోసం 'సరస్వతీ గానసభను ప్రారంభించారు. అనేకమంది అమ్మాయిలు తెలంగాణ (247) తేజోమూర్తులు ban<noinclude><references/></noinclude> 4bck3gddx2wkm0jj3mfbl5o3a50kog4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/269 104 211690 551940 2026-04-07T16:07:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఇంటింటా నాట్య సరస్వతులు, గాన కోకిలలూ ఐనారు. సాయంత్రం బాలవిహార్ పిల్లలతో సందడి సందడిగా విడివిడిగా అనేక నాటిక సంస్థలు ఎవరికివారే అన్నట్లుగా ఉండేవారు. వీరభద్రాచారి గారి సలహ...' 551940 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఇంటింటా నాట్య సరస్వతులు, గాన కోకిలలూ ఐనారు. సాయంత్రం బాలవిహార్ పిల్లలతో సందడి సందడిగా విడివిడిగా అనేక నాటిక సంస్థలు ఎవరికివారే అన్నట్లుగా ఉండేవారు. వీరభద్రాచారి గారి సలహాల మేరకు అన్ని నాటక సంస్థలు ఒకటై 'నగరనట సమాఖ్యగా ఒక్కటైనారు. ఈ సమాఖ్య నేపథ్యంలో చారి సార్ విశాల హృదయం ప్రగతి ఆలోచనలే కారణం. ఈ సంస్థ ద్వారా అనేక నాటకాల పోటీలు నిర్వహింప జేసి - గొప్ప నటులను ఆహ్వానించి ఇందూరు పేరు తెలుగు నాట సుప్రసిద్ధం చేశారు. గానసభ ద్వారా శోభానాయుడు నరసింహాచారి, వసంత, ఈమని శంకరశాస్త్రి చిట్టిబాబు పర్విన్ సుల్తానా వంటి సుప్రసిద్ధులను ఆహ్వానించి నిజామాబాదున్ను రాయల యుగంగా మార్చారు. సాహితీ కళాసంస్థలలోనే కాకుండా సేవాసంస్థలైన Lions, Lio మొదలైన క్లబ్బుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహింపజేసేవారు. యువకులందరికి ఆంగ్లం ఎలా మాట్లాడాలో శిక్షణ సైతం ఇచ్చేవారు. వేదికపై వ్యాఖ్యానం ఎలా చేయాలో, కవిత్వం ఎలా చదవాలో, వేదిక మంగళాచరణ గీతం నుండి వందన సమర్పణ వరకు పెట్టి మెలుకువలు ఉపయోగించాలో ఇవన్నీ యువతకు నేర్పించి గొప్ప కవులుగా నటులుగా గాయకులుగా తీర్చిదిద్దారు. అప్పటి సాహిత్య అకాడమిలో దాదాపు తన జీవిత కాలము సభ్యుడిగా ఉండి నిజామాబాద్కు ఎనలేని సాహిత్య సాంస్కృతిక సేవలనందించారు. తాను ఎన్నో కవితలు పద్యాలు రాసినా అవి అచ్చుకు నోచుకోలేదని, అలాంటి స్థితి యువతకు ఉండకూడదని ఇందూరు భారతి ద్వారా వెలుగులోకి, నగ్న చిత్రాలు, ప్రతి సంవత్సర సావనీర్లను ప్రింటు చేయించారు. 24 గంటలలో దాదాపు అర్ధరాత్రి దాటేవరకు బిజీగా ఉండేవారు. మళ్లీ ఉదయమే ఇంగ్లీషు ట్యూషన్స్ చెప్పేవారు. అప్పుడప్పుడు కవిత్వం సామాన్య జనానికి అందాలని మన రాత్రిపూట గ్రామాల్లో కవిసమ్మేళనం నిర్వహించేవారు. కంజర్ల బోర్గాం ముబారక్ నగర్, మొదలైన గ్రామాల్లో అందరూ భోంచేసి వచ్చిన తరువాత కవిత్వం వేదిక ప్రారంభమయేది. అందరు కవులు సామాన్య జనానికి అర్థమయేలా ఉన్నా కవిత్వాన్ని అందించేవారు. ఈ కవి సమ్మేళనం దాదాపు అర్ధరాత్రి దాటిపోయేది. ఇలాంటి స్ఫూర్తి కలిగించింది చారి సారే. - అంతేగాక పున్నమి వెన్నెల రాత్రుల్లో ఊరి బయట చెరువుకట్ల మీద కవి సమ్మేళనం నిర్వహింపజేసేవారు. బొడ్డెము, చెరువు మంచిప్ప చెరువు, అలీసాగర్ మొదలైన చెరువుల వద్దకు పెట్రోమాక్స్లతో వెళ్లేవాళ్ళం. దాదాపు 10 గంటల రాత్రి గడిచిపోయేది. కవితా విభావరులు ఇలా అనేకమంది యువకవుల్లో ప్రేరణగా నిల్చిపోయాయి. చర్చలు, సమావేశాలు, గృహ సమావేశాలు, కవుల సంకలనాలపై ఉపన్యాసాలు, క్లుప్త గోష్టులు, కవితాపోటీలు, అనేకమందికి అవార్డులు, పండుగ పూట కవిత్వం వేడుకలు. ఇలా భోజరాజు కాలంలో సాగినట్లే కేశనకుర్తి వీరభద్రాచారి గారి మార్గదర్శకత్వంలో ఇందూరు భారతి సాహితీ శిఖరంగా ఎదిగింది. 1985లో ఆంగ్లోపన్యాసకులుగా పదవీ విరమణ గావించినా ఏనాడు అలసిపోని కళాతపస్విగా తమ సేవలను అందిస్తూ వచ్చారు. నిరంతర సేవలు అందించడం ఎప్పుడు విరామమెరుగని ట్యూషన్లు మొదలైన వాటివలన కేశవకుర్తి వీరభద్రాచారిగారికి శ్వాసకోశాల ఇబ్బంది తలెత్తింది. చికిత్స నిమిత్తం చెన్నైలోని బిజయా హాస్పిటల్కు వెళుతున్నప్పుడు అందరం చారిగారికి ధైర్యం చెపుతూ పసిపిల్లాడిలా వీడ్కోలు చెప్పాం! కానీ చారి సార్ అనారోగ్యం తీవ్రతై అక్కడే 04-06-1986 నాడు కళాకీర్తిశేషులైనారు. నిజామాబాదులో వారు పరమపదించి ఉంటే కొన్ని కిలోమీటర్ల పర్యంతరం కళాభిమానులు చారి సార్క వీడ్కోలు పలికేవారు. అంత్యక్రియలూ సన్మానప్రాయంగా జరిగేవి. కానీ చెన్నైలో కాలధర్మం చెందటంతో వారిని ఇక్కడికి రప్పించే అవకాశం రాలేదు. మా అందరికీ కడచూపుకూడా కరవైంది. నిజామాబాదును ఇలా సర్వతోకళావేదికగా తీర్చిదిద్దిన darsh తెలంగాణ ( 248 తేజోమూర్తులు ఉండడంత<noinclude><references/></noinclude> snmw2u2hp5v7xsv3ufc5i33l371wus7 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/19 104 211691 551961 2026-04-07T23:25:40Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551961 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|11}}</noinclude>మును దుర్లభముచేసినవి. జనకునిరాజయోగము, శుకుని మోక్షసన్న్యాసయోగము, ధర్మజుని కర్మయోగము, భీష్మవిదురాదుల భక్తియోగము కామ్యపరములై ధర్మప్రవృత్తి నశించినది. మతములు ప్రబలినవి. పాంచభౌతికవాదము, శాక్తేయము, అద్వైతము, బ్రాహ్మణ్యము మొదలగుమతములు ప్రవృత్తినివృత్తిమార్గములను పరిహాసాస్పదము చేసినవి. ధర్మము చెడినది. ఇహపరములు దుఃఖమయము లైనవి. పరపీడనము ప్రబలినది. రాజులు, బ్రాహ్మణులు, వైశ్యశూద్రాదులు సాత్త్వికవృత్తినివిసర్జించి రాజసతామసపరాయణులై లోకపీడకుఁ గారకు లైరి. కర్మకలాప మీలోకమునను పరలోకమునను కామ్యరూపమును దాల్చి సంక్షోభమును గలుగఁజేసినది. కర్మ జిజ్ఞాస, ధర్మజిజ్ఞాస మతప్రవృత్తియందు మహాపరివర్తనము గలుగఁజేసినవి. మహావీరుఁడును సిద్ధార్థుఁడును మత ప్రవృత్తియందు, ప్రజాహృదయమునందు మహాసంచలనమును గలుగఁజేసిన యవతారమూర్తులు. ఈయవతారమూర్తులలో క్రీ.శ.నకు పూర్వము 597-527 వఱకును వర్ధమానుఁడును, 167-487 వఱకును బుద్ధదేవుఁడును జీవించి ధర్మప్రవృత్తియందు మహాపరివర్తనమును గలుగఁజేసిరి. '''కర్మజిజ్ఞాస''' జీవయాత్రయందు జీవజాలములు సుఖమును గోరుటయును, దుఃఖమును నివారించుటయును సహజముగ<noinclude><references/></noinclude> ch4lsxlogy0s6krj5e7s3yqens93xrn పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/20 104 211692 551962 2026-04-07T23:31:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551962 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|12}}</noinclude>నున్నవి. సుఖదుఃఖస్వరూపములను నిరూపించుటయును, సుఖదుఃఖములకు కార్యకారణములను నిర్ణయించుటయును సాధ్యము గాకున్నవి. సుఖము దుఃఖరూపమును దాల్చుచున్నది. దుఃఖము సుఖరూపమును దాల్చుచున్నది. భోగములు వ్యాధు లగుచున్నవి. వ్యాధులు ఆరోగ్యమునకు సాధనంబు లగుచున్నవి. ప్రపంచమునందు సంపన్నులు దరిద్రులు, సజ్జనులు దుర్జనులు, సురూపులు కురూపులు, పండితులు పామరులు, ధీరులు భీరువులు, సాధువులు క్రూరులు, భక్తులు విద్వేషులు మొదలగు విభేదములకు కర్మసిద్ధాంతము సమాధానముగ నున్నది. పూర్వజన్మకృతము లైన సుకృతదుష్కృతములకు ఫలము వర్తమాన జన్మమునందును. వర్తమానజన్మమునందుఁ జేసిన కర్మములకు ఫలము పరలోకజన్మాంతరములందును గలుగుచున్నటులు జన్మాంతర సిద్ధాంతము బోధించుచున్నది. మానవులు స్వకర్మవశమునను తమసుఖదుఃఖములకు తామే కారకులగుచున్నారు. ఇహలోకమునందు సాధ్యముగాని భోగములు పరలోకమునందుఁగలుగుటకు కర్మములను జేయుచు దుఃఖపరంపరల ననుభవించుచున్నారు. మానవులు నిరతి శయానందము ననుభవించుటకు జ్ఞానము శరణ్యముగ నున్నది. కర్మపరిత్యాగములేక ఫలరహితమైన మోక్షము సాధ్యము గాకున్నది. కర్మానుష్ఠానము చేయనిచో<noinclude><references/></noinclude> 9hy0upmgxicqg65tgqtpxexv6qr400h పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/21 104 211693 551963 2026-04-08T01:20:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551963 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|13}}</noinclude>జీవయాత్రయె దుస్తరమగుచున్నది. “శరీరయాత్రా౽పిచన ప్రసిద్ధ్యేదకర్మణః" "శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్” "కర్మణైవహి సంసిద్ధిమాస్థితా జనకాదయః" ఇత్యాది ధర్మసిద్ధాంతములు కర్మప్రయోజనమును విశదముచేయుచున్నను కర్మాకర్మములను నిర్ణయించుట పండితులకు సయితము దుస్తరముగ నున్నది. శ్రీకృష్ణుడు కర్మవిషయమై చేసినబోధ విచారయోగ్యముగ నున్నది. <poem> {{left margin|5em}} "శ్లో. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్దవ్యంచ వికర్మణః, అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః." </poem> ప్రవృత్తియందు కర్మ వికర్మ అకర్మరూపములను ప్రవర్తించుచున్న కర్మగతిని గ్రహించుట గహనముగ నున్నది. కర్మమం దకర్మమును అకర్మమందుకర్మమును గనుఁగొనుటయె కర్మజ్ఞానమునకు సాధనముగ నున్నది. ఫలాపేక్షలేనికర్మము దుఃఖనివృత్తికిని సుఖప్రాప్తికిని సాధనంబైనను కర్మయోగారూఢమునకు సామాన్యముగా ప్రయోజనకరము గాకున్నది. నిమిత్తము లేకను కర్మములను జేయకుండుట జీవజాలములకు పరిపాటి యైనది. పశువులు పొట్ట నింపుకొనుట కాహారసంపాదనమునకుఁ గడంగు చున్నవి. ఆహారసంపాదనమునందు ధర్మాధర్మ వివక్ష లేకను పశువులు క్రూరకర్మములను జేయుచున్నవి. ఆహారము లభించినతరువాతను మరల అవసర<noinclude><references/></noinclude> 19jr7t13uw31oewvkbxx95g8ngpzrp5 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/22 104 211694 551967 2026-04-08T01:29:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551967 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|14}}</noinclude>మేర్పడువఱకును కాలమును నిద్రాలసత్వాదులందుఁ గడపుచున్నవి. పశువులరీతిని నరులును ఉదరపోషణార్థము వారిజీవయాత్రను వినియోగించుట యవివేకముగ నున్నది. జీవయాత్ర యందు కర్మానుష్ఠానము ప్రాణసంరక్షణమునకు సాధనంబుగనున్నను సామాన్యముగా కామ్యకర్మములందు లగ్నమగుచు దుఃఖభాజనం బగుచున్నది. కర్మానుష్ఠానము విషయేంద్రియారాధనమునకు వినియోగపడునపుడు పరిమితమై దుఃఖభాజనంబగుచున్నది. ఖండములైన దేహేంద్రియాదు లఖండమైన విశ్వమును భోగించుట యసంభవము. దేహేంద్రియాదులును దృశ్యప్రపంచమును నశించుచున్నవి. నశ్వరమైన పదార్థములు శాశ్వతమైనసుఖమును గలుగఁజేయఁజాలవు. ధనరాసులు రాజ్యములు మేడలు కామినులు చీనాంబరములు వస్తు వాహనములు భక్ష్యభోజ్యములు జీవయాత్రయందు భోగమునందును అభావమునందును సంతృప్తిని గలుఁగఁజేయ జాలక దుఃఖమునకు సాధనంబులగుచున్నవి. భోగములు రోగము లగుచున్నవి. అభావము విషాదాలసత్వరూపమును దాల్చుచు హృదయదౌర్బల్యమును గలుగఁజేయుచున్నది. జీవయాత్రయందు కర్మానుష్ఠానము సుఖసాధనం బగుటకు ఫలరహితమైన కర్మయోగానుష్ఠానము సాధనంబుగ నున్నది. దేహేంద్రియాదులు కామ్యకర్మము<noinclude><references/></noinclude> 5mwcya6l13qgmzkivv45x295gjkp89n పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/23 104 211695 551969 2026-04-08T01:40:38Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551969 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|15}}</noinclude>లందు లగ్నము గాక నియతకర్మములందు లగ్నమగునపుడు కర్మములుసుఖప్రాప్తికిని, కామ్యకర్మములందు లగ్నమగునపుడు దుఃఖప్రాప్తికిని సాధనంబు లగుచున్నవి. కామ్యకర్మములుహింసారూపమును దాల్చుచు కర్తకును కార్యమునకును సంతృప్తిని గలుగఁజేయక దుఃఖభాజనంబులుగ నున్నవి.నియతకర్మములు త్యాగపరములై కర్తకును కార్యమునకునుసుఖసాధనంబులుగనున్నవి. ప్రవృత్తియందు కామ్యకర్మములకును నియతకర్మములకును సరిహద్దునిర్ణయించుటదుష్కరముగ నున్నది. జీవయాత్రయందు జీవజాలములనవరతము కర్మమందు లగ్నమగుచున్నవి. జీవయాత్రయందు జీవముల కొకక్షణకాలమైనను అకర్మప్రవృత్తి సాధ్యము గాదు. <poem> {{left margin|5em}} శ్లో. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠ త్యకర్మకృత్, కార్యతే హ్యవశః కర్మ సర్వైః ప్రకృతిజై ర్గుణెః. శ్లో. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః, శరీరయా౽త్రాపిద తే నప్రసిద్ధ్యే దకర్మణః. శ్లో. సన్న్యాసః కర్మయోగశ్చే నిశ్శ్రేయసకరావుభౌ, తయోస్తు కర్మసన్న్యాసా త్కర్మయోగో విశిష్యతే. </poem> జీవములకు జననము ప్రవృత్తికిఁ గారణం బగుచున్నది. కర్మానుష్ఠానము జీవయాత్రయం దవసరం బగుచున్నది. దేహయాత్ర కవసరమైన ఆహారనిద్రాదులును కర్మసాధ్య<noinclude><references/></noinclude> iykgb8xmwi625ub0dsk4hp4izdcw2bo పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/24 104 211696 551970 2026-04-08T01:47:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551970 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|16}}</noinclude>ములు. కర్మసన్న్యాసముకన్నను కర్మయోగము విశేషముగనున్నది. దేహధారులకు సకలకర్మములనువిడుచుట శక్యముగాదు; కర్మఫలత్యాగము కర్మత్యాగముగ నున్నది. జీవయాత్రయందుకర్మయోగమునకును కర్మసన్న్యాసయోగమునకునుగల ప్రతిఘటనము వివిధములైనధర్మసిద్ధాంతములకును మతసిద్ధాంతములకును మూలముగ నున్నది. జీవయాత్రయందు కర్మయోగ మిహలోకసౌఖ్యములకు వినియోగపడునదియును పరలోకసౌఖ్యములకు వినియోగపడునదియును నిర్ణయించుట దుర్లభము. కర్మము జీవయాత్రకు సాధనముగను ప్రతిబంధకముగను నున్నది. చతుర్విధపురుషార్థసిద్ధికిని కర్మమే సాధనముగ నున్నది. కర్మములు కేవలము దేహేంద్రియాదులకు వినియోగపడునపుడు జీవయాత్రకు ప్రతిబంధక మగుచున్నవి. కర్మములు దేహేంద్రియాతీతమైనయాత్మార్థము వినియోగపడునపుడు పురుషార్థమునకు సాధనంబు లగుచున్నవి. పురుసార్థసాధనములు ధర్మార్థకామమోక్షములందు ధర్మము జీవయాత్రకు ముఖ్యసాధనముగ నున్నది. మానవులు దేహయాత్రను నీతినియమములు విడిచి అర్థకామములను కాంక్షించుచు జీవయాత్రను జేయుట పరమానర్థములకు మూలమగుచున్నది. కామక్రోధలోభాదు లాత్మనాశన<noinclude><references/></noinclude> 8cwihepu1gfiyha4kg3oej5nxr43xxj పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/25 104 211697 551971 2026-04-08T01:57:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551971 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|17}}</noinclude>మునకును పరపీడనమునకును గారణంబగుచున్న విధమును సంసారయాత్ర సహస్రముఖముల విశదము చేయుచున్నది. ధర్మానుకూల మైన యర్థకామము లాత్మార్థముగాను పరార్థముగాను వినియోగపడుచున్నవి. జీవయాత్రయందు ప్రవృత్తియందు కర్మయోగము నివృత్తియందు కర్మసన్న్యాసయోగము ధర్మపరములై మోక్షమార్గమునకు సాధనంబులుగ నున్నవి. మోక్షమునకు సన్న్యాసయోగము సాధనము గాని కామ్యయోగము సాధనము గాదని ప్రస్థానత్రయము పలువిధముల బోధించుచున్నది. గీతాశాస్త్రము కర్మమీమాంస వివరముగను జేయుచు కర్మయోగమును ప్రశంసించుచున్నది. మోక్షసన్న్యాసయోగమునందు కర్మరహస్యము సంగ్రహముగాఁ దెలుపఁబడినది. <poem> {{left margin|5em}} శ్లో. కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః, సర్వకర్మఫలత్యాగం ప్రాహు స్త్యాగం విచక్షణాః. శ్లో. యజ్ఞదానతపఃకర్మ నత్యాజ్యం కార్యమేం తత్, యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్. శ్లో. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలానిచ. కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మత ముత్తమమ్. శ్లో. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః, యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీ త్యభిధీయతే. </poem><noinclude><references/></noinclude> maywt7htedr52udn8yek66bf1ly0ey1 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/26 104 211698 551978 2026-04-08T04:26:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551978 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|18}}</noinclude>దేహధారులు సకలకర్మములను పరిత్యజింపఁజాలరు. మానవజన్మమును సార్థకము చేయఁగల యజ్ఞము, దానము, తపస్సు మొదలగు కర్మము లవశ్యాచరణీయము లై యున్నవి. నియతకర్మములనైనను ఫలాపేక్షలేక ఆత్మశుద్ధికొఱకుఁ జేయవలయును. కామ్యకర్మములను కర్మఫలమును విడనాడుట మోక్షమునకు సాధనముగ నున్నది. కర్మప్రధానమైన వైదికమతము జ్ఞానప్రధానమైన వేదాంతరూపమును దాల్చినది. జీవయాత్రయందు వైదికకర్మములకును వేదాంతసూత్రములకును ధర్మానుసంధానము దుస్తరమైనది. శాంతికర్మములు వీరకర్మములు కామ్యపరములైమహాసంక్షోభమును గలుగఁజేసినవి. బ్రాహ్మణు లహంకారపరాయణులై శబ్దవాదములతో కాలయాపనమును చేయుచుండిరి. క్షత్రియులు వీరావేశవశులై మహాసంక్షోభమును గలుగఁజేయుచుండిరి. ఇతరు లజ్ఞానాంధకారమగ్ను లై స్వధర్మనిర్వహణమును చేయఁజాలకుండిరి. భారతయుద్ధయుగమునందు సంప్రాప్తమైన ధర్మవిప్లవము బుద్ధయుగమునందును సంప్రాప్తమైనది. బుద్ధభగవానుఁడు ధర్మోద్ధరణమును జేసి సంక్షోభమయమైన ప్రవృత్తియందు శాంతిని ప్రతిష్ఠించెను.<noinclude><references/></noinclude> bepgags1gyjqp7hvkzv5gwwdy8k7t38 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/27 104 211699 551979 2026-04-08T04:34:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551979 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|19}}</noinclude>'''బుద్ధదేవుఁడు''' శ్రీకృష్ణుఁడు విజయునకు కురుక్షేత్రమునందు కర్మయోగప్రాశస్త్యమును బోధించి విజయుని కర్మయోగారూఢుని జేసి ధర్మోద్ధరణమును జేయఁగలిగెను. <poem> {{left margin|5em}} శ్లో. యస్య నాహంకృతో భావో బుద్ధి ర్యస్య నలిప్యతే, హత్వాపి స ఇమాన్ లోకాన్ న హన్తి న నిబద్ధ్యతే. </poem> సంకల్పమును బూనకుండ అహంకారభావమును విడిచి ఎవరైనను సమస్తలోకములను నాశనముచేసినను వారు చంపినవారును దుర్జనులును కారు అని శ్రీకృష్ణుఁడు చేసిన ధర్మోపదేశము కాలాంతరమునందు విపరీతార్థములకు పాలైనది. ఆత్మపరమైన ధర్మము దేహపరమైనది. త్యాగపరమైనధర్మము కామ్యపర మైనది. వైదికకర్మములు వీరకర్మములు హింసాయత్తములైకామ్యరూపములను దాల్చినవి. పశుహింసలు సంగ్రామములు ప్రబలినవి. యజ్ఞయాగాదులయందు బ్రాహ్మణుల పౌరోహిత్యము క్రియాహీన మైనది. ప్రజలయందు పరిజ్ఞాన మంతరించినది. ధర్మముచెడినది. సంఘబలము క్షీణించినది. ధర్మప్రవృత్తి పదములందువలెను కర్మములయందుఁ గనఁబడకుండెను. ప్రజలు దుఃఖార్తులై పరితపించుచుండిరి. ఇట్టివిషాదస్థితియందు సిద్ధార్థఁడు పుట్టి ధర్మోద్ధరణమును జేసినవిధమును వైదికబౌద్ధమతచరిత్ర విశదము చేయుచున్నది.<noinclude><references/></noinclude> oka2e801uarogvj9ernpoce65ds6t6u పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/28 104 211700 551980 2026-04-08T04:41:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 551980 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|20}}</noinclude>బుద్ధఁడు వైదికవేదాంతమతసిద్ధాంతములకు నూతన భావార్థమును గల్పించి వానిని కర్మపరముచేసెను. బుద్ధుఁడు ప్రజలధర్మలక్ష్యమును అజ్ఞాతమైన పరలోకధర్మసిద్ధాంతములందు లగ్నము చేయకను సుజ్ఞాతమైన ఇహలోకధర్మములందు లగ్నముచేసి ధర్మాభ్యుదయమును చేయగలిగెను. జీవయాత్రయందు కామ్యార్థములందు లగ్నమైన ప్రజాలక్ష్యమును ధర్మార్థములందు లగ్నముచేసి నిర్వాణసాధనమును ప్రజలకు బోధించెను. '''నిర్వాణము- మోక్షము''' బుద్ధుఁడు చేసినధర్మబోధనలు వైదికమతధర్మమునందు నూతనభావమును స్థాపించినవి. ధర్మము వైదికమతమునకును బౌద్ధమతమునకును మూలాధారము. వైదికమతమునందు ధర్మలక్ష్య మిహపరములందు నిమగ్నమగుచున్నది కర్మలు ధర్మసాధనమునకు వినియోగపడుచున్నవి. కర్మలు దుఃఖమునకును మోక్షమునకును గారణములు. ఫలాపేక్షలేనికర్మలు మోక్షమునకును ఫలాపేక్షగల కర్మలు బంధమునకును గారణములు. వైదికమతధర్మమునందు కర్మలు హింసాత్మకమైనను యజ్ఞార్థము చేయబడినపుడు బంధకమునకు గాకను మోక్షమునకు సాధనంబు లగుచున్నవి. ఈ కర్మయోగరహస్యమును<noinclude><references/></noinclude> 5mugd9au2vc3cqiqbgd5xe54z5x3bnx రచయిత:కిళాంబి రంగాచార్యులు 102 211701 551987 2026-04-08T05:35:06Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = కిళాంబి |అసలుపేరు = రంగాచార్యులు |పేరు_మొదటి_అక్షరం = ర |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కిళాంబి రంగాచార్యులు |వికీవ్యాఖ్య_లం...' 551987 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కిళాంబి |అసలుపేరు = రంగాచార్యులు |పేరు_మొదటి_అక్షరం = ర |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కిళాంబి రంగాచార్యులు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * ''[[ధమ్మపదము]] '' (1927) oevvzbnl9e4bu55aq6kk0t3ubcfsafa 551990 551987 2026-04-08T05:36:38Z Rajasekhar1961 50 /* రచనలు */ 551990 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కిళాంబి |అసలుపేరు = రంగాచార్యులు |పేరు_మొదటి_అక్షరం = ర |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కిళాంబి రంగాచార్యులు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * ''[[ధమ్మపదము]] '' (1927) {{smallscanlink|Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf}} l60l0h3n9g2kr43ly8k4whdlausilre 551991 551990 2026-04-08T05:36:52Z Rajasekhar1961 50 /* రచనలు */ 551991 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కిళాంబి |అసలుపేరు = రంగాచార్యులు |పేరు_మొదటి_అక్షరం = ర |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కిళాంబి రంగాచార్యులు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * ''[[ధమ్మపదము]] '' (1927) {{small scan link|Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf}} nz6ldni1zernx2oxc5f7l33uzfcafsu పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.10 (1937).pdf/26 104 211702 552017 2026-04-08T06:19:20Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552017 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}గ్రంథాలయోద్యమము గ్రామస్థుల కేట్లు సహాయపడగలదు?</p>}} {{Center|'''సంభాషణము'''}} [యథాశక్తి గ్రంథాలయ సేవచేయుచున్న సేవకులు ఇప్పుడు ఆంధ్రదేశ మందు పలువు రున్నారు. ఈ నడుమ ఒక గ్రంధాలయా యాభిమానికిని, మా కార్యనిర్వాహక సంఘాధ్యక్షువకును జరిగిన సంభాషణమును దిగువ పొందుపరచినాము. దీనివలన గ్రంథాలయ సేవకులు గుర్తింపవలసిన అంశములు కలవని ఇది ప్రకటింపనైనది). {{right|ఆం॥ గ్ర॥ సం॥)}} అభిమాని:-మన దేశములో నూటికి తొంబది మంది ప్రజలు గ్రామములలో ఉన్నారు కదా! గ్రంథాలయోద్యమము వీరికేమైనా సహాయపడగలదా! అధ్యక్షుఁడు:-తప్పక సాయపడఁగలదు; ఆంధ్రదేశగ్రంథాలయసంఘోద్దేశము అదే. అభిమాని:- మీ సంఘోద్దేశముసం అదియనుటనే నెరుగుదును. ఆఉద్దేశముయొక్క ఆచరణను గురించియే నాసందేహము. గ్రంథాలయోద్యమ నాయకులలో గ్రామముల పరిస్థితులను తెలిసికొన్నవారెవరైన కలరా? యని నేను ప్రశ్నింపఁగోరెదను. అధ్యక్షుఁడు:-ఏలలేరు! పెక్కురుఉన్నారు. గ్రామ పరిస్థితులను గుఱించినాకున్నూ పరిచయము గలదు. అభిమాని:- గ్రంథాల యోద్యమము క్రింద గ్రామములలో మీరు ఏయే శాఖలను అభివృద్ధిచేయఁదలచెదరు! అధ్యక్షుఁడు:- గ్రామములలోని ఏశాఖయు గ్రంథాలయోద్యమమునకు సంబంధింపనిది లేదు. ఆయా గ్రామములలోని సేవకుల పటుత్వమును బట్టి శాఖలు ఎంతవరకైనను అభివృద్ధి చేయవచ్చును. ఇపుడు గ్రంథాలయములు పత్రికాపుస్తక పఠనమునకును తదభిమానమును ప్రజలలో వ్యాప్తి చేయుటకును తోడ్పడుచున్నవి. నిరక్షరత్వ నిర్మూలన ప్రయత్నము లిప్పుడిప్పుడే జరుగుచున్నవి. . అభిమాని:-ఇది కొంత నిజమే కావచ్చును, కాని మొత్తముమీద ఊహలలో ఉన్నంత ఆచరణలో కనబడదు. మీరు చెప్పే పటుత్వము ఎక్కడనులేదని నా తలంపు అక్కడక్కడ ఆవేశముతో కూడిన మాటలు మాత్రము వినవచ్చుచుండును; ఈ ఉద్యమ మందు నాయకులకు లక్ష్యమున్నట్లు కానరాదు. గ్రామానుభవముకల నాయకు లెవరును లేరు; ప్రజలును, నాయకులును, తమ్ము తాము ఆత్మవంచన చేసుకొనుచున్నారని నా అనుభవము. ఇట్టి పరిస్థితులలో మీబోటి అనుభవశాలురు ముందు కర్తవ్యమేదో ఆలోచింప వలసినదని నేను ప్రార్థించుచున్నాను. అధ్యక్షుఁడు:-మీ మాటలనుబట్టి మీకు మాటలతో సమాధానము చెప్పుటకంటే ఆదర్శమగు కొంత పనిచేసి ప్రత్యక్ష పఱుచుటయే తగిన సమాధానమగునని తలచెదను. రాష్ట్రమందక్కడక్కడ జరుగుచున్న పనియటుండ, ఒక్క మాసము ప్రత్యేక కృషిసలిపి, గ్రంథాలయోద్య మాదర్శమును ప్రత్యక్షపఱుప ప్రయత్నించెదను. అటు<noinclude><references/></noinclude> 8nqm71qtmnxw6grwkz83t1mt2f7qxvb 552021 552017 2026-04-08T06:26:37Z Brjswiki 6801 552021 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}గ్రంథాలయోద్యమము గ్రామస్థుల కేట్లు సహాయపడగలదు?</p>}} {{Center|'''సంభాషణము'''}} [యథాశక్తి గ్రంథాలయ సేవచేయుచున్న సేవకులు ఇప్పుడు ఆంధ్రదేశ మందు పలువు రున్నారు. ఈ నడుమ ఒక గ్రంధాలయా యాభిమానికిని, మా కార్యనిర్వాహక సంఘాధ్యక్షువకును జరిగిన సంభాషణమును దిగువ పొందుపరచినాము. దీనివలన గ్రంథాలయ సేవకులు గుర్తింపవలసిన అంశములు కలవని ఇది ప్రకటింపనైనది). {{right|ఆం॥ గ్ర॥ సం॥)}} అభిమాని:-మన దేశములో నూటికి తొంబది మంది ప్రజలు గ్రామములలో ఉన్నారు కదా! గ్రంథాలయోద్యమము వీరికేమైనా సహాయపడగలదా! అధ్యక్షుఁడు:-తప్పక సాయపడఁగలదు; ఆంధ్రదేశగ్రంథాలయసంఘోద్దేశము అదే. అభిమాని:- మీ సంఘోద్దేశముసం అదియనుటనే నెరుగుదును. ఆఉద్దేశముయొక్క ఆచరణను గురించియే నాసందేహము. గ్రంథాలయోద్యమ నాయకులలో గ్రామముల పరిస్థితులను తెలిసికొన్నవారెవరైన కలరా? యని నేను ప్రశ్నింపఁగోరెదను. అధ్యక్షుఁడు:-ఏలలేరు! పెక్కురుఉన్నారు. గ్రామ పరిస్థితులను గుఱించినాకున్నూ పరిచయము గలదు. అభిమాని:- గ్రంథాల యోద్యమము క్రింద గ్రామములలో మీరు ఏయే శాఖలను అభివృద్ధిచేయఁదలచెదరు! అధ్యక్షుఁడు:- గ్రామములలోని ఏశాఖయు గ్రంథాలయోద్యమమునకు సంబంధింపనిది లేదు. ఆయా గ్రామములలోని సేవకుల పటుత్వమును బట్టి శాఖలు ఎంతవరకైనను అభివృద్ధి చేయవచ్చును. ఇపుడు గ్రంథాలయములు పత్రికాపుస్తక పఠనమునకును తదభిమానమును ప్రజలలో వ్యాప్తి చేయుటకును తోడ్పడుచున్నవి. నిరక్షరత్వ నిర్మూలన ప్రయత్నము లిప్పుడిప్పుడే జరుగుచున్నవి. . అభిమాని:-ఇది కొంత నిజమే కావచ్చును, కాని మొత్తముమీద ఊహలలో ఉన్నంత ఆచరణలో కనబడదు. మీరు చెప్పే పటుత్వము ఎక్కడనులేదని నా తలంపు అక్కడక్కడ ఆవేశముతో కూడిన మాటలు మాత్రము వినవచ్చుచుండును; ఈ ఉద్యమ మందు నాయకులకు లక్ష్యమున్నట్లు కానరాదు. గ్రామానుభవముకల నాయకు లెవరును లేరు; ప్రజలును, నాయకులును, తమ్ము తాము ఆత్మవంచన చేసుకొనుచున్నారని నా అనుభవము. ఇట్టి పరిస్థితులలో మీబోటి అనుభవశాలురు ముందు కర్తవ్యమేదో ఆలోచింప వలసినదని నేను ప్రార్థించుచున్నాను. అధ్యక్షుఁడు:-మీ మాటలనుబట్టి మీకు మాటలతో సమాధానము చెప్పుటకంటే ఆదర్శమగు కొంత పనిచేసి ప్రత్యక్ష పఱుచుటయే తగిన సమాధానమగునని తలచెదను. రాష్ట్రమందక్కడక్కడ జరుగుచున్న పనియటుండ, ఒక్క మాసము ప్రత్యేక కృషిసలిపి, గ్రంథాలయోద్య మాదర్శమును ప్రత్యక్షపఱుప ప్రయత్నించెదను. అటు<noinclude><references/></noinclude> fo6icwy5051h04dxdr5gr8jt2d1sfti 552022 552021 2026-04-08T06:28:18Z Brjswiki 6801 552022 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}గ్రంథాలయోద్యమము గ్రామస్థుల కేట్లు సహాయపడగలదు?</p>}} {{Center|'''సంభాషణము'''}} [యథాశక్తి గ్రంథాలయ సేవచేయుచున్న సేవకులు ఇప్పుడు ఆంధ్రదేశ మందు పలువు రున్నారు. ఈ నడుమ ఒక గ్రంధాలయా యాభిమానికిని, మా కార్యనిర్వాహక సంఘాధ్యక్షువకును జరిగిన సంభాషణమును దిగువ పొందుపరచినాము. దీనివలన గ్రంథాలయ సేవకులు గుర్తింపవలసిన అంశములు కలవని ఇది ప్రకటింపనైనది). {{right|ఆం॥ గ్ర॥ సం॥)}} అభిమాని:-మన దేశములో నూటికి తొంబది మంది ప్రజలు గ్రామములలో ఉన్నారు కదా! గ్రంథాలయోద్యమము వీరికేమైనా సహాయపడగలదా! అధ్యక్షుఁడు:-తప్పక సాయపడఁగలదు; ఆంధ్రదేశగ్రంథాలయసంఘోద్దేశము అదే. అభిమాని:- మీ సంఘోద్దేశముసం అదియనుటనే నెరుగుదును. ఆఉద్దేశముయొక్క ఆచరణను గురించియే నాసందేహము. గ్రంథాలయోద్యమ నాయకులలో గ్రామముల పరిస్థితులను తెలిసికొన్నవారెవరైన కలరా? యని నేను ప్రశ్నింపఁగోరెదను. అధ్యక్షుఁడు:-ఏలలేరు! పెక్కురుఉన్నారు. గ్రామ పరిస్థితులను గుఱించినాకున్నూ పరిచయము గలదు. అభిమాని:- గ్రంథాల యోద్యమము క్రింద గ్రామములలో మీరు ఏయే శాఖలను అభివృద్ధిచేయఁదలచెదరు! అధ్యక్షుఁడు:- గ్రామములలోని ఏశాఖయు గ్రంథాలయోద్యమమునకు సంబంధింపనిది లేదు. ఆయా గ్రామములలోని సేవకుల పటుత్వమును బట్టి శాఖలు ఎంతవరకైనను అభివృద్ధి చేయవచ్చును. ఇపుడు గ్రంథాలయములు పత్రికాపుస్తక పఠనమునకును తదభిమానమును ప్రజలలో వ్యాప్తి చేయుటకును తోడ్పడుచున్నవి. నిరక్షరత్వ నిర్మూలన ప్రయత్నము లిప్పుడిప్పుడే జరుగుచున్నవి. . అభిమాని:-ఇది కొంత నిజమే కావచ్చును, కాని మొత్తముమీద ఊహలలో ఉన్నంత ఆచరణలో కనబడదు. మీరు చెప్పే పటుత్వము ఎక్కడనులేదని నా తలంపు అక్కడక్కడ ఆవేశముతో కూడిన మాటలు మాత్రము వినవచ్చుచుండును; ఈ ఉద్యమ మందు నాయకులకు లక్ష్యమున్నట్లు కానరాదు. గ్రామానుభవముకల నాయకు లెవరును లేరు; ప్రజలును, నాయకులును, తమ్ము తాము ఆత్మవంచన చేసుకొనుచున్నారని నా అనుభవము. ఇట్టి పరిస్థితులలో మీబోటి అనుభవశాలురు ముందు కర్తవ్యమేదో ఆలోచింప వలసినదని నేను ప్రార్థించుచున్నాను. అధ్యక్షుఁడు:-మీ మాటలనుబట్టి మీకు మాటలతో సమాధానము చెప్పుటకంటే ఆదర్శమగు కొంత పనిచేసి ప్రత్యక్ష పఱుచుటయే తగిన సమాధానమగునని తలచెదను. రాష్ట్రమందక్కడక్కడ జరుగుచున్న పనియటుండ, ఒక్క మాసము ప్రత్యేక కృషిసలిపి, గ్రంథాలయోద్య మాదర్శమును ప్రత్యక్షపఱుప ప్రయత్నించెదను. అటు<noinclude><references/></noinclude> daegwdxyx4v95vpxqvzhbde6yrypv2b పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.10 (1937).pdf/27 104 211703 552019 2026-04-08T06:25:00Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552019 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>పైన మీకు సందేహము లుండుచో తెలుప వచ్చును. అభిమాని:-తమ సమాధానమునకు సంతసించు చున్నాను. మీ బోటివారు దీక్ష పూనినయెడల కార్యసాఫల్యమున కెట్టి ఆటంకములును ఉండబోవు. ఒక మాసము గడచిన తరువాతనే నేను తమరిని కలసికొందును. మరియొక విషయము. ఈ మధ్య శిక్షణ నిలయము క్రింద యువకులకు శిక్షణ మిచ్చెదమని ప్రకటించి యుంటిరే! దాని సంగతేమైనది! అధ్యక్షుఁడు:-నలుగురు శిక్షణార్థుల వద్ద నుండి మాత్రము దరఖాస్తులు వచ్చినవి. ఇంకను పది దరఖాస్తులైన వచ్చినఁ గాని పని ప్రారంభింప వీలు కాదు. అర్హులగు యువకులచే దరఖాస్తులు పంపించుటకు మీరు కూడ ప్రయత్నము చేయుఁడు. ఇందును గురించి కూడ ముందు మాట్లాడవచ్చును. {{rule |6em }}<noinclude><references/></noinclude> marbnt697ssej3jepoor46t0koq9qv1 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/5 104 211704 552030 2026-04-08T07:35:58Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552030 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ఈశ్వర</p>}} {{Center|{{p|fs125}}శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమ రావుగారు, ఎం. ఎ.</p>}} {{p|fs125}}<poem>యంత్రయుగమను పేరిటి యమునిమూర్తి వస్తుకల్పన యను మేటి పాశ రాజి కట్టి బ్రమయించి బుద్దిని మట్టి గలిపి మనుజు రాక్షసు గావించి మాయ పెంచి రుద్రరూపము దాలిచి రోజుచుండు.</poem></p> {{p|fs125}}<poem>ఒండొరుల జూచి రాష్ట్రము లోర్వలేవు సేనలను మీరి సేనలు సిద్ధపడెడు మందుగుండులకొండల మహిమ మించె సహజ ప్రేమలు లోకాన సమసిచనియె ప్రళయగర్జలు జగమున ప్రబలిపోయె.</poem></p> {{p|fs125}}<poem>దేవదానవకోటులు తివిరి కడలి దచ్చగా బుట్టి లోకంబు దవిలి కాల్ప సిద్ధపడినట్టి విషమును జేర్చి మ్రింగి మేలుచేసిన ఈశ్వరుమేటి పేరు ఈశ్వరాబ్దమ! తాల్చితి నీవు సరిగ.</poem></p> {{p|fs125}}<poem>వరము కోరినతోడనే పరమమైత్రి క్రిందుమీదులు చూడక క్రీడనిచ్చు భక్త సులభుడు భవు డను ప్రాతనుడిని పేరుకతమున నీవు నిల్పిననుగాదె సార్థకంబగు నీజన్మచరిత మెంతొ!</poem></p> {{p|fs125}}<poem>పండునీలిమ యాకసం బది పెండ్లిపందిరి యౌచు వెలయగ అరుణతరుణిమ సమరుచివుకులు నలరు తోరణపంక్తి పన్నగ వెండి వెలుగులు తారసంహతి దండి దీపావళులు కాగా మావిపండులు మధువు నమరిచి మన్ననంబును జూపగా కొత్త బెల్లము కొత్తబియ్యము కూర్మి సేసలు గూర్పగా పూతవేములు సౌరభంబులు పొదవి జల్లులు జల్లగా కుహుకుహూ యని కూడి పాటల కొమ్మ కోయిలపిండు పిలువగ కమ్మతెమ్మెర నీకు తోడై నెమ్మి నీతో కుమ్మరన్ రమ్ము ఈశ్వర! రమ్ము రమ్మిక చిమ్ము శుభముల భూస్థలిన్</poem></p> {{rule |6em }}<noinclude><references/></noinclude> rz0ktj300vjc15u2k14spy1vga431ls పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/6 104 211705 552031 2026-04-08T08:01:47Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 552031 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}గ్రామావసరము లేవి?</p>}} {{Center|{{p|fs125}}శ్రీ గా.హరిసర్వోత్తమరావు గారు, ఎం. ఏ.</p>}} గ్రామపునర్నిర్మాణ సమస్య నేటిదినము ఏకైక సమస్యగా నాలోచింపబడుచున్నది. కాని గ్రామావసరములు ఇట్టివియని గ్రహింపక ఈ సమస్యను పూర్తిఁజేయుట సాధ్యము కానిపని. ఆయా ప్రాంతములకు సంబంధించి గ్రామావసరములు కొంతవరకు మారుననుట నిజమేయైనను మొత్తముమీద అన్ని గ్రామములకును సమానమైన అవసరములను నిరూపించుట కష్టము కాదు. {{Center|{{p|fs125}}వైజ్ఞానికము</p>}} ఏకార్యమునకైనను దానికి సంబంధించిన విజ్ఞానమును సమకూర్చుకొనక పోయినయెడల సంఘజీవనము సాధ్యమే కాదు. మన దేశములో నేటిదినము గ్రామములు దుస్థితియందు ఉన్నవంటే కారణము ముఖ్యమైనది ఆజ్ఞానమే. ఏవిషయమున ఎప్పుడు ఏమి చేసికొనిన మేలు కలుగునో అభివృద్ధియందుండు ప్రజాసమూహములు ఎట్టి సందర్భమున ఏ విధముగా నడుచుకొని కార్యసాధన చేయుచున్నవో అను సంగతులు మన ప్రజలకు తెలియుట మొధటి యవసరము. దీనికి ఆధారము గ్రంథాలయము అగును గాని వేరుగాదని చెప్పనక్కరే లేదు. ముఖ్యముగా అక్షరజ్ఞతలేని మన ప్రజలకు గ్రంథాలయముచేత సూచితము కావలసినది వట్టి గ్రంధ సామగ్రి మాత్రము కాదు. దాని సారమును ప్రజలకు అందజేయు సర్వప్రయత్నములును చేయునట్టి సంస్థ. ఈ కార్యమునందు అధికారము చెలాయించుటకు అవకాశములేదు. ద్రవ్యము కూర్చుకొనుటకు మార్గము లేదు. పేరు ప్రతిష్ఠలు అఖండముగా సంపాదించుటకును త్రోవ యుండదు. కృష్ణార్పణమని సేవ చేయగల మానవులే ఈ కార్యమును పూనుట కర్హులు. అనుభవశాలురే దీనికి తగినవారు. కావున అస్తి సంపాదన ఇట్టివారు గ్రామ నాయకత్వము పూనుకొనిన యెడల వీరే నిజముగా గ్రామమునకు శాసన సభగా నుపకరింప గలరు, వ్యవసాయము, వృత్తులు, విద్య, గ్రామరక్షణ, పాడి, అర్థికావసరములు ఇన్ని విషయములలోను, వీరు గ్రామము లోని యువకులకు సలహాలిచ్చుచు శిక్షణ పెంచగలరు. {{Center|{{p|fs125}}పరిపాలన</p>}} చ్ఛలేని ప్రజా సేవకులును, అర్జన వదలి విరామము గడింపనెంచు ౪౫ ఏండ్లకు పైబడిన పెద్దలును నియమితులగుట శ్రేయస్కరము. సర్వపరిపాలన విషయములందును, పంచాయితీకి ప్ర్రాతి పదిక మైన అధికారము సంక్రమింపజేయవలయును. ప్రతి గ్రామమునకు లేక కొన్ని గ్రామముల చిన్న సమూహము నకు పంచాయతులు నిర్బంధముగా ఏర్పడి పనిచేసే విషయములందే గాక గ్రామమునకు సంబంధించిన అడవి, ఏగ్రామపు పరిపాలన ఆగ్రామముననే విశేషభాగము ఊరి పెద్దల చేతనే జరుపబడునేని బయటి ఉద్యోగస్థులకు గ్రామములోనికి ఎక్కువగా ప్రవేశముండదు. వారి యల జడియు నుండబోదు. ప్రజలు చిన్ని చిన్ని విషయములలో సైతము వ్యయ ప్రయాసల కోర్చి బయటికి వలసిన పని ఉండదు, కాబట్టే, సర్వపరిపాలనకును పంచా యతీపరిపాలన పునాది కావలెనని నేటి రాజకీయవేత్తలు ఆంగీకరించి నారు. అందులోను దేశమున ప్రజాపరిపాలనా సౌధమును కట్ట నెంచిన ఈదినములలో దానితత్వమునందు ప్రజలను సుశిక్షితులను జేయుటకు పంచాయతీవంటి మంచి ఉపకరణము ఇంకొకటి లేదు. ఇప్పటి పంచా యతీ అధికారము లైన రోడ్లు దీపాలు ఆరోగ్యము వగైరా నీటివసతి, ధర్మాదాయములు, బందెలదొడ్లు మొదలగు యెడల నేడు జిల్లాబోర్డులను గురించి యితర శాఖలలోని కలిగే అసంతృప్తియు లకు తెలియుట మొదటి యవసరము. అవకా అధికారులను గురించి వారి వలన సంభవించే ఇక్కట్టులుకు తగ్గిపోవును. నిజముగా పనికిమాలిన ఎలెక్షన్లు ఎన్ని సంస్థలతో పెట్టి దేశమును చిందరవందర జేయుటకంటె పంచాయతు లేర్పరచి వారి ప్రతినిధులు పంచాయతీ భాగమునకే కాక ఫిర్కా జిల్లా కార్యములకు బాధ్యులగునట్లు చేయుట చాల ఉపయోగకరముగా ఈ పంచాయతు లైనను పన్నులు పెంచుటకు బదులు ప్రజల చేత సమష్టి కార్యములు చేయించుటకు మైసూరులో వలె అధికారము కలిగియుండుట మేలు, గ్రామ విద్యాలయము వీరి యాజ మాన్యమున నుండి గ్రంథాలయమునకు దానికి సన్నిహిత సంబంధము కల్పించునెడల గ్రంథాలయ నిర్వాహకులే పంచాయతీ కార్యనిర్వహణకు సహాయకులు కావచ్చును. న్యాయవిచారణ . గ్రామములోని న్యాయవిచారణకు ప్రజల చే నిన్ను కొనబడు పంచాయతీదారులైనను పనికిరారు. అందులోను<noinclude><references/></noinclude> rwdxctzifcei6jcqusjnqbau7jonl7x 552034 552031 2026-04-08T08:56:19Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552034 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}గ్రామావసరము లేవి?</p>}} {{Center|{{p|fs125}}శ్రీ గా.హరిసర్వోత్తమరావు గారు, ఎం. ఏ.</p>}} గ్రామపునర్నిర్మాణ సమస్య నేటిదినము ఏకైక సమస్యగా నాలోచింపబడుచున్నది. కాని గ్రామావసరములు ఇట్టివియని గ్రహింపక ఈ సమస్యను పూర్తిఁజేయుట సాధ్యము కానిపని. ఆయా ప్రాంతములకు సంబంధించి గ్రామావసరములు కొంతవరకు మారుననుట నిజమేయైనను మొత్తముమీద అన్ని గ్రామములకును సమానమైన అవసరములను నిరూపించుట కష్టము కాదు. {{Center|{{p|fs125}}వైజ్ఞానికము</p>}} ఏకార్యమునకైనను దానికి సంబంధించిన విజ్ఞానమును సమకూర్చుకొనక పోయినయెడల సంఘజీవనము సాధ్యమే కాదు. మన దేశములో నేటిదినము గ్రామములు దుస్థితియందు ఉన్నవంటే కారణము ముఖ్యమైనది ఆజ్ఞానమే. ఏవిషయమున ఎప్పుడు ఏమి చేసికొనిన మేలు కలుగునో అభివృద్ధియందుండు ప్రజాసమూహములు ఎట్టి సందర్భమున ఏ విధముగా నడుచుకొని కార్యసాధన చేయుచున్నవో అను సంగతులు మన ప్రజలకు తెలియుట మొధటి యవసరము. దీనికి ఆధారము గ్రంథాలయము అగును గాని వేరుగాదని చెప్పనక్కరే లేదు. ముఖ్యముగా అక్షరజ్ఞతలేని మన ప్రజలకు గ్రంథాలయముచేత సూచితము కావలసినది వట్టి గ్రంధ సామగ్రి మాత్రము కాదు. దాని సారమును ప్రజలకు అందజేయు సర్వప్రయత్నములును చేయునట్టి సంస్థ. ఈ కార్యమునందు అధికారము చెలాయించుటకు అవకాశములేదు. ద్రవ్యము కూర్చుకొనుటకు మార్గము లేదు. పేరు ప్రతిష్ఠలు అఖండముగా సంపాదించుటకును త్రోవ యుండదు. కృష్ణార్పణమని సేవ చేయగల మానవులే ఈ కార్యమును పూనుట కర్హులు. అనుభవశాలురే దీనికి తగినవారు. కావున అస్తి సంపాదన ఐచ్ఛలేని ప్రజా సేవకులును, అర్జన వదలి విరామము గడింపనెంచు ౪౫ ఏండ్లకు పైబడిన పెద్దలును నియమితులగుట శ్రేయస్కరము. ఇట్టివారు గ్రామ నాయకత్వము పూనుకొనిన యెడల వీరే నిజముగా గ్రామమునకు శాసన సభగా నుపకరింప గలరు, వ్యవసాయము, వృత్తులు, విద్య, గ్రామరక్షణ, పాడి, అర్థికావసరములు ఇన్ని విషయములలోను, వీరు గ్రామము లోని యువకులకు సలహాలిచ్చుచు శిక్షణ పెంచగలరు. {{Center|{{p|fs125}}పరిపాలన</p>}} ఏ గ్రామపు పరిపాలన ఆగ్రామముననే విశేషభాగము ఊరిపెద్దలచేతనే జరుపబడునేని బయటి ఉద్యోగస్థులకు గ్రామములోనికి ఎక్కువగా ప్రవేశముండదు. వారి యలజడియు నుండబోదు. ప్రజలు చిన్ని చిన్ని విషయములలో సైతము వ్యయ ప్రయాసల కోర్చి బయటికి వలసిన పని ఉండదు. కాబట్టే, సర్వపరిపాలనకును పంచాయతీ పరిపాలన పునాది కావలెనని నేటి రాజకీయవేత్తలు ఆంగీకరించినారు. అందులోను దేశమున ప్రజాపరిపాలనా సౌధమును కట్టనెంచిన ఈదినములలో దానితత్వమునందు ప్రజలను సుశిక్షితులను జేయుటకు పంచాయతీ వంటి మంచి ఉపకరణము ఇంకొకటి లేదు. ఇప్పటి పంచాయతీ అధికారములైన రోడ్లు దీపాలు ఆరోగ్యము వగైరా విషయములందే గాక గ్రామమునకు సంబంధించిన అడవి, నీటివసతి, ధర్మాదాయములు, బందెలదొడ్లు మొదలగు సర్వపరిపాలన విషయములందును, పంచాయితీకి ప్రాతి పదికమైన అధికారము సంక్రమింప జేయవలయును. ప్రతి గ్రామమునకు లేక కొన్ని గ్రామముల చిన్న సమూహమునకు పంచాయతులు నిర్బంధముగా ఏర్పడి పనిచేసే యెడల నేడు జిల్లాబోర్డులను గురించి యితర శాఖలలోని అధికారులను గురించి కలిగే అసంతృప్తియు వారి వలన సంభవించే ఇక్కట్టులుకు తగ్గిపోవును. నిజముగా పనికిమాలిన ఎలెక్షన్లు ఎన్ని సంస్థలతో పెట్టి దేశమును చిందరవందర జేయుటకంటె పంచాయతు లేర్పరచి వారి ప్రతినిధులు పంచాయతీ భాగమునకే కాక ఫిర్కా జిల్లా కార్యములకు బాధ్యులగునట్లు చేయుట చాల ఉపయోగకరముగా నుండును. ఈ పంచాయతు లైనను పన్నులు పెంచుటకు బదులు ప్రజల చేత సమష్టి కార్యములు చేయించుటకు మైసూరులో వలె అధికారము కలిగియుండుట మేలు. గ్రామ విద్యాలయము వీరి యాజమాన్యమున నుండి గ్రంథాలయమునకు దానికి సన్నిహిత సంబంధము కల్పించునెడల గ్రంథాలయ నిర్వాహకులే పంచాయతీ కార్యనిర్వహణకు సహాయకులు కావచ్చును. {{Center|{{p|fs125}}న్యాయవిచారణ</p>}} గ్రామములోని న్యాయవిచారణకు ప్రజలచే నిన్ను కొనబడు పంచాయతీదారులైనను పనికిరారు. అందులోను అవకా<noinclude><references/></noinclude> af8yea3tykahgmvrxzbon7bhzyawhh7 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/7 104 211706 552043 2026-04-08T10:34:34Z Brjswiki 6801 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{center|5}} {{center|{{p|fs150}}గ్రామావసరము లేవి?</p>}} ఇప్పటి విధముగా మూకల చేత చేతులెత్తించుకొని అధికారము నభిష్టించు బలవంతులు ఆదర్శములను కల్పించుకు. గ్రామములలో జరుగవలసిన న్యాయము గ్రామములోన...' 552043 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>{{center|5}} {{center|{{p|fs150}}గ్రామావసరము లేవి?</p>}} ఇప్పటి విధముగా మూకల చేత చేతులెత్తించుకొని అధికారము నభిష్టించు బలవంతులు ఆదర్శములను కల్పించుకు. గ్రామములలో జరుగవలసిన న్యాయము గ్రామములోనే తీర్చుట నేటి మహాకృషములను నశింపజేయగలదు. దానికి వొదిపరితనమును ఫీల్డూరి ముద్రాయులు విశ్వాసముంచి ఏర్పరచుకొను పంచాయతీ వారికే విచారణకర్తలు కావలేను. ప్రతి గ్రామములోను అన్నిమతముల కులముల ప్రజలలోనుండి పెద్దమనుష్యుల జాబితాలను సిద్ధపరచియుంచి కేసు దాఖలు చేసికొనుట కుముందు గ్రామమున సబుకు రిజిస్ట్రారుగా నేర్పరచి పార్టీ లేర్పరచుకొను పంచాయతీల చేత విచారణ జరిపించుటకు ఏర్పాట్లు వెంటనే జరుగవలయును. ఒక పంచాయతీ కూలీలు ధాన్య రూపకంగానే యిస్తున్నారు. మాత్రం చాలును. గ్రామంలో నమ్మకమైన యోగ్యుడొక వ్యాన్నో, నూలునో, పానో, పరిమాణమో టోకానో చుట్టిపెట్టి బ్యాంకి ఆఫీసుల యింగ్లండులో ఇటీవల బ్యాంకి చీటీల వలె చలామణి చేసి బియ్యం, గుడ్డ, కర్ర, ఇత్యాదుల పరస్పరం ఊళ్లో మార్చుకునే చేస్తే రైతుకు సగము వేదన తప్పిపోతుంది. గ్రామవాసి బయటికి పోయి వస్తువులు కొనే అవసరం ఎంత తక్కువ చేసుకోగలిగితే అంత తక్కువ కోసమే మారకుండా ఆవుతుంది. ఈ బ్యాంక్ లో ఒక బ్యాంకి కూడా ఏర్పడి రైతు వస్తువులను సమీకరించుకోవడానికి సరైన గిరాకీ ఏర్పడుతుంది. {{center|5}}{{center|{{p|fs150}}గ్రామావసరము లేవి?</p>}}ఇప్పటి విధముగా మూకల చేత చేతులెత్తించుకొని అధికారము నభిష్టించు బలవంతులు ఆదర్శములను కల్పించుకు. గ్రామములలో జరుగవలసిన న్యాయము గ్రామములోనే తీర్చుట నేటి మహాకృషములను నశింపజేయగలదు. దానికి వొదిపరితనమును ఫీల్డూరి ముద్రాయులు విశ్వాసముంచి ఏర్పరచుకొను పంచాయతీ వారికే విచారణకర్తలు కావలేను. ప్రతి గ్రామములోను అన్నిమతముల కులముల ప్రజలలోనుండి పెద్దమనుష్యుల జాబితాలను సిద్ధపరచియుంచి కేసు దాఖలు చేసికొనుట కుముందు గ్రామమున సబుకు రిజిస్ట్రారుగా నేర్పరచి పార్టీ లేర్పరచుకొను పంచాయతీల చేత విచారణ జరిపించుటకు ఏర్పాట్లు వెంటనే జరుగవలయును. ఒక పంచాయతీ ఎవరిపాటవంచేతనో న్యాయము జరుపలేదని ఏర్పడితే నూలు తోచినయెడల రెండవ పంచాయతీ ఏర్పరచి అప్పీలు పెట్టుకొనుటకు అవకాశముండవలయును. అంతకుపైన వ్యవహారమునకు వీలుండరాదు. ఎట్టి వ్యవహారములను ఈ పంచాయతీలు తీర్చవచ్చునను విశేషవిషయమును శాసనముచే నిర్ణయింపనగును. ఇతరీతిని ప్రాచీనకాలపు పంచాయతీల చరిత్రని తగినంత మార్గమును చూపగలదు. పంచాయతీకి వైదరాకోర్టు గ్రామాల కు తిరిగి స్థానికంగా న్యాయవిచారణ చేసి తీర్పులిచ్చి పోవుచుండవలెనే గాని రైతు పదే పదే బయటియూళ్ళకు పోవునని యుండరాదు. {{center|గ్రామబ్యాంకు}} గ్రామములోని ప్రజలను నేడు పట్టి వేధించు మహాపిశాచము ఆర్థిక దురవస్థ. ఈ దురవస్థ మనలను వైకొనడానికి ఇతర కారణాలెన్ని ఉన్నా రెంటిని మాత్రము ప్రముఖంగా ఆలోచింపక తప్పదు. మొదటిది ప్రతివ్యవహారానికి చలామణి నాణ్యాలలో జరగడం, పన్నుకు నాణ్యం, కోర్టు వ్యవహారాలకు నాణ్యం, గుడ్డకొనడానికి నాణ్యం, కూరముట్టుకు నాణ్యం, పశువుల మేతకు నాణ్యం, ఉప్పుకు నాణ్యం, దీపపు నూనెకు నాణ్యం, అది యిది యననేల? కూర్చుంటే నాణ్యం, లేస్తే నాణ్యం. తాను పండించే వస్తువును నాణ్యంలోనికి మార్చేవరకు రైతుకు తల ప్రాణం తోకకు రావడం. అమార్పుయ్యేటప్పటికి కలిగేనష్టాలు కంటికి కనిపించవు గాని రైతును సగానికి పైన అణచివేస్తాయి.కూలీలు ధాన్యరూపంగానే ఇస్తున్నారు. మాత్రం చాలును. గ్రామంలో నమ్మకమైన యోగ్యుడొక వ్యాన్నో, నూలునో, పానో, పరిమాణమో టోకానో చుట్టిపెట్టి బ్యాంకి ఆఫీసుల యింగ్లండులో ఇటీవల బ్యాంకి చీటీల వలె చలామణి చేసి బియ్యం, గుడ్డ, కర్ర, ఇత్యాదుల పరస్పరం ఊళ్లో మార్చుకునే చేస్తే రైతుకు సగము వేదన తప్పిపోతుంది. గ్రామవాసి బయటికి పోయి వస్తువులు కొనే అవసరం ఎంత తక్కువ చేసుకోగలిగితే అంత తక్కువ కోసమే మారకుండా అవుతుంది. ఈ బ్యాంక్‌లో ఒక బ్యాంకి కూడా ఏర్పడి రైతు వస్తువులను సమీకరించుకోవడానికి సరైన గిరాకీ ఏర్పడుతుంది. రైతు తన సరుకును అమ్ముకోడానికి సంతోషించే యెడల కొన్ని కొత్త మార్గాలతో భోజనమునకు పాయము మాత్రము పూర్తిగా తుడిచివేస్తూ మిగతవాటికి పత్రరాలి మీద కొన్నిడ్లీలో వ్రాసి ఇచ్చి ఉన్న అప్పులు తీర్చుకోవచ్చు. అప్పుడు పన్నుకి నీలుకూడా ధాన్యా దానికి తోడ్పడితే మహోపకారం. వృత్తులయొక్కయు వృత్తి విద్యల సంస్కారము చేసే సహాయపు మొత్తాలు పల్లెటూళ్ళవారాలకు వచ్చే సుంకోని గ్రామధికారులు అనగా దేవాలయము, గ్రంథాలయము, విచారణ జరిపే అధికారులు, నియమాలన్నీ ఇచ్చి పుచ్చుకోలు జరుపడానికి తోడ్పడవలె.కొత్త ప్రభుత్వము వారు ఖద్దరు సంస్థానంవారు చేసే ఈ సర్వ విషయములకు సంబంధించి యున్నాను. పైనవ్రాసిన గ్రామములలో ఈ సలహాలు చక్కగా ఎవ్వరైనా అంగీకరింపక తప్పదు. చదువుకొని అధికారులతో పాటు...<noinclude><references/></noinclude> 8gkdbgltw62ica8r1q32kdy7htaqcku పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/29 104 211707 552059 2026-04-08T11:35:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భగవద్గీత చక్కగను తెలుపుచున్నది. అర్జునుడు శోకా కులచిత్తుడై ధనుర్బాణములను విడిచి రణరంగమునందు రథముమిూద చతికిలబడి కార్యాచరణమునందు స్వధర్మ విముఖశ్వమును బూనెను. భగవద్గీత...' 552059 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|21}}</noinclude>భగవద్గీత చక్కగను తెలుపుచున్నది. అర్జునుడు శోకా కులచిత్తుడై ధనుర్బాణములను విడిచి రణరంగమునందు రథముమిూద చతికిలబడి కార్యాచరణమునందు స్వధర్మ విముఖశ్వమును బూనెను. భగవద్గీత ప్రవృత్తి నివృత్తి మార్గములకు కర్మయోగవి శేషమును ప్రతిపాదించు చున్నది. పదునెనిమిది యధ్యాయములయందును కర్మ ప్రాశస్త్యము గలదు. ప్రథమశ్లోకమునందె ధర్మక్షేత్ర మునందు మమకారమునకును ఆత్మకును గలుగగల కర్మ సంరంభము సూచింపబడినది. —విషాదయోగము. ఆ. ౧. శ్లో. 8. నిస్పృహుఁడును నిరహంకారుఁడును మమకార రహితుఁడును నై కామములను విడిచి పురుషుఁడు కర్మ లందు చరించుచున్నను శాంతి గలుగుచున్నది. —సాంఖ్యయోగము. ఆ. వి. శ్లో. శ. ఫలాపేకు లేకను నియతకర్మలను చేయువాడు పర మును బొందుచున్నాడు. —కర్మయోగము ఆ. 3 శ్లో.. సంశ సం కర్మసన్న్యాస యోగియును జ్ఞానసంచ్ఛిన్న స యుడును, ఆత్మవంతుడును నైనవానిని కర్మలు బంధింపవు. —జ్ఞానయోగము అ. ర,శ్లో. రణ<noinclude><references/></noinclude> oingjoz9aumybii67133sjumlehd5on పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/30 104 211708 552060 2026-04-08T11:36:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంగమును విడిచి బ్రహ్మార్పణముగను మనోవా క్కాయములు చేసిన కర్మలు పాపహేతువులు గాకను ఆత్మశుద్ధికి సాధనములుగ నున్నవి. _కం్మసన్న్యాసయోగము ఆ. x శ్లో. 60, n. తనయందు పర మేశ్వరాత్మకమైన స...' 552060 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|22}}</noinclude>సంగమును విడిచి బ్రహ్మార్పణముగను మనోవా క్కాయములు చేసిన కర్మలు పాపహేతువులు గాకను ఆత్మశుద్ధికి సాధనములుగ నున్నవి. _కం్మసన్న్యాసయోగము ఆ. x శ్లో. 60, n. తనయందు పర మేశ్వరాత్మకమైన సర్వభూతము లను సర్వభూతములయందు సరబ్రహ్మాత్మకమైన తనను సమదృష్టితో జూడగలవాడు సకల కర్మలను జేసినను పరమయోగి యగుచున్నాడు. __ఆక్మసంయమయోగము ఆ. ఓ శ్లో. 25, 3_9. భగవదర్పిత మైనకర్మ శుభాశుభ ఫలములను గలుగ జేయకను నన్న్యాసయోగయుక్తమై భగవంతుని పొం దించుచున్నది. - —రాజవిద్యాం జగుహ్యయోగము ఆ. 8 శ్లో అలా. శుక్లమార్గ మనావృత్తికిని కృష్ణ ప్రవృత్తి మార్గ మావృత్తికిని గారణంబులుగ నున్నవి. - విభూతిసంపదగల సత్త్వమంతయును భగవదంశ సంభూతము. - అక్షరబ్రహ్మ యోగము ఆ. 0, శ్లో౬. నిభూతియోగము అ. శ్లో. కం. - ఓపాండవా! ఎవడు సంగవర్జితుడై భగవన్ని మిత్త ము కర్మలనుచేయువాడొ భగవత్సరుడొ భగవద్భక్తుడొ<noinclude><references/></noinclude> jfc9qu7ssf1olcci07r2jbk1dvcz8ps పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/31 104 211709 552061 2026-04-08T11:37:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సర్వభూతములందు వైరము లేనివాడొ వాడే భగవంతుని పొందగలడు. —విశ్వరూప సందర్శన యోగము అ. ౧౦, శ్లో. ౫. ఓపార్థా! ఎవరు ముత్పరులై సకలకర్మలను నాయం దుంచి ఏకాంత యోగముతోను నన్ను ధ్యానము చేయు...' 552061 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|23}}</noinclude>సర్వభూతములందు వైరము లేనివాడొ వాడే భగవంతుని పొందగలడు. —విశ్వరూప సందర్శన యోగము అ. ౧౦, శ్లో. ౫. ఓపార్థా! ఎవరు ముత్పరులై సకలకర్మలను నాయం దుంచి ఏకాంత యోగముతోను నన్ను ధ్యానము చేయుచు సేవించుదురొ నాయందు చిత్తముగలవారొ వారిని శీఘ్ర ముగను నుద్ధరించుదును. -భక్తియోగము అ. ౧౨, శ్లో. 2. గుణములతోగూడిన పురుషుని ప్రకృతిని యథా విధిగను బెలిసికొనినవానికి కర్మప్రవృత్తిబంధకము గాదు. —క్షేత్ర షేక్రజ్ఞవిభాగయోగము ఆ. ౧౩, శ్లో. 28. - సాత్త్వికకర్మలు నిర్మలసుఖమును, రాజన కర్మలు దుఃఖమును, తామసకర్మలు అజ్ఞానమును గలుగజేయు చున్నవి. __గుణత్రయనిభాగయోగము అ. ౧ర్, . ౧.. యోగులు కర్మప్రవృత్తియందు సంచరించు చున్నను ఆత్మసందర్శనమును జేయుదురు. ఆత్మజ్ఞానము లేని యజ్ఞానులు కర్మప్రవృత్తియం చాత్మనందర్శనమును చేయజాలరు. - పురుషో త్తమప్రాప్తియోగము ఆ. ౧౫ శ్లో.CO<noinclude><references/></noinclude> g8p596zzpf7h8utk0ow4wthsg2ovphn పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/32 104 211710 552062 2026-04-08T11:37:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఓయి పార్థా! కర్మలయొక్క విధినిషేధములకు శాస్త్రము ప్రమాణము. శాస్త్రవిధానమును దెలిసికొని కర్మాధికారిపై కర్మలను జేయుము, ౨౭. —దైవాసుర సంపద్విభాగయోగము అ. (౬ శ్లో. అర. యజ్ఞము తసస...' 552062 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|24}}</noinclude>ఓయి పార్థా! కర్మలయొక్క విధినిషేధములకు శాస్త్రము ప్రమాణము. శాస్త్రవిధానమును దెలిసికొని కర్మాధికారిపై కర్మలను జేయుము, ౨౭. —దైవాసుర సంపద్విభాగయోగము అ. (౬ శ్లో. అర. యజ్ఞము తసస్సు దానము సత్ స్థితికి సాధనములు, వానికి సంబంధించిన కర్మలు సత్తనిదే: గ్రహింపబడు చున్నవి. —శ్రద్ధాత్రయవిభాగ యోగము అ. ౧౭ శ్లో. విడి. కర్మయోగపరమైన గీతాశాస్త్రమునందలి కడ పటి యధ్యాయము సాంఖ్య శర్మ జ్ఞాన భక్తి సన్న్యాసాది యోగములను కర్మప్రవృత్తియందు సమన్వయమును జే యుచున్నది. మానవులు నియతకర్మలను ఫలాపేక్ష లే కను జేయనగును. కవియె సాత్త్వికకర్మలు. ఎల్లప్పుడును అన్ని కర్మలను చేయుచున్నను భగవదాశ్రయము గల వారు భగనదను గ్రహమువలనను శాశ్వతమును అవ్య యమును నగు పదమును పొందుదురు. శ్లో. నియతం సంగరహిత మరాగర్వేషతః కృతమ్, అఫల సేప్సునా కర్మ యత్త తాత్త్విక ముచ్యతే. శ్లో, ముక్తసంగో సహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః, | సిద్ధ సిద్ధ్యర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. శ్లో. సర్వకర్మాణ్యనీ సదా కుర్వాణో మన్వ్యపాశ్రయః, మత్ప్రసాద్ దవాప్నోతి శాశ్వరింపని మపయమ్. -ఆ గూళ్లో 3 ఆట, - 3<noinclude><references/></noinclude> cu8hxiv90s9zvelg2m9yhx6u6d843a6 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/33 104 211711 552063 2026-04-08T11:38:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ్రీకృష్ణునియంత్యోప దేశమును భగవత్కటా ప్రాబల్యమును విశదము చేయుచున్నది. శ్లో. మన్మనా భవ మన్మక్తో మద్యాజీ మాం నమస్కురు, చూమేవైష్యసి సశ్యం తే ప్రతిజానే ప్రియోసి మే శ్లో. సర్...' 552063 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|25}}</noinclude>శ్రీకృష్ణునియంత్యోప దేశమును భగవత్కటా ప్రాబల్యమును విశదము చేయుచున్నది. శ్లో. మన్మనా భవ మన్మక్తో మద్యాజీ మాం నమస్కురు, చూమేవైష్యసి సశ్యం తే ప్రతిజానే ప్రియోసి మే శ్లో. సర్వధర్మాన్ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిస్యామి మాకుచః ॥ “నాయందు మనస్సునుంచుము; నాభక్తుడవుకమ్ము; నన్నా రాధింపుము; నన్ను నమస్కరింపుము; నన్నే చేరు దువు. నీవు నాకు ప్రేమపాత్రుడవు గనుక ప్రతిజ్ఞ చేయు చున్నాను. సమస్తధర్మములను విడిచి నన్నే శరణు పొం గుము. నేను నిన్ను సకలపాపములనుండియును రక్షించు చున్నాను. నీవు విచార పడకుము.” . శ్రీకృష్ణుని యుప దేశమును విని విజయుడు సమ్మో హమును విడిచి యుద్ధము చేసి స్వధర్మనిర్వహణమును జేసెను. శ్లో, నష్టో మోహః స్మృతి క్లభా క్వత్ప్రసాదా న్మయా2చ్యుత్, స్థితోస్మి గఃసన్దేహః కరిష్యే వచనం తవ, __అ. ౮ శ్లో. 83. కర్మవీరుడైన యర్జునుడు స్వర్గారోహణమును చేయగలిగెను గాని ము క్తిని బొందలేదు. భారతయుద్ధము, పార్థుడు, గీతాశాస్త్రోపదేశము కర్మబోధకు దిష్ప్రదర్శణ<noinclude><references/></noinclude> 2iad5jw3bd6dtvre3329ii4r98k2qbh పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/34 104 211712 552064 2026-04-08T11:38:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మాత్రముగ నున్నవి. విజయుడు శ్రీకృష్ణభక్తుడు శ్రీకృష్ణసఖుడు, మహారథుడును నయ్యును కర్మయోగము నందు విషాదమును బూనిన పుడు సామాన్యులు కర్మ ప్రవృత్తిని సులభముగను గ్రహింపజాలరు. స...' 552064 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|26}}</noinclude>మాత్రముగ నున్నవి. విజయుడు శ్రీకృష్ణభక్తుడు శ్రీకృష్ణసఖుడు, మహారథుడును నయ్యును కర్మయోగము నందు విషాదమును బూనిన పుడు సామాన్యులు కర్మ ప్రవృత్తిని సులభముగను గ్రహింపజాలరు. సర్వోపనిష త్సారమైన గీతాశాస్త్రము గోవు, గోపాల నందనుడు దోగ్ధ, పార్థుడు సత్సము, ధీమంతులు మహత్తెసగీతా మృతదుగ్ధమునకు భోక్తలు. భగవద్గీతాశాస్త్రము విధి కృతమైన కర్మయోగము పురుషార్థమును సాధింపగల విధమును విశదము చేయుచున్నది. మానవుడు ఘా పేక్ష లేకను భగవదర్పణముగను కర్మలను చేయునపుడు మోక్షము కలుగుచున్నది. మోక్షము సర్వసాక్షియును, సరబ్రహ్మమును అగు నాత్మకు కలుగుచున్నది. వైదిక మతము ప్రతిపాదించెడిమోక్షము జీవేశ్వరుల శాశ్వత సం బంధమును బోధించుచున్నది. సాలోక్య, సామీప్య, సా రూప్య, సాయుజ్యదశలందు జీవేశ్వరులకు భిన్నా భిన్నా వస్థలు గలవు. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములు జీవేశ్వరుల యవ్యవహిత సంబంధమునకు సర్వాత్మత్వము ను, బ్రహ్మత్వమును బోధించుచున్నవి. బౌద్ధధర్మము జీవు నకు నిర్వాణమును బోధించుచున్నను, సర్వాత్మత్వ మును బ్రహ్మత్వమును అప్రధానము చేయుచున్నది.<noinclude><references/></noinclude> q4ay6tik974l1xblivxfxawmyed7plx పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/35 104 211713 552065 2026-04-08T11:39:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నిర్వాణము నిర్వాణమునకును వేదాంతు లుప దేశించిడీమోక్ష మునకును భేదముగలదు. మోత. మీశ్వరునకును జీవున కును నిరతిశయసంబంధమును గలుగ జేయు చున్నది. నిర్వా మమరత్వమునో అభానమునో విశద...' 552065 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|27}}</noinclude>నిర్వాణము నిర్వాణమునకును వేదాంతు లుప దేశించిడీమోక్ష మునకును భేదముగలదు. మోత. మీశ్వరునకును జీవున కును నిరతిశయసంబంధమును గలుగ జేయు చున్నది. నిర్వా మమరత్వమునో అభానమునో విశదము చేయుచున్నది. నిర్వాణపదార్థమును నిర్ణయించుటయందు పండితులు భేదాభిప్రాయములను దెలుపుచున్నారు. పాలిభాషా నిఘంటువును రచియించిన రాబర్టు సీజరు ఛైర్సుగా రీవిష యమును బాగుగను పరిశోధించి అర్థమును నిర్ణయించిరి. జన్మ దుఃఖమయ మనియును జన్మరాహిత్యమె దుఃఖనినృ త్తికి సాధనమనియును బుద్ధునిసిద్ధాంతము. కర్మ జన్మము నకు గారణంబుగ నున్నది. జన్మరాహిత్యమునకు కర్మ రాహిత్యము సాధనముగ నున్నది. కర్మరాహిత్యమునకు అష్టాంగమార్గములను నడుచుచు పంచశీలముల నను ష్ఠించుచు పంచస్కందములనతిక్ర మింపవలయును. నలు వది కర్మస్థానముల నతిక్ర మించిన బౌద్ధభిక్షువు నిర్వాణ నూర్గమును జేరి “సోతాపన్న సకదాగామి, అనాగా గామి, అరహత" దశల ననుభవించుచున్నాడు. అరహ తుడు నిర్వాణసౌఖ్యము ననుభవించుచు నిర్వాణమును జన్మాంతరమునందు బొందుచున్నాడు. అర్హతు శానంద ము ననుభవించుచున్నను, జన్మరాహిత్యమును బొంద<noinclude><references/></noinclude> g07elbkjpxjx1voyjine4s91keewd8b పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/36 104 211714 552066 2026-04-08T11:40:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'జాలడు. జన్మవాసన లేనపుడు నిర్వాణము గలుగు చున్నది. జన్మయే లేనపుడు నిర్వాణము సఫల మగు చున్నది. బుద్ధునిమతమునందు నిర్వాణ మభావ స్థితి యని గ్రాహ్యమగుచున్నది. అర్హతదశకును నిర్వా...' 552066 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|28}}</noinclude>జాలడు. జన్మవాసన లేనపుడు నిర్వాణము గలుగు చున్నది. జన్మయే లేనపుడు నిర్వాణము సఫల మగు చున్నది. బుద్ధునిమతమునందు నిర్వాణ మభావ స్థితి యని గ్రాహ్యమగుచున్నది. అర్హతదశకును నిర్వాణనామ మేర్చ డినటులు ఛైర్సుగారు నిర్ధారణ చేయుచున్నారు. ధమ్మ పదమునందును నితర గ్రంథములందును నిందులకు ప్రమా ణములు గనుపట్టుచున్నవి. ప్రస్థానత్రయమును (బ్రహ్మ సూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత) మోక్షమును బ్రహ్మపరము చేయుచున్నవి. బౌద్ధధర్మములు నిర్వాణ మును నా స్తీకపరము చేయుచున్నవి. వేదాంతులు దుఃఖ నివృత్తిని నివృత్తిపరమైన పరబ్రహ్మస్థితియందు గనుగొ నుచున్నారు. బౌద్ధులు దుఃఖనివృత్తిని దుఃఖ కారణమైన జన్మరాహిత్యమునందు గనుగొనుచున్నారు. వేదాంతులు గోరెడి మోనస్థ కా స్తికత్వమును బౌద్ధులు గోరెడి ని ర్వాణమునకు నా స్తికత్వమును ఫలములుగ నున్నవి. ఇం దుల కీ క్రింది ప్రమాణములు నిదర్శనములు:- శ్లో.యుజ్ఞు న్నేపం సదాత్మానం యోగీ నియతనూనపశి శాస్త్రం నిర్వాణపరమాం మక్సంస్థా నుధిగచ్ఛతి. A. ... శ్లో. నిట్టంగతో అసన్తాసీ ఏకత్వల్లో అనఙ్గణో, అచ్చిన్ద భవసల్లాని అ న్తిమేఒయం సమస్సమో. $3.95-98.-15.<noinclude><references/></noinclude> 3cfkr34lgbh0vvtttmb101lsa8t0o77 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/37 104 211715 552067 2026-04-08T11:41:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ధమ్మపదము బౌద్ధధర్మములకు ప్రమాణ గ్రంథ ముగనున్నది. ఇది స్వతంత్ర రచనగాదు. బుద్ధ భగవానుని నిర్యాణానంతరము త్రిపిటకములలోని ధర్మవాక్యములు ధమ్మపదరూపమునను గ్రంథరూపమ...' 552067 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|29}}</noinclude>ధమ్మపదము ధమ్మపదము బౌద్ధధర్మములకు ప్రమాణ గ్రంథ ముగనున్నది. ఇది స్వతంత్ర రచనగాదు. బుద్ధ భగవానుని నిర్యాణానంతరము త్రిపిటకములలోని ధర్మవాక్యములు ధమ్మపదరూపమునను గ్రంథరూపమును దాల్చినవి. గ్రం థమునకు కర్తృత్వనిర్ణ యమును కాలనిర్ణయమును తెలి యకున్నది. బుద్ధునినిర్యాణానంతరము 200 ఏండ్ల కీ గ్రంథ మేర్పడినటులు విశ్వసింపవచ్చును. బుద్ధఘోషుడు ధమ్మ పదమునకు క్రీ.శ. అయిదవశతాబ్దారంభమునను గొప్ప వ్యాఖ్యానమును వ్రాసెను. త్రిపిటకములని ప్రసిద్ధివడసిన సుతపిటకమునందును వినయపిటకమునందును అభిధమ్మ పిటకమునందును గల ధర్మములు ధమ్మపదమునందు చివ రింపబడి గ్రంథము బుద్ధగీత యని ప్రసిద్ధిని బడసినది, ప్రస్థానత్రయమునందు గల ధర్మవాక్యము లనేకములు ధమ్మపదమునందు గనుపట్టుచున్నవి. ధమ్మపదము వైదిక మతపరిణామమునందు నూతన ఘట్టమును ద్యోతకము చేయుచున్నది. వేదాంతమునకును బౌద్ధమతమునకునుకర్మసిద్ధాంతము జన్మాంత ర సిద్ధాంతము సమానధర్మములైనను వేదాంతలక్ష్యము బ్రహ్మపదము 'నందును బౌద్ధమతలక్ష్యము నిర్వాణమునందును లగ్న “మగుచున్నవి. బుద్ధ దేవుని ధర్మోపదేశములు ప్రజాహృద<noinclude><references/></noinclude> fwzm1bdo7to9g4gl70ttxv9oon0sfjn పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/38 104 211716 552068 2026-04-08T11:41:53Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యమునాకర్షించినవిధమును బుద్ధమత వ్యాసనము విశదము చేయుచున్నది. భోగధర్మావృత మైన యుగమునందు బుద్ధ భగవానుడు త్యాగధర్మరూపమునను మానవకల్యాణము నందు కర్మాధ్యాయమునకు మహా ప్రతిష్ఠ...' 552068 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{c|30}}</noinclude>యమునాకర్షించినవిధమును బుద్ధమత వ్యాసనము విశదము చేయుచున్నది. భోగధర్మావృత మైన యుగమునందు బుద్ధ భగవానుడు త్యాగధర్మరూపమునను మానవకల్యాణము నందు కర్మాధ్యాయమునకు మహా ప్రతిష్ఠను గల్పించి శాంతిధర్మమును ప్రతిపాదించెను. కర్మపరమైన వైదిక ధర్మ మహింసాధర్మపరమై సాత్వికస్వరూపమును దాల్చినను సత్త్యాశ్రయములేని బౌద్ధమతము కాలక్రమమునను సంకరరూపమును దాల్చి తీణించినది. బుద్ధభగవానుడు మహాపండితుడయ్యును తనబో ధలను ప్రజలు వాడెడి వాడుక భాష యందు జేయుచు జన సమూహముల నాకర్షించుచుండెను. వారి శిష్యులును వారి మార్గమునే యవలంబించుచు వారిబోధలను ప్రాకృత భాష లందు చేయుచుండిరి. బౌద్ధధర్మగ్రంథములు పాలిభాష యందు గలవు. సుప్రసిద్ధమైన ధమ్మపడమును పాలిభాష యందుగలదు. జైన బౌద్ధమతము లాంధ్రావనియందు వ్యా స్త్రీని బడసినవిధమును అమరావతి గుంటుపల్లి భట్టిప్రోలు జగ్గయ్యపేట మొదలగు స్థలములందలి స్తూపవిహార శిథిల ములు విశదము చేయుచున్నవి. అజంతా శిల్పమును నాం ధ్రావనియందు బౌద్ధమతమునకు గలిగినయాదరణమును విశదము చేయుచున్నది. జైన బౌద్ధమతము లాంధ్ర దేశ మునం ద స్తమించినను మత ధర్మములు ప్రజాశీలమునందు<noinclude><references/></noinclude> lgiewx1jdogy3v1ahj4hir0fs4t7ukz