వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.23 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk సుమతీ శతకము 0 2075 552368 543746 2026-04-09T13:51:46Z ~2026-21968-29 7270 31 పద్యం భావం తప్పు ఉంది. కరణముల ననుసరింపక అన్న చోట లేఖకులని అనుసరించకుండా అని రాశారు. కరణములు అంటే కరణాల గురించి కాదు. కరణములు అంటే ఇంద్రియాలు. 552368 wikitext text/x-wiki {{Migrate to|[[సూచిక:Sumati Shatakamu.pdf]]}} {{తలకట్టు | శీర్షిక = [[సుమతీ శతకము]] | రచయిత = బద్దెన | విభాగము = | ముందరి = | తదుపరి = [[సుమతీ శతకము - రెండవభాగం]] | వివరములు = |సంవత్సరం= }} __NOTOC__ ===001=== శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ '''భావం:''' మంచి బుధ్ధిగలవాడా! శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులను ఔరా అనునట్లుగా నోటినుండి నీళ్ళూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును భోధించు నీతులను చెప్పెదన్. ===002=== అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ '''భావం:''' అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెఱవేర్చని భగవంతుని, యుద్ధసమయమున ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుఱ్ఱమును వెంటనే విడిచిపెట్టవలయును. ===003=== అడిగిన జీతంబియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ '''భావం:''' అడిగినప్పుడు జీతము ఇవ్వని యజమానిని సెవించి జీవించుటకంటె, వేగముగా పోగల యెద్దులను కట్టుకొని పొలమును దున్ని బ్రతకవచ్చు ===004=== అడియాస కొలువు గొలువకు, గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్‌ విడువక కూరిమి సేయకు, మడవిని దో డరయ కొంటి నరుగకు సుమతీ '''భావం:''' వృధా ప్రయాసయగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తుత్వము చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయము లేక ఒంటరిగా పోకుము. ===005=== అధరము గదలియు, గదలక మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ అధికార రోగ పూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతీ '''భావం:''' పెదవి కదలీకదలకుండ తీయనైన మాటలు మాని, మాటలాడనను నియమము పూని, అధికార వ్యాధిచేనిండిన చెవిటి గ్రుడ్డి పీనుగును చూచుట పాపము. ===006=== అప్పు కొని చేయు విభవము, ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్‌, దప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ '''భావం:''' ఋణము దెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనమందు పడుచు భార్య, తప్పిదములను కనిపెట్టని రాజు యొక్క రాజ్యము సహింపరానిదై చివరకు హానిని తెచ్చిపెట్టును. ===007=== అప్పిచ్చువాడు, వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్‌ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ '''భావం:''' ఋణమునిచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడును ఆగకుండా ప్రవహించు నదియును, బ్రాహ్మణుడుగల గ్రామమునందు నివసింపుము. వారు లేనట్టి గ్రామమునందు నివసింపకుము. ===008=== అల్లుని మంచితనంబును, కాపు సాహిత్య విద్య, కోమలి నిజమున్‌, బొల్లున దంచిన బియ్యము, దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ '''భావం:''' అల్లుని మంచితనమును, కాపువాని పాండిత్య జ్ఞానమును, ఆడుదానియందు నిజమును, పొల్లు ధాన్యములో బియ్యమును, తెల్లని రంగు కాకులును లోకములో నుండవు. ===009=== ఆకొన్న కూడె యమృతము, తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్‌, సోకోర్చువాడె మనుజుడు, తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ '''భావం:''' లోకమునందు ఆకలి సమయమున అన్నమే అమృతము. బాధ నొందకుండా నిచ్చువాడే దాత. ఆవేశమును ఓర్చుకొనువాడే మానవుడు. ధైర్యం కలవాడే వంశ శ్రేష్టుడు. ===010=== ఆకలి యుడుగని కడుపును, వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్‌, బ్రాకొన్న నూతి యుదకము, మేకల పాడియును రోత మేదిని సుమతీ '''భావం:''' భూమియందు ఆకలి తీరని భోజనం, గర్భము వచ్చిన జారస్త్రీ యొక్క వ్యభిచారమును విడువని బ్రతుకును, పాచిపట్టిన బావి నీళ్ళును, మేకల పాడియు రోత పుట్టించును. ===011=== ఇచ్చునదె విద్య, రణమున జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్‌ మెచ్చునదే నేర్చు, వదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ '''భావం:''' భూమియందు ధనము నొసగునదియే విద్య. యుద్ధభూమియందు ప్రవేశించునదే పౌరుషము. మంచి కవిశ్రేష్టులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము. తగవునకు వచ్చునదియే హాని. ===012=== ఇమ్ముగ జదువని నోరును, నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్‌, దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ '''భావం:''' ఇంపుగా పఠింపని నోరును, అమ్మయని పిలచి అన్నము అడుగనినోరును, తమ్ముడాయని పిలువని నోరును, కుమ్మరివాడు మన్నుత్రవ్విన గోయీవంటిది సుమా. ===013=== ఉడుముండదె నూరేండ్లును, బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌, మడువున గొక్కెర యుండదె, కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ '''భావం:''' ఉడుము నూరేండ్లును, పాము పదివందల ఏండ్లును, కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి. వాని జీవితములన్నియు నిరుపయోగములు. మానవుని జీవిత మట్టిదికాక ధర్మార్ధకామ మోక్షాసక్తితో కూడినది కావలెను. ===014=== ఉత్తమగుణములు నీచున కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా నెత్తిచ్చి కరగి పోసిన నిత్తడి బంగారమగునె యిలలో సుమతీ? '''భావం:''' బంగారమునకు సమానమైన యెత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏవిధముగను మంచి గుణములు కలుగనేరవు. ===015=== ఉదకము ద్రావెడు హయమును, మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌, మొదవు కడ నున్న వృషభము, జదువని యానీచు గడకు జనకుర సుమతీ '''భావం:''' నీరు త్రాగెడు గుఱ్ఱము కడకును, క్రొవ్వుచే విజృంబించు మదపుటేనుగుకడకును, ఆవుకడనున్న ఆబోతు దగ్గరకును, విద్య నేర్వని అల్పుని కడకును వెళ్ళకుము. ===016=== ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా; అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ '''భావం:''' మేలు చేసినవానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషములు లెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు. ===017=== ఉపమింప మొదలు తియ్యన కపటం బెడనెడను జెఱకు కై వడినే పో నెపములు వెదకును గడపట గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ '''భావం:''' చెఱకుగడ మొట్టమొదట తియ్యగానుండి, చివరకు పోయిన కొలది మధ్య మధ్య చప్పగా నేవిధమున నుండునో ఆ విధముగా పోల్చి చూడగా మోసగాడైన దుర్మార్గునితోడి స్నేహము మొదట ఇంపుగా నున్నను చివరకు తప్పులను వెదకుటకు ప్రారంభించునుగదా. ===018=== ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్‌ నొప్పించక, తా నొవ్వక, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ '''భావం:''' ఏ సమయమునకు ఏదేది అవసరమో తెలుసుకొని, అప్పటికా మాటలు పల్కి ఇతరుల మనస్సులను బాధపెట్టక తాను బాధనుపడక తప్పించుకొని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు. ===019=== ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్‌ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ '''భావం:''' నల్లత్రాచుయొక్క పడగనీడను వసించు కప్ప బ్రతుకెంత అస్థిరమైనదో ఆ విధముగనే ఎల్లప్పుడు దోషములను వెదకు యజమానుని సేవించువాడి బ్రతుకును ప్రాణభయముతో కూడినది. ===020=== ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్‌ తెప్పలుగ జెఱువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ '''భావం''': చెరువునిండా నీరుచేరగనే వేలకొలది కప్పలందులోనికి ఏ విధముగా చేరుకొనునో, సంపద కలిగిన బంధువులెక్కువగా జేరుకొందురు. ===021=== ఏఱకుమీ కసుగాయలు, దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ, పాఱకుమీ రణమందున, మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ '''భావం:''' ఈ భూమి పైన పచ్చికాయలు ఏరి తినకుము, చుట్టములను ధూషింపకుము, యుధ్ధమునుండి వెనుదిరిగి పారిపోకుము, పెద్దల మాటను జవదాటకుము తప్పు సుమా. ===022=== ఒక యూరికి నొక కరణము, నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్‌, గకవికలు గాక యుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ '''భావం:''' ఒక గ్రామమునకు ఒక లేఖరి, ఒక ధర్మాధికారి యుండవలెను. అట్లు కాక పైన చెప్పబడినవారు పెక్కుమందియైనచో అనేకమైన గంధరగోళములు పుట్టి సమస్తమును చెడిపోవుట సహజము. ===023=== ఒరు నాత్మ దలచు సతి విడు, మఱుమాటలు పలుకు సతుల మన్నింపకుమీ, వెఱ పెఱుగని భటునేలకు, తఱచుగ సతి గవయ బోకు, తగదుర సుమతీ ===024=== ఒల్లని సతి నొల్లని పతి, నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే గొల్లండు, కాక ధరలో గొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ '''భావం:''' తన్ను ప్రేమించని భార్యను, యజమానుని, స్నేహితుని విడిచిపెట్టుటకు అంగీకరింపనివాడే వెర్రిగొల్లవాడు. కాని జాతిచేత గొల్లవాదైనంత మాత్రమున గుణములయందు వెర్రి గొల్లవాడు కాదు. ===025=== ఓడల బండ్లును వచ్చును, ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్‌, ఓడలు బండ్లును వలనే వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ '''భావం:''' నావలమీద బండ్లును, బండ్లమీద నావలును వచ్చునట్లుగనే భాగ్యవంతులకు దారిద్ర్యము, దరిద్రులకు భాగ్యమును పర్యాయముగా కలుగుచుండును. ===026=== కడు బలవంతుడైనను బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన యింటన్‌ దడవుండ నిచ్చెనేనియు బడుపుగ నంగడికి దానె బంపుట సుమతీ '''భావం:''' ఎంత సమర్ధత కలవాడైనను యవ్వనమందున్న భార్యను చిరకాలము పుట్టినయింట నుండనిచ్చినచో తానే స్వయముగా భార్యను వ్యభిచార వృత్తికి దింపినవాడగును. ===027=== కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ '''భావం:''' కుక్కను తీసుకొని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు గద్దె మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకము చేసినప్పటికి దాని నైజగుణము నేలాగున మానలేదో, ఆ విధముగనే అల్పుడైనవానికి ఎంత గౌరవము చేసి మంచి పదవొసంగినను తన నీచత్వమును వదలనేరడు. ===028=== కప్పకు నొరగాలైనను, సర్పమునకు రోగమైన, సతి తులువైనన్‌, ముప్పున దరిద్రుడైనను, తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ '''భావం:''' కప్పకు కాలు విఱిగినను, పాముకు రోగము కలిగినను, భార్య దుష్టురాలైనను, ముసలితనములో దారిద్ర్యము సంభవించినను, ఎక్కువ దుఖప్రదమగును తప్పదు. ===029=== కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ '''భావం:''' కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్టిన తరువాత తమ మిత్రుడైన సూర్యుని యొక్క ఎండ తాకుడుకే కమలుచున్నవి. అట్లే మానవులు తమ తమ హద్దులు దాటి ప్రవర్తించిన తమ స్నేహితులే తమకు శత్రువులగుదురు. ===030=== కరణము గరణము నమ్మిన మరణాంతక మౌను గాని మనలేడు సుమీ; కరణము దన సరి కరణము మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ '''భావం:''' ఒక లేఖకుడు మఱియొక లేఖకుని నమ్మిన మరణముతో సమానమైన ఆపదను చెందును కావున లేఖకుడైనవాడు తనతో సమానుడైన మఱియొక లేఖరిని విశ్వసింపక తన గుట్టు ఈయక జీవింపవలయును. ===031=== కరణముల ననుసరింపక విరసంబున దిన్న తిండి వికటించు జుమీ యిరుసున కందెన బెట్టక పరమేశ్వరు బండి యైన బారదు సుమతీ '''భావం:''' బండి యిరుసునకు కందెన పెట్టకున్నచో భగవంతుని బండియైనను త్వరితంగా పరుగెత్తదు. అదే విధముగా పంచేంద్రియాలు ఇచ్చే సూచనలు గమనిచకుండా ఏది పడితే అది తింటే వికటించగలదు. ===032=== కరణము సాదైయున్నను, గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్‌, ధర దేలు మీటకున్నను, గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ '''భావం:''' భూమియందు కరణము నెమ్మదివాడైనను, ఏనుగు మదము పోయినదైననూ, త్రాచు కఱవకున్నను, తేలు కుట్టకున్నను ఆశ్చర్యముతో మిక్కిలి తేలికగా చూతురు. ===033=== కసుగాయ గఱచి చూచిన మసలక పస యొగరు రాక మధురంబగునా; పస గలుగు యువతులుండగ పసి బాలల బొందువాడు పశువుర సుమతీ '''భావం:''' పక్వమునకు వచ్చిన పండ్లను వదలి పచ్చికాయలను కొఱికిన తీయదనము లేక ఒగరుగా దోచును. ఆ విధముగనే చాతుర్యము గల పడుచులుండంగా పసిపాపలను కూడెడువానికి సుఖము శూన్యము అట్టివాడు నిజముగా పశువే. ===034=== కవి కాని వాని వ్రాతయు, నవరస భావములు లేని నాతుల వలపున్‌, దవిలి చను పంది నేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతీ '''భావం:''' కవికానట్టివాడు వ్రాసిన రచనయును, తొమ్మిది రసముల యొక్క స్థితులు తెలియని స్త్రీలయొక్క ప్రేమయును, ముందు పోయెడి పందిని వెంబడించి కొట్టలేనివాని యొక్క ఆయుధవిద్యయందలి నేర్పరితనము వ్యర్ధము. ===035=== కాదు సుమీ దుస్సంగతి, పోదుసుమీ "కీర్తి" కాంత పొందిన పిదపన్‌, వాదు సుమీ యప్పిచ్చుట, లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ '''భావం:''' చెడ్డవారితోడ స్నేహము మంచిదికాదు. కీర్తి వచ్చిన పిదప నశించదు. అప్పొసంగుట తగవులకు మూలము. స్త్రీలకడ ప్రేమ శూన్యము. ===036=== కాముకుడు దనిసి విడిచిన కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్‌ బ్రేమమున జెఱకు పిప్పికి చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ '''భావం:''' ఒక విటుడు తృప్తియగునట్లుగా భోగించి విడచిన కాంతను మఱియొక జాఱుడు అనుభవింపగోరుట చెఱకునందలి రసమును సంపూర్ణముగా తీసివేసిన తరువాత ఆ పిప్పికై చీమలు ముసుకొన్నట్లుండును. ===037=== కారణము లేని నగవును, బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో బూరణము లేని బూరెయు, వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ '''భావం:''' కారణములేని నవ్వును, పేరణము(రవిక) లేని స్త్రీయును, పూరణములేని బూరెయును, వీరణములేని పెండ్లియును వ్యర్ధములు. ===038=== కులకాంత తోడ నెప్పుడు గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ, కలకంఠి కంట కన్నీ రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ '''భావం:''' భార్యతోడ నెప్పుడును జగడములాడవలదు. లేని నేరములు ఆరోపింపవలదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటనీరు క్రిందపడిన నాయింట లక్ష్మి నిలవదు. ===039=== కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా కూరిమి విరసంబైనను నేరములే తోచు చుండు నిక్కము సుమతీ '''భావం:''' పరస్పరము స్నేహమున్న రోజులలో నేరములెప్పుడును కనుపించబోవు. ఆ స్నేహము చెడగానే అన్నియును తప్పులుగా కనపడుచుండును. ఇది నిజము. ===040=== కొంచెపు నరు సంగతిచే నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌ గించిత్తు నల్లి కుట్టిన మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ '''భావం:''' చిన్న నల్లి కుట్టిన ఆ నల్లి యున్న మంచమును ఎండలో వేయుట కర్రతో కొట్టుట, మరుగునీళ్ళు పోయుట మొదలగు ఆపదలు కలుగును. ఆ విధముగనే అల్పుడైనవానితోడి స్నేహము ఎట్టివారికైనను ఆపదను తెచ్చిపెట్టును. ===041=== కొక్కోకమెల్ల జదివిన, చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్‌, మిక్కిలి రొక్కము లియ్యక, చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ '''భావం:''' వెలయాలు పుష్కలముగా ధనమీయకున్న ఎంతగా రతిశాస్త్రమును చదివినవాడైనను, అందగాడైనను, గొప్ప రాజశ్రేష్టుడైనను, ప్రేమించి దగ్గరకు చేరదు. ===042=== కొఱ గాని కొడుకు బుట్టిన కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్‌ చెఱకు తుద వెన్ను బుట్టిన జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ '''భావం:''' చెఱకుగడ చివర వెన్ను పుట్టినచో ఆ చెఱకునందలి తీయదనము నంతయు నేవిధముగ పాడుచేయునో ఆ విధముగనే అప్రయోజకుడైన కుమారుడు కలిగిన కుటుంబమునకుపయోగకారి కాకపోవుట యటుండగా తండ్రి మంచిగుణమును కూడా పాడుచేయును. ===043=== కోమలి విశ్వాసంబును, బాములతో జెలిమి, యన్య భామల వలపున్‌, వేముల తియ్యదనంబును, భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ '''భావం:''' స్త్రీలయందు విశ్వాసమును, పాములయందు స్నేహమును, పరస్త్రీలయందు ప్రేమయును, వేపచెట్లయందు తీయదనమును, రాజులయందు నమ్మకము వట్టి అసత్యములు. ===044=== గడన గల మగని జూచిన నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో; గడ నుడుగు మగని జూచిన నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ '''భావం:''' స్త్రీలు సంపాదన కలిగిన భర్తను చూచిన అడుగులకు మడుగులొత్తుచు పూజింతురు. సంపాదనలేని మగనిని చూచినచో నడుచునట్టి శవము వచ్చెనని హీనముగా జూతురు. ===045=== చింతింపకు కడచిన పని, కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో, నంతఃపుర కాంతలతో మంతనముల మాను మిదియె మతముర సుమతీ '''భావం:''' జరిగిపోయిన దానిని గురించి ఆలోచించుటయు, స్త్రీలు తన్ను ప్రేమింతురని విశ్వసించుటయును, రాణీవాసపు స్త్రీలతో రహస్యములను విడిచిపెట్టుము. ఇదియే అనుసరించవలసిన మంచితనము. ===046=== చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు పామరుడు దగన్‌ హేమంబు గూడ బెట్టిన భూమీశుల పాల జేరు భువిలో సుమతీ '''భావం:''' చీమలు పెట్టినటువంటి పుట్టలు పాములకు నివాసమైనంట్లు, అజ్ఞానుడు కూడబెట్టిన బంగారమంతయు రాజుల వశమైపోవును. ===047=== చుట్టములు గాని వారలు చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్‌ నెట్టుకొని యాశ్రయింతురు గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ '''భావం:''' ధనము కలిగిన యెడల ఏ సంబంధంలేని వారు కూడ, ఆ ధనము మీది ఆశతో, లేని సంబంధము కలుపుకొని మన కూడా ఉంటారు. ===048=== చేతులకు దొడవు దానము, భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో, నీతియె తొడవెవ్వారికి, నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ '''భావం:''' చేతులకు దానమును, పాలకులకు అసత్యమును పలుకకుండుటయును, అందరికినీ న్యాయమును, స్త్రీకి అభిమానమును అలంకారములు. ===049=== తడ వోర్వక, యొడ లోర్వక, కడు వేగం బడిచి పడిన గార్యం బగునే; తడ వోర్చిన, నొడ లోర్చిన, జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ '''భావం:''' ఆలస్యమునకు, శరీర శ్రమకును సహింపక తొందరపడిన నేకార్యమును కానేరదు. ఆలస్యమునకును శరీర శ్రమకును ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యమంతయు నెఱవేరుచుండును. ===050=== తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము, తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ '''భావం:''' తన కోపమే తనను శత్రువులువలె బాధించును. తన శాంతమే తనను రక్షించును. తన దయయే తనకు చుట్టమువలె సహాయపడును. తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము. తన దుఖమే తనకు నరకమగును. ఇది నిజము. ==ఇవి కూడా చూడండి== * [[సుమతీ శతకము - రెండవభాగం]] ==వనరులు== {{వికీపీడియా|బద్దెన}} {{శతకములు}} {{PD-old}} [[వర్గం:13వ శతాబ్దం రచనలు]] skcqk7rxf4q2mzrby9smc8tappgv2z0 సూచిక:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf 106 161308 552366 551989 2026-04-09T12:59:13Z Rajasekhar1961 50 552366 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[ధమ్మపదము]] |భాష=te |సంపుటి= |రచయిత= |అనువాదకులు=[[రచయిత:కిళాంబి రంగాచార్యులు]] |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=కాశీనాథుని నాగేశ్వరరావు |చిరునామా=చెన్నై |సంవత్సరం=1927 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} ffqv6afyb3oc1tiu2ao7y9r57lfll9w పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/228 104 171150 552394 551941 2026-04-10T01:24:16Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 552394 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |209 }}</noinclude> ఇంద్రియములగా, నిగ్రహించి జయించి, ప్రాణములతో = ప్రాణవా యువులతో, మానసముక్=మనస్సును, కూర్చించేర్చి, వానితోడు = అ ప్రాణముల తోను, మనసుతోను, హంసయనఁగ హంసయనెడు, ఒప్పున క్షరద్వయంలు = ఒప్పుచున్న రెండక్షరములను, యోజించి = చేర్చి, సంతకము ఎల్లప్పుడును, భజింపన "లయుఁ" = జపింపవలయును. అది ఎట్లంటేని ఆజపించుట యెట్లనఁగా. తా. మొట్టమొదట నింద్రియములు వానివానివృత్తులనుండి మరలించి వానితోఁ ప్రాణములఁ జేర్చి యందు మనసును సంధించి (అనఁగాఃనన్నిఁటి శీకా ముగఁ జేసి) యా. ప్రాణమనస్సులతోఁగూడ హం, స అను రెండక్షరములను జేర్చి సర్వకాలములయం దును సేవింపవలయును. (ధ్యానింపనలయును అనుట. ఇదియే హంసతత్త్వానుభవము, ఇదియే ఆజపా గాయత్రి.) అవ. సంక్షేపముగాఁ జెప్పఁబడిన హంసతత్త్వానుభవమును (లేక, హంసమంత్ర జపప్రకారమును) విస్తరించుచున్నాఁడు— <poem> సీ. అనిశంబు పద్మాసనాసీనుఁడై చూపు లమరంగ నాసికాగ్రమున నిలిపి యింద్రియంబుల నెల్ల నిట్టట్టు వోనీక మదిచేతఁ దిరముగా గుదియఁబట్టి ప్రాణాదిదశవిధపవనంబులను వికా రము లంట కుండఁ జొక్కముగ నునిచి కామరాగాదిసంకల్పవర్ణనము గా స్వాంతంబు నరసి నిశ్చలముఁ జేసి తే. యనిలమానసములతోడ హంసమంత్ర మమరఁ గూర్చి జపించుచు నంతమీఁద హృదయనభమున బిందువు గదల కుండఁ బెంపుగా నాకళల వీక్షింపవలయు. {{float right|168 }} </poem> టీ. అనిశంబు = ఎల్లప్పుడు, పద్మాసనాసీనుఁడై = పద్మాసనమునఁ గూర్చుండి, చూ పులు, అమరంగన్ = చక్కగ, నాసికాగ్రమున = ముక్కుకొనయందు, నిలిపి = ఉం చి, ఇంద్రియంబులనెల్లన్ , ఇట్టట్టుపోనీక = చలింపనీక, మదిచేతన్ = మనోబలముచేత, తీరముగాన్ = నిశ్చలముగా, (లేక దృఢముగా) కుదియఁబట్టి = నిర్బంధించి, ప్రాణా.… లన్ - ప్రాణాది = ప్రాణము మొదలగు, దశవిధపవనంబులన్ = పదివిధము లగువాయువు లను, వికారములు = మార్పులు, అంటకుండన్ = కలుఁగకుండ, చొక్కముగనునిచి = బా గుగ నిలిపి, "కామ…ముగాన్ - కామరాగాది - కౌమము రాగము మొదలగు, సంకల్ప<noinclude><references/></noinclude> qk0eczo20blmnl23ut935ksvqojxp0g 552395 552394 2026-04-10T01:24:37Z Ramesam54 3001 552395 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |209 }}</noinclude> ఇంద్రియములగా, నిగ్రహించి జయించి, ప్రాణములతో = ప్రాణవా యువులతో, మానసముక్=మనస్సును, కూర్చించేర్చి, వానితోడు = అ ప్రాణముల తోను, మనసుతోను, హంసయనఁగ హంసయనెడు, ఒప్పున క్షరద్వయంలు = ఒప్పుచున్న రెండక్షరములను, యోజించి = చేర్చి, సంతకము ఎల్లప్పుడును, భజింపన "లయుఁ" = జపింపవలయును. అది ఎట్లంటేని ఆజపించుట యెట్లనఁగా. తా. మొట్టమొదట నింద్రియములు వానివానివృత్తులనుండి మరలించి వానితోఁ ప్రాణములఁ జేర్చి యందు మనసును సంధించి (అనఁగాఃనన్నిఁటి శీకా ముగఁ జేసి) యా. ప్రాణమనస్సులతోఁగూడ హం, స అను రెండక్షరములను జేర్చి సర్వకాలములయం దును సేవింపవలయును. (ధ్యానింపనలయును అనుట. ఇదియే హంసతత్త్వానుభవము, ఇదియే ఆజపా గాయత్రి.) అవ. సంక్షేపముగాఁ జెప్పఁబడిన హంసతత్త్వానుభవమును (లేక, హంసమంత్ర జపప్రకారమును) విస్తరించుచున్నాఁడు— <poem> సీ. అనిశంబు పద్మాసనాసీనుఁడై చూపు లమరంగ నాసికాగ్రమున నిలిపి యింద్రియంబుల నెల్ల నిట్టట్టు వోనీక మదిచేతఁ దిరముగా గుదియఁబట్టి ప్రాణాదిదశవిధపవనంబులను వికా రము లంట కుండఁ జొక్కముగ నునిచి కామరాగాదిసంకల్పవర్ణనము గా స్వాంతంబు నరసి నిశ్చలముఁ జేసి తే. యనిలమానసములతోడ హంసమంత్ర మమరఁ గూర్చి జపించుచు నంతమీఁద హృదయనభమున బిందువు గదల కుండఁ బెంపుగా నాకళల వీక్షింపవలయు. {{float right|168 }} </poem> టీ. అనిశంబు = ఎల్లప్పుడు, పద్మాసనాసీనుఁడై = పద్మాసనమునఁ గూర్చుండి, చూ పులు, అమరంగన్ = చక్కగ, నాసికాగ్రమున = ముక్కుకొనయందు, నిలిపి = ఉం చి, ఇంద్రియంబులనెల్లన్ , ఇట్టట్టుపోనీక = చలింపనీక, మదిచేతన్ = మనోబలముచేత, తీరముగాన్ = నిశ్చలముగా, (లేక దృఢముగా) కుదియఁబట్టి = నిర్బంధించి, ప్రాణా.… లన్ - ప్రాణాది = ప్రాణము మొదలగు, దశవిధపవనంబులన్ = పదివిధము లగువాయువు లను, వికారములు = మార్పులు, అంటకుండన్ = కలుఁగకుండ, చొక్కముగనునిచి = బా గుగ నిలిపి, "కామ…ముగాన్ - కామరాగాది - కౌమము రాగము మొదలగు, సంకల్ప<noinclude><references/></noinclude> szvuhutxvrc4cg3qaj5ynsy9oxgm7ab 552534 552395 2026-04-10T05:10:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 552534 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |209 }}</noinclude>'''టీ'''. ఇంద్రియములన్, నిగ్రహించి = జయించి, ప్రాణములతో = ప్రాణవాయువులతో, మానసమున్ = మనస్సును, కూర్చి = చేర్చి, వానితోడన్ = ఆప్రాణములతోను, మనసుతోను, హంస యనఁగన్ = హంస యనెడు, ఒప్పునక్షరద్వయంబున్ = ఒప్పుచున్న రెండక్షరములను, యోజించి = చేర్చి, సంతతము = ఎల్లప్పుడును, భజింపవలయున్ = జపింపవలయును, అది ఎట్లంటేని = ఆజపించుట యెట్లనఁగా. '''తా'''. మొట్టమొదట నింద్రియముల వానివానివృత్తులనుండి మరలించి వానితోఁ ప్రాణములఁ జేర్చి యందు మనసును సంధించి (అనఁగా: నన్నిఁటి నేకాగ్రముగఁ జేసి) యాప్రాణమనస్సులతోఁగూడ హం, స అను రెండక్షరములను జేర్చి సర్వకాలములయందును సేవింపవలయును. (ధ్యానింపవలయును అనుట. ఇదియే హంసతత్త్వానుభవము. ఇదియే ఆజపాగాయత్రి.) '''అవ'''. సంక్షేపముగాఁ జెప్పఁబడిన హంసతత్త్వానుభవమును (లేక హంసమంత్రజపప్రకారమును) విస్తరించుచున్నాఁడు — {{Telugu poem|type=సీ.|lines=<poem>అనిశంబు పద్మాసనాసీనుఁడై చూపు లమరంగ నాసికాగ్రమున నిలిపి యింద్రియంబుల నెల్ల నిట్టట్టు వోనీక మదిచేతఁ దిరముగా గుదియఁబట్టి ప్రాణాదిదశవిధపవనంబులను వికా రము లంట కుండఁ జొక్కముగ నునిచి కామరాగాదిసంకల్పవర్ణనము గా స్వాంతంబు నరసి నిశ్చలముఁ జేసి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>యనిలమానసములతోడ హంసమంత్ర మమరఁ గూర్చి జపించుచు నంతమీఁద హృదయనభమున బిందువు గదల కుండఁ బెంపుగా నాకళల వీక్షింపవలయు.</poem>|ref=168}} '''టీ'''. అనిశంబు = ఎల్లప్పుడు, పద్మాసనాసీనుఁడై = పద్మాసనమునఁ గూర్చుండి, చూపులు, అమరంగన్ = చక్కగ, నాసికాగ్రమునన్ = ముక్కుకొనయందు, నిలిపి = ఉంచి, ఇంద్రియంబులనెల్లన్, ఇట్టట్టు పోనీక = చలింపనీక, మదిచేతన్ = మనోబలముచేత, తిరముగాన్ = నిశ్చలముగా (లేక దృఢముగా), కుదియఁబట్టి = నిర్బంధించి, ప్రాణా...లన్ — ప్రాణాది = ప్రాణము మొదలగు, దశవిధపవనంబులన్ = పదివిధము లగువాయువులను, వికారములు = మార్పులు, అంటకుండన్ = కలుఁగకుండ, చొక్కముగ నునిచి = బాగుగ నిలిపి, కామ...ముగాన్ — కామరాగాది = కౌమము రాగము మొదలగు, సంకల్ప<noinclude><references/></noinclude> 6aq5tefbwytpa138dxwl25g3ip2mt6q 552536 552534 2026-04-10T05:11:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 552536 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |209 }}</noinclude>'''టీ'''. ఇంద్రియములన్, నిగ్రహించి = జయించి, ప్రాణములతో = ప్రాణవాయువులతో, మానసమున్ = మనస్సును, కూర్చి = చేర్చి, వానితోడన్ = ఆప్రాణములతోను, మనసుతోను, హంస యనఁగన్ = హంస యనెడు, ఒప్పునక్షరద్వయంబున్ = ఒప్పుచున్న రెండక్షరములను, యోజించి = చేర్చి, సంతతము = ఎల్లప్పుడును, భజింపవలయున్ = జపింపవలయును, అది ఎట్లంటేని = ఆజపించుట యెట్లనఁగా. '''తా'''. మొట్టమొదట నింద్రియముల వానివానివృత్తులనుండి మరలించి వానితోఁ ప్రాణములఁ జేర్చి యందు మనసును సంధించి (అనఁగా: నన్నిఁటి నేకాగ్రముగఁ జేసి) యాప్రాణమనస్సులతోఁగూడ హం, స అను రెండక్షరములను జేర్చి సర్వకాలములయందును సేవింపవలయును. (ధ్యానింపవలయును అనుట. ఇదియే హంసతత్త్వానుభవము. ఇదియే ఆజపాగాయత్రి.) '''అవ'''. సంక్షేపముగాఁ జెప్పఁబడిన హంసతత్త్వానుభవమును (లేక హంసమంత్రజపప్రకారమును) విస్తరించుచున్నాఁడు — {{Telugu poem|type=సీ.|lines=<poem>అనిశంబు పద్మాసనాసీనుఁడై చూపు లమరంగ నాసికాగ్రమున నిలిపి యింద్రియంబుల నెల్ల నిట్టట్టు వోనీక మదిచేతఁ దిరముగా గుదియఁబట్టి ప్రాణాదిదశవిధపవనంబులను వికా రము లంట కుండఁ జొక్కముగ నునిచి కామరాగాదిసంకల్పవర్ణనము గా స్వాంతంబు నరసి నిశ్చలముఁ జేసి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>యనిలమానసములతోడ హంసమంత్ర మమరఁ గూర్చి జపించుచు నంతమీఁద హృదయనభమున బిందువు గదల కుండఁ బెంపుగా నాకళల వీక్షింపవలయు.</poem>|ref=168}} '''టీ'''. అనిశంబు = ఎల్లప్పుడు, పద్మాసనాసీనుఁడై = పద్మాసనమునఁ గూర్చుండి, చూపులు, అమరంగన్ = చక్కగ, నాసికాగ్రమునన్ = ముక్కుకొనయందు, నిలిపి = ఉంచి, ఇంద్రియంబులనెల్లన్, ఇట్టట్టు పోనీక = చలింపనీక, మదిచేతన్ = మనోబలముచేత, తిరముగాన్ = నిశ్చలముగా (లేక దృఢముగా), కుదియఁబట్టి = నిర్బంధించి, ప్రాణా...లన్ — ప్రాణాది = ప్రాణము మొదలగు, దశవిధపవనంబులన్ = పదివిధము లగువాయువులను, వికారములు = మార్పులు, అంటకుండన్ = కలుఁగకుండ, చొక్కముగ నునిచి = బాగుగ నిలిపి, కామ...ముగాన్ — కామరాగాది = కామము రాగము మొదలగు, సంకల్ప<noinclude><references/></noinclude> kg9k0wcu7mgc7h5noskp1xdojc3tfwl పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/229 104 171151 552398 482997 2026-04-10T01:38:35Z Ramesam54 3001 552398 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 210 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude><poem></poem> {{float right| }} వర్జనముగాన్ -సంకల్పములు లేకుండునట్లుగా, స్వాంతంబున్ = మనసును, అరసి = విమర్శించి, నిశ్చలము చేసి = చలనము లేకుండఁజేసి, అనిలమానసములతోడన్ - అనిల = ప్రాణవాయువులతోను, మానస = మనస్సుతోను, హంసమంత్రము = హంస యనెడు మంత్రమును, అమర = ఒప్పునట్లుగా, కూర్చి = చేసి, జపించుచు = జపము చేయుచు, అంతమీఁదన్ = తర్వాత, హృదయనభమునన్ = హృదయాకాశమునందు, బిందువు కద లకుండన్ = బుద్ధి చలింపకుండఁజేసి, పెంపుగాన్ = దినదినమున అభివృద్ధి యగునట్లుగా, నాదకళలన్ - నాద = దశవిధ ప్రణవనాదములను, కశలన్ = చిత్కళలను, వీక్షింపనల యున్ = చూడవలయును. తా. సాధకుఁ డగువాఁడు పద్మాసనస్థితుఁడై కూర్చుండి దృష్టిని నాసికాగ్ర ముపై నిలిపి (లేక నాసికాగ్రమును జూచు వానివలె దృష్టినిఁగదలక నిలిపి) ఇటునటువీ క్షింపక దశవిధేంద్రియములఁ జలింపనీక మనశ్శక్తిచే స్థిరములఁ గావించి యామనస్సున్న గూడ కామము రాగము మొదలగు సంకల్పవికల్పములచేఁ జెదరకుండునట్లు ఏకాగ్ర భాషము నొందించి ప్రాణవాయువులకు వికారములు లేకుండునట్లు జేసి ఆమనః ప్రాణ ములతో హంసమంత్రమునుగూర్చి జపింపవలయును. (అనఁగాః ప్రాణముతోఁజేర్చి హంసమంత్రమును జపించుచు మనసు నామంత్రాదిదేవతయందే నిలుపవలయును.) ఇదియే హంసతత్త్వానుభవము. ఇట్లు సర్వకాలములయందు నాచరించుచు హృదయా కాశమునందున్న బిందువు చలింపకుండునట్లుఁ జేయవలయును. హంసతత్త్వానుభవము కలుగఁగానే బిందువు తనంతఁ దానే నిలచును. అచట సాధకుఁ డాచరింపవలసిన ప్ర యత్న మేదియును లేదు. ఇట్లా బిందువు స్థిరము కాఁగానే నాదకళలు గోచరము లగును. కావున నీహంసతత్త్వానుభవము రాజయోగికి ప్రథమ కర్తవ్యము. అన. ఇట్టు మంత్రము నెఱింగించి దానియర్థమును వివరించుచున్నాఁడు.. ఆ. నాదబిండుకళల కాదియై ద్రష్ట యె సర్వదృశ్యములకు సాక్షి యగుచుఁ జిత్స్వరూప మైన శ్రీ రామతత్త్వమా నముల మగుహకార మాంజ నేయ! - 169 టీ, అంజనేయ! నాదబిందుకు ళలకు నాట ప్రణవనాదములకు, బిందుబు దికి, కళలకు=చిక్క ళలకు, ఆదియై కారణభూతుఁడై, ద ప్రయె అనాదబిందుక ళలను జూచువాఁడై, సర్వ... లకు-సర్వ సమస్తములైన, దృశ్యములకు" ఈక నల్ ఎడుపదార్థముల కొన్ని టికిని, సాక్షియగుచుకో- ప్రకాశకుఁడగుచు, చిత్స్వరూపము జ్ఞానస్వరూపము, ఐన శ్రీ రామతత్త్వము ఐన = ఐనట్టి, శ్రీశోభాయుక్తుడైన<noinclude><references/></noinclude> 0crjdhdw8xlu3v6mwqxtdcrxqzhz51m పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/34 104 178767 552370 496104 2026-04-09T14:28:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552370 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>న్యనివహమున్ వడిన్ దఱిమినన్ సురు లచ్చెరు వంది రప్పు డ ద్దనుజుఁడు మందరాచలవిధంబున నబ్బలవార్ధిఁ జొచ్చినన్.</poem>|ref=32}} {{Telugu poem|type=సీ.|lines=<poem>కలగుండు వడి హల్లకల్లోల మై చాలఁ గలఁగె వాహినులు భంగములతోడఁ గటకశోభితవిశంకటకూటములతోడఁ బెకలె సపక్షభూభృచ్ఛయంబు చండభాస్కరసముజ్జ్వలితహేతులతోడ బాడబోద్భూతవిభ్రమము లడఁగె నాలోలకీలాలహతులతోడఁ బెనంగి కడలేనివివిధశంఖములు దేలెఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బవనసుతపౌత్రదుర్దాంతబాహుదండ, మందరాచలమంధానమథ్యమాన యౌవనాశ్వమహీపాలకాగ్రగణ్య, వర్ణితాభీలవిపుల సన్యార్ణవమున.</poem>|ref=33}} {{Telugu poem|type=క.|lines=<poem>ఈకరణి దానవుం డతి, భీకరముగ రణము సేయఁ బిఱుతివియక వై భాకరసేనలు శస్త్రా, నీకంబుల ముంచి రాతనిశరీరంబున్.</poem>|ref=34}} {{Telugu poem|type=తే.|lines=<poem>అపుడు వృషకేతుఁ డమ్మహాహవముఁ జూచి, మేఘవర్ణుండు హరి విక్రమించి తెచ్చు నవసరంబున నయ్యాజి నలసినాఁడు, దలము గా దొక్కరునకు నీదళము గెలువ.</poem>|ref=35}} {{Telugu poem|type=క.|lines=<poem>అని పలికి కార్ముకము గొని, యనిలతనూజునకు మ్రొక్కి యనుమతి గొని తాఁ జనియె రణం బొనరింపఁగఁ, గనుఁగవ నునుసోఁగకెంపు గడలుకొనంగన్.</poem>|ref=36}} {{Telugu poem|type=శా.|lines=<poem>జ్యాటంకారకఠోరరావము దిశాజంఘాల మై మ్రోయఁ దీ వ్రాటోటంబున యౌవనాశ్వనృపుసైన్యంబు ల్విలోకించి త ద్ధాటీనిష్ఠురఖేలనంబునకు సంత్రాసంబు నొంద న్నిరా ఘాటోత్సాహత మేఘవర్ణుఁడు మదిం గౌతూహలం బందఁగన్.</poem>|ref=37}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఇవ్విధంబున వృషకేతుఁ డేఁగుదెంచి, యలసినాఁడవు వత్స నీ వరుగు మనుచు భీమపౌత్రుని ననిపి యుద్దామసింహ, వృత్తిఁ బరసైన్యమత్తేభవితత కుఱికి.</poem>|ref=38}} {{p|ac|fwb}}వృషకేతుఁడు సేనలం దునుముట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>బాణనఖప్రకాండముల భద్రగజంబుల సంహరించి కం ఖాణములన్ వధించి రథకాండములన్ నుఱుమాడి సద్భట శ్రేణుల మర్మవర్మములఁ జెండి విశృంఖలవృత్తి నాహవ క్షోణిఁ జరించి జన్యజయశోభితనిష్ఠురసింహనాదుఁ డై.</poem>|ref=39}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>హాటకశైలధన్వి త్రిపురాసురవీరుల సంహరించు న ప్పాటునఁ గార్ముకాంబుధరబంధురమార్గణవృష్టి ముంచినన్ ఘోటరథేభవీరభటకోటులు రూపఱి పోవ వీటికిన్ జే టెఱిఁగింపఁ గంఠగతజీవుఁ డొకం డరిగెన్ రయంబునన్.</poem>|ref=40}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అరిగి భద్రావతీశ్వరుఁ జేరి ప్రణమిల్లి సేన లన్నియు సమసినతెఱంగు వీతిఁ గొల్పోయినవిధమును విన్నవించిన రోషవిహ్వలచిత్తుఁ డగుచు</poem>|ref=}}<noinclude><references/></noinclude> ksa9m659cltl7ukzqqlbfotjtf8cuzd పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/35 104 178768 552372 496105 2026-04-09T14:42:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552372 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నెట్టెట్టురా దళం బెంత వచ్చె హయంబు పరుల కేగతి బట్టుబడియె ననిన దేవర మువ్వు రేతెంచిరి వారిలో నడుకొత్తి కొంతసైన్యము వధించి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సవనహరిఁ గొంచు నెగసె నద్దివికి నొక్కఁ డుఱికి బల మెల్ల సమయించె నొక్కఁ డతని దండ నున్నాఁడు పెనునిట్టతాటివంటి, గుదియ మూఁపున సవరించుకొని యొకండు.</poem>|ref=41}} {{Telugu poem|type=క.|lines=<poem>అని విన్నపంబు చేసిన, మనమున రోషాద్భుతములు మల్లడి గొన న య్యనఘులు కారణజన్ములు, జనులకు లే వరయ నిట్టిసామర్థ్యంబుల్.</poem>|ref=42}} {{Telugu poem|type=చ.|lines=<poem>ముగురును నాకుఁ జూడఁగఁ ద్రిమూర్తులు తప్పదు లేక వాహమున్ బొగరున నొక్కఁ డెత్తుక నభోగతి నేఁగుట యెట్లు లెక్కకున్ మిగిలిన సేన నొక్కఁ డహమించి వధించుట యెట్లు వారిలో మొగఁ దగువాని కింత మసి మోవక త్రుంగుట యెట్లు సైన్యముల్.</poem>|ref=43}} {{Telugu poem|type=తే.|lines=<poem>అశ్వమేధంబునకు విఘ్న మాచరించి, తిగిచి రశ్వంబుఁ దిగిచినఁ దిగువ నిమ్ము వానితోడన సంగరాధ్వర మొనర్చి, దేవతల నెల్ల దృప్తిఁ బొందింతు ననుచు.</poem>|ref=44}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఆహవోత్సాహదోహలమ్మున నమ్మహీవిభుండు శతాంగమాతంగతురంగసుభట పుంగవసంగతుం డై పురంబు నిర్గమించి సమరభూమిసమీపంబునకు వచ్చి యా సమీపంబున యుగాంతకాలకాలుండునుంబోలెఁ బ్రచండగదాదండమండితభుజో ద్దండుం డై భండనంబున కెదురుచూచుచున్న వృకోదరు విలోకించి యలోక సామాన్యంబు లగునతని తేజోవిశేషంబులకు నద్భుతంబు నొందుచు జన్యంబున సైన్యంబు నెల్ల సమయించి సన్యస్తభయుండై నిజధనుఃకోటివిన్యస్తహస్తుం డై యు న్నవృషకేతుం గనుంగొని శిరఃకంపంబు చేసి తనమనంబున.</poem>|ref=45}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>కంపితదిగ్విభాగమున గాసిలి వచ్చిన న న్నొకింత వీ క్షింపఁడు సైన్యమున్ సరకు సేయఁడు సింహకిశోరవృత్తి గ ర్జింపుచు నున్నవాఁడు మది మృత్యుభయం బిసుమంత లేక యీ తెంపరి కర్మపాశములు దెంపఁగ నిల్చినయోగికైవడిన్.</poem>|ref=46}} {{Telugu poem|type=తే.|lines=<poem>అని బలంబులఁ గర్ణనందనునిమీఁదఁ బంపు వెట్టిన వానిసంభ్రమము చూచి రోషతామ్రాక్షుఁ డగుచు మారుతసుతుండు, ఘనగదాదండ మంకించి కదలుటయును.</poem>|ref=47}} {{p|ac|fwb}}యౌవనాశ్వుండు వృషకేతునితోఁ బోరుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>భీమసేనునిసముద్దామత గన్గొని యెదురుగా వృషకేతుఁ డేఁగుదెంచి యీరెడుభువనంబు లెత్తి వచ్చినఁ గాక యల్పసైన్యంబు లక్ష్యంబె నీకు నీపుత్త్రులు నన్ను మన్నించి చూచుచునుండు నే నీక్షణంబున నీవు మెచ్చఁ బరబలారణ్యంబు భస్మంబు చేసెద నస్మత్కఠోరబాణాగ్నిశిఖల</poem>|ref=}}<noinclude><references/></noinclude> 02s5vfhebpifceg6djmmc4fk5ift0vc పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/36 104 178769 552381 496106 2026-04-09T19:40:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552381 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>నఖిలజనులకుఁ దేహంబుఁ లస్థిరములు, ప్రాయములు చంచలంబులు పౌరుషమునఁ గాని త్రైలోక్యవర్తిని యైనకీర్తి, గలుగనేరదు తండ్రి యెక్కాలమునను.</poem>|ref=48}} {{Telugu poem|type=మ.|lines=<poem>కరియానం బటుపాశహస్తఁ బృథుశంఖగ్రీవఁ జక్రస్తనిన్ బరసేనారమణి న్వరించితి మరోభాగంబునన్ నిల్చె ని ర్భరకేళిన్ విషమాస్త్రచిహ్నములు సేరన్ వావి గా దింక మా ను రణోత్సాహము నీవు జన్యరతిఁ గాంతు న్నే యశస్సంతతిన్.</poem>|ref=49}} {{Telugu poem|type=తే.|lines=<poem>నన్ను వరియించినది కారణంబు గాఁగ, దేవరకుఁ గోడ లైన సేనావధూటి సిగ్గుపెంపున మొగము వాంచినది చిత్ర, వైజయంతీనవాంశుకవ్యాజమునను.</poem>|ref=50}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>నావుడు వాయునందనుఁడు నందన పొమ్ము చమూవధూటి నీ కైవస మైన లెస్స యటు గాక నినుం దల మీఱె నేని దౌ డౌవుల నిల్చి మద్భుజగదాపటువిభ్రమతాడనంబులన్ జేవ యడంతు నెందు గురుశిక్షఁ గదా మతి గాంతు రంగనల్.</poem>|ref=51}} {{Telugu poem|type=తే.|lines=<poem>వత్స నీవు పదాతివి వారు రథికు, లెట్లు పంపుదు నిను మది గట్టి చేసి యనిన నీకృప నాకు వజ్రాంగిజోడు, చింత వలవదు పనుపు మాజికిని ననుచు.</poem>|ref=52}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>భీముఁ బ్రదక్షణించి మెయిఁ బెంపుచుఁ గెంపగుకన్నుదోయితోఁ గాముకవృత్తి నేఁగి నవకం బగు చందనకుంకుమాబ్జధూ ళీమృగనాభకర్దమవిలిప్తఁ జమూసతి సాయకాంబకన్ సామజకుంభకర్కశకుచ న్వరియింపఁగ నుత్సాహించుచున్.</poem>|ref=53}} {{Telugu poem|type=క.|lines=<poem>వీతభయుండై యావృష, కేతుఁడు గుతుకమునఁ బెండ్లికిం జనుగతిఁ స్ఫీతగితి వచ్చి మును తనచేత హతం బైనసమరసీమాభూమిన్.</poem>|ref=54}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రథపయోరాశి పగిది నొక్కొకచోట క్షారకీలాలసంకలిత మగుచుఁ గైలాసశైలంబుకరణి నొక్కొకచోటఁ గరిరాజవదనవిస్ఫురిత మగుచుఁ బార్థప్రతిజ్ఞాజిభంగి నొక్కొకచోట దళితసైంధవముఖోద్దామ మగుచు శౌఠిదక్షిణబాహుసరణి నొక్కొకచోటఁ బృథులరథాంగాతిభీమ మగుచు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నిష్ఠురాత్మీయకింశారునికరనిర్భి, దేళిమారాతిసైన్యప్రతీకశకల వితతవిషమితిసంగరోర్వీతలంబుఁ, జూచి యల్లన నగుచు నచ్చోట నిలిచి.</poem>|ref=55}} {{Telugu poem|type=మ.|lines=<poem>తనపై వచ్చు విరోధిసైన్యముల నుద్యద్భాణజాలంబులన్ దనువుల్ సించియు నశ్వసంతతులగాత్రంబుల్ విభేదించియున్ ఘనదంతావళకుంభకూటముల ముక్తాశ్రేణులన్ రాల్చియున్ దిననాథాత్మజసూతి రౌద్రరసము న్నిద్రస్థితిన్ జూపుచున్.</poem>|ref=56}}<noinclude><references/></noinclude> 0lnl7qqsvybh8t6now2o5d7gqchi9co 552382 552381 2026-04-09T19:43:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 552382 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>నఖిలజనులకుఁ దేహంబుఁ లస్థిరములు, ప్రాయములు చంచలంబులు పౌరుషమునఁ గాని త్రైలోక్యవర్తిని యైనకీర్తి, గలుగనేరదు తండ్రి యెక్కాలమునను.</poem>|ref=48}} {{Telugu poem|type=మ.|lines=<poem>కరియానం బటుపాశహస్తఁ బృథుశంఖగ్రీవఁ జక్రస్తనిన్ బరసేనారమణి న్వరించితి మరోభాగంబునన్ నిల్చె ని ర్భరకేళిన్ విషమాస్త్రచిహ్నములు సేరన్ వావి గా దింక మా ను రణోత్సాహము నీవు జన్యరతిఁ గాంతు న్నే యశస్సంతతిన్.</poem>|ref=49}} {{Telugu poem|type=తే.|lines=<poem>నన్ను వరియించినది కారణంబు గాఁగ, దేవరకుఁ గోడ లైన సేనావధూటి సిగ్గుపెంపున మొగము వాంచినది చిత్ర, వైజయంతీనవాంశుకవ్యాజమునను.</poem>|ref=50}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>నావుడు వాయునందనుఁడు నందన పొమ్ము చమూవధూటి నీ కైవస మైన లెస్స యటు గాక నినుం దల మీఱె నేని దౌ డౌవుల నిల్చి మద్భుజగదాపటువిభ్రమతాడనంబులన్ జేవ యడంతు నెందు గురుశిక్షఁ గదా మతి గాంతు రంగనల్.</poem>|ref=51}} {{Telugu poem|type=తే.|lines=<poem>వత్స నీవు పదాతివి వారు రథికు, లెట్లు పంపుదు నిను మది గట్టి చేసి యనిన నీకృప నాకు వజ్రాంగిజోడు, చింత వలవదు పనుపు మాజికిని ననుచు.</poem>|ref=52}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>భీముఁ బ్రదక్షణించి మెయిఁ బెంపుచుఁ గెంపగుకన్నుదోయితోఁ గాముకవృత్తి నేఁగి నవకం బగు చందనకుంకుమాబ్జధూ ళీమృగనాభకర్దమవిలిప్తఁ జమూసతి సాయకాంబకన్ సామజకుంభకర్కశకుచ న్వరియింపఁగ నుత్సాహించుచున్.</poem>|ref=53}} {{Telugu poem|type=క.|lines=<poem>వీతభయుండై యావృష, కేతుఁడు గుతుకమునఁ బెండ్లికిం జనుగతిఁ స్ఫీతగితి వచ్చి మును తనచేత హతం బైనసమరసీమాభూమిన్.</poem>|ref=54}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రథపయోరాశి పగిది నొక్కొకచోట క్షారకీలాలసంకలిత మగుచుఁ గైలాసశైలంబుకరణి నొక్కొకచోటఁ గరిరాజవదనవిస్ఫురిత మగుచుఁ బార్థప్రతిజ్ఞాజిభంగి నొక్కొకచోట దళితసైంధవముఖోద్దామ మగుచు శౌఠిదక్షిణబాహుసరణి నొక్కొకచోటఁ బృథులరథాంగాతిభీమ మగుచు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నిష్ఠురాత్మీయకింశారునికరనిర్భి, దేళిమారాతిసైన్యప్రతీకశకల వితతవిషమితిసంగరోర్వీతలంబుఁ, జూచి యల్లన నగుచు నచ్చోట నిలిచి.</poem>|ref=55}} {{Telugu poem|type=మ.|lines=<poem>తనపై వచ్చు విరోధిసైన్యముల నుద్యద్భాణజాలంబులన్ దనువుల్ సించియు నశ్వసంతతులగాత్రంబుల్ విభేదించియున్ ఘనదంతావళకుంభకూటముల ముక్తాశ్రేణులన్ రాల్చియున్ దిననాథాత్మజసూతి రౌద్రరసము న్నిద్రస్థితిన్ జూపుచున్.</poem>|ref=56}}<noinclude><references/></noinclude> mzf7bx9ie13di65qcf2n35t48qtnk1z పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/37 104 178770 552383 496107 2026-04-09T20:02:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552383 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>సైన్యంబు నీగతి సమయించుచును వచ్చు నతనిఁ గన్గొని యౌవనాశ్వవిభుఁడు దంతావళము నెక్కి తపనపౌత్రునిఁ జూచి యాదివిష్ణువుఁబోలె నాత్మలోనఁ దెలియకున్నాఁడ నీకులగోత్రనామంబు లని సేయరా దన్వయం బెఱుంగ కెవ్వరితనయుండ వెద్ది నీ నామంబు నీరాక కిపు డేది కారణంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నాకు నెఱిఁగింపు మనిన భూనాథుతోడఁ, గశ్యపుఁడు వంశకర్త పంకజహితుండు తాత త్రైలోక్యవినుతప్రదాత కర్ణుఁ, డనఘ మాతండ్రి వృషకేతుఁ డండ్రు నన్ను.</poem>|ref=57}} {{Telugu poem|type=తే.|lines=<poem>ధర్మనందనునశ్వమేధంబుకొఱకు, వచ్చి కనుఁగొను నాతండు వాయుసూనుఁ డతనిపౌత్రుండు తురగము నపహరించె, నేను నిల్చితి నిల్చినసేనలకును.</poem>|ref=58}} {{Telugu poem|type=తే.|lines=<poem>అనుచు వృషకేతుఁ డాడిన యౌవనాశ్వ, ధరణిపాలుండు మదిఁ బ్రమోదంబు నొంది యనఘ యొక్కింత శ్రమ మార్చుకొనుము మిగుల, నలసినాఁడవు తడవు కయ్యంబు చేసి.</poem>|ref=59}} {{Telugu poem|type=క.|lines=<poem>నీవు పదాతివి నే దం, తావళరాజంబు నెక్కినాఁడఁ దగవుగా దోవత్స యరద మెక్కుము, నావుడుఁ జిఱునవ్వు మోమునం దళుకొత్తన్.</poem>|ref=60}} {{Telugu poem|type=చ.|lines=<poem>తరువులు ఱాలు గొడ్లును బ్రదాత ల వెవ్వనివీట నట్టియా సురపతి నర్థిఁ జేసినయశోనిధికూర్మిసుతుండ నీవు న న్నరదముఁ బుచ్చుకొమ్మనెద వందిన వందిన కాదె మీఁద సం గరము ఘటిల్లు నే చెలిమిగాఁ బడుఁగా కిటు మాట లాడినన్.</poem>|ref=61}} {{Telugu poem|type=క.|lines=<poem>అనిన వృషకేతుఁ గనుఁగొని, యనురాగముఁ బొంది యౌవనాశ్వమహీశుం డనియె మును చూపుమా నీ, ఘనకార్ముకముఖశిలీముఖంబున ననినన్.</poem>|ref=62}} {{Telugu poem|type=చ.|lines=<poem>తురగముసుద్ది చెప్పిన నెదుర్కొనుకోపముతోడ నాత్మమం దిరములు నిర్గమించుచుఁ బ్రతిజ్ఞలు పల్కఁగఁ గాదు వారిని ష్ఠురతరశౌర్యముల్ మొదలఁ జూడుము నాశరవృష్టి ముంచినన్ మరల జనింప దీబలము మంత్రజలంబులు మీఁదఁ జల్లినన్.</poem>|ref=63}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అదియునుం గాక నీకనుగుణం బైనయీబంధువర్గముఁ బుత్త్రపౌత్రచయము సమదవారణహయస్యందనారూఢులై చనుదెంచి యుభయపార్శ్వముల నిలిచి బిరుదకాహళములు పెనుపడం బై మ్రోయ ఘనశస్త్రరోచు లాకసముఁ బ్రాఁక విజయకేతనములు వివిధంబు లై క్రాలఁ గాలు ద్రవ్వుచును సంగరముఁ జేయ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మెండుకొని యున్నవా రందుమీఁద నీకు, వార్ధకం బొత్తినది లావువయసు నాకు నన్ను నేకాకి యని కన్గొనంగవలదు, శౌరికృప గాదె నాకు నక్షయబలంబు.</poem>|ref=64}} {{Telugu poem|type=క.|lines=<poem>వల దింకఁ బెక్కుమాటలు, తొలిపోటై నిలిచినాఁడ దుర మొనరింపన్ దలపడు మనుటయు నాతం, డలిగి మదావళము డిగి రథారూఢుం డై.</poem>|ref=65}} {{Telugu poem|type=క.|lines=<poem>బెడిద మగు కార్ముకం బె, క్కిడి నిష్ఠురసాయకంబు లీరైదు వడిన్ దొడి యేయ నక్కుమారుఁడు, నడుమన యొకమార్గణమున నవి త్రుంచి వడిన్.</poem>|ref=66}}<noinclude><references/></noinclude> ilpx2p2v0x3c4scsdhwc8swfuq13ltx పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/38 104 178771 552384 496108 2026-04-09T20:35:21Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552384 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>అర్ధచంద్రాశుగం బేయ నధిపుగొడుగుఁ, జామరయుగంబుఁ దుముఱయ్యె సగుణధర్మ రహితు లైనట్టికుటిలవర్తనులఁ గూడ, సజ్జనునిప్రీతి గుణములు సమసినట్లు.</poem>|ref=67}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>అంతటఁ బోక మూఁడునిశితాస్త్రము లుద్ధతి నేయఁ జాప మొ క్కంతగఁ ద్రుంచి యశ్వనివహంబుల నొంచి నృపాలుదేహమున్ గ్రంతలు చేసి చొచ్చె విశిఖంబులు గహ్వరిఁ గూటసాక్షు ల త్యంతకఠోరఘోరనిరయంబులు దూఱఁగఁ బోవుకైవడిన్.</poem>|ref=68}} {{Telugu poem|type=చ.|lines=<poem>నరపతి యొండువి ల్గొని గుణధ్వని చేసి కుమారుమీఁద ని ర్భరగతి నేసె నర్వదిశరంబు లురంబునఁ గాఁడ నెత్తు రా బిరుసగుగంటులం దొరఁగి పింజనఁగ్రోవులరీతిఁ బాఱఁగా నరుణమరీచిమాలిక్రియ నర్కజుపట్టి వెలింగె నాజిలోన్.</poem>|ref=69}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అవ్విధంబున యౌవనాశ్వభీకరశాతశరభిన్నవక్షుఁడై తరణిపౌత్రుఁ డడరి బెబ్బులిఁ గోల నడిచినగతి రేఁగి చండమార్గణచతుష్టయముచేత రథరథ్యములను సారథిశిరోధియుఁ ద్రుంచి జననాథు నమ్ముల మునుఁగఁ జేసి తపనమండలము శస్త్రపరంపరలఁ గప్పి కదన మంతయును జీఁకట్లు గొలుపఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బొలిసి రాజన్యసేనలు కళవళింప, వెఱఁగుపడఁ బావకాస్త్ర మవ్వేళఁ దొడిగి నృపతి తత్కాండనివహంబు నీఱుచేసి, వారుణం చేసి యార్చి యవ్వహ్ని నార్చె.</poem>|ref=70}} {{p|ac|fwb}}వృషకేతుఁడు మూర్ఛిల్లుట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>భానుజసూనుఁడుం గనలి పావకవారుణదారుణాస్త్రసం తానము లేయ నద్ధరణినాయకుఁ డాగ్రహవృత్తి నుద్ధతుం డై నగబాణ మేసిన రయంబున నమ్మహనీయసాధనం బేనికగున్నలం గడవ నెక్కుడుగుండుల ఱువ్వఁ జొచ్చినన్.</poem>|ref=71}} {{Telugu poem|type=మ.|lines=<poem>కులిశాస్త్రంబున నమ్మహాశిలల నుగ్గుల్ చేసి హాలాహలా నలసంకాశము లైనబాణముల నోనాటింప నల్క న్మహీ తలనాథుండు కఠోరభల్లమున వత్సం బేయఁ జండాంశుమ త్తులితం బైనశరంబు నాటి వృషకేతుం డాజిలో మూర్ఛిలెన్.</poem>|ref=72}} {{Telugu poem|type=చ.|lines=<poem>మిహిరతనూజుపట్టి రణమేదిని వ్రాలిన భీమసేనుఁ డా గ్రహమునఁ జూచి కన్ను లెదురన్ వృషకేతునిపాటు గాంచి యీ యహితుల నెల్లడించి సవనాశ్వముతోఁ బురి కేఁగుదెంచి య మ్మహిపతిఁ గాంచి యీతనిక్రమం బపు డేమని విన్నవించెదన్.</poem>|ref=73}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆలమున యౌవనాశ్వనృ, పాలుని వరపుత్త్రమిత్రబంధుయుతముగాఁ గాలుని పురి కనుపక యీ, బాలునికొల దీఱ దనుచుఁ బట్టినకినుకన్.</poem>|ref=74}}<noinclude><references/></noinclude> r4ie91vvgyu8gn7d3dcflgsb8uuwr0i పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/39 104 178772 552385 496109 2026-04-09T22:33:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552385 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>భీమసేనుండు రెండవదండధరుండునుంబోలె యుద్దండభుజదండభీషణగదాదం డుండై కనలి భండనంబున కెదుర వేదండకాండంబులు తండతండంబులై పయిం బడం బడలువడం గనుపుకొట్టినయప్పట్టునఁ బడినయట్టలతిట్టలం జుట్టుకొని వెడలు శోణితప్రవాహంబులు దురవగాహంబులై పాఱం బాఱ వశంబు గాక తెరలి పొరలంబడు వాహనంబులును దత్తటంబున నెత్తుటం దడిసి జొత్తుపాపలవిధంబున నొత్తొత్తుల నలసి యమ్ములతిత్తు లైన రాహుత్తులును సముల్లోలకల్లోలమాలికాభీల కీలాలవేల్లితంబులం దలక్రిందుగాఁ బడి శకలితాంగంబు లైనశతాంగంబులును జెంగటఁ గృతాంతపురపథికు లైనరథికులును గూలంబులయోలంబులం గాలు గాలం బెనంగఁ దేలియాడు కాలుబలంబునుం గా నాలంబు త్రిజగదాభీలంబయ్యె నప్పుడు.</poem>|ref=75}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>భీముని జానుదేశముల భీషణవాయువు లుప్పతిల్లి సం గ్రామతలంబున న్విసరఁగాఁ జతురంగసమస్తసైనిక స్తోమము లభ్రమండలముతో నొరయం జనె బొందితోన సు త్రామునివీటి కేఁగెడువిధంబున దివ్యులు చోద్య మందఁగన్.</poem>|ref=76}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆహవభూమి సోఁకఁ బడె నంతట దంతిరథాశ్వసైనిక వ్యూహము గీలుగీలునకు నూడి వడిన్ రుధిరంబు గ్రక్కుచున్ శ్రీహరికీర్తనంబుఁ జెవిఁ జేర్పక దుర్మతిఁ జన్నవైష్ణవ ద్రోహులు ముక్తకేశములతో నిరయంబునఁ గూలుకైవడిన్.</poem>|ref=77}} {{Telugu poem|type=సీ.|lines=<poem>దంతంబు లిడిసి మూర్ధంబులు వ్రక్కలై కూలినభద్రశుండాలములును గళములు మలఁగి డొక్కలు మీఁది కెత్తుక చాఁపకట్టుగఁ బడ్డసైంధవములు విటతాటనములుగా విఱిగి చక్రములతోఁ దలక్రిందు లైనరథవ్రజములు దొడగులు సడలి కుత్తుక లెండి మిక్కిలి వెడరూపులై పడ్డవీరభటులుఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>గలనఁ బ్రోవులు గొనుచుండ గజతురంగ, సుభటవిగ్రహసంజాతశోణితములు వఱదలై పాఱ భీముదుర్వారజాను, తటసముద్భూతవాతూలతాడనమున.</poem>|ref=78}} {{p|ac|fwb}}సువేగభీమసేనుల ద్వంద్వయుద్ధము</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>అప్పుడు యౌవనాశ్వసుతుఁ డైనసువేగుఁడు కీచకాంతకున్ దప్పక చూచి తానును గదాఘనదండము కేలఁ గ్రాలఁగాఁ ద్రిప్పుచుఁ దేరు డిగ్గి పఱతెంచి వడిం దనపేరు వాడి వా తప్పక వేసె నొక్కమొగిఁ దార్కొని భీము శిరంబు వక్షమున్.</poem>|ref=79}} {{Telugu poem|type=క.|lines=<poem>పెట్టు బయలుగాఁ గరువలి, పట్టి బెడంకుచు సువేగు బరులు నురంబున్ జుట్టుకొని విసర నాజగ, జెట్టి మిగుల నడిఁకి బొంకు చేసితి ననుచున్.</poem>|ref=80}} {{Telugu poem|type=చ.|lines=<poem>తొలఁగిన నుప్పరం బెగసి దూఁటి శిరం బది త్రిప్పి వ్రేయ న వ్వల నటూ దాఁటి చిత్రగతి వాయుజుఁ డి ట్లపసవ్యసవ్యమం</poem>|ref=}}<noinclude><references/></noinclude> akwg0adul3q6gl4yw1towvcuhmkiwqo పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/40 104 178773 552392 496110 2026-04-10T01:17:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552392 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>డలవికటప్రచండకరణస్ఫుటవిభ్రమఖేలనంబులన్ దలపడి చేసి రిద్దఱు గదారణమున్ బటుదారుణంబుగన్.</poem>|ref=81}} {{Telugu poem|type=క.|lines=<poem>కోలాట మాడుపాత్రల, పోలిక నరుదైనకీలుబొమ్మలగతి నా భీలతఁ బెనఁగిరి గదలను, వేలుపులు నుతింపఁ బెక్కువిన్నాణములన్.</poem>|ref=82}} {{Telugu poem|type=తే.|lines=<poem>కొదలు దెలియంగవలె ననుకోర్కిఁ బేర్చి, యెదలఁ బొదలినపదిలంపుటీ సమర్చి మొదలుకొని మేనులు చెమర్చి మద మెలర్చి, గదలరొద లార్చి గగనంబు గదలనార్చి.</poem>|ref=83}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఈహం బూఁచి పెనంగఁ జొచ్చి రపు డయ్యేకాంగవీరుల్ జయో త్సాహంబుల్ వదనంబులం బొదల మాద్యచ్చండగర్వోద్ధత వ్యాహారధ్వను లభ్రవిభ్రమములన్ వారింప నొక్కుమ్మడిన్ బాహాబాహిఁ గచాకచిం దొడరి ప్రాబల్యంబు తుల్యంబుగన్.</poem>|ref=84}} {{Telugu poem|type=సీ.|lines=<poem>కనలి భీముఁడు సువేగుని లాగమునఁ జొచ్చి పడవైచి చరణంబు లొడిసి పట్టి విసరి పల్మఱుఁ ద్రిప్పి వ్రేయ నమ్మేటియు ధరఁ బడి బంతిచందమున నెగసి పెనఁగి వాయుతనూభవుని నవ్విధమ్మునఁ బడవేయ నవ్వడముడియుఁ గినిసి కరటిఘోటకశతాంగములచే నొప్పింపఁ దప్పించి కదియ నిద్దఱును మఱియుఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బార్షి పాదోరుపర్వకూర్పరకఠోర, ముష్టినిహతులఁ బగిలి మోములను దొరఁగు రక్తములఁ దొప్పదోఁగి మూర్ఛలను వ్రాలి, యుండి రావేళ వృషకేతనుండు దెలిసి.</poem>|ref=85}} {{p|ac|fwb}}యౌవనాశ్వుని వృషకేతనుం డుద్ధరించుట</p> {{Telugu poem|type=చ.|lines=<poem>వదలినద్రిండు తొంటిగతి వాటముగా బిగియించి మోమునన్ బెదరినఘర్మవారిఁ గొన సేలమునన్ దొలఁగించి వీఁపునన్ బొదు లమరించి మించి బలుముష్టి శరాసనమున్ ధరించి క ట్టెదుర విరోధిఁ గాంచి యెద నించినకోపము సందడింపఁగన్.</poem>|ref=86}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఎఱికలతో దుష్టభుజగేంద్రముల న్నిరసించునైదుక్రొ మ్మెఱుఁగుశరంబుల న్విభునిమీఁదఁ గుమారకుఁ డేసె నేసిన న్నెఱఁకుల నుచ్చిపాఱి ధరణీపతి తద్రధకూబరంబు పై నొఱఁగి శరీరమున్ మఱచి యుండెను బ్రాణము లేనికైవడిన్.</poem>|ref=87}} {{Telugu poem|type=క.|lines=<poem>అరదంబుమీఁద వ్రాలిన, ధరణీశ్వరుఁ జేరి కర్ణతనయుఁడు చిత్తం బెరియంగ గంట్లవెంటన్, దొరఁగెడురక్తంబుఁ గేలఁ దుడుచుచుఁ గరుణన్.</poem>|ref=88}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ముదుకనిమస్తకంబునకు దాపున నూఱుకాండముల్ దలగడగా నమర్చి తనువునఁ దూఱఁగాఁడినగంట్లు పరికించి యధిపతియుత్తరీయమునఁ బొదిగి మెఱుఁగుదట్టియుఁ గొంత కుఱుచగా నెఱివట్టి సురఁటిలాగున గాలి సోఁక విసరి యొయ్యనఁ బెడకేల నూర్పులు పరికించి పలుమాఱు డెందంబు పట్టిచూచి</poem>|ref=}}<noinclude><references/></noinclude> okaohzkw4sjecp0xud17u7q5z8758pu పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/41 104 178774 552498 496111 2026-04-10T03:53:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552498 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>నాన్యధా దైవబుద్ధిఁ బ్రత్యహము నేను, హరిపదారాధనైకతత్పరుఁడ నేని శూరతముఁ డైనయిమ్మహాసుకృతరాశి, బాణజాతవ్యధలఁ వాని బ్రదుకుఁగాత.</poem>|ref=89}} {{Telugu poem|type=మ.|lines=<poem>అనుచున్ శౌరిపదాబ్జముల్ దలఁచి దేహం బంటినన్ దీవ్రశ స్త్రనిరూఢవ్రణఖేదము దొలఁగ నంతన్ ఱెప్ప లల్లార్చి లో చనముల్ మెల్లన విచ్చి కర్ణసుతునాస్యంబున్ విలోకించి ని ల్చిన నవ్వీరుఁడుఁ దొంటితావునకు వచ్చె న్వచ్చి వి ల్లందినన్.</poem>|ref=90}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>అవ్వనజాప్తపౌత్రునిఁ బ్రియంబున దగ్గఱ కౌఁగిలించి లే నవ్వున యౌవనాశ్వనరనాయకుఁ డిట్లను నన్ను వేలుపుల్ మువ్వురు మెచ్చఁ బ్రోచినసముజ్జ్వలమూర్తివి ని న్నెఱింగియున్ జివ్వకు మార్కొనం దలఁపు చేసిన వెఱ్ఱితనంబు చాలదే.</poem>|ref=91}} {{Telugu poem|type=క.|lines=<poem>ప్రాణసముఁ డైనసఖునకుఁ, బ్రాణము లీఁగనుట చెలిమిఫల మటుగా దీ ప్రాణంబులు నీ విచ్చిన, ప్రాణము లిదె నీవె పంచి పనిగొను తఱితోన్.</poem>|ref=92}} {{Telugu poem|type=క.|lines=<poem>దినపజుఁడు భవజ్ఞనకుం, డనవరతాభిష్టదాత యైనను నాలం బునఁ దెగినప్రాణములు త, త్తరువున కీ నేరఁ దివ్విధంబున నతఁడున్.</poem>|ref=93}} {{Telugu poem|type=మ.|lines=<poem>జయలక్ష్మీధవుఁ డైననీకుఁ దగ మత్సామ్రాజ్యభోగంబు ల న్నియు నర్పించితి నీకృపాతిశయత న్నీరేజపత్త్రాయతా క్షు యదూత్తంసు మునీంద్రమానసరిరంసుం గంసవిధ్వంసు న వ్యయు నద్వైతు భజించి యవ్విభునిసేవం గాంతు నిష్టార్థముల్.</poem>|ref=94}} {{p|ac|fwb}}యౌవనాశ్వుండు భీమాదులతోఁ బురంబున కరగుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>అని ప్రియోక్తుల యౌవనాశ్వభూపాలుండు వృషకేతనునివీర్యవితరణములు వినుతించి తగ నిద్దఱును మరుత్సూనుసువేగు లున్నచటికి వేడ్కతోడఁ జనుదెంచి భీమసేనునిఁ గాంచి కర్ణనందనుఁడు ఘోరాస్త్రసంతతులఁ దన్ను జంపి రక్షించినచందంబుఁ గొనియాడి వినుఁ డిది మీకు నిచ్చినశిరంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>క్రతుహయము వెంట నరిగి దిక్చక్ర మద్రువఁ, దిరిగికొనివత్తుఁ దెమ్మన్నతిథికి మునుప ధర్మజునిసమ్ముఖము సేయ దశసహస్ర, ధవళదంతుల నిత్తుఁ జేదర్శనంబు.</poem>|ref=95}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆసమయంబునఁ గృష్ణు ద, యాసింధువుఁ గానిపింప నద్దేవు నుతుల్ చేసి హితబంధుయుతముగ, నాసర్వస్వము సమర్పణం బొనరింతున్.</poem>|ref=96}} {{Telugu poem|type=వ.|lines=<poem>విశేషించియుం బ్రాణదాతలతోడియుద్ధం బసంబద్ధంబు సిద్ధంబుగా మీకు మాన్యుం డ నని పలుకురాజన్యసౌజన్యవాక్యంబులం బరితుష్టమానసుం డైనపవమానసూను నభ్యర్ణంబునకు మేఘవర్ణుండునుం గ్రతుహయంబు రయంబునం గొనివచ్చె ననంత రంబ యనంతరత్నరాజీవిరాజమానకల్యాణపల్యాణపరిస్తరణపరిస్తోమాభిరామంబు</poem>|ref=}}<noinclude><references/></noinclude> 2dn3d96rtjvlorig1mh1dnh6md677ak పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/42 104 178775 552499 496112 2026-04-10T04:11:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552499 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>లును గండపాళికాచూళికాంతరసముల్లసితహల్లకోద్దామదామంబులును గాంచన ఘంటికాసమంచితకాంచీలతాప్రాంచలచంచలచ్చమరవాలచాలనారంభగంభీర యానంబులును నైరావణసార్వభౌమకులీనంబులును నిరంతరానర్గళనిర్గతసింధుసిక్య సాగరమేఘచిక్కణశీకరప్రముఖాష్టమదగంధలహరీవిహరదలినికరకోలాహలా క్రాంతదశదిగంతంబులును నరాళకరాళదంతంబులును నిర్యాణపర్యంతకల్పితాన ల్పసిందూరతిలకానుబంధబంధురములు నగుధవళసింధురంబుల నాధోరణు లసాధా రణప్రయత్నంబులం గొనివచ్చిన మెచ్చి యవ్వసుంధరారమణుండు గంధవహతనూ భవుండునుం దాను నొక్కవేదండంబును రెండవశుండాలంబు మార్తాండపౌత్రనిజ పుత్త్రులుంగా నెక్కి లెక్కింపరానిసేన లుక్కున నొక్కుమ్మడిం గ్రిక్కిఱిసి నలు దిక్కులం గొలిచి రా నిరాఘాటచాటుప్రబంధంబుల వందిబృందంబు లభినందింప నందంద ముందటం గ్రందుకొని చెలంగుశంఖభేరీమృదంగఢక్కాహుడుక్కానక ఝల్లరీమురజకాహళారావంబులు భైరవంబులై మొరయ సముత్తంభితశుంభచ్ఛాత కుంభరంభాస్తంభసంభృతానర్ఘమాణిక్యమకరతోరణపరిష్కారం బైనభద్రావతీ పురద్వారంబు గారవంబునం జొచ్చి యచ్చటఁ బచ్చలగచ్చుమేడల మేలుమచ్చులం బచ్చవిలుతు నెచ్చరించుమచ్చెకంట్ల నిడువాలుఁజూపులచాపలం దగిలినట్లు నిట్టట్టు గదలనేరక చిట్టకంబునం బొరలునాగరకలోకంబును గాశ్మీరగంధసారనీహారవారి ధారావిలిప్తంబులయినయంగళ్ళముంగిళ్ళ నత్తమిల్లినముత్తియంపురంగవల్లికలమీఁదఁ బసిండిజాలవల్లికల నమర్చిన మంగళద్రవ్యంబులును నంతరిక్షంబునకు వింతసింగా రంబు సంతరించు వైజయంతీవితానంబులును భాసురంబులుగ భూసురాశీర్వాద నాదమేదురంబుగా నాదరంబునం బురంధ్రీజనంబు లల్లుకొని చల్లునాచారలాజాక్ష తప్రసూనంబు లనూనవైభవంబులం దేజరిల్లు రాజమార్గంబునం జని వాసరాధిపరధావ రోధినిజారంబగు హజారంబు డగ్గఱి మదావళంబు డిగ్గి దండనాయకపురోహితామా త్యసామంతభృత్యవర్గంబు నైసర్గికదయావలోకనంబునం జూచి యథోచితప్రకారం బుల వీడుకొలిపి యౌవనాశ్వవిశ్వంభరాధీశ్వరుండు పురస్కృతపాండవుండై యం తఃపురిసమీపంబులోపలికొలువుకూటంబున హాటకమణిగణోన్నిద్రభద్రాసనంబుల వారునుం దానును సుఖాసీనుండై యుండె నాసమయంబున.</poem>|ref=97}} {{Telugu poem|type=చ.|lines=<poem>పనివడి నాథుపంపునఁ బ్రభావతి భామిను లర్థిఁ గొల్వఁ గుం దనపుమెఱుంగుఁబళ్ళెరమునన్ ఘనసారజదీపికావళు ల్గొని మును భీముఁ గాంచి యనిలోఁ దనమంగళసూత్ర మూడఁగా ననువున నిల్పె నేసదయుఁ డాతనికిన్ జయమంగళం బనెన్.</poem>|ref=98}} {{Telugu poem|type=తే.|lines=<poem>కర్ణజునికీర్తి లోకవిఖ్యాత మగుచుఁ, బ్రబలుఁ గా కని దీవించి పరమసాధ్వి వారి కత్యంతభక్తి నివాళు లొసగి, రమణులును దాను నంతఃపురమున కరిగె.</poem>|ref=99}}<noinclude><references/></noinclude> 0gtlr2ncrzldyocotbmjndc8q30r9ps పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/43 104 178776 552502 496113 2026-04-10T04:28:23Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552502 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అంతటఁ గనుపట్టెను భా, స్వంతుఁడు చరమాద్రిమీఁద వారుణదిక్సీ మంతిని జలకేళికిఁ జిఱు, బంతిపసుపుముద్ద సన్నెపై నిడుభంగిన్.</poem>|ref=100}} {{Telugu poem|type=క.|lines=<poem>మసమసక నయ్యె దిక్కులు, పసిగ్రేపుఁ దలంచి తిరుగఁబడె గూండ్ల శకుం తసమాజము కలకలము లె, గసె వెడవెడ గన్ను మొగిచెఁ గమలవనంబుల్.</poem>|ref=101}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆవేళ యౌవనాశ్వ, క్ష్మావరుఁడు సువర్ణకుంభసలిలంబుల న ప్పావనిముఖ్యులతో సం, ధ్యావిధు లొనరించి బాంధవావలితోడన్.</poem>|ref=102}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పవనసంభవునికోపప్రసాదంబులు పదివేలభంగులఁ బ్రస్తుతించి వృషకేతుఁ డహవోర్వి నిజంబుగాఁ దన్నుఁ జంపి రక్షించినపెంపుఁ బొగడి వీతి నెత్తుక వినువీథి కేఁగిన మేఘవర్ణుని బాహుగర్వము నుతించి ధర్మజాచ్యుతుల సందర్శింపఁ గల్గిన తనపుణ్యపరిపాకమునకు మెచ్చి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>కదలనియమించి తనవెంట గజపురమున, కౌదనికచిత్రకారకలాదరజక తంతువాయకులాలవర్ధకులు మొదలు, గాఁ గలుగు మేటిపనుల నాగరికవరుల.</poem>|ref=103}} {{Telugu poem|type=శా.|lines=<poem>కుంతీద్రౌపదులం బ్రభావతి కనుంగో నేఁగెడున్ మీరు శు ద్ధాంతస్త్రీనికురంబులై కదలి రండంచున్ బ్రియోక్తి న్మహీ కాంతుం డాప్తుల నంపి పాండవులజోకన్ సాత్త్వికాన్నంబు ల త్యంతాభీష్టత నారగించి సుఖనిద్రం జెంది యావేకువన్.</poem>|ref=104}} {{Telugu poem|type=క.|lines=<poem>పురజనుల నెల్ల ముందటఁ, దెరలుచుకొని హస్తినావతీనగరికి నా దరమునఁ గొనిపొమ్మని భూ, వరుఁడు సుదేవునకుఁ జెప్ప వాఁడును వేడ్కన్.</poem>|ref=105}} {{Telugu poem|type=తే.|lines=<poem>సకలజనులకుఁ బయనంబు చాటఁబంచి, బలముఁ జదలంబు గదలింపఁ బంచిపెట్టి తాను గమనింప సమకట్టి తద్విదంబుఁ, దల్లి కెఱిఁగింప నిజనిశాంతమున కరిగి.</poem>|ref=106}} {{Telugu poem|type=మ.|lines=<poem>జననీ భూపతి ధర్మనందనునియజ్ఞం బర్మిలిం జూడఁ గో రి ననుం గట్టడ చేసెఁ బట్టణమువారిం గొంచుఁ బొమ్మంచు నీ వును వేగం బయనంబు గమ్మన సుదేవుం జూచి కోపించి యీ ధనధాన్యాదులు వీఁటిబుచ్చి ననుఁ బుత్త్రా వెళ్ళి రమ్మందురే.</poem>|ref=107}} {{Telugu poem|type=తే.|lines=<poem>కుడిచి కూర్చుండి రాజ్యంబు విడిచిపోవ, విభునకును నీకు నెటువంటివెఱ్ఱి పుట్టెఁ బురజనులు మీరు నెట్లైనఁ బొండు నేను, వేయుఁ జెప్పిన నిలయంబు వెడలననిన.</poem>|ref=108}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అంబతో నగుచు ని ట్లనియె సుదేవుండు భాగీరథీపుణ్యపరిసరమున ధర్మజుఁ డశ్వమేధముఁ జేయఁగాఁ గోరి రప్పించె మౌనివర్గంబు నెల్ల రుక్మిణీముఖవరారోహలతో వాసుదేవుఁ డచ్చటికి నేతెంచినాఁడు వారల దర్శించువారిదుష్కృతములు పంచబంగాళమై పాఱు ననినఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దండితరమునిఁ బెనిమిటితరమునందు, వీసమంతయుఁ బుణ్యంబుఁ జేసి యెఱుఁగ వార్థకంబుద నిం కేల వట్టితొడుసు, కృష్ణు దర్శింప కున్న నా కేమిచిక్కు</poem>|ref=109}}<noinclude><references/></noinclude> rjsbw7npzbyds6ef73yqdizuvzo5mw2 పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/44 104 178777 552506 496114 2026-04-10T04:40:21Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552506 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ఏరీతి ధర్మసుతునకు, శౌరికి నధ్వరముఁ జేయ సంతస మగు నా కారీతిని తప్పదు సం, సారము సేయునెడ నిది నిజంబు కుమారా.</poem>|ref=110}} {{Telugu poem|type=చ.|lines=<poem>అని జనయిత్రి పల్కెడుదురాగతభాషలు యౌవనాశ్వపా వనులకుఁ జెప్ప కొంతవడి వారికి హాస్యముఁ బుట్టఁజేసి యా పెనపరివక్క్కరాలు మొఱపెట్టుచు నీడిగిలంగ నందలం బున వడిఁగట్టి వైచుకొనిపొం డని చెప్పి సుదేవుఁ డంతటన్.</poem>|ref=111}} {{Telugu poem|type=క.|lines=<poem>కరితురగస్యందనభట, వరసైన్యము లుబ్బి రెండువంకలుఁ గొలువం గరినగరికిఁ దెరలించెన్, బురజనములఁ బ్రాణిమాత్రమును లే కుండన్.</poem>|ref=112}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>పల్లకులన్ మహోష్ట్రముల భద్రగజంబుల నందలంబులన్ గొల్లెనబండులన్ నడకగుఱ్ఱపుమోటుల వేసడంబులం బెల్లుగ నెక్కి పౌరజనబృందము వోఁ బురి నైదునాళ్ళు భూ వల్లభుఁ డుండి తాఁ గదలె వాయుజముఖ్యులతోడ వేడుకన్.</poem>|ref=113}} {{Telugu poem|type=తే.|lines=<poem>అనుచుఁ జైమిని చెప్పిన నాత్మలోన, నలరి జనమేజయక్ష్మాతలవిభుండు యతికులోత్తంస మీఁదివృత్తాంత మెల్లఁ, దెలివిపడ నాకు నానతీవలయు ననిన.</poem>|ref=114}} {{p|al|fwb}}ముక్తపదగ్రస్తము</p> {{Telugu poem|type=మ.|lines=<poem>ప్రమదాస్వాంతనిశాంత శాంతనవశౌర్యప్రౌఢిమాభోగ భో గమరుద్రాజసమాన మానకలనాకౌరవ్య రవ్యగ్రజ న్మమనోజ్ఞస్మృతిమార్గ మార్గణకుటుంబస్థైర్యసంకల్ప క ల్పమహీజప్రతిమానదానసుషమాభాస్వత్కరాంభోరుహా.</poem>|ref=115}} {{Telugu poem|type=క.|lines=<poem>త్రైలోక్యనుతకఠారీ, సాళువబిరుదాంక మథితజలధిభవమహా హాలాహలకోలాహల, కీలాభీలాసిజైత్ర కీర్తికళత్రా.</poem>|ref=116}} {{Telugu poem|type=పృథ్వీ.|lines=<poem>బుధావనపురూరవా భుజగజిద్భుజాభైరవా విధావితమదాహితద్విపచమూపకంఠీరవా సుధాకరనిధానరాట్సురమహీజదానప్రధా విధాయిగుణగౌరవా బిరుదపంచఘంటారవా.</poem>|ref=117}} {{Center|<poem>గద్యము. ఇది భారతీతీర్థశ్రీచరణకరుణాపాత్ర గాదయామాత్యపుత్త్ర వినయవిద్యా సముద్ర పినవీరభద్రప్రణీతం బైనజైమినిభారతంబునం దశ్వమేధ పర్వంబున ద్వితీయాశ్వాసము.</poem>}}<noinclude><references/></noinclude> 7tgec9rr685lzpzsecl65xwfwdvtw9n పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/45 104 178778 552595 496115 2026-04-10T06:06:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552595 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 45 |bSize = 371 |cWidth = 300 |cHeight = 77 |oTop = 18 |oLeft = 33 |Location = center |Description = }} {{Center|శ్రీ}} {{p|ac|fs150}}జైమినిభారతము</p> {{p|ac|fs125}}అశ్వమేధపర్వము — తృతీయాశ్వాసము</p> {{Telugu poem|type={{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 45 |bSize = 371 |cWidth = 75 |cHeight = 140 |oTop = 195 |oLeft = 23 |Location = left |Description = }}|lines=<poem> కరవిశాలకరుణా లోకనసంరక్షితార్ధిలోకహిమానీ రాకేందురుచిరకీర్తి స్వీకృతదిగ్జాల నారసింహనృపాలా.</poem>|ref=1}} {{Telugu poem|type=వ.|lines=<poem>అవధరింపుము జైమినిమునీంద్రుండు జనమేజయనరేంద్రున కిట్లనియె.</poem>|ref=2}} {{Telugu poem|type=క.|lines=<poem>సామజనగరం బిరువది, యామడ గల దనఁగ యౌవనాశ్వనృపాల గ్రామణితోడుత నిట్లని, సామీరణి పలికె సంతసము రెట్టింపన్.</poem>|ref=3}} {{p|ac|fwb}}భీముఁ డన్నకుఁ దమవిజయంబు నెఱిఁగించుట</p> {{Telugu poem|typeఉ.=|lines=<poem>మించి కళత్రబాంధవసమేతముగా నిటు మీర లర్ది నే తెంచువిధం బతిత్వరగతిం జని ధర్మజుతోడ ము న్నెఱిం గించెద మిమ్ముఁ గొల్చి వృషకేతుఁడు రాఁగలఁ దంచుఁ బల్కి ని ర్వంచితలీల హస్తినగరంబునకున్ జని మ్రొక్కె నన్నకున్.</poem>|ref=4}} {{Telugu poem|type=క.|lines=<poem>తమ్ములతో నపు డాస్థా, నమ్మునఁ గొలు వుండి ధర్మనందనుఁడు ప్రమో దమ్మునఁ దమ్ముఁడ రమ్మని, క్రమ్మనఁ గదియంగ భీముఁ గౌఁగిటఁ జేర్చెన్.</poem>|ref=5}} {{Telugu poem|type=సీ.|lines=<poem>తనకు మ్రొక్కినశక్రతనయమాద్రేయుల నెమ్మితో నాలింగనమ్ము జేసి వాయునందన సేమమే యన్న నన్నకుఁ గరములు మొగిచి నీకరుణ గలుగ నఖిలంబు సేమంబ యధ్వరాశ్వముఁ గొంచు వచ్చె భద్రావతీశ్వరుఁడు తాన యతనిదేవియుఁ బ్రభావతి కామినీసహస్రంబు సేవింపఁ బాంచాలిఁ జూడఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude> qn2u71pecss9ymh2liffk2klx2ydzy0 552596 552595 2026-04-10T06:07:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 552596 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 45 |bSize = 371 |cWidth = 300 |cHeight = 77 |oTop = 18 |oLeft = 33 |Location = center |Description = }} {{Center|శ్రీ}} {{p|ac|fs150}}జైమినిభారతము</p> {{p|ac|fs125}}అశ్వమేధపర్వము — తృతీయాశ్వాసము</p> {{Telugu poem|type={{Css image crop |Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf |Page = 45 |bSize = 371 |cWidth = 75 |cHeight = 140 |oTop = 195 |oLeft = 23 |Location = left |Description = }}|lines=<poem> కరవిశాలకరుణా లోకనసంరక్షితార్ధిలోకహిమానీ రాకేందురుచిరకీర్తి స్వీకృతదిగ్జాల నారసింహనృపాలా.</poem>|ref=1}} {{Telugu poem|type=వ.|lines=<poem>అవధరింపుము జైమినిమునీంద్రుండు జనమేజయనరేంద్రున కిట్లనియె.</poem>|ref=2}} {{Telugu poem|type=క.|lines=<poem>సామజనగరం బిరువది, యామడ గల దనఁగ యౌవనాశ్వనృపాల గ్రామణితోడుత నిట్లని, సామీరణి పలికె సంతసము రెట్టింపన్.</poem>|ref=3}} {{p|ac|fwb}}భీముఁ డన్నకుఁ దమవిజయంబు నెఱిఁగించుట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>మించి కళత్రబాంధవసమేతముగా నిటు మీర లర్ది నే తెంచువిధం బతిత్వరగతిం జని ధర్మజుతోడ ము న్నెఱిం గించెద మిమ్ముఁ గొల్చి వృషకేతుఁడు రాఁగలఁ దంచుఁ బల్కి ని ర్వంచితలీల హస్తినగరంబునకున్ జని మ్రొక్కె నన్నకున్.</poem>|ref=4}} {{Telugu poem|type=క.|lines=<poem>తమ్ములతో నపు డాస్థా, నమ్మునఁ గొలు వుండి ధర్మనందనుఁడు ప్రమో దమ్మునఁ దమ్ముఁడ రమ్మని, క్రమ్మనఁ గదియంగ భీముఁ గౌఁగిటఁ జేర్చెన్.</poem>|ref=5}} {{Telugu poem|type=సీ.|lines=<poem>తనకు మ్రొక్కినశక్రతనయమాద్రేయుల నెమ్మితో నాలింగనమ్ము జేసి వాయునందన సేమమే యన్న నన్నకుఁ గరములు మొగిచి నీకరుణ గలుగ నఖిలంబు సేమంబ యధ్వరాశ్వముఁ గొంచు వచ్చె భద్రావతీశ్వరుఁడు తాన యతనిదేవియుఁ బ్రభావతి కామినీసహస్రంబు సేవింపఁ బాంచాలిఁ జూడఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude> 0cbj6f9vqnzsjyr6ki67j0hlww3eqdc పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/46 104 178779 552600 496116 2026-04-10T06:36:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552600 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>గానరుగుదెంచి వృషకేతుఁ డానరేంద్రుఁ, బోర మెచ్చించె నని ధర్మపుత్రుఁ డీజ యంబు కృష్ణకుఁ జెప్పు పొమ్మనిన భీముఁ, డంతిపురమున కేఁగ నయ్యాజ్ఞసేని.</poem>|ref=6}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>అచ్చెరు వంది గొబ్బున నిజాసనముం దిగి నమ్ముఖంబుగా వచ్చి సువర్ణపీఠమున వాయుతనూభవు నుంచి నెమ్మదిన్ వచ్చిరె కర్ణనందనుఁడు నామనుమండును నంచు మేనిముల్ వ్రచ్చి వెడందగాయములు పాణితలంబున వంటి చూచుచున్.</poem>|ref=7}} {{Telugu poem|type=క.|lines=<poem>కుశలం బడిగిన సర్వము, కుశలము భద్రావతీశుకులసతి రాకా శశివదనలు గొల్వ నిరం, కుశవృత్తిని నిన్నుఁ జూచుకోరిక వచ్చెన్.</poem>|ref=8}} {{Telugu poem|type=శా.|lines=<poem>కాంతా నీవు నలంకరింపు సభలోఁ గానంగరాఁ డిందిరా కాంతుం డేఁగెనె ద్వారకాజనుల వేడ్కం జూడ నన్నన్ విభుం డంతస్సౌధములోన వాఁడె యన న ట్లైనన్ భవన్మందిరం బెంతే వన్నెకు నెక్కెఁబో హరి దయ న్వీక్షింపఁగాఁ గల్గుటన్.</poem>|ref=9}} {{Telugu poem|type=తే.|lines=<poem>చెల్ల దొక్కింతయును దామసింప నిచట, సఖులు నీవును లోచనోత్సవము గాఁగ నాయితముగం డనుచుఁ బల్కి వాయుసుతుఁడు, చనియెఁ గృష్ణయు శృంగారశాల కరిగి.</poem>|ref=10}} {{Telugu poem|type=క.|lines=<poem>పన్నీట జలక మాడెను, నున్ననివేణాముఁ గట్టెను విరు ల్దుఱిమెన్ సన్నముగ నలఁదెఁ గస్తురి, చన్నుల ముత్యాలబన్నసరములు దాల్చెన్.</poem>|ref=11}} {{p|ac|fwb}}యౌవనాశ్వుండు సైన్యంబుతో హస్తిపురంబునకు వచ్చుట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>అంతట యౌవనాశ్వవసుధాధిపుసేవలు హస్తినావతీ ప్రాంతవిశాలచంపకవనాంతరసీమలు డాయ వచ్చినన్ దంతిరథాశ్వసైనికవితానము గొల్వఁగ వచ్చి రాత్మలన్ సంతస మందుచున్ మదగజంబుల నెక్కి యుధిష్ఠిరాచ్యుతుల్.</poem>|ref=12}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆనక శంఖదుందుభిమహారవముల్ దశదిక్కులన్ బ్రతి ధ్వానము లీనఁగాఁ గదియవచ్చువిభుం గని యధ్వరాశ్వమున్ గానిక వెట్టి కూర్మి దొలఁకన్ బ్రణమిల్లినఁ బాండవాగ్రజుం డేనుఁగు డిగ్గి యవ్విభుని నెత్తి కవుంగిటఁ జేర్చి యిట్లనున్.</poem>|ref=13}} {{Telugu poem|type=క.|lines=<poem>నరనాథ వినుము భీముఁడు, నరుఁడును మాద్రిజులు గూడ నా కనుజులు న ల్వురు కృతమున నేఁటికి నే, గురుసోదరు లైరి నీవు గూడినకతనన్.</poem>|ref=14}} {{Telugu poem|type=క.|lines=<poem>సందర్శింపుము వాఁడె ము, కుందుని లోకైకరక్షకుఁ బ్రభావతి మ న్మందిరమున కంపుము కుం, తిం దామరసాక్షి ద్రౌపది న్వీక్షింపన్.</poem>|ref=15}} {{Telugu poem|type=క.|lines=<poem>నావుడు సంతఃపురికిఁ బ్ర, భావతిఁ గదలించి ధరణిపతి దనశిర మ గ్గోవిందునిపాదంబుల, మోవఁగఁ బ్రణమిల్లి వినయమున ని ట్లనియెన్.</poem>|ref=16}}<noinclude><references/></noinclude> 8nu64brju68jge0cet8meqdc5i9f5do 552601 552600 2026-04-10T06:38:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 552601 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>గానరుగుదెంచి వృషకేతుఁ డానరేంద్రుఁ, బోర మెచ్చించె నని ధర్మపుత్రుఁ డీజ యంబు కృష్ణకుఁ జెప్పు పొమ్మనిన భీముఁ, డంతిపురమున కేఁగ నయ్యాజ్ఞసేని.</poem>|ref=6}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>అచ్చెరు వంది గొబ్బున నిజాసనముం దిగి నమ్ముఖంబుగా వచ్చి సువర్ణపీఠమున వాయుతనూభవు నుంచి నెమ్మదిన్ వచ్చిరె కర్ణనందనుఁడు నామనుమండును నంచు మేనిముల్ వ్రచ్చి వెడందగాయములు పాణితలంబున వంటి చూచుచున్.</poem>|ref=7}} {{Telugu poem|type=క.|lines=<poem>కుశలం బడిగిన సర్వము, కుశలము భద్రావతీశుకులసతి రాకా శశివదనలు గొల్వ నిరం, కుశవృత్తిని నిన్నుఁ జూచుకోరిక వచ్చెన్.</poem>|ref=8}} {{Telugu poem|type=శా.|lines=<poem>కాంతా నీవు నలంకరింపు సభలోఁ గానంగరాఁ డిందిరా కాంతుం డేఁగెనె ద్వారకాజనుల వేడ్కం జూడ నన్నన్ విభుం డంతస్సౌధములోన వాఁడె యన న ట్లైనన్ భవన్మందిరం బెంతే వన్నెకు నెక్కెఁబో హరి దయ న్వీక్షింపఁగాఁ గల్గుటన్.</poem>|ref=9}} {{Telugu poem|type=తే.|lines=<poem>చెల్ల దొక్కింతయును దామసింప నిచట, సఖులు నీవును లోచనోత్సవము గాఁగ నాయితముగం డనుచుఁ బల్కి వాయుసుతుఁడు, చనియెఁ గృష్ణయు శృంగారశాల కరిగి.</poem>|ref=10}} {{Telugu poem|type=క.|lines=<poem>పన్నీట జలక మాడెను, నున్ననివేణాముఁ గట్టెను విరు ల్దుఱిమెన్ సన్నముగ నలఁదెఁ గస్తురి, చన్నుల ముత్యాలబన్నసరములు దాల్చెన్.</poem>|ref=11}} {{p|ac|fwb}}యౌవనాశ్వుండు సైన్యంబుతో హస్తిపురంబునకు వచ్చుట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>అంతట యౌవనాశ్వవసుధాధిపుసేవలు హస్తినావతీ ప్రాంతవిశాలచంపకవనాంతరసీమలు డాయ వచ్చినన్ దంతిరథాశ్వసైనికవితానము గొల్వఁగ వచ్చి రాత్మలన్ సంతస మందుచున్ మదగజంబుల నెక్కి యుధిష్ఠిరాచ్యుతుల్.</poem>|ref=12}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆనక శంఖదుందుభిమహారవముల్ దశదిక్కులన్ బ్రతి ధ్వానము లీనఁగాఁ గదియవచ్చువిభుం గని యధ్వరాశ్వమున్ గానిక వెట్టి కూర్మి దొలఁకన్ బ్రణమిల్లినఁ బాండవాగ్రజుం డేనుఁగు డిగ్గి యవ్విభుని నెత్తి కవుంగిటఁ జేర్చి యిట్లనున్.</poem>|ref=13}} {{Telugu poem|type=క.|lines=<poem>నరనాథ వినుము భీముఁడు, నరుఁడును మాద్రిజులు గూడ నా కనుజులు న ల్వురు కృతమున నేఁటికి నే, గురుసోదరు లైరి నీవు గూడినకతనన్.</poem>|ref=14}} {{Telugu poem|type=క.|lines=<poem>సందర్శింపుము వాఁడె ము, కుందుని లోకైకరక్షకుఁ బ్రభావతి మ న్మందిరమున కంపుము కుం, తిం దామరసాక్షి ద్రౌపది న్వీక్షింపన్.</poem>|ref=15}} {{Telugu poem|type=క.|lines=<poem>నావుడు నంతఃపురికిఁ బ్ర, భావతిఁ గదలించి ధరణిపతి దనశిర మ గ్గోవిందునిపాదంబుల, మోవఁగఁ బ్రణమిల్లి వినయమున ని ట్లనియెన్.</poem>|ref=16}}<noinclude><references/></noinclude> kzzf2ct85ijpskrnedg89umu1q9y005 పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/47 104 178780 552632 496117 2026-04-10T10:51:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552632 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>దేవ ధన్యుండ నైతిని భవత్పాదాబ్జములు మోపఁగా మ్రొక్కగలిగెఁ గాన నాపట్టణము పావనం బయ్యె భీమాదిశూరత్రయము మట్టి చూచెఁ గానఁ గీర్తనీయము వృషకేతుశౌర్యం బాజిఁ జెల్లిననన్ను రక్షించెఁ గాన సఫల మీతురంగంబుజన్మంబు ధర్మజుం డొనరించు క్రతువున కొదవెఁ గాన</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నిన్నిటికి శేఖరంబుగా నింద్రతనయుఁ, జూడవలె నాకు నతఁడు నీజోడు గాఁడె యనఁగ నర్జునుఁ డరుదెంచి యౌవనాశ్వ, నరవరేణ్యునిఁ బరిరంభణం బొనర్ప.</poem>|ref=17}} {{Telugu poem|type=చ.|lines=<poem>అనయము నీవు ధర్మజుని యట్టికృతార్ధుఁడ వర్ధి నిన్నుఁ గ న్గొనినజనంబు లెల్ల ననఘుల్ మును చేసినపుణ్య మెట్టిదో నినఁ గనుఁగొంటి నంచు ధరణీపతి ప్రస్తుతి చేసె దత్కులాం గనయును గుంతికిన్ ద్రుపదకన్యకుఁ జాఁగిల మ్రొక్కె నచ్చటన్.</poem>|ref=18}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆగుణనిధినందనుఁడు సు, వేగుఁడు ధర్మాదులకును వినతుండై మా కీగోవిందునిఁ గరుణా, సాగరుఁ గనఁ గల్గెఁ గర్ణసంభవుకతనన్.</poem>|ref=19}} {{Telugu poem|type=క.|lines=<poem>శౌరి వెలియైనధనము శ, రీరము సామ్రాజ్యమును బరేతసమంబుల్ పేరు గొనఁదగదు గాన ము, రారి పదాబ్జములు విడువ ననవరతంబున్.</poem>|ref=20}} {{Telugu poem|type=చ.|lines=<poem>తురగము వెంట నంపుము కుతూహలినై చని మోహరించుభూ వరులఁ దృణీకరించి కొనివచ్చెద నధ్వరవేళ కన్న శ్రీ హరి వృషకేతు రాసుతుఁ బ్రియంబునఁ గౌఁగిటఁ జేర్ప హస్తినా పురి కరుదెంచి రందఱుఁ బ్రభూతపురందరవైభవంబునన్.</poem>|ref=21}} {{Telugu poem|type=తే.|lines=<poem>అందు నొకమాస ముండి ముకుందుఁ డనియె, ధర్మజునితోడ నింక ముందఱను వచ్చుఁ బదునొకండవనెల చైత్రపౌర్ణమాసి, నాఁడు ముఖ్యంబు నీకు జన్నం బొనర్ప.</poem>|ref=22}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>కావున నుగ్రసేనభుజఖడ్గసురక్షితయై తనర్చు ద్వా రావతి కేఁగెదన్ మఖతురంగము నీవును యౌవనాశ్వుఁడున్ గావుఁ డతిప్రయత్నమునఁ గైకొను మధ్వరదీక్షవేళకున్ నీ వెఱిఁగింప వత్తు ధరణీవర యేనును బంధుకోటితోన్.</poem>|ref=23}} {{Telugu poem|type=క.|lines=<poem>అని పలికిన గోవిందుని, మన సెఱిగి విభుండు సబహుమానముగా నం పినఁ జనియె నయ్యశోదా, తనయుఁడు వరభోగవతికి ద్వారావతికిన్.</poem>|ref=24}} {{Telugu poem|type=సీ.|lines=<poem>వనజాక్షుఁ డరిగినవెనుక వేదవ్యాసుఁ డరుగుదెంచిన యుథిష్ఠిరుఁడు మ్రొక్కి యాది మరుత్తుఁడు యజ్ఞంబుఁ జేసినవైభవం బానతీవలయు ననిన విను మానవేశ్వరుం డనిమిషగురుని నాచార్యుఁగాఁ గోరిన శక్రుఁ డతని వారింప నారదువలన నెఱింగి సంవర్తుని నధ్వరకర్తఁ జేయఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దనమహత్త్వంబుచేత నత్తపసిఱేఁడు, శతమఖాదులు వాకట్టి క్రతు వొనర్చి భూమిభర్తకు వర మిచ్చి పోవ నానృ, పతియు బూతాత్ముఁడై దివ్యపదముఁ గనియె.</poem>|ref=25}}<noinclude><references/></noinclude> svvlkx9zow0dzgkw6n8hcjqb72equvx పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/48 104 178781 552639 496118 2026-04-10T11:34:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552639 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అంచు మరుత్తునికథ విని, పించిన మునితోడ జననభీరువులకు నే యంచున నిహపరములు సి, ద్ధించు ననుచు నడుగ నయ్యుధిష్టిరుతోడన్.</poem>|ref=26}} {{p|ac|fwb}}వ్యాసులు ధర్మజునకు ధర్మంబులు చెప్పుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>ధర్మశాస్త్రములయర్థరహస్యము లెఱింగి జరపుబ్రాహ్మణుఁడు మోక్షంబు గాంచు న్యాయమార్గము నొకింతయును దప్పక ధాత్రిఁ బాలించుజనపతి పడయు ముక్తి క్రయవిక్రయములఁ బొందక సర్వసముఁ డైన వైశ్యుండు పొందుఁ గైవల్యపదము నారాయణస్మరణయు విప్రపూజయుఁ గావించుశూద్రుండు గనుఁ బరంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నాల్గువర్ణంబులును నిట్లు నడచి పొందు, ముమ్మరంబుగ నైహికాముష్మికములు స్త్రీలవర్తన లేర్పరించెదను సావ, ధానమతితోడ విను మింక ధర్మతనయ.</poem>|ref=27}} {{p|ac|fwb}}వ్యాసులు ధర్మజునకు జారస్త్రీలక్షణంబులు చెప్పుట</p> {{Telugu poem|type=చ.|lines=<poem>ఒఱపరిఁ గన్నఁ గూడఁ జను నూరక సన్నలు వాఱ నాడుఁ ద త్తఱపడు బోటిఁ బిల్చెడువిధంబున నొత్తిలి పల్కు నవ్వుఁ బ ల్మఱుఁ బొరుగిండ్ల కేఁగు నొకమట్టున నిల్వదు చంటిమీఁద ముం జెఱఁ గెడలించు వైశికపుసిగ్గు నటించుచు జార ధారుణిన్.</poem>|ref=28}} {{Telugu poem|type=ఆ.|lines=<poem>పరులఁ గన్నఁ జంకపాపని ముద్దాడు, గోడ నిక్కి చూచుఁ గొప్పు దీర్చు మాఱుమలయు నత్తమామలతో లేని, కిటుకు పెట్టి బంధకీవధూటి.</poem>|ref=29}} {{Telugu poem|type=తే.|lines=<poem>మాలకరి దాసి సైరంధ్రి మాఱుఁదల్లి, మగఁడు విడిచినసతి దూతి మంత్రసాని జోగురా లాఁకు లమ్మెడిజోటి విధవఁ, గలసి వర్తించునది జారగా నెఱుంగు.</poem>|ref=30}} {{Telugu poem|type=క.|lines=<poem>వీరలలోపల మిక్కిలి, జారకు దూతియును దాది సాహసపారా వారము తీరముఁ జేరుపఁ, బేరోడలు పాయరాని పెసఁకువకతనన్.</poem>|ref=31}} {{Telugu poem|type=క.|lines=<poem>ఎచ్చోట విలాసినులకు మచ్చికఁ జన విచ్చినం బ్రమాదము పతికిన్ వచ్చు నవశ్యము కాంతలు, చచ్చినపుడు విశ్వసింపఁ జన దెవ్వరికిన్.</poem>|ref=32}} {{Telugu poem|type=క.|lines=<poem>అత్తయు మామయు మగఁడును, గత్తులబోను లయి బిఱుసు గావలె నెపుడున్ మత్తచకోరాక్షులకును, జిత్తము పరపురుషభోగశీలం బగుటన్.</poem>|ref=33}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఉపవాసములఁ దద్దయును గృశింపక మేను దిండిచేఁ బోషించుచుండెనేని మస్తకాంబరముల మాలిన్యభావంబు నందక వన్నె జెట్టయ్యెనేని దానధర్మముల నర్థంబు వెచ్చించక కట్టిఁడియై కూడఁబెట్టెనేని తనపుట్టినింట వంచనతోడ నిల్వక పొరుగిండ్లపా లయి తిరిగెనేని</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సంతతంబును శ్రీహరిస్మరణలేక, కఱకుఁదనమున దుర్భాష లఱచెనేని విధవ పెనిమిటితోఁ గూడ వివిధనరక, కూపబాధలఁ బడుఁ గడు గుఱుతు లేక.</poem>|ref=34}}<noinclude><references/></noinclude> fzbc9vyf0bxqbbapyt4wxbgdm9jgtuw పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/25 104 187863 552603 506206 2026-04-10T06:59:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552603 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>"అంత భూపాలుఁ డాయవనినందనకు సంతతి లేకున్నఁ జాల చింతించి తనయులు లేని యాతని యన్వయంబు జననంబు వృథగాదె చర్చించి చూడ నెందును సంతానహీనులు కీర్తిఁ బొంద రిందును నందుఁ బుణ్యాత్ములైన నెలకొన్న వగపులు నిట్టూర్పుగములు బెలయించి వారల పితరులందఱును ననురక్తిఁ దమ కుదకాంజలికర్మ మొనరించువాఁ డింక నుర్వి లేఁ డనుచు క్షితిఁ దమవంశవిచ్ఛేదంబుఁ దలఁచి మతిలోనఁ దమయాస మాని తూలుదురు ధారణిసుతయందుఁ దనయులఁ బడయ నేర నక్కట! వంశనిస్తారకులనుఁ గడుదుష్టదెస నొంది కాకుస్స్థకులము పొడవడంచినజాడఁ బోవలె ననుచుఁ జింతించి దేవతాసేవఁ గావింప</poem>|ref=}} శ్రీరామునకు సంతతి లేకుండెనని మాత్రము మూలమునఁ బ్రతిపాదింపఁబడియుండఁ గవి రామనార్యుఁడు, ధార్మికుఁడైన నృపతికి బహువత్సరములు రాజ్యపాలనముఁ జేసినపిదప సంతానము లేకుండుటవలనఁ గలుగు సంతాపమునుఁ గూడ విశదీకరించి తత్సందర్భపోష్యమగు నిర్వేదమును మనోవికలత్వమును మూలావిరుద్ధ ముగఁ బోషించి తనకవితాప్రౌఢిమఁ జాటియున్నాఁడు. సంతాన<noinclude><references/></noinclude> 79i95athlzjtpa592m42tle89mgo837 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/26 104 187864 552604 506207 2026-04-10T07:05:18Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552604 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>హీనుఁడగునతని హృద్గతభావాదు లేరీతి దొర్లుచుండునో ప్రస్ఫుటముగ విశదీకరించిన కవియొక్కనడక చతురగంభీరమై యనన్యసామాన్యమై యొప్పుచున్నది. {{p|ac|fwb}}పరిష్కరణము</p> ఈతంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయమున M.240, M.241, M.242 సంఖ్యలఁగల మూఁడు కుశలవోపాఖ్యాన గ్రంథముయొక్క తాళపత్రప్రతు లున్నవి. అందు M.240 సంఖ్యఁగల కుశలవోపాఖ్యానగ్రంథము ప్రస్ఫుటమగు లిపినిఁ గల్గి శుద్ధమై యొప్పుటచే ముద్రణమునకుఁ దగినదిగా నిర్ణయింపఁబడినది. కాని యతిప్రాచీనములగు 241, 242 సంఖ్యలఁ గల ప్రతులయొక్క సాహాయ్యముకూడ అత్యంతావశ్యకమై యుండినందున నా రెంటినిగూడ బరిశోధించి యావశ్యకములగు పాఠములు సంగ్రహింపఁబడినవి. చాలచోట్లఁ బ్రకృతపరిష్కరణమునకు నా రెండు గ్రంథములలోని పాఠాంతరములు గూడ నివ్వబడియున్నవి. 240 సంఖ్యఁగల ప్రకృతపరిష్కరణమున సర్వవిధములఁ బొసఁగని భాగములు తదితర (241, 242) మాతృకలసాహాయ్యమున సరిదిద్దఁబడి యథామాతృకపాఠములు ప్రాయికముగా నన్నియుఁ గ్రింద నివ్వఁబడియున్నవి. లేఖకప్రమాదవశమునఁ బ్రకృతపరిష్కరణమునకు మాతృక యగు 240 సంఖ్యఁ గల ప్రతియందు విలుప్తములైన భాగములు 241, 242 సంఖ్యలఁ గల గ్రంథములనుండి సంగ్రహింపఁబడినవి. పైమూఁడు గ్రంథములను బరిశీలించి చూడ నతిప్రాచీనమైన ప్రతియగు 241 సంఖ్యఁ గల ప్రతియే మొట్టమొదటిమాతృక యనియు నద్దానిపుత్రికలే తది<noinclude><references/></noinclude> 5vfudto7c1wcelhhg3tbwubat6xrisl పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/27 104 187865 552605 506208 2026-04-10T07:09:29Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552605 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తరప్రతులనియు స్పష్టమగుచున్నది. పాఠాంతరాదులను సులభముగ గ్రహించుట కనుకూలమగురీతిని M.241 సంఖ్యఁ గల గ్రంథమునకు “క” యనియు M.242 సంఖ్యఁ గల గ్రంథము "ఖ" యనియు సంజ్ఞ లేర్పరుపఁబడియున్నవి. క. గ్రంథమున నసంపూర్ణమును గవివంశవర్ణనాప్రధానమును నగు నుపోద్ఘాతమును వదలి తక్కినభాగము ప్రకృతపరిష్కరణమున లభ్యమగుచున్నది. ఖ. గ్రంథమునఁ బూర్వభాగము చాలవరకు లభ్యము కాలేదు. మదరాసు రాజకీయప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమందుఁ గూడ నీ గ్రంథముయొక్క మూఁడుప్రతులు లభ్యములగుచున్నవి. See the page No. 1376 of the Descriptive catalogue of the Telugu Manuscripts in the Government Oriental Manuscripts Library, Madras; Vol. IV. Prabandhas (continued,) Dvipadakavyas. కాని యా ప్రతులన్నియు నీసరస్వతీమహల్ గ్రంథాలయమునందలి ప్రతులకుఁ బుత్రికలనియే భావింపఁబడుచున్నందున నవి యీపరిష్కరణముదృష్ట్యా పరిశోధింపఁబడలేదు. ఆ ప్రతులనుఁగూడ పరిశోధించియుండిన బాగుండు ననియే తోఁచుచున్నది. కాని యవశాశాభావమే యందు దూష్యమైనది. సర్వసులభము గాని భాషయం దున్నట్టి జైమినిభారతమునఁ బ్రస్తావవశముఁ జెప్పఁబడి యతులితకవితావిశారదుఁడగు కవి రామనార్యునిచే మాధుర్యమును వెదజల్లు సర్వసుందరమగు<noinclude><references/></noinclude> dfq2jj2n61djky3e3jml0wn96ehey23 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/28 104 187866 552606 506209 2026-04-10T07:13:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552606 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నొక్కమధురకావ్యముగ ననువాదరూపమున సర్వవేద్యం బగునట్లు జేయఁబడిన యీ కుశలవోపాఖ్యానము సోదరాంధ్రమహాజనుల యాదరాభిమానములకుఁ బ్రముఖపాత్రమగు ననుటలో సందియము లేదు. ఇట్టి యపూర్వగ్రంథములనుఁ బ్రచురించుటకు సకాలమున నార్థికసాహాయ్య మొనరించి యాంధ్రభాషాభివృద్ధికిని దన్మూలముగ నాయకరాజుల యాశయసిద్ధికిని నిరుపమమగు సేవఁ జేసిన మన ప్రభుత్వము వేనోళ్ళఁ బొగడఁ దగియున్నది. ఈకుశలవోపాఖ్యానమునుఁ బ్రచురించుటకు నిశ్చయించి తత్పరిష్కరణభారమును నాపై నుంచి యేతన్మూలముగా నాంధ్రభాషామతల్లికి నీ యల్ఫీయమైన సేవనైనను జేయుటకు మహదవకాశము నొసంగిన సరస్వతీమహల్ గ్రంథాలయ గౌరవకార్యదర్శి శ్రీ యస్. గోపాలన్, బి. ఎ ; బి. ఎల్ ; గారికి నాహృదయపూర్వకాభివందనముల నర్పించుచున్నాను. న న్నీకార్యమున మిక్కిలి ప్రోత్సహించి తగుసహాయ మొనరించిన యీసరస్వతీమహల్ గ్రంథాలయమునందు విమర్శకోద్యోగులగు శ్రీయుత కె. వాసుదేవశాస్త్రిగారికి నా నమఃపూర్వకాభివందనముల నర్పించుచున్నాను. నా కన్నివిధము జేదోడువాదోడుగా నుండి సహాయ మొనర్చిన మన్మిత్రులును సహోద్యోగియు నగు శ్రీ అ. మహాదేవశాస్త్రిగారికి నా కృతజ్ఞతను, అపూర్వమగు సలహాల నొసంగి యాశీర్వదించిన యస్మజ్జేష్ఠసహోదరులును, పలమనేరునందలి<noinclude><references/></noinclude> a4qtkumtir24z83vchocr77n49nhdpt పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/29 104 187867 552607 506210 2026-04-10T07:20:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552607 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చిత్తూరుజిల్లా బోర్డు హైస్కూలులోఁ బ్రధానాంధ్రోపాధ్యానగు శ్రీయుత విఠలదేవుని సీతారామయ్యగారికి నా యభివాదములను దెల్పుచున్నాను. {{Telugu poem|type=|lines=<poem>"జాతౌ జాతౌ యదుత్కృష్టం తద్రత్న మభిధీయతే"</poem>|ref=}} అను నార్యోక్తి ననుసరించి ముద్రణాలయముల కన్నిటికిని రత్నమై వెలుఁగు "రత్నం ప్రెస్" లో నీ గ్రంథము ముద్రింపఁబడుట ముదావహమైయున్నది. పరిశోధనమున కధికముగ శ్రమ నివ్వక శుద్ధముగను ప్రామాదికము లధికముగ లేకుండునట్లును పాటుపడి త్వరలో గ్రంథముయొక్క ముద్రణ పూర్తియగునట్లు ముద్రణమును దృప్తికరముగ సాగించిన "రత్నం ప్రెస్"వారికి నామనఃపూర్వకాభినందనల దెల్పుచు నింతటితో విరమించుచున్నాను. {{Telugu poem|type=|lines=<poem>యావచ్చంద్రదివాకరౌ శుభకరౌ యావచ్చ గంగా శుభా యావద్భూధరపంక్తయస్సుఫలదాం రక్షంతి పృథ్వీమిమామ్। యావత్సత్యమిహాస్తి ధర్మనిరతాస్సర్వేపి విజ్ఞా జనా స్తావత్కౌశలవం చరిత్రమతులం జీయాద్ధరాయాం శుభమ్॥</poem>|ref=}} {{rh|సరస్వతీమహల్ గ్రంథాలయము,<br> తంజావూరు.<br> 29-12-1950. ||విఠలదేవుని సుందరశర్మ}}<noinclude><references/></noinclude> ahqyrckahrlg8tz19nmmyrcdd69ubwb పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/33 104 187871 552633 506214 2026-04-10T11:00:20Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552633 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|<poem>శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరామచంద్రాయనమః</poem>}} {{p|ac|fs150}}కుశలవోపాఖ్యానము</p> {{p|ac|fs125}}పూర్వభాగము</p> {{Telugu poem|type=|lines=<poem>శ్రీ యురంబునఁ గల్గి చెన్నొందు నభయ దాయకునకు జగత్రయనాయకునకు నంజనాసుతు నేలు నానతవజ్ర పంజరునకు మహీపతికుంజరునకు <ref>ఖ. అతిలోకచారిత్రుఁడై విలసిల్లు</ref>వితతచారము గాఁగ విలసిల్లువాని జితదూషణునకు నాశ్రితపోషణునకు మేఘనీలద్యుతి మెయి నుల్లసిల్లు రాఘవునకును మార్గణలాఘవునకుఁ దెలియ విన్నపముగా ద్విపదరూపమునఁ బలికెదఁ గుశలవోపాఖ్యాన మెలమి నని చెప్పఁబూనితి నారఘూత్తముని మనమున నిల్పి యిమ్మాట్కి నిట్లంటి.</poem>|ref=}} {{p|ac|fwb}}సూతుఁడు శౌనకాదులకోర్కెను మన్నించి జైమినిప్రోక్తంబగు కుశలవోపాఖ్యానమునుఁ జెప్పఁబూనుట</p> {{Telugu poem|type=|lines=<poem>అవధరింపుము రామ! అతిలోకధామ! రవికులాంబుధిసోమ! రాజసుత్రామ! నైమిశారణ్యపుణ్యప్రదేశమున</poem>|ref=}}<noinclude><references/></noinclude> 856d5lf6ysdbe75wahbrlbvl8vjnv47 552635 552633 2026-04-10T11:08:24Z దేవీప్రసాదశాస్త్రి 4290 552635 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|<poem>శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరామచంద్రాయనమః</poem>}} {{p|ac|fs150}}కుశలవోపాఖ్యానము</p> {{p|ac|fs125}}పూర్వభాగము</p> {{left margin|5em}}<poem>శ్రీ యురంబునఁ గల్గి చెన్నొందు నభయ దాయకునకు జగత్రయనాయకునకు నంజనాసుతు నేలు నానతవజ్ర పంజరునకు మహీపతికుంజరునకు <ref>ఖ. అతిలోకచారిత్రుఁడై విలసిల్లు</ref>వితతచారము గాఁగ విలసిల్లువాని జితదూషణునకు నాశ్రితపోషణునకు మేఘనీలద్యుతి మెయి నుల్లసిల్లు రాఘవునకును మార్గణలాఘవునకుఁ దెలియ విన్నపముగా ద్విపదరూపమునఁ బలికెదఁ గుశలవోపాఖ్యాన మెలమి నని చెప్పఁబూనితి నారఘూత్తముని మనమున నిల్పి యిమ్మాట్కి నిట్లంటి.</poem> </div> {{p|ac|fwb}}సూతుఁడు శౌనకాదులకోర్కెను మన్నించి జైమినిప్రోక్తంబగు కుశలవోపాఖ్యానమునుఁ జెప్పఁబూనుట</p> {{left margin|5em}}<poem>అవధరింపుము రామ! అతిలోకధామ! రవికులాంబుధిసోమ! రాజసుత్రామ! నైమిశారణ్యపుణ్యప్రదేశమున</poem> </div><noinclude><references/></noinclude> 646xwkgrljt82eyuna05kqmtb357zu2 పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/34 104 187872 552634 506215 2026-04-10T11:07:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552634 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem>గోమతీతటమునఁ గూడి సంయములు శౌనకప్రముఖులు జన్నము సేయ నానిత్యమతు లున్నయడకు సూతుండు వచ్చిన నెదురుగా వచ్చి యర్చనము లిచ్చి యచ్చల మెచ్చి యెలమి నిచ్చలును{{float right|10}} వనజాక్ష! యతనిచే వరపుణ్యకథలు వినుచుండి మును లొక్కవేళ యిట్లనిరి "అనఘాత్మ! కుశలవోపాఖ్యాన మిపుడు విన నిష్టమైనది వివరింపు మాకు " ననిన సూతుఁడు శౌనకాదులఁ జూచి యనురాగమునఁ బొంది యతిపుణ్యులార! చెప్పెద మీరు సేసినప్రశ్న మింత నొప్పునే సకలలోకోపకారమున జైమినిచే మున్ను జనమేజయుండు జైమినిభారతసంహిత వినుచు ధర్మజునశ్వమేధప్రసంగమున ధర్మాత్ముఁడైన యాధరణీశ్వరుండు "పార్థుండుఁ గర్ణుండుఁ బన్ని పోరుటయు వ్యర్థమే ప్రజలెల్ల వసుధఁ గూలుటయుఁ దలఁప నచ్చెరువుగాదా" యన నతఁడుఁ బలికె నాఖండలపౌత్రపౌత్రునకు "నిదియేమి రాముండు యెఱిఁగి యాకుశుఁడుఁ గదనంబు సేయరే కమలారివంశ! వినవయ్య యద్భుతవృత్తాంత” మనిన జనమేజయుఁడు పల్కె జైమినిఁ జూచి{{float right|20}}</poem> </div><noinclude><references/></noinclude> jwp6rp6woxhmaxc7cp49u0otljhnqns పుట:కుశలవోపాఖ్యానము (రామనార్య).pdf/35 104 187873 552636 506216 2026-04-10T11:16:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 552636 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|5em}}<poem>రాసి యొండొరులతో రాముండుఁ గుశుఁడు చేసినకయ్యంబుఁ జెప్పనచ్చెరువు అది యానతిమ్ము నాకంతయుఁ దెలియ మదిఁ గోర్కె కలదన్న” మౌని యి ట్లనియె పూర్వోక్తమగు రామభూపాలుచరిత ముర్వీశ! చెప్పెద నురుభక్తి వినుము.</poem> </div> {{p|ac|fwb}}<big>కథాప్రారంభము</big></p> {{p|ac|fwb}}శ్రీరాముండు రావణాదులసంహరించి సీతనుఁ గైకొని యయోధ్యకు మఱలుట</p> {{left margin|5em}}<poem>శ్రీరామచంద్రుఁ డాశ్రితవార్ధిచంద్రుఁ డారఘునాయకుం డభయదాయకుఁడు అమరవిద్రావణుండైన రావణుని నమితబలోదీర్ణుఁడగు కుంభకర్ణు నతిశాత్రవోపాయుఁడగు నతికాయు నతులమదోన్మత్తుఁడగు నింద్రజిత్తుఁ జతురంగబలవీరసంచితబంధు సుతులతో యముఁడున్న చోటికి ననిపి పవనాప్తముఖమునఁ బావనం బైన యవనిజఁ గైకొని యఖిలంబు మెచ్చఁ దనకూర్చుతమ్ముఁడు తరుచరోత్తముఁడు దనుజనాయకుఁడునుఁ దన్మంత్రివరులుఁ దనుఁ గొల్వఁగా నయోధ్యాపురంబునకుఁ జనుదేర నాలోన సంభ్రమింపుచును{{float right|30}}</poem> </div><noinclude><references/></noinclude> 999711rpoq2jymt7wdw9jdq4mtwnpmd పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/155 104 211333 552373 552356 2026-04-09T15:22:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552373 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> 1934లొ స్థాపించబడిన "సాహితీ మేఖల సంస్థకు వ్యవస్థాపక కార్యదర్శి ఇదే సంస్థకు చెందిన ధవళా శ్రీనివాసరావు కూడా తెలుగుభాష పట్ల చిన్నచూపుగల వారిని మందలిస్తూ పద్యాలు రాశారు. <poem> తెలుగుదేశాన జన్మించి తెలుగు చేత మంచి చెడ్డల భేదంపు మర్మమరసి తెలుగు పొలముల పంటను తినుచు బెరిగి తెనుగు బాసన్న నాలుక తేలవైతె ?</poem> అంతేకాదు నిజాం పాలనలో తెలుగుభాష యొక్క దీనస్థితి, హీనస్థితిని చూసి ధవళా శ్రీనివాసరావు హృదయం చలించింది. ఉర్దూభాషా సాహిత్యాలను, అక్కడి ఫాయర్లనూ ముషాయిరాలను మెచ్చుకునే సందర్భంలో తెలుగు రాదని చెప్పుకోవడమే గొప్పగా భావించేవారు. ఇది నచ్చని ధవళా శ్రీనివాసరావు సింహంలా గర్జించాడు. <poem> తెలుగన్నతంనే యేవగించుకొని మూతిల్ విప్పవేమోయి ఈ తెలుగుంబాస పసందు ముచ్చటలు సుంతేనింపసందింపవో పలుడం జెల్లునె తెల్గు రాదనుచుని పాండిత్యమా గంగలొ గలువంగా దగదే యదేదియుయినంగానిమ్ము నీపాలిటన్”</poem> ఆనాడు శ్రీనివాసరావు తన పద్యాన్ని ప్రజలకు ప్రబోధ శంఖంలా పూరించాడు. పాటలాగా పద్యాన్ని పరుగెత్తించే కలం బలం ధవళశ్రీ సొత్తు. ధవళా శ్రీనివాసరావు జాతీయ భావాలు కలిగిన కవి. జాతీయోద్యమ స్ఫూర్తితో ఆనాడు చక్కని కవితలు రాశారు. <poem> అదిగో తూర్పున రక్తిసంధిలగ నార్యావర్త దేశంబుపై నుదయించె ప్రబికాంతి జీవనపు లీలోద్యాన మందెల్లడన్ యెదల న్మూసిన శౌర్యపంఉగుసుమముల్విప్పారి స్వాతంత్య్ర సం పదసౌరభము దిద్దిగంతములలో వ్యాపింపగా నొప్పదే </poem> 'క్విట్ ఇండియా' ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో హైదరాబాద్ సంస్థానంలో ఉన్నా, భారత స్వాతంత్య్రం కోసం స్పందించి రాసిన పద్యమిది. ప్రజాకవి కాళోజీని నిజాం ప్రభుత్వం 1946లో మూడునెలలు వరంగల్ నుండి బహిష్కరించినపుడు “సాహితీ మేఖల" దశమ వార్షికోత్సవాల సందర్భంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించింది. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ధవళా శ్రీనివాసరావు 'కాళోజి" పై రాసిన కవితలు ఎంతో గుర్తింపుపొందాయి. <poem> కాకిమూకలు నిన్ను చీకాకు నొనరింప ఏకతంబే కోయిలా! వానికేమి లాభమె కోయిలా! కలత జెందకె కోయిలా! మనది కవికులంబౌ కోయిలా!</poem> ఈ కవికి పల్లెటూళ్లన్నా, పచ్చని పంటపొలాలన్నా ఎంతో ఇష్టం. అందుకే చేలన్నీ పచ్చదనంతో కళకళలాడుతూ వుండాలని, మండుటెండలకు ఎండి వాడిపోయే పొలాలు చూచి తన కన్నీళ్ళతోనైనా వాటికి తేమగూర్చాలని “మధురోహం”లో కోరుకుంటాడు. <poem> 'నా కలం నేడు బలరాముని హలం' అంటారొక చోట నేనెవరో నన్నెరుగరు కవిని - కాదు గాయకుడు శిల్పినంటారేమొ అదిగాదిదిగాదు నేను మధురోహను</poem> మధురోహను' అని అంటారు ఇంకోచోట. వేదనాభారంతో మగ్గిపోయిన హృదయాలను మధించి అమృతభాండములను అందించగల మధురకవి ధవళశ్రీ, వీరి మరణానంతరం వీరి కుమారులు అముద్రితంగా వున్న కవితలన్నీ సేకరించి "ధవళశ్రీ" పేరుతో 1991లో అచ్చువేయించారు. ఈ కవి 1980 మే 7న అస్తమించారు. తెలంగాణ (134) తేజోమూర్తులు<noinclude><references/> {{rh|తెలంగాణ |134| తేజోమూర్తులు}}</noinclude> i6vvfr94rumw1kfjmi43z67i1iysoui పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/156 104 211334 552374 551157 2026-04-09T15:31:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552374 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''40. దొడ్డి కొమురయ్య '''</p>}} {{right|- ప్రొ. ననుమాస స్వామి}} దొడ్డి కొమురయ్య భారతదేశ పోరాటానికి నాయకత్వం వహించిన యోధుడు. 1857 నాటి సైనిక తిరుగుబాటును తలపించే కడివెండి పోరాటానికి కారకుడు. 1946లో ఆంధ్ర మహాసభ సంఘానికి నాయకుడై కరడుగట్టిన భూస్వాములతో పోరాడి తానా రంగంలో అసువులు బాశాడు. ఆయన మరణించిన తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలయింది. అంతిమంగా హైదరాబాద్ విముక్తి పోరాటమయింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆవిర్భవించిన ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీగా మారిపోయింది. తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లాలో ఉన్న కడివెండిపల్లె ప్రపంచ పటంలోకి ఎక్కింది అప్పుడే. విసునూరు గ్రామం చుట్టూ ఉన్న 60 పల్లెలకు దొర రాపాక రామచంద్రారెడ్డి. మకుటంలేని మహారాజు. పరమ కిరాతకుడు. ఆగడాలకు హద్దు - పద్దూ లేదు. అతను జేసే అఘాయిత్యాలకు జనం హడలిపోతుంటారు. అతని తల్లి జానకమ్మ. ఆ దొరసాని కొడుకును మించిన కౄరురాలు. కడివెండి జాగీర్ ఆమెది. కడివెండి గడి నరకానికి నక్సల్ వెట్టిచాకిరీలో నలిగింది. వండే వంటమీద హక్కులేదు. పీళ్ళే గాలి మీద హక్కులేదు. దొరకు వచ్చే ప్రభుత్వ అధికారులకు విందు ఖర్చులివ్వాలి. జానకమ్మ గడిలో పుట్టుకైనా దావతైనా ఖర్చులు ఊరు వారే భరించాలి. పటేల్, పట్వారి, దొరల రాజ్యంలో బతుకే తమదిగాదు. అణచివేతకు, దోపిడీలకు అంతేలేదు. ఇక జానకమ్మను దొరసాని అంటే నేను సానినా అని మండిపడుతుంది. అమ్మా అని పిలిస్తే నీ తండ్రికి పెళ్ళాన్నా అని భగ్గుమంటుంది. ఆడదైనా 'దొర' అనే పిలవాలని ఆజ్ఞాపించింది. దొరల దురాగతాలను మాసిన దొడ్డి కొమురయ్య గుండె మండింది. అన్యాయాలను ఎదురించడమే గాదు పోరాడి ప్రాణం విడిచాడు. ఆయన త్యాగం రైతాంగ సాయుధ పోరాటానికి మొదటి అధ్యాయమైంది. నల్గొండ జిల్లా భువనగిరిలో 1944లో ఆంధ్ర మహాసభ మహాసభలు జరిగాయి. వేలమంది జనం, వందలమంది కవుల హాజరైనారు. వాళ్ళందరూ రైతులు, కూలీలు రకరకాల వృత్తులు జేసే ఉత్పత్తి కులాలవారు. నాయకులు చెప్పే ఉపన్యాసాలు, గాయకులూ పాడిన పాటలు విన్నారు. ఆ మాటలు, పాటలు తమ బతుకుల గురించే పున్నదని తమ కష్టాలు పోయే మార్గమున్నదని, ఉత్సాహం, ఉత్తేజం కలిగి సంఘంలో జేరి పోరాడాలనుకొన్నారు. వెట్టిచాకిరి, దొరల జమీందార్ల దౌర్జన్యాలు అంతం జేయాలనుకొన్నారు. జనమంతా "ఆంధ్ర మహాసభకు జై అన్నారు. వాళ్ళ కళ్ళల్లో కాంతి కనిపించింది. గుండెల్లో ధైర్యం వచ్చింది. గుట్టలు, పుట్టలు, చెట్లు జై అన్నట్లు ప్రతిధ్వనించినాయ్. గుండెల్లో ధైర్యం నిండింది. కళ్ళల్లో శక్తి వచ్చింది. మనసులో ఆవేశం రగిలింది. నిగూఢమైన శక్తి నిద్ర లేచింది. కానీ, అంతలోనే గుండెల్లో గుబులు కలిగింది. సభకు పోయినమని దొరకు, పటేళ్ళకు తెలిసి<noinclude><references/> {{rh|తెలంగాణ |135| తేజోమూర్తులు}}</noinclude> 3c5xz1wiczor2vg55226q3pk6b4ixng పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/157 104 211335 552375 551158 2026-04-09T15:46:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552375 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఉంటది. ఇంటికి పోగానే జరిగేది గుర్తుజేసుకున్నారు. దొర, గడి, గడిముందు పెట్టే హింసలు కళ్ళముందు తిరిగినయ్. ఏమి చెయ్యాలే! ఎట్లా బోవాలి! ఊర్లో వుండనిస్తరా? ఎన్ని హింసలు పెడ్తారోనని గుంపులు, గుంపులుగా జేరి చర్చించుకున్నారు. అమ్మో! దొరకు దెలిస్తే? యం జేస్తడు? 'కొడ్తడు తిడ్తడు- జుర్మానా వేస్తారు. ఊరు నుండి వెల్లగొడ్తాడు. అన్నడో యువకుడు. మనందరం ఒక్కటిగుంటే ఊరి జనమంతా మనతో కలిస్తే వాళ్ళేంజేస్తరు? సంఘంలో చేరాలి. ఒక్కటిగ నిలవాలి? అనుకొంటూ కడివెండికి వెళ్ళారు. ఊరూరున సంఘం పుట్టింది. సంఘం పుట్టిందనగానే జానకమ్మ దొరసానికి శివమెత్తినట్లయ్యింది. సంఘం లేకుండా చేయాలనుకున్నది. తాగుబోతు కిష్ఠుడు. కోట చంద్రయ్య పెండ్లాల నర్సమ్మను తప్ప తాగించి, సంఘం కార్యకర్తల ఇండ్లపై ఉసిగొల్చింది. వారిద్దరు సంఘం కార్యకర్తల, నాయకులను బండ బూతులు తిడుతూనే శాపనార్ధాలు పెడుతున్నారు. రాళ్లు విసురుతున్నారు. సహనం. నశించిన సంఘం కార్యకర్తలు వాళ్ళను తొక్కి కొట్టారు. ఆ తర్వాత 40 మంది రౌడీలతో మిస్కి నలీ, అబ్బాసలీ, దిగిండ్రు. గడిలో మఖాం బెట్టారు. అక్రమ కేసుల్లో ఇరికించడానికి అమీనాబ్ కు కబురు చేశారు. అమీనాబ్ వచ్చిండు. గ్రామ సంఘం నాయకుడు మోహన్ రెడ్డిని గడికి రమ్మని నౌకరును పంపిండు. మోహన్రెడ్డి గడికి రానన్నాడు. కావాలంటే ఆంధ్ర మహాసభ ఆఫీసుకు, లేదా చావడి దగ్గర కొస్తానన్నాడు. అమీనాబు కోపమొచ్చింది. 16 మంది కార్యకర్తలను పట్టుకొచ్చిండ్రు. అది చూసే వందలమంది జనం అమీన్ సాబ్ ను చుట్టుముట్టారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడిపించుకున్నారు. అది అమీనాబ్, దొరసాని జానకమ్మ తీరని అవమానమనుకున్నారు. రౌడీలకు తలవంపు అయ్యింది. ప్రతీకారం తీర్చుకోవాలను కున్నారు. సర్కార్ ఖానూన్ ప్రకారం ప్రతీ రైతూ బోనీ ధాన్యం చెల్లించాల్సిందేనంటూ ఇల్లుల్లు సోదా చేసి ఉన్న నాలుగు గింజలు బలవంతంగా లాక్కొని, ధాన్యానంతా బండ్లమీద వేసుకొని వెళ్ళిపోతున్నారు. ఊరు బయటకు రాగానే సంగంవాళ్ళు అడ్డుపడి నిలిచారు. పేదల గింజలు కాదు... దొర గడీలో ఉన్న పుట్ల కొద్దీ ధాన్యం ఎందుకు ముట్టుకోలేదని నిలదీశారు. తటపటాయించాడు తహసీల్దారు. గడిలో ధాన్యం లేదని బుకాయించాడు. తాము చూపిస్తామన్నారు. సంఘంవాళ్ళు. గత్యంతరంలేక అధికారులు బండ్లను వెనక్కి మళ్ళించారు. అధికారులు, పోలీసులు తిరిగి గడీలో బస చేశారు. ఆ రాత్రి విందు జరిగింది. పొద్దున్న ప్రజల ముందు గడీలో ధాన్యం బయట పడుతుందని, పరువు పోతుందని రాత్రికి రాత్రే దాన్నంతా దొంగచాటుగా విసునూర్కు తరలించారు. పొద్దున్నే చూస్తే గడీలో ఖాళీ గరిసెలు దర్శనమిచ్చాయి. కానీ దొరతనం పరువు పోయింది. మొదటిసారిగా ప్రజలు తమకు ఎదురుతిరగడం సహించలేకపోయారు. సంఘం సంగతి, ప్రజల సంగతి చూస్తానని జానకమ్మ గుడ్లురిమింది. గుండాల గుంపులు కడవెండికి చేరుకున్నాయి. అడ్డుకోకపోతే మరింత హద్దు మీరుతారని అనుకున్నారు. గుమాస్తా అబ్బాసలీ (అమరుడైన బందగి సోదరుడు) నాయకత్వంలో గడీ నిండా చేరిన గుండాలు ఊరిపై దాడికి పూనుకున్నారు. కత్తులు, కర్రలు, బరిసెలతో బీభత్సం చేశారు. అమీనా షాబ్ జమేదార్ వెళ్ళిపోయాడు. రౌడీలు రాత్రంతా గడిలో కుట్ర వన్నారు. మరుసటిరోజు (1946లో జూలై4) చీకటిపడగానే, సంఘం కార్యకర్తల ఇండ్లపై రాళ్ల వర్షం కురిపించారు. సంఘం నాయకులు సంఘశక్తి చూపాలనుకున్నారు. ఇళ్ళల్లోని వారంతా బయటికొచ్చారు. దాడికి వ్యతిరేకంగా ఊరేగింపు జరపాలని నిశ్చయించారు. ఊరంతా కదిలింది. ఉరేగింపు గా ఆంధ్ర మహాసభ కార్యాలయం వైపు బయల్దేరారు. అప్పుడే వచ్చి అన్నం తింటున్న దొడ్డి కొమురయ్య ఆ వార్త తెలిసి దుడ్డుకర్ర అందుకొని 'జై' అంటూ అన్న మల్లయ్యతో కలిసి వెళ్ళి ఊరేగింపులో కలిశాడు. ఊరేగింపు సాగిపోతోంది. సంఘం ఆఫీసు జానకమ్మ దొరసారి గడిముందే వున్నది. ఊరేగింపు గడి దగ్గరకు రాగానే, తప్ప తాగిన రౌడీలు తుపాకులు పేల్చారు. ఊరేగింపు ముందు వరుసలోవున్న దొడ్డి కొమురయ్యను మిస్కీనలీ గురిపెట్టి కాల్చిండు. ముందున్న దొడ్డి కొమురయ్య సోదరుడు మల్లయ్య మోకాలు నుండి తూటా దూసుకుపోయింది. కొమురయ్య ఉగ్రుడయ్యాడు. ముందుకు సాగాడు. గూండాలు కాల్పులు జరిపారు. తూటా కొమురయ్య పొట్టలో నుండి దూసుకు పోయింది. పేగులు బయటపడ్డాయి. ఆంధ్ర మహాసభకు 'జై' అని నినదిస్తూ ప్రాణాలు వదిలాడు. దొడ్డి మల్లయ్య, నేడిపల్లి కొండయ్య మురిగొల్ల నర్సయ్య, కొరగల్ల సాయిలు, పడమటింటి అయిలయ్య దేశవల్లి లక్ష్మీనర్సీహ్మలతో సహా 20 మందికి గాయాలయ్యాయి. వారు నేల గూలి రక్తపు<noinclude><references/> {{rh|తెలంగాణ |136| తేజోమూర్తులు}}</noinclude> kslo9ok663w7h8wm3bx8ckkc3518pzt పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/158 104 211336 552376 551159 2026-04-09T16:03:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552376 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> మడుగులో కొట్టుకుంటున్నారు. సంఘం కార్యకర్తలు రౌద్ర రూపం దాల్చారు. 'ఆంధ్ర మహాసభకు జై అని గడివైపు ఉరికిండ్రు. రౌడీల గూండెలదిరినయ్. తలుపులు బిగించు కున్నారు. సంఘం నాయకులు ప్రజలను శాంతింప చేశారు. గడిచుట్టూ కాపలా బెట్టారు. గాయపడిన వాళ్ళను భుజాల మీద వేసుకొని జనగామ దవాఖానాకు తీసుకెళ్లారు. అప్పటికే దొడ్డి కొమురయ్య ప్రాణాలిడిచాడు. ఈ వార్త తెలిసిన చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు కడవెండి చేరారు. 1946 జూలై ఐదున వేలాది జనం ఊరేగింపుగా వెళ్ళి అమరజీవి దొడ్డి కొమురయ్య అంత్యక్రియలలో పాల్గొన్నారు. కొమురయ్య ఆశయ సాధన జరిగేదాకా విరమించేది లేదని ప్రతిన పూనారు. విసుమారు దొర దుర్మార్గాలకు కడివెండి అర్థం పట్టింది. దొడ్డి కొమురయ్య అమరత్వం ఉద్యమానికి ప్రతీకలయ్యాయి. "ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు. ఒక నెత్తుటి బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు 'ఖబర్దార్ ఖబర్దార్ నిజాం పాదుషాహీ బానిసత్వం విముక్తికై హిందూ ముస్లిం పీడిత శ్రమజీవులు ఏకమైంది" అన్నాడు. ఓ కవి. రైతాంగ సాయుధ పోరాటయోధులకు ఉత్తేజం నింపేట్టుగా ఓ వాగ్గేయకారుడు స్మృతి గీతాన్ని రచియించాడు. వినండి. 'గొడ్లండ్లు నూరినారు గొంగండ్ల పెట్టినారు కారిన రక్తమంతా కడపల్లో నింపినారు చిలికిన రక్తమంతా సీసాల్లో నింపినారు నీ పాణం తీసిరి కొడుకో కడివెండి కొమురయ్య' మరో తెలంగాణ కవి 'పోరుగడ్డ తెలంగాణ తెలంగాణ వీరమాత తెలంగాణ’ అంటూ పల్లవి ఎత్తుకొని 'దొడ్డి కొమురయ్య పోరుగడ్డ 'తెలంగాణ' తెలంగాణ తెలంగాణ - అంటూ కొమురయ్య త్యాగాన్ని కీర్తించాడు. మరో తెలంగాణ కవి <poem> 'అమర వీరుడవు నీవు కొమురయ్యా అందుకొ జోహారు కొమురయ్యా న్యాయవంతం లేని నిజాం పాలనలో విశ్వ కంఠకమైన ఇన్నూరు రాజ్యంలో పాలించుచున్నాడు ప్రజల పాలిటి యముడు జానకమ్మ కొడుకు రామచంద్రారెడ్డి ప్రజల హక్కుల కోసం కొమురయ్య ప్రాణాలు విడిచావు కొమురయ్యా అమర వీరుడవు నీవు కొమురయ్య అందుకో జోహార్లు కొమురయ్యా</poem> సామాన్యుడైన దొడ్డి కొమురయ్య అసామాన్యంగా పోరాడిన ఘట్టాన్ని ఏ జాతి పోరాటానికైనా స్పూర్తి కదా!- దేశంలో స్వాతంత్య్రం కోసం పోరు సాగుతూ ఉంటే, నిజాం సంస్థానంలో విముక్తి పోరాటం సాగింది. ఒక ప్రతిఘటన, ఒక తిరుగుబాటు, ఒక విప్లవం అన్ని కలిస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైంది. ప్రజాస్వామ్య మంటే ఏమిటో తెలియని రోజుల్లో సామాన్యులు ఏకమై నిజాం పైశాచిక పాలనపై తిరగబడ్డారు. రెండు శతాబ్దాలపాటు ఎదురులేని పాలనకు మట్టి మనుషులు మరణ శాసనాన్ని లిఖియించారు. బడుగు బలహీన వర్గాల బలిదానాలు ఇక్కడే ఎక్కువ. తెలంగాణ విప్లవ చరిత్రలో దొడ్డి కొమురయ్య అమరత్వం ఓ ఉజ్జ్వల ఘట్టం. సైద్ధాంతికంగా ప్రారంభమైన ఉద్యమమెప్పుడు లక్ష్యాన్ని ముద్దాడుతుంది. తెలంగాణ సాయుధ పోరాటం వెనుకడు గేయక ప్రాణ త్యాగాలకు సైతం ముందుకురికి విజయ తీరాలను తాకింది. రాచరికపు కోటలను బద్దలుకొట్టి, తరాల నిరంకుశత్వాన్ని పాతరేసి, బానిస సంకెళ్ళను తెగ్గొట్టింది. బైరాన్ పల్లి, గుండ్రపల్లి, రాయికుడ్, అప్పంపల్లి లాంటి గ్రామాలలో 4 వేలమందిని ఊచకోత కోసిన రజాకార్ల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆధునిక ప్రపంచ విప్లవ పోరాటాల్లో తెలంగాణ పోరాటం వియత్నాం యుద్ధమంతా పెద్దది. అంతేగాదు ప్రపంచ పోరాటాల చరిత్ర పుటల ఎక్కవల్సిన పోరాటంగా పేర్కొనాలి. మదనపల్లి గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని జె.ఏ.సి. చైర్మన్ కోదండ రామ్ ఆవిష్కరించాడు. హన్మకొండ లో దొడ్డి కొమురయ్య స్మారక సంస్థ కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. కొమురెల్లి మల్లన్న గుడి సందర్శించి నప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొమురయ్య భవనాన్ని హైదరాబాద్లో ఎకరం 20 గుంతల భూమిలో నిర్మిస్తామని ప్రభుత్వ గెజిట్ లో ప్రకటన ఇస్తామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి తన ఊపిరిని ఎత్తుగా పెట్టి ప్రాణవాయువులూదిన దొడ్డి కొమురయ్య త్యాగాన్ని స్మరించుకోవడానికి చెప్పాల్సి ఉంది.<noinclude><references/> {{rh|తెలంగాణ |137| తేజోమూర్తులు}}</noinclude> somapcfxgn7hyjdlv3wedm6auh7u9fo పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/159 104 211337 552377 551160 2026-04-09T16:14:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552377 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''41. డోకూరు కోట్ల బాల బ్రహ్మచారి </p>}} {{right|-మావిశ్రీ మాణిక్యం}} తెలుగు భాషకున్న ప్రత్యేక భాషాభూషణ అవధానం ఇది మన తెలుగు భాషకే సొంతమైన ప్రక్రియ. ఈ అవధాన ప్రక్రియను ఎందరో మహానుభావులు నిర్వహించారు. ఎంతో కీర్తి ప్రతిష్ఠలను సంపాదించారు. వారంతా సర్వాంగులు సుందర స్వరూపులు కీర్తి గడించడానికి ఏ లోపమూ లేనివారు కానీ అంగ విహీనమైవుండి, పుంభావ సరస్వతీ పుత్రుడై భాసిల్లిన ఓ నడయాడే విజ్ఞాన స్వరూపమా అన్నట్లు తెలంగాణములో ఉన్నాడా అనే విధంగా ఒకింత ఆశ్చర్యానికి గురి చేసే అంశం "సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అనేది పెద్దల మాట అలాంటి నయనాలు లేని ఓ వ్యక్తి అవధానాలను అలవోకగా నిర్వహించాడంటే ఆశ్చర్యం వేయక మానదు. కేవలం తన మనోనేత్రంతో చూస్తూ రెండువేలకు పైగా అవధానాలు చేసి మెప్పించారు వారు. అంతటి ఘనాపాటి తెలంగాణ మట్టిపై పుట్టి తిరుపతి వేంకట కవులకు ధీటుగా అవధానాలను నిర్వహించారంటే వారెంతటి ఘటికులో అర్ధమవుతుంది. అలాంటి ఒక గొప్ప తెలంగాణ ముద్దుబిడ్డ, కవి పండితుడు అవధాన సరస్వతి అయిన బాలబ్రహ్మచారిని గుర్తుకు చేసుకోవడం ఎంతో గర్వించదగిన విషయం అని చెప్పాలి ఈనాడు. బాలబ్రహ్మచారి గారి తల్లి మోనాంబికా, తండ్రి అనంత రామాచార్యులు వారు మహా పండితులు, సకల కళావిశారథులు అట్టివారి పుత్రులే అవధాని బాలబ్రహ్మచారిగారు. బాలబ్రహ్మచారి గారు మూడేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడే అనారోగ్యం బారిన పడి తన రెండు కళ్ళను కోల్పోయాడు. ఆయన ఎంతో స్ఫురద్రూపి, ఏక సంథాగ్రహి. వీరి తండ్రిగారైన అంతాచార్యులు వారే వీరికి స్వయంగా విద్యను బోధించారు. ఆయన సకల శాస్త్ర పారంగతుడు. జ్యోతిష్య, కావ్య మీమాంస, వ్యాకరణ శాస్త్రాలలో నిష్ణాతులు గనక తన కుమారునికి మౌఖికంగానే విద్యాబోధన జరిపి జ్యోతిష్య, వ్యాకరణ, కావ్య శాస్త్రాదులలో, నిష్ణాతుడిగా తీర్చదిద్దినాడు. క్రమంగా వారు విద్యాభ్యాస నంతరం ఇతిహాస కథలు, హరికథలు చెప్పటం ఆరంభించి చతుర్విదకవితలు చెప్పడంలో ఆరితేరారు. ఒకరోజు గద్వాల సంస్థానంలో సాహిత్యోత్సవాలు జరుగుతుండగా, అందులో పాల్గొనే అవకాశం బ్రహ్మవారి గారికి లభించింది. అదే ఉత్సవాల్లో శతావధాని కవి సింహ పోకూరి కాశీపతి అవధానిగారు అష్టావధానం చేస్తుండగా ఆ సభలోనే ఉండి అవధాన కార్యక్రమాన్ని ఆసాంతం విన్న బ్రహ్మచారి నేను కూడా అవధానం చేస్తానని నాకు అవకాశం ఇప్పించండని కోరి తన ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆ వెంటనే రాజావారు విని సంభ్రమంతో మీరు కూడా అవధానం చేయవచ్చని చెప్పి అవకాశం కల్పించారట. అదే అదనుగా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్విఘ్నంగా అష్టావధానాన్ని<noinclude><references/> {{rh|తెలంగాణ |138| తేజోమూర్తులు}}</noinclude> a6zxkbtfnk0x8gu4oga3oghikrypqh6 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/160 104 211338 552378 551161 2026-04-09T16:34:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552378 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ధైర్యంగా వచ్చి చేశారు. 32, అర్థాలు వచ్చేలా ఒక చమత్కార పద్యంలో మొదలుపెట్టారు. <poem> తే.గీ.॥ శ్రీ పుభేభ్యుడు, హరిబుధార్చిత సదినుడు పరమ హితకరుడజపద బ్రాజితుండు కువలయ, బిడ్డనుడు సమగోవు, సిద్ధు డైన భగవంతుదోము మమ్యాదరమున </poem> అని శ్రీకారంతో ఆరంభించి దత్తపదితో ముందుకెళ్లాడు. అల్లము, బెల్లము, పల్లము, బుల్లము (ఇవి దత్తపవి) అంశాలు ఇవ్వగా శ్రీ అవధానిగారు రామాయణార్ధంలో ఎలా పూరించారో చూడండి. <poem> "అ ముకుందు డాశ్రిత బుధావళి నేలగ రాముడై జనం బెల్ల ముదంబు నొంది నుతియింప, దురాత్ముల రక్తముర్విపై బల్లము, మిఱ్ఱనేకమయి పాఱెడి, యిట్లానరించి సతతం బుల్లము, రంజిలన్, బుధుల నోమెనయోధ్య పురాధినాధుడై</poem> అని పూరించి అందరి మెప్పును పొందారు. ఆ వెంటనే మరో పృచ్ఛకుడు లేసి, నాకో సమస్య ఉన్నది. నీ కోసమస్య ఉన్నది నీ సమస్యను నీవేమైనా చేసుకో కానీ నా సమస్యకు మాత్రం భారతార్థంలో చెప్పమనెను. సమస్య : అంధత్వంబు పురాభవ గ్రణిత పుణ్యప్రాప్త మూహింపగ సమస్యను ఇలా పూరించాడు అవధాని. <poem> శా౹౹ అంధత్వ స్థికమేమి నాబ్రతుకునన్, వ్యాసుండు దానినిట్లనెను గాంధారీధవ యిట్లుగాని యెడ, దుష్కర్మ ప్రపంచపు గా డుంధాత్రిస్, గని, కుందవలసియుండున్ గాని, నెంతేని నీ యంధత్వంబు, పురాభవ ద్రదిత పుణ్యప్రాప్త మూహింపగాన్ </poem> అని పూరించిరి. అలా అవధాన ప్రస్తానాన్ని మొదలు పెట్టి (2000) రెండు వేలకు పైగా అవధానాలు చేసి దేశవ్యాప్తంగా పర్యటించారు. జైపూర్ సంస్థానం వరకూ వీరి యాత్ర కొనసాగించారు. అందులో భాగంగానే గద్వాల, వినవర్తి, ఆత్మకూరు, జటప్రోలు, దైవముదిన్నె మొదలైన సంస్థానాల్లో వీరు అవధానాలను నిర్వహించారు. అలాగే తిరుపతి, శ్రీశైలం బ్రహ్మంగారి మఠం, మంగలగిరి, వేములవాడ, యాదగిరి గుట్ట, మున్నగు క్షేత్రాలలోగానూ, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలందు, ఇంకా గ్రామాలు, పట్టణాలు ఎన్నింటిలోనో, రాష్ట్రము, రాష్టేతర ప్రదేశాలలో యావద్దేశమంతా పర్యటించి అవధానామృతాన్ని పంచిపెట్టారు వారు. పోయిన ప్రతిచోట వారికి ప్రశంసల జల్లులు కురిసినాయి. ఎన్నో సత్కారాలు, బిరుదులు, ధన కనక వస్తువులు బహుమానాలుగా అందినాయి. అందులో కొన్నింటిని ఇక్కడ ప్రస్తావిస్తారు. గద్వాల సంస్థానం వారు "కవిరత్న" బిరుదతో సత్కరించారు తిరుపతి వాస్తవ్యులు - "చిత్రకవిత ప్రవీణా అంటూ చమత్కరించారు. వరంగల్ పట్టణంవారు - ఆశు కవితా దురీణ అంటూ అక్కున చేర్చుకున్నారు. మంగళగిరి మాన్యంవారు 'కవిశేఖర' అని కీర్తించారు. రాజమండ్రి వారు - 'కవిశిరోభూషణ' - అని ఘనంగా పొగిడారు. జైపూరు పట్టణంవారు - 'అవధాన పంచాననా' అంటూ ఆనందంతో అందల మెత్తి ఊరేగించారు. ఇలా అనేక పట్టణాలలో అనేక విధాల కీర్తించి సత్కరించి ఆనందించారు అక్కడివారు. అంతేకాక వారికి స్వర్ణ కిరీటం, స్వర్ణకంకణాలు, స్వర్ణ పతకాలతో సత్కరించారు.వారు. బాలబ్రహ్మచారి గారు దివ్యాంగులైనప్పటికీ పెద్దవి, చిన్నవి కలిపి, మొత్తం 40 రచనలు చేసినారు. అందులో కొన్నింటి పేర్లను ఇక్కడ ప్రస్థావిస్తాను. :1.నాగ్నజితి పరిణయం :2.మహేంద్ర గర్వభంగం :3.సుగుణ వర్మోపాఖ్యానం మొ॥లగు కావ్యాలను వారు రాశారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |139| తేజోమూర్తులు}}</noinclude> csh8gv1r97kffwr0u7ro5pdrv6a0ae1 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/161 104 211339 552379 551162 2026-04-09T16:41:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552379 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> కొన్ని శతకాలను కూడా వెలువరించారు. :1. మన్నెంకొండ వెంకటేశ్వర శతకం :2. కొడంగల్ వెంకటేశ్వర శతకం :3. శంభులింగ ప్రభు శతకం :4. నామ లింగేశ్వర శతకం :5. శ్రీ రంగనాథ శతకం - వింటి శతకాలు రాసి శివ కేశవ తత్వాన్ని వారు తెలివినారనవచ్చు. :6. మౌన ప్రభు శతకం-ద్వారా వేదాంత జ్ఞానాన్ని వారు మనకందించినారనిపిస్తుంది. అలాగే :7. భారతీ శతకంతో సరస్వతి మాతను ఆర్పించారు. ఇంకా :వెంకటేశ్వర గీతావళి. :బసవ నక్షత్ర మాలిక :కలిమి - కాలిమి, :వజ్రసూచి, :చమత్కార దర్శిని గణితము, :బహుళార్ధ గీత పద్యము. ఏకాక్షరీ, ద్వక్షరి, త్రక్షరి, పంచాక్షరీ, సప్తాక్షరీ ఆకార, ఇకార, ఓకార పద్యములను, అనులోమ విలోమ, పద్యములను, చమత్కార పద్యములను చిత్రబంధ కవిత్వమును, గర్భ కవిత్వమును. ఆశుకవిత్వము, ఆశు పద్యాల నెన్నింటినో చెప్పి తరువాతితరం అవధానులెల్లరకు గొప్ప మార్గదర్శనం చేసి గొప్ప ఖ్యాతిని అర్ధించారు. శ్రీ శ్రీ బాల బ్రహ్మచారి గారు. ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆజన్మాంతం గౌరవ వేతనం అందించినాయి. చివరికి వారు 1983 ఏప్రిల్ 8వ తేదీన యావత్ సాహితీ లోకాన్ని త్యజించి శివైక్యం చెందారు. తెలంగాణ జాతికి శాశ్వత కీర్తి నందించారు. మేరు నగ సమానంగా తెలంగాణ కీర్తిని, జాతి పతాకనెగరేసి తెలంగాణ వైతాళికులో ఒకరిగావించిరి. దీని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహా సభలలో వారూ ఒక వెలుగు కిరణమై వెలగడం. యాపత్ ప్రజలకే అది గర్వకారణమని చెప్పవచ్చు.<noinclude><references/> {{rh|తెలంగాణ |140| తేజోమూర్తులు}}</noinclude> s42rbi1z0eme8d7n6wv0oxrqrsenvfj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/162 104 211340 552380 551163 2026-04-09T16:49:33Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''ఎదిరె చెన్నకేశవులు '''</p>}} {{right|- డా॥ భీంపల్లి శ్రీకాంత్}} పాలమూరు సాహిత్యంలో ఆణిముత్యాలనదగ్గ రచయితల్లో అగ్రగణ్యులు ఎదిరె చెన్నకేశవులు. కవిగా, కథా, నవలా, గేయ రచయితగా, జర్నలిస్టుగా, సంపాదకుడిగా, అనువాదకుడిగా, సహకార సంఘ ఉద్యమ నాయకుడిగా లబ్ద ప్రతిష్టులు. తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రముఖంగా పేర్కొనదగినవారు ఎదిరె చెన్నకేశవులు. మహబూబ్నగర్ పట్టణంలో ఆగస్టు 15, 1918న బాలకృష్ణమ్మ నారాయణమ్మ అనే దంపతులకు జన్మించారు. స్వయంకృషితో తెలుగు, ఆంగ్ల, ఉర్దూ భాషలలో తగు ప్రావీణ్యాన్ని సంపాదించారు. విద్యార్థి దశలోనే ఈ మూడు భాషలలో వెలువడు దినపత్రికలకు విలేకరిగా పనిచేశారు. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించి గోలకొండ ద్వైవారపత్రికకు సహాయ సంపాదకులుగా పనిచేశారు. మిలాప్ హిందీ పత్రికకు ప్రతినిధిగా కూడా కొంతకాలం పనిచేశారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ప్రచురించే 'నేత పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. చేనేత సహకార సంఘం నిర్వహణలో ముఖ్యపాత్ర పోషించారు. సహకార సమాచారం పత్రికకు సహాయ సంపాదకులుగా వ్యవహరించారు. చేనేత రంగంలో విశేష కృషి సల్పిన వారి గురించి 'చేనేత ప్రముఖులు' అనే గ్రంథాన్ని వెలువరించారు. 'సహకార సహజీవనం' అనే వ్యాససంపుటిని వెలువరించారు. ఎదిరె చెన్నకేశవులు మొదటగా గోపాలపేట సంస్థానంలోని హరిజన పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి వారి అభ్యున్నతికై పాటుపడ్డారు. ఎంతోమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. '''కథారచయితగా ''' తెలంగాణ తొలితరం కథల్లో లబ్ద ప్రతిష్టులు ఎదిరె చెన్నకేశవులు. ఆయన కథలు అనేక పత్రికల్లో ప్రచురిత మయ్యాయి. వీరి 'అభ్యుదయ రచయిత అన్న కథ సుజాత పత్రికలో 1950లో మొదటగా అచ్చయింది. అనంతరం రాసిన తొమ్మిది కథలతో 'పొట్టకోసం' అనే కథాసంపుటిని 1968లో వెలువరించారు. ఇందులో పర్యవసానం, కూలి వెంకన్న, ప్రతిఫలం, పొట్టకోసం, సహవాసం, ఉగాది, కార్మికులదే గెలుపు, నీ కోసం, గుణపాఠం వంటి కథలున్నాయి. '''పర్యవసానం ''' పొట్టకోసం కథా సంపుటిలో మొదటి కథ పర్యవసానం. ఈ కథలో రూప అనే అమ్మాయి డ్రామా ఆర్టిస్టుగా, ప్లే బ్యాక్ గాయకురాలిగా పనిచేస్తుంది. చంద్రహాసన్ అనే మేకఫ్ మేన్ ఆమెను లోబర్చుకోవాలనుకుంటాడు. ఆమె చంద్రహాసన్ ను తిరస్కరిస్తుంది. చంద్రహాసన్ రూపపై పగ సాధించడానికి ఆమెను పతిత అని దుష్ప్రచారం చేస్తాడు. అవమానాలు తట్టుకొని ప్రేమించిన వాడితో చివరికి పెళ్ళి<noinclude><references/> {{rh|తెలంగాణ |141| తేజోమూర్తులు}}</noinclude> 53xkqddurl2lz6qizi5365zr03x0vyf పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/51 104 211859 552386 552272 2026-04-09T23:07:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552386 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>దూరగామియగుచు, నేకాకియై చరించుచు, నశరీరియై హృదయస్థానంబున దాగియుండునట్టి చిత్తంబు నెవ్వాడు నిగ్రహించునో వాఁడు మారపాశ విముక్తుం డగును. {{float right|37}} చంచలచిత్తుండై, సద్ధర్మజ్ఞానహీనుండైన యెవని మనోవ్యాపారంబు లతిచంచలంబులో యట్టి వానిజ్ఞానము పరిపక్వముం జెందదు.{{float right|38}} ఎవ్వఁ డనాకులచిత్తుండై, పుణ్యపాపవిచారంబుఁ గావింపకుండునో, యెవ్వనిచిత్తచేష్టలు వ్యసనాసక్తములుకావో, జాగరూకతతోఁ బ్రవర్తించిన నట్టివానికి భయంబులేదు.{{float right|39}} దేహము అలింజరంబుభాతి భంగురంబని గుర్తెఱింగి, చిత్తంబును దుర్గంబువలె దృఢంబుగ నొనర్చి, మానవుండు జ్ఞానశస్త్రంబుచే మారునితోఁ బోరాడి జితుండగు నవ్వాని నీక్షించుచు నశ్రాంతుండై యుండవలయును. {{float right|40}} అచిరకాలంబుననే, అయ్యో! యీ దేహంబు త్యక్తంబై, ప్రజ్ఞాహీనంబై నిష్ప్రయోజనంబగు కాష్ఠఖండంబుభాతి భూతలంబునం బడును.{{float right|41}}<noinclude><references/> {{right|9}}</noinclude> 8nw3ha829lwpmdfjrz65drz27zgts49 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/52 104 211860 552387 552273 2026-04-09T23:15:57Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552387 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము}||}</noinclude>ద్వేషు లొండొరులకును, శాత్రవులు పరస్పరమును జేయు నపకారంబుకంటె నపమార్గ ప్రయుక్తంబగు చిత్త మెక్కుడు హాని నొనర్చును.{{float right|42}} సన్మార్గ ప్రయుక్తంబగు చిత్త మెక్కుడు మేలుంజేయును. జననిగాని జనకుఁడుగాని, తదితర బంధువుం డెవ్వండైనఁ గాని యంత యుపకారం బొనర్పనేరఁడు.{{float right|43}} {{rule|2cm}} {{p|fs125|ac}}నాల్గవ యధ్యాయము</p> {{rule|2cm}} '''సుమములు''' ఈలోకమును, సంతక సహచరదేవతా యుక్తం బగు యమలోకంబును నెవ్వాఁడు జయింపఁగలఁడు? నిపుణుఁడగు నెవఁడు స్వాభిలషితకుసుమముఁ గనుంగొనునట్లు సుదర్శిత సాధుమార్గంబును గనుఁగొనఁగలఁడు?{{float right|44}} నాశిష్యుఁడు భూలోకంబును, సంతక సహచరదేవతా యుక్తంబగు యమలోకమును జయింపఁగలఁడు. మతిమం<noinclude><references/> {{left|10}}</noinclude> nyz2vdvhl9yn5c6t6rbh4xdj8w56tnp 552388 552387 2026-04-09T23:16:34Z శ్రీరామమూర్తి 1517 552388 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>ద్వేషు లొండొరులకును, శాత్రవులు పరస్పరమును జేయు నపకారంబుకంటె నపమార్గ ప్రయుక్తంబగు చిత్త మెక్కుడు హాని నొనర్చును.{{float right|42}} సన్మార్గ ప్రయుక్తంబగు చిత్త మెక్కుడు మేలుంజేయును. జననిగాని జనకుఁడుగాని, తదితర బంధువుం డెవ్వండైనఁ గాని యంత యుపకారం బొనర్పనేరఁడు.{{float right|43}} {{rule|2cm}} {{p|fs125|ac}}నాల్గవ యధ్యాయము</p> {{rule|2cm}} '''సుమములు''' ఈలోకమును, సంతక సహచరదేవతా యుక్తం బగు యమలోకంబును నెవ్వాఁడు జయింపఁగలఁడు? నిపుణుఁడగు నెవఁడు స్వాభిలషితకుసుమముఁ గనుంగొనునట్లు సుదర్శిత సాధుమార్గంబును గనుఁగొనఁగలఁడు?{{float right|44}} నాశిష్యుఁడు భూలోకంబును, సంతక సహచరదేవతా యుక్తంబగు యమలోకమును జయింపఁగలఁడు. మతిమం<noinclude><references/> {{left|10}}</noinclude> tikmyb2jngbwtus27nmxm9cbz9a1hr2 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/53 104 211861 552389 552274 2026-04-09T23:25:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552389 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>తుండు సమ్యగ్దర్శిత ఋజుమార్గంబును, మాలాకరి యను గుణకుసుమంబులభాతి గనుంగొనఁగలఁడు.{{float right|45}} ఎవ్వాఁడు దేహంబు బుద్బుదప్రాయంబనియు మరీచికలవలె నిస్సారంబనియు గ్రహించునో వాఁడు మారపుష్ప సాయకభంజనంబుం గావించి యమలోకమునకుం జనఁడు.{{float right|46}} మహాప్రవాహము సుషుప్త జనగ్రామంబునుం బోలె యముఁడు పుష్పసంచయనముం గావించు భోగాసక్తుఁడగు నరునిఁ దీసికొనిపోవును.{{float right|47}} అంతకుఁడు పుష్పసంచయనముం గావించు విషయాసక్త చిత్తుండైన మనుజుని భోగానుభవంబునఁ దృప్తిఁగాంచక మున్నే వశీకరించును.{{float right|48}} భ్రమరంబు మధువును సంగ్రహించి కుసుమంబునకుఁ గాని, తద్వర్ణసౌరభములకుఁ గాని, హానియొనర్పకయ యెట్లు చనునో యట్లే ముని గ్రామంబున నివసింపవలెను.{{float right|49}} ఇతరుల వికారంబులను గాని, తదాచరణా౽నాచరణ ప్రభూతదోషములం గాని, సరకుగొనక ప్రాజ్ఞుండు నిజ దుష్కృతప్రమాదంబులనే గుర్తెఱుంగవలయును.{{float right|50}}<noinclude><references/> {{right|11}}</noinclude> gcmhikbsluehkso28ka41g2hxvq4ojs పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/54 104 211862 552390 552275 2026-04-09T23:35:52Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552390 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>సువర్ణ శోభితనిర్గంధకుసుమంబుభాతి ననాచరితంబు లగు రమ్యంపుఁబల్కులు నిష్ఫలంబు లగును.{{float right|51}} సువర్ణశోభితసుగంధకుసుమంబుభాతి నాచరితంబు లగు సుభాషణంబులు సార్థకంబు లగును.{{float right|52}} పుష్పసంచయంబునుండి యనేకమాలికలఁజేయ నెట్లనువగునో యట్లే మనుజునిచే సుకృతంబు లనేకములు కావింపనగును.{{float right|53}} కుసుమగంధంబును, నట్లే చందనతగరమల్లికాపరిమిళంబులును బ్రతివాతంబుగఁ జననేరవు; కాని సత్పురుషుల శీలసౌరభంబు ప్రతివాతంబుగఁ జనఁజాలును. సత్పురుషుండు సర్వవ్యాపి.{{float right|54}} శీలసౌరభంబు చందనతగరకమలవాసంతికేత్యాది గంధంబులచే ననతిక్రమంబు. చందనతగరవాసంతి కేత్యాదిగంధంబులు శీలసౌరభంబు నతిక్రమింపనేరవు.{{float right|55}} తగరచందనతరూద్భవంబగుగంధం బధమంబు. సచ్చరితులశీలగంధంబు పరమోత్కృష్టంబై దేవతల యున్నత స్థానమును జేరును.{{float right|56}}<noinclude><references/> {{left|12}}</noinclude> 19sd9kcqcg7dc0j333oym9qyzfgjpi3 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/55 104 211863 552391 552278 2026-04-10T01:13:07Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552391 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము.}}</noinclude>ఈసుగుణంబులఁగల్గి యప్రమత్తులై శుద్ధజ్ఞానంబుచే ముక్తులైనవారలను మారుం డను మోహకుండు చేరనేరఁడు.{{float right|58}} మార్గనిక్షిప్తావస్కరరాశిపై సుసౌరభయుక్తంబై, యామోదజనకంబగు పద్మంబెట్లు ప్రభవించునో, సుజ్ఞానియగు బుద్ధునిశిష్యుండు నిజజ్ఞానంబుచే నిస్సారద్రవ్యంబులఁబోలు నజ్ఞానతిమిరసంచారు లగు మనుజులలోఁ బ్రకాశించును.{{float right|59}} {{rule|2cm}} {{p|fs125|ac}}అయిదవ యధ్యాయము</p> {{rule|2cm}} '''మూర్ఖుఁడు''' మేల్కొని యున్నవానికి రాత్రిదీర్ఘము; శ్రాంతునకు యోజనమార్గమైనను దీర్ఘంబె. ధర్మపథంబు తెలియని మూఢునకు జీవనం బతిదీర్ఘంబు.{{float right|60}} పథికుండు తనకంటె నుత్తమునిఁగాని, తుల్యునిఁగాని కలియకుండినఁ దానొక్కఁడే ప్రయాణమును దృఢముగఁ గావించుకొనవలయును. కాని మూర్ఖునితో సాహచర్యముఁజేయరాదు.{{float right|61}}<noinclude><references/> {{right|13}}</noinclude> or9ii8ws4o6zq6el57w7z7f4agpdj7n పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/56 104 211864 552393 552279 2026-04-10T01:19:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552393 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>"వీరు నాకొడుకులు; ఈధనము నాది” అను నిట్టితలంపులచే మూర్ఖుడుం బాధింపఁబడుచున్నాఁడు. తానే తనకుఁ జెందకున్న పుడు ధనమునుబుత్రులును దనవా రెట్లగుదురు.{{float right|62}} తన యవివేకమును గుర్తెఱింగిన మూఢుండు కొంతవఱకుఁ బ్రాజ్ఞుండు. తాను బ్రాజ్ఞుండనని యూహించు మూర్ఖుండుమాత్రము నిశ్చయముగ మూర్ఖుండే.{{float right|63}} జూషరుచిని దెడ్డెఱుఁగకుండునట్లు పండిత సహవాసం బా జీవముఁ గావించినను మూర్ఖుండు ధర్మంబు నెఱుంగ నేరఁడు.{{float right|64}} జిహ్వ యూషరుచిని గనినట్లు బుద్ధిమంతుఁ డొక్కనిమేషమాత్రమైనను బండితునితోఁ గలిసియుండిన ధర్మంబు నెఱుంగఁగలఁడు.{{float right|65}} ప్రజ్ఞాహీనులగు మూర్ఖు లాత్మశత్రువులు; ఏలయన వారు పాపఫలం బొనఁగూర్చు దుష్కర్మల నాచరింతురు.{{float right|66}} దుఃఖరోదన కారణంబును, బశ్చాత్తాపకారకమును నగు కర్మ సుకృతంబు కానేరదు.{{float right|67}}<noinclude><references/> {{left|14}}</noinclude> rr405fdf0108bno3f31qx4qzhxmyhmm పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/57 104 211865 552396 552280 2026-04-10T01:27:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552396 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>ఎద్దానికై మనుజుండు పశ్చాత్తాపముఁజెందక దేనిఫలంబును సంతుష్టుండై యానందముతో ననుభవించు చున్నాఁడో యట్టికర్మ సుకృతంబు.{{float right|68}} ఆచరితంబగు పాపకర్మ ఫలింపకుండువఱకును మూర్ఖుండు దానిని మధువువలెఁ బరిగణించును; కాని కర్మఫలించుతరి నతఁడు దుఃఖమును జెందును.{{float right|69}} మూడుఁడు మాసములకొలదియుఁ గుశదళాగ్రంబున మునివలె భోజనంబుఁగావించినఁ గావింపనిమ్ము; ధర్మ విమర్శనంబుఁ గావించినవారి పదునాఱవభాగమునైన ననుసరింపలేఁడు.{{float right|70}} పాపకర్మం బచిరదుగ్ధంబగు క్షీరంబువలె శుక్తంబు కానేరదు. నిగురుకప్పిన నిప్పువలె లోన జ్వలించుచు మూర్ఖునినంటిచనును.{{float right|71} పాపకర్మంబు తెలియఁబడిన తరువాత, నది మూర్ఖునకు దుఃఖమును గలుగఁజేసి వానిభాగ్యము నశింపఁజేయును. అంతియకాదు; వానితలఁ బగులఁగొట్టును.{{float right|72}}<noinclude><references/> {{right|15}}</noinclude> m2h5jraaexqf153oq2fq29nbk7bma4x పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/58 104 211866 552397 552281 2026-04-10T01:37:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552397 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>మిథ్యాకీర్తిని, భిక్షుకులలో నగ్రతను, సంఘారామంబుల నాధిపత్యమును, జనులగౌరవమును, నవివేకునిఁ గోరనిమ్ము.{{float right|73}} “గృహస్థుఁడును, సన్న్యాసియు, నందఱును నిది మత్కృతంబని గుర్తెఱుంగనిమ్ము; కరణీయాకరణీయంబు లన్నిటియందును, నాయాజ్ఞానువర్తులై యందఱు నుందురుగాక;” అని మూర్ఖుఁ డూహించును. వానికిఁ గామంబును గర్వంబును వృద్ధిఁజెందును.{{float right|74}} “ఒకమార్గము ధనమునకు దారిఁజూపును. మఱియొకటి నిర్వాణమునకుఁ గొనిబోవును”. అను దీనిని బుద్ధశిష్యుఁడగు భిక్షువు గ్రహించిన నతఁడు యశము నభిలషింపక ప్రపంచముననుండి తద్వియోగమునకై యుద్యమించును.{{float right|75}} భవదీయదోషప్రదర్శకుని నిక్షేపప్రదర్శకునిభాతిఁ బూజింపుము. ఆయుక్తమార్గములం జొరనీక మందలించుచు యుక్తపరివాదం బొనర్చు విబుధుని సేవింపుము. అట్లువాని ననుసరించువానికి శుభంబగుఁగాని యశుభంబుకానేరదు.{{float right|76}} అట్టివాని నుపదేశింపనిమ్ము; బోధఁ గావింపనిమ్ము; అనుచితంబగుదానిని నిషేధింపనిమ్ము; అట్టివాఁడు సాధుప్రియుండును, దుష్టవిద్విష్టుండును నగును.{{float right|77}}<noinclude><references/> {{left|16}}</noinclude> mmm8d5owyd14x03i4uhya5qm7olkcvw పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/59 104 211867 552399 552283 2026-04-10T01:45:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552399 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>ఖలులతో స్నేహింపకుము. నీచులతో సహవాసముఁ చేయకుము. సచ్చరితులతోఁ జెలిమిఁ గావింపుము. పరమోత్తములను స్నేహితులుగాఁ గైకొనుము.{{float right|78}} ధర్మసేవఁ గావించువాఁడు ప్రసన్నమనస్కుఁడై జీవించును. సిద్ధుం డార్యులచే బోధితంబులగు ధర్మములచే సంతుష్టుండగును.{{float right|79}} కూపఖనకులు కామితప్రదేశమున కుదకంబును గొంపోవఁగలరు. బాణకారులు నారాచంబుల భుగ్నంబుగ నొనర్పఁగలరు. రథకారులు తరుఖండంబును వక్రముగఁ జేయఁగలరు. ప్రాజ్ఞు లాత్మనిర్మాతలు.{{float right|80}} ప్రవాతంబుచే సుదృఢంబగు శిల యకంపితం బగునట్లు ప్రాజ్ఞులు నిందలచేతను స్తోత్రములచేతను స్ఖలితులు కారు.{{float right|81}} ప్రాజ్ఞులు ధర్మబోధలగ్రహించి గభీరతరంగరహిత కాసారంబుభాతి నిరుద్వేగులై యుందురు.{{float right|82}} సత్పురుషు లేమితటస్థించినను సరకుఁగొనక సుఖకాములై ప్రలాపింపరు. సుఖప్రాప్తిచే నుత్సాహ యుక్తులుగను, దుఃఖకలనచే ఖిన్నులుగను గాన్పింపరు.{{float right|83}}<noinclude><references/> {{right|17}}</noinclude> tkj847ygeww6pa9z6h8whzg8ij9l4yt పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/60 104 211868 552400 552284 2026-04-10T01:54:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552400 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>ఎవ్వాఁడు స్వార్థపరార్థములకుఁగాను ధనమునుగాని, పుత్రునిఁగాని, సామ్రాజ్యమునుగాని, యనృజుమార్గాను సరణమున జయము నభిలషింపఁడో వాఁడే సచ్చరితుఁDu; వాఁడే విబుధుఁడు.{{float right|84}} పారగాములగువారు నరులలో నత్యల్పసంఖ్యాకులు. మిగిలినవా రొడ్డున నిటునటుఁ బరుగులిడుచుందురు.{{float right|85}} ఎవ్వరు ధర్మబోధానంతరమున దాని నాచరింతురో వారు దుస్తరంబగు మృత్యులోకమును దాటుదురు.{{float right|86}} ప్రాజ్ఞుం డంధకారబంధురంబగు సాధారణ సంసారంబును బరిత్యజించి, ప్రకాశవంతమగు భిక్షుజీవనంబును బరిగ్రహింపవలెను. సంసారమునువిడిచి సన్న్యసించి, యట్టి సంసారవిరామంబున సౌఖ్యదాయకంబుగఁ గనుపింపని వానినుండి సౌఖ్యంబును బరిగ్రహింపవలెను. సౌఖ్యంబులఁ బోవిడిచి, స్వకీయంబని యెద్దానిని నుడువక ప్రాజ్ఞుండు మనస్సంతాపములను బోఁగొట్టుకొనవలెను. {{float right|87,88}} ఎవ్వానిచిత్తము జ్ఞానాంగంబుల సుశిక్షితంబో, యెవ్వార లెదానినైన నాశ్రయింపక యట్టి రాగరాహిత్యంబున<noinclude><references/> {{left|18}}</noinclude> o8wfnmshq1andbz6rjj6qw4q6ru236d పుట:పటం కతలు.pdf/88 104 211879 552503 552296 2026-04-10T04:29:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552503 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||71}}</noinclude> '''కాకివడిగెల కులోత్పత్తి ''' పూర్వం ముదిరాజ్ వాళ్లలో ఐదుగురు అన్నదమ్ములు కలిసి పెందోట వనం చేసి ఆ వనానికి ఈ ఐదుగురు అన్నదమ్ముల్ని కావలి (కాపలా) ఉంచారు. అయితే ఒకరోజు అవుసలీ బ్రహ్మ (కంసాలి) పండ్లు పెట్టమని వీరి తోటకు వచ్చాడు. అతనికి పండ్లు పెట్టలేదు. దీనితో అవుసలి బ్రహ్మకు కోపం వచ్చి ఒక బంగారు కాకిని చేసి ప్రాణం పోసి పెందోట వనంలోని పండ్లన్నీ పాడు చేయడానికి తోట మీదకి పంపించాడు. ఆ కాకి పెందోట వనంలోని పండ్లన్నీ తింటూ పాడుచేస్తుంటే ఆ ఐదుగురు ముదిరాజ్లకు కోపం వచ్చింది. అందులో చిన్నోడు ఒక బాణం తీసి ఆ కాకికి వేస్తే అది రెక్కలు విరిగి పడిపోయింది. అమ్మకు కోపం వచ్చి "ముదిరాజ్ వాళ్లం, మనం మాంసం తినేవాళ్లం కాదు. సూరుణ్ని చూసి సుక్కబొట్టు పెట్టం, చంద్రున్ని చూసి చంద్రవంక పెట్టం, వరాహావతారం (పంది) ఎదురొచ్చిందంటే ఏడు నూతుల్లల్ల స్నానం చేసి వచ్చేవాళ్లం. అట్లాంటి నీవు కాకిని చంపి కాకిని పట్టుకొని వచ్చినావు కాబట్టి కాకిపగిడెల వానిపై పక్కకుండాలి అని శపించింది. దానితో అమ్మా! నీవు శపించావు కాబట్టి నేను పక్కకే ఉంటాను అని అన్నం తినకుండా పక్కకుంటే అయ్యో కొడుకు అన్నం తినడం లేదని కొడుకా ! ఎన్నిరోజులు ఇట్ల అన్నం తినకుండా పక్కకుంటావు బిడ్డా అని అన్నం తీసుకుపోయి అన్నం పెడుతుంది. అప్పుడు అమ్మా! నీవు పక్కకు కూర్చొని అన్నం పెట్టినావు కాబట్టి నీ ఇంట్లో నాకు అన్నం సొత్తు ఉంటుంది. నీవు తెచ్చిపెడితేనే తినాలి కాని.. నేను నీ ఇంట్లోకొచ్చి తినను. అంటే అప్పుడు ఆ తల్లి మన ఇండ్లళ్ల ఎవరైనా పుడితే పురుడు కట్నం, చస్తే చావుకట్నం నీకు ఇస్తం అని కట్టుచేసి పాండవులంటే మనకిష్టము కదా ! వాళ్లకు సంబంధించిన వృత్తాంతము చెబుతూ మమ్ముల్ని అడుక్కొని బ్రతుకు బిడ్డా అని చెప్పింది. అప్పటి నుంచి కాకిపడిగెల వాడై పాండవుల కథ చెబుతూ జీవనం గడుపుతున్నాడు.<noinclude><references/></noinclude> bbvl0osil3l1owc4iryfkn7ikx26pcg పుట:పటం కతలు.pdf/89 104 211880 552504 552297 2026-04-10T04:33:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552504 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|72||పటం కతలు}}</noinclude> ఇట్లా కొంతకాలానికి ఊరికే నోటితో చెప్పితే సరిగా అర్ధమయితలేదని గుడ్డ మీద మహాభారతానికి సంబంధించిన బొమ్మలు వేయించి బొమ్మలు చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదేవిధంగా కథ చెబుతూ ముదిరాజ్ వాళ్లను త్యాగం / తేగం అదుక్కొని జీవిస్తున్నారు. '''దేశాల మీదకు పోయే ముందు చేసుకునే అనుష్టానం ''' దసరా పండుగ వెళ్లిన తర్వాత తమతమ మేళాలను సమకూర్చుకొని దేశాల మీదికి పోయే ఒకరోజు ముందు ఎవరికి వారు తమ ఇంట్లో పెద్దమ్మ పండుగ చేస్తారు. ఆ రోజు ఇల్లు శుభ్రంగా అలుక్కొని అందరూ స్నానాలు చేసి ఇంట్లో నైరుతీ దిశలో రెండు కట్టెలు పాతి తూర్పుకు ముఖం ఉండేవిధంగా పటంకట్టి, పటంలో ఉండే పెద్దమ్మ బొమ్మను తీసి పాలతో వండిన పరమాన్నం బదులుగా పెడతారు. ఈ పదులు పెద్దమ్మకు, ఐదుగురు పాండవులకు, కృష్ణదేవునికి పెట్టి ఊదిఐత్తీలు ముట్టించి, పప్పు ఫలహారం ఆరగింపు చేసి, కొబ్బరికాయ కొట్టి పెద్దమ్మకు మొక్కుతారు. అవ్వా ! పెద్దమ్మ తల్లి ! మేము దేశాల మీదికి పోతున్నాము. మమ్మల్ని చల్లగ చూడాలి. మా పిల్లల్ని మంచిగ చూడాలి. మాకు ఏ హాని కలగకుండా చూడాలి' అని మొక్కి కోడిని లేదా ఏటను కోస్తారు. తర్వాత పదులను కుటుంబ సభ్యులు తింటారు. తర్వాత ఆ కోసిన కోడి లేదా ఏట మాంసం వండుకొని ముందుగా ఒక డొప్పలో ఆయాలు సాయాలు (ముఖ్యమైన భాగాలు) పెద్దమ్మ దగ్గర పెట్టి ఆరగింపు చేసి ఆ తర్వాత తింటారు. సాయంత్రం సమయంలో పటం చుట్టి జాగ్రత్తగా పెడతారు. ఈ విధంగా చేసిన తెల్లారి పొద్దున్నే లేచి మూటాముల్లె సర్దుకొని మద్దెల, హార్మోనియం పట్టుకొని మేళం మొత్తం ముందుగా అనుకున్న ఊరికి పోతారు. ఊరికిపోయి ముందుగా కులపెద్ద ఇంటికిపోయి నమస్కరించి ఆయన ఇంటి దగ్గర వీళ్ల సామగ్రి పెట్టి' అయ్యా ! మీ ఆడివాళ్లమొచ్చినాము. మేము ఇంత మందిమి వచ్చినాము. మాకు భోజన వసతి, ఉండటానికి ఇల్లు వసతి<noinclude><references/></noinclude> i33ckur8ghhm6ephaw7zwvm5f7qz116 పుట:పటం కతలు.pdf/90 104 211881 552505 552298 2026-04-10T04:38:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552505 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||73}}</noinclude> కల్పించాలని కోర్తారు. ఆ కులపెద్ద సరే అని కులం వాళ్లందరికీ తెలియజేసి భోజన వసతి ఏర్పాటు చేస్తారు. ఉండటానికి కులపెద్ద ఇంటి దగ్గర చోటు లేకుంటే వేరే ఇళ్లలో వసతి కల్పిస్తారు. అంతకు వసతి లేకుంటే వీళ్లే ఒక గుడారం ముదిరాజ్ ఇండ్ల సమీపంలో వేసుకొని ఉంటారు. ఈ సమయంలో వీళ్లకు రోజుకు ఒకరు బియ్యం, ఉప్పు, పప్పులు ఇస్తారు. కథ చెప్పినన్ని రోజులు కల్లు లేదా సారాకు కూడా డబ్బులిస్తారు. '''త్యాగం నిర్ణయించుకునే విధానం ''' వీళ్లు పోయి కలిసిన తెల్లారి కులపెద్ద అందరినీ కూడగడతాదు. కాకిపడిగెల వాళ్లు ఒక చాపవేసి అందులో మద్దెల, హార్మోనియం, పటం పెట్టి వచ్చిన వాళ్లందరికీ బొట్టుపెట్టి కూర్చుని మద్దెల, హార్మోనియం సహాయంతో మహాభారతానికి సంబంధించిన పాటలు పాడి వినిపించిన తర్వాత ముదిరాజ్ వాళ్లు అందరూ కలిసి ఆలోచించుకుని త్యాగం నిర్ణయం చేస్తారు. తర్వాత ముదిరాజ్ వాళ్లను పొగుడుతారు. ఫలానా గ్రామం ముదిరాజ్ సంఘం వాళ్లు మనకు త్యాగం / ఫలానా ఇంత దయతలచి ఇస్తున్నారు కావున వాళ్ల కుటుంబం భార్యాబిడ్డలు సల్లగ ఉండాలి. పెద్దమ్మ దీవెన కలిగి అందరూ శుభంగా ఉండాలి. జయీ భవ, విజయీభవ అని అట్లాగే పంచపాండవుల మరియు కృష్ణదేవుని కృప వల్ల అందరూ మంచి గుండాలే జయీ భవ, విజయీభవ అని పొగుడుతారు. అయితే వీళ్లకు ఒప్పుకున్న త్యాగం ఎన్ని ముదిరాజ్ ఇండ్లయితే ఉంటాయో ఆ ఇండ్ల వాళ్లు వాళ్ల ప్రకారం చేసుకొని ఇస్తారు. '''ప్రదర్శనా విధానం ''' కాకిపడిగెల వారు త్యాగం నిర్ణయించేసుకున్న తర్వాత మంచిరోజు చూసి కథ ప్రారంభిస్తారు. '''సమయం ''' కాకిపడిగెల వారు సాధారణ పటం కథను మధ్యాహ్నం పూటనే చెబుతారు. అంటే ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించి ఐదు గంటల వరకు ముగిస్తారు.<noinclude><references/></noinclude> lre22heodtoj2iu1u3c7vqei7gx5dot పుట:పటం కతలు.pdf/91 104 211882 552507 552299 2026-04-10T04:42:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552507 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|74||పటం కతలు}}</noinclude> కళ్లాల సమయంలోనైతే గ్రామప్రజలు పొద్దందాక పనుల మీద ఉంటారు కాబట్టి ఆ సమయంలో రాత్రిపూట చెబుతారు. '''సంధర్భం''' కాకిపడిగెల వారు దసరా పండుగ వెళ్లిన తర్వాత బయలుదేరి రోహిణి కార్తె ప్రవేశం వరకు దేశాల మీద ఉండి కథలు చెబుతారు. వారి హక్కుల గల గ్రామాలు తిరుగుతూ త్యాగం / తేగం కట్టడి తీసుకుంటూ కథలు చెబుతారు. కాకిపడిగెల వారు పటం కథతో పాటు... కొన్ని యక్షగానాలు, నాటకాలు కూడా వేస్తారు. పటం కథ చెప్పిన తర్వాత ముదిరాజ్ వాళ్ల కోరిక మేరకు డబ్బులు తీసుకొని నాటకాలు వేస్తారు. '''ప్రదర్శించే రోజులు - కథలు ''' వీరు పటం కథ ముదిరాజ్ వాళ్ల ఇష్టానుసారం ఐదురోజులు / తొమ్మిది రోజులు చెబుతారు. ఐదురోజులు చెబితే ఐదురోజులకు కథ చెప్పి ఐదవ రోజు సాయంత్రం పెద్దమ్మ పండుగ చేస్తారు. తొమ్మిది రోజులు చెబితే తొమ్మిదవ రోజు కథ చెప్పి ఆరోజు సాయంత్రం పెద్దమ్మ పండుగ చేస్తారు. :ఐదురోజులు పటం కథ చెబితే సాధారణంగా :మొదటిరోజు సహదేవుని కల్యాణం, :రెండోరోజు సుభద్ర కల్యాణం, :మూడోరోజు గరిమళ్లకోట, :నాల్గవ రోజు ఆదిపర్వము, :ఐదోరోజు సభాపర్వం చెబుతారు లేదా ఇవేకాకుండా ముదిరాజ్ వాళ్లు మహాభారతంలోని వేరే ఏ కథ చెప్పమన్నా ఆ కథ చెబుతారు. ఇక తొమ్మిది రోజులు పటం కథ చెప్పినట్లయితే -<noinclude><references/></noinclude> pohpkftorpyh8fm4vuv6dokt1rnmser పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/18 104 211885 552360 552353 2026-04-09T12:01:39Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552360 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము - విజ్ఞాపనము</p>}} జాతీయ పునర్నిర్మాణము జాతీయ వికాసవ్యాప్తిని బట్టి పెంపొందునని లోకమెల్ల బాగుగా గుర్తించినది వికాసవ్యాప్తికి ప్రధానాధారము గ్రంథాలయమగుట సర్వజనాంగీకృతమే. కాబట్టి దేశ క్షేమమును కోరు సర్వోద్యమములకును పునాదిగా ఏర్పడఁదగినది గ్రంథాలయో ద్యమమే. దీనిదే ప్రధాన నిర్మాణ కార్యక్రమము. దీనిని భారతభూమిలో కొంతవిరివిగా మొట్టమొదట సాగించిన ప్రాంతములు ఆంధ్ర దేశము, బరోడా సంస్థానము. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము 1914 లో ప్రారంభమైనది. బరోడా లోని యుద్యమము రాజాశ్రయమున త్వరత్వరగా పెరిగి, విజృంభించినది. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమును జనాశ్రయమున మెలమెల్లగా సభివృద్ధి నొందినది. కాని ఆకాశవిమాన వేగము తోను రేడియో విద్యుత్ప్రణ వేగముతోను నడచునట్టి యుగమున మన యుద్యమమును బలవత్తరముగా సాగించుట అత్యవసరము ఆంధదేశ గ్రంథాలయ సంఘము తల పెట్టిన కార్యక్రమమునకు సేవాతత్పరు లనేకులుకావలసి యున్నారు. కార్యక్రమ వివరణములీ క్రింద నిచ్చుచున్నాము. ౧. ప్రజాసామాన్యము నందు విజ్ఞాన వ్యాప్తి చేయుటకును అక్షరాసభిజ్ఞతను రూపుమాపుటకును తగిన ప్రబోధము కలిగించు కరపత్రములు, పోస్టరులు ధర్మగ్రంథాలయ ప్రయోజనమును తెలుపు చిన్ని పొత్తములు గ్రంథములు ప్రకటించుట. ౨. గ్రంథాలయ శాస్త్ర బోధకములును, విజ్ఞాన వికాస సహకారులునునగు వ్యాసములతో గ్రంథాలయ సర్వస్వపత్రికను ప్రకటించుట. 3. రాష్ట్ర, మండల, తాలూకా, గ్రామ సమావేశములు, సభలు, యాత్రలు జరుపుచు, సంఘములు స్థాపించుచు, బొమ్మల లాంతరు, సంచార గ్రంథాలయములు మొదలగు సాధనముల మూలకముగా వైజ్ఞానిక ప్రచారము చేయుట. ౪. విజ్ఞాన శాఖలయందు శిక్షణము పొంది గ్రంథాలయ శాస్త్రమునందును సుశిక్షితులైన నిత్యసేవక బృందము నేర్పఱచి, గ్రంథాలయోద్యమాదర్శముల నమలులో పెట్టుట. ౫. ఆంధ్ర దేశమున కంతటికీని కేంద్ర గ్రంథాలయమును స్థాపించుట, అదేరీతి మండల గ్రంథాలయములను స్థాపించుట. ఈ సందర్భమున నొక విషయమును కృతజ్ఞతా పూర్వకముగా ప్రకటించుచున్నాము. ఉదారులగు కొందఱు గ్రంథ ప్రకాశకులు కేంద్ర గ్రంథాలయమునకును మండల గ్రంథాలయమునకును ధర్మార్ధముగా గ్రంథముల నిచ్చుట కంగీకరించినారు. ౬. పబ్లిక్ లైబ్రరీ పరిపాలన శాస్త్ర విధులను ఆచరణమువలన పరిపాకమునకు తెచ్చుట. బరోడాలో ఏర్పడి, గుజరాతు మహారాష్ట్రములలో కొన్ని సంవత్సరముల తరబడిని అమలులోనికి వచ్చిన గ్రంథ వర్గీకరణ విధానమును తెలుగునకు సరిపఱచి నిర్మించితిమి. గ్రంథాలయ శాస్త్ర శిక్షణమునకు పాఠవిధాన మేర్చఱచి 1934 జూనులో బెజవాడ<noinclude><references/></noinclude> gt4jtu91fy28yn6rl6k23zhv815vt9m పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/19 104 211886 552361 2026-04-09T12:27:08Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552361 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యందు శిక్షణమిచ్చితిమి. ౨౪ గురు అభ్యర్థులను పరీక్షించి వారికి యోగ్యతాపత్రము లిచ్చితిమి. ఈ శాస్త్ర విషయక పాఠ్యగ్రంథములు లేనికొరత ఈయనుభవమువలన తెలియవచ్చినది. అట్టి గ్రంథ సామగ్రి సిద్ధము చేయించుటకు పూనుకొనినాము, ౭. దేశములోని పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు రోగులు అంగవికలులు విద్యార్థులు, ఉపాధ్యాయులు వ్యాపారస్థులు, కర్మకరులు మున్నగు నెల్లరకు వారివారికి తగినరీతిని విరివిగా అన్నిరకముల గ్రంథాలయములు స్థాపింపించి నడపించుట. ౮. చదువులేక గ్రామములలోని నూటికి తోంబది మంది చొప్పుననున్న మన సోదరుల కాలోసమును తుడిచి వేయుటకు మార్గాన్వేషణము చేయ పరిశ్రమించుట. ౮.౨౦ వ మద్రాసు రాష్ట్రీయ సహకార మహాసభవారు, సహకార సంఘముల క్షేమనిధి నుండి ద్రవ్యము వెచ్చించి సహకార విషయ జ్ఞానమును ఇతరవిజ్ఞానమును కలిగించు గ్రంథాలయములు నెలకొల్పి ఇతర మార్గములనుగూడ సర్వజన విద్యావ్యాప్తికి తోడ్పడవలెను. గ్రంథాలయ నిర్మాణ వ్యాప్తులకై చెన్న రాష్ట్రములో ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమును మద్రాసు సంఘమును చేయుచున్న కృషి ప్ర్రశంసింపదగిన దనియు, కో ఆపరేటివు సంస్థలు పై సంఘములలో తమతమ ప్రాంతము ననుసరించి సభ్యులుగా చేరే, గ్రంథాలయపోషణ నిర్వహణములకు వాని సేవ నుపయోగించు కొనవలసినదని సలహా చేయుచున్నామనియు, తీర్మానించిరి. ౧౯౧౮ వ సంవత్సరమాదిగా మా సంఘము చేసిన ప్రచారమువలన ఈ క్రింది లాభములు చేకూరినవి. అవి లభించుటకు మాకు తోడ్పడిన యందఱకును కృతజ్ఞులము. ౧ గ్రంథాలయములకు స్థానిక సంస్థలు విరాళములియ్య వీలులేదని నిరోధింప నుద్యుక్తులగు చుండిన మద్రాసు ప్రభుత్వము వారు తామే లైబ్రరీ గ్రాంటు లిచ్చుచు వానిని స్థానిక సంస్థల ద్వారా పంచి పెట్టించుచున్నారు. ౨ ఈ ఆంధ్ర గ్రంథాలయ సంఘము వారు ఏర్పరిచిన అఖిలభారత గ్రంథాలయ మహాసభను మద్రాసులో జరిపిన పిదప, దేశ రాష్ట్ర మండల గ్రామసమావేశము విరివిగా జరిగి, గ్రంథాలయోద్యమమునకు బలముకలిగి అభిమానము ప్రబలజొచ్చినది. విరివియగు అభిమాన ముదయించినందున దీక్షాబద్ధనిబిడ ప్రయత్నము అవసర మైనది. ఇదిగాక గుంటూరు, నరసారావుపేట. ఒంగోలు, కర్నూలు, బెజవాడ మొదలగు మునిసిపాలిటీలును, పడమటి గోదావరి, గుంటూరు కర్నూలు జిల్లా బోర్డులును గ్రంథాలయోద్యమమును తామే నిర్వహించుటకు నడుముగట్టినవి. కృష్ణా జిల్లాబోర్డు వారు కొంత ఉదారమగు విరాళమీయ నారంభించి మార్గదర్శకులైనారు. ఇంతటి కార్యక్రమము ద్రవ్యములేక జరుగదు. కాబట్టి దేశములోని సహకార సంఘములు, మునిసిపాలిటీలు, జిల్లాబోర్డులు, పంచాయతులు, పాఠశాలలు, కళాశాలలు, అన్ని విధములగు గ్రంథాలయములు, ఇతర సంస్థలు మాకు తోడ్పడి, మమ్ములను కృతకృత్యులను గావింప<noinclude><references/></noinclude> e02uh0osil1jf4uvs9dxqbzsc3z6nav ధమ్మపదము 0 211887 552362 2026-04-09T12:54:55Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ధమ్మపదము]] | రచయిత = కిళాంబి రంగాచార్యులు | అనువాదం= | విభాగము =ముఖపత్రం | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Kanknamu020631mbp.pdf" from=1 to=19 /> {{PD-India}}' 552362 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ధమ్మపదము]] | రచయిత = కిళాంబి రంగాచార్యులు | అనువాదం= | విభాగము =ముఖపత్రం | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Kanknamu020631mbp.pdf" from=1 to=19 /> {{PD-India}} 9imzndcpj3fwctogknfmui0nxvi26ir 552364 552362 2026-04-09T12:56:13Z Rajasekhar1961 50 552364 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ధమ్మపదము]] | రచయిత = కిళాంబి రంగాచార్యులు | అనువాదం= | విభాగము =ముఖపత్రం | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1927 }} <pages index="Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf" from=1 to=11 /> {{PD-India}} dxjlh0yd0jpftsuic4nssp1fhrqmcok పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/20 104 211888 552363 2026-04-09T12:55:39Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552363 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>వలెనని కోరుచున్నాము. మాకు తోడ్పడు మార్గములు రెండు. ౧ మాసంఘములో సభ్యులగుట, * ౨ జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమమున ప్రధాన భాగమయిన యీ యుద్యమమునకు భూరివిరాళములిచ్చుట. ఈ మహోద్యమమునకు తప్పక తోడ్పడి; ప్రోత్సహింతురని ఆశించుచున్నాము. 3-౪-3౭ బెజవాడ. {{right|గాడిచెర్ల హరిసర్వోత్తమరావు}} {{right|మారేపల్లి రామచంద్రశాస్త్రి}} {{right|అయ్యంకి వేంకటరమణయ్య}} {{rule |em }} * సంస్థలకు సం॥నకు సభ్యత్వపు చందా రు ౪ లు, వ్యక్తులకు సం. నకు చందా జీవితపు చందా రు. ౩ లు '''రాజపోషకులు''' ఈ సంఘమునకు గాని, అనుబంధ సంస్థలకు గాని రు ౨౫౦౦ ల విరాళము దయ చేయువారు. '''ప్రధాన పోషకులు''' పైరీతినే రు ౧౦౦౦౦ లు మొ ౨౫౦౦౦ ల వఱకు విరాళము దయ చేయువారు. '''పోషకులు''' సంవత్సరమునకు రు ౧,౦౦౦ లు విరాళము దయ చేయువారు.<noinclude><references/></noinclude> g7cq3idvteyotwuu9tst6xsk5n50pgu 552365 552363 2026-04-09T12:58:30Z Brjswiki 6801 552365 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>వలెనని కోరుచున్నాము. మాకు తోడ్పడు మార్గములు రెండు. ౧ మాసంఘములో సభ్యులగుట, * ౨ జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమమున ప్రధాన భాగమయిన యీ యుద్యమమునకు భూరివిరాళములిచ్చుట. ఈ మహోద్యమమునకు తప్పక తోడ్పడి; ప్రోత్సహింతురని ఆశించుచున్నాము. 3-౪-3౭ బెజవాడ. {{right|గాడిచెర్ల హరిసర్వోత్తమరావు}} {{right|మారేపల్లి రామచంద్రశాస్త్రి}} {{right|అయ్యంకి వేంకటరమణయ్య}} {{rule |em }} * సంస్థలకు సం॥నకు సభ్యత్వపు చందా రు ౪ లు, వ్యక్తులకు సం. నకు చందా జీవితపు చందా రు. ౩ లు '''రాజపోషకులు''' ఈ సంఘమునకు గాని, అనుబంధ సంస్థలకు గాని రు ౨౫౦౦ ల విరాళము దయ చేయువారు. '''ప్రధాన పోషకులు''' పైరీతినే రు ౧౦౦౦౦ లు మొ ౨౫౦౦౦ ల వఱకు విరాళము దయ చేయువారు. '''పోషకులు''' సంవత్సరమునకు రు ౧,౦౦౦ లు విరాళము దయ చేయువారు. {{rule |6em }}<noinclude><references/></noinclude> 4hpn9d78kxr2qojpx3cd10j6v8eoe6x 552367 552365 2026-04-09T13:23:54Z Brjswiki 6801 552367 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>వలెనని కోరుచున్నాము. మాకు తోడ్పడు మార్గములు రెండు. ౧ మాసంఘములో సభ్యులగుట, * ౨ జాతీయ పునర్నిర్మాణ కార్యక్రమమున ప్రధాన భాగమయిన యీ యుద్యమమునకు భూరివిరాళములిచ్చుట. ఈ మహోద్యమమునకు తప్పక తోడ్పడి; ప్రోత్సహింతురని ఆశించుచున్నాము. 3-౪-3౭ బెజవాడ. {{right|గాడిచెర్ల హరిసర్వోత్తమరావు}} {{right|మారేపల్లి రామచంద్రశాస్త్రి}} {{right|అయ్యంకి వేంకటరమణయ్య}} {{rule |em }} * సంస్థలకు సం॥నకు సభ్యత్వపు చందా రు ౪ లు, వ్యక్తులకు సం. నకు చందా జీవితపు చందా రు. ౩ లు ::జీవిత చందా రు. ౧౦౦ లు '''రాజపోషకులు''' ఈ సంఘమునకు గాని, అనుబంధ సంస్థలకు గాని రు ౨౫౦౦ ల విరాళము దయ చేయువారు. '''ప్రధాన పోషకులు''' పైరీతినే రు ౧౦౦౦౦ లు మొ ౨౫౦౦౦ ల వఱకు విరాళము దయ చేయువారు. '''పోషకులు''' సంవత్సరమునకు రు ౧,౦౦౦ లు విరాళము దయ చేయువారు. {{rule |6em }}<noinclude><references/></noinclude> hpxlwtdsy74qkar27torvs1ojbp492q పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/23 104 211889 552369 2026-04-09T14:02:50Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552369 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ఖద్దరుసంస్థానము - గుణదల</p>}} {{Center|{{p|fs125}}ఆదర్శ గ్రంథాలయ ప్రారంభోత్సవము</p>}} ఆదర్శ గ్రంధాలయ ప్రారంభోత్సవము ది ౨౪-3-3౭ తేదీని పైగ్రంథాలయ ప్రారంభోత్సవమున అధ్యక్షత వహిఁచిన శ్రీయుత మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు ఇట్లు ఉపన్యసించిరి: ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము ౧౯౧ర సం॥ మున నెలకొల్పబడి గ్రంధాలయోద్యమమును నడపుచున్నది. అసంఘ కృషి విశేషములు గ్రంథాలయ సర్వస్వములో ప్రకటింపబడుచున్నవి. ఆ కృషికి ఫలముగా ఇప్పటికి ఆంధ్రదేశములో గ్రామములలో సుమారు ౫౦౦ గ్రంథాలయములను, పట్టణములలో సుమారు ౩౦౦ గ్రంథాలయములును ఏర్పడి యధాశక్తిని పని చేయుచున్నవి. ధనవంతులును, విజ్ఞానవంతులును, స్థానిక సంస్థలును, సాయము చేయుటచే పట్టణములలోని గ్రంథాలయములు పొందుచున్న అభివృద్ధిని పట్టిచూడ గ్రామాదులలోని అభివృద్ధి తక్కువయని చెప్పక తప్పదు. అయినను, కొన్ని గ్రంథాలయములు ఊళ్లలో కూడ వానికి తగినట్లు పని చేయుచునే యున్నవి. కాని ఆపని మొత్తము మీద చూచినచో చాల తక్కవ. మనదేశములోని ప్రజలలో నూటికి ౯O మంది గ్రామములలో ఉన్నారను విషయము మనము ఎప్పుడును ఏ సందర్భములోను మఱవరాదు. ఏ ఉద్యమములో నైనను మనదేశములో గ్రామాదులను వదలి పట్టణవాసులు ఫలప్రదముగా నడపగలుగుదురని ఊహించుట యెనను పొరపాటే. మన దేశమున గ్రామముల పరిస్థితులు తెలిసికొనక గొప్ప ఉద్యమమును ఎంత గొప్పవారు ప్రారంభించినను అది విఫలమగునని చరిత్ర చాటుచున్నది. విజ్ఞానవంతులును, పట్టణవాసులును తమకు గల సాధన సంపత్తితో తమంతట తాము కొన్ని ప్రత్యేక సందర్భములలో తమ ప్రయత్నములు ఫలించెనని సంతోషపడ గలిగినను గ్రామాదులను కూడ తమతో కలుపుకొని రాగలమను ధైర్యము కలిగినప్పుడే వారికృషి సరిగా ఫలింపగలదని నాతలంపు. మన దేశములో ఉన్న ప్రత్యేక పరిస్థితులలో మనలోని విజ్ఞానవంతులు పరదేశపరిస్థితులు తెలిసికొనుటవలనను, పుస్తకములను వార్తాపత్రికలను చదువుటవలనను, ఈ దేశమునకు సరియగుదారి చూపింపజాలరని మనవారు ఇప్పుడిప్పుడే గ్రహించుట శుభచిహ్నము. ఇప్పుడు దేశక్షేమమును కోరు ప్రతివారి దృష్టియు గ్రామాదులవంక తిరిగి యున్నది. ఈ అవకాశమును కైకొని, గ్రామాదులలోని ప్రజలు కూడ తమ అభివృద్ధికొఱకు అవలంబింపదగిన విధానమును సూచించి తోడ్పడనియెడల, ఏవిధమైన అభివృద్ధియు గ్రామములు పొందజాలవు. గ్రామప్రజలు తమ పైగల భారమును క్రమమముగా నిర్వర్తింపనియెడల, తమ మేలుకోరు ఎల్లర కృషియు, వృధయగుటయేకాక గ్రామప్రజలకు ఉపయోగింపని ఇతర మార్గములను త్రొక్కుటము తటస్థింపగలదు. ఇది మహాసందిగ్ధ సమయము. ఇప్పుడు గ్రంథాలయోద్యమము ఒక పెద్ద బాధ్యత వహింపవలసిన తరుణమువచ్చినది. గ్రామాదులలో నిరక్షరత్వమును, దారిద్యమును, నిరుద్యోగమును ప్రబలియున్నవి. ఇవి నివారించుటకు కేవలము ఉపన్యాసముల వలనను వార్తాపత్రికల వలనను అభివృద్ధి చేయు మార్గములలో కల కష్టములను మనము గుర్తింపవలసి యున్నది. ఇట్టి క్లిష్టపరిస్థితులలో దేశములోని వివిధ గ్రంథాలయముల అవలంబింపవలసిన విధానమును సూచించుట కొఱకు ఒక ఆదర్శ గ్రంథాలయ మేర్పడుట అత్యావశ్యకమని ఎంచి ఆట్టి యీ గ్రంథాలయమునకు ప్రారంభోత్సవము జరుపగలిగినందులకు సంతసించుచున్నాను. ఈ గ్రంథాలయాచరణమే గ్రామములలోని అన్ని గ్రంథాలయముల గుర్తించుచుండవలెనని నాకోరిక. ఇట్టి మహాబాధ్యతను పెట్టుకొని నడపుచున్నవారి కెంతయు సాయమీయ వలయునని అందరను వేడెద. మన దేశములో గ్రామముల దుస్థితిని గుణించి చిలుక పలుకులవలె వర్ణించిన ప్రయోజనము లేదు. ప్రజలును, నాయకులును, అందఱును ఆదుస్థితిని దాని మూల కారణములను గ్రహించియే యున్నారు. ఆదర్శమగు గ్రామములోనే కాని ఆదర్శమగు గ్రంథాలయము ఏర్పడజాలదు. ఈ రెండింటికిని అవినాభావసంబంధ మేర్పడి యున్నది. ఇట్టి తరుణమున ఆదర్శ గ్రంథాలయ మేర్పాటు చేయుటతో పాటు ఆదర్శగ్రామమును సైతము తయారు చేయవలెనని ఖద్దరు సంస్థానమువారు నిశ్చయించుటచే గ్రంథాలయ సంఘకృషికి ఎక్కువ సహకారము చేకూరినది. ఖద్దరు సంస్థానము పదిసంవత్సరముల క్రింద స్థాపింపబడి శాంతి సాధనముల కొఱకు విశేషకృషి చేసియున్నది. అకృషికి ఇక్కడివారు విశేషముగా తోడ్పడి యున్నారు. వారికృషి చూడ దేశములో మహామహులగు గాంధీ మహాత్ముడు, బాబురాజేంద్రప్రసాద్, శంకర్ లాల్ బాంకర్, మీరా బేన్, ప్రకాశము, పట్టాభిసీతారామయ్య, కుమా<noinclude><references/></noinclude> 01a93kh2u9iyrt0erl51e0htt4tch9h పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/24 104 211890 552371 2026-04-09T14:41:47Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552371 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>రప్ప, సీతారామశాస్త్రి మొదలగు పెద్దలు ఈ ప్రదేశమును సందర్శించియున్నారు. అట్టివారి దర్శన భాగ్యమునకు కృషిచేసి, దినదినాభివృద్ధి కాంచుచున్న ఖద్దరు సంస్థానమునకు అదర్శ గ్రామమును నిర్మాణము చేయుటగాని, ఆదర్శ గ్రంథాలయమును నిర్మాణము చేయట కాని అంత పెద్దపని కాదనియే చెప్పవచ్చును. వారికృషిని దేశమంతయు ముఖ్యముగా గ్రామములవారును, మణింతముఖ్యముగా గ్రామాభివృద్ధికోరు అన్ని శాఖల వారును కనిపెట్టుట అత్యావశ్యకము. కావున అనావశ్యక విషయ పరిశోధనములతో కాలము కడపక. ఆచరణయోగ్యమగు విధానమును అవలంమొదట బ్రతుకు తెరువు కొఱకు అవసరమగు వృత్తులవలంబింపవలె; దానికి తోడు లోకఙ్ఞానము కలుగుటకు వలయు చదువు సైతము పెంపొందింపవలెను. ఇందును గురించి జరుగుకృషి అంతయు గ్రంథాలయోద్యమము వారు తమతమ విజ్ఞానముతో విమర్శించి దేశాభివృద్ధికి చక్కనిదారి చూపించవలెనని కోరుచున్నాను. అధ్యక్షుని ఉపన్యాసానంతరము ఖద్దరు సంస్థాన ధర్మకర్త శ్రీ ఉప్పులూరి వేంకటకృష్ణయ్య గారు ఈ క్రింది తెఱంగున ఉపన్యాసమొసగిరి:- ఖద్దరు సంస్థాన గ్రంథాలయమును ఆదర్శముగ చేయ నిశ్చయించిన ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము వారి సంకల్పము మన అదృష్టమని భావించెదను. ఇందువలన మనపై పెద్ద బాధ్యతపడినది. మనకు శక్తియున్నను లేకపోయినను పెద్దల ఆశీర్వాదముతోను, దేశీయుల తోడ్పాటుతోను ఇది నెరవేరుననియే నానమ్మకము. అన్నిటికి ముందు మనము నెరవేర్పవలసిన ఆదర్శమును తెలిసికొనుట అవసరము. ఇప్పటి పరిస్ధితులు కూడ గుర్తింపవలని యున్నది. నేను పదునైదు సంవత్సరముల నుంచి చేయుచున్న పరిశోధనల ఫలితములను బట్టి మన ము ముందు కార్యకమమును నిస్సంశయముగా నెరవేర్పగలమని నమ్మకము కలుగు చున్నది. మానవునకు శాంతిని పెంపొందించునదే విజ్ఞానము. అహింసా సత్యములు లేనిది మానవునకు శాంతి ఏర్పడదనుటలో సందేహమెంత మాత్రమును లేదు. అహింసా సత్యములు ప్రజలలో స్థిరముగా నిలువవలెనన్న పాతివ్రత్యమును, ఏకపత్నీ వ్రతమును, యుక్తాహార (శాకాహార) విహారములును ముఖ్యములని నేను నమ్ముచున్నాను. ప్రజలందరు ఈ విధానములో ఉతీర్ణులైనను కాకపోయినను ఈలక్ష్యమునకు ప్రధాన గౌరవమిచ్చిన దేశములలోనే శాంతి స్టాపనముకు తావు ఏర్పడగలదు. ఇప్పుడు మానవులలో స్వేచ్ఛ పెంపొందించవలెనని ఆనేకోద్యమములు ప్రబలుచు, పైలక్ష్యమునకు ముప్పును కలుగ చేయుచున్నవి. ఇందువలన స్త్రీ పురుషాదులలో పైలక్ష్యమునకు విరుద్ధములగు విధానములు వాడుకలోనికి రావలెనని హెచ్చుపచారము జరుగుచున్నది. ఇది కూడ మానవశాంతి కొఱకు అవలంబింపవలసిన ఎట్టి విజ్ఞానమునకు ప్రాధాన్య మివ్వవలెనో ఎట్టి గ్రంధములను వాడుక లోనికి తేవలెనో మనము నిర్ణయించుకోవలసియున్నది. లక్ష్యమును నిర్ణయమును లేకుండ కలగూరగంపగా ఉద్యమములు నడపు నెడల చదువరులలో భిన్న భిన్నములగు ఆలోచనలును భిన్న భిన్న తర్కములును ప్రతి నిర్మాణ కార్యక్రమమునకు భంగము కలుగునే కాని సక్రమమగు అభివృద్ధి కలుగనేరదని నా అనుభవమై యున్నది. నేను ఇట్లు చెప్పుటలో ఇతర విజ్ఞానమును తెలిసికొనరాదని కాదు; రెండు రకముల విఙ్ఞానములును తెలిసికొనిన తరువాత అన్ని బాపతుల గ్రంథములను సేకరించినను, అర్హతలను బట్టి గ్రంధముల నందజేయు చుండవలెనని అభిప్రాయము. మానవశాంతికొరకు అహింసయు, సత్యమును, పాతివ్రత్యమును, ఏకపత్నీ వ్రతమును, యుక్తాహార (శాకాహార) విహారములును అత్యవసరములనియు ఆ ఉత్కృష్ట సాధనములను మానవులు తెలిసికాని తెలియకకాని పొరపాటుననైనా తప్పక అనుసరించుటకు వీలుగుల విజ్ఞానమును వెదచల్లుట గ్రంథాలయముల కర్తవ్యమనియు, ఆకర్తవ్యమును ఈ గ్రంథాలయములో ప్రత్యక్ష పరీక్ష చేసెద రనియు నమ్ముచున్నాను. {{rule |6em }}<noinclude><references/></noinclude> ivdsrme12yv4p3un09w8y3onf36ci3t పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/61 104 211891 552401 2026-04-10T03:15:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధర్మ పదము సంతసింతురో, యెవ్వారలు కామంబుల జయించి సప్ర కాశులో, యట్టివార లిహమందును ముక్తులు. పూజలు ఏడవ యధ్యాయము సంసారయాత్రాసమా ప్తిని గావించి, దుఃఖమును విడిచి, సమస్తవిధముల ము...' 552401 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధర్మ పదము సంతసింతురో, యెవ్వారలు కామంబుల జయించి సప్ర కాశులో, యట్టివార లిహమందును ముక్తులు. పూజలు ఏడవ యధ్యాయము సంసారయాత్రాసమా ప్తిని గావించి, దుఃఖమును విడిచి, సమస్తవిధముల ముక్తిఁ జెంది, బంధవిముక్తుం డగువానికి దుఃఖంబు లేదు. Fо సమాహితచిత్తులై వారు పోవుదురు. గృహంబున సంతు ష్టులు కారు. కాసారమును బరిత్యజించిన హంసలవలె వారు గృహమును ద్యజింతురు. జీవితానిమి త్తశూన్యత్వంబుల గుర్తెఱుఁగుటచే మోక్షమే పరమావధిగఁ బెట్టుకొని, సిర్ధనులై, యనుజ్ఞాతవస్తు భక్షకులై, యుండు నారిమార్గ మాకాశంబునఁ బంగతి వ లె సజ్ఞేయంబు. وع OF . CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 2rv7w3f755uos5izpv45b9rnsu5rwo2 552593 552401 2026-04-10T05:58:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552593 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>సంతసింతురో, యెవ్వారలు కామంబులజయించి సప్రకాశులో, యట్టివార లిహమందును ముక్తులు.{{float right|89}} {{rule|2cm}} {{p|fs125|ac}}ఏడవ యధ్యాయము</p> {{rule|}} '''పూజ్యులు''' సంసారయాత్రాసమాప్తిని గావించి, దుఃఖమును విడిచి, సమస్తవిధముల ముక్తిఁజెంది, బంధవిముక్తుం డగువానికి దుఃఖంబులేదు.{{float right|90}} సమాహితచిత్తులై వారు పోవుదురు. గృహంబున సంతుష్టులు కారు. కాసారమును బరిత్యజించిన హంసలవలె వారు గృహమును ద్యజింతురు.{{float right|91}} జీవితానిమిత్తశూన్యత్వంబుల గుర్తెఱుఁగుటచే మోక్షమే పరమావధిగఁ బెట్టుకొని, నిర్ధనులై, యనుజ్ఞాతవస్తు భక్షకులై, యుండువారిమార్గ మాకాశంబునఁ బక్షిగతివలె నజ్ఞేయంబు.{{float right|92}}<noinclude><references/> {{right|19}}</noinclude> 30r72yzh3uv4qqgrokpvhol28bf8s1p 552594 552593 2026-04-10T05:58:56Z శ్రీరామమూర్తి 1517 552594 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>సంతసింతురో, యెవ్వారలు కామంబులజయించి సప్రకాశులో, యట్టివార లిహమందును ముక్తులు.{{float right|89}} {{rule|2cm}} {{p|fs125|ac}}ఏడవ యధ్యాయము</p> {{rule|2cm}} '''పూజ్యులు''' సంసారయాత్రాసమాప్తిని గావించి, దుఃఖమును విడిచి, సమస్తవిధముల ముక్తిఁజెంది, బంధవిముక్తుం డగువానికి దుఃఖంబులేదు.{{float right|90}} సమాహితచిత్తులై వారు పోవుదురు. గృహంబున సంతుష్టులు కారు. కాసారమును బరిత్యజించిన హంసలవలె వారు గృహమును ద్యజింతురు.{{float right|91}} జీవితానిమిత్తశూన్యత్వంబుల గుర్తెఱుఁగుటచే మోక్షమే పరమావధిగఁ బెట్టుకొని, నిర్ధనులై, యనుజ్ఞాతవస్తు భక్షకులై, యుండువారిమార్గ మాకాశంబునఁ బక్షిగతివలె నజ్ఞేయంబు.{{float right|92}}<noinclude><references/> {{right|19}}</noinclude> 9bm4mpfnnj70f8he9hav55sz05dxhet పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/62 104 211892 552402 2026-04-10T03:15:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఉపశమిత రాగుండును, భోగవిముఖుండునునై యెవ్వాఁడు శూన్యతానిమిత్త ప్రణిహిత మోడ విదుఁణో త్త మోక్షవిదుఁడో మార్గంబు పక్షి గతివలె దురవగాహంబు. యట్టివాని 3 సూతశిషి తాశ్వం...' 552402 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఉపశమిత రాగుండును, భోగవిముఖుండునునై యెవ్వాఁడు శూన్యతానిమిత్త ప్రణిహిత మోడ విదుఁణో త్త మోక్షవిదుఁడో మార్గంబు పక్షి గతివలె దురవగాహంబు. యట్టివాని 3 సూతశిషి తాశ్వంబులభాతి నిజేంద్రియంబుల నిగ్రహించి, యెవ్వాఁడు నిర్దేర్వియును, నిష్కాముఁడును, నగునో యట్టివానిం గూర్చి దేవతలు కూడ నీర్ఘఁజూపింతురు. ర ధర్మాచరణపరాయణుం డగువాఁడు భూమివలె, వజ్రంబు రీతి, శాంతియుక్తుండు; పంకరహితసరోవర సదృశుండు. అట్టివానికిఁ బునర్జన్మము లేదు. FX సుజ్ఞానప్రాప్తిచే మోతంబుఁ జెంది, శాంతుఁ డైనవాని చిత్తము శాంతిమయంబు. వానివాక్కర్మములును శాంతి మయంబులు. ఎన్వాఁడు మిథ్యాభ_క్తివిముక్తుండై, నిర్వాణజ్ఞానయుక్తుం డై, సర్వపాపవిముక్తుండై, సర్వవికార హేతురహితుండై, నిష్కాముండై యుండునో యట్టివాఁడు పురుష శ్రేష్ఠుండు. గ్రామంబునఁగాని, వనంబునఁగాని, గభీరజలాశయంబునఁ గాని, మరుస్థలంబునఁగాని, యర్హతులు వసించునట్టి ప్రదేశం బానందదాయకంబు. 90 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri FJ<noinclude><references/></noinclude> odogqjymx2lf17ynb42s2kjotku5faq 552597 552402 2026-04-10T06:08:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552597 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>ఉపశమితరాగుండును, భోగవిముఖుండునునై యెవ్వాఁడు శూన్యతానిమిత్తప్రణిహిత మోక్షవిదుఁడో యట్టివాని మార్గంబు పక్షిగతివలె దురవగాహంబు.{{float right|93}} సూతశిక్షితాశ్వంబులభాతి నిజేంద్రియంబుల నిగ్రహించి, యెవ్వాఁడు నిర్గర్వియును, నిష్కాముఁడును, నగునో యట్టివానింగూర్చి దేవతలుకూడ నీర్ష్యఁజూపింతురు.{{float right|94}} ధర్మాచరణపరాయణుం డగువాఁడు భూమివలె, వజ్రంబురీతి, శాంతియుక్తుండు; పంకరహితసరోవర సదృశుండు. అట్టివానికిఁ బునర్జన్మము లేదు.{{float right|95}} సుజ్ఞానప్రాప్తిచే మోక్షంబుఁజెంది, శాంతుం డైనవాని చిత్తము శాంతిమయంబు. వానివాక్కర్మములును శాంతి మయంబులు.{{float right|96}} ఎవ్వాఁడు మిథ్యాభక్తివిముక్తుండై, నిర్వాణజ్ఞానయుక్తుండై, సర్వపాపవిముక్తుండై, సర్వవికారహేతురహితుండై, నిష్కాముండై యుండునో యట్టివాఁడు పురుషశ్రేష్ఠుండు.{{float right|97}} గ్రామంబునఁగాని, వనంబునఁగాని, గభీరజలాశయంబునఁగాని, మరుస్థలంబునఁగాని, యర్హతులు వసించునట్టి ప్రదేశం బానందదాయకంబు.{{float right|98}}<noinclude><references/> {{left|20}}</noinclude> orppnotqc2oswxhr8pd5bmlim5he22m పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/63 104 211893 552403 2026-04-10T03:15:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదమా విపినంబులు సంతోష విధాయకంబులు; ఎచట సామాన్య జనంబు లానందమును గాంచరో యచట రాగరహితు లానందమును గాంతురు. ఏలయన: వార లానందము నన్వేషింపరు. వేవేలు ఎనిమిదవ యధ్యాయము 200 సహస్రపద...' 552403 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదమా విపినంబులు సంతోష విధాయకంబులు; ఎచట సామాన్య జనంబు లానందమును గాంచరో యచట రాగరహితు లానందమును గాంతురు. ఏలయన: వార లానందము నన్వేషింపరు. వేవేలు ఎనిమిదవ యధ్యాయము 200 సహస్రపదయుక్తంబయ్యు నర్థరహితపద సంహితంబగు నేని దానికంటే మనుజుం డెద్దాని శ్రవణానంతరమున శాంతిమయుండగునో యట్టి సద్యుక్తియుక్తంబగు నొక్క పదంబే శ్రేష్ఠంబు. పద్యంబొకటి సహస్రపదయుక్తంబయ్య నర్థరహిత పద సంహితంబగు నేని యట్టిదానికంటే, మనుజుం డేదాని శ్రవణానంతరమున శాంతిమయుండగునో యట్టిపదం బే శ్రేష్ఠంబు. 300 అర్థరహిత పదకల్పిత గాథాశతంబుకంటె, మనుజుఁ డెద్దాని శ్రవణానంతరమున శాంతుండగునో యట్టి ధర్మం ప 509 CC-0. Jangamwadi Math,Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> fzx22e3z3d3qfssf4hct0phqojhqgy8 552598 552403 2026-04-10T06:16:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552598 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>నిపినంబులు సంతోషవిధాయకంబులు; ఎచట సామాన్య జనంబు లానందమును గాంచరో యచట రాగరహితు లానందమును గాంతురు. ఏలయన: వార లానందము నన్వేషింపరు.{{float right|99}} {{rule|2cm}} {{p|fs125|ac}}ఎనిమిదవ యధ్యాయము</p> {{rule|2cm}} '''వేనవేలు''' సహస్రపదయుక్తంబయ్యు నర్థరహితపద సంహితంబగు నేని దానికంటె మనుజుం డెద్దాని శ్రవణానంతరమున శాంతిమయుండగునో యట్టి సద్యుక్తియుక్తంబగు నొక్క పదంబే శ్రేష్ఠంబు.{{float right|100}} పద్యంబొకటి సహస్రపదయుక్తంబయ్యు నర్థరహితపద సంహితంబగునేని యట్టిదానికంటె, మనుజుం డెద్దాని శ్రవణానంతరమున శాంతిమయుండగునో యట్టిపదంబే శ్రేష్ఠంబు.{{float right|101}} అర్థరహిత పదకల్పిత గాథాశతంబుకంటె, మనుజుఁ డెద్దాని శ్రవణానంతరమున శాంతుండగునో యట్టి ధర్మంపుఁబల్కు మేలు.{{float right|102}}<noinclude><references/> {{right|21}}</noinclude> st0jj1uvqpyd045lk1pdoyj5oq1zmzw పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/64 104 211894 552404 2026-04-10T03:15:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము మనుజుం డొక్కరుఁడు యుద్ధమున సహస్ర గుణ సహస్ర యోధులను జయించినను, వేఱకఁ డాత్మ జయంబుఁ గావించిన నట్టివాఁడే జేతశ్రేష్ఠుండు. ఆత్మజయం బఖిలజయంబుకంటె శ్రేష్ఠంబు. 003 అమరుండ...' 552404 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము మనుజుం డొక్కరుఁడు యుద్ధమున సహస్ర గుణ సహస్ర యోధులను జయించినను, వేఱకఁ డాత్మ జయంబుఁ గావించిన నట్టివాఁడే జేతశ్రేష్ఠుండు. ఆత్మజయం బఖిలజయంబుకంటె శ్రేష్ఠంబు. 003 అమరుండైనను, గంధర్వుండైనను, బ్రహ్మతోఁ గూడిన మారుండైనను సతతమును నిగ్రహముతో జీవించు జితాత్మునిజయము నపజయంబుగ మార్పఁజాలరు. ౧౦౫ మనుజుండు వత్సరశతంబు ప్రతిమాసంబునను సహస్రం బులతో యజ్ఞాదు లొనర్చినను,మఱియు నాతఁడు ముహూ ర్తమాత్రము సుజ్ఞాన స్థాపి తాత్మ యుక్తుండగు మనుజుని నరించిన నట్టి యర్చన నూఱు వత్సరంబులు చేయు యజ్ఞంబుకంటె మేలు. కాంతారంబునం దయనశతంబు హుతాశనారాధనఁ గా వించినను, నొక్క ముహూర్తమాత్రము శుద్ధజ్ఞాన ప్రతిష్ఠి. తాత్మవంతు నర్చించిన నట్టి యర్చన నూఱు సంవ త్సరములు చేయు యజ్ఞంబుకంటె మేలు. وو. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 202<noinclude><references/></noinclude> 8l4o95e8a402xghg3itg0g075xcpkh2 552613 552404 2026-04-10T08:18:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552613 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>మనుజుం డొక్కరుఁడు యుద్ధమున సహస్రగుణ సహస్రయోధులను జయించినను, వేఱొకఁ డాత్మ జయంబుఁ గావించిన నట్టివాఁడే జేతృశ్రేష్ఠుండు.{{float right|103}} ఆత్మజయం బఖిలజయంబుకంటె శ్రేష్ఠంబు.{{float right|104}} అమరుండైనను, గంధర్వుండైనను, బ్రహ్మతోఁగూడిన మారుండైనను సతతమును నిగ్రహముతో జీవించు జితాత్మునిజయము నపజయంబుగ మార్పఁజాలరు.{{float right|105}} మనుజుండు వత్సరశతంబు ప్రతిమాసంబునను సహస్రంబులతో యజ్ఞాదు లొనర్చినను,మఱియు నాతఁడు ముహూర్తమాత్రము సుజ్ఞానస్థాపితాత్మ యుక్తుండగు మనుజుని నర్చించిన నట్టి యర్చన నూఱు వత్సరంబులు చేయు యజ్ఞంబుకంటె మేలు.{{float right|106}} కాంతారంబునం దయనశతంబు హుతాశనారాధనఁ గావించినను, నొక్కముహూర్తమాత్రము శుద్ధజ్ఞాన ప్రతిష్ఠితాత్మవంతు నర్చించిన నట్టి యర్చన నూఱు సంవత్సరములుచేయు యజ్ఞంబుకంటె మేలు.{{float right|107}}<noinclude><references/> {{left|22}}</noinclude> omde8b28rokvgt9sxnrnmi40yk1p0b0 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/65 104 211895 552405 2026-04-10T03:16:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము పుణ్యసంపాదనార్థ 'మొకవత్సరంబు మనుజుండు కావించిన యజ్ఞతర్పణాదు లొకకా సైనను జేయవు. ధర్మపరులయం దలి భక్తి, యజ్ఞాదులలో శ్రేష్ఠతమంబు. 500 ఎవ్వాఁడు వృద్ధజనుల కనవరత మభివంద...' 552405 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము పుణ్యసంపాదనార్థ 'మొకవత్సరంబు మనుజుండు కావించిన యజ్ఞతర్పణాదు లొకకా సైనను జేయవు. ధర్మపరులయం దలి భక్తి, యజ్ఞాదులలో శ్రేష్ఠతమంబు. 500 ఎవ్వాఁడు వృద్ధజనుల కనవరత మభివందనార్చనలఁ గావించుచుండునో యట్టివాని కాయుళ్ళోభా సౌఖ్యశక్తులు నాల్గును నభివృద్ధిఁ గాంచుచుండును. 307 నిగ్రహరహితంబగు శతవర్ష దుర్జీవముకంటె సచ్చరిత విచారయుక్తంబగు నేక దినజీవనంబైనను మేలు. ౧౧౦ జ్ఞానహీనంబై, నిగ్రహ రహితంబైన శతవర్ష జీవనము కంటె సుజ్ఞాన సువిచారయుక్తంబగు నేకదినజీవన మైన మేలు. 300 అలసశీలుండై, దుర్బలుండైన వాని శతవర్ష జీవనముకంటే దృఢశక్తి యుక్తంబగు నేక దినజీవనమైనను మేలు. ౧౧౨ ఉదయతీ యజ్ఞానహీనుఁడగు వాని వర్ష శతజీవనము కంపె నుదయ యజ్ఞానయుక్తంబగు వాని యేక దిన జీవనంబె మేలు... 35 CC-0. Jangamwadi Math Collection. Digitized by Gangotri<noinclude><references/></noinclude> dkfz1o124kcvt8bim9ab206ths16g75 552614 552405 2026-04-10T08:27:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552614 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>పుణ్యసంపాదనార్థ మొకవత్సరంబు మనుజుండు కావించిన యజ్ఞతర్పణాదు లొకకాసైనను జేయవు. ధర్మపరులయందలి భక్తి, యజ్ఞాదులలో శ్రేష్ఠతమంబు.{{float right|108}} ఎవ్వాఁడు వృద్ధజనుల కనవరత మభివందనార్చనలఁ గావించుచుండునో యట్టివాని కాయుశ్శోభా సౌఖ్యశక్తులు నాల్గును నభివృద్ధిఁ గాంచుచుండును.{{float right|109}} నిగ్రహరహితంబగు శతవర్ష దుర్జీవనముకంటె సచ్చరిత విచారయుక్తంబగు నేక దినజీవనంబైనను మేలు.{{float right|110}} జ్ఞానహీనంబై, నిగ్రహ రహితంబైన శతవర్ష జీవనము కంటె సుజ్ఞాన సువిచారయుక్తంబగు నేకదినజీవనమైన మేలు.{{float right|111}} అలసశీలుండై, దుర్బలుండైన వాని శతవర్ష జీవనముకంటె దృఢశక్తి యుక్తంబగు నేక దినజీవనమైనను మేలు.{{float right|112}} ఉదయక్షయజ్ఞానహీనుండగు వాని వర్ష శతజీవనముకంటె నుదయక్షయజ్ఞానయుక్తంబగు వాని యేక దిన జీవనంబె మేలు.{{float right|113}}<noinclude><references/> {{right|23}}</noinclude> f9ogedty0igs9031n9wlzflst45ysdv పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/66 104 211896 552406 2026-04-10T03:16:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము అక్ష రస్థానంబుఁ గాంచనివాని వర్ష శతజీవనముకంటే నవతర స్థాన దర్శనంబుఁ గావించినవాని యేకదిన జీవనంబు మేలు, ఉత్కృష్టధర్మజ్ఞాన రహితుండగువాని వర్ష శతజీవంబుకంటె నుత్కృ...' 552406 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము అక్ష రస్థానంబుఁ గాంచనివాని వర్ష శతజీవనముకంటే నవతర స్థాన దర్శనంబుఁ గావించినవాని యేకదిన జీవనంబు మేలు, ఉత్కృష్టధర్మజ్ఞాన రహితుండగువాని వర్ష శతజీవంబుకంటె నుత్కృష్ట జ్ఞాన సహితంబగువాని యేకదిన జీవనంబు మేలు. అధర్మము తొమ్మిదవ యధ్యాయము మనుజుండు పుణ్యాభిసరణంబుఁ గావింపఁబూనినఁ జిత్త మును బాపమునుండి నివర్తింపవలయును. మనుజుండు పుణ్యంబగుదాని నాలస్యముగ నొనరించిన నాతనిచి త్తము పాపమున మోదంబుఁ జెందు. మనుజుఁడు దుష్కృతం బొకమా టొనరించిన మగుడ దానిఁ గావింపకుండనిమ్ము; దుష్ట కార్యమున మోదమును జెందకుండనిమ్ము; దుఃఖము పాపజన్యంబు. పుణ్యంబగు దానినొకమాటు మనుజుండు కావించినఁ దిరుగ దానిఁ గావింపనిమ్ము; దానివలన నానందమును జెందనిమ్ము; సుఖము పుణ్యసంభూతము. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 72dc3ma6bbbuwpetcovj3rwefae0yjv 552615 552406 2026-04-10T08:35:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552615 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>అక్షరస్థానంబుఁ గాంచనివాని వర్ష శతజీవనముకంటె నక్షరస్థాన దర్శనంబుఁ గావించినవాని యేకదిన జీవనంబు మేలు.{{float right|114}} ఉత్కృష్టధర్మజ్ఞానరహితుండగువాని వర్ష శతజీవంబుకంటె నుత్కృష్టజ్ఞానసహితంబగువాని యేకదినజీవనంబు మేలు.{{float right|115}} {{rule|2cm}} {{p|fs125|ac}}తొమ్మిదవ యధ్యాయము</p> {{rule|2cm}} '''అధర్మము''' మనుజుండు పుణ్యాభిసరణంబుఁ గావింపఁబూనినఁ జిత్తమును బాపమునుండి నివర్తింపవలయును. మనుజుండు పుణ్యంబగుదాని నాలస్యముగ నొనరించిన నాతనిచిత్తము పాపమున మోదంబుఁ జెందు.{{float right|116}} మనుజుఁడు దుష్కృతం బొకమా టొనరించిన మగుడ దానిఁ గావింపకుండనిమ్ము; దుష్టకార్యమున మోదమును జెందకుండనిమ్ము; దుఃఖము పాపజన్యంబు.{{float right|117}} పుణ్యంబగు దానినొకమాటు మనుజుండు కావించినఁ దిరుగ దానిఁ గావింపనిమ్ము; దానివలన నానందమును జెందనిమ్ము; సుఖము పుణ్యసంభూతము.{{float right|118}}<noinclude><references/> {{left|24}}</noinclude> c1ogdi76xeaknu4qpf33b3hmsrkwcud పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/67 104 211897 552407 2026-04-10T03:16:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము దుష్టకర్ముఁడు దుష్కృతము ఫలించువఱకును మోదం బును జెందును; కాని వాని దుష్టకర్మము ఫలించు తఱి దుఃఖమును బొందును. సచ్చరితుఁడు సుకర్మలు ఫలించువఱకును దుర్దినములను గాంచ...' 552407 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము దుష్టకర్ముఁడు దుష్కృతము ఫలించువఱకును మోదం బును జెందును; కాని వాని దుష్టకర్మము ఫలించు తఱి దుఃఖమును బొందును. సచ్చరితుఁడు సుకర్మలు ఫలించువఱకును దుర్దినములను గాంచుచునుండును; కాని వాని సుకృతంబు ఫలించు తఱి సుఖమును బొందును. 090 పాపంబు నన్నుఁ జేరదని మనమున నిడుకొని యేమనుజుం డైనను జపలత్వమునఁ బాపమును గూర్చి చింతనంబుఁ గావింపకుండనిమ్ము; ఉదక బిందువతనంబున నంజరంబు సంపూర్ణమగుచున్నది. మూడుం డల్పానల్పంబునఁ బాప సంగ్రహణ సంగ్ర హణంబుఁ గావించినఁ బావపూరితుం డగును. ౧౨౧ పుణ్యము నన్నుఁ జేర నేరదని మనమున నిడుకొని మనుజుఁ డెవ్వండైనను బుణ్యంబుంగూర్చి చింతింపఁగూడదు. ఉద బిందు పతనంబుననే యుదకుంభంబు నిండుచున్నది. మతి మంతుం డల్పముగనైన బుణ్యమును సంగ్రహించినను గ్రమముగఁ బుణ్యపూర్ణుం డగును. ఆల్ప సంఖ్యాకులగు మిత్రులతోఁ గూడి బహుధనంబుల సంభరించు వణిజుఁ డపాయభూయిష్ఠంబగు మార్గమున CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri X<noinclude><references/></noinclude> 2ku865zjr1cj9i4mhqjfyk5fx0hjj7a 552616 552407 2026-04-10T08:43:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552616 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>దుష్టకర్ముఁడు దుష్కృతము ఫలించువఱకును మోదంబును జెందును; కాని వాని దుష్టకర్మము ఫలించు తఱి దుఃఖమును బొందును.{{float right|119}} సచ్చరితుఁడు సుకర్మలు ఫలించువఱకును దుర్దినములను గాంచుచునుండును; కాని వాని సుకృతంబు ఫలించు తఱి సుఖమును బొందును.{{float right|120}} పాపంబు నన్నుఁజేరదని మనమున నిడుకొని యేమనుజుండైనను జపలత్వమునఁ బాపమునుగూర్చి చింతనంబుఁ గావింపకుండనిమ్ము; ఉదకబిందుపతనంబున నలింజరంబు సంపూర్ణమగుచున్నది. మూడుం డల్పానల్పంబునఁ బాప సంగ్రహణంబుఁ గావించినఁ బాపపూరితుండగును.{{float right|121}} పుణ్యము నన్నుఁ జేరనేరదని మనమున నిడుకొని మనుజుఁడెవ్వండైనను బుణ్యంబుంగూర్చి చింతింపఁగూడదు. ఉదబిందుపతనంబుననే యుదకుంభంబు నిండుచున్నది. మతిమంతుం డల్పముగనైన బుణ్యమును సంగ్రహించినను గ్రమముగఁ బుణ్యపూర్ణుం డగును.{{float right|122}} అల్పసంఖ్యాకులగు మిత్రులతోఁగూడి బహుధనంబుల సంభరించు వణిజుఁ డపాయభూయిష్ఠంబగు మార్గమున<noinclude><references/> {{right|25}}</noinclude> ro1k5vak2mqfnr3chc0t29tr82acwvo పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/68 104 211898 552408 2026-04-10T03:16:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము నెట్లుచనఁతో, జీవితాశకలిగినవాఁడు విషము నెట్లు విసర్జించునో యట్లే మనుజుండు పాపకార్యములను విసర్జింపవలయును. తతరహితంబగు హస్తంబున విషస్పర్శనంబుఁ గావింప వచ్చును! మ...' 552408 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము నెట్లుచనఁతో, జీవితాశకలిగినవాఁడు విషము నెట్లు విసర్జించునో యట్లే మనుజుండు పాపకార్యములను విసర్జింపవలయును. తతరహితంబగు హస్తంబున విషస్పర్శనంబుఁ గావింప వచ్చును! మతరహితుండగువానిని గరళం బేమియుఁ జేయనేరదు. అహింసా పరుండును, బవిత్రుండును, నిర్మలుండును, నైన నాని కెవ్వండైన నపరాధ మొనరించినఁ బ్రతివాతంబునఁ బ్రక్షిప్త లఘు రేణువులపోల్కి నది. యట్టిమూఢుని పైఁ బడును. కొందఱు పునర్జన్మంబుఁ గాంతురు. పాపులు నరకంబును జెందుదురు. సచ్చరితులు స్వర్గమును బొందుదురు. ఐహిక వాంఛవిముక్తులైన వారు నిర్వాణముం జెందుదురు. ౧ ౨౬ ఆకసంబునఁగాని, సముద్ర మధ్యంబునఁగాని, పర్వతకందర ప్రదేశంబునఁ గాని, భూతలంబున మఱియెచటనైనఁ గాని స్వకృత పాపవిముక్తిని ప్ర మ ను జుఁ డు లేదు. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 5kyhllgeh2wknt52r3d10ekfor92vy8 552617 552408 2026-04-10T08:51:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552617 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>నెట్లుచనఁడో, జీవితాశకలిగినవాఁడు విషము నెట్లు విసర్జించునో యట్లే మనుజుండు పాపకార్యములను విసర్జింపవలయును.{{float right|123}} క్షతరహితంబగు హస్తంబున విషస్పర్శనంబుఁ గావింపవచ్చును! క్షతరహితుండగువానిని గరళం బేమియుఁ జేయనేరదు.{{float right|124}} అహింసాపరుండును, బవిత్రుండును, నిర్మలుండును, నైనవాని కెవ్వండైన నపరాధ మొనరించినఁ బ్రతివాతంబునఁ బ్రక్షిప్త లఘురేణువులపోల్కి నది. యట్టిమూఢునిపైఁ బడును.{{float right|125}} కొందఱు పునర్జన్మంబుఁ గాంతురు. పాపులు నరకంబును జెందుదురు. సచ్చరితులు స్వర్గమును బొందుదురు. ఐహిక వాంఛవిముక్తులైనవారు నిర్వాణముం జెందుదురు.{{float right|126}} ఆకసంబునఁగాని, సముద్రమధ్యంబునఁగాని, పర్వతకందర ప్రదేశంబునఁ గాని, భూతలంబున మఱియెచటనైనఁ గాని మనుజుఁడు స్వకృతపాపవిముక్తిని జెందు ప్రదేశంబు లేదు. {{float right|127}}<noinclude><references/> {{left|26}}</noinclude> 5q4e9wdilcun4swa5u2p3hs5w86zy1y పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/69 104 211899 552409 2026-04-10T03:16:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఆకాశంబునఁగాని, సముద్ర మధ్యంబునఁ గాని, పర్వతకంద రంబునఁగాని, భూతలంబున మఱియెచ్చోటనుగాని మను జుని మృత్యువు వశీకరింపని స్థానము లేదు. పదియవ యధ్యాయము దండనము దండనమన మను...' 552409 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఆకాశంబునఁగాని, సముద్ర మధ్యంబునఁ గాని, పర్వతకంద రంబునఁగాని, భూతలంబున మఱియెచ్చోటనుగాని మను జుని మృత్యువు వశీకరింపని స్థానము లేదు. పదియవ యధ్యాయము దండనము దండనమన మనుజులందఱును గంపముఁ జెందుదురు. అందఱును మరణమన వెఱతురు. ఆత్మోపమానంబును మనమున నిడుకొని ప్రాణిహింసనమును గావింపకుము.. తత్కారణభూతుండవును గాకుము. దండనమన మనుజులందఱును గంపముఁ జెందుదురు.. అందఱును జీవితాశ గలిగియుందురు. ఆత్మోపమా నంబును మనమున నిడుకొని ప్రాణిహింసఁ గావింప కుము; తత్కారణ భూతుడవునుగాకుము. 30. ఆత్మీయసౌఖ్యముల నన్వేషించుచు, సౌఖ్యాసక్తులగు నిత రులకు శిక్షఁగాని, హింసఁగాని, యెవఁడు కావించునో వాఁడు మరణానంతరమున సౌఖ్యముఁ జెందఁడు. 93 3. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> rsnjc1imo7nt2e192u2p1h3mtdzqllh 552618 552409 2026-04-10T08:59:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552618 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||ధమ్మపదము}}</noinclude>ఆకాశంబునఁగాని, సముద్రమధ్యంబునఁగాని, పర్వతకందరంబునఁగాని, భూతలంబున మఱియెచ్చోటనుగాని మనుజుని మృత్యువు వశీకరింపని స్థానము లేదు.{{float right|128}} {{rule|2cm}} {{p|fs125|ac}}పదియవ యధ్యాయము</p> {{rule|2cm}} '''దండనము''' దండనమన మనుజులందఱును గంపముఁ జెందుదురు. అందఱును మరణమన వెఱతురు. ఆత్మోపమానంబును మనమున నిడుకొని ప్రాణిహింసనమును గావింపకుము. తత్కారణభూతుండవును గాకుము.{{float right|129}} దండనమన మనుజులందఱును గంపముఁ జెందుదురు. అందఱును జీవితాశ గలిగియుందురు. ఆత్మోపమానంబును మనమున నిడుకొని ప్రాణిహింసఁ గావింపకుము; తత్కారణ భూతుండవును గాకుము.{{float right|130}} ఆత్మీయసౌఖ్యముల నన్వేషించుచు, సౌఖ్యాసక్తులగు నితరులకు శిక్షఁగాని, హింసఁగాని, యెవఁడు కావించునో వాఁడు మరణానంతరమున సౌఖ్యముఁ జెందఁడు.{{float right|131}}<noinclude><references/> {{right|27}}</noinclude> 21lzfzagisp4wkfag2lc0yj424c56al పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/70 104 211900 552410 2026-04-10T03:17:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము 'ఆత్మీయసౌఖ్యముల న న్వేషించుచు, సౌఖ్యాసక్తులగు నిక రుల నెవ్వాఁడు దండనమారణంబులఁ గావింపఁడో వాఁడు. మరణానంతరమున నానందమును గాంచును. ఎవ్వనితోనైనను బరుష భాష,ణంబులు వలు...' 552410 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము 'ఆత్మీయసౌఖ్యముల న న్వేషించుచు, సౌఖ్యాసక్తులగు నిక రుల నెవ్వాఁడు దండనమారణంబులఁ గావింపఁడో వాఁడు. మరణానంతరమున నానందమును గాంచును. ఎవ్వనితోనైనను బరుష భాష,ణంబులు వలుకకుము. అట్లు భాషింపఁబడిన వాఁ డవ్విధమున నే నీకు త్తరంబిచ్చును ఆత్మీయ పరుష వాక్యంబు వ్యధాజనకంబు. ప్రహార ప్రతి ప్రహారంబులు ని న్నుద్విగ్న మానసునిగ నొనర్చును. లె భగ్నలోహ పట్టంబువలె వాగ్వర్జితుండ వైనచో నీవు -నిర్వాణముఁ జెందుదువు. పిదప నాదజ్ఞాన రహితుండ వగుదువు. గోపాలుఁడు గోష్ఠములోని కెట్లు దండముతో గోవులం దోలుకొనిపోవునో యట్లే జరామరణంబులు మనుజుల జీవితంబులు నడపును. బుద్ధిహీనుఁడు దుష్టక ర్మాచరణ సమయంబున నది దుష్ట కర్మయను జ్ఞానంబును గలిగియుండఁడు; కాని దుష్టు డగ్ని దగ్ధుండైనటులు తనకర్మలచే దగ్ధుండగును. ౧3 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 77v6v3lsqwaz7qmaayjo6t8vqumcz2w 552621 552410 2026-04-10T09:07:20Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552621 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|ధమ్మపదము||}}</noinclude>ఆత్మీయసౌఖ్యముల నన్వేషించుచు, సౌఖ్యాసక్తులగు నితరుల నెవ్వాఁడు దండనమారణంబులఁ గావింపఁడో వాఁడు మరణానంతరమున నానందమును గాంచును.{{float right|132}} ఎవ్వనితోనైనను బరుషభాషణంబులు పలుకకుము. అట్లు భాషింపఁబడినవాఁ డవ్విధముననే నీకుత్తరంబిచ్చును ఆత్మీయ పరుషవాక్యంబు వ్యధాజనకంబు. ప్రహార ప్రతిప్రహారంబులు ని న్నుద్విగ్నమానసునిగ నొనర్చును.{{float right|133}} భగ్నలోహ పట్టంబువలె వాగ్వర్జితుండవైనచో నీవు నిర్వాణముఁ జెందుదువు. పిదప వాదజ్ఞాన రహితుండ వగుదువు.{{float right|134}} గోపాలుఁడు గోష్ఠములోనికెట్లు దండముతో గోవులం దోలుకొనిపోవునో యట్లే జరామరణంబులు మనుజుల జీవితంబుల నడపును.{{float right|135}} బుద్ధిహీనుఁడు దుష్టకర్మాచరణ సమయంబున నది దుష్టకర్మయను జ్ఞానంబును గలిగియుండఁడు; కాని దుష్టుం డగ్ని దగ్ధుండైనటులు తనకర్మలచే దగ్ధుండగును.{{float right|136}}<noinclude><references/> {{left|28}}</noinclude> r6ebycgvbckj95x98fh964yfxemodcd పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/71 104 211901 552411 2026-04-10T03:17:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము అనపరాధుల హింసింపని వాని కెవ్వఁడు వ్యధఁ గలుగఁ జేయునో వాఁ డీదశగుణస్థితులలో నెద్ధానినైన నొకదానిం జెందును. 032 తీవ్ర పీడనంబు కాని, ధననష్టము కాని, యత్యంత క్లేశంబు' కాని,...' 552411 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము అనపరాధుల హింసింపని వాని కెవ్వఁడు వ్యధఁ గలుగఁ జేయునో వాఁ డీదశగుణస్థితులలో నెద్ధానినైన నొకదానిం జెందును. 032 తీవ్ర పీడనంబు కాని, ధననష్టము కాని, యత్యంత క్లేశంబు' కాని, గురుదుఃఖంబుకాని, బుద్ధినాశంబు కాని ౧30 రాజకృతంబగు దుఃఖంబుగాని, ఘోరాపవాదంబుగాని,. బంధునాశంబుగాని, ధనవిద్వంసంబు 03 వైద్యు తాగ్ని దగ్ధగృహంబులు కాని, వానికి సమకూడు” ను. మఱియు నట్టిమూడుండు విగతజీవుండై నరకమును జెందును. నగ్నత్వము కాని, జటలుగాని, పంకంబుగాని, యుపవా సంబులు కాని, భూతలశయనంబుగాని, భస్మలేపంబుగాని, నిశ్చలాసనంబుగాని, కామోపశమనంబుఁ గావింపని వానిని బూత్సుగఁ జేయఁజాలవు. იზი ఎవ్వాఁడు సువస్త్రాలంకృతుం డయ్యుఁ బ్రశాంతమన స్కుండై, దాంతుండై, నిశ్చలుండై, నిగ్రహయుక్తుండై, నిష్కానుండై, పరదోషాన్వేషణంబుఁ గావింపకుండునో CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> of1vm1xvpprjm2rptsdecglpskjrvmv పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/72 104 211902 552412 2026-04-10T03:17:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము -యట్టివాఁడే నిశ్చయముగ బ్రాహ్మణుండును, శ్రమణుం డును, భిక్షువును. ప్రపంచమున సుశిక్షిత సైంధనంబు ప్రతోదకమును లక్ష్య పెట్టినట్లు వినయబద్ధుండై నిందను సరకు చేయనివార...' 552412 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము -యట్టివాఁడే నిశ్చయముగ బ్రాహ్మణుండును, శ్రమణుం డును, భిక్షువును. ప్రపంచమున సుశిక్షిత సైంధనంబు ప్రతోదకమును లక్ష్య పెట్టినట్లు వినయబద్ధుండై నిందను సరకు చేయనివార డుండునా? 108 3 శశాస్ప ృష్టసుశిషీ తాశ్వంబుభాతి ననలసుఁడవై, సోల్లా సుండవై యుండుము. విస్రంభ సచ్చరిత ధ్యాన తేజోధర్మ చింతనలచే జ్ఞానమునందును, ననుష్ఠానమునందును సిద్ధుఁ డవై మఱపులేక నీనత్యధిక భేదంబును బొందవు. ౧రర కూపనిర్మాతలు తమ యిచ్చవచ్చిన తావుల కండక మును గొంపోవుదురు. సాయకకారులు బాణమును నక ముగఁ గావింతురు. రథకారులు దారు ఖండంబును వస్త్రం బుగనొనర్తురు. సత్పురుషులు నిజనిర్మాతలు. జర పదునొకండన యధ్యాయము భూలోకం బి ట్లనవరతము దహింపఁబడుచుండ నెక్కడి దయో హాసము! ఎక్కడిదయో ఆనందము! తిమిర పరివృ తుండవైన నీ వెందులకుఁ బ్రదీపంబు న న్వేషింపవు? ad 30 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 2i5wa2s3nt5lpqr8e1d8wuh526d0uzl పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/73 104 211903 552413 2026-04-10T03:17:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము బహుతయుక్తంబై, సంగ్రధితంబై, రోగమయమై, బహుసంకల్పయు క్తంబై, దుర్బలంబై, యనిత్యంబగు నీ సువస్త్రాలంకృతపిండమును గనుగొనుము. ర రోగ భూయిష్ఠంబై దుర్బలంబగు నీ దేహము క్షీణించ...' 552413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము బహుతయుక్తంబై, సంగ్రధితంబై, రోగమయమై, బహుసంకల్పయు క్తంబై, దుర్బలంబై, యనిత్యంబగు నీ సువస్త్రాలంకృతపిండమును గనుగొనుము. ర రోగ భూయిష్ఠంబై దుర్బలంబగు నీ దేహము క్షీణించినది. ఈదోష రాశి ముక్కముక్కలుగ భంజింపఁబడును. నిశ్చ యముగ జీవనము మరణమున విరమించును. 580 శరత్కాలంబున విసర్జింపఁబడు నలాబువుల పోల్కి నా ధవళాస్థిదర్శనమున నేమిమోదము ? ర అస్థికలచే దుర్గనిర్మాణ మగునపు డది మాంసరుధిరా చ్ఛాదితం బగును. మఱియు నందు జరామరణంబులును, గర్వళైతవంబులును వసియించును. భాసురంబు లగు రాజరథంబులు వినాశమును జెందుచున్నవి. దేహము నాశమును జెందుచున్నది. కాని సత్పురుషుల సుకృతంబు మాత్రము నాశము నెన్నఁడును జెందనేరదని సజ్జను లొండొరులతోఁ జెప్పుచుందురు. ఈ దేహనిర్మాత న న్వేషించుచుఁ ద జ్ఞానము సిద్ధింప క జన్మపరంపరలనే పొందవలసి యున్నది. პი CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 1zgspxd84mgkyrgdqsbcque3ociczp7 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/74 104 211904 552414 2026-04-10T03:17:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము మఱియు జన్మపరంపరలు దుఃఖకారణంబులు. ఇప్పుడన్న నోయోయీ! ఆలయనిర్మాతా! భవద్దర్శనంబు సిద్ధించి నది. ఈయాలయమును బునర్ని ర్మాణము చేయకుము. నీదూలములు విరిగినవి. వెన్నుపట్టె...' 552414 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము మఱియు జన్మపరంపరలు దుఃఖకారణంబులు. ఇప్పుడన్న నోయోయీ! ఆలయనిర్మాతా! భవద్దర్శనంబు సిద్ధించి నది. ఈయాలయమును బునర్ని ర్మాణము చేయకుము. నీదూలములు విరిగినవి. వెన్నుపట్టె కూలినది. చిత్తము నిర్వాణాభిగమన మొనర్చుచు సర్వకామరహితం నది. 03-028 యౌవనంబున యుక్తంబగు శిక్షను బొందనివారును, నైశ్వర్యమును జెందనివారును, మత్స్యహీనంబగు కాసా రంబున జీర్న బకంబులభాతి నశించెదరు. తారుణ్యమున యుక్తంబగు శిక్షను బొందనివారును, నైశ్వర్యమును జెందనివారును, గతించినదానిం గూర్చి పరి తపించుచు భగ్న ధనువుమాడ్కిఁ బడియుందురు. ౧౬ పండ్రెండవ యధ్యాయము మనుజుం డాత్మప్రేమయుక్తుండై యాత్మావధారణంబుఁ గావించుకొననిమ్ము; రాత్రి యామత్రయమున నొకదాని యం దైనను జాగ్రత్తతో నుండవలయును. 3౨ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> hveakiavm9uo10wf5am368nlec7xu32 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/75 104 211905 552415 2026-04-10T03:18:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము యుక్తంబగుదానిఁ గూర్చి ప్రతిమనుజుఁడును దొలుత నాత్మశిక్షఁ గావించుకొని యటుతరువాత నితరుల శిక్షింప వలెను. అట్లు కావించిన వివేకవంతుఁడు దుఃఖముఁ జెందఁడు. ఎవ్వఁడు స్వ...' 552415 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము యుక్తంబగుదానిఁ గూర్చి ప్రతిమనుజుఁడును దొలుత నాత్మశిక్షఁ గావించుకొని యటుతరువాత నితరుల శిక్షింప వలెను. అట్లు కావించిన వివేకవంతుఁడు దుఃఖముఁ జెందఁడు. ఎవ్వఁడు స్వకీయోపదేశంబుల ననుసరించి ప్రవర్తించునో యట్టివాఁడు నిగ్రహపరాయణుండై పరుల వశీకరింపఁ గలఁడు. ఆత్మవశీకరణంబే నిశ్చయముగఁ గతమంబు. తనకు నాథుఁడు తానే! ఇంకెన్వఁ డధిపుఁడై యుండఁ గలఁడు? ఆత్మని గ్ర హయుక్తుఁడు, అత్యల్ప సంఖ్యాకులు మాత్రము కనుగొనఁగలిగిన యధిపునిఁ గనుఁగొనును. ఆత్మజనితంబై యాత్మవర్ధితంబగు పాపంబు, వజ్రంబు రత్నమును భేదించునట్లు మూఢుని వినాశంబు కావించును. ఎవ్వాని దుష్ట చరితం బత్యధికంబో వాఁడు లతాపరివేష్టిత తరువుభాతిని, దానెట్టి దురవస్థలో నుండఁగఁజూచుటకు శాత్రవుఁడిచ్చగించునో యట్టిదురవస్థకు లోనగును. ౧౬౨ దుష్టములును, నా త్మారిస్టములును నగుకర్మల నాచరించు టతిసులభంబు; శ్రేయస్కరంబు, పుణ్యవంతంబునైన దానిఁ జేయుట బహుకష్టంబు. 3 QE3 33 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 0yd2y9f3kr5y36sk6w1syalrldngag3 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/76 104 211906 552416 2026-04-10T03:18:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము అర్హతులయొక్కయు, నరియులయొక్కయు, సచ్చరితుల యొక్క_యు, ధర్మంబు నేమూఢుండు నిరాకరించి మిథ్యా సిద్ధాంతముల ననుసరించునో యట్టివాఁడు కధక గ్రానంబు మాడ్కి స్వనాశంబు నొడఁగూ...' 552416 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము అర్హతులయొక్కయు, నరియులయొక్కయు, సచ్చరితుల యొక్క_యు, ధర్మంబు నేమూఢుండు నిరాకరించి మిథ్యా సిద్ధాంతముల ననుసరించునో యట్టివాఁడు కధక గ్రానంబు మాడ్కి స్వనాశంబు నొడఁగూర్చు ఫలముల భరించును. పాపం బాత్మకృతంబు; దుఃఖంబును నాత్మ సంకల్పితంబు; పాపమును జేయకుండువాఁడును దానే; పవిత్రత యాత్మ ప్రతిపాదితంబు ; పవిత్రా పవిత్రత లాత్మీయములై యుండ నొక్కరుఁ డింకొకనిఁ బూతునిఁగ నొనర్ప నేరఁడు. ౧౬౫ ఎంతమనంబయ్యు నింకొకని యుపకారమునకై యాత్మ విధిని మరువఁగూడదు. నిజవిధి దర్శనానంతర మనవరత ముఁ దదాచరణపరాయణుండై యుండవలయును. ౧౬౬ దుష్ట ధర్మంబు ననుసరింపకుము; విచారశూన్యం బగు 'జీవసంబుఁ జేయకుము; మిథ్యాసిద్ధాంతముల నవలంబింప కుము; సంసారలగ్నుండవై యుండకుము; DE2 మేల్కొనుము; అలసశీలుండవు కాకుము; ధర్మము ననుసరింపుము; ఇహపరంబులు రెంటియందును సచ్చరి తుం డానందమయుండై యుండును. ३४ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri CES<noinclude><references/></noinclude> 9wt1vpfvwcfl7xy2cjjsemuqxppg0fg పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/77 104 211907 552417 2026-04-10T03:18:20Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము పుణ్యమార్గము ననుసరింపుము; పాపమార్గముం ద్రొక్క కుము; ఇహపరంబుల రెంటియందును రెంటియందును సచ్చరితుం డౌనందమయుండై యుండును. CEF ప్రపంచమును బుద్బుదంబుభాతిని, మరీచిక మాడ్...' 552417 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము పుణ్యమార్గము ననుసరింపుము; పాపమార్గముం ద్రొక్క కుము; ఇహపరంబుల రెంటియందును రెంటియందును సచ్చరితుం డౌనందమయుండై యుండును. CEF ప్రపంచమును బుద్బుదంబుభాతిని, మరీచిక మాడ్కిని బరి గణింపుము; అట్లు సంసారమును నిరసించువానిని బ త రాజు గల్గొన నేరఁడు. రమణీయరాజరథ సమానంబును, బాహ్యాడంబరయు క్తం బును నగు నీ ప్రపంచమును గనుఁగొనుము. అందు మూఢులు నిమగ్ను లై యున్నారు. ప్రాజ్ఞులన్ననో దానినిఁ దాఁకనైనఁ దాఁకరు. మొదటఁ బ్రమత్తుండయ్యుఁ దరువాతఁ బ్రమాదము లేకుండ సంచరించువాఁడు జలదవిముక్తుండైన చంద్రుని మాడ్కిఁ బ్రపంచమును గాంతియుక్తంబుగ నొనర్చును. ఎవ్వాని దుష్టకర్మలు సుకృతంబులచేఁ గప్పఁబడినవో యట్టివాఁడు జల విముక్తేందునిభాతిఁ బ్రపంచమును బ్ర కాశింపఁ జేయును. 023 ప్రపంచ మంధ కార బంధురంబు. అత్యల్ప సంఖ్యాకులు మాత్రమే సమముగ దానిఁజూడ నేర్తురు. జాలవిము క్త 30. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> ldryvb40zey8bc6efur1wmt8upaopew పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/78 104 211908 552418 2026-04-10T03:18:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము విహంగములమాడ్కి బహ్వల్పసంఖ్యాకులు మాత్రమే స్వర్గమున కరుగఁగలరు. హంసలు భానుమార్గంబునఁ జనును. అవి సిద్ధిచే నాకాశ మార్గంబునఁ జనును. మారునిఁ దదనుచరులను జయించు నప్పు...' 552418 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము విహంగములమాడ్కి బహ్వల్పసంఖ్యాకులు మాత్రమే స్వర్గమున కరుగఁగలరు. హంసలు భానుమార్గంబునఁ జనును. అవి సిద్ధిచే నాకాశ మార్గంబునఁ జనును. మారునిఁ దదనుచరులను జయించు నప్పుఁడు ప్రపంచమునుండి విద్వాంసులు నిర్గమింతురు. మనుజుం డొకధర్మమును బరిత్యజించి, యనృతములఁ మన నిరసించిన నట్టివాఁ జొనరింపని పాపం బెద్దియును లేదు. ఆదానశీలురు దేవలోకమున కేగరు; మూఢులు దాతృ త్వమును బ్రస్తుతింపరు. విద్వాంసుఁడు దాతృత్వమున మోదముఁ జెంది తత్కారణమునఁ బరలోకమునందు సుఖయగును. 022 ప్రపంచాధిపత్యముకంటే, స్వర్గారోహణముకంటె, సర్వ ప్రపంచాధిపత్యముకం టెఁ బుణ్యప్రథమసోపానాధిరోహ శ్రేష్ఠతరంబు. ణంబు 525 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> m6btgrc5sj8slxqbicmh7aywnua185m పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/79 104 211909 552419 2026-04-10T03:18:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రబుద్ధుఁడు పదునాల్గవ యధ్యాయము ధమ్మపదము ఎవ్వానియాత్మ జయము పరాజితంబు కాదో, ఎవ్వాని జయమున నితరుం డెవ్వండైనను బ్ర వేశంబుఁ గాంచఁడో యట్టి ప్రబుద్ధుని, సర్వజ్ఞేయుని, మార్గర...' 552419 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ప్రబుద్ధుఁడు పదునాల్గవ యధ్యాయము ధమ్మపదము ఎవ్వానియాత్మ జయము పరాజితంబు కాదో, ఎవ్వాని జయమున నితరుం డెవ్వండైనను బ్ర వేశంబుఁ గాంచఁడో యట్టి ప్రబుద్ధుని, సర్వజ్ఞేయుని, మార్గరహితుని నేమార్గ మునఁ గొంపోవుదుపు? 027 ఎవ్వనిని గ్రామం బెద్దియును దదీయపాశ విషంబులతో నపమార్గగామిగ నొనర్ప నేరదో యట్టి ప్రబుద్ధుని, సర్వ జ్ఞేయుని, మార్గరహితుని, నేమార్గమునఁ గొంపోదువు? ప్రబుద్ధులై, యప్రమత్తులై, ధ్యానశీలురై, జ్ఞానులై, సన్న్యాస విశ్రామమున నెవ్వార లానందముఁ గాంతురో యట్టివారింగూర్చి దేవత లైన నసూయఁ జెందుదురు. ౧౯౧ మనుష్యావధారణంబు కస్టంబు; మానుష జీవనంబు కష్టంబు; సుధర్మశ్రీ నణంబు కష్టంబు; ప్రబుద్ధుని జననం బును గస్టంబు; 38 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> dc4zo06hdfgkb49pg1l9h2it67a1uu8 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/80 104 211910 552420 2026-04-10T03:18:52Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము పాపంబెద్దియు నొనర్పక పుణ్యంబుఁ గావించుచుఁ మును శుద్ధముగ నొనర్చుటయే సమసబుద్ధులయొక్క ప్రబోధ. 053 ప్రబుద్ధులు తమము యొక్కృష్టత పమనియు దీర్ఘాను భూత పీడనంబునే యుత్కృ...' 552420 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము పాపంబెద్దియు నొనర్పక పుణ్యంబుఁ గావించుచుఁ మును శుద్ధముగ నొనర్చుటయే సమసబుద్ధులయొక్క ప్రబోధ. 053 ప్రబుద్ధులు తమము యొక్కృష్టత పమనియు దీర్ఘాను భూత పీడనంబునే యుత్కృష్టనిర్వాణంబనియు నుడువు దురు. ఏలయన నితరులఁ గొట్టువాఁడు ప్రవజితుఁడు కానే రఁడు. ఇతరుల నవమానించువాఁడు శ్రమణుండు కానే రఁడు. నిందింపకుండుటయుఁ, గొట్టకుండుటయు, ధర్మనిగ్రహు డై యుండుటయు, మితముగ భుజించుటయు, నేకాంత స్వపనాసన కల్పనంబును, వ్యుత్కృష్ట చింతనముల మన మున నిడుకొనుటయు ననునివియే ప్రబుద్ధుని బోధలు. కనకటంకవర్షంబుననైనఁ గామోపశమనంబు కానేరదు. కామంబు లల్సరుచిమంతంబులును, వ్యధాజనకంబులు నని యెవఁడు గు రైఱుంగునో వాఁడే విబుధుండు. సుప్రబుద్ధుండైన ఛాత్రుండు స్వర్గ సౌఖ్యములయం దైనను దృప్తిఁగనఁడు; అట్టివాఁడు కామనాశంబుననే మోదంబుఁ గనును. 30 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ర<noinclude><references/></noinclude> 60sh918i0qoy43j0ac0cjh84n5bcvmp పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/81 104 211911 552421 2026-04-10T03:19:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధర్ముపదము భయప్రచోదితు లై నరులు నగవననికుంజ పవిత్ర తరులను శరణుచొత్తురు. అల కాని యట్టి శరణ్యము భద్రంబైనది కాని, శ్రేష్ఠతమం బైనది కాని కాదు. అట్టి యాశ్రయముఁ జెందిన నరుఁడు వ్య...' 552421 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధర్ముపదము భయప్రచోదితు లై నరులు నగవననికుంజ పవిత్ర తరులను శరణుచొత్తురు. అల కాని యట్టి శరణ్యము భద్రంబైనది కాని, శ్రేష్ఠతమం బైనది కాని కాదు. అట్టి యాశ్రయముఁ జెందిన నరుఁడు వ్యధా విముక్తుండు కానేరఁడు. QJF ఎవ్వాఁడు బుద్ధునికిని, ధర్మమునకును, సంఘమునకును శరణుచొచ్చునో ఎవ్వాఁడు నిర్మలంబగుబుద్ధితో నీచతుగ్గు ణత త్త్వమును గాంచునో: (ఆత త్త్వము లెవ్వియనిన) వ్యధ, వ్యధోత్పత్తియు, వ్యధా నాశనంబును, వ్యధోపశమనంబునుం బొందించు నష్టగుణ మార్గంబును. శేషత అవియే శ్రేయోదాయకంబులగు శరణ్యంబులు; 3 మములగు నాశ్రమములు; అట్టి యాశ్రమము జేరున పుడు మనుజుఁడు దుఃఖవిముక్తుండగును. 630 అట్టి యతిమానుషవ్యక్తి సులభముగఁ గనుఁగొనఁ “బడఁడు; అట్టివాఁ డెల్లెడల నుద్భవిషఁడు; అట్టియోగియె చట జననంబుఁ గాంచునో యట్టికులము వృద్ధిఁ జెందును. 3 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> hbosr82ywkpe2qsbcvhjn6n777syq3y పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/82 104 211912 552422 2026-04-10T03:19:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ప్రబుద్ధోద్భవంబు సుఖ ప్రదంబు; సుధర్మబోధ సుఖప్ర దంబు; సంఘశాంతి సుఖప్రదంబు; శాంతిమయులగువారి భక్తి సుఖ ప్ర దంబు, 378 ఎవ్వాఁడు దుష్ట సంఘంబుల నతిక్రమించి, దుఃఖ ప్రవా హము...' 552422 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ప్రబుద్ధోద్భవంబు సుఖ ప్రదంబు; సుధర్మబోధ సుఖప్ర దంబు; సంఘశాంతి సుఖప్రదంబు; శాంతిమయులగువారి భక్తి సుఖ ప్ర దంబు, 378 ఎవ్వాఁడు దుష్ట సంఘంబుల నతిక్రమించి, దుఃఖ ప్రవా హమునుదాటి, విముక్తుండై, భయరహితుఁడుకు బూజా పండునునైన బుద్ధునిఁగాని, తచ్చిష్యులనుగాని యర్చిం చునో యట్టివాని పుణ్యం బెవ్వని కైన దురవగాహంబు, పదునైదవయధ్యాయము సుఖము మనలను విద్వేషించువారలను ద్వేషింపన సుఖముగ జీవింతుముగాక ! విద్వేషరహితులమై మనలను ద్వేషిం చువారలతోఁగలిసి జీవింతము ! OF2 ఆర్తులమధ్య నానార్తులమై సుఖముగ జీవింతుముగాక ! దురాశాపరులమధ్యమున దురాశావిముక్తులమై జీవిం తము. ४० OFS CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 5eq0eln359p8ikqcy2lwjuawjq0w2hd పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/83 104 211913 552423 2026-04-10T03:19:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము దురాశాపరులమధ్యమున దురాశావిముక్తులమై జీవిం తుముగాక! దురాశాపరులమధ్యమున దురాశావిముక్తుల మై జీవింతము. కించి లైన నాత్మీయంబని నుడువకుండియు సౌఖ్యజీవుల మవుదుముగాక!...' 552423 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము దురాశాపరులమధ్యమున దురాశావిముక్తులమై జీవిం తుముగాక! దురాశాపరులమధ్యమున దురాశావిముక్తుల మై జీవింతము. కించి లైన నాత్మీయంబని నుడువకుండియు సౌఖ్యజీవుల మవుదుముగాక! సుఖులమై తేజోమయులగు నిలింపులు వలె నుందుము. 900 జయము విద్వేష జనకంబు; ఏలయనఁ బరాజతులు దుఃఖ- పూరితులు. ఎవ్వాఁడు జయాపజయంబులఁ బరిత్యజిం చెనో యట్టివాఁడు సంతృప్తుఁడై సౌఖ్యముఁ గాంచును. కామనమానంబగు నగ్ని లేదు; విద్వేషముకంటెఁ బరా జయము లేదు; ఈ దేహమువంటి దుఃఖములేదు. విశ్రా మముకంటె నుత్కృష్టంబగు సౌఖ్యము లేదు. ودو ఆమయంబులలో ముల్పీడ యధమంబు. అధికతమం బగు పీడా హేతుభూతంబు దేహంబు. నిర్వాణం పరమావధి. 903 దైవదత్తములలో నారోగ్య ముత్కృష్టంబు : తృప్తి ధనం బులలో శ్రేష్ఠతమంబు. విశ్వాసము బాంధవ్యములలో నుత్కృష్టంబు. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> g1huf5mvlwivdgavdd571w9133t0pko పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/84 104 211914 552424 2026-04-10T03:19:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఎవ్వాఁ డేకాంత తానిశ్చలత్వముల స్వాదుత్వమును జవి చూచెనో యట్టివాఁడు త్రాససాపవిముక్తుండై ధర్మపాన మాధుర్యము ననుభవించును. అరియుల దర్శనంబు శ్రేయోదాయకంబు. అట్టివారి...' 552424 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఎవ్వాఁ డేకాంత తానిశ్చలత్వముల స్వాదుత్వమును జవి చూచెనో యట్టివాఁడు త్రాససాపవిముక్తుండై ధర్మపాన మాధుర్యము ననుభవించును. అరియుల దర్శనంబు శ్రేయోదాయకంబు. అట్టివారితో జీవనంబు సంత తా'మోదకరంబు. మూఢులఁ జూడకుండిన నిశ్చయముగ నట్టివాఁడు సుఖముగ నుండును. دلو 305 మూఢజన సంఘముతోఁ బ్రయాణము చేయువానికి మార్గ మతిదీర్ఘముగ నుండును. మూఢులతో సహవాసము శత్రువులతో సహవాసమువలె సతతము దుఃఖము నాపా దించును. బంధుసమాగంబువలె విద్వాంసులతో సహ వాసము మోదజనకంబు. 902 కాన వివేకవంతుఁడు, మేధావంతుఁడు, విద్వాంసుఁడు, నతి శాంతుఁడు, ధర్మపరాయణుఁడునగు సరియుని ననుసరింప వలె; చంద్రుఁడు తారల ననుసరించునట్లు మనుజుఁడు వివే కియైన సత్పురుషు ననుసరింపవలె. 506 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 9ohprfo1hhhpnauxrld7ajff0yn94hk పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/85 104 211915 552425 2026-04-10T03:19:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పదునాఱవ యధ్యాయము ధమ్మపదము ఆనందము ఎవఁడు నృధాభిమానవంతుఁడై, ధ్యాన పరాయణుండు కాకయు, సత్యజీవనాశయమును గుర్తెఱుంగకయు, భోగా సక్తుఁడైయుండునో యట్టివాఁడు యుక్త కాలమున ధ్యాన పరాయణ...' 552425 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>పదునాఱవ యధ్యాయము ధమ్మపదము ఆనందము ఎవఁడు నృధాభిమానవంతుఁడై, ధ్యాన పరాయణుండు కాకయు, సత్యజీవనాశయమును గుర్తెఱుంగకయు, భోగా సక్తుఁడైయుండునో యట్టివాఁడు యుక్త కాలమున ధ్యాన పరాయణుండైన నరునిగాంచి యసూయఁ జెందును. అంగా సుఖావహంబులు కాని దుఃఖకరవిషయముల నన్వేషింపఁ గూడదు. సంతోషదాయకం బగుదానిని బొందకుండుట వ్యధ. దుఃఖకరం బగుదానినిఁ బొందుటయు వ్యధయే. కాన నెద్ధానినైన మనుజుండు ప్రేమింపకుండును గాక ! ప్రియవస్తునాశంబు దుఃఖ కారణము. ఎవ్వార లెదాని నైనను ప్రేమింపకయు, విద్వేషింపకయు నుందురో యట్టి వారలు నిర్ని గళులు. 645 భోగములనుండి దుఃఖ ముద్భవించును. భోగములనుండి భీతి జనించును. ఎవఁడు భోగనిముక్తుఁ డగునో వానికి భయదుఃఖములు లేవు. GC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 2o2kqqkj3clrxobx94eoam8pbc6ccm3 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/86 104 211916 552426 2026-04-10T03:19:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము అనురాగమువలన దుఃఖ ముద్భవించును. అనురాగము వలన భయముజనించును. అనురాగవిముక్తునకు భయ దుఃఖము లుండవు. విషయసుథేచ్ఛవలన దుఃఖ ముద్భవించును. విషయసుఖే చ్ఛవలన భయము జనించును. ఎ...' 552426 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము అనురాగమువలన దుఃఖ ముద్భవించును. అనురాగము వలన భయముజనించును. అనురాగవిముక్తునకు భయ దుఃఖము లుండవు. విషయసుథేచ్ఛవలన దుఃఖ ముద్భవించును. విషయసుఖే చ్ఛవలన భయము జనించును. ఎవ్వాఁడు కామవిముక్తుం డో వానికి భయదుఃఖము లుండవు. ప్రేమనుండి దుఃఖ ముద్భవించును. ప్రేమనుండి భయము జనించును. ఎన్వాఁడు ప్రేమవిముక్తుండో యట్టివానికి దుఃఖభయము లుండవు. లోభంబువలన దుఃఖ ముద్భవించును. లోభమునుండి భయము జనించును. లోభవిముక్తుం డగువానికి భయ దుఃఖము లుండవు. 346 సచ్చరితుండును, మేధావియును, న్యాయ ప్రవర్తకుండును, సత్యవాదియు, స్వవస్తునిరతుఁడును నగువానిని బ్రపంచ ము గారవించును. మన ఎవ్వానియందు నిర్వాణేచ్ఛ జనించినదో, సంతృప్త స్కుండైన యెవ్వానిచింత లవ్యామోహితంబులో యట్టి వాఁ డూర్ధ్వస్తోతనుఁడని పిలువఁబడుచున్నాఁడు. అంత CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> gfnidluxfozx3bwo9c7rta941yjb8c1 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/87 104 211917 552427 2026-04-10T03:20:07Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము బంధువులు, మిత్రులు, ప్రియులును, జిరకాలము పరదేశ వాసముఁ గావించి సుఖముగఁ దిరిగి యింటికి వచ్చిన వాని కభివందనంబుఁ గావింతురు. 167 బంధువు లిష్టుండగు ప్రయాణస్థున కభివందనం...' 552427 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము బంధువులు, మిత్రులు, ప్రియులును, జిరకాలము పరదేశ వాసముఁ గావించి సుఖముగఁ దిరిగి యింటికి వచ్చిన వాని కభివందనంబుఁ గావింతురు. 167 బంధువు లిష్టుండగు ప్రయాణస్థున కభివందనంబు కావించు నట్లు సచ్చరితుని స్వపుణ్యకర్మలు పరలోకంబున నధిగ మించును. కోసము వదు నేఁడవ యిఛ్యాయము هوو కోపమును ద్యజించి నిగర్వియై నరుఁడు బంధవిచ్ఛేదనంబు కావింపవలయును. నామరూపములయందు లగ్నమన స్కుండుకాక, దేనిని దనదని నుడువక యుండువానికిఁ గష్టంబులు కలుగవు. 056 పరిభ్ర మించురథంబు నడ్డునట్లు కోపంబు నుడిగించినవానినే రథనియంత యని పిలిచెదను. తదితరులు రశ్మిగ్రాహులు. ४x CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> tokjfr9nap98q0zxz1e8ouqdzggq2vu పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/88 104 211918 552428 2026-04-10T03:20:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము కోపమును బ్రేమచే జయింపవలె; దుష్టత్వమును సచ్చరి తంబుచే జయింపవలెను; లుబ్ధత్వము నీవిచేతను, సత్య మును సత్యముచేతను జయింపవలెను. 9.93 సత్యమును నుడువుము; కోపమునకు లోనుగాకు...' 552428 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము కోపమును బ్రేమచే జయింపవలె; దుష్టత్వమును సచ్చరి తంబుచే జయింపవలెను; లుబ్ధత్వము నీవిచేతను, సత్య మును సత్యముచేతను జయింపవలెను. 9.93 సత్యమును నుడువుము; కోపమునకు లోనుగాకుము; కోరిన వారికి నీధనము నిమ్ము! ఈసోపాన త్రయము నిన్ను దేవసాన్నిధ్యమునకుఁ గొంపోవును. ఎవ్వాని కైన హింస కావింపక యాత్మనిగ్రహము కలిగి సంచరించుసిద్ధులు నిర్వాణమును బొందుదురు. చేరినవారికి దుఃఖము లేదు. الاوو ఎల్లపుడును జాగరూకులై యెనరు రేయుంబవళ్లు జ్ఞాన సంపాదనఁ గావించుచు, నిర్వాణార్థమై శ్రీమయొనర్చి పాటుపడుచుందురో యట్టివారి రాగము అడుగంటును. ఓయతులుఁడా ! "ఊరకయుండువానిని నిందింతురు. వా చాటుని నిందింతురు. మితభాషినిఁ గూడ నిందింతురు. అవని ననిందితుఁడు లేఁడు" అను నావ్యోక్తి కాదు. పూర్వమునుండియు నున్నదియే. ૪ యీనాఁటిది CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri دوو<noinclude><references/></noinclude> k5slpu9ldxpyimt3nf383ymueq3yz7h పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/89 104 211919 552429 2026-04-10T03:20:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఎల్లపుడును నిందితుండైనవాఁడు కాని, స్తుతింపఁబడు వాఁడు కాని, యీవఱ కెన్నఁడును లేఁడు; ఇప్పుడును లేఁడు; ఇఁక నెన్నఁడు నుండఁబోఁడు. విద్వాంసుండై జ్ఞానసుగుణశీలుండైన యెవ...' 552429 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఎల్లపుడును నిందితుండైనవాఁడు కాని, స్తుతింపఁబడు వాఁడు కాని, యీవఱ కెన్నఁడును లేఁడు; ఇప్పుడును లేఁడు; ఇఁక నెన్నఁడు నుండఁబోఁడు. విద్వాంసుండై జ్ఞానసుగుణశీలుండైన యెవ్వనిని బ్రాజ్ఞులు ప్రతిదినమును నకళంకుఁడని కీర్తింతురో, జంబూ ప్రవాహ 930 కనక నాణకంబువలె నట్టివాని నెవరు నిందింపఁదొడం గుదురు? అట్టివాఁడు బ్రహ్మచేఁగూడ శ్లాఘింపఁబడును. కాయప్రకోపమును వెఱువుము. దేహంబును నిగ్రహిం పుము; దైహికంబులగు పాపంబులఁ బరిత్యజింపుము. దేహంబుతో సౌశీల్యము నభ్యసింపుము. వాక్త్రకోపమును జాగ్రత్తతోఁ జూడుము; జిహ్వను నిగ్ర హింపుము. జిహ్వావిషయకంబులగు పాపంబులఁ బరిత జించి జిహ్వతో సౌశీల్యము నభ్యసింపుము. చిత్తవిషయం బగు ప్రకోపమును విడువుము. మనమును నిగ్రహింపుము. మనోవిషయంబులైన పాపములఁ బరి త్యజించి చిత్తసౌశీల్యము నభ్యసింపుము. 939 933 దేహమును, జి త్తమును, జిహ్వను నిగ్రహించు విద్వాం సులు నిశ్చయముగ నిగ్రహము కలవారు. 938 ba CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> i9vvfuxa9n1icafpxv88h7i3i9cqxng పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/90 104 211920 552430 2026-04-10T03:20:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము పదునెనిమిదవ యధ్యాయము మలము నీవు పండినయాకువ లె నున్నా వు; యమకింకరులు నీసమీ పమునకు వచ్చినారు; నీవు ప్రయాణోన్ముఖుఁడవు. ప్రయా ణోపకరణ రహితుండవు. 93 ద్వీపముం గావించుకొను...' 552430 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము పదునెనిమిదవ యధ్యాయము మలము నీవు పండినయాకువ లె నున్నా వు; యమకింకరులు నీసమీ పమునకు వచ్చినారు; నీవు ప్రయాణోన్ముఖుఁడవు. ప్రయా ణోపకరణ రహితుండవు. 93 ద్వీపముం గావించుకొనుము. లెస్సఁగఁ బాటుపడుము; ప్రాజ్ఞుండవై యుండుము. నీకలుషంబు లుద్ధూతంబులై నీవు సావరహితుండవైన, దివ్యంబగు నరియుల లోకంబు నకుం బోదువు. 93 నీజీవితము ముగిసినది. మరణ మాసన్నమైనది. మార్గ మున విశ్రాంతిస్థలం లేదు. మఱియుఁ బ్రయాణసామగ్రీ . 932 ద్వీపముం గావించుకొనుము; లెస్సఁగఁ బాటుపడుము. ప్రాజ్ఞుండ వై యుండుము. నీకలుషంబు లుద్ధూతంబులై నీవు పాపరహితుండవైన బునర్జన్మ క్షయరహితుండ వగుదువు. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> f6b7oqc8wbhl69rjn4hqgpqjc7uov1c పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/91 104 211921 552431 2026-04-10T03:20:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సమ్మపదము కంసాలివాఁడు రజతమాలిన్యము నెల్లొకదాని వెనుక · నొకటిగను, గొంచెము కొంచెముగను నిర్వాపయించునో, యట్లే ప్రాజ్ఞుండు కలుషములఁ బోఁగొట్టుకొనవలెను. అయోమలం బెట్లయోనాశనము...' 552431 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>సమ్మపదము కంసాలివాఁడు రజతమాలిన్యము నెల్లొకదాని వెనుక · నొకటిగను, గొంచెము కొంచెముగను నిర్వాపయించునో, యట్లే ప్రాజ్ఞుండు కలుషములఁ బోఁగొట్టుకొనవలెను. అయోమలం బెట్లయోనాశనము కావించునో యట్లే స్వకృత్యములు పాపి నవమార్గమునకుం గొంపోవును. దైవప్రార్థనల దూషణంబు తత్పునరుక్త్యభావంబే. గృహ . దూషణంబు తన్న వీకరణాభావం బే. దేహదూషణం బాల సశీలత్వము. జాగరూకుఁడై యుండువాని దూషణము ప్రమాదము. ზი స్త్రీ కళంకము వ్యభిచారము. ఉపకారికళంకము లోభ త్వము. ఇహపరముల నన్ని యవమార్గములును దోష యు క్తములు. అన్ని దోషములలో దుష్టతమంబగునది యొకటి కలదు: అవిధ్య దుష్టతమంబు. ఓ భిక్షుకులారా! ఆదోషమును విసర్జించి దోషరహితుల రగుఁడు. అ ర 3 లజ్జాహీనునకు, కాకశూరునకు, దుష్టకర్మునకు, ధూ ర్తునకుఁ, బాషశీలునకు జీవనం బతిసులభము. 988 ४ ४ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 6ltxj5v02r7ovnnmx04oe6vzaghmqjd పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/92 104 211922 552432 2026-04-10T03:20:58Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము నమ్రునకుఁ, బుణ్యాన్వేషకులకు, నాశావిరహితునకు, స్థిరునకు, నిష్కళంకునకు, విద్వాంసునకు జీవనంబు కష్ట సాధ్యము. అర జీవహింసకుఁడు, ననృతవాది, యదత్త వస్తుగ్రాహకుఁడు, అర మాద...' 552432 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము నమ్రునకుఁ, బుణ్యాన్వేషకులకు, నాశావిరహితునకు, స్థిరునకు, నిష్కళంకునకు, విద్వాంసునకు జీవనంబు కష్ట సాధ్యము. అర జీవహింసకుఁడు, ననృతవాది, యదత్త వస్తుగ్రాహకుఁడు, అర మాదక ద్రవ్యపాయి యిహమున నైనను స్వమూలోతన కుం డగును. ఓ మనుజుఁడా! నిగ్రహహీనులు దురవస్థ నున్న వారలని గ్రహింపుము. దురాశయుఁ బాపచరితంబును నిన్నుఁ జిర కాలము దుఃఖవంతునిగా నొనర్పకుండునట్లు జాగరూక తతో నుండుము. అరూ జనులు భక్త్యనుసారముగఁగాని, యథేచ్ఛగఁగాని దాన ముల నొసంగుదురు. మనుజుండు పరుల కీయఁబడిన భోజన పానీయంబులఁ గూర్చి కలతఁ జెందిన నట్టివానికి రేయుం బవళ్లు శాంతియుండదు. ఎవ్వానియందు నిర్మూలంబగునట్టి మనోవికారం బుద్ధృతం బయ్యెనో యట్టివాఁడు దివారాత్రములు శాంతియుక్తుం డగును. xo CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 06<noinclude><references/></noinclude> 0rn1xui65pmow8h4in0wdtokihg5pfc పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/93 104 211923 552433 2026-04-10T03:21:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ప్రకోపమువంటి యగ్ని లేదు. విద్వేష మువంటి సొర చేప: లేదు. అవివేకమువంటి జాలములేదు. దురాశ వంటి నిర్ణ రము లేదు. na ఇతరుల లోపములు నతిసులభముగఁ గనవచ్చును. కాని తనలోపములను బరి...' 552433 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ప్రకోపమువంటి యగ్ని లేదు. విద్వేష మువంటి సొర చేప: లేదు. అవివేకమువంటి జాలములేదు. దురాశ వంటి నిర్ణ రము లేదు. na ఇతరుల లోపములు నతిసులభముగఁ గనవచ్చును. కాని తనలోపములను బరిశీలించుట యతికష్టంబు; ప్రతివేళ్ముని లోపముల నూఁకవలెఁ జెరువునుగాని ద్యూత పరాయణుని నుండి యెట్టులు వంచకుఁడు దుష్టాక్షికల దాఁచునో యట్లే మనుజుండు స్వలోపంబుల దాఁచుకొనును. మనుజుఁ డితరుల లోపముల నన్వేషించుచు సతతముఁ దా నవమానితుండనని యనుకొనునో యట్టివాని రాగ ద్వేషాదులు వృద్ధిఁ జెందును. అతఁడును రాగవినాశంబున కతిదూరుఁడై యుండును. 83 ఆకాశమున మార్గములేదు; మనుజుండు బాహ్యచరితం బులవలన శ్రమణుఁడు కానేరఁడు. ప్రపంచమున జనులు మిథ్యాగర్వమునఁ బ్రీతిఁ జెందుదురు. తథాగతులు మాత్ర మహంకారశూన్యులు. ఆకాశములో మార్గము లేదు. బాహ్యచరితంబువలన మను జుఁడు శ్రమణుఁడు కానేరఁడు. నాశరహితములైన జీవ SRI JAGADGURU VISHWARADHYA JNANA SIMHASAN JNANAMANDIR a CC-0. Jangamwadi Matheon. Digitized by eGangotri LIBRARY Jangamawadi Math, Varanasi<noinclude><references/></noinclude> pgi5ydn1xx20hjkuttalx3y9t675djm పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/94 104 211924 552434 2026-04-10T03:21:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము జంతువులు లేవు. ప్రబుద్ధులు మాత్రమే సంక్షోభమును బొందరు. ధర్మపరుడు పందొమ్మిదవ యధ్యాయము బలాత్కారము:గ నెవ్వాఁ డే కార్యమునైనఁ గావించునో యట్టివాఁడు ధర్మపరుఁడు కాఁడు...' 552434 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము జంతువులు లేవు. ప్రబుద్ధులు మాత్రమే సంక్షోభమును బొందరు. ధర్మపరుడు పందొమ్మిదవ యధ్యాయము బలాత్కారము:గ నెవ్వాఁ డే కార్యమునైనఁ గావించునో యట్టివాఁడు ధర్మపరుఁడు కాఁడు. ధర్మాధర్మ విచక్షణ పరుఁడై, విద్వాంసుఁడై, బలాత్కారమునఁ గాక పరులకు న్యాయమున, ధర్మమున నియంత యగుచున్నాఁడో, యెవ్వాఁడు మతిమంతుఁడై ధర్మంబుచే రక్షితుం డగు చున్నాఁడో యట్టివాఁడు ధర్మపరుఁడని యనఁబడు చున్నాఁడు.. వాచాటతవలన మనుజుఁడు పండితుఁడు కానేరఁడు. ఎవ్వాఁడు క్షమాయుక్తుండై, త్యక్తవిద్వేషభయుఁడగు చున్నాఁడో యట్టివాఁడు విద్వాంసుఁ చున్నాఁడు. డనఁబడు. كلام CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 0j8adbn9oq2w6e3lxyo5s65odee3wsu పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/95 104 211925 552435 2026-04-10T03:21:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము 'వాచాటక ధర్మరక్షణముఁ జేయనేరదు; మనుజుండు కొలఁదిగా నేర్చియు ధర్మస్వరూపమును గాంచిన నట్టి వాఁడు ధర్మనిరాకరణంబుఁ గావింపక ధర్మధరుఁడై యుం దును. علاو మనుజుఁడు పలితశిరము...' 552435 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము 'వాచాటక ధర్మరక్షణముఁ జేయనేరదు; మనుజుండు కొలఁదిగా నేర్చియు ధర్మస్వరూపమును గాంచిన నట్టి వాఁడు ధర్మనిరాకరణంబుఁ గావింపక ధర్మధరుఁడై యుం దును. علاو మనుజుఁడు పలితశిరమువలనఁ బూజార్హుఁడు కాఁజాలఁ డు. వయసున వృద్ధుఁడైనను మిథ్యాగర్వంబున వృద్ధుఁడని పిలువఁబడును. EO ఎవ్వానికి సత్యసాధుత్వ ప్రేమనిగ్రహము లున్నవో, యెవ్వాఁ డనముండును, విద్వాంసుండునునై యుండునో యట్టివాఁడు వృద్ధుఁడని పిలువఁ బడుచున్నాఁడు. ౨౬౧ అసూయాపరుఁడై, లోభియై, వంచకుఁడై యున్న మను జుఁడు వాచాటత వలనఁగాని, దేహవర్ణ సౌందర్యమునఁ గాని పూజార్హుండు కానేరఁడు. அட்த ఎవ్వానియందుఁ బూర్వోక్తం బంతయు నిర్మూలంబుగ ఛేదితంబగునో యట్టివాఁడు విద్వేష రహితుండై, వివేకియై, పూజనీయుఁ డగుచున్నాఁడు. 3 03 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 2a7l6lxttjjppajq26t9iiy9plw8pjk పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/96 104 211926 552436 2026-04-10T03:21:38Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము అనృతంబు వల్కునట్టి యళి, తుండగు పురుషుండు శ్రీమణుఁడు కానేరఁడు. కామలోభ బందీకృతుఁడైన మనుజుఁడు శ్రమణుఁడు కాఁగలఁడా? ఎవ్వాఁ డల్పమైనను బాపమును సతత మంత మొందింపఁ గలఁడో య...' 552436 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము అనృతంబు వల్కునట్టి యళి, తుండగు పురుషుండు శ్రీమణుఁడు కానేరఁడు. కామలోభ బందీకృతుఁడైన మనుజుఁడు శ్రమణుఁడు కాఁగలఁడా? ఎవ్వాఁ డల్పమైనను బాపమును సతత మంత మొందింపఁ గలఁడో యట్టివాఁడు సర్వపాపనాశంబువలన శ్రమణుఁ డని పిలువఁబడుచున్నాఁడు. మనుజుఁడు భిష్ నర్థించుటవలన భిషకుండు కానేరఁడు. ధర్మమంతయుఁ బరిగ్రహించువాఁడు భిక్షుం డగును గాని, బిచ్చమెత్తుకొనువాఁడు మాత్రము కానేరఁడు. ఎవ్వాఁడు పుణ్యపాపంబుల నణఁగఁ ద్రొక్కి పూతుండై లోకయాత్రను జ్ఞానంబుతో సల్పునో, యట్టివాఁడు భిఝుండని పిలువఁబడుచున్నాఁడు. జ్ఞానహీనుండైన మనుజుండు మౌన వ్ర తా చరణమువలన ముని కానేరఁడు. కాని పుణ్యంబుఁ బరిగ్రహించి పాపంబు బరిత్యజించు వివేకవంతుఁడు తత్కారణముననే ముని యగుచున్నాఁడు. ఈలోకమున నెవ్వాఁడు రెండు పక్ష ములను విచారించునో యట్టివాఁడు మునిగఁ బరిగణింప బడుచున్నాఁడు. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 8genj9z7x0igt3eum6t1j2i93ecm0dr పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/97 104 211927 552437 2026-04-10T03:21:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము జంతుహింసఁ గావించుట చే మనుజుం డార్యుఁడు కానే రఁడు; సర్వభూతానుకంప కలిగియుండుటచే మనుజు డార్యుఁడుగఁ బరిగణింపఁబడుచున్నాఁడు. సామాన్యజనుఁడు పొందనేరని శాంతినిఁ నేఁబ...' 552437 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము జంతుహింసఁ గావించుట చే మనుజుం డార్యుఁడు కానే రఁడు; సర్వభూతానుకంప కలిగియుండుటచే మనుజు డార్యుఁడుగఁ బరిగణింపఁబడుచున్నాఁడు. సామాన్యజనుఁడు పొందనేరని శాంతినిఁ నేఁబొందుట శిక్షా వ్రతమువలనఁగాని, యధిక పాండిత్యమువలనఁ గాని సమాధి ప్ర వేశంబువలనఁగాని, యేకాకియై యుండుటవలనఁ గానికాదు. ఓభిక్షులారా! కామవినాశంబగు వఱకును దృప్తులై యుండకుఁడు. మార్గము ఇరువదియవ యధ్యాయచూ అష్టగుణమార్గము శ్రేష్ఠతమమైన మార్గము. చతుర్గుణ తత్త్వములును దత్త్వములలో శ్రేష్ఠతమంబులు. నిష్కా మతధర్మములలో శ్రేష్ఠృతమంబు. చక్షుష్మంతుఁడు నరు లలో శ్రేష్ఠుఁడు. 923 మార్గమిదియే. శుద్ధజ్ఞానంబునకుఁ బోవుమార్గ మింకొకటి లేదు. ఈమార్గమునం జనుము. తదితరంబంతయు మార్గ కృతంబగ్గు వంచనంబె. ఆ ర CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> hclxxx3hhi8nakwpcf5af4v8mwsvnjm పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/98 104 211928 552438 2026-04-10T03:21:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఈమార్గము నవలంబించిన నీవు వ్యధానాశనంబును గావింతువు. కంటకోత్సారణ మార్గమునే గ్రహించి నపుఁడు నే నీతత్వమును బోధించితిని. నీయంతట నీవే యీ ప్రయత్నమును గావింపవలయును. త...' 552438 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఈమార్గము నవలంబించిన నీవు వ్యధానాశనంబును గావింతువు. కంటకోత్సారణ మార్గమునే గ్రహించి నపుఁడు నే నీతత్వమును బోధించితిని. నీయంతట నీవే యీ ప్రయత్నమును గావింపవలయును. తథాగతులు బోధకులై యున్నారు. మార్గ ప్ర విష్టు లేన విమృశ్య కారులు మారపాశవిముక్తులు. કટ્ટ “సృజింపఁబడిన సమస్తవస్తువులు నశించును. ” అను నీ తత్త్వము నెఱిఁగినవాఁడు దుఃఖమునను సహనశీలుండై యుండును. ఇదియే పవిత్రతకు మార్గము. 922 “సృజింపఁబడిన సమస్తవస్తువులును దుఃఖవ్యధా కారక ములు”అను నీతత్వమును గుర్తెఱిఁగినవాఁడు సహనశీ లుండై యుండును. ఇదియే పవిత్రతకు మార్గము. ౨౭౮ రూపములును మాయారూపములైనవి" అను తత్త్వమును గుర్తెఱిఁగిన వాఁడు సహనశీలుండై యుండును. ఇదియే పవిత్రతకు మార్గము. 326 యౌవనబలము కలిగియు నుత్థానసమయమున శయ్యపై నుండి లేవక యలసుండై, మనశ్చింతా దౌర్బల్యములు X CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri ગ<noinclude><references/></noinclude> 5uyavpmexiypqpoeiw2wp3xf8jgddnh పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/99 104 211929 552439 2026-04-10T03:22:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదమణ కలవాఁడై, యలనశీలుండై యుండు సోమరి జ్ఞానమార్గ మును గనుంగొన నేరఁడు. జాగరూకతతో మాటలాడుచు, మనోనిగ్రహంబు కలిగి మనుజుఁడు శారీరకంబగు నధర్మంబుఁ గావింపకుండుఁ గాక! ఈ త్రివి...' 552439 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదమణ కలవాఁడై, యలనశీలుండై యుండు సోమరి జ్ఞానమార్గ మును గనుంగొన నేరఁడు. జాగరూకతతో మాటలాడుచు, మనోనిగ్రహంబు కలిగి మనుజుఁడు శారీరకంబగు నధర్మంబుఁ గావింపకుండుఁ గాక! ఈ త్రివిధకర్మ మార్గానువర్తియైన, విద్వాంసుల చేయ బ్రదర్శితంబగు మార్గము నట్టివాఁడు చేరఁగలఁడు. ౨౮౧ ఉత్సాహమున జ్ఞానంబు సంపాదనీయంబు; ఉత్సాహా భావంబున జ్ఞానము నశించును. ఈ ద్వివిధంబగువృద్ధి యమార్గమును గుర్తెఱింగిన మనుజుఁడు జ్ఞానాభివృద్ధి యగునటులఁ బ్రవర్తించుఁ గాక ! ونو ఒక్కతరువునే కాక రాగవనమును సర్వమును ఛేదిం పుఁడు. రాగవనంబునుండి యపాయము సంభవించును... కామవనంబును వనస్థములఁగూడను చ్ఛేదించిన నోభితుకు మీరు వనవిముక్తులై స్వాతంత్ర్యము జెందు దురు. 3 పురుషునకు స్త్రీయందైన మోహము పోవువఱకును నాతని మనము, పాలు త్రాగుదూడ తల్లికి లోఁబడియుం. డునట్లు బంధనంబున నుండును. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri శ 18<noinclude><references/></noinclude> 1zxx3dl19eaa6a7bkmb3mgxyrar500b పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/100 104 211930 552440 2026-04-10T03:22:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము స్వహస్తములతో నాత్మ ప్రేమను శిశిరపద్మంబుమాడ్కి నుఛ్ఛేదింపుము! శాంతిమార్గమును భజింపుము. సుగతు నిచే 'నిర్వాణము ప్రదర్శితంబైనది. “ఇచ్చట నేను శిశిరవర్ష గ్రీష్మర్త...' 552440 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము స్వహస్తములతో నాత్మ ప్రేమను శిశిరపద్మంబుమాడ్కి నుఛ్ఛేదింపుము! శాంతిమార్గమును భజింపుము. సుగతు నిచే 'నిర్వాణము ప్రదర్శితంబైనది. “ఇచ్చట నేను శిశిరవర్ష గ్రీష్మర్తుల వసియింతును.” అని చింతించుచు మూడుండు మరణమును సరకుసేయఁడు. సుషుప్తజనగ్రామంబుభౌతిఁ బుత్ర గోధనములయందు మోహవిముక్తిం జెందని నరుని మృత్యు వాసన్నమై కొం పోవును. 952 పుత్రులుగాని, జనకుండుగాని, బంధువులుగాని, సాహా -య్యకారులు కానేరరు; మృత్యు గ్రస్తుండగు వానికి బంధు వులనుండి సాహాయ్యమేమియు నుండదు. ک کو ఏతాజ్ జ్ఞానయుక్తుండై, వివేకియై, సచ్చరితుండై, నిర్వాణ మార్గమును నిర్విఘ్నముగ నొనర్పవలయును. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> r68aw13f8ocnuvzugi9yb7rp8nqyan7 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/101 104 211931 552441 2026-04-10T03:22:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము సంకీర్న ము ఇరువదియౌకటన యధ్యాయము అల్పసుఖవిసర్జనంబుచే నధిక సుఖంబును బొందఁగల్గిన ప్రాజ్ఞుఁ డల్ససుఖమును విడనాడి యధికసుఖము నా శ్రీ యింపవలయును. 0.35 ఎవ్వఁడైన నితీరులక...' 552441 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము సంకీర్న ము ఇరువదియౌకటన యధ్యాయము అల్పసుఖవిసర్జనంబుచే నధిక సుఖంబును బొందఁగల్గిన ప్రాజ్ఞుఁ డల్ససుఖమును విడనాడి యధికసుఖము నా శ్రీ యింపవలయును. 0.35 ఎవ్వఁడైన నితీరులకు బాధఁ గావించుటచే సౌఖ్యమును బొందఁగోరునో యట్టివాఁడు విద్వేష పాశలగ్నుఁడై విద్వే షవిముక్తుం డెన్నటికిని గా నేరఁడు. ఆజింపఁబడుచున్నది. అకరణీయం బాచరింపఁబడుచున్నది. దుర్ని గ్రహులయు నవివేకులయు గోర్కె లెల్లప్పుడును వృద్ధిఁ బొందుచుండును. F9 ఎవ్వారిజాగరూకత కాయగతమైనదో, ఎవ్వ రకరణీయం బుల ననుసరింపరో, మఱియు నెవ్వ రాచరింపవలసిన వానిని స్థిరముగ నాచరింతురో యట్టి యప్రమత్తులైన విద్వాం సుల కామంబు లంతంబు బొందును. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 3<noinclude><references/></noinclude> rhmrob14zeqz6d9glhxo7utewm063t6 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/102 104 211932 552442 2026-04-10T03:22:39Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము సబ్రాహ్మణుండు తలిదండ్రులను, రాజద్వయమును వధి యించినను, జనులతోఁగూడ రాష్ట్ర నాశం బొనర్చినను, నసంజాతవ్యధుండై చనును. బ్రాహ్మణుండు జనకులను, రాజపుంగవద్వయమును, దదుపరి...' 552442 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము సబ్రాహ్మణుండు తలిదండ్రులను, రాజద్వయమును వధి యించినను, జనులతోఁగూడ రాష్ట్ర నాశం బొనర్చినను, నసంజాతవ్యధుండై చనును. బ్రాహ్మణుండు జనకులను, రాజపుంగవద్వయమును, దదుపరి విఖ్యాతిఁ జెందిన నరుని వధియించినను నసంజాత వ్యధుండై చనును. గోతమశిష్యులు సతతము సుప్రబుద్ధులై యుందురు; మఱి యు వారిమనంబులు రేయుంబవలు బుద్ధబద్ధంబులై యుం . 36 గోతమశిష్యులు సతతము సుప్రబుద్ధులైయుందురు; మఱి యు వారిమనంబులు రేయుంబవళ్లు ధర్మబద్ధంబులై యుం 236 గోతమశిష్యులు సతతము సుప్రబుద్ధులై యుందురు; మఱియు వారిమనంబులు దివారాత్రములు సంఘబద్ధం బులై యుండును. గోతమఛాత్రులు సతతము విబుద్ధులైయుందురు; మఱియు వారిమనంబులు రేయుంబవళ్లు కాయగతంబు లై యుండును. 20 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> h1cu42c11tp88s8wh1qod2vglmrblvx పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/103 104 211933 552443 2026-04-10T03:22:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఎల్లప్పుడును గోతమఛాత్రులు సుప్రబుద్ధులై యుందురు; మఱియు వారిమనంబుఱు రేయుంబవ ళ్లనుకంపానుర క్త ములై యుండును. 300 గోతమశిష్యులు సుప్రబుద్ధులై యుందురు; మఱియు వారి మనం...' 552443 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఎల్లప్పుడును గోతమఛాత్రులు సుప్రబుద్ధులై యుందురు; మఱియు వారిమనంబుఱు రేయుంబవ ళ్లనుకంపానుర క్త ములై యుండును. 300 గోతమశిష్యులు సుప్రబుద్ధులై యుందురు; మఱియు వారి మనంబులు రేయుంబవళ్లు ధ్యానాసక్తములై యుండును. సంసారపరి త్యాగము కష్టము; సంసారానుభవంబుకష్టము; సంఘారామంబు కష్టభూయిష్ఠంబు; గృహంబులు వ్యధా: జనకంబులు; సమానులతో జీవనంబు వ్యధఁ గలిగించును; సతతమును బర్యటనము చేయు భిక్షు వుదుఃఖపరివృతుండు కాన నేభిక్షుకుండును సతతమును బర్యటనముఁ గామిషం గూడదు. అప్లైన వాఁడు దుఃఖపరివృతుండు కానేరఁడు. విశ్వసనీయుండును, సచ్చరితుండును, విఖ్యాతుండును, ధనికుండును, నగుమనుజుం డెచటనుండునో యచట నాతఁడు సమ్మానింపఁబడును. 303 హిమావృత నగంబులభాతి సచ్చరితు లతిదూరమున నుం డియుఁ బ్రకాశింతురు; నిశాసమయంబున విముక్తంబైన బాణంబు మాడ్కి దుష్టులదృశ్యులగుచున్నారు. 30 ర CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> obuqjzr4csk2mp1eeq6klurcsl5op1c పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/104 104 211934 552444 2026-04-10T03:22:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఎవ్వాఁ డనవరత మద్వితీయుండై, శయననదనవిధుల నభ్య సించుచుండునో, యట్టివాఁ డాత్మనిగ్రహుఁడై వనంబున నివసించుచుండినట్లు సర్వకామ వినాశంబున నానందముఁ జెందుచుండును. అధోగతి....' 552444 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఎవ్వాఁ డనవరత మద్వితీయుండై, శయననదనవిధుల నభ్య సించుచుండునో, యట్టివాఁ డాత్మనిగ్రహుఁడై వనంబున నివసించుచుండినట్లు సర్వకామ వినాశంబున నానందముఁ జెందుచుండును. అధోగతి. ఇరువది రెండవ యధ్యాయము 30%2 ఎవ్వాఁ డసత్యమును బల్కు నో యట్టివాఁడు నరకంబు. నకుం జనును. దుష్కార్యము నొకదాని నొనర్చి దానిం జేయలేదని నుడువువాఁడును నరకంబునకుం జనును. మర ణానంతరమున వారిరువురును సమానులే. పరలోకంబున దుష్కర్మయుక్తులు. కాషాయవస్త్రాచ్ఛాదిత స్కంధులగు ననేకులు నిగ్రహ రహేతులును దుస్ధితులును; అట్టి దుష్టకర్ములు నరకంబుస కుం బోదురు. దుష్టుండగు నిగ్ర హహీనుఁడు 302 302 పరిగ్రహమువలన జీవించుటకంటె నగ్ని శిఖోపమంబగు తప్తాయోగోళమును దిగమ్రింగుట మేలు. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 305<noinclude><references/></noinclude> tfeh17mc6h5iepgk90wrma40xm2pwel పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/105 104 211935 552445 2026-04-10T03:23:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము. ఆగామి ఫలము నాలోచింపని పరదారాభిలాషి యగు నరుఁడు నాల్గింటిని బొందును. అపకీర్తియు, నసుఖదాయక మగు సెజ్జయు, మూఁడవది దండనంబును, దుదకు నరక మును. 30: అపకీర్తియుఁ, బాపనూర్గము...' 552445 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము. ఆగామి ఫలము నాలోచింపని పరదారాభిలాషి యగు నరుఁడు నాల్గింటిని బొందును. అపకీర్తియు, నసుఖదాయక మగు సెజ్జయు, మూఁడవది దండనంబును, దుదకు నరక మును. 30: అపకీర్తియుఁ, బాపనూర్గమును, భీతయగు దానికౌఁగిటభీతం డగువాఁడు చెందుముహూర్తమాత్రంబగు సౌఖ్యమును, మఱియు రాజదండనంబును వానికిం గలుగును. మనుజుం డెవ్వాఁడును బరదారం గూర్చి తలంపరాదు. దుర్గ్రహిత కుశదళంబెట్లు హస్తంబును ఛేదించునో, య దురాచరితంబగు సన్న్యాసంబు నరకంబునకుఁ.. గొంపోవును. 300 నప్రమాదకృతంబగు కర్మయు, భంగవ్రతంబును, సాశం. కంబుగ బ్రహ్మచర్యానువర్తనమును, నను నివియన్ని యా.. విశేషఫలంబును నేనేరవు. 30 మనుజుం డెదానినైనఁ జేయవలసియుండిన దానిం జేయ నిమ్ము. దాని నాతఁడు దృఢముగఁ గావింపనిమ్ము! ప్రమ త్తుండగు యాత్రికుఁడు రాగధూళిని బహుళముగ విరఁ జల్లును. 303 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> rg906mtlurtq3te7lf7oem7do4lklx0 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/106 104 211936 552446 2026-04-10T03:23:20Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '-ధమ్మపదము పాపకార్యం ఒకృతముగ నేయుండిన మేలు. ఏలయన,మను' జుం డట్టిదానివలనఁ దరువాత విలపించును. సుకృతంబుఁ జేసిన మేలు. ఏలయన దానిం జేసిన తరువాత మనుజుఁడు దుఃఖమును జెందఁడు. 30 ర బహిరంత...' 552446 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>-ధమ్మపదము పాపకార్యం ఒకృతముగ నేయుండిన మేలు. ఏలయన,మను' జుం డట్టిదానివలనఁ దరువాత విలపించును. సుకృతంబుఁ జేసిన మేలు. ఏలయన దానిం జేసిన తరువాత మనుజుఁడు దుఃఖమును జెందఁడు. 30 ర బహిరంత స్సురక్షితంబగు ప్రాంతదుర్గంబుభాతి నరుండు తన్నుఁ గాచుకొననిమ్ము; క్షణమైనను వ్యర్థము చేయఁ గూడదు. ఏలయన యు క్త కాలమును బోనిచ్చువారు నర కంబున నుండునపుడు పీడనంబుఁ జెందుదురు. 30 జెందిన వారును, లజ్జఁ బొందఁగూడని విషయముల లజ్జింపఁదగినవిషయముల లజ్జింపనివారును, మిథ్యాసిద్ధాంత ములఁ బరిగ్రహించి పాపమార్గముం బ్ర వేశింతురు. 3౧౬ భయము చెందఁగూడనివానిఁ గూర్చి భీతిఁ జెందువాడలును. భీతిల్లఁ, దగిన వానింగూర్చి భయముఁ జెందని వారలును, మిథ్యావాదములఁ బరిగ్రహించి పాపమార్గముం బ్రవే 302 నిధిఁ గూడని విషయము నిషేధించువారలును, నిషే ధింపఁదగిన విషయముల నిషే. ధింపనివారలును మిథ్యా చాదంబులఁ బరిగ్రహించి పాపమార్గమునఁ బ్రవేశింతురు. €5 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 2ah7bucogqy0ql6c2z2czc9o402en1j పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/107 104 211937 552447 2026-04-10T03:23:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నమ్మపదము నిషేధింపఁబడిన దానిని నిషేధింపబడిన దానిఁగను, నిషే ధింపబడని దానిని నీ షేధింపఁబడనిదానిగను, గుర్తెఱింగిన వారలు సత్యవాద సమాశ్రయంబునఁ బుణ్యమార్గము ననుసరింతురు. 30F ఇర...' 552447 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నమ్మపదము నిషేధింపఁబడిన దానిని నిషేధింపబడిన దానిఁగను, నిషే ధింపబడని దానిని నీ షేధింపఁబడనిదానిగను, గుర్తెఱింగిన వారలు సత్యవాద సమాశ్రయంబునఁ బుణ్యమార్గము ననుసరింతురు. 30F ఇరువదిమూఁడవ యధ్యాయము జగము .. 3.90' యుద్ధంబున ధనుర్విము కంబగు బాణంబు నెట్లు దంతి సహిం చునో యట్లే నేను మౌనముతో నిందను సహించెదను; ఏలయనఁ బ్రపంచంబు దుశ్శీలంబు. యుద్ధంబునకు వశీకృతదం తావళములను గొంపోవుదురు. సార్వభౌముండును వళీకృత గణావరోహణంబుఁ గామి చును. మౌనముతో నిండను సహించునట్టిదాంతుండు నర శ్రేష్ఠుండు: 3.90 వశీకృత వేసరములు శ్రేష్ఠములు. ఆశ్లే- విఖ్యాతంబులగు- సైంధవాశ్వంబులును పృథుదంతయుక్తము లగు గజము. × CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri EX.<noinclude><references/></noinclude> 75y87pslfy6gadoicc6afwr1hahwy1d పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/108 104 211938 552448 2026-04-10T03:23:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము లును శిక్షితములై శ్రేష్ఠము లగుచున్నవి. 'ఆత్మనిగ్ర హముఁ గావించువాఁడు మఱియు శ్రేష్ఠుండు. 399 ఏలయన నీజంతువులలో నెవ్వఁడై నను న ప్రవిష్టు దేశంబును -(నిర్వాణంబును) జేర నే...' 552448 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము లును శిక్షితములై శ్రేష్ఠము లగుచున్నవి. 'ఆత్మనిగ్ర హముఁ గావించువాఁడు మఱియు శ్రేష్ఠుండు. 399 ఏలయన నీజంతువులలో నెవ్వఁడై నను న ప్రవిష్టు దేశంబును -(నిర్వాణంబును) జేర నేరఁడు. కాని యా ప్రదేశమునకు సుదాంతుఁ డగు నకుండు సనును. 393 దుర్నిరోధం బగునట్టియు, మదస్రావము కల్గినట్టియు, ధన పాలక నామమునఁ బఱఁగు దంతి బంధింపఁబడిన యొక్క కబళంబునైనఁ దినదు. గజంబు, గజవనంబు, నత్యంతము నభిలషించుచుండును. 398 * వీన దేహుండును, దిండిపోతును, నిద్రాళుండును, శయ్యా పరివర్తనుండు బుద్ధిహీనుండైన నరుండు శాతాపుష్ట సూ కరంబుభాతిఁ బునర్జన్మముగాంచును. 3.9 ఈనామనము పూర్వ మిటు నటు నిచ్చకువచ్చినట్లు పరి భ్రమించుచుండెడిది. అంకుశపాణియగు మావటీఁడు మత్తగజంబును లోంగఁదీయును లెస్సఁగ నాచిత్తమును - వశీకరించెద. 3. DE CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> qtv7d18tcnziompduxgxnyo0sfvmu8g పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/109 104 211939 552449 2026-04-10T03:23:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము విచారశూన్యుడవు కాకుము. చిత్తమును జాగరూక తతోఁ జూచుకొనుము. పంకనిర్మగ్నంబగు గజంబు భా ఔవమార్గమునుండి వెడలిచనుము, 392 ప్రాజ్ఞుండును, సాధుచరితుండును, ననుగామియు నగు స్న...' 552449 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము విచారశూన్యుడవు కాకుము. చిత్తమును జాగరూక తతోఁ జూచుకొనుము. పంకనిర్మగ్నంబగు గజంబు భా ఔవమార్గమునుండి వెడలిచనుము, 392 ప్రాజ్ఞుండును, సాధుచరితుండును, ననుగామియు నగు స్నేహితుని నరుండు కనుఁ గొనిన వానితోఁ గూడ సమస్తా పాయముల జయించి సంతుష్టుండై విచారశీలుండై యట్టి వాఁడు పోవచ్చును. 395 ప్రాజ్ఞుండును, సాధుచరితుండును, ననుగామియు నగువానిని నరుండు కనుఁగొన లేకయుండినఁ బరాజిత దేశంబును విడ నాడు సార్వభౌమునిభాతియు, వనంబున గజంబురీతిని దా నొక్కకుండే పోవలయును. 3 F ఏకాకియై జీవించుట శ్రేష్ఠము. బుద్ధిహీనునితో స్నేహ "ము వలను పడఁదు. పవిత్ర్యుడై యల్ప కాముఁడై వనంబున సంచరించు నగంబునూడ్కి మనుజుం డొంటరిగఁ 'బోవలయును. 330 సమయము వచ్చుతటి స్నేహితులు సుఖ ప్రదులు. కార బెద్దియైన సంతోషము సుఖప్రదంబు దుఃఖపరిత్యా . ణం : గంబు సుఖప్రదంబు. 330 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri a<noinclude><references/></noinclude> 7p0arvu9ib0c2kfqp6qwik8askb8uo1 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/110 104 211940 552450 2026-04-10T03:24:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''ఖమ్మపదము మాతృత్వము సుఖప్రదంబు. పితృత్వము సుఖప్రదంబు. శ్రవణత్వము సుఖప్రదంబు. బ్రాహ్మణత్వంబు సుఖ ప్రదంబు. 339 "ముదిమీవఱకును నిలిచియుండు సద్వృత్తి సుఖప్రదంబు, సుప్రతిష్ఠితం...' 552450 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>'ఖమ్మపదము మాతృత్వము సుఖప్రదంబు. పితృత్వము సుఖప్రదంబు. శ్రవణత్వము సుఖప్రదంబు. బ్రాహ్మణత్వంబు సుఖ ప్రదంబు. 339 "ముదిమీవఱకును నిలిచియుండు సద్వృత్తి సుఖప్రదంబు, సుప్రతిష్ఠితంబైనభక్తి సుఖప్రదంబు. • ప్రజ్ఞాధిగమనంబు సుఖప్రదంబు. పాపపరిత్యాగంబు సుఖప్రదంబు. ఇరువది నాల్గవ యధ్యాయము 333 బుద్ధిహీనునితృష్ణ లతవలె వృద్ధిఁ జెందును. మర్కటం బడవియందు ఫలాన్వేషణంబుఁ గావించున ట్లట్టి వాఁడు జన్మమునుండి జన్మమునకుఁ బరుగు లిడుచుండును. 338 వశీక విష పూరితంబును, నుగ్రంబును నగు తృష్ణ యెవ్వని రించునో యట్టివాని దుఃఖంబులు వీరణ గ్రానంబు భాతి · వృద్ధిఁగాంచును. 33Я CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 387k2i3faqgdpmiqj3md5h58xm8vv5v పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/111 104 211941 552451 2026-04-10T03:24:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము, ఎవ్వాఁడు దుర్జయంబగు నీదారుణతృష్ణను జయించునో, యట్టివాని దుఃఖంబులు గమలపర్ణంబుల నుండి జలబిందు వులు జారిపోవు తెఱంగున నశించును. 33 "ఇచట సమావేశమైన విూరందఱును సుగంధ యు...' 552451 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము, ఎవ్వాఁడు దుర్జయంబగు నీదారుణతృష్ణను జయించునో, యట్టివాని దుఃఖంబులు గమలపర్ణంబుల నుండి జలబిందు వులు జారిపోవు తెఱంగున నశించును. 33 "ఇచట సమావేశమైన విూరందఱును సుగంధ యుక్తం బగు నుశీరమూలంబుఁ గోరువాఁడు వీరణ గ్రాసంబు నెటులు త్రవ్వివేయవలయునో, జల ప్రవాహంబు జెల్లును చ్ఛే దించునట్లును, మిమ్ముల మారుండను మోహకుండు. భంజింపకుండునట్లు మీరు తృష్ణామూలోతననముఁ గా వింపవలయును” అను నీవాక్యంబుల నే నుపదేశించెద. మూలం బక్షతంబుగ నుండిన, ఛేదింపఁబడిన వృక్షంబు సుస్థితంబై తిరిగి మొలచునట్లు తృష్ణాపకల్పకంబులు విధ్వం సితంబులగువఱకును జీవితంబను బాధ తిరిగి తిరిగి యావి ర్భవించుచుండును. 330 ఎవ్వానితృష్ణనంతోషము వైపునకుఁబోవుచు వట్రింశత్ .ప్రోతనంబుల నత్యంత బలిష్ఠంబో యట్టి యున్మార్గ ప్రవర్త కుని రాగసంజనిత కామంబుల నెడి తరంగపరంపరల నపన చును. 33F CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> np8l3zdwq3e8c5asnigxbm6qh4xm4ay పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/112 104 211942 552452 2026-04-10T03:24:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గమపదము ప్రోతనంబు లన్ని దిక్కులఁ బ్రవహించును. రాగవల్లి అంకురించుచుండును. రాగవల్లీ ప్రరోహంబు నీవు కాంచిన జ్ఞానంబుతో దానిమూలంబును ఛేదింపుము. 38 నరునిసుఖంబు లతిబహుళంబులును,...' 552452 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>గమపదము ప్రోతనంబు లన్ని దిక్కులఁ బ్రవహించును. రాగవల్లి అంకురించుచుండును. రాగవల్లీ ప్రరోహంబు నీవు కాంచిన జ్ఞానంబుతో దానిమూలంబును ఛేదింపుము. 38 నరునిసుఖంబు లతిబహుళంబులును, భోగానుకూలము లును. కామనిమగ్నులై భోగాన్వేషణము కావించు మానవులు తిరిగితిరిగి జన్మలయములం బొందుచుందురు. నరులు తృష్ణా ప్రచోదితులై నాగురాలన్న శశంబువ లె నీటునుఁ బరుగులిడుచుందురు. నిగళ పాశబద్ధులై తిరిగి తిరిగి వారు చిరకాలము బాధపొందుచుందురు. 38 నరులు తృష్ణా ప్రచోదితులై వాగురాలన్న శశంబులవ లె నటునిటుఁ బరుగులిడుచుందురు. కాన భిక్షకుండు నిజరా గరాహిత్యమునకు ముద్యమంబు సల్పుచుఁ దృష్ణను బారఁ ద్రోలవలయును. 383 కామపరి త్యాగంబు కావించి యెవ్వాఁడు కామంబున కు లోనగునో, కామవన బహిష్కృతుండై కామవనము నకుఁ బరుగులిడుచుండునో, యట్టివానిని జూడుము, కామవిముక్తుండయ్యు నాతఁడు బంధములంజొచ్చుచు నాన్నా! 80 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri 384<noinclude><references/></noinclude> ko4ai53qdnfdk11rdkxmytlb5yq9q0r పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/113 104 211943 552453 2026-04-10T03:24:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము సూరు లయోమయంబగునట్టిగాని, దారుమయంబగునట్టి. కాని, శణమయంబగునట్టిగాని, నిగళంబులను బలవత్తర ములని నుడువరు ; మణులకొఱకును, సంగుళీయము! కొఱకును, దారాపుత్రాదుల కొఱకు, నైనయ మ...' 552453 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము సూరు లయోమయంబగునట్టిగాని, దారుమయంబగునట్టి. కాని, శణమయంబగునట్టిగాని, నిగళంబులను బలవత్తర ములని నుడువరు ; మణులకొఱకును, సంగుళీయము! కొఱకును, దారాపుత్రాదుల కొఱకు, నైనయ మేట్. యే వానికంటె బలవత్తరం బైనయది. క్రిందికి దిగలాగి లొంగియు విడని పాశంబునే బలవంత.. మైనదని వివేకులు వక్కాణింతురు. నిగళ భేదనంబు తుద కుఁగావించి, చింతావిముఖులై, రాగములను సౌఖ్యము లనువిసర్జించి, భూలోకమును విసర్జింతురు. ఊర్ణ నాభంబు స్వశృతతంతుజాలంబున నెట్లుజారునో య కామప్ర వాహంబునఁ గామవశ్యులై న వారు కొట్టుకొనిపోయెదరు. ముక్తకాములై చింతా విముక్తులై యనురాగంబులఁ బోవిడిచి భూతలంబును బరిత్యజింతురు. సంసారాపరతీరంబుఁ జేరుతరి నీవాదిమధ్యాంతస్థములగు వానిని విసర్జింపుము ; నిర్నిరోధంబులైన జన్మలయంబుల నీవు పొందవు. 385 ఏమనుజుండు శంకాసంక్షుభితుండై, ప్రబలకాముండై సంతోషకరంబగు దానినే యెల్లపుడు నన్వేషించుచుం ZQ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> ausajmx76tykjvnctp57evvulhl0vq9 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/114 104 211944 552454 2026-04-10T03:24:45Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపడము డునో యట్టివాని తృష్ణ యధికంబగును. మఱియు వాఁడు నిజనిగళంబుల బలిష్ఠములుగ నొనర్చును.. మనుజుండు శంకానివారణ మందు సంతోషమును గాంచు చు, విచారయుక్తుండై సంతోషహీనం బైనదానియ...' 552454 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపడము డునో యట్టివాని తృష్ణ యధికంబగును. మఱియు వాఁడు నిజనిగళంబుల బలిష్ఠములుగ నొనర్చును.. మనుజుండు శంకానివారణ మందు సంతోషమును గాంచు చు, విచారయుక్తుండై సంతోషహీనం బైనదానియందు- లగ్న మనస్కుండై యుండిన నిశ్చయముగ నట్టివాఁడు. మారునిపాశంబును దొలఁగించి మఱియు దాని ఛేదించును. నిష్టాగతుండై, అకంపనుండై తృష్ణాపాపరహితుండైన వాఁ డు జీవనసంబంధకంటకోచ్ఛేదనంబు కావించినవాఁడు; అట్టివాని కిదియె యంతిమ దేహంబు. నీతతృష్ణుఁడై, యనురాగరహితుండై, నిరుక్తిపదకోవిదుం డై యక్షరములయొక్క పూర్వాపరనన్ని పాతములను గుర్తెఱింగి యంతిమ దేహంబును బొందినవాఁడు మహా ప్రజ్ఞావంతుఁడును; మహాపురుషుండును. "సర్వమును జయించితిని; సర్వవిదుఁడను; సర్వధర్మముల యందు నిర్లేపుండను. సర్వమును బరిత్యజించి, తృష్ణా నాశంబుచే ముక్తుండనై నాఁడను; నేను సత్యమును గ్రహిం చితిని; అందఱకుఁ దద్బోధనం గావింతును. 3×3 ون CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> dr6k9xmuduny1sg2nh0yc81d32buolx పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/115 104 211945 552455 2026-04-10T03:24:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మ అన్ని దానములను ధర్మప్రదాన మతిక్రమించు చున్నది. అన్ని రసములను ధర్మరస మతిక్రమించుచున్నది; అన్ని సుఖములను ధర్మరతి యతిక్రమించుచున్నది; తృష్ణా ఓయంబు సర్వదుఃఖముల జయించుచున...' 552455 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>మ అన్ని దానములను ధర్మప్రదాన మతిక్రమించు చున్నది. అన్ని రసములను ధర్మరస మతిక్రమించుచున్నది; అన్ని సుఖములను ధర్మరతి యతిక్రమించుచున్నది; తృష్ణా ఓయంబు సర్వదుఃఖముల జయించుచున్నది. 3 అపరపారంబు నీషింపకుండిన మూఢులను, భోగములు- నశింపఁ జేయును. ఆత్మశత్రువువలె మూడుఁడు భోగతృష్ణ చే స్వనాశముం గలుగఁ జేసికొనును. 3×× క్షేత్రంబులు తృణాదికముచేఁ జెడుగుం జెందుచున్నవి. మనుష్యజాతి కామంబు చేఁ బాడగుచున్నది. . కామ రహితులైన వారలఁ కీయఁబడిన దానం బుత్కృష్ట ఫలంబుఁ గలుగఁ జేయును. 3 క్షేత్రంబులు కరంబులచేఁ జెడుగుఁ జెందుచున్నవి. మను వ్యకులము విద్వేషముచే బాడగుచున్నది. కాన ద్వేష రహితుల కీయఁబడినదానంబు బహుఫలంబు నందించును. ంబులు తృణాదికములచేఁ బాడగుచున్నవి. మను వ్యజాతియహంకారము చేఁ బాడగుచున్నది. కాన నిరహం కారుల కీయఁబడిన దానం బధికఫలంబును గలుగఁ జేయును. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 9f65k42ckgxcn6j30czo2omxd1sq1by పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/116 104 211946 552456 2026-04-10T03:25:07Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఛమ్మపదము క్షేత్రంబులు తృణాదికములచేఁ బాడగుచున్నవి. మను వ్యజాతి కామంబుచేఁ బాడగుచున్నది. కాన నిష్కా ముల కీయఁబడిన దానం బధికఫలంబుఁ గలుగఁ జేయును. బిరువు ఇరువదియైదవ యధ్యాయము చ...' 552456 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఛమ్మపదము క్షేత్రంబులు తృణాదికములచేఁ బాడగుచున్నవి. మను వ్యజాతి కామంబుచేఁ బాడగుచున్నది. కాన నిష్కా ముల కీయఁబడిన దానం బధికఫలంబుఁ గలుగఁ జేయును. బిరువు ఇరువదియైదవ యధ్యాయము చతురింద్రియని గ్ర హంబు మేలు; కర్ణేంద్రియనిగ్రహంబు మేలు; సమ స్తవిషయంబులయు నిగ్రహంబు శ్రేయోదా 'యకము. సమ_స్తవిషయంబులలో నిగ్రహము కలభిక్షువు .సర్వపీడావిముక్తుం డగుచున్నాఁడు. హస్తములను, బాదములను, వాక్కును నిగ్రహించి సమ్య గృహీతుఁడును, సంతుష్టాత్ముండును, సమాహిత చిత్తుండును, నేకాకీయును, శాంతియుక్తుండునునైన వానిని భిత్సవందురు. 39 జిహ్వాని గ్రహంబు కలిగి భీషాపు వివేకయుక్తంబులును, శాంతిమయంబులును, నగు వచనంబుల నుచ్చరించుచు २४ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> r0m4jk6xnrg2mps8qzuyl380s9ap4jt పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/117 104 211947 552457 2026-04-10T03:25:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదములు ధర్మార్థంబుల నుపదేశించుచుండునో యట్టివానిపలుకులు.: మధురంబులు. 33 ఏభిక్షువు దర్మంబున నుపవసించుచు, ధర్మరతుండై, ధర్మాను చింతనంబు సల్పుచు ధర్మము ననుసరించి 'చను చుం...' 552457 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదములు ధర్మార్థంబుల నుపదేశించుచుండునో యట్టివానిపలుకులు.: మధురంబులు. 33 ఏభిక్షువు దర్మంబున నుపవసించుచు, ధర్మరతుండై, ధర్మాను చింతనంబు సల్పుచు ధర్మము ననుసరించి 'చను చుండునో యట్టివాఁ డెన్నడును నిజధర్మ భ్రష్టుండు కానే ఈడు. 3 = 8. తాఁబొందినదానిని నిరసింపక భీష్మ లితరులను గూర్చి యసూయఁ జెందకుండవలయును. ఇతరులఁ జూచి యసూ యఁ జెందు భితుకుండు శాంతుండు కానేరఁడు. 3=> భిక్షువు కొలఁదిం జెందియు దాని నిరసింపకుండి యనాలన పరుఁడై యుండిన, దేవతలును నట్టివానిని శ్లాఘింతురు. నామరూపములతో నైక్యమును జెందక, నశించినదాని గూర్చి దుఃఖమును జెందనివానిని భిక్షువందురు. 32 పభిషువు సదయుండై ప్రవర్తించుచు బుద్ధశాసన ప్రస న్నుఁడై యుండునో యట్టివాఁడు శాంతిమయం బగు నిర్వా. ణంబును, నిర్వాణంబున సహజ కామవిరామంబును, సుఖ మును బొందును. ک سے CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> fztk97gwerq931ywhrsvp43kh66l1kv పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/118 104 211948 552458 2026-04-10T03:25:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఓ భిత్సకుఁడా ! ఈనావను భారరహితంబుగ నొనర్పుము; భారము లేకుండిన నది త్వరగఁబోవును. కామద్వేపోచ్ఛే. వనంబున నీవు నిర్వాణంబును జెందుదువు. 3EF పంచేంద్రి యంబులను ఛేదింపుము; ఇం...' 552458 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఓ భిత్సకుఁడా ! ఈనావను భారరహితంబుగ నొనర్పుము; భారము లేకుండిన నది త్వరగఁబోవును. కామద్వేపోచ్ఛే. వనంబున నీవు నిర్వాణంబును జెందుదువు. 3EF పంచేంద్రి యంబులను ఛేదింపుము; ఇంద్రియ పంచక మును విసర్జింపుము; ఇంద్రియపంచకము నతిక్రమింపుము ; పంచపాశవిముక్తుండైన భిక్షకుఁ డోమతీర్ణుండని పిలువఁ బడును. 320 ఓయీ! భిక్షుకుఁడా ! నీవు ధ్యానంబు సల్పుచుఁ బ్ర మత్తు,, డవై యుండకుము. నీయప్రమత్తతచే నరకంబున నయః పిండమును దిగమ్రింగకుండునట్లును, దహింపఁబడుచున్న పుడు “ఇదియే పీడనంబు” అని యేడ్వకుండునట్లును, దేహ సౌఖ్యంబొసంగు వానియందు నీబుద్ధిని నిగుడింపకుము. జ్ఞానంబులేని ధ్యానంబు లేదు; ధ్యానము లేని జ్ఞానమును లేదు; ఎవ్వానికి జ్ఞానధ్యానంబు లున్నవో అట్టివాఁడు నిర్వాణసమీపమున నుండును. 329 శూన్యంబగు నిజగృహంబును బ్రవేశించి శాంతుఁడైన భిక్షువు ధర్మంబును లెస్సఁగఁ బరిశీలించిన మనుష్యానం దముకంటె నెక్కుడగు నానందముం జెందును. 323 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> jvz6xfowzbac9sakgeihablwsukbity పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/119 104 211949 552459 2026-04-10T03:25:38Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '. ధమ్మపదము .దేహమూలములను, జన్మలయములను గూర్చి లెస్సఁగఁ జింతనంబుఁ గావించినపిదప వాఁడు నిర్వాణజ్ఞానయుక్తుల కుంగల సుఖానందములఁ 'బొందును. " - 328 ప్రాజ్ఞుండగు భిక్షువున కీది యాత్మశి...' 552459 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>. ధమ్మపదము .దేహమూలములను, జన్మలయములను గూర్చి లెస్సఁగఁ జింతనంబుఁ గావించినపిదప వాఁడు నిర్వాణజ్ఞానయుక్తుల కుంగల సుఖానందములఁ 'బొందును. " - 328 ప్రాజ్ఞుండగు భిక్షువున కీది యాత్మశిరంభంబు. “ఇంట్రియ గోపనంబును, దృప్తియు, ధర్మంబు ననుసరించి నిగ్రహం 'బును, పరిశుద్ధ జీవనంబును, గలిగి మందులు కాని. యుదా రులగు మిత్రులతో సహవాసముం జేయుటయు. ” 3౭౫ 'అనుకంపాయుక్తుండై జీవనంబుసల్పుచు . విధ్యాచరణపతి ణతుండై యుండవలెను; అప్పుడు సంతోష సంపూర్ణుఁడై వాఁడు దుఃఖాంతముఁ గావించును. 32 వాసంతికము జీర్ణ పుష్పంబుల రాల్చునట్లు, ఓయీ కులారా! మనుజులు రాగ ద్వేషంబులఁ_బరిత్యజింప లెను. 322 ఎవ్వాని దేహ జిహ్వాచిత్తంబులు శాంతిఁ బొంఠింపఁబడి నవో, ఎవ్వాఁదు 'సమాహితచిత్తుఁడో ఎవ్వాఁడు ప్రాపంచమిషంబులు నిరాకరించునో యట్టిభిక్షువు. శాంతుండని చెప్పఁబడుచున్నాఁడు. 325 2.3 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> edoxat9h8l2zjq9nprkdqba4ks5kq26 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/120 104 211950 552460 2026-04-10T03:25:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '- ధమ్మపదము ఓయీ, భిక్షుతుఁడా! నీయంతట నీవే మేలుకొనుము. 'నిన్ను నీవే పరీక్షించుకొనుము. అట్లు స్వరం, తుండనై 'యప్రమత్తుండ వైయుండిన నీవు సుఖింపఁగలవు 3.25 ఏలయనఁ బ్రతిమనుజుండును దనకుఁ...' 552460 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>- ధమ్మపదము ఓయీ, భిక్షుతుఁడా! నీయంతట నీవే మేలుకొనుము. 'నిన్ను నీవే పరీక్షించుకొనుము. అట్లు స్వరం, తుండనై 'యప్రమత్తుండ వైయుండిన నీవు సుఖింపఁగలవు 3.25 ఏలయనఁ బ్రతిమనుజుండును దనకుఁ దానే యధికారి యును దనకుఁ దానే రక్షకుఁడునై యున్నాఁడు. కాన · · నణిజుండు త్తమాశ్వంబును వశీకరించు పగిది నాత్మనిగ్రహ 'మును గావించుకొనుము. ఆనందపూర్ణుఁ డైనభితువు బౌద్ధసిద్ధాంతముచే శాంతుఁడై 'యుండిన పట్టివాఁడు నిర్వాణంబును, గామరాహిత్యం. -బును, సౌఖ్యమును బొందఁగలఁడు. 350 బౌద్ధసిద్ధాంతానుసారి యగు భీతువు తరుణ వయస్కుండ య్యు ఘనవిము క్త చంద్రునిమాడ్కి నీ ప్ర పంచంబును గాంతిమయంబుగ నొనర్చును. 355 .25 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 51dufzhq6cyt8stei9twpkvwxdraf0v పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/121 104 211951 552461 2026-04-10T03:25:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'బ్రాహ్మణుఁడు ఇరువదియాఱవ యధ్యాయము "ధమ్ముసదనం. ఓయీ! బ్రాహ్మణుఁడా! పరాక్రమముతోఁ బ్రవాహంబు నరికట్టుము; కామంబులఁ బారఁ ద్రోలుము; వృష్టవస్తువినా : శంబుఁ దెలిసికొనిన నసృష్టుబడుద...' 552461 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>బ్రాహ్మణుఁడు ఇరువదియాఱవ యధ్యాయము "ధమ్ముసదనం. ఓయీ! బ్రాహ్మణుఁడా! పరాక్రమముతోఁ బ్రవాహంబు నరికట్టుము; కామంబులఁ బారఁ ద్రోలుము; వృష్టవస్తువినా : శంబుఁ దెలిసికొనిన నసృష్టుబడుదానిని నీ వెఱుంగఁ గలవు. బ్రాహ్మణుండు నిగ్రహధ్యానంబులనెడి ద్విధర్మపారావా· రంబును జేరి జ్ఞానియైన నట్టివాని పాశంబులన్నియు మాయ 'మగును. 358 ఎవ్వాని కుభయతీరంబులును లేవో, నిర్భయుండును. - నిరర్గళుండునునై న యట్టివానినే బ్రాహ్మణుండని చెప్పెదను ఎవ్వాఁడు సమీక్ష్య కారియై, యనింద్యుఁడై, ప్రశాం 'తుఁడై, రాగరహితుండై పరమార్థమును జెందునో వానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. 30%. భానుఁడు పగటియందుఁ బ్రకాశించును. చంద్రుఁడు నిశా సమయంబునఁ బ్రకాశించును. యోధుఁడు కనచధార ణంబునఁ గాంతిమంతుండైయుండును. "బ్రాహ్మణుడదు CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> g1ty03j6x8x6u5oh0wbz4yp1r6x75d4 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/122 104 211952 552462 2026-04-10T03:26:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ధ్యానము చేఁ బ్రకాశించును. కాని ప్రబుద్ధుఁడైన బుద్ధుఁ డు రేయింబవలు ప్రభాయుక్తుండైయుండును. 352 పాపవిముక్తుం డగుటచే మనుజుండు బ్రాహ్మణుండని పరిగ ణింపఁ బడుచున్నాఁడు;...' 552462 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ధ్యానము చేఁ బ్రకాశించును. కాని ప్రబుద్ధుఁడైన బుద్ధుఁ డు రేయింబవలు ప్రభాయుక్తుండైయుండును. 352 పాపవిముక్తుం డగుటచే మనుజుండు బ్రాహ్మణుండని పరిగ ణింపఁ బడుచున్నాఁడు; నిశ్చలుడై సంచరించుటచే శ్రమ ణుండని ఎన్నఁబడుచున్నాఁడు; స్వకలుషముల విసర్జిం చుటచేఁ బ్రవ్రజితుండని పిలువఁబడుచున్నాఁడు: నెలార బ్రాహ్మణు నెవ్వాఁడును బ్ర హరింపఁగూడదు; ఎవ్వ డైనఁ దన్నుఁగొట్టిన నాకొట్టిన వానిని బ్రాహ్మణుఁ డెదు 'ర్కొనఁగూడదు; బ్రాహ్మణాక్రమకునికి దుఃఖమగును శాక ! గొట్టిన వానిం దిరిగి కొట్టిన వాని కెక్కుడుదుఃఖ 'మగుఁగాక! 307 సంసారసౌఖ్యముల నుండి మనంబును నిగ్రహించుట బ్రాహ్మణ బు; హింస కావించుట కిచ్చ లేకుండిన దుఃఖముపోవును. .370 ఎవ్వాఁడు మనోవాక్కాయములచే నపరాధం బొనర్పఁ డో, ఎవ్వాఁ డీమూఁడువిషయముల నిగ్రహయుక్తుండై యుండునో, నే నట్టివానిని బ్రాహ్మణుఁడని చెప్పెదను.- CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> rfmqljhldl5sky6zzotdc1a3aa2nv00 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/123 104 211953 552463 2026-04-10T03:26:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము బ్రాహ్మణుం డెట్లు యజ్ఞాగ్ని నర్చించునో, యట్లే బుద్ధా దిష్ట ధర్మములం గ్రహించినయెడల వానిని మనుజుం డారాధింపనిమ్ము. 3F9 జటలవలనఁగాని, గోత్రమువలనఁగాని, జన్మమువలనఁ గాన...' 552463 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము బ్రాహ్మణుం డెట్లు యజ్ఞాగ్ని నర్చించునో, యట్లే బుద్ధా దిష్ట ధర్మములం గ్రహించినయెడల వానిని మనుజుం డారాధింపనిమ్ము. 3F9 జటలవలనఁగాని, గోత్రమువలనఁగాని, జన్మమువలనఁ గాని మనుజుఁడు బ్రాహ్మణుండు కానేరఁడు; సత్యసం ధుఁడును, సచ్చరితుండును నైనవాఁడు ధన్యుండును బ్రాహ్మణుండును నగును. 3-3 ఓయీ! మూఢుఁడా! జటాజూటంబునఁ గాని, యజచర్మ వసనంబునఁగాని యేమున్నది? అంతస్సు మన్మరంబై యుండ బహిర్భాగంబును మాత్రమును శుద్ధముగ నొన రుచున్నావు. ఎవ్వాఁడు మలినవసనంబుల ధరియించి, కృశించిన శరీ రము కలవాఁడై ధమనీసం స్తృతు: డై, యద్వితీయుఁడై వనవాసంబు సల్పుచు, ధ్యాన పరాయణుండై యుండునో యట్టివానినే బ్రాహ్మణుఁడని చెప్పెద. 37 మనుజునిజన్మమునుబట్టియు, జననింబట్టియు బ్రాహ్మణునిగఁ బరిగణింపను. నిశ్చయముగ నట్టివాఁ డహంకారపరుఁ డై E CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri من<noinclude><references/></noinclude> slh5w6xbopkjub3v9bqt57v7apeqft3 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/124 104 211954 552464 2026-04-10T03:26:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '. ధమ్మపదము ధనికుఁడై యుండును. అభినివేశరహితుండై నిర్ధనుండైన వానినే బ్రాహ్మణుుడని చెప్పెదను. 3FE సర్వబంధంబులను ఛేదించి యెన్న ఁడును గంపంబుఁ జెందక స్వతంత్రుఁడై నిరర్గళుండై నవ...' 552464 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>. ధమ్మపదము ధనికుఁడై యుండును. అభినివేశరహితుండై నిర్ధనుండైన వానినే బ్రాహ్మణుుడని చెప్పెదను. 3FE సర్వబంధంబులను ఛేదించి యెన్న ఁడును గంపంబుఁ జెందక స్వతంత్రుఁడై నిరర్గళుండై నవానినే బ్రాహ్మణుండని చెప్పి దను. 3F2 చర్మపట్టవరత్ర శృంఖలంబులను ఛేదించి, యర్గళముల . బంధించి ప్రబుద్ధుండైన వానినే బ్రాహ్మణుండని చెప్పెదను. ఎవ్వాఁ డపరాధంబొనర్చకయే నిందాబంధన దండనంబుల సహియింపనోపునో, యెవ్వాఁడు క్షమను శక్తిగను, బలంబు నేనగను, గలిగియుండునో యట్టివానినే బ్రాహ్మ: ణుండని చెప్పెదను. 3FF ఎవ్వాఁడు కోపవిముక్తుండై, ధర్మజ్ఞుండై, సచ్చరితుండై, నిష్కాముండై, నిగ్రహయుక్తుండై, యంతిమశరీరధారి యై యుండునో యట్టివానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. ఎవ్వాఁడు పద్మదళంబుపై బిందువుమాడ్కిని సూచ్యగ్ర మందైన సర్ష పబీజంబుభాతిని భోగాలంబకుఁడు కాఁణో యట్టివానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. 200 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> iz3zk210d6m3lv1fcjocztxs7qsml6y పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/125 104 211955 552465 2026-04-10T03:26:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము ఈలోకమునను దుఃఖాంతము నెఱిఁగి, భారంబును గ్రింద నిడి నిరర్గళుండై నవానినే బ్రాహ్మణుఁ డని చెప్పెదను. ఎవ్వాఁడు జ్ఞానమునుండో, ప్రాజ్ఞుండో, సత్పథంబులను దుష్పథంబులను గ...' 552465 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము ఈలోకమునను దుఃఖాంతము నెఱిఁగి, భారంబును గ్రింద నిడి నిరర్గళుండై నవానినే బ్రాహ్మణుఁ డని చెప్పెదను. ఎవ్వాఁడు జ్ఞానమునుండో, ప్రాజ్ఞుండో, సత్పథంబులను దుష్పథంబులను గుర్తెఱిఁగి పరమార్థమును జెందిన యట్టివానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. 8ం3 ఎవ్వాఁడు సంసారులను భిక్షువులను బరివర్ణించి యనోక శారికాక స్వల్ప వాంఛలఁ గలిగియుండినవానినే బ్రాహ ణుఁడని చెప్పెదను. ४०४ ఎవ్వాఁడు దండమును విడనాడి, బలహీనములైనఁ గాని, బలవంతములైనఁగాని, జంతువుల వధియింపకయు, వధి యింపించకయు నుండునో యట్టివానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. లో ४०x ఎన్వాఁడు విరోధులలో నవిరోధమునను, యుయుత్సువు బ్రసన్నుండుగను, క్రోధనులలో నక్రోధనుఁడు గను నుండునో యట్టివానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. ఎవ్వానినుండి కోడవి ద్వేష గర్వమాత్సర్యంబులు సూచ్య గ్రంబునుండి వర్ష పబీజంబుభాతి జారినవో యట్టివాని నే బ్రాహ్మణుఁడని చెప్పెద. 0-3 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> nwus4pdfdgqcwlyjnprjw8arl36qdux పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/126 104 211956 552466 2026-04-10T03:26:52Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నమ్మపదము సత్యంబును, సుబోధకంబును, బారుష్యరహితంబును, నగు · గీతిని నచియించుచు నితరుల నవమానంబు చేయనివానినే బ్రాహ్మణుండని చెప్పెదను. దీర్ఘంబైనఁగాని, హ్రస్వం బైనఁగాని, స్థూలం...' 552466 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నమ్మపదము సత్యంబును, సుబోధకంబును, బారుష్యరహితంబును, నగు · గీతిని నచియించుచు నితరుల నవమానంబు చేయనివానినే బ్రాహ్మణుండని చెప్పెదను. దీర్ఘంబైనఁగాని, హ్రస్వం బైనఁగాని, స్థూలంబైనఁగాని, యల్పంబైనఁగాని, శుభంబైనఁగాని, యశుభంబైనఁగాని, యప్రదత్తంబగు నేవస్తువునైన నెవ్వాఁడు స్వీకరింపఁడో వాసినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. ఇహపరసంబంధములైన యాశ లేమియు లేక నిష్కాముఁ డై నిరర్గళుఁడై యుండువానినే బ్రాహ్మణుఁడని చెప్పెద. రాగరహితుఁడై, తత్త్వజ్ఞానియై, శంకావిముక్తుండై, నిర్వాణ సథజ్ఞానయుక్తుండైన వానినే బ్రాహ్మణుఁ డని చెప్పెదను. ఈలోకంబునఁ బుణ్య పాపంబుల నతిక్రమించి తద్బంధన విముక్తుండై, దుఃఖపాపరహితుండై, శుద్ధుండైన వానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. ర౧౨ చంద్రునివలె నిర్మలుండై, శుద్ధుండై, ప్రసన్నుండై, సంసా రతృష్ణారహితుండైనవానినే బ్రాహ్మణుండని చెప్పెదను. ४ .CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> smx2span6g50v2c5ii97b31y2add0qo పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/127 104 211957 552467 2026-04-10T03:27:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము వంకయుక్తంబగు నీమార్గమును దాటి, దుర్గమంబును, మోహబద్ధంబును నగు సంసారావరతీరంబును జేరి, సమా వ్యకారియై, విమలాత్ముండై, శంకారహితుండై, యభిని వేళహీనుండై, సంతుష్టుండైన వా...' 552467 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము వంకయుక్తంబగు నీమార్గమును దాటి, దుర్గమంబును, మోహబద్ధంబును నగు సంసారావరతీరంబును జేరి, సమా వ్యకారియై, విమలాత్ముండై, శంకారహితుండై, యభిని వేళహీనుండై, సంతుష్టుండైన వానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. రణర సర్వకామంబులఁ బరిత్యజించి నిర్ని కేతనుండై ప్రయాణ మును సల్పుచు నీత రాగుఁడై యుండు వానినే బ్రాహ్మణుఁ డని చెప్పెదను. సర్వకామంబులం బరిత్యజించి నిర్ని కేతనుండై ప్రయాణ మును సల్పుచు లోభరహితుండై యుండు వానినే బ్రాహ్మ ణుఁడని చెప్పెదను. STUDE మానుష సుఖంబులను ద్యజించి, స్వర్గసుఖములఁ బరిత జించి, సర్వసుఖబంధన విముక్తుండైన వానినే బ్రాహ్మణుఁ డని చెప్పెదను. సుఖదుఃఖంబులఁ బరిత్యజించి, శీతకుండై పునర్జన్మ బీజ రహితుండై, తిరస్కృత సర్వలోకుఁడై యుండువానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> eda1e2wvzxngfrtetweocpyfjyplc3j పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/128 104 211958 552468 2026-04-10T03:27:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధమ్మపదము అన్ని భూతంబుల జన్మలయంబుల నెఱింగి బంధముక్తుఁడై, సుగతుండై, బుద్ధుండైనవానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. మనుష్య దేవ గంధర్వుల కెవ్వాని గతి తెలియదో, నిష్కాముడై యెవ్వఁ...' 552468 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ధమ్మపదము అన్ని భూతంబుల జన్మలయంబుల నెఱింగి బంధముక్తుఁడై, సుగతుండై, బుద్ధుండైనవానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. మనుష్య దేవ గంధర్వుల కెవ్వాని గతి తెలియదో, నిష్కాముడై యెవ్వఁ డర్హతుఁడై యుండునో వానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. ర ౨౦ ముందుకాని, వెనుకఁగాని, మధ్యనుగాని యుండు నెద్ధాని నైనఁ దనదని నుడువక బీదయై సంసారేఛ్ఛ లేకయుం డునో వానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. నరశ్రేష్ఠుండై, వీరుండై, యుత్తముండై, మునియై, గుణ వంతుఁడై, సుఖదుఃఖముండై, ప్రాజ్ఞుండై ప్రబుద్ధుండైన వానినే బ్రాహ్మణుఁడని చెప్పెదను. ర ౨౨ పూర్వజన్మ జ్ఞానయుక్తుండై, స్వర్గనరకములను గాంచి, పునర్జన్మరహితుండై, జ్ఞానసంపన్నుండై, మునియై, పరి ణత జ్ఞానయుక్తుండై యుండు వానినే బ్రాహ్మణుం డని చెప్పెదను. ధమ్మపదము ముగిసినది. ర ౨3 రా CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> mqbukfrccnjbhlabyp0tbf0byvo6lw8 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/129 104 211959 552469 2026-04-10T03:27:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము C బుద్ధుని ధర్మోప దేశములు పవిత్రజీవనంబున నిర్వాణంబుఁ జెందవచ్చునని బౌద్ధమత ముద్ధోషించుచున్నది. బౌద్ధ గ్రంథములు పుణ్య జీవనమే యద్వితీయమోక్షమార్గమని నొక్కివక్కా...' 552469 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము C బుద్ధుని ధర్మోప దేశములు పవిత్రజీవనంబున నిర్వాణంబుఁ జెందవచ్చునని బౌద్ధమత ముద్ధోషించుచున్నది. బౌద్ధ గ్రంథములు పుణ్య జీవనమే యద్వితీయమోక్షమార్గమని నొక్కివక్కాణిం చుచున్నవి. దుర్భరసంసారకష్టముల దాఁటుట సచ్చరితము ననే యగునని బౌద్ధమతసూత్రములు విసువు లేక నుడువు చున్నవి. అట్టి బౌద్ధమతముననుండు ధర్మోపదేశములం గొన్నిటి నిచటఁ బేర్కొనుచున్నారము. బుద్ధుని నవ తార పురుషునిగఁ బరిగణించియుఁ బాషండులని బౌద్ధులను, బాషండమతమని బౌద్ధమతమును జులకఁదనముతో నిరా కరించుట తన్మతపరిచయము లేకుండుటచేఁగాని వేఱు కారణమునఁగాదు. తన్మతలలిత ధర్మోపదేశములఁ దెలిసి కొనిన వారికి బుద్ధ దేవుఁ డవతారపురుషుఁ డనుటకుఁ గార ణము స్పష్టమగును. 2 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> iz6tmibpxdi5831x8cvgkgm1zbwbakf 552638 552469 2026-04-10T11:24:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552638 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}అనుబంధము</p> {{rule|2cm}} {{p|fs150|ac}}1</p> '''బుద్ధుని ధర్మోపదేశములు''' పవిత్రజీవనంబున నిర్వాణంబుఁ జెందవచ్చునని బౌద్ధమత ముద్ఘోషించుచున్నది. బౌద్ధగ్రంథములు పుణ్యజీవనమే యద్వితీయమోక్షమార్గమని నొక్కివక్కాణించుచున్నవి. దుర్భరసంసారకష్టముల దాఁటుట సచ్చరితముననే యగునని బౌద్ధమతసూత్రములు విసువులేక నుడువుచున్నవి. అట్టి బౌద్ధమతముననుండు ధర్మోపదేశములం గొన్నిటి నిచటఁ బేర్కొనుచున్నారము. బుద్ధుని నవతారపురుషునిగఁ బరిగణించియుఁ బాషండులని బౌద్ధులను, బాషండమతమని బౌద్ధమతమును జులకఁదనముతో నిరాకరించుట తన్మతపరిచయము లేకుండుటచేఁగాని వేఱుకారణమునఁగాదు. తన్మతలలిత ధర్మోపదేశములఁ దెలిసికొనినవారికి బుద్ధదేవుఁ డవతారపురుషుఁ డనుటకుఁ గారణము స్పష్టమగును.<noinclude><references/> {{right|87}}</noinclude> rskzcft66q22qo8rdlqwo1k6yh7b2i3 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/130 104 211960 552470 2026-04-10T03:27:40Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము 'ధమ్మికసూత్తమం 'దీరీతిన బుద్ధుఁడు గృహస్థులైన బౌద్ధులకుఁ బంచవిధులను నియమించెను. "గృహస్థుని వ్యాపారమును, గౌవకుం డెట్లు సచ్చరి తుఁడు కాన లెనో యదియు నేను మీకుఁ దెల్...' 552470 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము 'ధమ్మికసూత్తమం 'దీరీతిన బుద్ధుఁడు గృహస్థులైన బౌద్ధులకుఁ బంచవిధులను నియమించెను. "గృహస్థుని వ్యాపారమును, గౌవకుం డెట్లు సచ్చరి తుఁడు కాన లెనో యదియు నేను మీకుఁ దెల్పెదను; ఏల యన భితుధర్మ మామూలాగ్రముగ సంసారలగ్నునిచే నాచరింపఁ బడనేరదు.” "జీవియగుదాని నెద్ధాన్ని దాను జంపుటగాని, దానిని వధింపించుటగాని, యొనర్పఁగూడదు; మఱియుఁ దాను జీవహింసఁ గావింపక తదితరులు జీవహింసఁ గామి చునపుడు చూచి తాను దాని కంగీకరింపఁగూడదు.” “అన్యులదని తెలిసికొని, శ్రావకుం డేస్థలమునం దైనను నదత్తంబగుదానిఁ బరిగ్రహింపఁగూడదు; మఱి యుఁ దానట్టిది యితరులచే గ్రహింపఁబడనీయకయు నట్లు గ్రహించిన వారి కార్యముల నంగీకరింపకయు నుండవల యును. చౌర్యమును విసర్జింపవలయును.” “విద్వాంసుఁడు జ్వలించుచున్న యగ్నికణరాశిని బరిత్యజించుట మేలు.” “ఎవ్వఁడును నింకొకనితో న్యాయస్థానంబునఁగాని, సభయందుఁగాని యనృతమును బల్కఁగూడదు; మఱియు هم • CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> rda1ei36lmrkfurxgy9d6v870idyxlq పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/131 104 211961 552471 2026-04-10T03:27:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము నింకొకనిచే ననృతమాడింపకయు నట్లసత్యంబుఁ జెప్పువా రల నంగీకరింపకయు నుండవలయును.” "ఈధర్మంబుల నంగీకరించు గృహస్థు మాదక ద్రవ్యములు సేవింపఁగూడదు. అవి యున్మాద కారణం బులన...' 552471 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము నింకొకనిచే ననృతమాడింపకయు నట్లసత్యంబుఁ జెప్పువా రల నంగీకరింపకయు నుండవలయును.” "ఈధర్మంబుల నంగీకరించు గృహస్థు మాదక ద్రవ్యములు సేవింపఁగూడదు. అవి యున్మాద కారణం బులని గుర్తెఱిఁగి యితరు లావస్తువులను సేవింపకుండునట్లు చేయవలయును.” ఇవియైదును బౌద్ధమతస్థులైన సన్న్యాసులకును, గృహస్థులకును విధింపఁబడినవి. ధర్మపరాయణు లగు తీవ్రతర బౌద్ధుల కీదిగునఁ జెప్పఁబడిన త్రివిధులు గూడ నధికముగ విధింపఁబడినవి. అవియెవ్వియన:— గూడదు. నిశాసమయంబున నకాలభోజనంబుఁ గావింపఁ మాలికలను ధరించుటగాని, సుగంధి ద్రవ్యసం నేన నంబుగాని గావింపఁగూడదు. భూతలశయనుండై యుండ వలెను. ఈయెనిమిదినియమములు 'నష్టాంగళీల' మని బుద్ధ ధర్మమునందుఁ బేర్కొనఁబడినవి. ఈ యెనిమిదింటితో 1 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> jukcd00z0iznffrwfvmf443nxk0no9z పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/132 104 211962 552472 2026-04-10T03:28:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము ౧ మఱి రెండు కలుపఁబడి దశశీలనామంబున బుద్ధధర్మమునం బేర్కొనఁబడినవి. అవియెవ్వియన: — “కనకరజతవిసర్జనములు” ఈదశవిధులును బౌద్ధ భిక్షువులకు విధింపఁబడినవి. మఱియు నీసూత్ర...' 552472 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము ౧ మఱి రెండు కలుపఁబడి దశశీలనామంబున బుద్ధధర్మమునం బేర్కొనఁబడినవి. అవియెవ్వియన: — “కనకరజతవిసర్జనములు” ఈదశవిధులును బౌద్ధ భిక్షువులకు విధింపఁబడినవి. మఱియు నీసూత్రమునందే బౌద్ధులకందఱకును నీధర్మము బోధింపఁబడినది. జననీజనకుల భక్తితోఁ బోషించుచు సువ్యాపారము ననుసరింపవలయును. ఈ ధర్మమును శ్రద్ధతో నాచరించు గృహస్థులు స్వయంభ వుల సాన్నిధ్యమునకు బోదురు. శిగలబోధ సూత్రమునం దీరీతిన గృహస్థధర్మము లు పేర్కొనఁబడినవి: జననీజనకులు తమబిడ్డలను దుర్వ్యాపారముల నుండి నిషేధింపవలయును. వారలను సదాచరణయం దనుశాసింపవలయును' కళలయందుఁగాని, శిల్పములయందుఁగాని, వార లకు శిక్ష నొనర్పవలయును. అనురూపదారలనుగాని, భర్తలనుగాని వారలకు సమకూర్పవలయును. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 7adzlr0ebftm70rkza2a9j7uexdc746 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/133 104 211963 552473 2026-04-10T03:28:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'బంధము . నిజరికంబుల వారల కీయవలయును. బిడ్డలును నిట్లు చెప్పవలయును. నన్నుఁ బోసించిన వారలను నేను బోషిం చెదను. వారి సంసారసంబంధములగు నావశ్యక కృత్యములను నేను నెర వే ర్చెదను. వారి...' 552473 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>బంధము . నిజరికంబుల వారల కీయవలయును. బిడ్డలును నిట్లు చెప్పవలయును. నన్నుఁ బోసించిన వారలను నేను బోషిం చెదను. వారి సంసారసంబంధములగు నావశ్యక కృత్యములను నేను నెర వే ర్చెదను. వారి రిర్థములను నేరక్షించెదను. వారి రికములను బొందఁ దగియుండుటకు నేఁ బ్రయత్నిం వారు కాలగతిఁ జెందిన నుచితమగు నుత్తరక్రియ లను వారికి నేఁ గావించెదను. ఆచార్యులును శిష్యులును యును. . శిష్యుఁ డాచార్యునకుఁ బరిచర్యఁ గావింపవల ఆచార్య సమక్షమునందు నిలువఁబడి యుండవల ఆచార్యునకు విధేయుఁడై యుండవలయును. ఆచార్యునికోర్కెల నెరవేర్చు చుండవలయును. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri んじ<noinclude><references/></noinclude> s9wtpjzp691jyy5e3gu7moh440kciqz పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/134 104 211964 552474 2026-04-10T03:28:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము ౧ యును. ఆచార్యునిచే శిశును శ్రద్ధతోఁ బొందుచుండవల ఆచార్యుఁడును శిష్యులను సన్మార్గ ప్ర నర్తకులనుగ నొనర్చుటయందును, శ్రద్ధతో జ్ఞానధారణంబుఁ గావిం పుఁడని బోధించుటయ...' 552474 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము ౧ యును. ఆచార్యునిచే శిశును శ్రద్ధతోఁ బొందుచుండవల ఆచార్యుఁడును శిష్యులను సన్మార్గ ప్ర నర్తకులనుగ నొనర్చుటయందును, శ్రద్ధతో జ్ఞానధారణంబుఁ గావిం పుఁడని బోధించుటయందును, గళలయందును శాస్త్ర ములయందును శిత. నొనర్చుటయందును, వారి మిత్రుల తోడను సహచరులతోడను వారినిఁ గూర్చి సుభాషిత ముల నాడుటయందును, వారి నుపద్రవముల నుండి రక్షిం చుటయందును, వారిపైఁ దనకుండు ప్రేమను గనుపరుప 'వలయును. భర్త భార్యను సగౌరవముగ సత్కరించియు, దయతో నాదరించియు, నేకపత్నీ వ్రతుఁడై యుండియు, నితరు లామెను గౌరవముతో నాదరించునట్లు చేసియు, యుక్తాభరణవసనంబుల నిచ్చియుఁ బాలింపవలయును. భార్యయుఁ బతిభక్తి నీరీతిగఁ గనుపఱుపవలయును. గృహపాలనంబు సమముగ నొనర్చుటయందును, బంధు మిత్రాదులు కలిగిసత్కారములు గావించుటయందును, సాధ్వియై మిత వ్యయమునొనర్చుటయందును, సర్వకార్యం బులయందును, శ్రద్ధయు, నిపుణతయుఁ గనుపరుపనల యు. F CC-0. Janganwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 78nfat96gxusju22h9m46d51x0apcur పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/135 104 211965 552475 2026-04-10T03:28:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము ౧ సాధుచరితుండగు నరుం డుపహారములనిచ్చియు, సుభాషితంబులఁ బల్కియు, వారియభిహితములు నెరవే `ర్చియు, వారిని దనతోఁ దుల్యులను గఁ బరిగణించియు, నాత్మీయసంపదయందు సహభోజనులుగు...' 552475 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము ౧ సాధుచరితుండగు నరుం డుపహారములనిచ్చియు, సుభాషితంబులఁ బల్కియు, వారియభిహితములు నెరవే `ర్చియు, వారిని దనతోఁ దుల్యులను గఁ బరిగణించియు, నాత్మీయసంపదయందు సహభోజనులుగు నొనర్చియు, మిత్రులను బాలింపవలయును. అట్టిమిత్రులును బ్రమత్తుం డైయున్న పుడు స్నేహితుని రక్షించియు, నజాగరూకతతో నున్న పుడు వాని రికముల సంరక్షించియుఁ, గష్టములలో నున్నపు డాశ్రయమునిచ్చియు, నాపదయం దుపకారము కావించియు, వానికుటుంబమునకు దయఁజూపియు మిత్రుని యందు వా రాసక్తిని గనుపరుపవలయును. యును: యజమాని నేనకుల శ్రేయస్సు నిట్లు పాలింపవల వారిశక్తికివిూరని వ్యాపారములయందు వారిని నియమింపవలయును. యు క్తములగు భోజన వేతనములు నీయవలయును. రోగపీడితుఁడై యున్నపు డట్టి సేవకుని రక్షింప వలయును. అసాధారణ రుచ్యములు కల్గినపుడు వానిని వారి కీయవలయును. అప్పుడప్పుడు వారికి సెలవుల నీయవలయును. F3 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> mmls0ythvl059046oiei1pkvx6le2m8 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/136 104 211966 552476 2026-04-10T03:28:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పవలయును. సేవకులును యజమానుల కభ్యుత్థానముఁ గావిం యజమాని వి శ్రమించినపిదపఁ దాము విశ్రమింప వలయును. ఇచ్చినదానితోఁ దృప్తిఁ జెందవలయును. సోత్సాహులై సంతోషముతోఁ గార్యముల సాం తము...' 552476 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>పవలయును. సేవకులును యజమానుల కభ్యుత్థానముఁ గావిం యజమాని వి శ్రమించినపిదపఁ దాము విశ్రమింప వలయును. ఇచ్చినదానితోఁ దృప్తిఁ జెందవలయును. సోత్సాహులై సంతోషముతోఁ గార్యముల సాం తముగ నెర వేర్పవలయును. యజమానుని వారెల్ల పుడుఁ బ్రశంసించుచుండ వలయును. సచ్చరితుండగునరుఁడు మనోవాక్కర్మల ననురా గమును గనుపఱచియుఁ, బూజాసత్కారముల నొన ర్చియు, శరీరసంబంధములగు వాంఛలం దీర్చియు, భీషువు లను, బ్రాహ్మణులను నర్చించవలయును. వారును నట్టిమానవుని దుష్ట మార్గమునుండి నివ పఁజేసి, దయతోఁజూచియు, మతబోధఁ గామి చియు, శంకలఁబోఁగొట్టియు, ముక్తిమార్గమును గనుపఱ చియు వానికిఁ దమప్రేమను గనుపఱుపవలయును. పైఁ జెప్పఁబడినయంశములు పూర్వ హైందవసంఘ మునందైన గ్యహస్థకృత్యములయొక్క యు, సాంసర్గి కాను CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> m1yuy1kl5zhxhbl8rjd2n6gc1bydk5h పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/137 104 211967 552477 2026-04-10T03:28:53Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము భవములయొక్కయు సంతోషదాయకంబగు జ్ఞానమును మన కిచ్చుచున్నవి. సంతానమునకు శిక్షుఁ గావించి నీతిఁగఱపుటయం దును, శరీరసంబంధము లగు సౌఖ్యముల నొనర్చుటయం దును జననీజనక ప్రదర్శ...' 552477 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము భవములయొక్కయు సంతోషదాయకంబగు జ్ఞానమును మన కిచ్చుచున్నవి. సంతానమునకు శిక్షుఁ గావించి నీతిఁగఱపుటయం దును, శరీరసంబంధము లగు సౌఖ్యముల నొనర్చుటయం దును జననీజనక ప్రదర్శితోత్సాహశక్తులును, జననీజన కులయందుఁ బుత్రే ప్ర దర్శిత భక్తివినయంబులును, మన కానందదాయకములు కాకపోవు. ఆచార్యునకు శిష్యుని యందైన ప్రేమయు, భార్యాభర్తల కన్యోన్యము విధింపఁ బడిన యనురాగ ప్రేమ దయాగౌరవాదులును, భార్యలకు గృహకృత్యములయందు విధింపఁబడిన శ్రద్ధయు, మిత్రు లలో మిత్రులకును, యజమానులకును, సేవకులకును, గృహస్థులకును, మతబోధకులకును, విధియింపఁబడిన య న్యోన్య వాత్సల్యమును మన కానందమును గలుగఁ జేయక మానవు. హిందూమతము వీనియన్ని టినిఁ గూర్చియు సత్య ధికముగఁ జెప్పుచున్నది. వానినన్నిటిని బౌద్ధమతము స్వీకరించి తన్మతవిషయిక వాఙ్మయమున వీని కుత్కృష్టవ దవినొసంగి మాననకోటి నుద్ధరింప నత్యధిక ప్రయత్నముఁ గావించినది. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 7a4hkb0rgvv2zes1in4or9mdtih7oij పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/138 104 211968 552478 2026-04-10T03:29:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము బౌద్ధమత సిద్ధాంతములు ఆత్మప్రబోధ నిగ్రహములు బౌద్ధమత సారము లనదగును. పావనంబై రాగ కామరహితంబగు జీవనంబు ననే మానుషవ్యధా నాశనం బగునని బుద్ధుఁడు బోధిం చెన బుద్ధుఁడు గయ...' 552478 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము బౌద్ధమత సిద్ధాంతములు ఆత్మప్రబోధ నిగ్రహములు బౌద్ధమత సారము లనదగును. పావనంబై రాగ కామరహితంబగు జీవనంబు ననే మానుషవ్యధా నాశనం బగునని బుద్ధుఁడు బోధిం చెన బుద్ధుఁడు గయనుండి వారాణసికిఁబోయి నిజశిష్య పంచకమునకుఁ జతు స్తత్వములను, నష్టగుణమార్గమును బోధించెను. "ఓభితుకులారా! ఇదియే ఘనమగు వ్యధావిష యకతత్త్వము. జననము క్లేశము; లయము వ్యధ; రోగ ము పీడనము; మరణము దుఃఖము; విద్విష్టవస్తుసాన్ని ధ్యము వ్యధ; ఈప్సితంబగుదానిని బొందకుండుట దుఃఖ ము; పంచభూతాశ్రయమగు జీవనము కేవలము క్లేశము.” FE CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 8wg3kw1lvsbxwrsoy6o4gqvbo2035ai 552637 552478 2026-04-10T11:18:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 552637 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}అనుబంధము</p> {{rule|2cm}} {{p|fs150|ac}}2</p> '''బౌద్ధమత సిద్ధాంతములు''' ఆత్మప్రబోధ నిగ్రహములు బౌద్ధమతసారము లనదగును. పావనంబై రాగకామరహితంబగు జీవనంబు ననె మానుషవ్యధా నాశనంబగునని బుద్ధుఁడు బోధించెను. బుద్ధుఁడు గయనుండి వారాణసికిఁబోయి నిజశిష్య పంచకమునకుఁ జతుస్తత్వములను, నష్టగుణమార్గమును బోధించెను. "ఓభిక్షుకులారా! ఇదియే ఘనమగు వ్యధావిషయకతత్త్వము. జననము క్లేశము; లయము వ్యధ; రోగము పీడనము; మరణము దుఃఖము; విద్విష్టవస్తుసాన్నిధ్యము వ్యధ; ఈప్సితంబగుదానిని బొందకుండుట దుఃఖము; పంచభూతాశ్రయమగు జీవనము కేవలము క్లేశము.”<noinclude><references/> {{left|96}}</noinclude> clnk4019gldoprbz5ned247l1zdngs7 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/139 104 211969 552479 2026-04-10T03:29:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము -౨ “ఓభితుకులారా! ఇదియే ఘనమగు దుఃఖ కారణ ముల తత్త్వము. సుఖకామనం కల్పితంబై యిచ్చట నచ్చ ట మోదంబుఁ జెందించు తజ్జన్మ కారణం బైన తృష్ణయే దుఃఖమూలంబు. ఈతృష్ణ మూఁడువిధములు: స...' 552479 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము -౨ “ఓభితుకులారా! ఇదియే ఘనమగు దుఃఖ కారణ ముల తత్త్వము. సుఖకామనం కల్పితంబై యిచ్చట నచ్చ ట మోదంబుఁ జెందించు తజ్జన్మ కారణం బైన తృష్ణయే దుఃఖమూలంబు. ఈతృష్ణ మూఁడువిధములు: సుఖతృష్ణ, సంసారతృష్ణ, మైశ్వర్యతృష్ణ యనునవి. ఓ భిక్షుకులారా! ఇదియే మనమగు దుఃఖనివృత్తి విషయక తత్త్వము. దుఃఖము తృష్ణావిరామమున నుప శమించును. సర్వవికృత్యభావంబునను, దృష్ణావిసర్జనంబు నను, దృష్ణానిరాకరణమునను, దన్మోక్షణంబునను, నాశా శమనంబునను దృష్ణానివృత్తి యగును. ఓభిషుకులారా! దుఃఖవిరామమునకుఁ గొంపోవు ఘనమార్గవిషయకమగు తత్త్వ మిదియే. పావనంబగు నాయష్టగుణమైన మార్గం బెద్దియనిన:- సత్యంబగుభక్తి, 2. ధర్మ్యాకాంక్ష, 3. య ధార్థ వాక్కు, ర, ఋజువృత్తి, 2. సరళజీవనోపాధి, ౬. ఋజు వ్యాపారము, 2. సత్యా పేష్, ౮. యధార్థచింత, (మహావర్గము ౧. ౬.) ఈబోధసారం బేమియన? జీవనంబు దుఃఖంబు. సౌఖ్యార్థమైన తృష్ణయే దుఃఖ కారణము. అట్టి తృష్ణానాశంబే దుఃఖవిరామంబు. 2 పావనజీవనంబున నే F2 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> m8x025d1afw0lpyd8epxs9i5o6825f5 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/140 104 211970 552480 2026-04-10T03:29:29Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము అ యట్టి వినాశంబునని సత్యములగు నుద్దేశములును, భక్తియు] గ్రహింపఁబడి పొందఁబడవలెను. మనమున మహాకాంక్షల నిడుకొనవలెను. వాక్శుద్ధియు, మార్దవం బును నుండవలయును. శుచియును,...' 552480 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము అ యట్టి వినాశంబునని సత్యములగు నుద్దేశములును, భక్తియు] గ్రహింపఁబడి పొందఁబడవలెను. మనమున మహాకాంక్షల నిడుకొనవలెను. వాక్శుద్ధియు, మార్దవం బును నుండవలయును. శుచియును, న్యాయమును నర్తనం బున నుండవలయును. ప్రాణులకును, సచేతనజీవులకును హింసఁగామిపని జీవనోపాధిని సంపాదించి దాని నాచు చుచుండవలయును. ఆజీవంబును సచ్చరితంబులును, బర యోదాయకంబులును, దయామయంబులునునగు కర్మ ముల నాచరించుచుండవలయును. మనస్సును, బుద్ధియు నప్రమత్తంబులును,సోత్సాహంబులునునై యుండవలయు ను. నిశ్చలం బైన ధ్యానంబుచేజీవనంబును శాంతిమయంబుగ నొనర్పవలయును. ఇదియే వాంఛలను, గామంబులను, రాగ ములను, సంసారతృష్ణను జయించుటకుఁ దగిన యష్టుగు మార్గము.” సిద్ధిఁ జెందుసమయంబున గౌతముఁడు తన శిష్యు లను రావించి యాత్మ కృషి విషయకంబగు తన సిద్ధాంతం బంతయు బౌద్ధధర్మంబుల (సప్తమణులనఁబడు) సప్తధర్మం బుల బోధించెనని చెప్పుదురు.' "భిక్షులారా! నాచే గ్రహింపఁబడిన మేధర్మం బులు మీకు బోధింపఁబడినవి? వేనిని మీరు గ్రహించి Fσ CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> cg1qpffd6qgyd72qez3n4k1ddrdxrtr పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/141 104 211971 552481 2026-04-10T03:29:40Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము అ చింతనంబుఁగావించి, యే మతమును వ్యాపింపఁజేయుట వలన దేవమానుష ప్రీతియు, మనం బగుమానవకోటిసౌ ఖ్యోపకార వర్ధనంబునగునో, యట్టిమత వ్యాపనంబును మీ రపచేయవలయును. అవియెవ్వియన: చ...' 552481 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము అ చింతనంబుఁగావించి, యే మతమును వ్యాపింపఁజేయుట వలన దేవమానుష ప్రీతియు, మనం బగుమానవకోటిసౌ ఖ్యోపకార వర్ధనంబునగునో, యట్టిమత వ్యాపనంబును మీ రపచేయవలయును. అవియెవ్వియన: చతురేకాగ్ర ధ్యా నంబులును, జతుర్గుణంబులును, ఘనంబగు పాపనాశంబు నకుఁ బ్రయాసము, సిద్ధవృత్తిప్రాపకంబులగు చతుర్మార్గం బులు, నాత్మజ్ఞాన సంబంధమైన పంచేం ద్రియములు, సప్త విధం బైన జ్ఞానంబు, మనంబున సుగుణ మార్గంబు ననునవి.” మహాపరిని బ్బానసూ తము 3-౨2. చతురేకా గ్ర ధ్యానంబు లెవ్వియనిన: తనో దేశవి వేక విషయకము లైనవి. - దేవాచే రెండవది యెద్దియనిన: — పాపనినర్తనంబునకును, నుద్భవించిన సాపస్థితులనాశంబునకును, సద్భావ సౌజన్య దయాద్యుత్పత్త్యర్థమును, వాని సంవర్ధనమునకును, నైన ప్రయాసమే. మూఁడవది సిద్ధిసంపాదనయంపైన సంకల్ప ప్రయాస విధానాన్వేష ణంబులును, బంచధర్మానురూప శక్తులును. సంచాత్మజ్ఞానేంద్రియంబు లెవ్వియనిన:- భక్తియు, శక్తియు, విమర్శయు, ధ్యానంబును, జ్ఞానం సప్తవిధంబైన జ్ఞానం బెద్దియనిన:— శక్తియు, 21750. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 9ceqc6oqx7jwvh0loeprow0f1zw4vp8 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/142 104 211972 552482 2026-04-10T03:29:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము - జ్ఞానంబును, నస్వీతుణంబును, నానందమును, బ్రశాంతియు, నిర్మలత్వమును, అష్టగుణం బగు మార్గంబు. యింతకుఁబూర్వమునఁ జెప్పఁబడినది. ප්‍රයි ఇట్టిదీర్ఘం బైన యాత్మకృషివలనను, శ...' 552482 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము - జ్ఞానంబును, నస్వీతుణంబును, నానందమును, బ్రశాంతియు, నిర్మలత్వమును, అష్టగుణం బగు మార్గంబు. యింతకుఁబూర్వమునఁ జెప్పఁబడినది. ප්‍රයි ఇట్టిదీర్ఘం బైన యాత్మకృషివలనను, శంకాకామా సక్త్యాది దశపాశని ర్భేదనంబువలననే మనుజుఁడు నిర్వాణ మును జెందఁగలఁడు. "ప్రయాణాంతమునుగావించి, దుఃఖమునుద్యజించి యఖలపాశంబుల ఛేదించి, యన్ని విధముల నిరర్గళుడైన నానికిఁ బీడనంబు లేదు. చింతల లెస్సఁగ సంగ్రహించి, గృహవాసం బునఁ బ్రీతిఁ జెందక యుండునట్టి వారలు సరోవరంబును విడిచిన హంసలపోల్కిఁ దమవాసంబులఁ బరిత్యజించి పోవుదురు. సత్యంబగు జ్ఞానంబుచే నిరర్గళుఁడై శాంతియుక్తుఁ డైనవానిచింత శాంతిమయము. వానికర్మములును శాంతి మయములు.” (ధమ్మపదము FO,FG,FE) సామాన్యముగ నిర్వాణమన ననంతమైన లయ మని యూహించుచుందురు. కాని మాక్స్ముల్ల రాచా 030 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> q865nqbubmj28m9yvkwcybrb9m50hnp పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/143 104 211973 552483 2026-04-10T03:30:03Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము ర్యుఁడు మొట్టమొదటఁ గనుపఱచినట్లు నిర్వాణ మన మరణము కాదనియు, మనః పాపస్థితియొక్కయు, సంసార సౌఖ్యాదులయంబైన తృష్ణ యొక్క యు నాశనమని రూఢి యగుచున్నది. గౌతమబోధితంబైన నిర్...' 552483 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము ర్యుఁడు మొట్టమొదటఁ గనుపఱచినట్లు నిర్వాణ మన మరణము కాదనియు, మనః పాపస్థితియొక్కయు, సంసార సౌఖ్యాదులయంబైన తృష్ణ యొక్క యు నాశనమని రూఢి యగుచున్నది. గౌతమబోధితంబైన నిర్వాణం బీజీవనము ననే పొందఁదగినది, నిశ్చల పాపరహితంబైన మనస్సు యొక్క స్థితియుఁ, గామరాగ రాహిత్యంబును, నిర్వాణము నీ జీవనముననే కలిగించును. ఐహికంబైన పావనజీవనముకంటె నిర్వాణమును జెందిన వారల కానందమే కాని భవిష్యద్వైకుంఠం బెద్దియు లేదా? బౌద్ధులు బుద్ధు నీవిషయంబుల బోధింపు మని యడిగిరి గాని గౌతముని ప్రత్యుత్తరములు సందిగ్ధ ములుగ నున్నవి. బౌద్ధమో తుంబగు నిర్వాణంబుకంటే వేఱగు మోక్షవిషయకమైన యాశల గౌతముఁడు తన శిష్యులకుఁ గలుగఁ జేయ లేదు. మాలుక్యపుత్రుఁడు గౌతము నీవిషయముం గూర్చి ప్రశ్నించి సిద్ధబుద్ధుని మరణానంతరస్థితిని గూర్చి సందేహ రహితముగఁ దెలియఁగోరెను. అది విని గౌతముఁ డిట్లు. ప్రశ్నించెను: 000 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> luutym41kco6le9qeryvdu5en9tvqsj పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/144 104 211974 552484 2026-04-10T03:30:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము 9 “మాలుక్యపుత్రా! నాశిష్యుఁడవగుము; నీకు నేను బ్రసంచము నాశరహితంబై యనంత్యముగ నుండునో యుండదో చెప్పుదుననుచు నే నుడివితినా?” మాలుక్యపుత్రుఁడు:—“తా మట్లు చెప్పలేదు.”...' 552484 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము 9 “మాలుక్యపుత్రా! నాశిష్యుఁడవగుము; నీకు నేను బ్రసంచము నాశరహితంబై యనంత్యముగ నుండునో యుండదో చెప్పుదుననుచు నే నుడివితినా?” మాలుక్యపుత్రుఁడు:—“తా మట్లు చెప్పలేదు.” గౌతముఁడు:__"అప్లైన నన్నా ప్రశ్నోత్తరార్థమై నిర్బం ధింపకుము. విషలిప్తబాణనిహతుఁడైన మనుజుఁడు చికిత్సకునితో "అయ్యా! ననుఁగొట్టిన నాఁడు క్షత్రి యుఁడో, బ్రాహ్మణుఁడో, వైశ్యుఁడో, శూద్రుఁడో, తెలియకమున్ను నాగాయంబును మీ చేఁ జికిత్స: జేయనీయను”అని చెప్పిన నాని గతి యేమగును? ఆక్ష తంబుచే వాఁడు మరణించును. మరణానంతరమున రాఁబోవుదాని జ్ఞానంబు లేకుండుటచేఁ బావనంబగు జీవనంబుఁ గూర్చియు, జ్ఞానార్థము నత్యంత పరిశ్రమ ను గావింపనివాఁడు నాశమును జెందును. కాన ఓయీ! మాలుక్యపుత్రా! నాచే న ప్రకాశితం బైన దాని ప్రకాశితంబుగను, బ్రకాశితంబైనదానిని బ్రకాశితంబుగను నుండనిమ్ము.” ג ఈరీతిగనే ప్రసేనజిత్తను కోసల రాజు తన ముఖ్య పట్టణమైన సాకేతపురమునుండి రాజధానియగు శ్రావస్తీ GOS CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> qzgp9i699b8qn6emrs04sopsm8feq3q పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/145 104 211975 552485 2026-04-10T03:30:24Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము పురమునకుం జనుచు విశిష్టజ్ఞానంబునకు విఖ్యాతిఁ జెం దిన 'క్షేమ’యను భీషిణీం గలిసికొని యామె నర్చించి యిట్టు లనెను: ప్రసేనజిత్తు:__"పూజ్యా! సిద్ధుండు మరణానంతరమున నుండ...' 552485 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము పురమునకుం జనుచు విశిష్టజ్ఞానంబునకు విఖ్యాతిఁ జెం దిన 'క్షేమ’యను భీషిణీం గలిసికొని యామె నర్చించి యిట్టు లనెను: ప్రసేనజిత్తు:__"పూజ్యా! సిద్ధుండు మరణానంతరమున నుండునా? క్షేమ:__“మహారాజా! అత్యుత్తముండు, సిద్ధుఁడు మర ణానంతరమున నుండుసని మాత్రము చెప్పలేదు.” ప్రసేనజిత్తు: — "పూజ్యా! సిద్ధుండు మరణాంతరమున నుండఁడా?" క్షేమ:_"ఓ మహారాజా! దీని గూర్చియు బుద్ధ దేవుం డేమియుఁ జెప్ప లేదు.” వీని బట్టి గౌతమమతము నిర్వాణముకంటె వేఱగు స్థలము నంగీకరింపదని నిశ్చయమగుచున్నది. గౌతముని యొక్క యాశయ మసందిగ్ధముగ నున్నది. మానవ కోటికి నాతఁ “డాత్మకృషిచే వ్యధానాశంబును, భవిష్య ద్వ్యధాస్థితి పరివర్జనంబును, నిహంబుననే పావనానంద మయమైన సంపన్న నిష్పాపస్థితిని బొంది నిర్వాణమును జెం దుఁడని బోధించెను. C03 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> py2cb5eppfg8x5fdjs9s9vp91yca11d పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/146 104 211976 552486 2026-04-10T03:30:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము ౨ ఇహంబుననే నిర్వాణమును జెందకయున్న మను జుఁడు పునర్జన్మమునకు లోనైయుండును. గౌతముని కాత్మయందు నమ్మకము లేదు. ఆత్మయ స్తిత్వము నంగీకరిం పకయే, హైందవులకు దేహాంతర ప్రాప్...' 552486 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము ౨ ఇహంబుననే నిర్వాణమును జెందకయున్న మను జుఁడు పునర్జన్మమునకు లోనైయుండును. గౌతముని కాత్మయందు నమ్మకము లేదు. ఆత్మయ స్తిత్వము నంగీకరిం పకయే, హైందవులకు దేహాంతర ప్రాప్తియందు నీకున్మూ 'లంబగు విశేష నమ్మక ముండుటం జేసి గౌతముఁడును బునర్జన్మ నంగీకరించెను. కాని యాత్మ లేనిపక్షమున నెయ్యది పునర్జన్మమును బొందును? దీనికిఁ గర్మసిద్ధాంత మున బౌద్ధులు సమాధానమును జెప్పిరి. ఆసిద్ధాంత మెద్ది యన: కర్మము, వినాశమును జెందక, తత్కర్మఫలంబును జీవుని బొందించుచున్నది. సజీవంబగు ప్రాణి మృతిఁ జెందిన నట్టిప్రాణి కర్మముననుసరించుచు నింకొక ప్రాణి యుద్భవించు చున్నది. దీని కుపమానంబుగ బౌద్ధవిద్వాంసు లొక దీప జ్వాలకును, దానిచే నుద్దీ ప్తంబగు నింకొక దీపజ్వాలకును గల పరస్పరసంబంధమును జెప్పుదురు. నిష్పాపి యెవ్వఁడైన నీ ప్ర పంచమునఁ బీడనంబుఁ జెందిన నట్టివాఁడు బౌద్ధుఁడైన నిట్లు చెప్పును: “ఈదుఃఖము నాకర్మఫలమే; విలఘనంబు నకుఁ గారణము లేదు.” ఆత్మ లేనిపక్షమున వ్యధఁ జెందు చున్న మనుజునకును మృతిఁ జెందిన వానికిని న భేదం బెట్లు? దీనికి బౌద్ధులు చెప్పు సమాధానం బెద్దియన: “ప్రాణి మృతిఁ జెంది పరమాణువులలోనికి గ్రహించినతఱిని నాశనము లేని CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> hqglvrhtngtlwwpmjnz9ux0zccvacqp పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/147 104 211977 552487 2026-04-10T03:30:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము మనోనాక్క ర్మానుకూపమైన కర్మముమాత్ర ముండును.” అని బ్రాహ్మణ వేదాంతమునుండి గౌతముఁడు. పునర్జన్మమత మునే కాక పాననజీవనౌత్కృష్ట్యమును, దాన్ని బ్రకా శింపఁ జేయుటకుఁ దగిన...' 552487 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము మనోనాక్క ర్మానుకూపమైన కర్మముమాత్ర ముండును.” అని బ్రాహ్మణ వేదాంతమునుండి గౌతముఁడు. పునర్జన్మమత మునే కాక పాననజీవనౌత్కృష్ట్యమును, దాన్ని బ్రకా శింపఁ జేయుటకుఁ దగిన విశ్వ దేవతాగణమును గూడఁ గొన్ని మార్పులఁజేసి పరిగ్రహించెను. మఱియు ముప్పది ముగ్గురుగు ఋగ్వేద దేవతల నాతఁడు పరిగ్రహించెను. కాని వారికిఁ బరమాత్మత్వము నాతఁ జొనంగ లేదు. ఉపని షత్తులయందుఁ బూజింపఁబడుచున్న పరబ్రహ్మమును గూడ గౌతముఁ డంగీకరించెను. కాని యట్టి పర బ్రహ్మమునకు జగదాత్మత్వము నంగీకరింప లేదు. ఏల యన: వారుగూడఁ బునర్జన్మ పరంపరలచే నిరతిశయం బగు నిర్వాణమును బొందుటకుఁ బ్రయత్నములు సల్పు చున్నారు. ఏ కాలమందైనను, నేమానవునిచేనైనను, దైవి కాశిమానుషశక్తులకం టెఁ బుణ్యంబగు జీవనం బేయుత్కృ ష్టమనియును, మనుజుని చేఁ బొందఁ దగు సాధుత్వం బే యజ్ఞేయంబులగు బ్రహ్మాండము, లందైన శక్తుల కంటే గొప్పదనియును సాహసముగఁ జెప్పఁ బ్రయత్నము గావింపఁబడ లేదు. జన్మమాత్రముననే కాక జ్ఞానాధిక్యము చేఁ గూడ యోగ్యుండైన బ్రాహ్మణుని గౌతముఁడు బౌద్ధశ ధశ్రమణు CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri г.ox<noinclude><references/></noinclude> t4k5gai3xqlpreoy9oayopx7p4you3i పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/148 104 211978 552488 2026-04-10T03:30:54Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము నెట్లు గౌరవించెనో యట్లే గారవించెను. వసిష్ఠ, భరద్వా జులను నిద్దఱు బ్రాహ్మణయువకులు బ్రాహ్మణత్వముఁ గూర్చి వివాదముఁ గావించి గౌతమునియొద్ద కేగి నీయు దేశ మేమి యని యడు...' 552488 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము నెట్లు గౌరవించెనో యట్లే గారవించెను. వసిష్ఠ, భరద్వా జులను నిద్దఱు బ్రాహ్మణయువకులు బ్రాహ్మణత్వముఁ గూర్చి వివాదముఁ గావించి గౌతమునియొద్ద కేగి నీయు దేశ మేమి యని యడుగ నాతఁ డొక సంకథనంబున జాతి భేదంబుల ఖండించి మనుజునియొక్క ముఖ్యచిహ్నము వానికర్మమే యనియును, జన్మము కాదనియును జెప్పెను. "గ్రాసంబును, వృక్షములును, గీటకములును, బిపీ, లికములును, జతుష్పాద జంతువులును, సర్పములును, జల జంతువులును, బళులును వానివాని విశిష్ట చిహ్నములచే వేర్వేఱుజాతులుగా విభజింపఁబడుచున్నవి. మనుజుఁడును వాని విశిష్ట చిహ్నంబుఁ దెలియఁ బడుచున్నాఁడు. అది యెద్దియన వాని వృత్తియే.” “మనుజులలో నెప్పుడైనను గోరక్షణంబున జీన నంబుఁ గావించిన నట్టివాఁ డర్యుఁడుగాని బ్రాహ్మణుఁడు గాఁడు.” “మనుజులలో నెవ్వఁడైన శిల్పముచే జీవించు చున్నట్టివాఁడు శిల్పిగాని బ్రాహ్మణుఁడు గాఁడు.” “ఎవ్వఁడు వాణిజ్యముచే జీవించునో వాఁడు వణి జుఁడు కాని బ్రాహ్మణుఁడు కాఁడు.” 300 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> kunckdjca1zz413lkcuj1w2ect0zcdm పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/149 104 211979 552489 2026-04-10T03:31:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము “ఎన్వాఁడు శౌర్యముచే జీవించుచున్నాఁడో వాఁడు చోరుఁడుకాని బ్రాహ్మణుఁడు కాఁదు. ” "ఎనఁడు శస్త్రజీవి యగుచున్నాడో వాఁడు యోధుఁడుగాని 'బ్రాహ్మణుఁడు కాఁఁడు." "ఎవ్వఁడు గృహ...' 552489 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము “ఎన్వాఁడు శౌర్యముచే జీవించుచున్నాఁడో వాఁడు చోరుఁడుకాని బ్రాహ్మణుఁడు కాఁదు. ” "ఎనఁడు శస్త్రజీవి యగుచున్నాడో వాఁడు యోధుఁడుగాని 'బ్రాహ్మణుఁడు కాఁఁడు." "ఎవ్వఁడు గృహ్య కర్మానుష్ఠానంబుచే జీవించు చున్నాడో వాఁడు హోత యగుచున్నాఁడు కాని బ్రాహ్మణుఁడు కాఁడు.” "ఎవ్వఁడు గ్రామమునకు స్వామియో వాఁడు రాజు కాని బ్రాహ్మణుఁడు కాఁడు.” “మనుజుని జన్మముంబట్టి కాని, వాని మాతృజాతిం బట్టికాని వానిని బ్రాహ్మణునిగ నేను బరిగణింపను. ఎవఁ డు రికహీనుఁడై యెద్ధానినైనం బరిగ్రహింపఁడో వాని నే బ్రాహ్మణునిగనేఁ బరిగణిం చెదను. ” “ఏమనుజుఁడు రోషరహితుఁడై, పూతకర్మాను స్థానుఁడై, ధర్మపరాయణుఁడై, కామరహితుఁడై, శమద మాది యుక్తుండై, యంత్యదేహధారి యగునో వానినే బ్రాహ్మణునిగఁ బరిగణించుచున్నాఁడను.” CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> pta7js3wt3omze52fth53hr5bbbkel7 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/150 104 211980 552490 2026-04-10T03:31:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము ౨ ఎవ్వాఁడు కమలపత్రంబుపై నుదక బిందువువ లెను, సూచ్య గ్రంబున సర్ష పబీజంబువలెను విషయాసక్తిలేక యుండునో వానినే బ్రాహ్మణునిగఁ బరిగణించుచున్నాఁ డను.” (వా సేర్థనూ త్తము)...' 552490 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము ౨ ఎవ్వాఁడు కమలపత్రంబుపై నుదక బిందువువ లెను, సూచ్య గ్రంబున సర్ష పబీజంబువలెను విషయాసక్తిలేక యుండునో వానినే బ్రాహ్మణునిగఁ బరిగణించుచున్నాఁ డను.” (వా సేర్థనూ త్తము) ఇట్లే మఝుమనికాయంబున నస్సలాయనసూత్తమం దస్సలాయణుఁడను విద్విష్ట బ్రాహ్మణ విద్వాంసుఁ డన్ని జాతుల వారును శుచిత్వమున సమానులను సిద్ధాంతమును ఖండింపఁ బ్రయత్నించెను. గౌతముఁడు తార్కికునితో వాని యీ యుధములతోనే సంవాదంబుఁ గావింప శక్తి 'గలవాఁడై “బ్రాహ్మణయువతు లితరజాతి స్త్రీలవలెఁ బ్రసవకష్టములకు లోనైయున్నారా? లేదా?" అని యస్సలాయణుని బ్రశ్నించెను. యా “అట్లే యితర జాతి స్త్రీలవలె వారు గూడఁ బ్రనవ కష్టంబులకు లోనై యున్నారు.” అని యాతఁడు ప్రత్యు త్తర మిచ్చెను. “బాక్ట్రియా యాఫమను దేశీయులలో వర్ణ భేద ముండినను, దాసులు యజమానులుగను, యజమా నులు దాసులుగను నగుట లేదా?" యని గౌతముఁడు ప్రశ్నింప “అట్లే యగుచున్నది” అని యస్సలాయణుఁడు 200 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> grz7w9zwbynbcnjnuf6xukhw2sn6ax9 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/151 104 211981 552491 2026-04-10T03:31:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము ప్రత్యుత్త త్తరముఁ జెప్పెను. "అప్లైన బ్రాహ్మణుఁడు మానవ హంతకుఁడును, జోరుఁడును, వ్యభిచారియు, ననృత వాదియుఁ, బిశునుఁడును, దుచ్ఛ పరుష వచనంబులు వల్కువాఁడును, దురాశాపరు...' 552491 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము ప్రత్యుత్త త్తరముఁ జెప్పెను. "అప్లైన బ్రాహ్మణుఁడు మానవ హంతకుఁడును, జోరుఁడును, వ్యభిచారియు, ననృత వాదియుఁ, బిశునుఁడును, దుచ్ఛ పరుష వచనంబులు వల్కువాఁడును, దురాశాపరుండును, నసూయా గ్రస్తుఁ డును, నానృజుమార్గవర్తియు నైనయెడల నాతఁడు మర ణానంతరమునఁ దదితర జాతి వానివలె దుఃఖభోజనం బైన జన్మంబును బొందఁడా? అని యన “అట్లే” అనుచు నస్సలాయణుఁడు “సుకర్మములు, జాతిభేదమును బాటింపక కర్మికిమోక్షమును గలుగఁ జేయు"నని యంగీకరిం చెను. గౌతముఁ డీరీతిఁగానే చర్చఁ గావించుచు నాఁడు గుఱ్ఱ మునకును, గాడిదకును గంచరిగాడిద పుట్టుననియును, క్షత్త్రియ బ్రాహ్మణుల కుద్భవించువాఁడు జననీజనకులను బోలియుండుననియుఁ, జెప్పుచు బాహ్మణులకును క్షత్తి యులకును భేదంబు లేదనియును, దదనుగుణముగఁ జెప్పె ను. యువకుండగు నాతార్కికు నిట్టి సంభాషణచే సత్య గ్రహణంబు కావించునట్లు చేసెను. గౌతముఁ డింకొకతఱిని దన శిష్యుల కిట్లు బోధఁ గావిం చెను: “భ్రాతృలారా! ఎట్లు గంగా, యమునానదు. లును, నసిరావతి, శరభు, మాహి, మొదలగు గొప్ప నదులును సాగరసంగమంబుఁ గావించి పూర్వోత్పత్తి నామములను గోల్పోయి, సాగరంబనునామమునుధరించు చున్ననో యట్లే బ్రాహ్మణ క్షత్త్రియ వైశ్య శూద్రులు 400 CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> dh0myq2hxdjd2mf857c1cum7s0ov4y8 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/152 104 211982 552492 2026-04-10T03:31:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము బౌద్ధసంఘంబునఁ జేరి జాతి భేదంబులఁ బోగొట్టుకొందురు.” ఉపాలియనుమంగలి బౌద్ధభిక్షుక సంఘంబునఁ జేరి, బౌద్ధ భిక్షుకులలో సతిపూజనీయుఁడును; విద్వచ్ఛేఖరుఁడును నయ్యెను. థే...' 552492 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము బౌద్ధసంఘంబునఁ జేరి జాతి భేదంబులఁ బోగొట్టుకొందురు.” ఉపాలియనుమంగలి బౌద్ధభిక్షుక సంఘంబునఁ జేరి, బౌద్ధ భిక్షుకులలో సతిపూజనీయుఁడును; విద్వచ్ఛేఖరుఁడును నయ్యెను. థేరాగతంబున నెట్లు బౌద్ధమతము దీనులకును క్షుద్రజాతివారలకును హిందూదేశమున సౌఖ్యదాయ కమై వారలకు జాతిభేదంబువలన వచ్చినయన్యాయములఁ దగ్గించెనో సూచించుచున్నది. సునీతుఁడను బౌద్ధుఁ డిట్లు వ్రాయుచున్నాఁడు: “నే నొక ముద్ర కుటుంబములోని వాఁడను. బీదనై యష్టకష్టంబులం బడుచుండెడివాఁడను. క్షుద్రవ్యా పారినై జీర్ణపుష్పాపమర్జనంబుఁ వాఁడను. అణఁకువతో న నేకులను గులమర్యాదతోఁ గావించుచుండెడి జూచుచుండెడివాఁడను. భిక్షుక సంఘంబుతో మగధ రాజ్యముఖ్యపట్టణమునకుం జన బుద్ధ దేవు ని నేఁ గంటిని. నాభారంబుఁ బరిత్యజించి వానికి భక్తి పూర్వకముగ దండ ప్రణామంబుఁ గావించుటకుఁ బోతిని. మానవులలోఁ బరమోత్తముండగు నాతఁడు నాయందు దయఁబూని మార్గమున నాఁగెను. గురుపుంగవుని పాదార విందములకు మ్రొక్కి నన్ను భీష్మకునిగఁ బరిగ్రహింపు మని యానర శ్రేష్ఠుని వేఁడితిని. దయామయుండగు నా యాచార్యపుంగవుండు "ఓయీ! భిషుకా! ఇటురమ్ము!” అనెను. అదియే నేఁబొందిన సంస్కారము. ” గౌతమునిచే CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri .<noinclude><references/></noinclude> 0kfmbquf696m9xzv1xxzbhl3o836sz0 పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/153 104 211983 552493 2026-04-10T03:31:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము .కా నసంఖ్యాకముగ బోధింపఁబడిన తత్త్వ రీతిగ నాక థాం తమున నీయఁబడినది. "పవిత్ర జీవనంబుననైన యుత్సా హంబుచేతను, బూతజీవనంబునను, నాత్మనిగ్రహంబునను మనుజుఁడు బ్రాహ్మణుఁడగు...' 552493 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము .కా నసంఖ్యాకముగ బోధింపఁబడిన తత్త్వ రీతిగ నాక థాం తమున నీయఁబడినది. "పవిత్ర జీవనంబుననైన యుత్సా హంబుచేతను, బూతజీవనంబునను, నాత్మనిగ్రహంబునను మనుజుఁడు బ్రాహ్మణుఁడగును; ఇదియే యుత్కృష్టంబగు బ్రాహ్మణత్వము.” దీనుండగు సునీతుని బౌద్ధమతాశ్రయ విషయక మైనకథ ప్రాథమిక బౌద్ధమత సంబంధ మగు సప్రేమ సమానతా చిత్తవృత్తిని నిరూపించుచున్నది. బుద్ధ దేవుఁడు జాతికులవృత్తులను నిరాకరించియే దరిద్రులకును ధనికులకును, నభిజాతులకును, నీచజాతులకును, భేదంబు లేక పావనంబగు జీవనంబుననే పరమగతిం జెందుఁడని బోధించుచుండెను. కులీనునకును, నీచ వంశ ప్రసూతున కును సాధువృత్తియే యుత్తమగతిప్రాప్తికిఁ గారణంబయ్యె ను. పవిత్రాశ్రమస్థులకు జాతికులాది భేదంబులు లేకుండెను. వేలకొలఁది పురుషులును, స్త్రీలును జాతిభేదముల విస ర్జించి ప్రేమమయంబును, న్యాయానురూపంబును నగు బుద్ధునిమతము నంగీకరించి యాచార్యునియందైన భక్తి చేఁ దమతమ భేదములను మఱచిరి. పవిత్రాశ్రమంబున జాతి భేదంబు లేదు. బౌద్ధగృహస్థులయందుఁ గూడ వర్ణ భేదముల వలనఁ గలుగు మనస్సంతాపములు తగ్గినవి. ఏలయన: నత్యధమజాతియం దుద్భవించినవానికైన నుత్తమస్థాన ప్రాప్తి నిరోధింపఁబడ లేదు. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> kwpdg1sj7h4ndayw17jawtcu7x4uy1l పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/154 104 211984 552494 2026-04-10T03:31:54Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనుబంధము కా మనుజుఁడు శిఖలవలనను, గులమువలనను, గుణ మువలనను, జన్మమువలనను, బ్రాహ్మణుఁడు కానేరఁడు. ఎవఁడు ఋజుమార్గానునరియై సత్యపథము నతిక్ర మింపఁ డో వాఁడే బ్రాహ్మణ శబ్దవాచ్యుఁడు...' 552494 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుబంధము కా మనుజుఁడు శిఖలవలనను, గులమువలనను, గుణ మువలనను, జన్మమువలనను, బ్రాహ్మణుఁడు కానేరఁడు. ఎవఁడు ఋజుమార్గానునరియై సత్యపథము నతిక్ర మింపఁ డో వాఁడే బ్రాహ్మణ శబ్దవాచ్యుఁడు. “జటావల్కలముల వలన లాభమేమి? ఓయీ! ముదుఁడా! నేషచర్మధారణం బున నేమున్నది? హృదయాంతర్భాగమున నాశ దహించు నున్నది. వెలుపల నీవేమి చేసిన నేమిఫలము?” "ఎనఁడు విశ్రాంతుఁడై, వీరుఁడై, యోగియై, జయ శీలుండై, సుఖదుఃఖక్షతముండై, సంపన్నుఁడై, జ్ఞానియగు నో వానినే బ్రాహ్మణునిగఁ బరిగణింతును.” “నగ్నత్వముకాని, జటలు కాని, మలినంబుకాని, నిరాహారంబుకాని, క్షితితలశయనంబు కాని, మలిన పరిమా ర్జనంబుకాని, నిశ్చేతన్యవృత్తికాని, నిష్కాముఁడు కాని వానిని బవిత్రునిగఁ జేయనేరవు.” బుద్ధుఁ డందఱను సంసారమును బరిత్యజింపుఁడని యే శాసింపలేదు. విషయాసక్తిని, గామములను జయిం పుఁడనియే వానిబోధ. రాగాతిక్రమణము గావింపనివాని సంసార త్యాగము బుద్ధుఁ డంగీకరింపలేదు. కాని సంసార సుఖముల ననుభవించు చున్నప్పటికంటె సంసార పరి త్యాగమును గావించిన నెక్కుడు సులభముగ నిర్వాణ ప్రాప్తియగునని మాత్రము బోధించెను. CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri<noinclude><references/></noinclude> 9fqfnbddzy9cewxlrmzo6plh9qkfcza పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/158 104 211985 552495 2026-04-10T03:33:09Z శ్రీరామమూర్తి 1517 /* పాఠ్యం లేనిది */ 552495 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude><references/></noinclude> ayztjahdx3h8u5dx34xf7xa8j87pkng పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/161 104 211986 552496 2026-04-10T03:33:42Z శ్రీరామమూర్తి 1517 /* పాఠ్యం లేనిది */ 552496 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude><references/></noinclude> ayztjahdx3h8u5dx34xf7xa8j87pkng పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/162 104 211987 552497 2026-04-10T03:34:08Z శ్రీరామమూర్తి 1517 /* పాఠ్యం లేనిది */ 552497 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude><references/></noinclude> ayztjahdx3h8u5dx34xf7xa8j87pkng పుట:పటం కతలు.pdf/92 104 211988 552500 2026-04-10T04:23:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు రెండురోజులు సహదేవ కల్యాణం, ఒకరోజు సుభద్ర కల్యాణం, రెండురోజులు గరిమళ్లకోట, రెండురోజులు సభాపర్వం, 75 రెండురోజులు విరాటపర్వం చెబుతారు లేదా పద్మవ్యూహం, విరాటపర్వం, గో...' 552500 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు రెండురోజులు సహదేవ కల్యాణం, ఒకరోజు సుభద్ర కల్యాణం, రెండురోజులు గరిమళ్లకోట, రెండురోజులు సభాపర్వం, 75 రెండురోజులు విరాటపర్వం చెబుతారు లేదా పద్మవ్యూహం, విరాటపర్వం, గోవుల చెరకు సంబంధించిన కథ చెబుతారు. స్టేజీ ఏర్పాట కాకిపడిగెల వారు ముదిరాజ్ వాడలోనే విశాలమైన స్థలంలో పటం కట్టే విధంగా రెండు గుంజలు నాటి పటం కట్టి కింద చాపవేసుకొని చెబుతారు. ఇక నాటకాలు ప్రదర్శిస్తే మాత్రం చుట్టూ నాలుగు గుంజలు నాటి పరదాలు కట్టి పైన ఒక పరదావేసి కింద బల్లలపైన చెబుతారు. దర్శకుల వేషధారణ పటం కథ చెప్పేటప్పుడు సాధారణ వేషధారణతోనే చెబుతారు. అంటే మామూలుగా ధోతి, కమీజు వేసుకుని నడుముకు ఒక పంచె కట్టుకొని చెబుతారు. వటం తయారీ వీరి పటాన్ని నకాశివాళ్లు తయారు చేస్తారు. ముందుగా వీళ్ల గుడ్డ ప్రత్యేకంగా నేయించి ఇస్తే వాళ్లు పద్దెనిమిది వారాలకు సంబంధించిన బొమ్మలు వేసిస్తారు. అయితే ఈ పటాలు వేసిన వాళ్లకు పటం వేసిన తర్వాత ఏదో ఒక చెడు జరుగుతుందట. అంటే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోవడం గానీ లేదా అతనే చనిపోవడం గానీ జరుగుతుందట. అయితే ఇలా జరగకుండా ఉండటానికి నియమ నిష్టలతో ఉండి పటాన్ని గీసి మంత్ర తంత్రాలు చేసుకుంటూ ఉంటే మాత్రం చెదు నుంచి కాపాడుకోవచ్చు. ఈ పటం వేసేవారు చేర్యాలలోనూ, అవిశపురంలోనూ ఉన్నారు. పటం నలభై మూరల పొడవుండి రెండు మూరల వెడల్పు ఉంటుంది. పటాల చివరలో కంక కట్టెలు గానీ, తునికి చేపగానీ, జిట్రేగ కలిగిన కర్రతో చేసిన గుండ్రటి కట్టెలు<noinclude><references/></noinclude> hcwmq44n6ldwlz8zsp73u4983v0y5g0 552508 552500 2026-04-10T04:46:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552508 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||75}}</noinclude> :రెండురోజులు సహదేవ కల్యాణం, :ఒకరోజు సుభద్ర కల్యాణం, :రెండురోజులు గరిమళ్లకోట, :రెండురోజులు సభాపర్వం, {రెండురోజులు విరాటపర్వం చెబుతారు లేదా పద్మవ్యూహం, విరాటపర్వం, గోవుల చెరకు సంబంధించిన కథ చెబుతారు. '''స్టేజీ ఏర్పా''' కాకిపడిగెల వారు ముదిరాజ్ వాడలోనే విశాలమైన స్థలంలో పటం కట్టే విధంగా రెండు గుంజలు నాటి పటం కట్టి కింద చాపవేసుకొని చెబుతారు. ఇక నాటకాలు ప్రదర్శిస్తే మాత్రం చుట్టూ నాలుగు గుంజలు నాటి పరదాలు కట్టి పైన ఒక పరదావేసి కింద బల్లలపైన చెబుతారు. '''దర్శకుల వేషధారణ ''' పటం కథ చెప్పేటప్పుడు సాధారణ వేషధారణతోనే చెబుతారు. అంటే మామూలుగా ధోతి, కమీజు వేసుకుని నడుముకు ఒక పంచె కట్టుకొని చెబుతారు. '''వటం తయారీ ''' వీరి పటాన్ని నకాశివాళ్లు తయారు చేస్తారు. ముందుగా వీళ్ల గుడ్డ ప్రత్యేకంగా నేయించి ఇస్తే వాళ్లు పద్దెనిమిది వారాలకు సంబంధించిన బొమ్మలు వేసిస్తారు. అయితే ఈ పటాలు వేసిన వాళ్లకు పటం వేసిన తర్వాత ఏదో ఒక చెడు జరుగుతుందట. అంటే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోవడం గానీ లేదా అతనే చనిపోవడం గానీ జరుగుతుందట. అయితే ఇలా జరగకుండా ఉండటానికి నియమ నిష్టలతో ఉండి పటాన్ని గీసి మంత్ర తంత్రాలు చేసుకుంటూ ఉంటే మాత్రం చెదు నుంచి కాపాడుకోవచ్చు. ఈ పటం వేసేవారు చేర్యాలలోనూ, అవిశపురంలోనూ ఉన్నారు. పటం నలభై మూరల పొడవుండి రెండు మూరల వెడల్పు ఉంటుంది. పటాల చివరలో కంక కట్టెలు గానీ, తునికి చేపగానీ, జిట్రేగ కలిగిన కర్రతో చేసిన గుండ్రటి కట్టెలు<noinclude><references/></noinclude> jr1zznho29a7vml2ifvrjevt59ltwi1 పుట:పటం కతలు.pdf/93 104 211989 552501 2026-04-10T04:23:26Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '76 పటం కతలు ఉంటాయి. దానికి ఈ పటం చుట్టి ఉంటుంది. కథ చెప్పిన తర్వాత పటాన్ని గట్టిగా చుట్ట దానికి ఒక వర్క్ కాగితం (ప్లాస్టిక్ పేపర్) చుట్టి కురవని మరియు ఎలుకలు లేని ప్రదేశంలో పె...' 552501 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>76 పటం కతలు ఉంటాయి. దానికి ఈ పటం చుట్టి ఉంటుంది. కథ చెప్పిన తర్వాత పటాన్ని గట్టిగా చుట్ట దానికి ఒక వర్క్ కాగితం (ప్లాస్టిక్ పేపర్) చుట్టి కురవని మరియు ఎలుకలు లేని ప్రదేశంలో పెడతారు. మేళం ఎంపిక దేశాల మీదికి పోయే ముందు మేళాలుగా తయారవుతారు. వారివారి కంఠాలను బట్టి నైపుణ్యాన్ని ఎంచుకొని మేళం తయారవుతారు. పటం కథ అయితే ముగ్గురు లేదా నాటకాలకు అయితే ఎనిమిది తయారవుతారు. పటం కథ చెప్పేటప్పుడు ముగ్గురు లేదా నలుగురు ఉంటారు. ముగ్గురు ఉన్నట్లయితే ఒకరు ప్రధాన కథకుడు, మరొకరు సహకథకునిగా వ్యవహరిస్తూ తాళాలు లేదా మద్దెల వాయిస్తారు. ఇంకొకరు తాళాలు వాయిస్తారు. నలుగురైతే ఒకరు ప్రధాన కథకుడు, ఒక సహకథకుడు, ఒకరు మద్దెల, ఒకరు తాళాలు వాయిస్తారు. కథా ప్రారంభం త్యాగం నిర్ణయం అయిన తర్వాత కులపెద్ద ఇంటికి సమీపాన గానీ లేదా ముదిరాజ్ వీధిలోనే కొంచెం విశాలమైన స్థలంలో గానీ ఒక స్టేజీ ఏర్పాటు చేసుకొని మంచిరోజు చూసుకొని అంటే ఎక్కువగా విదియ, తదియలలో గానీ లేదా అష్ట నవమిలు రాకుండా చూసి సోమ, బుధ, శుక్ర వారాల్లో గానీ కథను ప్రారంభిస్తారు. కథ ప్రారంభించే ముందు పటం కట్టి పటంలోని పెద్దమ్మ బొమ్మ తీసి దానిముందు కొబ్బరికాయ, పూలు, ఊదిబత్తీలు, మంగళ హారతి, నెమలి ఈకల కట్ట పెట్టి నెమలి ఈకల కట్టతో పటాన్ని తుడిచినట్లు వేసి ముందుగా గణపతి ప్రార్ధన, సరస్వతి ప్రార్ధన చేస్తారు. తర్వాత పెద్దమ్మ ముంగిట ప్రధాన కథకుడు కొబ్బరికాయ కొట్టి ఆ రోజు ఏ కథ అయితే చెబుతాడో ఆ కథకు సంబంధించిన బొమ్మలను తీసి ఉంచి కథ ప్రారంభిస్తాడు. నాటకాలు ప్రదర్శించే సమయంలో కూడా రంగస్థలం మీద ఒక కొబ్బరికాయ కొట్టి ప్రదర్శన ప్రారంభిస్తారు.<noinclude><references/></noinclude> idl8qaeelp0uta6i7yqpm6gxjfouiut 552509 552501 2026-04-10T05:01:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552509 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|76||పటం కతలు}}</noinclude> ఉంటాయి. దానికి ఈ పటం చుట్టి ఉంటుంది. కథ చెప్పిన తర్వాత పటాన్ని గట్టిగా చుట్టి దానికి ఒక వర్క్ కాగితం (ప్లాస్టిక్ పేపర్) చుట్టి కురవని మరియు ఎలుకలు లేని ప్రదేశంలో పెడతారు. '''మేళం ఎంపిక ''' దేశాల మీదికి పోయే ముందు మేళాలుగా తయారవుతారు. వారివారి కంఠాలను బట్టి నైపుణ్యాన్ని ఎంచుకొని మేళం తయారవుతారు. పటం కథ అయితే ముగ్గురు లేదా నాటకాలకు అయితే ఎనిమిది తయారవుతారు. పటం కథ చెప్పేటప్పుడు ముగ్గురు లేదా నలుగురు ఉంటారు. ముగ్గురు ఉన్నట్లయితే ఒకరు ప్రధాన కథకుడు, మరొకరు సహకథకునిగా వ్యవహరిస్తూ తాళాలు లేదా మద్దెల వాయిస్తారు. ఇంకొకరు తాళాలు వాయిస్తారు. నలుగురైతే ఒకరు ప్రధాన కథకుడు, ఒక సహకథకుడు, ఒకరు మద్దెల, ఒకరు తాళాలు వాయిస్తారు. '''కథా ప్రారంభం ''' త్యాగం నిర్ణయం అయిన తర్వాత కులపెద్ద ఇంటికి సమీపాన గానీ లేదా ముదిరాజ్ వీధిలోనే కొంచెం విశాలమైన స్థలంలో గానీ ఒక స్టేజీ ఏర్పాటు చేసుకొని మంచిరోజు చూసుకొని అంటే ఎక్కువగా విదియ, తదియలలో గానీ లేదా అష్ట నవమిలు రాకుండా చూసి సోమ, బుధ, శుక్ర వారాల్లో గానీ కథను ప్రారంభిస్తారు. కథ ప్రారంభించే ముందు పటం కట్టి పటంలోని పెద్దమ్మ బొమ్మ తీసి దానిముందు కొబ్బరికాయ, పూలు, ఊదిబత్తీలు, మంగళ హారతి, నెమలి ఈకల కట్ట పెట్టి నెమలి ఈకల కట్టతో పటాన్ని తుడిచినట్లు వేసి ముందుగా గణపతి ప్రార్ధన, సరస్వతి ప్రార్ధన చేస్తారు. తర్వాత పెద్దమ్మ ముంగిట ప్రధాన కథకుడు కొబ్బరికాయ కొట్టి ఆ రోజు ఏ కథ అయితే చెబుతాడో ఆ కథకు సంబంధించిన బొమ్మలను తీసి ఉంచి కథ ప్రారంభిస్తాడు. నాటకాలు ప్రదర్శించే సమయంలో కూడా రంగస్థలం మీద ఒక కొబ్బరికాయ కొట్టి ప్రదర్శన ప్రారంభిస్తారు.<noinclude><references/></noinclude> r0vds95o8i5lx0f6c79vy6z6prq32dg పుట:పటం కతలు.pdf/94 104 211990 552510 2026-04-10T05:01:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 77 ప్రధాన కథకుడు కథ చెబుతుంటే సహకథకుడు సందర్భాన్ని బట్టి వివరిస్తాడు. కథకు అనుగుణంగా ప్రధాన కథకుడు కట్టెతో బొమ్మలు చూపిస్తూ వివరిస్తుంటాడు. ఈ విధంగా కథ చెబుతుంటే...' 552510 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 77 ప్రధాన కథకుడు కథ చెబుతుంటే సహకథకుడు సందర్భాన్ని బట్టి వివరిస్తాడు. కథకు అనుగుణంగా ప్రధాన కథకుడు కట్టెతో బొమ్మలు చూపిస్తూ వివరిస్తుంటాడు. ఈ విధంగా కథ చెబుతుంటే మద్దెల, తాళాలు వాయిస్తారు. వీరు ఐదురోజులు గానీ తొమ్మిది రోజులు గానీ కథ చెపితే మధ్యమధ్యలో రెండురోజులకొకసారి విశ్రాంతి తీసుకుంటారు. చివరిరోజు సాయంత్రం పెద్దమ్మ పండుగ చేస్తారు. నాటకాలు ప్రదర్శిస్తే వేషధారణ చేసుకొని ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసుకొని ప్రదర్శిస్తారు. ప్రదర్శనలోని అనుష్టానాలు వీరు ప్రదర్శన ఇచ్చేటప్పుడు మధ్యమధ్యలో కొన్ని అనుష్టానాలు నిర్వహిస్తారు. పూర్వ కాలంలో కౌరవులు చనిపోయేటప్పుడు ఆ సందర్భంలో ఒక కోడిని కోస్తారు. అలాగే ద్రోణుడు చనిపోయిన దగ్గర, సైంధవుడు పడిపోయిన దగ్గర కోడిని కోస్తారు. సహదేవ కల్యాణం సమయంలో పెండ్లిలాగా చేసి కట్నాలు చదివించమని కట్నాలు తీసుకుంటారు. అలాగే శశిరేఖ పరిణయం సమయంలో కూడా పెండ్లి లాగా చేసి కట్నాలు చదివించమని కట్నాలు తీసుకుంటారు. త్యాగం కథల అనంతరం త్యాగం కథలు చెప్పిన తర్వాత వేరే వాళ్లు ఎవరు చెప్పమన్నా కథలు చెబుతారు. కానీ ముదిరాజ్ వాదలోనే కథలు చెబుతారు. కథ మధ్యలో ఎవరైతే కథ చెప్పిస్తారో వాళ్ళ పేర్లు చదువుతారు. ఇలాంటి సమయంలో ఐదు వందల పదహారు నుంచి వెయ్యి నూట పదహార్లు తీసుకుంటారు. ఇక చావుకథలు చెప్పినట్లయితే చనిపోయిన వారికి ఉండే బంగారం, వెండి కడాలు ఉంటే అవి ఇవ్వమని తీసుకుంటారు. చనిపోయిన వారి మీద ఆభరణాలు లేకపోతే కథ చెప్పినందుకు వాళ్లు ఆశ్రితుని బట్టి (వ్యక్తిని బట్టి) ఎంత ఇచ్చినా తీసుకుంటారు. కొందరు మేకలు, గొర్లు కూడా ఇస్తారు. ఆర్థిక పరిస్థితి కాకిపడిగెల వారి స్థితిని గమనించినట్లయితే వెనుకటికి ఇప్పటికి కొంచెం మెరుగుగా ఉన్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే.. వెనుకట నూట పదహార్లు త్యాగం<noinclude><references/></noinclude> a51ljje4pszcpfxn1ftmm5f7z9m0c9r పుట:పటం కతలు.pdf/95 104 211991 552511 2026-04-10T05:02:08Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '78 పటం కతలు ఇస్తే ఇప్పుడు ఐదు వేలు, పదివేలు ఇస్తున్నారు. కానీ చాలామందికి పక్కాగృహాలు మాత్రం లేవు. గడ్డితో కప్పబడిన ఇండ్లే ఉన్నాయి. గతంలో మాదిరిగా కంటే కళాకారుల సంఖ్య కూడా తగ...' 552511 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>78 పటం కతలు ఇస్తే ఇప్పుడు ఐదు వేలు, పదివేలు ఇస్తున్నారు. కానీ చాలామందికి పక్కాగృహాలు మాత్రం లేవు. గడ్డితో కప్పబడిన ఇండ్లే ఉన్నాయి. గతంలో మాదిరిగా కంటే కళాకారుల సంఖ్య కూడా తగ్గుతుంది. కొందరు యువకులు ఇతర వృత్తులను చేపట్టి జీవనం సాగిస్తున్నారు. - డా॥ గడ్డం వెంకన్న<noinclude><references/></noinclude> figvw1d99aq9jc1gwt11lg0jebhbpsc పుట:పటం కతలు.pdf/96 104 211992 552512 2026-04-10T05:02:25Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '8. కొమ్ము పటం కత సం ప్రదాయ పటం కథల్లో కొమ్ము కథ ఒకటి. జానపద కళారూపాల్లో ప్రదర్శన వివిధ మాధ్యమాల్లో సాగుతుంది. అందులో 'పటం' ఆధారంగా ప్రదర్శన ఇచ్చే కళారూపాలు తెలంగాణలో ఉండడం ప్...' 552512 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>8. కొమ్ము పటం కత సం ప్రదాయ పటం కథల్లో కొమ్ము కథ ఒకటి. జానపద కళారూపాల్లో ప్రదర్శన వివిధ మాధ్యమాల్లో సాగుతుంది. అందులో 'పటం' ఆధారంగా ప్రదర్శన ఇచ్చే కళారూపాలు తెలంగాణలో ఉండడం ప్రత్యేకత. కుల పురాణాలను పటం ఆధారంగా చెప్పే విధానం ఇక్కడ కనిపిస్తుంది. నకారి అనే ప్రత్యేక కులం వారి కలం నుండి పురుడు పోసుకున్న పటాలు ఎక్కువ. కానీ కొమ్ము కథకు ప్రధానమైన పటం కథను నెల్లూరు జిల్లా కలంకారి కళాకారులచే రూపొందించడం కొమ్ము పటం ప్రత్యేకత. యాదవరాజుల చరిత్రను, వారి సామాజిక స్థితిగతులను, సాంస్కృతిక బృందాలను అందమైన చిత్రాలుగా పటంపై రూపొందించగా వాటి ఆధారంగా ప్రదర్శన ఇచ్చే కళాకారులు కొమ్ము కథకులు.<noinclude><references/></noinclude> 67vzgm1dgqqb9w9973nvn5kibmno810 పుట:పటం కతలు.pdf/97 104 211993 552513 2026-04-10T05:02:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '80 |ü≥+ ø£‘·T' 552513 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>80 |ü≥+ ø£‘·T<noinclude><references/></noinclude> m6enobdxukxn1nknef0rlrvumabof5z పుట:పటం కతలు.pdf/98 104 211994 552514 2026-04-10T05:03:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 81 కొమ్ము అనే వాద్యాన్ని ఉపయోగించి కథలు చెప్పడంవల్ల కొమ్ము వారని పిలుస్తూ వస్తున్నారు. పటం ఆధారంగా కథ చెపుతూ ఉన్నప్పటికీ ప్రదర్శనకు ముందు, ప్రదర్శనలో, ప్రదర్శన చి...' 552514 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 81 కొమ్ము అనే వాద్యాన్ని ఉపయోగించి కథలు చెప్పడంవల్ల కొమ్ము వారని పిలుస్తూ వస్తున్నారు. పటం ఆధారంగా కథ చెపుతూ ఉన్నప్పటికీ ప్రదర్శనకు ముందు, ప్రదర్శనలో, ప్రదర్శన చివర కొమ్ము వాద్యాన్ని ఉపయోగిస్తారు. శృతి, పంబజోడు ఉన్నప్పటికీ కథకు కొమ్ము వాద్యమే ప్రేరణ. తెలుగు రాష్ట్రాల్లో కొమ్ముకథ కళాకారులు ఉన్నప్పటికీ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నివసించే కొమ్ముకథకులకు ఒక ప్రత్యేకత ఉంది. మధ్యయుగ కాలంలో నెల్లూరు సీమలో జరిగిన పుల్లరి యుద్ధంలో ఐత్తీరన్న భీకర పోరాటం చేస్తూ ఉంటే కొప్పుకొండపైన 'శృంగనాదం' చేస్తూ శత్రువుల రాకను కొండ క్రింది సైన్యానికి తెలిపినవారే కొమ్మువారు. అలా శృంగనాదం చేసిన వారి సంతతి అనంతరకాలంలో యాదవరాజుల కథలు చెపుతూ వారిని ఆశ్రయించి కథల ద్వారా అందించే ప్రతిఫలంతో జీవనం సాగిస్తున్నవారు కొమ్మువారు. శృంగనాదం పుట్టుక గురించి తెలియజేస్తూ వద్ది, మద్ది వృక్షాలను కొంగవాలు కత్తితో అడ్డంగా నరికివేయగా, ఆ కత్తి రణరంగంలో శృంగ వాద్యంగా మారి రాజుకు సహాయం చేసింది. అంతకుముందు త్రిమూర్తుల కల్యాణ సమయంలో వాయు గుండం నుండి ఓంకారనాదం చేస్తూ అర్ధచంద్రాకారంగా ఓం దాల్చిన శృంగనాదం - శృంగవాద్యంగా పురుడుపోసుకుంది అని కొమ్ముకథ ప్రధాన కథకుడు ఆకారపు మహిశేశ్వరరావు తెలుపడం జరిగింది. కలియుగంలో కంచుకొమ్ముగా మారి కొమ్ము సంతతివారు కొమ్ము వాయిస్తూ బత్తీరన్నకు, అనంతరం యాదవులకు తోడుగా ఉండి యాదవ రాజుల చరిత్ర చెప్పేవారుగా స్థిరపడిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కులాన్ని ఆశ్రయించి ప్రధాన కులం చరిత్ర, కథలు చెప్పే హక్కు కులాలుగా, ఉపకులాలుగా ఉన్న కళారూపాలు అధికం. ఇవి వంశపారంపర్యంగా వస్తున్న పద్ధతి, ఐతే కొమ్ము వారి ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వం వారి జాబితాలో షెడ్యూల్ కులాలుగా ఉండి, వెనుకబడిన తరగతులైన యాదవులకు కథలు చెపుతూ, త్యాగం పొందడం ఈ కళారూపం ప్రత్యేకత.<noinclude><references/></noinclude> avnfzqfqykdsfx2bzgpnmhjvfpj10k2 పుట:పటం కతలు.pdf/99 104 211995 552515 2026-04-10T05:03:20Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '82 పటం కతలు కళాకారుల ప్రదర్శనకు కావాల్సిన ప్రధాన వస్తువులైన పటం, కొమ్ము, ఈర్నం, తిత్తిలాంటి వాద్యాలు, కథ చెప్పే డేరా లేదా గుడారంను యాదవులే అందిస్తారు. తమ ఇళ్ళలో శుభ, అశుభ కార్...' 552515 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>82 పటం కతలు కళాకారుల ప్రదర్శనకు కావాల్సిన ప్రధాన వస్తువులైన పటం, కొమ్ము, ఈర్నం, తిత్తిలాంటి వాద్యాలు, కథ చెప్పే డేరా లేదా గుడారంను యాదవులే అందిస్తారు. తమ ఇళ్ళలో శుభ, అశుభ కార్యాలు, కొలువుల సందర్భంలో కొమ్ముకథ చెప్పించడం ఆనవాయితీ. కొమ్ము కళాకారులు ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని కళాకారులు మాత్రం యాదవుల ఆశ్రితులుగా, హక్కుదారులుగా ఉండి ప్రదర్శనలు ఇస్తున్నారు. ఖమ్మం జిల్లా అంతటా కొమ్ము కళాకారుల గ్రామాలు ఉన్నాయి. వంశపారంపర్యంగా వచ్చే గ్రామాల్లో తమ హక్కు ఏర్పరచుకున్న కట్టడి ప్రకారం త్యాగం పొంది కథలు చెపుతున్నారు. వంశవృద్ధి అవుతున్నకొద్దీ తమ భాగాల్లో మార్పులు చేసుకుంటూ తిరిగి హక్కు గ్రామాలను పంచుకుంటున్నారు. మూడు, ఐదు సంవత్సరాలకు ఒకసారి తమకు హక్కుగా ఉండే గ్రామాలకు వెళ్తారు. ముఖ్యంగా పంటల సమయంలో వెళ్ళడంవల్ల ఇంటికి ఐస్తా చొప్పున ధాన్యం ఇస్తారు. ఇక కథలు అనేవి వారి అవసరాలనుబట్టి చెప్పించడంవల్ల నగదు రూపంలో ప్రతిఫలం పొందుతారు. తమవద్ద ఉన్న 'మేర'నే ఈ హక్కును తెలుపుతుంది. ఇది రాగిసన్నతి లేదా శాసనం. ఇందులో కాటమరాజు చేసిన యుద్ధ ప్రస్తావనతోపాటు కొమ్మువారికి చెల్లించాల్సిన ప్రతిఫలం, ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది. కథలు, కొలువులు కొమ్ము వారికి ఆర్థిక వనరులు చేకూర్చే దారులు. కొమ్ము కథ.... 1. వలరాజు కథ 3. పెద్దిరాజు కల్యాణం 5. ఉత్తరాదికి ఆవులమేపు 7. ఎర్రగడ్డపాటి యుద్ధం 9. పోలురాజు కథ 2. పంపాద్రినోములు 4. కాటమరాజు కథ 6. నెల్లూరి పుల్లరి 8. ఐక్తీరన్న కథ 10. కరియావుల కథ అనేవి పటంలో చిత్రాల ఆధారంగా చెప్పే కొమ్ముకథలు. ఇందులో పెద్దిరాజు కథ, పంపాద్రికథ, కరియావుల కథ, ఆవులమేపు అనేవి చనిపోయిన సందర్భాల్లో యాదవులు చెప్పించే కథలు.<noinclude><references/></noinclude> l57dhg9wxy8cyvr3x5qggof1zhf66ah పుట:పటం కతలు.pdf/100 104 211996 552516 2026-04-10T05:03:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 83 వర్షాలు సకాలంలో కురియకపోతే కొమ్ము వారిని పిలిపించి ఆవుల మేపుట, ఉత్తర కాండం చెప్పిస్తే కథ పూర్తయ్యేలోపు వర్షం పడుతుందని యాదవుల విశ్వాసం. అది నేటికీ నిదర్శనంగా క...' 552516 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 83 వర్షాలు సకాలంలో కురియకపోతే కొమ్ము వారిని పిలిపించి ఆవుల మేపుట, ఉత్తర కాండం చెప్పిస్తే కథ పూర్తయ్యేలోపు వర్షం పడుతుందని యాదవుల విశ్వాసం. అది నేటికీ నిదర్శనంగా కొనసాగుతుంది కూడా. కొమ్ముకథలో పంపాద్రి నోములు అనే ఘట్టం అనుష్ఠాన ప్రక్రియతో కూడి యాదవ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇవే కాకుండా తిరుపతమ్మకథ, కలపోతగంగరాజు కథలనేవి బైటికథలు. ఇవి ఏ సమయంలోనైనా చెపుతారు. కొమ్ముకథను పగటిపూట చెపుతారు. కొన్ని రాత్రుళ్ళు ప్రారంభించి తెల్లవారుఝాము వరకు కొనసాగిస్తారు. కథనిడివి ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. ఉత్తరాకాండ లేదా ఆవులమేపు అనేది ఐదు రోజులపాటు చెపుతారు. తాళపత్రగ్రంథ ఆధారంగా సాగే ఈ కథలు నేడు ఒకరి నుండి ఒకరికి అనుకరణతో సంక్రమించే సంప్రదాయకళగా ఉంది. గణనాయక, గంగ ప్రార్థనలతో కథ ప్రారంభిస్తారు. పద్య, వచన రూపంలో కథ కొనసాగుతుంది. కథ కొనసాగింపు బట్టి మధ్యలో అనుష్టాన ప్రక్రియలు ఉంటాయి. ప్రదర్శన మధ్యలో చదివింపులు ఉంటాయి. వారికి అందమైన రాగయుక్త దీవనార్తి ఈ కొమ్ము కథలో ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఐదుగురు సభ్యుల బృందంతో ఉండే కొమ్ముకథలో ఒకరు ప్రధాన కథకుడు, మరొకరు వంత పాడుతారు. మిగతా ముగ్గురిలో ఒకరు ఈర్నం, తిత్తి, తాలాలతో వాద్య సహకారం అందిస్తారు. కొమ్ము వాద్యంలో యతి, శృతి ఉంటుంది. ఇవి కిలకిల, మందరతో ఉంటుంది. ఇక ఈర్నంపైన సాలు, జిగిని, మద్దెల దరువులతోపాటు, అడుగుదెబ్బ, శివాలు దెబ్బ అనే వరుసలు వాయిస్తారు. ఇవే కాకుండా ఈర్నంపై పద్దెనిమిది దరువులు వాయించేవారు. 'మతిలేని మాట, శృతిలేని పాట / రాగం' అన్నట్లు కొమ్ము ప్రదర్శనలో శృతిగా 'తిత్తి' చాలా ప్రధానమైనది. మేకతోలుతో ఈ వాద్యం ఆధునిక బాగ్పైపర్ను గుర్తు చేస్తుంది.<noinclude><references/></noinclude> q6tcr14ko3juhfcctnnay7mtap27z0i పుట:పటం కతలు.pdf/101 104 211997 552517 2026-04-10T05:03:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '84 పటం కతలు గుడారం పైన పెట్టే పసినికొండ అనేది గుడికి శిఖరం లాంటిది. ఈ గుడారంలోనే గంగ విగ్రహం, సూర్య, చంద్రుల బొమ్మలు, గంగ, బొల్లావు బొమ్మలను ఒకవైపు, పటంను వీటికి ఎదురుగా మరోవై...' 552517 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>84 పటం కతలు గుడారం పైన పెట్టే పసినికొండ అనేది గుడికి శిఖరం లాంటిది. ఈ గుడారంలోనే గంగ విగ్రహం, సూర్య, చంద్రుల బొమ్మలు, గంగ, బొల్లావు బొమ్మలను ఒకవైపు, పటంను వీటికి ఎదురుగా మరోవైపు గుడారంలో కట్టి అందులోనే కథ చెపుతారు. వీటిని ముందుగా తెలిపినట్లు యాదవులే సమకూర్చి అందిస్తారు. కథలతోపాటు ఉప్పలమ్మ, వీరుల, ఎల్లమ్మ, ముత్యాలమ్మలకు కౌలుపులు చేయడం కొమ్ము వారి మరో హక్కు, దేవతల కొలుపులో కొమ్ము వారికి ముఖ్యస్థానం ఉంటుంది. వీటితోపాటు గంగ తిరునాళ్ళు, మల్లన్న తిరునాళ్ళు, బొడ్రాయి సంబురాళ్ళలో వాద్యాలు వాయిస్తారు. ఇలా ఒకే కళాకారులు వివిధ ప్రక్రియలో తమ కళను ప్రదర్శిస్తూ ప్రతిఫలం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని అరుదైన కళారూపం ఇది. ప్రస్తుత కాలంలో కథలతోపాటు కొలువులకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ కథ కొనసాగించే కొమ్ము కళాకారులు తక్కువైపోతున్నారు. నిరంతరం ఆడుతూ, పాడుతూ ఉండడంవల్ల తమ ఆరోగ్యాలు పాడైపోతున్నాయనే వేదనే ఈ కళపైన ఆసక్తి తగ్గుతుంది. తెలంగాణలోని అరుదైన కళారూపంగా దీనికై ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ సహకారంతో పాటు స్వచ్చంధ సంస్థలు, విశ్వ విద్యాలయాల తోడ్పాటు కూడా అవసరం. కొమ్ము కథను పేర్కొనే యాదవ వంశంతోపాటు కొమ్ము వంశం కూడా ఆ చంద్రార్కం నిలువాలని ఆశిద్దాం. - డా॥ భట్టు రమేష్<noinclude><references/></noinclude> bcv3n56jmzbxf77mgl8wek9jr11imst పుట:పటం కతలు.pdf/102 104 211998 552518 2026-04-10T05:04:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '9. కొర్రాజుల పటం కత సం ప్రదాయ గిరిజన తెగలు మానవజాతి మూలాలకు ప్రతీకలు. తెగల ఆవిర్భావం గురించి ఉనికి గురించి వారికి సంబంధించిన సాహిత్యం, చరిత్ర ఈ విషయాల్ని రూఢీపరుస్తున్నాయి...' 552518 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>9. కొర్రాజుల పటం కత సం ప్రదాయ గిరిజన తెగలు మానవజాతి మూలాలకు ప్రతీకలు. తెగల ఆవిర్భావం గురించి ఉనికి గురించి వారికి సంబంధించిన సాహిత్యం, చరిత్ర ఈ విషయాల్ని రూఢీపరుస్తున్నాయి. భారతదేశ గిరిజనులు ముఖ్యంగా తెలుగు నేలపైన ప్రత్యేక ఉనికిని చాటుకుంటున్నారు. సుమారు 35 గిరిజన తెగలు అడవుల్లో, కొండకోనల్లో, నదీతీరాల వెంట ఆవాసాలు ఏర్పర్చుకున్నాయి. మరికొన్ని గిరిజన తెగలు మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. ఆదివాసీ, గిరిజన తెగల వృత్తి - ప్రవృత్తులు, జీవన విధానం, ఆచార అనుష్టానాల్లో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రకృతిలో మమేకమై జీవనం కొనసాగిస్తున్న గిరిజనుల చరిత్రను మౌఖిక సాహిత్యంగా గానం చేసున్న ఉపతెగలు నేటికి కూడా కొనసాగుతూ ఉండటం గమనార్హం.<noinclude><references/></noinclude> 6urh5zdoe6p74pexoyh4ooqbcgoe1j5 పుట:పటం కతలు.pdf/103 104 211999 552519 2026-04-10T05:04:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పద' 552519 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పద<noinclude><references/></noinclude> 45em53z33yx5gerspajcszbwqgfdmps పుట:పటం కతలు.pdf/104 104 212000 552520 2026-04-10T05:04:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 87 గోండ్ తెగకు పరదాన్, తోటి, కోయకు డోలీ, పట్టెడ, లంబాడీలకు భాట్స్, దాడీ లాంటి ఉపతెగలు మౌఖిక సాహిత్యం ద్వారా పూర్వ చరిత్రను అందిస్తున్నట్లే... నాయకపోడు అనే గిరిజన తెగకు...' 552520 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 87 గోండ్ తెగకు పరదాన్, తోటి, కోయకు డోలీ, పట్టెడ, లంబాడీలకు భాట్స్, దాడీ లాంటి ఉపతెగలు మౌఖిక సాహిత్యం ద్వారా పూర్వ చరిత్రను అందిస్తున్నట్లే... నాయకపోడు అనే గిరిజన తెగకు కొర్రాజుల (తోటి), పూజరి అనే ఉపతెగలు సంప్రదాయ మౌఖిక సాహిత్యం ద్వారా పద్మనాయక తెగ ఔన్నత్యాన్ని చాటి చెపుతున్నాయి. తెలుగు నేలపైన అరుదైన కళాప్రక్రియల్లో పటం కథలు ఒకటి. పటం ద్వారా కుల లేదా తెగ పురాణాల్ని అందించే సంప్రదాయం ఉంది. అలాంటి వాటిలో కొర్రాజులు ఒకరు. వీరు పద్మనాయక (నాయకపోడు) గిరిజన తెగ ఆశ్రితులు. పటం ఆధారంగా పద్మనాయకుల వృత్తాంతాన్ని తెలియజేస్తారు. ఐదుగురు బృందంగా ఉండి పటంతో పాటు మద్దెల, హార్మోనియం, తాళాలు ప్రధాన వాద్యాలను ఉపయోగిస్తూ ప్రదర్శన ఇస్తారు. కొర్రాజులు ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి తమకు హక్కుగా ఉండే గ్రామాలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి ప్రతిఫలం పొందడం ఆనవాయితీ. కొర్రాజుల ఆవిర్భావం : కొర్రాజులు పటం ఆధారంగా పద్మనాయకుల వృత్తాంతాన్ని ఐదు కాండాలుగా ఐదురోజుల పాటు చెపుతారు. సంక్షిప్తంగా వీరు కథలు వివరిస్తారు. భూలోకంలో మధ రాక్షసులు పెట్టే బాధలు భరించలేక భూదేవి, గంగాదేవి విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి కంసుడు రాక్షసులకు మద్దతునిచ్చి నానా బాధలు పెడుతున్నాడని కంస మర్దన చేయాలని ప్రార్థిస్తారు. అప్పుడు లక్ష్మీదేవితో విష్ణుమూర్తి 'నేను దేవకి వసుదేవుల అష్టమా గర్భమున గోపాలకృష్ణునిగా పుట్టి కంస మర్దన చేయబోతున్నా' అంటాడు. లక్ష్మీదేవి 'తాను ఒంటరిగా ఎలా ఉండాలని' అడుగుతుందట. అప్పుడు విష్ణుమూర్తి 'బాధపడకు లక్ష్మీ సాంబవుని పట్నమందున బంగారు గుడి, వెండిగుడి అనే రెండు గుళ్లు ఉన్నాయి. ఆ గుడి ముందు బంగారు కోనేరు ఉంది. ఆ వెండి గుడియందు నీవు జన్మించి పరమ భక్తురాలైనటువంటి పద్మనాయక గిరిజనులను పుట్టించి కాలం గడుపవలె, నీకేం కష్టం వచ్చినా కాపాడే భారం నాది' అని చెప్తాడు.<noinclude><references/></noinclude> 1jcsjd38eg79ctf6qjb5l588qcot60v పుట:పటం కతలు.pdf/105 104 212001 552521 2026-04-10T05:05:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '88 పటం కతలు విష్ణుమూర్తి చెప్పిన విధంగా లక్ష్మీదేవి సాంబవుని పట్టణంలో వెండి గుడిలో అవతరిస్తుంది. సాంబవుని పట్టణము క్రూర మృగాలతో నిండి ఉన్న కీకారణ్యము. ఈ కీకారణ్యములో కాలి...' 552521 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>88 పటం కతలు విష్ణుమూర్తి చెప్పిన విధంగా లక్ష్మీదేవి సాంబవుని పట్టణంలో వెండి గుడిలో అవతరిస్తుంది. సాంబవుని పట్టణము క్రూర మృగాలతో నిండి ఉన్న కీకారణ్యము. ఈ కీకారణ్యములో కాలినడకన వెళ్తుండగా ఆమె శరీరం నుంచి చెమట వచ్చి ఆ చెమట బిందువులు, కొలనులో ఉన్న ఎర్రని తామర పద్మములపై పడగా ఐదుగురు అందమైన పద్మనాయకులు జన్మిస్తారు. ఆ పిల్లవాళ్లు ఏడుస్తుండగా లక్ష్మీదేవి వారిని తీసుకొచ్చి ఐదు తామరాకులు పరిచి వారిని పండబెట్టి.. ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఆ పిల్లలు ఐదేండ్ల ప్రాయము గలవారైనాక 'మీరు తామర పద్మంలో పుట్టినవారు కనుక మిమ్ములను పద్మనాయకులు అంటారు. మీరు పాల పండ్లు, పరికి పండ్లు, అల్లనేరేడి ఫలములు, జాంబో నేరేడి ఫలములు, సీతాఫలములు, శ్రీరామ ఫలములు, దుంపగడ్డలు, పల్లేరుగడ్డలు, బోడ్డమగడ్డ, నల్లసన్నగడ్డలు, తెల్లసన్నగడ్డలు భోజనముగా తినుకుంటు కాలము గడపండి. మీకు పాలు తాగడానికి అడవి గోవులను పుట్టిస్తున్నా, మీ తల్లినైన నేను లక్ష్మీదేవిని, తండ్రి విష్ణుమూర్తి' అని తెలుపుతుంది. 'నాయనా పెద్దవాడా నీవు పద్మంలో పుట్టిన వాడవు కనుక పద్మనాయకుడవు. రెండవవాడు భీముని పరాక్రమశాలి కనుక భీమానాయకుడు. మూడవ వాడు రాముని వంటి సద్గుణ లక్షణాలు ఉన్నటువంటి వాడు గనుక రామానాయకుడు, ప్రపంచానికి సూర్యచంద్రుల లాగా నాలుగవ వాడు సూర్యనాయకుడు, ఐదవ వాడు చంద్ర నాయకుడు అని చెపుతుంది. పద్మనాయకులు అడవిలో తిరిగి తిరిగి పాలపండ్లు, పనసపండ్లు, అల్లనేరేడి ఫలములు తీసుకొచ్చి లక్ష్మీదేవికి ఇస్తారు. ముప్పది కోట్ల దేవతలు, అష్టదిక్పాలకులు, పద్నాలుగు వేల గంధర్వులు, బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలు అందరికి ఆరగింపు చేయాలని, ఐదు తామరాకులలో దేవతలందరికి పెట్టి సమస్కరించి తనకూ పూజలు చేయమంటుంది లక్ష్మీ. పద్మనాయకులు ఆ విధంగా లక్ష్మీదేవికి ఆరగింపు చేసి తాము కూడా భోంచేస్తారు. పద్మనాయకులు అడవిలో ఐదు పర్ణశాలలు నిర్మించుకుంటారు. పర్ణశాలలు నిర్మించుకున్న తరువాత పండ్లు పాలు భోంచేస్తే మా కడుపు నిందుతుందా తల్లీ, మాకు భోజనం కావాలి అని అడుగుతారు. అప్పుడు లక్ష్మీదేవి నా మాయతో గండ్రగొడ్డలి పుట్టిస్తున్నా, పండ్రెండు గుట్టల సందునా మీరు పోళ్లు కొట్టండి అంటూ చేతికి గొడ్డలి ఇస్తుంది. పద్మనాయకులు ఆ గొడ్డలితో<noinclude><references/></noinclude> 3jbwkagpezlskayg7i6bgj3njdnjzoh పుట:పటం కతలు.pdf/106 104 212002 552522 2026-04-10T05:05:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 89 చెట్లను కొట్టి మాకులు విరగగొట్టి సరికి కుప్పలు పెట్టి అగ్గిపెడతారు. మళ్లీ లక్ష్మీదేవి వద్దకు పోళ్లు కొట్టిన విషయం చెప్పి 'ఏం విత్తనం వేయమంటారని' అడుగుతారు. లక్ష...' 552522 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 89 చెట్లను కొట్టి మాకులు విరగగొట్టి సరికి కుప్పలు పెట్టి అగ్గిపెడతారు. మళ్లీ లక్ష్మీదేవి వద్దకు పోళ్లు కొట్టిన విషయం చెప్పి 'ఏం విత్తనం వేయమంటారని' అడుగుతారు. లక్ష్మీదేవి 'తోటి దోస, తోటి ఖర్బూజా, సామలు, కొర్రలు' పండించుకోమని చెప్తుంది. నాగలి కర్రును పుట్టిస్తుంది. అడవి దున్నపోతును ఈ నాగలి కర్రుకు కట్టించి పద్మనాయకులలో మొదటివాడు ఈ నాగలి కర్రుతో దున్నుతుండగా భీమానాయకుడు సామలు చల్లుతాడు. ఈ విధంగా అరవై ఎకరాలు దున్ని సాగుచేస్తారు. లక్ష్మీదేవి వరంచేత పంటలు చక్కగా పండుతాయి. అయితే పంటచేల మీదికి దుప్పులు, లేళ్లు, అడవి మృగాలు వస్తాయి. ఆ అడవి జంతువులను పారదోలడానికి పద్మనాయకులు వడిసెలు చేతపట్టి రాళ్లతో వాటిని కొడుతూ కాపలా కాస్తుంటారు. మాకు నిద్రలేదు తల్లీ, పంటచేల మీదికి మృగాలు వచ్చి చేరినవి. లేళ్లు, దుప్పులు, మనుమొక శార్దూలములు వచ్చి పంటలు పాడుచేస్తున్నాయి. మా గతి ఏమిటి తల్లీ అని అడుగుతారు. అపుడు లక్ష్మీదేవి 'నేనున్నంక మీకు భయం లేదు, శత్రువు వచ్చినా, రాక్షసి వచ్చినా పర్వాలేదు. నాకు బలం ఎంత ఉందో అంత బలం మీకు ఇస్తున్నా' అంటూ కత్తులు, కటార్లు, బాకులు, బాణములు, తల్వార్లు, తుపాకులు ఇస్తుంది. పద్మనాయకులు ఆ ఆయుధాలతో పంటను ఇంటికి తెచ్చుకుని కొర్రసామలను గంగి గోవుపాలతో కలిపి లక్ష్మీదేవికి ఆరగింపు చేస్తారు. ఆ విధంగా సాంబశివుని పట్నంలో పద్మనాయకులు సుఖంగా జీవిస్తుంటారు. వారికి వివాహం చేసుకోవాలనిపిస్తుంది. లక్ష్మీదేవి వద్దకు వెళ్లి, మాకు ఎలాంటి కష్టం కలిగినా నిన్ను గుర్తుచేసుకుంటూ ఉన్నాం. నీ వల్ల విద్య నేర్చుకున్నాం. ధనమునకు కొదవలేదు. నీ యుక్త వయస్సులో ఉన్నాం. మాకు పెళ్లిళ్లు చేయమని వేడుకుంటారు. అపుడు లక్ష్మీదేవి 'గంగాదేవి వద్దకు వెళ్లండి, గంగలో స్నానం చేయండి' అని చెప్తుంది. అదేవిధంగా శుక్రవారం రోజున పద్మనాయకులు గంగకు వెళ్లి స్నానం చేసి ఒడ్డున కూర్చుంటారు. అక్కడ లక్ష్మీదేవి గంగాదేవితో, చెల్లెలా గంగాభవాని! నా కుమారులైన ఈ ఐదుగురు పద్మనాయకులకు భార్యలు కావాలె, ఐదుగురు అమ్మాయిలను ప్రసాదింపుమని కోరుతుంది. ఈ ఐదుగురు అన్నదమ్ముల ఎదుట గంగాదేవి మహిమతో పుట్టిన పద్మనాయకమ్మ, భీమా నాయకమ్మ, రామా నాయకమ్మ, సూర్య నాయకమ్మ, చంద్రా నాయకమ్మలు పద్మనాయకులకు నమస్కరించి నిల్చుంటారు. వారు గంపలు నెత్తిన పెట్టుకుని పద్మనాయకుల వెంట బయలుదేరి లక్ష్మీదేవి వద్దకు<noinclude><references/></noinclude> 1fzjr6fssjln7k6n78osw8gw2yjwiyh పుట:పటం కతలు.pdf/107 104 212003 552523 2026-04-10T05:05:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '90 పటం కతలు వస్తారు. లక్ష్మీదేవి 'ఒరే నాయనలారా.. ఇప్పటి నుండి మీరు అడవుల యందు కాయగడ్డలు తిని, పద్మనాయకులు కోయ, గోండు అనేటువంటి పన్నెండు జాతులు గలవాండ్లయి అరణ్యాల యందు బతకండి అ...' 552523 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>90 పటం కతలు వస్తారు. లక్ష్మీదేవి 'ఒరే నాయనలారా.. ఇప్పటి నుండి మీరు అడవుల యందు కాయగడ్డలు తిని, పద్మనాయకులు కోయ, గోండు అనేటువంటి పన్నెండు జాతులు గలవాండ్లయి అరణ్యాల యందు బతకండి అని చెప్తుంది. ఐదుగురికి పసుపు అద్దిన ధోతులు, అంగీలు, చీరలు, రవికలు తొడిగి పెండ్లి చేసి అక్షింతలు చల్లుతుంది. బ్రహ్మ విష్ణు సురా ముప్పది మూడు కోట్ల దేవతలు, అష్టదిక్పాలకులు, పద్నాలుగు వేల గంధర్వులు గగన మార్గం నుంచి అక్షింతలు చల్లుతారు. 'మీరు మధువు తాగకూడదు, మాంసము తినకూడదు, ఆడవాళ్లు అడవికి పోయి పండ్లు ఫలములు తీసుకురావలె, పారటాకుల మీద పడుకుండవలె, ఉదయమే గంగలో ఏడుసార్లు స్నానం చేసి పూలు ఫలములతో పూజ చేయాలి. పరమ భక్తులని పేరు వస్తుంది. పెద్దవాడైన పద్మనాయకుడు తనకు పూజ చెయ్యాలని, రెండవ వాడైన భీమానాయకుడిని పువ్వులు తీసుకురావాలని, మూడవ రామానాయకుడిని అడవి గోవుల పాలు తీసుకురావాలని, నాల్గవ సూర్యనాయకుడిని అడవిలో ఉన్న పత్రములు తీసుకురావాలని, చిన్నవాడైన చంద్రానాయకున్ని పాలపండ్లు, పనస పండ్లు పట్టుకు రావాలని చెప్పి వెళ్లమంటుంది. ఆ విధంగా లక్ష్మీదేవిని కులదైవంగా పూజిస్తూ పది సంవత్సరములు గడిచిపోతాయి. పద్మనాయకుల భార్యలు గర్భవతులవుతారు. పిల్లలు జన్మిస్తారు. శ్రీసాంబశివుని పట్నము ఎటు చూసినా ఆరు ఆమడల దూరము విస్తరించి మిద్దెలు, మేడలతో పట్టణముగా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం తెలిసి పాండురాజు, 'యాభై ఆరు రాజ్యాల నుంచి తనకు పన్ను వస్తున్నది కానీ సాంబవునిపట్నం నుంచి మాత్రం పన్ను రావడం లేదని మండిపడి యుద్ధానికి బయలు దేరుతాడు. సాంబవునిపట్నం పొలిమేరలో ఉన్న కుంబావతల గడ్డ వద్ద కూర్చుని రణభేరి మోగిస్తాడు. ఈ రణభేరి చప్పుడు విని పద్మనాయకులు లక్ష్మీదేవి వద్దకు వచ్చి "మేము ఎవ్వరికి ద్రోహము చెయ్యలేదు, ఒకరికి అంటూ ఉండలేదు. ఎవరితోనూ దుర్మార్గులను అనిపించుకోలేదు. ఎవరో అకారణంగా వచ్చి మాపై యుద్ధభేరి మోగిస్తున్నారు. వాళ్లు ఎవరో మాకు తెలియదు" అని విన్నవించుకుంటారు. అపుడు లక్ష్మీదేవి నాయనా పద్మనాయకులారా! హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రునికి యువరాజు పాండురాజు మహావీరుడు అతనితో మీకు యుద్ధం వద్దు, మీరు<noinclude><references/></noinclude> 9h11jlv569yqrhf9wrd7jha4e8shrn7 పుట:పటం కతలు.pdf/108 104 212004 552524 2026-04-10T05:05:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 91 అడవిలో ఉండే గిరిజనులు, కాయలు, గడ్డలు తినేటోళ్లు యుద్ధము వద్దని' చెప్తుంది. పద్మనాయకులు మంగళహారతులు పట్టుకుని లక్ష్మీదేవి వెంటరాగా పాండురాజు వద్దకు వెళతారు. అపు...' 552524 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 91 అడవిలో ఉండే గిరిజనులు, కాయలు, గడ్డలు తినేటోళ్లు యుద్ధము వద్దని' చెప్తుంది. పద్మనాయకులు మంగళహారతులు పట్టుకుని లక్ష్మీదేవి వెంటరాగా పాండురాజు వద్దకు వెళతారు. అపుడు పాండురాజు 'ఒరే పద్మ నాయకులారా! అడవిలో ఉండే కొండగొర్ల విధంగా, కోతుల విధంగా ఆకులు అలములు భోంచేసి బతుకుతున్నా రనుకుంటే మీరు కీర్తిమంతులైండ్లు కాబట్టి 'అన్నుపన్ను కట్టాలి, చెల్లిస్తారా.. లేదా నాతో యుద్ధం చేస్తారా..' అని అంటాడు. పద్మనాయకులు మా వద్ద ఉన్న ధనముతో లక్ష్మీదేవతకు గుళ్లుగోపురములు కట్టినాము కావున పన్ను కట్టలేమని అంటారు. పాండురాజుకు పూలమాలలు వేసి గౌరవిస్తారు. పాండురాజు సంతసించి పక్కనే ఉన్న లక్ష్మీదేవిని చూసి ఆ అమ్మాయి మీకేం కావాలి అని పద్మనాయకుడిని అదుగుతాడు. ఆమె మా ఇంటిదేవత, మమ్ములను పద్మంలో పుట్టించి పెంచి పెద్దచేసింది అని పద్మనాయకులంటారు. ఆమెకు పెండ్లి జరిగిందా.. అని పాండురాజు అడుగుతాడు. పెండ్లి కాలేదని పద్మనాయకులు చెప్పగా ఆమెను దానం ఇమ్మని అడుగుతాడు. వారు పాండురాజు చేతిలో పెడతారు. పాందురాజుతో వెళ్లిపోతున్న లక్ష్మీదేవి 'పద్మనాయకులారా! నేను మిమ్ములను విడిచిపెట్టి పోతున్నాను. నా మీద భక్తి మాత్రము మరువకండి, నన్ను యాది చేసినపుడు అన్నం ఇస్తాను. నన్ను మరిచిపోతే మళ్లీ కాయలు, గడ్డలు, ఆకులు, అలములు తిని బతకాల్సి వస్తుంది. శ్రీమన్నారాయణుని వరం చేత పుట్టినవారు కనుక మీలో కొందరు నల్లవారి గోత్రనామం ధరించండి. సాంబశివుడు అంటే శంకరుని పట్నంలో పుట్టినవారు కనుక మీలో కొందరు అడ్డబొట్లు పెట్టుకుని శంఖుమా గోత్రం, పాలకాయ గోత్రం ధరించండి. మీ గురువు ఎవరంటే పరాశరుడు అని చెప్పండి' అని తెలుపుతుంది. పాండురాజు కూడా 'ఓరి పద్మనాయకులారా నేను లక్ష్మీదేవిని తీసుకొని వెళుతున్నాను. ఈ అమ్మాయికి పెండ్లి చేసేటటువంటి సమయంలో మిమ్ములను పిలుస్తాను. తప్పకుండా రండి' అని అంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ఒకనాడు పద్మనాయకుడు భీమానాయకున్ని లక్ష్మీదేవికి పూజలు చేయడానికి పూలు, పండ్లు తీసుకురమ్మని అడవికి పంపుతాడు. అతనికి పుష్పములు దొరకవు. ఎదురుగా అడవిపంది వస్తుంది. పప్పుచారు కాయకూరలు తిని నాలుక చప్పబడింది. ఈ అడవి పందిని తింటే<noinclude><references/></noinclude> mde9b3lx0z0trw12abnnlvykti6ghti పుట:పటం కతలు.pdf/109 104 212005 552525 2026-04-10T05:06:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '92 పటం కతలు ఏమైపోతుంది అనుకుని అడవి పందిని వేటాడి చంపి ఆ మాంసాన్ని పట్టుకుని ఇంటికి వస్తారు. భీమానాయకమ్మ కూడా 'మనం పన్నెండు సంవత్సరాలుగా మధుమాంసాలు ముట్టకుండా బతుకుతున్నా...' 552525 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>92 పటం కతలు ఏమైపోతుంది అనుకుని అడవి పందిని వేటాడి చంపి ఆ మాంసాన్ని పట్టుకుని ఇంటికి వస్తారు. భీమానాయకమ్మ కూడా 'మనం పన్నెండు సంవత్సరాలుగా మధుమాంసాలు ముట్టకుండా బతుకుతున్నాం. ఇటువంటి పనులు చేస్తే పెద్దవాళ్లకు కోపం వస్తుంది అని వండటానికి నిరాకరిస్తుంది. అయినా కూడా వండమని చెప్తాడు. కూర వండుకుని తిన్న తర్వాత బుట్ట పట్టుకుని దేవత గుడి దగ్గరకు రాగానే, పద్మనాయుకుడు నీవు చేసిన మూర్ఖమైన పనికి నిన్ను కులం నుంచి గెంటివేస్తున్నా. రాచకోయవాడవై జీవించమని శపిస్తుంది. ఆ విధంగా భీముడు శపించబడి రాచ కోయగా జీవిస్తూ ఉంటాడు. మరొక రోజు రామానాయకుడు ఫలముల కోసం అడవికి వెళ్లి ఫలములు దొరకక తిరిగివస్తూ ఉడుమును చూసి చంపి ఇంటికి తెచ్చి వండుకుని తింటాడు. పద్మనాయకునికి ఈ విషయం తెలిసి కోపించి, యానాది వాడవైపో అని శపిస్తాడు. ఆ విధంగా రామానాయకుడు యానాదివాడిగా శపించబడి యానాది జీవనం గడుపుతూ ఉంటాడు. సూర్యనాయకుడు కూడా లక్ష్మీదేవతకు పూజచేయడానికి పూల కోసం అడవికి వెళ్లి అక్కడ పొదల మాటునున్న కుందేలును వేటాడి చంపి కూర వండుకుని భార్యాపిల్లలతో సహా తిని పద్మనాయకుని వద్దకు రాగా పద్మనాయకుడు కోపించి సూర్యనాయకున్ని చెంచువాడిగా జీవించమని శపిస్తాడు. ఈ విధంగా భీమానాయకుడు రాచకోయవాడిగా, రామానాయకుడు యానాది వాడిగా వేరే ప్రాంతాలకు వెళ్లి జీవిస్తుండటంతో పద్మనాయకుడు అందరికంటే చిన్న వాడయిన చంద్రానాయకుడు మాత్రమే లక్ష్మీదేవికి పూజలు చేస్తూ జీవిస్తుంటాడు. తమ్ముళ్లు ముగ్గురు వ్రతం చెడినవారు కావడం వలన పద్మనాయకుడు మానసికంగా మదనపడి అగ్నిగుండం ఏర్పాటుచేసుకుని అందులో 'టెర్రలు' వేస్తూ ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అపుడు అతని శరీరంలోంచి చెమటకారి అగ్నిగుండంలో పడుతుంది. ఆ చెమట బిందువుల నుంచి నిప్పుకొర్రాయి, అగ్గికొర్రాయి పట్టుకుని కొర్రాజు పుడతాడు. పద్మనాయకున్ని మీరు ఎవరని అడుగుతాడు. పద్మనాయకుడు 'నేను పరమ భక్తుడినైన పద్మనాయకున్ని, అది తప్పనివాన్ని, అబద్ధమాదనివాన్ని. అయితే నా చెమటయందున పుట్టిన వాడవు కనుక నీవు నా ఆస్తిబిడ్డవు. తప్పకుండా<noinclude><references/></noinclude> 6tnlf1n7q5osmd1dhrf8oaot8ffr1m8 పుట:పటం కతలు.pdf/110 104 212006 552526 2026-04-10T05:07:20Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 93 నా దగ్గర ఉండి నేను చెప్పిన సేవలు చెయ్యి, నేను లక్ష్మీదేవతకు పూజలు చెయ్యాలి కనుక నా ఆజ్ఞ శిరసావహించు. ఇప్పటి నుంచి నీ పేరు కొర్రాజుల రామచంద్రయ్య. నీవు లక్ష్మీదేవి...' 552526 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 93 నా దగ్గర ఉండి నేను చెప్పిన సేవలు చెయ్యి, నేను లక్ష్మీదేవతకు పూజలు చెయ్యాలి కనుక నా ఆజ్ఞ శిరసావహించు. ఇప్పటి నుంచి నీ పేరు కొర్రాజుల రామచంద్రయ్య. నీవు లక్ష్మీదేవి పూజకు పండ్లు పుష్పములు తీసుకుని రావాలి. నీవు భార్యాబిడ్డలు కలిగి సుఖంగా ఉండు నాయనా అని దీవిస్తాడు. ఈ విధంగా పద్మనాయకుడు, చంద్రానాయకుడు కొర్రాజుల రామచంద్రయ్యలు లక్ష్మీదేవతకు పూజలు చేస్తూ సుఖంగా జీవిస్తుంటారు. అక్కడ శ్రీకృష్ణుడు - బలరామునితో హస్తినాపురి పట్నంలో పాండురాజు ఇంటిలో లక్ష్మీదేవి అవతరించినదట. పాండురాజు “మనకు మామ కావాలి. లక్ష్మీదేవిని పెండ్లి చేసుకుందామనే కోరిక కలుగుతున్నది అన్నయ్యా" అని అంటాడు. సరేనని బలరాముడు, వసుదేవుడు, నందనుడు, యుద్ధముడు, సాంబశివుడు, కృష్ణుడు, యశోదాదేవి, అక్రూరుడు హస్తినాపురి పట్టణానికి వెళ్తారు. అంతకుముందే నారదముని పాండురాజుకు శ్రీమన్నారాయణుడు గోపాలకృష్ణుడిగా అవతరించిన విధము, శ్రీ సాంబవుని పట్నంలో లక్ష్మీదేవి అవతరించిన విధము చెప్పి ఉంటాడు. కృష్ణుడికి లక్ష్మీదేవికి పెళ్లి నిశ్చయమవుతుంది. పాండురాజు పద్మనాయకులకు వివాహానికి రమ్మని ఉత్తరం రాస్తాడు. పద్మనాయకుడు కూడా తాను వెలివేసిన భీమా నాయకున్ని, రామానాయకున్ని, సూర్యానాయకున్ని జాబు రాసి పిలిపిస్తాడు. పద్మనాయకులందరూ వివాహానికి వెళ్తారు. కృష్ణపరంధాముడి వీళ్లందరినీ చూసి సంతోషించి మీ లక్ష్మీదేవి వివాహానికి మీరు రావడం సంతోషం కలిగిస్తున్నది అని అనేసరికి కొర్రాజుల రామచంద్రయ్య కృష్ణపరంధామా! నేను పద్మనాయకుని చెమట వల్ల లక్ష్మీదేవి వరం వల్ల, నీ వరం వల్ల ఉద్భవించిన వాడను. అగ్గిలో పుట్టినటువంటి వాన్ని కనుక నా పేరు కొర్రాజుల రామచంద్రయ్య. నాక్కావలసినటువంటి బతుకు ఏమిటయ్యా అని దండం పెడతాడు. అపుడు కృష్ణపరంధాముడు 'ఇదిగో నా లగ్నమైపోయినంక పారుటాకులు తెప్పించి ఐదుగురు పంచపాండవులు, కౌరవులు జన్మించబోతా ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇలాంటి దేవతల బొమ్మలు ఆ పారుటాకుల మీద రాయిస్తాను. వీటిని నీ చేతికిస్తున్నా.. నీవు ఆ తర్వాత గుడిలో పూజలు చేస్తున్నటువంటి పూజరివాడైనటువంటి పద్మనాయకుడు మీరు ఇరువురు కలిసి పద్మనాయక కులం వారి నుంచి త్యాగం తీసుకుంటూ సుఖంగా జీవించండి' అని అంటారు. ఆ తర్వాత కృష్ణపరంధాముని వివాహం చాలా వైభవంగా<noinclude><references/></noinclude> 6qm31aq0xeprmtv9yemq1fhfa48t62w పుట:పటం కతలు.pdf/111 104 212007 552527 2026-04-10T05:07:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '94 పటం కతలు జరుగుతుంది. అప్పటి నుంచి సంవత్సరానికొకసారి కొర్రాజుల పండుగ చేసి తడి బట్టలతోని అగ్నిగుండం లోంచి నడుస్తుంటారు. భారతీయ చారిత్రక మూలాలుగా చెప్పే ఇతిహాసాలైన భారత, భ...' 552527 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>94 పటం కతలు జరుగుతుంది. అప్పటి నుంచి సంవత్సరానికొకసారి కొర్రాజుల పండుగ చేసి తడి బట్టలతోని అగ్నిగుండం లోంచి నడుస్తుంటారు. భారతీయ చారిత్రక మూలాలుగా చెప్పే ఇతిహాసాలైన భారత, భాగవత, రామాయణ కథల్లో గిరిజనుల ప్రస్తావన అగ్రభాగాన నిలుస్తుంది. అదవులు, కొండకోనలు, నదీతీరాల వెంట ఆవాసాలు ఏర్పరచుకొని ప్రకృతిపై ఆధారపడి జీవించే గిరిజన సాహిత్యం కూడా అరుదైనదే. తక్కువ జనసాంద్రత కలిగిన నాయకపోడు గిరిజనుల చరిత్రను మౌకిక సాహిత్యంగా చెప్పే కొర్రాజుల కుటుంబాలు రెండు, మూడు వరకే ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యమే కావచ్చు, ప్రకృతిలో వస్తున్న మార్పులే కావచ్చు. సమాజం పైన విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. సంప్రదాయ విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని తరతరాలుగా అందిపుచ్చుకుంటూ వస్తున్న ఒక సాంస్కృతికధార ఆవిరైపోయే ప్రమాదం ఉంది. అయినా వరంగల్లోని జానపద, గిరిజన విజ్ఞానపీఠం తనవంతు పాత్రను పోషిస్తూ మిణుకు మిణుకు అంటూ ఉన్న అరుదైన సంప్రదాయ విజ్ఞానాన్ని వివిధ మాధ్యమాల్లో భద్రపరుస్తుంది. గిరిజన సాహిత్యం, అనుష్టాన ప్రక్రియ, సమాజం - స్వరూపం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, దైనందిన జీవిత విశేషాల్ని భవిష్యత్తు తరాలకు అందించే ఏర్పాట్లను చేస్తుంది. · అడ్లూరి శివప్రసాద్<noinclude><references/></noinclude> 5fv9k2qeohz0jmnds2ssc5n6owf9xmq పుట:పటం కతలు.pdf/112 104 212008 552528 2026-04-10T05:08:12Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '10. కోయ పటం కత భా రతదేశంలో మూలవాసులుగా పేర్కొంటున్న ఆదిమ జాతి ఈ కోయ జాతి. ఈ ఆదివాసులే మొదట భారతదేశానికి వచ్చిన ఆర్యులని 'కోయ చరిత్ర' చెపుతున్నది.. కోయ భాషకు అప్పటికే లిపి ఏర్పడ...' 552528 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>10. కోయ పటం కత భా రతదేశంలో మూలవాసులుగా పేర్కొంటున్న ఆదిమ జాతి ఈ కోయ జాతి. ఈ ఆదివాసులే మొదట భారతదేశానికి వచ్చిన ఆర్యులని 'కోయ చరిత్ర' చెపుతున్నది.. కోయ భాషకు అప్పటికే లిపి ఏర్పడలేదు. మౌఖికంగానే సాగే కోయ భాషలో ఈ పురాణం చెప్పబడుతూ వస్తున్నది. మైదాన ప్రాంతంలోని బడుగు, బలహీన వర్గాల పురాణాలాగా ఈ పురాణం కూడా 'పటం కథ' కళారూపంలో ప్రదర్శించబడు తుంది. వృత్తి పురాణాల ప్రదర్శనలలో పటం తయారీ, పటం కథాగానం, ఒక నూతన ఒరవడిని దిద్దింది. సంగీతం, సాహిత్యం, కళారూపం మిశ్రితమైనదే పటం కథా గానమని చెప్పాలి. దాదాపుగా ఏడు కోట్ల జనాభాకు చేరిన కోయలకు తమదైన చరిత్ర, సంస్కృతులను పరిరక్షించుకునేందుకే ఈ కోయ పురాణాన్ని వారు సృష్టించుకున్నారు. తెలంగాణలో ఈ కోయ పురాణాన్ని చెప్పేందుకు వేల్పుల వారు, పట్టెడ, డోలి అనే ఆశ్రిత గిరిజన తెగలున్నాయి.<noinclude><references/></noinclude> o93jsphwfznfob4tyjw1zx9pvdzfup0 పుట:పటం కతలు.pdf/113 104 212009 552529 2026-04-10T05:08:33Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '96 |ü≥+ ø£‘·T' 552529 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>96 |ü≥+ ø£‘·T<noinclude><references/></noinclude> 3sgex4hdj1nyao3okhjyqiwg86dq13r పుట:పటం కతలు.pdf/114 104 212010 552530 2026-04-10T05:08:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు కోయటం 97 తెలంగాణ రాష్ట్రంలో చిత్రపటం కళారూపాలు పదిహేను వరకు కనిపిస్తాయి. ఈ చిత్రపటం కళారూపాలను చిత్రకారులైన నకాషి వారిచేత తయారు చేయిస్తారు. 1. జాంబ పురాణం 2. శివకంఠ మ...' 552530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు కోయటం 97 తెలంగాణ రాష్ట్రంలో చిత్రపటం కళారూపాలు పదిహేను వరకు కనిపిస్తాయి. ఈ చిత్రపటం కళారూపాలను చిత్రకారులైన నకాషి వారిచేత తయారు చేయిస్తారు. 1. జాంబ పురాణం 2. శివకంఠ మాల 3. పద్మనాయక పురాణం 4. నాయీ బ్రాహ్మణ పురాణం 5. మడేలు పురాణం 6. యాదవ పురాణం 7. కుమ్మరి పురాణం 8. ముదిరాజు పురాణం 9. పద్మశాలి పురాణం 10. విశ్వ బ్రాహ్మణ పురాణం 11. గౌడ పురాణాల కోసం ఏర్పడ్డ 'చిత్రపటం' కోయపురాణం కోసం చిత్రపటం మాదిరిగానే కూడా ఏర్పడింది. వృత్తిపురాణాలు 93 కులాలకు, మూడు తెగల కోసం నిర్మింపబడి, ప్రదర్శింపబడుతూ వస్తున్నాయి. అందులో చిత్రపటం కథాగానం వినూత్నమైనదే గాదు.. అద్భుతమైన కళారూపం కూడా. కోయ పురాణ కథకులు వివిధ కళారూపాలు ప్రదర్శించేందుకు ఆశ్రిత కులాల వారు ఉన్నప్పటికీ వేల్పులవారు, పట్టెడవారు మాత్రమే ఈ కోయ పురాణం పటం కథను గానం చేస్తుంటారు. నకాశీ వారు తయారుచేసే కోయ పటం మూడున్నర అడుగుల వెడల్పు, 36 అడుగుల పొడుగున్న ఒక సైను తెల్ల బట్టను ఎన్నుకొని దాన్ని చదును నేల మీద పరిచి ఖడి, గోందు, గంజి కలిపిన ద్రావకాన్ని వెడల్పున్న కుంచతో పూస్తారు. ఆ గుడ్డ ఆరిన తర్వాత నల్లరంగు రేఖలతో చిత్రాలను గీసి వాటి మీద నప్పే రంగులను నింపుతారు. తెల్ల, నల్ల, పసుపు, నీలి, ఆకుపచ్చ, ఎరుపులతో పాటు.. పసుపుపచ్చ రంగులో ఉండే తాళకం లాంటివి ఉపయోగిస్తారు. కోయ పురాణాన్ని అంతా బొమ్మల రూపంలో చిత్రిస్తారు. పటం తయారీని గమనిస్తే అది ఒక శాస్త్రీయ పద్ధతిలో, సంప్రదాయకంగా తయారు చేసినట్టు అనిపిస్తుంది. ఈ పటం రూపం అంతా కోయ సాంస్కృతిక చరిత్రను దిద్దడం లాంటిదిగా కనిపిస్తుంది. కథకుడు చిత్రపటం మీద బొమ్మలను పొన్ను కర్రతో చూపిస్తూ కథాగానం చేస్తాడు. ఈ గానానికి హార్మోనియం, మద్దెల, తాళాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా కళాకారులు పటం కథా ప్రదర్శనకు పూనుకుంటారు. ఖమ్మం జిల్లా ములుకాలపల్లిలో తోలెం బక్కయ్య, మొగిలి వెంకటస్వామి, పాండ్రె గుండయ్య, తోలెంరాజు కళాకారులు బృందాలుగా ఏర్పడి ఈ పురాణాన్ని చెబుతూ వస్తున్నారు.<noinclude><references/></noinclude> qfyz2h73kr3ie3xu4fmb8nyqm2ki0dn పుట:పటం కతలు.pdf/115 104 212011 552531 2026-04-10T05:09:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '98 పటం కతలు పారాణిక గాథ కోయ పురాణం కథాంశం అంతా పౌరాణికానికి చెందిందే ఉంది. వృత్తి పురాణాల్లో మొదట ఆదిపురాణం చెప్పబడినట్టే ఇందులో జగత్ సృష్టికి సంబంధించిన పౌరాణిక గాథ ఉంటుం...' 552531 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>98 పటం కతలు పారాణిక గాథ కోయ పురాణం కథాంశం అంతా పౌరాణికానికి చెందిందే ఉంది. వృత్తి పురాణాల్లో మొదట ఆదిపురాణం చెప్పబడినట్టే ఇందులో జగత్ సృష్టికి సంబంధించిన పౌరాణిక గాథ ఉంటుంది. జగదృష్టికి ముందు ఒక అండం ఏర్పడి ఉంది. అది పగిలి అందులోంచి ఆకాశం, భూమి మాత్రమే గాదు.. ముగ్గురు దేవుళ్లు కూడా పుట్టారు. భూమంతా నీటితో నిండిపోయింది. ఒక పెద్ద సొరకాయ ఆ నీటిలో తేలుతూ వస్తోంది. అందులోని స్త్రీని ఒక దేవుడు పెళ్లాడాడు. ఆ దేవతల జంటకు 101 మంది దేవతలు పుట్టారు. వారిలో పేరం బోయరాజు అగ్రగణ్యుడు. హంస వచ్చి భూమిని మింగి పోగా... పెరంబోయ రాజు దాన్ని చంపి లోకాన్ని రక్షించాడు. 100 మంది దేవతలు కామధేనువుని కోసి తినాలనుకున్నారు. జాంబవంతుడు వచ్చి తన గోళ్లతో ఆవును కోసి మాంసాన్ని చెట్టు తొర్రలో పెడితే.. ఒకడు వచ్చి దాన్ని తింటాడు. వాన్ని జాంబవంతుడు కొయ్యోడా! అని సంబోధించాడు. ఆయనే కోయ తెగకు మూలపురుషుడయ్యాడు. ఇలాంటిదే మరో వృత్తాంతంలో కోయ భూంకంరాజు పారటాకులు కట్టుకొని గజ్జెలు ధరించి ఒక డోలు వాయించుకుంటూ వచ్చాడు. పురాణం అతడే కోయరాజు అని తెల్పుతోంది. ఎన్ని కథలున్నా కోయజాతి మూల పురుషుడు భూంకరాజనే దాన్నే ఈ కథాంశాలు ధ్రువపరుస్తున్నాయి. అయితే ఆయా ప్రాంతాలను బట్టి కథాంశాలలో స్వల్ప బేధాలు పొడసూపుతున్నాయి. కోయ జాతి మూలపురుషుని ఆవిర్భావానికి సంబంధించిన వేర్వేరు కథనాలున్నాయి. అందులో ప్రధానమైన ఈ పురాణంలో భూంకరాజు చరిత్ర కనిపిస్తోంది. బారకోడి మూడు గుడ్లు పొదిగితే జగత్ సృష్టి జరిగింది. మొదటి గుడ్డు పైభాగం ఆకాశం, కింది భాగం భూమి ఏర్పడుతుంది. రెండో గుద్దులో పాలు, నీల సంద్రాలు ఉద్భవించాయి. మూడో గుడ్డులోంచి కార్తీక రాజు, కళింగ రాజు, యాదవ రాజు త్రిమూర్తుల్లా పుడతారు. చంద్రవంశ రాజులు కార్తీక రాజు కోయ భూంకరాజు (కోయరాజు) వంశం వారు. సాహిత్యాంశాలు కోయలది తమకంటూ ప్రత్యేకమైన జీవనశైలి ఏర్పడినట్టే సాహిత్య, సంగీతాల్లోనూ ఓ ప్రత్యేకత కనిపిస్తోంది. కొండా కోన జీవనయానంలో సంగీత<noinclude><references/></noinclude> kkovbsvw6azwilercssdj4zwqgkj67g పుట:పటం కతలు.pdf/116 104 212012 552532 2026-04-10T05:09:57Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 99 వాద్యాలు, మట్టి పాత్రలు, కొయ్య, జంతు చర్మాలతో కోయలే తయారు చేసుకుంటారు. తమ కోయ భాషలో గానం సాగిస్తారు. కోయల సంస్కృతిలో భాష, పాట, ఆట ప్రత్యేక భూమిక పోషిస్తున్నాయి. వారి...' 552532 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 99 వాద్యాలు, మట్టి పాత్రలు, కొయ్య, జంతు చర్మాలతో కోయలే తయారు చేసుకుంటారు. తమ కోయ భాషలో గానం సాగిస్తారు. కోయల సంస్కృతిలో భాష, పాట, ఆట ప్రత్యేక భూమిక పోషిస్తున్నాయి. వారి సంస్కృతి, సంప్రదాయాలు కూడా అవే. ముఖ్యంగా జానపద గాయకులకు ఉన్న సమస్త లక్షణాలు ఈ కోయ కళాకారుల్లోనూ కనిపిస్తున్నాయి. కోయ పురాణంలోని సమస్త లక్షణాలు ఈ కోయ కళాకారుల్లోనూ కనిపిస్తున్నాయి. కోయ పురాణంలోని కథా సాహిత్యాన్ని వినండి. 'ఓరేరేనా రేరేనా రేరేరేనా రేరేనా ఆకాశాన తండ్రిలే భూదేవి తల్లిలే యమ్మాలే' అని కథకుడు పాడితే వంత మళ్లీ అదే ప్రారంభించిన గానస్వరాలు 'రేలా' పాటను తలపిస్తాయి. కోయ సంస్కృతి సంబరాలలో రేలా పాటలదే హవా. అదే సంప్రదాయ పురాణం చెప్పడంలోనూ కనిపిస్తోంది. భావి కథనాన్ని సాగిస్తూ కథకుడు... కింద భూదేవి ఇల్లేలే పైన ఆకాశం ఇల్లేలే యమ్మాలే భూమి దేవి, భూమి దేవి గర్భాతే యమ్మాలే అద్దు భూలోకం గలరో యమ్మాలే నూట ముప్పై మునులూ యమ్మాలే వారి తర్వాత గలరో యమ్మాలే సూర్య వంశపు రాజులే యమ్మాలే చంద్రవంశపు తల్లి యమ్మాలే రేరేలా రేరేనా రేలా అంటూ పాడతాడు. భూమి, ఆకాశం ఏర్పడి భూమి నుంచి 130 మునులు పుట్టారట. ఆ తర్వాత సూర్య వంశం రాజు, చంద్ర వంశపు తల్లి ఉదయించా రంటారు. శక్తి ఆవిర్భావం గురించి చెప్పేప్పుడు కథకుడు 'చీమ దోమ ఇల్లేలే గొడ్డు గోంద ఇల్లేలే యమ్మాలే అదిన రోగం ఇల్లేలే నరుడు నంది ఇల్లేలే యమ్మాలే<noinclude><references/></noinclude> p7l5vf1cvgdsfgu37s8ipwbvq94v8sh పుట:పటం కతలు.pdf/117 104 212013 552533 2026-04-10T05:10:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '100 పటం కతలు ఆదిరాజు కలగాలయ్యా ఆది శక్తి కలగాలయ్యా ఇదే ఖాత కలగారో అంటాడు. కథను ముందుకు సాగించేందుకు... ఓయమ్మా.. ఈ యొక్క పన్నెండు అవతాలెత్తారా అద్దు ఏడు ఏడు సముద్రాన మధ్యతే బారా...' 552533 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>100 పటం కతలు ఆదిరాజు కలగాలయ్యా ఆది శక్తి కలగాలయ్యా ఇదే ఖాత కలగారో అంటాడు. కథను ముందుకు సాగించేందుకు... ఓయమ్మా.. ఈ యొక్క పన్నెండు అవతాలెత్తారా అద్దు ఏడు ఏడు సముద్రాన మధ్యతే బారా కోడి ఊడారో యమ్మాలే అంటూ శక్తి బారకోడి అవతారమెత్తిందని చెబుతాడు. తర్వాతేమైంది..? అడ్డు చీపురు దుంపని, మధ్యతా ఆది గూడైనా వాటారో అద్దు బారకోడి ఊదారో అద్దు ఒక గుడ్డు వాటాలో అయ్యాలే అది మూడో గుద్దు వాటారో యమ్మాలే అంటూ మూడు గ్రుడ్లను పెట్టింది చెబుతాడు. పునరుత్పత్తికి గుడ్డు ప్రతీకగా కనిపిస్తోంది. అడ్డు ఐర్రం గుడ్డు ఓతారో యమ్మాలే అది కింద పింకు భూదేవి పైన పెంకు ఆకాశం అయ్యాలే ఓ ఐర్రం పెంకితే కలగారో అది విష్ణు, ఈశ్వరుడు కలగారో, బ్రహ్మమూర్తి అందురో అందురో కళింగరాజు ఈదారో అందురో అయ్యాలే అంటూ కోయజాతి మూల పురుషుడు కార్తీకరాజు (భంకరాజు) ఉద్భవించిందని వర్ణించాడు కథకుడు. మానవ నాగరికత వికాసంలో కోయభాష, చరిత్ర పాత్ర ఘనమైనదే. మైదాన ప్రాంతాల ప్రజల భాష, సంస్కృతుల్లోనే కోయ సారస్వతం విలసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాచీన భాష, సాహిత్య కళారూపాలకు చేయూత నివ్వడం వల్ల కోయ పురాణాల్లాంటివి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. - కట్టా ప్రతిఖాగౌడ్<noinclude><references/></noinclude> d3f25zo64pb5x78fmca63ora5k8b8cv పుట:పటం కతలు.pdf/118 104 212014 552535 2026-04-10T05:11:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '11. కూనపులి పటం కత తె లంగాణ జానపద కళారూపాల్లో ఆశ్రిత కళారూపాలు, ఆశ్రితేతర కళారూపాలని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఇందులో ఆశ్రిత కళారూపాలనేవికేవలం ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించ...' 552535 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>11. కూనపులి పటం కత తె లంగాణ జానపద కళారూపాల్లో ఆశ్రిత కళారూపాలు, ఆశ్రితేతర కళారూపాలని రెండు రకాలుగా చెప్పవచ్చు. ఇందులో ఆశ్రిత కళారూపాలనేవికేవలం ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించి వారికి హక్కుదారులుగా వుంటూ ప్రదర్శనలిస్తూ మనుగడ సాగిస్తాయి. ఆశ్రితేతర కళారూపాలనేవి కులంతో సంబంధంలేకుండా అన్ని కులాలను ఆశ్రయిస్తూ ప్రదర్శనలిస్తాయి. 12 శతాబ్దం నాటి కంటే ముందు నుంచే ఆశ్రిత కళారూపాల ప్రస్తావన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నట్టు ఆధారాలున్నాయి. అంతటి ప్రాచీనత కలిగిన ఆశ్రిత కళా రూపాల్లో భాగమైనదే పటం కథల కళారూపాలు. ఈ పటం కథల్లో అద్దపు, గౌడజెట్టి, ఏనూటి, తెర చీరలు, కొమ్ము, డక్కలి, గుర్రపు, కొర్రాజులు (తోటి), కాకి పడిగెలు, మాసయ్యలు, పూజరి, మందహెచ్చులు, పెక్కర్లు, కూనపులి పటం కథల్లాంటివి వున్నాయి. పద్మశాలికి చెందిన ఆశ్రిత కళారూపాల్లో ఒకటైన<noinclude><references/></noinclude> oh1aisirv4dyh1t2dwf5m1hnzp9gacw పుట:పటం కతలు.pdf/119 104 212015 552537 2026-04-10T05:13:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '102 |ü≥+ ø£‘·T' 552537 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>102 |ü≥+ ø£‘·T<noinclude><references/></noinclude> 8m2rtz1i3b15b90s4y8nuzkjqdtjezb పుట:పటం కతలు.pdf/120 104 212016 552538 2026-04-10T05:15:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 103 కూనపులి కళాకారులు పద్మశాలికి సంబంధించిన మార్కండేయ పురాణాన్ని పటం ద్వారా రెండురోజులు కథాగానం చేస్తారు. వీరు చెప్పే మార్కండేయ పురాణానికి 'పద్మ పురాణం' 'భావనా ఋషి...' 552538 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 103 కూనపులి కళాకారులు పద్మశాలికి సంబంధించిన మార్కండేయ పురాణాన్ని పటం ద్వారా రెండురోజులు కథాగానం చేస్తారు. వీరు చెప్పే మార్కండేయ పురాణానికి 'పద్మ పురాణం' 'భావనా ఋషి పురాణం' అనే పేర్లు కూడా ఉన్నాయి. కూనపులి వారే ఎందుకు పద్మశాలీలకు మార్కండేయ పురాణం చెపుతారనడానికి కారణంగా ఒక మౌఖిక కథను కళాకారులు చెపుతారు. కూనపులి పుట్టుక కథలో మార్కండేయుని కుమారుడు భావనాఋషి దేవ కార్యం నిమిత్తం శ్రీమహావిష్ణువు నాభి నుంచి పద్మ తంతువులను గ్రహించి వస్త్రాలు నిర్మిస్తాడు. దేవతలందరికీ వస్త్రాలు సమర్పిస్తూ శివునికి సమర్పించబోగా ఇది ఎంగిలి వస్త్రమని, నాకు పులిచర్మం కావాలని కోరుతాడు. అందుకోసం భావనాఋషి పులుల కోసం వెతుకుతుండగా నారద మహాముని ఎదురయ్యి పులులన్నీ సూర్యుని బిడ్డ భద్రావతి ఆధీనంలో ఉన్నాయని చెప్పి పంపిస్తాడు. భావనాఋషి భద్రావతిని కలిసి తాను వచ్చిన దేవకార్యం వివరించగా... ఆమె తనని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. భావనాఋషి అందుకు సమ్మతించి ఆమె ఆధీనంలో ఉన్న పులులన్నింటిని తీసుకొని ఒక వడిగల పులి మీద ఎక్కి బయలుదేరుతాడు. లోకకల్యాణార్ధం నారదుడు ఈ విషయం గమనించి కాలు వాసురుడు అనే రాక్షసుని వద్దకు వెళ్లి పులులు నీకు పెద్దమ్మ వరుస కదా! ఆ పులులన్నీ ఇప్పుడు భావనాఋషి ఆధీనంలోకి వెళ్లాయని చెప్పి రెచ్చగొడతాడు. ఆ విషయం విన్న కాలువాసురుడు కోపగించి భావనా ఋషిని అడ్డగించి యుద్ధానికి దిగుతాదు. ఇద్దరి మధ్య యుద్ధం ఏడురోజులు ఏడురాత్రులు భీకరంగా జరుగుతుంది. ఆ సమయంలో భావనాఋషి అలిసిపోగా అతని శరీరం నుంచి విపరీతమైన చెమట వస్తుంది. 'శంకరా పాపభయంకరా.. నీ కరుణా కటాక్షంతో నా చెమట నుండి వరప్రసాది జన్మించి నాకు సహాయం చేయాలని, ఆ చెమటను బండపై వేయగా వరప్రసాది జన్మిస్తాడు. అలానే యుద్ధంలో భావనాఋషికి సహాయంగా నిలుస్తాడు. ఇందులో భాగంగా ఋషి తన దగ్గర నిండు గర్భంతో ఉన్న పులిని యుద్ధంలో చనిపోకుండా ఉండేందుకు గాను 'కూన'గా చేసిన పులిని రక్షించినవాడు కాబట్టి కూనపులి అనే పేరు వచ్చిందంటారు. అంతేకాక.. కూనపులి వారు భావనాఋషిని రక్షించడం<noinclude><references/></noinclude> t6qtde9u8flapt9lka444teqmgmavqr పుట:పటం కతలు.pdf/121 104 212017 552539 2026-04-10T05:16:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '104 పటం కతలు కోసం కాళికాదేవిని యుద్ధరంగానికి రప్పించి.. రాక్షసుల రక్తం భూమి మీద పడకుండా ఆమెతో తాగించి రాక్షసులకు పుట్టుక లేకుండా చేస్తాడు. వీరు యుద్ధంలో సమయానికి పుట్టి సహా...' 552539 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>104 పటం కతలు కోసం కాళికాదేవిని యుద్ధరంగానికి రప్పించి.. రాక్షసుల రక్తం భూమి మీద పడకుండా ఆమెతో తాగించి రాక్షసులకు పుట్టుక లేకుండా చేస్తాడు. వీరు యుద్ధంలో సమయానికి పుట్టి సహాయం చేసినవారు కాబట్టి 'సమయంలు' అని, కథ చెప్పేటప్పుడు దేవతల విగ్రహాలు మోస్తారు కాబట్టి పడిగె రాజులని మరియు పులి జెండా వారని పిలుస్తారు. యుద్ధంలో కాలువాసురున్ని సంహరించిన తర్వాత కూనపులి నాకు భృతి ఎట్లా? అని ప్రశ్నించగా... సురముప్పది మూడు కోట్ల దేవతలు, మునులు ముందర మాట ఇస్తున్నా! నాకు నూట ఒక్క సంతానమై, నీవు నా వంశానికి అర్తిబిడ్డ ఆడబిడ్డతో సమానమని, నాయొక్క వంశాన్ని కీర్తిస్తూ జీవించాలని, అందుకు ప్రతిఫలంగా పద్మశాలీలు నీ వీపు చూసి బుట్టలిస్తారని, కడుపుచూసి అన్నం పెడతారని ఒప్పందం చేసుకుంటాడు. ఆ ప్రకారంగా కూనపులి వారు మార్కండేయ పురాణాన్ని కథాగానం చేస్తూ వస్తున్నారు. కూనపులివారు చెప్పే మార్కండేయ పురాణం సృష్టి పుట్టుకతో మొదలుపెడతారు. ఆ తర్వాత బ్రహ్మకు నవబ్రహ్మలు జన్మించడం, ఆ నవ బ్రహ్మలో ఒకరైన భృగుమహర్షి కుమారుడు మృకుండ మహర్షి, అతని భార్య మరుధ్వతి సంతానం లేని కారణంగా శివుని గురించి తపస్సు చేయగా... సంతానం లేకపోవడానికి గల కారణాన్ని చెప్పి అల్పాయుష్కుడైన మార్కండేయున్ని సంతానంగా వరం ప్రసాదిస్తాడు. మార్కండేయుడు సకల విద్యలు నేర్చుకుని ఆకాశవాణి ద్వారా తన ఆయుష్షు గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత చిరాయువు కోసం మార్కండేయుడు తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేసి చిరంజీవిగా వరం పొందుతాడు. అయితే ఇదే తరుణంలో దేవతలు, మునీశ్వరులు వస్త్రాల లేక తమ దీనస్థితిని విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా.. త్వరలోనే కారణజన్ముడు పుడతాడని, అతనే మీ దీనస్థితిని తొలగిస్తాడని అభయమిచ్చి పంపుతాడు. మార్కండేయుడు లోకకల్యాణార్ధం తన ఆయుష్షంత ఆయుష్షు కలిగిన దూమ్రావతిని పెళ్లి చేసుకొని పుత్రాకామేష్టి యాగం చేయగా.. భావనాఋషి, పంచమాఋషి జన్మిస్తారు. వీరు పెరిగి పెద్దవారై ఏ పనిచేయాలని తండ్రిని అడుగగా.. మార్కండేయుడు భావనాఋషిని వెంటబెట్టుకుని పరమశివుని వద్దకే వెళ్లి అక్కడి నుంచి శివుడు భావనాఋషిని శ్రీ మహావిష్ణువు దగ్గరకు తీసుకెళ్తాడు.<noinclude><references/></noinclude> 0pojk0l0mvr0ajkcxbpns9q7wpou8k9 పుట:పటం కతలు.pdf/122 104 212018 552540 2026-04-10T05:16:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 105 శ్రీ మహావిష్ణువు భావనాఋషి జన్మకర్తవ్యం తెలిపి తన నాభి నుంచి పద్మతంతువులను ఇచ్చి వస్త్రాలు తయారుచేయమని వస్త్ర విద్యను ప్రసాదిస్తాడు. పద్మ తంతువులను తీసుకొని వ...' 552540 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 105 శ్రీ మహావిష్ణువు భావనాఋషి జన్మకర్తవ్యం తెలిపి తన నాభి నుంచి పద్మతంతువులను ఇచ్చి వస్త్రాలు తయారుచేయమని వస్త్ర విద్యను ప్రసాదిస్తాడు. పద్మ తంతువులను తీసుకొని వస్తుండగా ఈ కార్యం నచ్చని రాక్షసులు అడ్డగించి తంతువులన్నింటినీ మింగేస్తారు. భావనాఋషి వారితో యుద్ధం చేసి వారిని సంహరించగా తెల్లగా ఉన్న తంతువులన్నీ రకరకాల రంగులుగా మారుతాయి. ఆ తంతువులతో తయారుచేసిన వస్త్రాలను భావనాఋషి దేవతలందరికి ఇచ్చి చివరగా కాలభైరవునికి ఇవ్వబోగా... నాకు చివరగా ఇస్తావా అని - నీవు నేసిన వస్త్రాలు మూడునెలలు కొత్త మూడునెలల పాత.. ఆరునెలలకే చినిగిపోతాయని శాపమిస్తాడు. అందుకు ప్రతీకారంగా భావనాఋషి దిగంబరుడై ఊరిబయట ఉంటావని శపిస్తాడు. భావనాఋషి ఆ తర్వాత శివునికి వస్త్రం ఇవ్వబోగా నాకు ఎంగిలి వస్త్రం వద్దని, పులిచర్మం కావాలని కోరుతాడు. పులిచర్మం గురించి భావనాఋషి తిరిగి అలిసిపోవడం, నారదుడు భావనాఋషికి ఎదురవడంతో పులుల జాడ లేకపోవడానికి గల కారణాన్ని అడగడం, అందుకు నారదుడు లోకకల్యాణార్ధం శ్రీ మహావిష్ణువు కోరిక మేర నిన్ను శివుడు పులిచర్మం కావాలని కోరాడని, పులులన్నీ భద్రావతి ఆధీనంలో ఉన్నాయని, నువ్వు భద్రావతిని పెళ్లి చేసుకోవాలనే కారణంతో నిన్ను ఇక్కడికి రప్పించారని చెప్పి పంపిస్తాడు. భావనాఋషి భద్రావతిని ఆమె తండ్రి సూర్యున్ని కూడా కలిసి భద్రావతిని నా యొక్క దేవకార్యం ముగియగానే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె ఆధీనంలో ఉన్న పులులను తీసుకుని బయలుదేరుతాడు. నారదుడు ప్రేరేపించగా కాలువాసురుడు అనే రాక్షసుడు అడ్డుతగిలి యుద్ధానికి దిగుతాడు. ఈ యుద్ధం భీకరంగా జరగడం, భావనాఋషి అలిసిపోయి తన శరీరం మీది చెమటను బండ మీద వేయగా కూనపులి జన్మించి భావనాఋషికి యుద్ధంలో సహాయం చేయడం, చివరకు రాక్షసున్ని భావనాఋషి సంహరించి అతని శరీర భాగాలతో మగ్గాన్ని నిర్మించడం, ఆ తర్వాత శివుని కోరిక తీర్చిన భావనాఋషి దేవతల కోరిక మేరకు భద్రావతిని పెళ్లిచేసుకుంటాడు. ఈ దంపతులకు నూట ఒక్క సంతానం కలిగి వీరంతా వస్త్ర నిర్మాణం చేస్తూ నూటొక్క గోత్రాలతో పద్మశాలీలుగా పిలవబడతారు.<noinclude><references/></noinclude> p2a4l205kl0b4ypomcyj8dawr62vod9 పుట:పటం కతలు.pdf/123 104 212019 552541 2026-04-10T05:16:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '106 పటం కతలు ఈ పురాణంలోని కథాంశాన్ని కూనపులి వారు రెండురోజులుగా విభజించుకుని ప్రదర్శిస్తారు. దీనికి సంబంధించిన వ్రాతప్రతులు గానీ, తాళపత్ర ప్రతులు గానీ లేవని, మౌఖికంగానే ఈ...' 552541 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>106 పటం కతలు ఈ పురాణంలోని కథాంశాన్ని కూనపులి వారు రెండురోజులుగా విభజించుకుని ప్రదర్శిస్తారు. దీనికి సంబంధించిన వ్రాతప్రతులు గానీ, తాళపత్ర ప్రతులు గానీ లేవని, మౌఖికంగానే ఈ పురాణం సంప్రదాయంగా సంక్రమించిందని చెప్తారు. అయితే కూనపులి వారు చెప్పే పురాణానికి క్రీ.శ. 1511-1568 మధ్యకాలానికి చెందిన ఎల్లకర నృసింహకవి రచించిన మార్కండేయ పురాణానికి బేధసాదృశ్యాలున్నాయి. ఇందులో కూనపులి వారి ప్రస్తావన మినహా మిగతా కథాంశం ఒకే మాదిరిగా కనిపిస్తుంది. కులపురాణాల లక్షణాలను చూస్తే ఏ పురాణమైన తనకంటూ ఒక ప్రత్యేకమైన కథానిర్మాణం కలిగి ఉంటుంది. ఏ కులానికి చెందిన మూలపురుషుణ్ణి తీసుకున్నా అతను దైవాంశ సంభూతుడు లేదా దేవకార్యం నిమిత్తం జన్మించినవాడై ఉంటాడు. అయితే పద్మశాలి కులానికి చెందిన మూలపురుషుడు మార్కండేయుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించినవాడు. శ్రీ మహావిష్ణువే స్వయంగా 'ఓ మార్కండేయ నీ బ్రహ్మచర్యం వర్ణింపదగినది కాదు. నా రూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేక పోయారు. అట్టి రూపాన్ని నీవు చూశావని, మార్కండేయున్ని ఎన్నో విధాలుగా ప్రస్తుతించాడు. అటువంటి మహాపురుషుడు పద్మశాలి కులానికి మూలపురుషునిగా ఉండటమనేది ఏ ఇతర పురాణాల్లో కనిపించదు. ఇది కులానికి గౌరవాన్ని, గొప్పదనాన్ని అందించడమే గాక.. కులం పట్ల ఉండే ఆత్మన్యూనతా భావాన్ని తొలగించడానికి దోహదం చేస్తుంది. మౌఖికంగా సంక్రమించిన పురాణాన్ని కూనపులి వారు పద్మశాలి వారికి పురాణం పట్ల నిరాసక్తి లేకుండా ఉండేందుకు వృత్తిని ప్రతిబింబించే సామెతలు, పొడుపు కథలను ప్రయోగిస్తూ ఆసక్తిగా కథాగానం చేస్తారు. అంతేగాకుండా మగ్గం నిర్మాణం ఎట్లా జరిగిందో వివరించడం, పద్మశాలి నేసిన బట్టలు ఎందుకు చినుగుతాయో అందుకు గల కారణాన్ని చెప్పడం, అట్లాగే బట్టలకు రంగులు ఏ విధంగా వచ్చాయో వివరించడం జరుగుతుంది. పద్మశాలి పురాణం విన్న తర్వాత తమ వృత్తి పట్ల, కులం పట్ల గౌరవభావం పెరుగుతుంది. ఎందుకంటే తమ పూర్వీకులు దేవతల సంతతివారేనని, సృష్టిలో<noinclude><references/></noinclude> dju1y595mkezblo6x68iny7kujezud5 పుట:పటం కతలు.pdf/124 104 212020 552542 2026-04-10T05:17:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 107 మొదట వస్త్రం నిర్మించి దేవతలకు సమర్పించామని, రాక్షసులను ఎదురించామని, కులం పుట్టుక, వృత్తి ఆవిర్భావంలో ఏర్పడ్డ ఆటంకాలు... ఆ ఆటంకాలను మూలపురుషుడు ఎదురుకున్న తీరు,...' 552542 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 107 మొదట వస్త్రం నిర్మించి దేవతలకు సమర్పించామని, రాక్షసులను ఎదురించామని, కులం పుట్టుక, వృత్తి ఆవిర్భావంలో ఏర్పడ్డ ఆటంకాలు... ఆ ఆటంకాలను మూలపురుషుడు ఎదురుకున్న తీరు, ఆ సమూహం లేదా ఆ సమాజం తెలుసుకున్నప్పుడే ఆ వృత్తిని, ఆ సమాజాన్ని ఇతరులు గౌరవంగా చూస్తారు. ఆ వృత్తిని చేసే వ్యక్తులను కూడా గౌరవంగా భావిస్తారు. ఈ తంతును తరతరాలుగా కూనపులి వారు నిర్వహిస్తూ ప్రధాన కులం యొక్క సంస్కృతిని పరిరక్షింప చేస్తున్నారనడంలో సందేహం లేదు. కూనపులి వారు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వారివారి నియమిత కట్టడి గ్రామాలకు వెళ్లి పద్మశాలి కులపెద్దను కలిసి పురాణం ప్రదర్శించడానికి ప్రతిఫలం మాట్లాడుకుంటారు. ఒకవేళ ప్రదర్శన వద్దనుకుంటే పద్మశాలి వానిదగ్గర ఇంటికి కొన్ని రూపాయలు వసూలు చేసుకుంటారు. కథా ప్రదర్శన ఉంటే రంగస్థలాన్ని కులపెద్ద ఇంటి దగ్గర గానీ లేదా పద్మశాలి వీధిలో గానీ ఏర్పాటు చేసుకుంటారు. పటం మీది బొమ్మలు కనిపించడానికి దాదాపుగా పగలే ప్రదర్శించడానికి కళాకారులు ఒప్పుకుంటారు. కథ చెప్పడానికి ఐదుగురు కళాకారులు ఉంటారు. ఇందులో ఒకరు ప్రధాన కథకుడు. ఇతను కాళ్లకు గజ్జెలు, నడుముకు కండువా కట్టుకొని కుడిచేతిలో బెత్తంఐరిగె, ఎడమ చేతిలో చిడతలు పట్టుకుని పాత్రలను పోషిస్తూ వినోదం, విషాదం, యుద్ధం వంటి సన్నివేశాల్లో హావభావాలు ప్రకటిస్తూ మధ్యమధ్యలో హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు వంతలు ఉంటారు. వీరు ప్రధాన కథకుణ్ని అనుసరిస్తూ పునరావృతం చేస్తూ వంత పాడుతారు. మరో ఇద్దరిలో ఒకరు తబలా, మరొకరు హార్మోనియం వాయిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రధాన కథకుడు విశ్రాంతి తీసుకుంటే కథకు అంతరాయం కలగకుండా వంతలు పిట్టకథలు, హాస్యపు పాటలు పాడుతూ కథను రక్తికట్టిస్తారు. వీరు ఉపయోగించే వాద్యాల్లో తబలా, హార్మోనియం, చిడతలు తాళాలతో పాటుగా 'ఢంకా' అనే ప్రత్యేక వాద్యాన్ని వాడతారు. దీన్నే 'రణభేరిన అంటారు. కులపెద్ద ఇంటిదగ్గర ప్రదర్శన ప్రారంభంలో ప్రేక్షకులను సమీకరించడానికి, కథలో సందర్భాన్ని బట్టి యుద్ధం జరిగే సన్నివేశంలో ప్రత్యేకంగా ఈ వాద్యాన్ని వాయిస్తారు.<noinclude><references/></noinclude> g5otga86tk3m1rt8xftb3fzg7geunwr పుట:పటం కతలు.pdf/125 104 212021 552543 2026-04-10T05:17:26Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '108 పటం కతలు కూనపులి వారు ప్రదర్శనకు పవిత్రతను ఆపాదించడం కోసం ప్రదర్శనలో సందర్భాన్ని బట్టి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కథలో భాగంగానే రెండోరోజు కాలువాసురుడనే రాక్షస...' 552543 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>108 పటం కతలు కూనపులి వారు ప్రదర్శనకు పవిత్రతను ఆపాదించడం కోసం ప్రదర్శనలో సందర్భాన్ని బట్టి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కథలో భాగంగానే రెండోరోజు కాలువాసురుడనే రాక్షసున్ని సంహరించాలంటే రాక్షసునికి మరియు భావనాఋషి వద్ద ఉండే పులికి మేకపోతును బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కళాకారులు చేసి పద్మశాలి ఇండ్లమీద ఐలి చల్లుతారు. దీన్ని పద్మశాలీలంతా శుభసూచకంగా భావిస్తారు. ప్రాచీనమైన మౌఖిక వారసత్వ సంపద కలిగిన కూనపులి కళారూపానికి ప్రాచుర్యం లేక అవసాన దశలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పటం ద్వారా కథాగానం చేసే కళాకారులు మాత్రం కేవలం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన కూనపులి ఎర్రగట్టు, అతని కొడుకు రమేష్ మాత్రమే ఉన్నారు. రమేష్ కళారూపాన్ని బతికించుకోవాలనే తపనతో తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వరంగ సంస్థలు ప్రదర్శించేందుకు అవకాశాలు కల్పించినప్పటికీ పురాణాన్ని ప్రదర్శించడానికి పటం వాద్యాలు ని కారణంగా ప్రదర్శించేందుకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు. ఎంతో ప్రాచీనత కలిగిన ఈ కళారూపాన్ని పరిరక్షిస్తే దీంతో పాటుగా ఇటు కూనపులి, అటు పద్మశాలి మౌఖిక సాహిత్య సంపద భవిష్యత్ తరాలకు అందించినట్లవుతుంది. - డా॥ బాసని సురేష్<noinclude><references/></noinclude> 6a3zqokjojjjnuyjv6fny90qfnghnuu పుట:పటం కతలు.pdf/126 104 212022 552544 2026-04-10T05:17:45Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '12. మందెచ్చుల పటం కత మం దెచ్చుల వారు యాదవకులం వారికి ఆశ్రితులు. యాదవుల ఇంట ఉన్న గొర్లు, మేకల మందలు హెచ్చుకావాలని కథలు చెప్పి గావు పట్టి, ఐలి చల్లె వారినే మందహెచ్చులు లేక మందెచ...' 552544 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>12. మందెచ్చుల పటం కత మం దెచ్చుల వారు యాదవకులం వారికి ఆశ్రితులు. యాదవుల ఇంట ఉన్న గొర్లు, మేకల మందలు హెచ్చుకావాలని కథలు చెప్పి గావు పట్టి, ఐలి చల్లె వారినే మందహెచ్చులు లేక మందెచ్చుల వాళ్ళు అని అంటారు. వీరు చెప్పే కథలను మందెచ్చుల కథలు అంటారు. వీరు బుడిగె జంగాలలోని ఒక వర్గానికి చెందినవారు. తెలంగాణలో వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో మందెచ్చుల వారు అధికంగా నివసిస్తున్నారు. వీరిని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నారు. వరంగల్ జిల్లాలో మందెచ్చుల వారని, నల్లగొండ జిల్లాలో పొదపొత్రపు వాళ్ళని, పొగడుపోల్లు అని పోడారులు, బొమ్మలాటల వాళ్లు అనే పేర్లతో పిలుస్తున్నారు.<noinclude><references/></noinclude> lc87t8ac8n9o41i2xxdfrypi2v701ap పుట:పటం కతలు.pdf/127 104 212023 552545 2026-04-10T05:18:03Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '110 |ü≥+ ø£‘·T' 552545 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>110 |ü≥+ ø£‘·T<noinclude><references/></noinclude> 4glf5g4ux65bnw7wdnvavwb2c56v730 పుట:పటం కతలు.pdf/128 104 212024 552546 2026-04-10T05:18:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 111 సాధారణంగా మందెచ్చుల వాళ్లు కథాగానం రూపంలో ప్రదర్శనలిస్తారు. కాని ఇటీవల కొన్ని బృందాలు తమ ప్రదర్శనలో మార్పులు చేసి, ప్రేక్షకుల అభిరుచి కనుగుణంగా పటం ఆధారంగా ప్...' 552546 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 111 సాధారణంగా మందెచ్చుల వాళ్లు కథాగానం రూపంలో ప్రదర్శనలిస్తారు. కాని ఇటీవల కొన్ని బృందాలు తమ ప్రదర్శనలో మార్పులు చేసి, ప్రేక్షకుల అభిరుచి కనుగుణంగా పటం ఆధారంగా ప్రదర్శనలిస్తున్నారు. నకాశి వారితో పటంను తయారు చేయించి తమ ధాతృకుల పెద్దలను ఆకట్టుకుంటున్నారు. మందెచ్చుల వారికి మూలపురుషుడు వలగొల్ల జగ్గయ్య అని, ఇతను పూర్వం యాదవుల యొక్క మందల వద్దకు వెళ్ళి గొర్రెను గావు పట్టించి, మంద మీద, చేను మీద, చెలక మీద బలిచల్లి కథలు చెప్పేవాడని, దానివల్ల గొల్లవారి మందలు బాగా పెరిగాయని, ఇలా మంద హెచ్చు కావడానికి కారకుడు అయిన ఆలగొల్ల జగ్గయ్య సంతతికి చెందినవారే మందెచ్చుల వారయ్యారని చెపుతారు. మరొక కులోత్పత్తి గాథలో... ఒక గ్రామంలో ఒక గొర్రెల మంద ఉండేది. అదే గ్రామంలో ఊరు ముందుండే గుడిసెలో నివసించే శారదాకాండ్ర స్త్రీకి, గొర్రెమంద యజమానికి రహస్యంగా సంబంధం ఏర్పడింది. ఆమె గర్భం దాల్చింది. ఆమెను తమ కులం వాళ్ళు వెలివేయడంతో మంద వద్దనే తొమ్మిది నెలలు గడిచి ఒక పిల్లాడికి జన్మనిచ్చింది. గొర్ల మంద యజమానికి ఆమెకు పొడలున్న ఒక మేకపోతును ఇచ్చాడు. ఆ పిల్లవాడు మంద వద్దనే రొచ్చులో పెరిగి పెద్దవాడయ్యాడు. మందెచ్చలో పెరిగాడు కాబట్టి అతనిని మందెచ్చుల వాడని, పొడలున్న పోతును పెంచడం వల్ల పొదపోతుల వాడు అయ్యాడని వీరి సంతతి ఇలా మారిపోయిందనేది వీరి నమ్మకం. ఇలా ప్రాంతాన్ని బట్టి కులోత్పత్తి గాధలుంటాయి. మందెచ్చుల వాళ్ళు గొల్లలకు, యాదవులకు మాత్రమే కథలు చెప్పి వారి నుంచి పుచ్చుకునే సంభావననే 'త్యాగం' అంటారు. దీనికే 'కట్టడి' అనిపేరు. కట్టడి ఉన్న గ్రామాలకు సంవత్సరానికి ఒకసారి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రావణ మాసం నుంచి ఎండాకాలం వరకు వెళ్లి కథలు చెబుతారు. కట్టడిని తెలిపే విధంగా తరతరాల నుంచి వస్తున్న రాగిసన్నతి (రాగిశాసనం)ని వీరు ఆయా గ్రామాలకు వెళ్ళినపుడు వెంట తీసుకువెళ్తారు. ఆ గ్రామంలో గొల్ల<noinclude><references/></noinclude> 2yxoxiq220ljumr30p95gmlac3ry2mq పుట:పటం కతలు.pdf/129 104 212025 552547 2026-04-10T05:18:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '112 పటం కతలు కులపెద్ద ఏర్పాటు చేయించిన ఇంట్లో ఉంటారు. మందెచ్చులవారు తెచ్చుకున్న బొమ్మలు ఉన్న బుట్టలను దించుకుంటారు. గ్రామానికి వచ్చిన విషయాన్ని 'నపీర' అనే వాద్యాన్ని ఊదుతూ...' 552547 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>112 పటం కతలు కులపెద్ద ఏర్పాటు చేయించిన ఇంట్లో ఉంటారు. మందెచ్చులవారు తెచ్చుకున్న బొమ్మలు ఉన్న బుట్టలను దించుకుంటారు. గ్రామానికి వచ్చిన విషయాన్ని 'నపీర' అనే వాద్యాన్ని ఊదుతూ యాదవులందరికీ తెలియపరుస్తారు. మరుసటి రోజున కులపెద్ద అంగీకారం మేరకు యాదవులు కోరుకున్న కథను చెపుతారు. దీనినే 'కులకథ' అంటారు. ఈ కథను మూడురోజుల పాటు చెబుతారు. ఈ కథ తర్వాత 'బలిచల్లి' 'పొలికథ'ను చెబుతారు. తరువాత రాజు బొమ్మలతో కథలు చెపుతారు. మందెచ్చుల వారు కథ చెప్పినందుకు ఎనిమిది మంది కళాకారులు ఒక బృందంగా ఉంటారు. అందులో ప్రధాన కథకుడు, ఇద్దరు సహాయ కథకులు, వాద్య సహకారం ఇద్దరు, వంతలు ఇద్దరు చొప్పున ఉంటారు. వీరు ప్రదర్శనలో ఉపయోగించే వాద్యాలు 'డోలు' ప్రధానమైనది. దీనినే 'రడవీర' అని కూడా అంటారు. మరొక వాద్యం పేరు 'నపీర'. దీనిని ఊదుతూ కథ చెబుతారు. జగ్గు, హార్మోనియం, పెద్దతాళాలు, చిన్నతాళాలు వంటి వాద్యాలను ఉపయోగిస్తారు. కథకుడు, సహకథకులు కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. కాళ్ల అడుగులతోనే గజ్జెల శబ్దం కథకు ఇంపునిస్తుంది. కథలు చెప్పడానికి ప్రత్యేకమైన రంగస్థలం అంటూ ఉండదు. పటం ప్రదర్శన ఐతే పటం వ్రేలాడదీయడానికి అనువుగా స్టేజి ఏర్పాటు చేసుకుంటారు. కథాగాన ప్రదర్శన అయితే నేల మీదనే చాప వేసుకొని రాత్రి సమయాల్లో అయితే కులపెద్ద ఇంటిముందు, పగలైతే చెట్ల కింద గొల్లవాళ్ళు నివసించే వీధులలోనే ప్రదర్శనలు ఉంటాయి. వీరికి ప్రత్యేకమైన వేషధారణ అంటూ ఉండదు. ప్రధాన కథకుడు తెల్లధోతి, తెల్ల అంగి ధరించి మెదలో వెండిగొలుసులు, చేతికి వెండి పోంచి చిట్రేగు కర్రకు తొడిగిస్తారు. దీనినే అనుసుల కట్టె అంటారు. ఈ కట్టెను చేత్తో పట్టుకుని, మరోచేత్తో రుమాలు పట్టుకుంటాడు. కథలో స్త్రీ పాత్ర ఉంటే మగవారే స్త్రీ పాత్ర ధరిస్తారు. మందెచ్చుల వారు చెప్పే కథల్లో ముఖ్యంగా - పెద్దిరాజు కథ,<noinclude><references/></noinclude> c39b0egvqdfqvw2jjst0km0nsntrd29 పుట:పటం కతలు.pdf/130 104 212026 552548 2026-04-10T05:19:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు కరియావుల గంగురాజు కథ, కాటమరాజు కథ, ఎర్రన్న కథ పోలురాజు కథ, ఎలనూకరాజు కథ, నలనూకరాజు కథ, ఆదిబిడ్డ కొంరవ్వ కథ, పాపమ్మ కథ, కాంబోజరాజు కథ, కనకతార వధ, బొల్లావు కథ, సారంగధర కథ,...' 552548 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు కరియావుల గంగురాజు కథ, కాటమరాజు కథ, ఎర్రన్న కథ పోలురాజు కథ, ఎలనూకరాజు కథ, నలనూకరాజు కథ, ఆదిబిడ్డ కొంరవ్వ కథ, పాపమ్మ కథ, కాంబోజరాజు కథ, కనకతార వధ, బొల్లావు కథ, సారంగధర కథ, సత్యహరిశ్చంద్ర, సిరితొండ మారాజు, మందోదరి, సువర్ణ సుందరి, అయిదు మల్లెపువ్వులు, బలిచక్రవర్తి, 113 నలచక్రవర్తి వంటి ఎన్నో కథలను చెపుతారు. ఈ కథలు ఒకరోజు నుంచి అయిదు రోజుల వరకు చెప్పే కథలు కూడా ఉన్నాయి. యాదవులు ఈ కథలను చెప్పించడానికి ముఖ్యోద్దేశం దొడ్డిహెచ్చు, మందెచ్చు అవుతుందనేది వీరి ప్రగాఢ విశ్వాసం. కథ ప్రారంభంలో గంగాదేవిని స్తుతిస్తారు.<noinclude><references/></noinclude> bolxhsygj5gvvlp7qn16l8m8suu1tu4 పుట:పటం కతలు.pdf/131 104 212027 552549 2026-04-10T05:19:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '114 పటం కతలు 'శరణు శరణు మాకన్న తల్లీ శాంభవి రాణి, శాంభవి రాణి శరణు జూడు మా కన్నతల్లీ గంగాభవానీ, దేవిభవాని' అంటూ గంగను శరణువేడి, తర్వాత ఆది గణపతిని తలుస్తారు. మందెచ్చుల వారు చెప్...' 552549 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>114 పటం కతలు 'శరణు శరణు మాకన్న తల్లీ శాంభవి రాణి, శాంభవి రాణి శరణు జూడు మా కన్నతల్లీ గంగాభవానీ, దేవిభవాని' అంటూ గంగను శరణువేడి, తర్వాత ఆది గణపతిని తలుస్తారు. మందెచ్చుల వారు చెప్పే కథల్లో కథావస్తువు యాదవుల ఘన చరిత్రకు సంబంధించినదే ఉంటుంది. యాదవులు గోవుల కోసం చేసిన యుద్ధాలు, చరిత్రకు సంబంధించిన ఇతివృత్తాలు గల కథలు చెపుతారు. మందెచ్చుల వారు కులకథ చెప్పిన తరువాత యాదవులు తమ మంద వద్ద గొర్రెను గావుపట్టించి మందల మీద ఐలి చల్లించుకుంటారు. ఇలా అయితే తమ మందలు హెచ్చు అవుతాయనేది వీరి నమ్మకం. పొలి కథగా కాటమరాజు కథ లేదా గంగాదేవి కథ చెపుతారు. కథలు పూర్తిగా అయిన తర్వాత ఆది లేదా గురువారాల్లో గొర్ల మంద వద్ద మందెచ్చు నాయకుడు గొర్రె మెడను పండ్లతో కొరుకుతూ గావుపడతాడు. మంద చుట్టూ తిరుగుతూ.. ఆ రక్తాన్ని గడుక, పసుపు మొదలైన వాటితో కలిపి ఐలొ.. బలి అంటూ గొర్ల మంద మీద, యాదవుల ఇండ్ల మీద, చెలకల్లా చల్లుతారు. ఈ కార్యక్రమం రాత్రి నుంచి తెల్లవారే సరికి పూర్తిచేస్తారు. గావుపట్టి బలి చల్లినందుకు గొర్రెను లేదా మేకను మందెచ్చుల వారికి కట్నంగా ఇస్తారు. యాదవుల ఇంట్లో పురుడు ఐతే పురుడుకట్నం పెరిగితే పెండ్లికట్నం చస్తే చావు కట్నాన్ని మందెచ్చుల వారు హక్కుగా పొందుతారు. వీరు కట్టడి సమయంలోనే కాకుండా యాదవుల ఇంట్లో మరణించిన వారి పేరుమీద కూడా ఈ కథలు చెప్పిస్తారు. ఇంటి పెద్ద అంగీకారంతో బుట్టబొమ్మల ప్రదర్శన ఇచ్చి చనిపోయన వారిని స్తుతిస్తారు. చనిపోయినవారు ధరించిన వెండి ఆభరణాలను దానంగా ఇస్తారు. కథకు అనుగుణంగా బొమ్మలు చూపిస్తూ దానికి సంబంధించిన సంక్షిప్త కథను చెపుతారు.<noinclude><references/></noinclude> 6122aqux3a0eatvhh5exmr6296ki2ua పుట:పటం కతలు.pdf/132 104 212028 552550 2026-04-10T05:19:54Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 115 ఈ బొమ్మల్లో కాటమరాజు, పెద్దిరాజు, పోలురాజు, గంగురాజు, పెద్దమదేవి, ఎర్రన్న, బత్తిరన్న, పావ్య, కౌంరవ్వ, పెద్దపులి, చిరుతగండు, కుక్క, తోడేలు, గంగాదేవి మొదలైన అనేక పాత్ర...' 552550 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 115 ఈ బొమ్మల్లో కాటమరాజు, పెద్దిరాజు, పోలురాజు, గంగురాజు, పెద్దమదేవి, ఎర్రన్న, బత్తిరన్న, పావ్య, కౌంరవ్వ, పెద్దపులి, చిరుతగండు, కుక్క, తోడేలు, గంగాదేవి మొదలైన అనేక పాత్రలు గల బొమ్మలు నూట యాభై వరకు ఉంటాయి. బొమ్మల ప్రదర్శనలో చివరిన గంగాదేవి బొమ్మ తీసేటప్పుడు యాదవ కులస్త్రీ ఇంటిపెద్ద బోనం వండి తీసుకొని వస్తుంది. గంగాదేవికి బొట్టుపెట్టి హారతి వెలిగించి కొబ్బరికాయ కొడుతుంది. ప్రేక్షకులకు పసుపు బొట్టు పెట్టి అందరూ గంగాదేవి మీద అక్షింతలు వేసి దండం పెట్టుకుంటారు. తర్వాత మందెచ్చు నాయకుడు గంగాదేవిని ఇంట్లోకి తీసుకునిపోయి మంగళం పాడి త్యాగంగా వడ్లు, జొన్నలు, యాదవులు ఒప్పుకున్న ప్రకారం గొర్రె, గంగాదేవికి చీర, రవికె, చనిపోయిన యాదవుడు తిన్న గిన్నె, చెంబు, దుస్తులు, బోల్కడియం, దండకడియం, కొనకు పోగు లాంటివి తీసుకుంటారు. కథ ముగింపులో మంగళహారతి పాడి ప్రేక్షకుల నుంచి కట్నాలు తీసుకుంటారు. వీరు చెప్పే కథల్లో శోక, కరుణ, వీర, భయానక రస ప్రధానమైనవే ఎక్కువగా ఉంటాయి. ఈ కళాకారులు కథను చాలా నిదానంగా రాగం తీస్తూ ప్రేక్షకులకు అర్ధమగు భాషలో చెపుతారు. కథ మధ్యలో సామెతలు, పొడుపు కథలు, హాస్య కథలు చెపుతూ.. ప్రేక్షకులకు సందేశాన్ని, సంతోషాన్ని అందిస్తారు. కథ చెబుతున్నప్పుడు ఆయా సన్నివేశాలను బట్టి ప్రేక్షకులు ఒసుగులు (కట్నాలు) చనిపోయిన వారి పేర్ల మీదుగా చదివిస్తారు. కథ గాన రూపంలోనూ, వచన రూపంలోనూ ఉంటుంది. సహజ శైలిలో పాడేందుకు వీలుగా ఉంటుంది. కథలో పునరావృత్తులు, వర్ణనలు, వారాను వర్తనాలు అధికంగా వస్తాయి. సరళ ఛందస్సు కలిగి ఉంటుంది. కథకులు అశువుగా కథలు చెప్పడం, సందర్భానుసారంగా హాస్యగాడు ప్రాంతీయ కథలు, పిట్టకథలు చెప్పి ప్రేక్షకుల దృష్టి మరల్చకుండా చేస్తాడు. కథలో నీతిభావం, భక్తిభావంతో పాటు.. ప్రేక్షకులకు సందేశాన్ని అందిస్తుంది. మందెచ్చుల వారి బొమ్మలను వెదురు బుట్టలలో చాలా జాగ్రత్తగా మరియు పవిత్రంగా భద్రపరుచుకుంటారు. ఈ బొమ్మలను 'నకాశి' అనే కులం వారు<noinclude><references/></noinclude> 7upltx16c9mgi3cp5nlmny1i4qeqnet పుట:పటం కతలు.pdf/133 104 212029 552551 2026-04-10T05:20:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '116 పటం కతలు తయారుచేసి రంగులు వేస్తారు. వారి దగ్గర మందెచ్చుల వారు కొనుక్కుంటారు. మందెచ్చుల వారికి కథలు లేని సమయంలో కూలి పనులకు వెళ్తారు. త్యాగంలో వచ్చిన మేకలను, గొర్లను మేపు...' 552551 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>116 పటం కతలు తయారుచేసి రంగులు వేస్తారు. వారి దగ్గర మందెచ్చుల వారు కొనుక్కుంటారు. మందెచ్చుల వారికి కథలు లేని సమయంలో కూలి పనులకు వెళ్తారు. త్యాగంలో వచ్చిన మేకలను, గొర్లను మేపుకుంటూ జీవిస్తారు. కట్నంగా వచ్చిన ధాన్యం, డబ్బులు, వెండినగలు పంచుకుంటారు. - కళాకారులు అందరూ సమానంగా మందెచ్చుల వారు సహజ సిద్ధంగా ధోతి కట్టుకొని తెల్లఅంగి ధరిస్తారు. జుట్టు పెంచుకుంటారు. మెదలో పొడవాటి వెండి గొలుసులు, చేతికి వెండి కడెం, వెండి పోంచి ధరించి ఉంటారు. వీరిని చూడగానే మందెచ్చుల వాళ్లు అని గుర్తుపట్టే విధంగా వీరి దైనందిన వేషదారణ ఉంటుంది. యాదవుల ఆదరణతో మందెచ్చుల కళారూపం ఇప్పటికీ సజీవంగా ఉండటం విశేషం. గతంలో కంటే వీరి జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కథాగానమే వృత్తిగా జీవిస్తున్న వారికి శాశ్వత గృహాలు లేకపోవడం విచారకరం. వీరి ఉనికి తెలియచేసేందుకు వీలుగా ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల విశ్వ విద్యాలయాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. - డా॥ శ్రీమంతుల దామోదర్<noinclude><references/></noinclude> 694h4ihapl90absbrfl9fh7rj6nunlm పుట:పటం కతలు.pdf/134 104 212030 552552 2026-04-10T05:20:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '13. మాసయ్య పటం కత జా నపద విజ్ఞానంలో ఆశ్రిత కులాలకు ఒక విశిష్టమైన సాహిత్యంతో పాటు.. వైవిధ్య భరితమైన సాంస్కృతిక జీవనం ఉంది. క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు రచ...' 552552 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>13. మాసయ్య పటం కత జా నపద విజ్ఞానంలో ఆశ్రిత కులాలకు ఒక విశిష్టమైన సాహిత్యంతో పాటు.. వైవిధ్య భరితమైన సాంస్కృతిక జీవనం ఉంది. క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు రచించిన 'పండితారాధ్య చరిత్ర'లో ఆశ్రిత కులాల ప్రస్తావన కనిపిస్తుంది. అంతటి ప్రాచీనత కలిగిన ఆశ్రిత కులాలు నేటికి సమాజంలో తమ సంస్కృతిని కాపాడుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయి. ఇవి హక్కుగా ఒక ప్రక్రియ ద్వారా దాతృ కులాలకు లేదా పోషక కులాలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే దాతృకులాల మూలపురుషులు వంశచరిత్ర లేదా కుల పురాణాన్ని వంశం యొక్క గోత్రనామాలను కీర్తిస్తున్నారు. ఇందులో కొన్ని ఆశ్రిత కులాలు కనికట్టు విద్యలు ప్రదర్శించి కూడా దాతృకులాన్ని ఆనందింపజేస్తున్నాయి. ఇటువంటి ఆశ్రిత కులాలను ఉపకులాలు, వృత్తి గాయకులు, భిక్షుక గాయకులు, ఆశ్రిత<noinclude><references/></noinclude> nr9wxshg91t5em5hqyix4i15m15kd4r పుట:పటం కతలు.pdf/135 104 212031 552553 2026-04-10T05:20:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '118 |ü≥+ ø£‘·T' 552553 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>118 |ü≥+ ø£‘·T<noinclude><references/></noinclude> iafn4bxatr616f7nocv9ykj336vw4fp పుట:పటం కతలు.pdf/136 104 212032 552554 2026-04-10T05:21:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 119 కళారూపాలుగా పిలుస్తున్నారు. వీరంతా తరతరాలుగా సంప్రదాయంగా, మౌఖికంగా సంక్రమించిన విద్యనే దాతృకులం దగ్గర ప్రదర్శిస్తూ వారివారి హక్కులను కాపాడుకుంటున్నారు. ఆశ్ర...' 552554 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 119 కళారూపాలుగా పిలుస్తున్నారు. వీరంతా తరతరాలుగా సంప్రదాయంగా, మౌఖికంగా సంక్రమించిన విద్యనే దాతృకులం దగ్గర ప్రదర్శిస్తూ వారివారి హక్కులను కాపాడుకుంటున్నారు. ఆశ్రిత కులాలు లేదా కళారూపాలు తెలంగాణ రాష్ట్రంలో 52కు పైగా ఉన్నాయి. ఇందులో వినూత్నమైన ప్రక్రియకు సంబంధించిన కళారూపాల్లో పటం కథలను ప్రముఖంగా చెప్పవచ్చు. ఇవి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కనిపించడం ప్రత్యేకంగా చెప్పవచ్చు. మాదిగ కులకథ అయిన జాంబ పురాణాన్ని డక్కలివారు, మాలల మూలకథ బేతాళ పురాణాన్ని గుర్రపువారు, చాకలి కుల కథ అయిన మడేలు పురాణాన్ని మాసయ్యలు, పద్మశాలీల కుల కథ మార్కండేయ పురాణాన్ని కూనపులివారు, యాదవుల కుల కథ కాటమరాజు కథలను తెరచీరలవారు, గౌదుల కుల కథ గౌడ పురాణాన్ని గౌడజెట్టీలు పటాలను చూపెడుతూ గానం చేస్తుంటారు. ఈ కులపురాణ కథా చిత్రాలను పొడవైన వస్త్రాలపైన చిత్రించి కథను ప్రదర్శిస్తారు. వీటినే పటం అంటారు. ఈనాడు మారుమూల గ్రామాల్లో బతుకుతున్న పటం కథకు అతి ప్రాచీనమైన చరిత్ర ఉంది. వైదిక వాంజ్ఞయంలోనే 'యమపటాల' ప్రస్తావన ఉంది. ఆనాడు యమపటాల ద్వారా వైదిక సంస్కృతి ప్రచారం జరుగుతుండేది. బౌద్ధ, జైన మతాలు కూడా ఈ పటాల ద్వారా తమ మతాలను ప్రచారం చేసినందువల్ల సామాన్య, పామర జనులను ఆకట్టుకున్నాయి. ఆ మతాలు క్షీణించిన తర్వాత పామరులు తమ కుల పురాణాల ప్రచారానికి పటం కథలను స్వీకరించి ఉండవచ్చు. ఈనాడు భారతదేశంలోని బీహార్, బెంగాల్, ఒరిస్సా, కర్ణాటకలో ప్రచారంలో ఉన్న పటం కథలను 'పటచిత్రాలని', మహారాష్ట్రలో 'పటా'లని, రాజస్థాన్ లో 'బాబూజీకా పట్ అని అంటారు. పట చిత్రాల ప్రదర్శనలు మన దేశంలోనే గాక.. చైనా, ఇండోనేసియా, నేపాల్, టిబెట్లో కూడా ఉన్నాయి. రా మన తెలుగు నేలలో ముఖ్యంగా తెలంగాణలో ఈ పటచిత్రాలను చిత్రించేవారు 'నకాశి' కులం వారు. చిత్రకళను కుల వృత్తిగా నమ్ముకుని బతికే వీరు చేర్యాలలో ఉన్నారు. వీరి వంశం వారు నిర్మల్, కొండపల్లి ప్రాంతంలో<noinclude><references/></noinclude> g6q4rk9301gw3r2hjyw6z2qv7mfpnj6 పుట:పటం కతలు.pdf/137 104 212033 552555 2026-04-10T05:21:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '120 పటం కతలు ఉన్నారంటారు. నకాశి కులం వారు పటం తయారుచేయడానికి ముందు పొడవైన తెల్లటి సైను ఐట్టను చదునుగా ఉన్న నేలమీద పరుస్తారు. తర్వాత ఖడి, గోందు, గంజిని కలిపిన మిశ్రమాన్ని తయార...' 552555 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>120 పటం కతలు ఉన్నారంటారు. నకాశి కులం వారు పటం తయారుచేయడానికి ముందు పొడవైన తెల్లటి సైను ఐట్టను చదునుగా ఉన్న నేలమీద పరుస్తారు. తర్వాత ఖడి, గోందు, గంజిని కలిపిన మిశ్రమాన్ని తయారుచేసి వెడల్పయిన కుంచెతో గానీ, గుడ్డముక్కతో గానీ ఐట్టపైన సమంగా పూస్తారు. బట్ట మీద మిశ్రమం తడి ఆరిన తర్వాత నల్లరంగు గీతలతో డ్రాయింగ్ వేసుకొని.. వివిధ రంగులతో నింపుతారు. ఎక్కువగా నీలం, నలుపు, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపుపచ్చ రంగులను వాడుతారు. వీరికి తాము చిత్రించే కథల గురించి ఎక్కువగా తెలియదు. పాత పటాలను చూసి 'నకలు' వేయడం లేదా కావలసిన చిత్రాలు గురించి కథకులు చెబితే చిత్రిస్తుంటారు. పటం కథకులు పటాన్ని కొన్న తర్వాత పూజచేసి వాడటం మొదలు పెడతారు. పటం వాడిన తర్వాత పాతదైతే దానిని పూజించి గంగలో వదిలేస్తారు. ఇటువంటి పటం కథను వృత్తిగా చేసుకొని చాకలి కులానికి ఆశ్రితులుగా ఉంటూ చాకలి కులపురాణం అయిన మడేలు పురాణాన్ని చెప్పేవారిని 'మాసయ్యలు అంటారు. మడివేలయ్య లేక మదేలయ్య అనే పేరు చాకలి కులానికి మారుపేరుగా ఎలా నిలిచిపోయింది.. మడివేలయ్య ఎవరు..? ఎలా ఉనికిలోకి వచ్చాడు అనడానికి ఒక కథ మౌఖికంగా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం నేడు మడేలు పురాణకథ శక్తిపుట్టుకతో ప్రారంభమవుతుంది. దక్షశత మహాదేవి దంపతులకు పార్వతితో పాటు పరమేశ్వరుని వరప్రభావంతో 100 మంది సంతానం కలుగుతుంది. పార్వతి తండ్రిని ధిక్కరించి తపస్సు చేసి శివుణ్ణి వివాహమాడుతుంది. ఆ కోపంతోనే దక్షప్రజాపతి తాను నిర్వహిస్తున్న యజ్ఞానికి శివపార్వతులను పిలవడు. అయినా పార్వతి ఆ యజ్ఞగుండం వద్దకు వెళుతుంది. పార్వతి అవమాన భారంతో యజ్ఞగుండంలోకి దుమికి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు తన జట నుండి వీరభద్రుడిని ఉద్భవింపజేసి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపిస్తాడు. దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసిన తర్వాత త్రిమూర్తుల వద్దకు వెళ్లి దక్షున్ని చంపి, కాల్చి, మాడ్చి, ఊడ్చి ఉస్సోమన్నాని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు 'యజ్ఞాన్ని నాశనం చేయమంటే దానితో పాటు స్త్రీ హత్య, శిశుహత్య, బ్రహ్మ హత్యలు చేసి పాప పంకితుడైనావు కాబట్టి నీ నీడ మాపై పడకూడదు' అని అంటారు. నువ్వు పాలగుండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్తు అని<noinclude><references/></noinclude> 5rs4nz23wtdzhv9ji1m3qt9risjly2o పుట:పటం కతలు.pdf/138 104 212034 552556 2026-04-10T05:21:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 121 అంటారు. అపుడు వీరభద్రుడు చెమట బిందువుల నుంచి ఇద్దర ప్రవాస కర్తలు మడేలయ్య, మాసయ్యలు భూమి మీద పుడతారు. మడివేలయ్య బట్టలు ఉతకడం, మాసయ్య దేవునికి పూజచేయడం చేస్తుండేద...' 552556 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 121 అంటారు. అపుడు వీరభద్రుడు చెమట బిందువుల నుంచి ఇద్దర ప్రవాస కర్తలు మడేలయ్య, మాసయ్యలు భూమి మీద పుడతారు. మడివేలయ్య బట్టలు ఉతకడం, మాసయ్య దేవునికి పూజచేయడం చేస్తుండేది. మాసయ్య అన్నం, ఆహారం లేకుండా పూజలోనే ఉండేది. ఎవరైనా వచ్చి ఇస్తేనే తినేది లేకుంటే లేదు. ఒకరోజు బాగా ఆకలి వేసిన మాసయ్య, మడేలయ్య అడుక్కుని తెచ్చుకున్న అన్నాన్ని ఒక్కడే తింటాడు. స్నానం చేసి భోజనానికి వచ్చిన మడేలయ్య కోపించి మాసయ్యతో 'పంచినదాన్ని మారు పంచుడయితే లేదు, నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నావు కాబట్టి ఏడాదికొకసారి అర్తివాడవై నా ఇంటికి వస్తే నీకు త్యాగం ఇస్తా' నంటాడు. అందుకే వీరి మధ్య కంచం పొత్తు ఉన్నప్పటికీ వియ్యపు పొత్తు లేదు. చాకలి వారికి మాసయ్యలు ఆడబిడ్డలు అర్తివారు వంటివారు. అందుకే అర్తిబిడ్డ దీవెన, ఆడబిడ్డ దీవెన, జంగం దీవెన సమానం అంటారు. వీరభద్రుని అవతారం అయిన మడేలయ్య సురా ముప్పది కోట్ల దేవతలు విడిచిన వస్త్రాలను పాపపరిహారం చేసుకోవడానికి పన్నెందు సంవత్సరాలు పిండుతాడు. పన్నెండు సంవత్సరాలు పిండడం పూర్తయిన తర్వాత ఒకసారి పరమశివుడు మడేలయ్యను వృత్తిపరంగా పరీక్షించదలిచి ఒక బొంతనిచ్చి ఉతకమంటాడు. కానీ ఉతకడానికి కావలసిన నీటిని, చవుడును, భాండాన్ని మాయం చేస్తాడు. మడేలు తన భార్య సీతాలును చంపి ఆమె శరీరావయవాలతో ఉతకడానికి కావలసిన పరికరాలను తయారుచేసుకొని బొంతను ఉతికిస్తాడు. శివుడు మడేలయ్య మహత్తుకు భయపడి ముందు పారిపోయినా తర్వాత ప్రత్యక్షమై వరం కోరు కొమ్మంటాడు. అపుడు మడేలయ్య తనకు చాకలి వృత్తి కావాలని, వందని కూడు, వడకని బట్ట, పిండని పాడి, ఇంటిముందు తడి వస్త్రాలు, పొడి వస్త్రాలు తరగకుండా ఉండాలని, ఎటువంటి రాజపుంగవులు కోకలు అయినా తాము ధరించినప్పటికీ తననేమి అనకుండా ఉండాలని కోరుకుంటాడు. అపుడు పరమశివుడు అలాగేనని దీవించి 'ముందుగా నీకు అన్నం పెట్టినవారు ముక్తిపొందుతారు, పెట్టనివారు నరకం వెళతారు, మరో జన్మలో నీకు కట్నాలు, కానుకలు ఇస్తార'ని ఆశీర్వదించి మాయ మవుతాడు. ఈ విధంగా జీవించే మడేలయ్య వంశం వారే చాకలివారు.<noinclude><references/></noinclude> nc7vn41vmyz98f1551kffe8vb3wpqha పుట:పటం కతలు.pdf/139 104 212035 552557 2026-04-10T05:22:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '122 పటం కతలు అందుకే మదేలయ్య రజక కులానికి మూలపురుషుడిగా చెప్పబడుతాడు. వీరభద్రాంశ సంభూతుడు. శివుని పరీక్షలనెదుర్కొని మెప్పించిన శివభక్తుడు. మాసయ్యలకు తమ కులకథను కీర్తించే హ...' 552557 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>122 పటం కతలు అందుకే మదేలయ్య రజక కులానికి మూలపురుషుడిగా చెప్పబడుతాడు. వీరభద్రాంశ సంభూతుడు. శివుని పరీక్షలనెదుర్కొని మెప్పించిన శివభక్తుడు. మాసయ్యలకు తమ కులకథను కీర్తించే హక్కును, భుక్తిని ప్రసాదించిన దయాకుడు. శివానుగ్రహంతో బట్టలుతికే వృత్తిని గౌరవంగా స్వీకరించిన కులాభిమాని, ఇంతటి శైవభక్తుడు మడేలయ్య కథను గానం చేయడం వల్ల చాకలివారికి తమ కులవృత్తి పైనా, కులం పైనా, మూలపురుషుడైన మడేలయ్య పైనా భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. ఇటువంటి మడివేలయ్య పురాణంతో పాటు... మాసయ్యలు పటం సహాయంతో చాకలివారికి స్తంభ పురాణం, పార్వతీ కల్యాణం, దక్షయజ్ఞం వంటి శివపురాణాలకు సంబంధించిన కథలు చెబుతారు. కథ చెప్పే ప్రదేశంలో వెడల్పు 8 అడుగులు, పొడవు 5 అడుగులు ఉండేవిధంగా నాలుగు గుంజల పందిరి వేస్తారు. రంగస్థలం వెనుకభాగంలో తెల్లని పరదాగుడ్డ కడతారు. ముందు భాగానికి పైన కుచ్చుల పరదాతో అలంకరిస్తారు. వెనుక తెల్ల పరదా దగ్గర మరి రెండు గుంజలు నాటి ఆ గుంజల పైన చుట్టబడి ఉన్న పటం కడతారు. కథ చెప్పేటప్పుడు ఈ పటంను పైనుండి కిందకు లాగుతూ ఉంటారు. ఈ విధంగా లాగుతున్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో కథకు అనుకూలంగా దృశ్యాలు వస్తుంటాయి. అదే విధంగా కథ చెపుతున్నపుడు తప్పకుండా రాగిసన్నత్ ఉంటుంది. రాగిసన్నత్ రంగస్థలం మీద లేకుండా కథ చెప్పనివ్వరు. పటం దగ్గర కథ చెప్పే వ్యక్తి నిలబడి కథాగానం ప్రారంభిస్తారు. ప్రదర్శన కోసం ఐదుగురు కళాకారులు ఉపయోగపడతారు. ప్రధాన కథకుడికి ఇరుపక్కల ఇద్దరు తాళాలు వాయిస్తూ వంత పాడతారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మద్దెల, మరొకరు హార్మోనియం వాయిస్తారు. కథకుడు చేతిలో ఉన్న బెత్తంతో పటం చూపుతూ కథను వచనంగానూ, పాటగాను రాగయుక్తంగా వివరిస్తుంటే వంతలు వాద్య సహకారం ఇస్తూ వంతపాడుతూ కథ కొనసాగడంలో సహాయపడుతుంటారు. మధ్యమధ్యలో కథకుడు ప్రేక్షకులను ఉత్తేజితులను చేయడానికి ఎగరడం, హాస్యపు మాటలు చెప్పడం చేస్తుంటారు. ప్రధాన కథకుడు చేతిలో బెత్తం, కాళ్లకు గజ్జెలు, తలపై రుమాలు, చేతికి వెండి పొంచి, చెవులకు కుండలాలు, మెడలో వెండి గొలుసులు ధరించి కథాగానం చేస్తాడు. కథ మొదలుపెట్టేముందు ఊదుబత్తీలు<noinclude><references/></noinclude> 4dolsopiyo514o472ilfo0r7wgy6ag9 పుట:పటం కతలు.pdf/140 104 212036 552558 2026-04-10T05:22:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 123 ముట్టించి కొబ్బరికాయ కొట్టి పటాన్ని కిందకు దించి మొదలుపెడతారు. పటం పైవైపున కడతారు కాబట్టి పైనుంచి కిందకు ఒక దృశ్యం తరువాత మరొక దృశ్యాన్ని లాగవలసి ఉంటుంది. పనుల...' 552558 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 123 ముట్టించి కొబ్బరికాయ కొట్టి పటాన్ని కిందకు దించి మొదలుపెడతారు. పటం పైవైపున కడతారు కాబట్టి పైనుంచి కిందకు ఒక దృశ్యం తరువాత మరొక దృశ్యాన్ని లాగవలసి ఉంటుంది. పనుల కాలంలో ఎక్కువగా రాత్రిపూట కథ చెపుతారు. మాగి రోజుల్లో కూడా రాత్రిపూట చెపుతుంటారు. పనులు లేని తీరిక కాలంలో గ్రామాల్లో సంచార జీవనం కొనసాగిస్తూ కథలు చెపుతుంటారు. పూర్వం గుర్రాలు ఉన్నపుడు వాటి మీద సామాన్లు వేసుకొని వెళ్లేవారట. చాకలివారి ఇంటిపట్టునే వీళ్లు కూడా చూరు కింద ఆశ్రయం పొందుతారు. ఆ గ్రామాల్లో ఉన్నన్ని రోజులూ మాసయ్యలను పోషించవలసిన బాధ్యత ఆ చాకలి కులస్తులదే. మాసయ్యల దగ్గర పూర్వం రాజులు ఇచ్చిన రాగిసన్నత్' ఉంటుంది. రాజులు లేక పాలకులు తమ ఇలాభాలోని గ్రామాలలోన వివిధ కులాలను ఆశ్రయించడానికి వచ్చిన ఉపకులాల వారికి ఉన్న హక్కును తెలియజేస్తూ రాసి ఇచ్చిన రాగి శాసనాన్ని సన్నత్ అంటారు. గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే చాకలి కులపెద్దను కలిసి ఈ రాగిసన్నత్ అతనికి చూపించి త్యాగం ఖరారు చేసుకుంటారు. తర్వాత కులపెద్దలు ఒక చాపలో ఉత్తరం లేదా తూర్పు వైపు ముఖం ఉండే విధంగా కూర్చొని రాగిసన్నత్ పైన కుడిచేయి ఉంచగా మాసయ్య వారికి బొట్టుపెట్టి దీవనార్తి పెడతారు. ఈ విధంగా అందరు కులపెద్దలకు చేస్తాడు మాసయ్య. 'త్యాగం' అంటే మాసయ్యకు హక్కు కింద చాకలివారు ఇచ్చే డబ్బు లేదా ధాన్యం అని అర్థం. కథ మొదలుపెట్టే ముందు స్నానం చేసి శుచిగా రంగస్థలం వద్దకు వచ్చి ఊదుబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ప్రేక్షకులకు కుంకుమ బొట్లు పెట్టి ఓంకార్ విరాట్తో కథ ప్రారంభిస్తారు. ఓంకార్ విరాట్ సృష్టికర్త, భూమి, ఆకాశం, చిమ్మచీకట్లో ఉన్నపుడు ఓంకార్ విరాట్ మిణుగురు పురుగుగా అవతరిస్తాడు. ఈయనకు ఎడమ వైపుగా ఆది మహాశక్తి వెయ్యి హస్తాలతో, వెయ్యి ఆయుధాలతో నిలబడి ఉండగా.. కుడివైపున ఆది బసవేశ్వరుడు ఉంటాడు. ఈ విధంగా ప్రారంభమైన శివపురాణానికి సంబంధించిన కథలు ఒక క్రమపద్ధతిలో చెప్పబడుతుంటాయి. వీరి కథలు వినడానికి చాకలివారే కాదు.. అన్ని కులాలవారు వీలును బట్టి వస్తుంటారు. కథ చెప్పడం పూర్తయిన తర్వాత మంగళహారతిలో ప్రేక్షకులు డబ్బులు వేసి మాసయ్యల వద్ద దీవెన పొందుతారు.<noinclude><references/></noinclude> t2dzzlrnmznbhhns4jsh9ytkkrym4tu పుట:పటం కతలు.pdf/141 104 212037 552559 2026-04-10T05:22:43Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '124 పటం కతలు ప్రస్తుతం మాసయ్య కథకులు చాలా తక్కువ మంది ఉన్నారు. కళకు సరైన ఆదరణ లేకపోవడంతో తమ పిల్లలకు ఈ కథను నేర్పించలేకపోతున్నారు. చాకలి కులం వారి పురాణం చెపుతూ వారి సంస్కృత...' 552559 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>124 పటం కతలు ప్రస్తుతం మాసయ్య కథకులు చాలా తక్కువ మంది ఉన్నారు. కళకు సరైన ఆదరణ లేకపోవడంతో తమ పిల్లలకు ఈ కథను నేర్పించలేకపోతున్నారు. చాకలి కులం వారి పురాణం చెపుతూ వారి సంస్కృతిని పరిరక్షిస్తున్న మాసయ్యలకు దాతృకులం ఆదరణతో పాటు.. ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరం. అప్పుడే ఇలాంటి కళలు అంతరించిపోకుండా ఉంటాయని చెప్పవచ్చును. - డా॥ చూరేపల్లి రవికుమార్<noinclude><references/></noinclude> 3aetingqhfsjg56fzagbhzb7i80xeyy పుట:పటం కతలు.pdf/142 104 212038 552560 2026-04-10T05:23:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '14. పెక్కర్ల పటం కత శూ న్యంలోంచి కుండ ఆకారాన్ని ఊహించి దాన్ని మట్టి ఆధారంగా రూపొందించిన సృష్టికారుడు గుండ్ర బ్రహ్మ. అపూర్వ సృజనశీలుడు. ఈయన మట్టితో పాత్రలని తయారు చేయడం వృత్...' 552560 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>14. పెక్కర్ల పటం కత శూ న్యంలోంచి కుండ ఆకారాన్ని ఊహించి దాన్ని మట్టి ఆధారంగా రూపొందించిన సృష్టికారుడు గుండ్ర బ్రహ్మ. అపూర్వ సృజనశీలుడు. ఈయన మట్టితో పాత్రలని తయారు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు. కుండను తయారుచేయడంతో మానవ నాగరికత వికాసం పొందింది. హిందూ సంస్కృతిలో కుండ అత్యంత ప్రాధాన్యం పొందింది. కర్మకాండల్లో కుండకు ఇస్తున్నంత విలువ మరేపాత్రకూ ఇవ్వడం లేదు. మనిషి పుట్టినప్పుడు 'మాయికుండ' అవసరమైంది. పెళ్ళికి 'ఐరోండ్లు కుండలు' అవసరం. మనిషి చనిపోయి నప్పుడు “పిందకుంద” ఇంకా అవసరం. ఇంకా సమాజంలో మానవులు ఎన్నో పనులకు కుండను ఉపయోగిస్తున్నారు.<noinclude><references/></noinclude> 1r82jkcyccld26kqqcbe7n51bonq0uq పుట:పటం కతలు.pdf/143 104 212039 552561 2026-04-10T05:23:18Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '126 పటం కతలు కుమ్మరి జాతిమూల పురుషుని చరిత్రను వివరించేది 'కుమ్మరి పురాణం'. శాలివాహన శకం ప్రారంభం కుమ్మరి సామాజిక వర్గంలో పుట్టిన మైసూరురాజువల్ల ఏర్పడింది. వృత్తి పురాణాల్...' 552561 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>126 పటం కతలు కుమ్మరి జాతిమూల పురుషుని చరిత్రను వివరించేది 'కుమ్మరి పురాణం'. శాలివాహన శకం ప్రారంభం కుమ్మరి సామాజిక వర్గంలో పుట్టిన మైసూరురాజువల్ల ఏర్పడింది. వృత్తి పురాణాల్లో కుమ్మరి పురాణానికి ఎనలేని గౌరవం ఉంది. శాలివాహన శకారంభం కూడ కుమ్మరి జాతి విజయానికి సంకేతంగా నిలిచింది. క్రీ.శ. 78లో ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుని ఓడించిన ఘనచరిత్ర శాలివాహనులకే దక్కింది. అపూర్వమైన కుండను సృష్టించిన వృత్తి చరిత్రతోపాటు చారిత్రక పురుషుడు శాలివాహనుడికి సంబంధించిన చరిత్ర, సంస్కృతులను ఈ కుమ్మరి పురాణం వివరిస్తోంది. ఈ కుమ్మరి పురాణం కథాగానం “పెక్కరులు” అనే ఆశ్రిత కులాలవారు చేస్తున్నారు. ఈ పురాణానికి చిత్రపటం మాధ్యమంగా ఉపయోగించుకుంటారు. తబల, హార్మోనియం, తాళాల సహకారంతో యక్షగాన సాహిత్యరూపకంలో కథాగానం చేయడం విశేషం. బుర్రకథ లాంటి వివిధ సాహితీ ప్రక్రియల్లో కూడా ఈ కుమ్మరి పురాణం చెప్పబడుతూ వస్తోంది. కుమ్మరి వాళ్ల ఆవిర్భావం ఆదిశక్తి పురాణగాథలో ఆమె దహనం అయిన తరువాత ఆ చితాభస్మం నుంచి సరస్వతి, లక్ష్మి, పార్వతులకు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులతో జరగబోయే వివాహానికి “ఐరోని” కుండలు అవసరమైనాయి. ప్రతిభగల పౌలస్త్యబ్రహ్మని ఏరోని కుండలను చెయ్యమని దేవతలు నియమించారు. ఆయన కొడుకే గుండ్యబ్రహ్మ. ఆయనే శివపార్వతుల వివాహానికి ఐరోని (అరివెలి) కుండలను తయారుచేసి అందిస్తాడు.<noinclude><references/></noinclude> af5b1j7g753nak8b55hcsr36frpnzmd పుట:పటం కతలు.pdf/144 104 212040 552562 2026-04-10T05:23:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 127 ఈ పురాణ కథ బీజం పౌరాణిక సంబంధమైన శివపురాణంలో మిళితమై ఉంది. చారిత్రకంగా శాలివాహనుని విజయంతో ఈ పురాణం పరిసమాప్తం అవుతుంది. కుమ్మరిజాతి మూలపురుషునిగా ఆయనను గుర్త...' 552562 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 127 ఈ పురాణ కథ బీజం పౌరాణిక సంబంధమైన శివపురాణంలో మిళితమై ఉంది. చారిత్రకంగా శాలివాహనుని విజయంతో ఈ పురాణం పరిసమాప్తం అవుతుంది. కుమ్మరిజాతి మూలపురుషునిగా ఆయనను గుర్తించడంవల్ల దీనికి శాలివాహన పురాణం అనికూడ పేరు వచ్చింది. కాలాన్ని లెక్కించే శకచరిత్ర కూడ శాలివాహన నామంతో ఆరంభం కావడం నాగరికతకు చిహ్నంగా నిలిచింది. వి కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆశ్రిత కులాలకు పెక్కర్లు అని పేరు పెట్టాడు. జన వ్యవహారాల్లో బాగా ప్రసిద్ధిపొందిన ఒక పురాణగాథ ఈ పెక్కర్ల వృత్తి ఆవిర్భావం గురించి వివరిస్తోంది. ఓరుగల్లు పట్టణంలో పూర్వం కుమ్మరి వృత్తివాడు కుండలు చేసుకునేందుకు రేగడిమన్ను తెచ్చి రాసిగా పోసుకున్నాడు. తోటి కుమ్మరివాడు ఆ రాశిలో నుంచి కొంత మట్టిని దొంగిలించాడు. ఇది తెలిసి వృత్తిదారులంతా కలిసి ఆ మట్టి దొంగను పట్టుకొని వెలివేసారు. అయితే ఆ రోజుల్లో సమాజం నుండి వెలివేసిన వారికి ఉపాధి చూపించడం కూడా ఒక ధర్మం. తమ కులంలో నుంచి విడిపోతున్న వారికి తమ కుల మూల పురుషుని యొక్క కుమ్మరి పురాణం కథాగానం చేయమని ఆజ్ఞాపించాడు. అయితే ఆ వెలివేసిన కులానికి ఏ పేరు పెట్టారో తెలియక కాకతీయ ప్రభువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆయన అక్కడికి వచ్చిన పెక్క జనాలతో చర్చించాడు. పెక్కండ్రు కూడి పేరు పెట్టినందువల్లె వారికి పెక్కండ్రు అనే నామం కలిగింది. వారికి ప్రతాపరుద్రుడు మిరాశీ హక్కులను కల్పిస్తూ రాగి శాసనాల్లో రాసిచ్చాడు. కుమ్మరి జాతి పురాణగాథ ఈ పురాణకథ ప్రారంభంలో జగత్ సృష్టి గురించిన ఆదిపురాణం అంతా చెప్పబడుతుంది. భూమి, ఆకాశం, నీరు, వాయువులేని చీకటిలో ఓంకార శబ్దం పుట్టి అందులో నుంచి ఆదిశక్తి అవతరిస్తుంది. ఆమె త్రిమూర్తులకు జన్మనిస్తుంది. అయితే ప్రేమ పేరున తన కోరికను కాదన్నందుకు బ్రహ్మ, విష్ణువులని త్రినేత్రంతో భస్మం చేస్తుంది. శివునివంతు వచ్చేసరికి, ఆయన బాగా ఆలోచించి ఆదిశక్తి దగ్గర నుండి త్రినేత్రాన్ని కానుకగా పొంది ఆమెని భస్మం చేస్తాడు. ఆ<noinclude><references/></noinclude> 0jne040qei06r56jn2wpdl2ddrovtke పుట:పటం కతలు.pdf/145 104 212041 552563 2026-04-10T05:23:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '128 పటం కతలు చితాభస్మం నుంచి జన్మించిన సరస్వతి, లక్ష్మి, పార్వతులను త్రిమూర్తులు వివాహం చేసుకోబోతారు. సనాతన సంప్రదాయం ప్రకారం పెళ్ళికి ఐరోని కుండలు కావలసి వస్తుంది. దాన్ని...' 552563 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>128 పటం కతలు చితాభస్మం నుంచి జన్మించిన సరస్వతి, లక్ష్మి, పార్వతులను త్రిమూర్తులు వివాహం చేసుకోబోతారు. సనాతన సంప్రదాయం ప్రకారం పెళ్ళికి ఐరోని కుండలు కావలసి వస్తుంది. దాన్ని తయారు చేసే జ్ఞానం పౌలస్యబ్రహ్మకు ఉంది. ఆయనకు జన్మించిన గుండ్యబ్రహ్మ కుండపాత్రను తయారు చేసి ఇస్తాడు. ఆయన ప్రజ్ఞను మెచ్చుకొని దేవతలంతా సూర్యవతితో పెళ్ళి చేయిస్తారు. ఆయన సమాజం కోసం కుమ్మరి వృత్తిని సాగిస్తాడు కాని, ఆయనకు పుత్ర సంతానం కలుగలేదు. “న పుత్రస్య గతిర్నాస్తి" అంటూ చింతిస్తుంటే, ఆయనకి శివుడు జంగమరూపంలో దర్శనమిచ్చి సంతానభాగ్యం కలిగించాడు. ఆమె దైవస్వరూపురాలు నాగవతి. ఆమె కన్యప్రాయంలో ఉండగానే నాగేంద్రుడు కలలో కనిపించి సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఆయనే కారణజన్ముడు శాలివాహనుడు. శాలివాహనుడు ప్రతిష్ఠానపురంలో దిన దిన వర్ధమానమవుతున్న తరుణంలో ఉజ్జయినిని ఏలుతున్న విక్రమార్కునికి అపశకునాలు ఎదురవుతాయి. తనకు శత్రువు పుట్టి పెరుగుతున్నట్టుగా కలగంటాడు. శత్రువుని వెతికి బంధించమని గూఢచారుల్ని పంపిస్తే వారు పట్టణాలన్నీ వెదుకుతూ ప్రతిష్ఠానపురం చేరుకొని శాలివాహనుణ్ణి బంధించబోయి మరణిస్తారు. ఈ విషయం తెలిసి విక్రమార్కుడు స్వయంగా వేల సైన్యంతో దండెత్తిరాగా శాలివాహనుడు శివుని ప్రార్థించి మాయావిభూతి వరంగా పొందాడు. అంతకుముందు తాను చేసిన మట్టి ఏనుగులు, గుర్రాలు, సైన్యం, ఆయుధాలు కుమ్మరి వాములో పెట్టి వాటిమీద మాయ విభూతి చల్లగానే అవి ప్రాణం పోసుకొని శత్రుసైన్యం మీదపడి విక్రమార్కుణ్ణి ఓడిస్తాయి. బందీగా చిక్కిన విక్రమార్కుడు కుమ్మరవాముని వాహనంగా చేసుకొని వచ్చావు. కాబట్టి "శాలివాహనుడివి”, మృణ్మయ ఆధారంగా సైన్యాన్ని తయారుచేసుకొని వచ్చావు గనుక ఉజ్జయిని నగరాన్ని “మహిమాసూరి"గా పాలించమని తనువు చాలిస్తాడు.<noinclude><references/></noinclude> qhch7l0aj3fea7g7o348jhemcrqu6k2 పుట:పటం కతలు.pdf/146 104 212042 552564 2026-04-10T05:24:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 129 సాహిత్యాంశాలు చిత్రపటం ఆధారంగా ప్రదర్శింపబడుతున్న కుమ్మర పురాణంలోని సాహిత్యం సన్నివేశానికి తగిందిగానే కనిపిస్తోంది. సంతాన లేమితో కుమిలిపోతున్న గుండ్యబ్రహ్...' 552564 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 129 సాహిత్యాంశాలు చిత్రపటం ఆధారంగా ప్రదర్శింపబడుతున్న కుమ్మర పురాణంలోని సాహిత్యం సన్నివేశానికి తగిందిగానే కనిపిస్తోంది. సంతాన లేమితో కుమిలిపోతున్న గుండ్యబ్రహ్మ, సూర్యవతులకు జంగమ రూపంలో శివుడు సంతానమిచ్చిపోతాడు. గుండ్యబ్రహ్మ కూతురిని తొట్టెలో పడుకోబెట్టినప్పుడు ఆమెకు ఎండ తాకకుండా నాగశేషు తన పడగను గొడుగుగా పట్టినతీరు చూసి దడుసుకొన్నారట. ప్రాణాలరచేతిలో పెట్టుకొని “భయమును చెందినిటు యిరుగువారిని, గ్రామంలోనివారికి రయమున రమ్ము రమ్మనుచు నెయ్యము రచ్చకు చేరియు కేకలేయ యిదియేమి వింతయని యావూరివారలు తరలి వచ్చి, నిశ్చయముగ నాగసర్పము చంపగ సంశయ మొందుచుండగను"న్నారంటూ వర్ణించి మనకి గగుర్పాటుని కలిగిస్తాడు. శాలివాహనుడు తన జన్మరహస్యం తెలుసుకొనేప్పుడు కథకుడు “ఒక బాలపడుచుకు ఒక భోగిపరుండు, తెలియక వర్తించే గర్భంబు నిలిచే, వీపు పుట్టితి వీవసుధలోన వీరింట కుమ్మరివారంట పెరుగ” అని వృత్తి గుర్తింపుని విశదపరుస్తాడు. విక్రమార్కుడు గూఢచారులని పంపించే ఘట్టం ఆసక్తి రేకించే ఘట్టంగానే పేర్కొంది. "దేశ దేశాలలో తిరుగుతూ ప్రతి యూరనుండు కుమ్మరిండ్ల నౌకటి రెండు నాడులు వరుసగ, నివశించి యచ్చోటగల వార్తలరసి రమ్ము” అని వర్ణించేది ప్రజల నుంచి ఎదిగే పాలకులమీద పెట్టే వేగుల వ్యవస్థలా కనిపిస్తోంది. జానపదులు విశ్వసించే ఉత్పాతాలను కవి చక్కగా వర్ణించాడు. సందర్భమేదంటే, విక్రమార్కుడు, మహాకాళి గురించి ఘోరతపస్సు చేసి మెప్పించి, ఒక సంవత్సరం, ఒక దినం వయస్సు కన్యకు పుట్టిన బాలునిచేత మరణం సంభవించాలని వరం పొందాడు.<noinclude><references/></noinclude> tnfj5332efslwnr1cka21xhgjk92165 పుట:పటం కతలు.pdf/147 104 212043 552565 2026-04-10T05:24:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '130 పటం కతలు బాలుడు శాలివాహనుడు పుట్టిన సందర్భంలో "భూపాలుందు పాలింపగా తత్పూర్వర్ణిత పుణ్యభోగముల కుత్సార్యత సంపాదులై యుత్సాతంబులు పుట్టె నుజ్జయినిలో నుల్కాది లక్ష్యంబుల...' 552565 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>130 పటం కతలు బాలుడు శాలివాహనుడు పుట్టిన సందర్భంలో "భూపాలుందు పాలింపగా తత్పూర్వర్ణిత పుణ్యభోగముల కుత్సార్యత సంపాదులై యుత్సాతంబులు పుట్టె నుజ్జయినిలో నుల్కాది లక్ష్యంబులై" అంటూ కవి ఉత్పాతాలని ప్రస్తావించాడు. కారణజన్ముడు శాలివాహనుని జననాన్ని గుండ్య బ్రహ్మ కూతురు "ఇద్ది ఏటిపై యొకదినం బేగుచో నాగేంద్రుడు ఈ పాపకూడిన నితడు పుట్టె, దీని కారణంబు దేవరకాక మొండెవ్వడెరుగునం" అంటూ సెలవిచ్చాడు. - నేతి మాధవి<noinclude><references/></noinclude> kmr645r4mtx6q5h3mhc6cyz6d64oe2h పుట:పటం కతలు.pdf/148 104 212044 552566 2026-04-10T05:24:47Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '15. పూజరి పటం కత ద కనీఠభూమిలో గోండ్వాన ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. అదిలాబాద్ జిల్లా నుండి అటువైపు సాత్పురా పర్వతాల వరకు అనేక గిరిజన సమూహాలు గొండ్వాన అడవులలో మనుగడలో ఉన్నాయ...' 552566 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>15. పూజరి పటం కత ద కనీఠభూమిలో గోండ్వాన ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. అదిలాబాద్ జిల్లా నుండి అటువైపు సాత్పురా పర్వతాల వరకు అనేక గిరిజన సమూహాలు గొండ్వాన అడవులలో మనుగడలో ఉన్నాయి. వీరిలో గోండు గిరిజనులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఆదిమ గిరిజన తెగ గోండులకు సంబంధించిన వారే కోయ. కోలాం, నాయక పోడు, ప్రధాన్, తోటి తదితర తెగలుగా పరిశోధకులు గుర్తించారు. వీరిలో గోండు, కోయగిరిజనులు కోయిత్తూర్ భాషా కుటుంబానికి చెందిన వారు కాగా కోలాంలు, నాయక పోడు గిరిజనులు మాట్లాడే భాషకు దగ్గరి సంబంధం ఉంది. కాని ఏ కారణంగానో నాయకపోడు గిరిజనులకు వారి భాష వినియోగంలో లేదు. నాయకపోడు గిరిజనులు తెలుగుభాషనే మాట్లాడుతూ ఉంటారు. నాయకపోడు గిరిజనులనే పద్మనాయక గిరిజనులని అంటారు. వీరు ఒకప్పడు అదిలాబాద్లో ఉన్న వారే అయినప్పటికీ తరువాత కాలంలో<noinclude><references/></noinclude> outvihcnbh39prcnbmpjg8pgaz5cbne పుట:పటం కతలు.pdf/149 104 212045 552567 2026-04-10T05:25:05Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '132 |ü≥+ ø£‘·T' 552567 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>132 |ü≥+ ø£‘·T<noinclude><references/></noinclude> lpumt2z2x66kspmmu3oppwsj08mxspf పుట:పటం కతలు.pdf/150 104 212046 552568 2026-04-10T05:25:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 133 వరంగల్, ఖమ్మం, భద్రాచలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలోని అడవులలో ఉంటున్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అదిలాబాద్ అడవులు ఏలాంటి ప్రాముఖ్యత గలవో అదే విధంగా గోం...' 552568 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 133 వరంగల్, ఖమ్మం, భద్రాచలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలోని అడవులలో ఉంటున్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అదిలాబాద్ అడవులు ఏలాంటి ప్రాముఖ్యత గలవో అదే విధంగా గోండు, కోలాం నాయకపోడు గిరిజనులు కూడా అలాంటి వైవిధ్యభరితమైన సామాజిక సాంస్కృతిక జీవితం గలవారే. గోండు గిరిజనులు ఇప్పటికీ అదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా నివసిస్తున్నారు. అదిలాబాద్లో గోండులతో పాటుగా ఉంటున్న ఆదిమ గిరిజన తెగలలో గోండులకు కథలు చెప్పే ప్రధాన్, తోటి గాయకుల తెగలు ఉన్నాయి. గోండులను ఆశయించి ఉంటూ వారికి పూజారులుగా ప్రధానులు లేదా పర్దాన్లు ఉంటున్నారు. ప్రధానులను పటాడి అని కూడా అంటారు. పటాలు గోండులు రాజులుగా ఉన్న సమయంలో మంత్రులుగా పనిచేశారని అంటారు. ప్రస్తుతం గోందుల వంశచరిత్రలు పాడుతుంటారు. తోటి వాళ్ళు కూడ గోండుల కులపురాణ కథలు పాడుతారు. అదే విధంగా గోండుల మాదిరిగానే నాయకపోడు గిరిజనులు కూడా ఒకప్పడు రాజ్యాలు పాలించారని వారి కథలను బట్టి తెలుస్తుంది. నాయకపోడు గిరిజనులకు కూడా కొర్రాజులు, పూజరులు, గురువులు (కోలుకానివాడు) అనబడే కథాగాయకులు ఉన్నారు. కొర్రాజులు పూర్వం ఒక ప్రత్యేక కథగాన సాంప్రదాయానికి చెందిన వారు. కాని ప్రస్తుతం నాయకపోడు గిరిజనుల లాగే అదిలాబాద్ జిల్లా నుండి వలసవచ్చిన తోటివారు ములుగు కటాక్షపూర్లో ఉంటూ కొర్రాజులుగా నాయకపోడులకు కతలు చెప్తారు. వీరు నాయకపోదులు ఏవిధంగా పుట్టిందీ, లక్ష్మీదేవి వారిని ఏ విధంగా జీవించమని చెప్పిందీ, కొర్రాజులు పూజరివారు ఏ విధంగా ఆవిర్భవించిందీ చెప్తారు. వీరు చెప్పే పద్మనాయక వృత్తాంతం కథను బట్టి, ద్వాపరయుగంలో భూమిపై రాక్షసులు పెట్టే బాధలు భరించలేక భూదేవి శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకొనగా శ్రీమహావిష్ణువు తాను శ్రీకృష్ణుడిగా అవతరించి లోకకళ్యాణం చేస్తానని అంటాడు. ఈలోపున లక్ష్మీదేవిని సాంబవుని పట్నంలో అవతరించి తన కోసం ఎదురు చూడమని చెప్తాడు. ఆ విధంగా సాంబవుని పట్నం (శ్రీశైలం)లోని వెండిగుడిలో శ్రీమహాలక్ష్మీదేవి అవతరించినప్పడు లక్ష్మీదేవి చెమట చుక్కలు పద్మములపై పదగా పద్మనాయకులు జన్మించారట. ఆ తరువాత లక్ష్మీదేవి ఆజ్ఞమేరకే ఈ ఐదుగురు సోదరులు అదవులలో పోడు వ్యవసాయం చేసి జీవిస్తారు. పద్మనాయక గిరిజనులపై<noinclude><references/></noinclude> 0nn1pnohxxu6icyo35i0qk5n9z2pqfd పుట:పటం కతలు.pdf/151 104 212047 552569 2026-04-10T05:25:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '134 పటం కతలు పన్ను విధించడానికి పొందురాజు సైన్యాన్ని పంపుతాడు. ఆ విధంగా పాండవులతో వీరికి సంబంధం ఏర్పడుతుంది. అలాంటి పురాతన పౌరాణిక చరిత్రగల పద్మనాయకులు ఇప్పుడు నాయకపోడులు...' 552569 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>134 పటం కతలు పన్ను విధించడానికి పొందురాజు సైన్యాన్ని పంపుతాడు. ఆ విధంగా పాండవులతో వీరికి సంబంధం ఏర్పడుతుంది. అలాంటి పురాతన పౌరాణిక చరిత్రగల పద్మనాయకులు ఇప్పుడు నాయకపోడులుగా పిలువబడుతున్నారు. ఒకప్పడు అదిలాబాద్ జిల్లాలో ఉన్న నాయకపోడుగిరిజనులు ఆ తరువాత మాత్రం గోదావరి నది వెంట విస్తరిస్తూ వరంగల్, ఖమ్మం జిల్లాలోని అడవులలో ఉంటున్నారు. నాయకపోడులు (పద్మనాయకలు) అనే ఈ గిరిజన తెగకు ఆశ్రితులుగా కొర్రాజులు, పూజారి వాళ్ళు మిరాశి కులంగా ఉంటూ వీరికి సంబంధించిన కతలు చెబుతున్నారు. పద్మనాయకులకు ఆశ్రితులైన వీరిని వరంగల్ జిల్లాలో పూజారి వారని పిలుస్తున్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో వీరిని గురువులని, కరీంనగర్ జిల్లాలో అయితే కోలకాని వారని అంటారు. భూపాలపల్లిజిల్లాలోని నేరేడుపల్లిలో రాంపురం, అడవికమలాపురం గ్రామాలలో ఉంటున్నారు. ప్రదర్శనా కతలు వీరు నాయకపోడు గిరిజనుల పుట్టుకకు సంబంధించిన కులపురాణమైన పద్మనాయక వృత్తాంతం చెప్తారు. దీంతో పాటుగా మహాభారతంలోని జూదపర్వం, విరాటపర్వం, పాండవ వనవాసం, గయోపాఖ్యానం, శశిరేఖ పరిణయం, కీచకవధ, సుభద్రా కళ్యాణం, ఉత్తరగోగ్రహణం, కర్ణుని పెళ్ళి, సహదేవకళ్యాణం మొదలైన కథలు చెబుతారు. వ్యాసభారతంలోని మహాభారతం, నన్నయ తిక్కన ఎర్రన్న అనువదించిన తెలుగు మహాభారతం కథకు వీరుచెప్పే మహాభారతం కథలకు ఎంతో వైవిధ్యం కన్పిస్తుంది. కర్ణుని పెళ్ళి చేయడానికి ధర్మరాజు ఎంతో కృషి చేస్తాడు. అదే విధంగా భీష్ముడు, కర్ణుడు, అర్జునుడితో కలిసి నందిగామరాజుతో యుద్ధం చేస్తారు. కాబట్టి ఎంతో అపురూపమైన సాహిత్య విస్తీర్ణత వీరి కథలలో కనపడుతుంది. వీటితో పాటు ఉల్ఫా కథలను కూడా చెపుతారు. పూజరికుల పుట్టుక పాండురాజు మాద్రిని కల్యాణమాడి వచ్చేటప్పడు దారిలో శబ్దభేది బాణం ఉపయోగించడం వల్ల తనకు తెలియకుండానే లేడి దంపతులలో ఒకటి చనిపోతుంది. మరొక లేడి పాండురాజును శపిస్తుంది. లేడిని కొట్టిన శాపం నుండి తప్పించుకోవడానికి సురుసుంగ పర్వతాన తపస్సు పడతాడు. ఆ శాపవిమోచనం కావాలని పాండురాజు<noinclude><references/></noinclude> t4mn7ayhmplebuif2h9e8ajgbzzxdyp పుట:పటం కతలు.pdf/152 104 212048 552570 2026-04-10T05:25:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 135 తపస్సు చేస్తుందగా అతని భార్యలు కుంతీదేవి, మాద్రిలు ఆ ఎందలో భర్తతో పాటు తపస్సు పట్టలేక పోతారు. "నాధా ప్రాణేశ్వరా మేము ఎక్కడన్న పోయి ఏ దేవునికన్నా పూజలు చేసి సంతాన...' 552570 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 135 తపస్సు చేస్తుందగా అతని భార్యలు కుంతీదేవి, మాద్రిలు ఆ ఎందలో భర్తతో పాటు తపస్సు పట్టలేక పోతారు. "నాధా ప్రాణేశ్వరా మేము ఎక్కడన్న పోయి ఏ దేవునికన్నా పూజలు చేసి సంతానం పొందుతాం" అని భార్యలిద్దరూ పాండురాజును అడుగుతారు. “సరే భామలారా అలాగే వెళ్ళండి", అంటాడు పాండురాజు. కుంతీదేవి, మాద్రిలు ఒక శివాలయానికి వెళ్ళి దేవాలయంలో పేరుకున్న ఏనుగ పల్లేరుకాయలు ఎత్తిపోసి శుభ్రం చేస్తారు. నీటితో శివలింగాన్ని శుద్ధిచేసి వాళ్ళు పూజలు చేస్తారు. కుంతి, మాద్రిలు ఆ విధంగా శివున్ని పూజించి నిద్రపోతారు. అప్పడు శంకరుడు కుంతిదేవి కలలోకి వచ్చి "అమ్మా చెల్లెలా కుంతీదేవి నీవు ఇక్కడ ఎన్ని పూజలు చేసినా వ్యర్ధమే కాని ఒక్కమాట విను నీకు సంతాన భాగ్యం లేదు కాని కొంత కృషి చేస్తే నీకు సంతానం దక్కుతుంది" అని సెలవిస్తాడు. అయితే ఇందుకోసం చాలా కష్టపడాలి. ఏడేడు సముద్రాల అవతల యమగండ దుస్స ఉంటుంది. ఆ దుస్సలోపలికి నీవు మాద్రితో పాటు పోయి ఒక్కొక్కరూ ఏడుపిడికిళ్ళు చొప్పన దుస్స ధాన్యం అంటే పద్నాలుగు పిడికిళ్ళ దుస్స ధాన్యం తీసుకుని సేకరించి తెచ్చుకుంటే నీకు సంతానం కలుగుతుంది. దుస్సవడ్లను గోటితో వోలవాలి, మోచేతితో పోటు పెట్టాలి, అరచేతితో చెరగాలి, ఏటి అడుగున మట్టి తీసుకు వచ్చి ఆ మట్టితో చల్లగురిగిని చేసి అందులో పాశం వండి సప్తకోటి మునులకు భోజనం పెట్టాలి. అట్లయితేనే నీకు సంతానం ఇస్తానంటాడు శంకరుడు. అప్పుడు కుంతీదేవి, మాద్రి ఇద్దరు ఏడేడు సముద్రాలు దాటి వెళ్తారు. అక్కడ వారికి దారి కన్పించక ఈ గంగను దాటి ఎలా వెళ్లాలని బాధపడుతూ శ్రీకృష్ణున్ని ప్రార్ధిస్తారు. శ్రీకృష్ణుడు గరుడవాహనం (గరుత్మంతుడు) పంపిస్తాడు. గరుత్మంతుడు వచ్చి కుంతీదేవిని, మాద్రిదేవిని తీసుకుని వెళ్ళి యమదుస్సగడ్డి ఉన్న చోట దించుతాడు. కుంతీదేవి, మాద్రి ఇద్దరు యమదుస్సను తెంపుతుంటే రంపాలతో కోసినట్లు కోసుకుంటాయి. వారు రక్తం కారిన తమ చేతులను చూసి ఏడుస్తుంటారు. ఆ సమయంలోనే మాతంగ మహాముని అటువైపు వచ్చి కుంతీదేవి, మాద్రి ఇద్దరిని చూస్తాడు, “అమ్మ నాకు ఒకకోరిక ఉంది, ఇక్కడ నేను ఒక్కడినే మగవాడిని ఉన్నాను. ఈ దుస్సవడ్లకు నేనే కావలిగా ఉన్నాను. మీరు ఎలాగూ ఈ దుస్సవడ్లను దుయ్యలేరు. కానీ నాకు ఒక భార్య కావాలి" అంటాడు. అప్పుడు కుంతీదేవి, మాద్రిలు “సరే అయ్యా మా అన్న శంకరుడు ఉన్నాడు. అతనికి చెప్పి<noinclude><references/></noinclude> 7y43wd0chi4gyntbwwcboyi3ukmogmq పుట:పటం కతలు.pdf/153 104 212049 552571 2026-04-10T05:26:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '136 పటం కతలు నీ కోరిక నేరవేర్చే ప్రయత్నం చేస్తాం” అంటారు. అదే విధంగా శంకరుడిని ప్రార్ధించగా శంకరుడు ప్రత్యక్షమవుతాడు. కుంతీదేవి, మాద్రిలు శంకరునికి మాతంగ ముని కోరికను విన్...' 552571 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>136 పటం కతలు నీ కోరిక నేరవేర్చే ప్రయత్నం చేస్తాం” అంటారు. అదే విధంగా శంకరుడిని ప్రార్ధించగా శంకరుడు ప్రత్యక్షమవుతాడు. కుంతీదేవి, మాద్రిలు శంకరునికి మాతంగ ముని కోరికను విన్నవిస్తారు. అప్పడు శంకరుడు మాతంగమునీశ్వరా నీకు భార్యకావాలా అందుకే దుస్సధాన్యం కోసం వచ్చిన మా చెల్లెండ్ల చేతులకు రక్తం వచ్చేలా యమగండదుస్సకు రంపాలు సృష్టించావా అంటూ తన నొసటన ఉన్న విభూతి తీసి యమగండదుస్స మీద వేస్తాడు. అప్పడు యమగండ దుస్సను పగలగొట్టుకుని పద్మగంధి పుడుతుంది. శంకరునికి నమస్కరిస్తుంది. శంకరుడు అమ్మా పద్మగంధి ఇదిగో నీ భర్త మాతంగమునీశ్వరుడు అంటూ అప్పజెప్పి ఆశీర్వదించి అదృశ్యమవుతాడు. పద్మగంధి మాతంగమునీశ్వరులు సుఖంగా దంపతులుగా జీవిస్తుంటారు. కొన్నాళ్ళ తరువాత వారికి నలుగురు కుమారులు జన్మిస్తారు. వారు ఉత్తంగుడు, మాతంగుడు, అర్జన్న, భీమన్న, వీరే పాండవ పద్మనాయకులు లేదా పాండవ ప్రభున్నాయకులు. ఈ పాండవ ప్రభున్నాయకులు ఒకరోజు చాలామందితో కలిసి కోలాటం ఆడుతుంటారు. తల్లియైన పద్మగంధి కొడుకులను పిలుస్తుంది. అయితే ఉత్తుంగుడు, మాతంగుడు, అర్జున్న వెంటనే వస్తారు. కానీ భీమన్న మాత్రం రాకుండా కోలాటం ఆడుతూనే ఉంటాడు. అప్పుడు పద్మగంధి ఒరే భీమన్న రేపు నాకు ఏదైనా ఆపద వచ్చి పిలిచినా అంతేనా నా పిలుపును పట్టించుకోకుండా నేను పిలిచినా రాకుండా అట్లాగే కోలాటమే శాశ్వతమన్నట్లు ఆడుతున్నావు కాబట్టి నీవు కులం మీద కోలకానివాడై అయిపోదువు గాక అంటూ శపిస్తుంది. భీమన్న భయపడి అమ్మా నన్ను శపించావు కదా మరి నా ఆదెరువు ఏమిటి నేనెలా జీవించాలి. అని అడుగుతాడు. లేదు నాయనా నీవు మాతోనే ఉంటావు కానీ నిన్ను కోలకాడు అని పిలుస్తారు అని పద్మగంధి అంటుంది. భీమన్న మాత్రం లేదమ్మా ఎప్పటికైనా నన్ను కోలుకాదని ఎగతాళి చేస్తుంటారు నా అన్నదమ్ములు నన్ను ఎత్తిపొడుస్తుంటారు. కాబట్టి నేను వేరే ఎక్కడికైనా పోయి ఉంటాను కానీ నేను ఎలా జీవించాలో చెప్పు అని అంటాడు. నాయనా నీవు కూర్చుంటే కులస్తునివి లేస్తే అస్తివానివి కాబట్టి నేను నిన్ను అడివానిగా స్వీకరిస్తున్నాను ఇదిగో నీవు నాయకపువారి ఇండ్ల మద్యనే ఉంటూ బతుకు అని పద్మగంధి చెప్తుంది. పద్మగంధి పారిటాకుల మీద పటం రాసి రాగి శాసనం మీద భీమన్నపేరు<noinclude><references/></noinclude> n189etiherrf5ltvv9sm2d51imc9n9d పుట:పటం కతలు.pdf/154 104 212050 552572 2026-04-10T05:26:28Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 137 కొట్టించి భీమన్నకు ఇచ్చి నాయకపువారికి రాగి శాసనం చూపించి ఈ పటంతో మన పెద్దలైన పాండవుల కథ చెప్పుకుంటూ బ్రతుకు అని ఆజ్ఞ ఇస్తుంది. ఆ విధంగా కోలకానివాడుగా వీరు కథలు...' 552572 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 137 కొట్టించి భీమన్నకు ఇచ్చి నాయకపువారికి రాగి శాసనం చూపించి ఈ పటంతో మన పెద్దలైన పాండవుల కథ చెప్పుకుంటూ బ్రతుకు అని ఆజ్ఞ ఇస్తుంది. ఆ విధంగా కోలకానివాడుగా వీరు కథలు చెప్పడం ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలో వీరిని పూజరి వాళ్లు అంటున్నారు. నాయకపు వాళ్లు లేదా పద్మనాయకుల దేవతలైన లక్ష్మీదేవి, భీమన్న, శ్రీకృష్ణుడు తదితర దేవతలను తీసుకుపోయి పూజించి పటం కథను చెప్తారు కాబట్టి పూజరి వారుగా కూడా పిలువబడ్డారు. నాయకపోడు వారికి సంబంధించిన దేవతల పురాణాలను చెప్తారు కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో గురువులుగా పిలువబడ్డారు. ప్రదర్శనలు నాయకపోడు గిరిజనుల వద్దకు వీరు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వెళ్లి కథలు చెప్పడం రివాజు. దీపావళి పండుగ వెళ్లిన తర్వాత తమ ఇండ్ల నుండి కథలు చెప్పడానికి బయలుదేరుతారు. పద్మనాయక గిరిజనులు ఉండే గ్రామాలకు పోయి నగారా కొట్టి అందరినీకూడగడతారు. కులం పెద్దని పిలిచి త్యాగం గురించి అడిగిన తర్వాత కథలు చెప్పడం ప్రారంభిస్తారు. ముందుగా పద్మనాయకుల కులపురాణ కథను ప్రదర్శిస్తారు. తర్వాతనే పాండవులకు సంబంధించిన విరాటపర్వం, పాండ వనవాసం, భీమార్జున యుద్ధం కథలను చెప్తారు. కథాప్రదర్శనలో ఐదుగురితో కూడిన కళాకారుల మేళం ఉంటుంది. వీరిలో ఇద్దరు ప్రధాన కథకులు కాగా మిగతా ముగ్గురు మద్దెల, హార్మోనియం, తాళ వాద్యాలతో సహకారం అందిస్తూ గాత్ర సహకారం కూడా ఇస్తుంటారు. కొర్రాజులు చెప్పే కథలకు వీరు చెప్పే కథలకు విభేదం తక్కువ. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందు, తిరిగి అయిటిపూనినంక రోహిణి మృగశిర కార్తెలో తమ ఇండ్లను చేరుకుంటారు. వర్షాకాలంలో కథలు చెప్పకుండా ఇంటిపట్టునే ఉంటారు. నాయకపోడు గిరిజనుల ఆర్ధిక పరిస్థితి కూడా వీరిపై ప్రభావం చూపుతుంది. కథలు చెప్పినందుకు త్యాగంగా వీరికి వచ్చే డబ్బుకూడా చాలా తక్కువ. రక్షించుకోవాల్సిన పరిస్థితి కానీ వీరి సంఖ్య ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వెళ్తున్నారు. ప్రస్తుతం రెడ్డబోయిన కృష్ణ, రెడ్డబోయిన సమ్మయ్యలు<noinclude><references/></noinclude> p6tnqxqn26mkaha1gn93qakh7mdqzu1 పుట:పటం కతలు.pdf/155 104 212051 552573 2026-04-10T05:26:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '138 పటం కతలు తమ కథాప్రదర్శనలో తమతోకూడా ఇతర కళాకారులైన కొర్రాజులు, కాకిపడిగెల వారికి సంబంధించిన సభ్యులను తమమేళంలో తాత్కాలికంగా కలుపుకుంటూ కథలు చెప్తున్నారు. ప్రస్తుతం పూజ...' 552573 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>138 పటం కతలు తమ కథాప్రదర్శనలో తమతోకూడా ఇతర కళాకారులైన కొర్రాజులు, కాకిపడిగెల వారికి సంబంధించిన సభ్యులను తమమేళంలో తాత్కాలికంగా కలుపుకుంటూ కథలు చెప్తున్నారు. ప్రస్తుతం పూజరి కళాకారులు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. కళారూపం కూడా పటంకథ స్థాయి నుండి బుర్రకథ సంప్రదాయానికి మారింది. ఆవిధంగా చూస్తే పూజరి కళారూపం పూర్తిగా అవసాన దశలో ఉందని చెప్పవచ్చు. ఈ కళారూపాన్ని, మరికొన్ని అంతరించిపోయే స్థితిలో ఉన్న కొర్రాజులు చెక్కబొమ్మలాట మొదలైనవాటిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ రక్షించుకోవలసిన జాబితాలో చేర్చుకోవాలి. సూచిథాలు 1. భక్తవత్సలరెడ్డి.ఎన్ (సంపాదకులు).. రాష్ట్రస్థాయి జానపదకకోత్సవాలు నల్గొండ (ప్రత్యేక సంచిక)(2001) జానపదగిరిజన విజ్ఞానపీఠం ప్రాంతీయ జానపద జీవనవనరుల అధ్యయన కేంద్రం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ 2. రమేష్ భట్టు, వెంకన్నగడ్డం (సంపాదకులు).. జానపదగిరిజన విజ్ఞాన జాతీయ సదస్సు పత్రాలు (2012) జానపదగిరిజన విజ్ఞానపీఠం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఓరుగల్లు ప్రాంగణం వరంగల్ ప్రచురణ 3. వెంకన్న గడ్డం.. పటంకథలు కథకులు (2011) భగత్ ప్రచురణలు హన్మకొండ 4. వెంకటేశ్వర్లు అట్లూరి.. వరంగల్ జిల్లా కాకి పడిగెల పటం కథలు (2011)మైత్రి ప్రచురణలు హన్మకొండ. - - అడ్లూరి శివప్రసాద్<noinclude><references/></noinclude> bjkdifkwy0ofbw9btwe0uouceswaxxw పుట:పటం కతలు.pdf/156 104 212052 552574 2026-04-10T05:27:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '16. తెరచీరల పటం కత వృ త్తి పురాణాల్లో మనకు కనిపించే 15 పటం కథల్లో తెరచీరల కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. యాదవ వంశంలో పుట్టిన చారిత్రక వీరుడు కాటమరాజు కథ ఇది. ఈ కథాగానం అరుదైం...' 552574 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>16. తెరచీరల పటం కత వృ త్తి పురాణాల్లో మనకు కనిపించే 15 పటం కథల్లో తెరచీరల కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. యాదవ వంశంలో పుట్టిన చారిత్రక వీరుడు కాటమరాజు కథ ఇది. ఈ కథాగానం అరుదైందే కాదు.. అద్భుతమైంది. కూడా. ఇందులో యదు వంశాన్ని కీర్తిస్తూ కృష్ణలీలలు ఇతివృత్తంతో యాదవ కళాకారులు గానం చేస్తారు. యాదవ పురాణాన్ని చెప్పేందుకు ఏర్పడిన ఎనిమిది మంది కళాకారులలో ఈ తెరచీరల వారు ఒకరు. 19వ శతాబ్ది నాటికే తెరబొమ్మల ప్రదర్శన కోసం ఈ కళారూపం ఏర్పడటం విశేషం. అంతేకాదు.. తెలంగాణలో ఈ కళాకారులని తెరచీర భక్తులని, యాదవపటం కథాకారులని పిలుస్తుంటారు. తెరచీరల చరిత్ర అన్ని ఆశ్రిత కళాకారులకు ఉన్నట్టే ఈ తెరచీరల వారికి కూడా చరిత్ర ఉంది. వీరు స్థిరమందుల వంశానికి<noinclude><references/></noinclude> cc5c72wbujdyci1nsfran14g9di9x3f పుట:పటం కతలు.pdf/157 104 212053 552575 2026-04-10T05:27:26Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '140 |ü≥+ ø£‘·T' 552575 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>140 |ü≥+ ø£‘·T<noinclude><references/></noinclude> ckze3qq4wrsknllxt9wwkptk72m4pct పుట:పటం కతలు.pdf/158 104 212054 552576 2026-04-10T05:27:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 141 చెందిన వారని జానపద పరిశోధకులు చెబుతున్నారు. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే స్థిరమందుల వారు పూర్వం యయాతి, దేవయానికి కలిగిన సంతానం అని తెలుస్తోంది. వీరు పల్లవ రాజ...' 552576 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 141 చెందిన వారని జానపద పరిశోధకులు చెబుతున్నారు. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే స్థిరమందుల వారు పూర్వం యయాతి, దేవయానికి కలిగిన సంతానం అని తెలుస్తోంది. వీరు పల్లవ రాజులకు ప్రధానులుగా పనిచేసిన చరిత్ర కనబడు తోంది. కాటమరాజు కాలం వచ్చేసరికి పల్లవుల వారసులుగానే ప్రసిద్ధిపొందారు. పూజా గొల్లల్నే తెరచీరల కథాగానం చేసే స్థిరమందుల వంశం వారుగా పేర్కొంటారు. తెరచీరల కళా ప్రదర్శన పటం కథల కళారూపాలకు చెందిందే ఈ తెరచీరల పటం. కాటమరాజు కథా వృత్తాంతాల్ని పెద్ద గుడ్డ మీద బొమ్మల రూపంలో అతికించి చిత్రపటం తయారు చేస్తారు. 15 చిత్రపటాలలో అతి చిన్నది ఈ తెరచీరల పటం. యాదవుల కథ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ తెరచీరల పటం ఒక గోడను లేదా గుడారాలు వేసి దాని గోడకు గానీ కట్టి కథాగానం చేస్తారు. ఈ కథాగానానికి సహకార వాయిద్యాలుగా వేప చెక్కతో, ఇత్తడితో చేసిన వీరణములు, ఇత్తడితో వంకరగా పొడుగు గొట్టాల కొమ్ములు, తాళాలు, దోలక్ లు ఉపయోగిస్తారు. తెరచీరల కళా కారులు ఆరుగురు ఒక బృందంగా ఏర్పడి ఊరూరా తిరుగుతూ పురాణాన్ని చెప్పే సంప్రదాయం కనబడుతుంది. తెలంగాణలోని అన్నీ జిల్లాల్లోనూ తెరచీరల కళాకారులు ఉన్నప్పటికీ నల్గొండ జిల్లా తిరుమలగిరి, మామిడాల వాస్తవ్యులు తండా భిక్షం, శ్రీనివాస్, కొంపెల్లి వెంకట నారాయణ బృందమే పేరుగాంచింది. యాదవుల కులదైవమైన గంగాదేవి కథ, కృష్ణలీలలతో సహా కాటమరాజు కథ చక్రాన్ని గానం చేస్తుంటారు. కృష్ణలీలలు - కథాంశం జానపద కళారూపాల్లో కృష్ణలీలలు ఏ కళారూపంలో ప్రదర్శించినా తరగని ఆదరణ పొందుతుంది. కృష్ణలీలలు నేపథ్యంగా కనిపించే కథలంతా యదువంశ గొప్పతనం వివరించేవే. కొండపల్లె నివాసి కనకబండి గట్టయ్య రచించిన కృష్ణ భాగవతం కథే కృష్ణ లీలలు. అందులో కంసుని చేతిలో చావకుండా సజీవంగా ఆకాశానికి ఎగిరి మాయా బాలికగా మారి గంగగా భువిన అవతరించింది. ఈ గంగ మూలవృత్తాంతం కృష్ణుని జననంతోనే ముడిపడి ఉంది. అలాగే గంగాదేవి యాదవుల కులదైవం కావడం యాదృచ్ఛికమే. ఇక కృష్ణుడే కాటమరాజు అని<noinclude><references/></noinclude> e53eegi1nqi4qbva9gg2cl3txaq51bh పుట:పటం కతలు.pdf/159 104 212055 552577 2026-04-10T05:28:06Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '142 పటం కతలు యాదవుల ప్రగాఢ విశ్వాసం. ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ముగించి.. 16వ అవతారంగా కాటమరాజై భువిలో జన్మిస్తాడు. అవతార తత్వాన్ని వివరిస్తూ కృష్ణలీలలను, చిలిపి చేష్టలను...' 552577 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>142 పటం కతలు యాదవుల ప్రగాఢ విశ్వాసం. ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ముగించి.. 16వ అవతారంగా కాటమరాజై భువిలో జన్మిస్తాడు. అవతార తత్వాన్ని వివరిస్తూ కృష్ణలీలలను, చిలిపి చేష్టలను కళ్ళకు కట్టిస్తుంది ఈ తెరచీరల కథ. గొల్లవారిండ్లలో పాలు, పెరుగు ఆరగిస్తున్నాడు. చల్ల చిలికే గొల్ల భామలతో సరసాలాడి గొల్ల దంపతులకు ముద్దు మురిపాలు అందిస్తూ యాదవుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. మన్ను తిన్నందుకు యశోదా దేవి రోటికి కడితే.. మద్దుమానులని పడగొట్టి శాపగ్రస్తులైన వారికి పునర్జన్మనిస్తాడు. పూతన, శకటా, థేనుకాసురున్ని వధిస్తాడు. కాళీయ మర్దనం, కంసుని వధతో కథ ఉత్కంఠంగా మారి బృందావన పయనంతో ముగుస్తుంది. ఈ పురాణ కథలకు మాధ్యమం 'తెర చీరపటం' అయితే జీవం పోసింది సాహిత్యమే. సాహిత్యాంశాలు తెరచీరల వాళ్లు చెప్పే కథలన్నీ కృష్ణభాగవతం కథ ఆధారంగానే ప్రదర్శిస్తారు. కనకబండి గట్టయ్య రచించిన కథా సాహిత్యాన్ని గానం చేస్తున్నారు. ఈ తెరచీరల వారు యాదవుల ఆశ్రిత కళాకారులు అయినందువల్ల కృష్ణుని అవతార కథలతో పాటు కాటమరాజు వంశ చరిత్రను కూడా కథాగానం చేయడం కనపడుతుంది. కథకుడు వంశక్రమాన్ని, అవతార తత్వాన్ని బట్టి వివరిస్తూంటాడు. 'మంధర పర్వత మథనంలో గోవు పుట్టే, గోపాలుడు పుట్టే, గోరక్షకుడు పుట్టే, వసుదేవునికి కృష్ణుడు పుట్టే, ఆయనకు మన్మథుడు, ఆయనకు అంభోజ, ఆయనకు చెంభోజ, ఆయనకు రత్నాంభోజ, గంగురాజు పుట్టే, ఆయనకు వలురాజు, వలురాజుకు పెద్దిరాజు, ఆయనకు కాటమరాజు పుట్టారు'. పదగుంఫన శైలిలో వచనం చెప్పి అద్భుతమైన కథాగానాన్ని ప్రారంభిస్తాడు కథకుడు. ప్రారంభంలోని గానమంతా బాలకృష్ణుని అల్లరిని తెలిపే విధానం. ఆయనను వెన్నదొంగగా చిత్రించేందుకు గాను రూపొందించుకున్నది. 'ఒకరి మీద ఒకరిని తాను వంగబెట్టి, ఉట్టి వార ఒట్టుక వెన్నమెక్కి వలకబోసి' అంటూ కథకుడు పాడుతుంటేనే నవ్వు పుట్టుకొస్తుంది. ఆ తరువాత గోపికలను తన చిలిపి చేష్టలతో ఉడికిస్తూ వస్తాడు. ఆ గోపికలంతా వచ్చి యశోదకు మొరపెట్టుకుంటే ఆమె అప్పుడు...<noinclude><references/></noinclude> s5dctimchkxifwhahkhcnaz9fbiip9e పుట:పటం కతలు.pdf/160 104 212056 552578 2026-04-10T05:28:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు 'ఏమిరా కృష్ణయ్య నీవు ఏమి చేసితివి? యాదవుల ఇండ్లళ్లకు పోయి ఏడ బోయితివి? పోరాని జాగలకు పోనేల కృష్ణా! గొల్లవాడలకు పోకురా కృష్ణా! ఆ గొల్లవాదలకు పోకురా కృష్ణా 143 గొల్లలు...' 552578 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు 'ఏమిరా కృష్ణయ్య నీవు ఏమి చేసితివి? యాదవుల ఇండ్లళ్లకు పోయి ఏడ బోయితివి? పోరాని జాగలకు పోనేల కృష్ణా! గొల్లవాడలకు పోకురా కృష్ణా! ఆ గొల్లవాదలకు పోకురా కృష్ణా 143 గొల్లలు నిను కొట్టేరూ, గొల్లభామలు నిను తిట్టేరూ' అంటూ మందలిస్తే బాలకృష్ణుడే గానీ అవతార పురుషుడు కదా. తన చిలిపి చేష్టలు బయటపడకుండా ఎట్లంటున్నాదో చూడండి. 'గొల్లవాదలు ఎక్కడున్నాయో గొల్ల ఇండ్లు ఎక్కడున్నాయో గొల్లభామలు ఎక్కడున్నారే' అంటూ బులిపిస్తూనే 'గొల్లవారిని మాయమ్మ కొట్టమనకు మోయమ్మా తిట్టమనకు మోయమ్మా' అంటూ గారాలుపోతాడు. గొల్ల ఇల్లాళ్ళంతా యశోద వద్దకు వచ్చి కాపురాలు కూల్చే బాలుడు అని చెప్పినపుడు ఆమె... 'ఆలుమగలు ఆదమరచి పవళిస్తే నువు సరసన చేరావంటా? అని అడిగితే 'మేలుకున్నరో మేలుక లేరని, ఆ మేలుకున్నరో మేలుకలేరని లేపి చూసినానమ్మా నే ఊపి చూసినానమ్మా' అంటూ మాటలతో కవ్విస్తాడు. కనకబండి గట్టయ్య రచించిన గోపికా వస్త్రాపహరణం సన్నివేశం అంతా పారమార్థికంగా సాగిపోతుంది. 'వేణు గానములు విని విరహములు బుట్ట నాతులు ఉబ్బుచూ నదికి ఏతెంచి ఓయక్క కృష్ణుని వలవనెననుచు కిలకిల నవ్వుచు జలక్రీడసల్పుచున్నా'రంటాడు' కవి.<noinclude><references/></noinclude> qd0meyz2gxth3w0xelv366ucxc1vsth పుట:పటం కతలు.pdf/161 104 212057 552579 2026-04-10T05:29:06Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '144 పటం కతలు కృష్ణుని చేష్టలన్నీ నాటకీయంగా కనిపిస్తాయి. కథకుని గానంలో ఆ దృశ్యాన్ని నిందుగా పండిస్తాయి. 'ఒకరి చాటుననొకరు వయ్యన జోక చాటుగా నొకచెయ్యి చాటు బెట్టుకొక బట్ట బయటకి...' 552579 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>144 పటం కతలు కృష్ణుని చేష్టలన్నీ నాటకీయంగా కనిపిస్తాయి. కథకుని గానంలో ఆ దృశ్యాన్ని నిందుగా పండిస్తాయి. 'ఒకరి చాటుననొకరు వయ్యన జోక చాటుగా నొకచెయ్యి చాటు బెట్టుకొక బట్ట బయటకి రారే ఓ భామలారా' అంటూ తాత్వికతను కనబరుస్తాడు కృష్ణుడు. ఇదే తాత్వికతను ఆధునిక కవి సి.నారాయణరెడ్డి... 'చీరలు గావు తొలిగింది కనులు పొరలు ఎక్కింది చెట్టుగాదే అందని తొలిమెట్టు' లాంటి కృష్ణతత్వంలో ఇమిడించి నూతనత్వాన్ని కలిగించాడు. తెరచీరల కళాకారులు చేసే కథాగానంలో దేశీ దరువులు వైవిధ్యంగా కనిపిస్తాయి. చిరుతల రామాయణంలో ఉండే కృష్ణలీలలు దరువుల వలనే ఇవి కనబడతాయి. ఈ సాహిత్యంలో శ్రామిక పదజాలం, నుడికారాలు, వ్యంగ్యార్థాలు ప్రేక్షకుల్ని రసానందంలో తేలి ఆడిస్తాయి. తెలంగాణలోనే కనిపించే ఈ తెరచీరల కళారూపం ఇప్పటికీ సజీవంగా సాగుతూ వస్తోంది. ఆశ్రిత కళాకారులు వారి కథాగానంలో కళాభినివేశం తప్ప ఎక్కడా కూడా తమ మిరాశి హక్కులను కానీ, పోషిత కులాల ఆధిపత్యం కానీ కనిపించనివ్వరు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ప్రాచీన కళారూపాల్ని ప్రోత్సహిస్తూ విశ్వవిద్యాలయాల వేదికల మీద, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని 'పీపుల్స్ ప్లాజా' వంటి వేదిక మీద ప్రదర్శనలు ఇప్పిస్తున్నది. కళాకారుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఈ తెరచీరల ప్రదర్శనలకు ప్రజల నుంచి తరగని ఆదరణ లభిస్తోంది. - - నేతి మాధవి<noinclude><references/></noinclude> 5xzpw1juvmhmcipo8jepotftm1jp6gn పుట:పటం కతలు.pdf/162 104 212058 552580 2026-04-10T05:30:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు - వ్యాసకర్తలు డా॥ అన్నావఝుల మల్లికార్జున్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ - 506002, ఫోన్: 9441454573 కట్టా ప్రతిభాగౌడ్ పరిశోధ...' 552580 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు - వ్యాసకర్తలు డా॥ అన్నావఝుల మల్లికార్జున్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ - 506002, ఫోన్: 9441454573 కట్టా ప్రతిభాగౌడ్ పరిశోధకురాలు ఇంటి నెం. 12-10-682/2, టి.ఆర్.టి. 188 ప్రక్కన, సీతాఫలండి, సికిందరాబాద్-61. ఫోన్: 8019771000 డా॥ బాసని సురేష్ ప్రాజెక్టు అసిస్టెంట్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్, ఫోన్: 9989417299 డా॥ గూడూరు మనోజ పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్నగర్, ఫోన్: 9704643240 డా॥ గడ్డం వెంకన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జానపద విజ్ఞాన అధ్యయన శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్. ఫోన్: 9441305070 అబ్బు గోపాల్ రెడ్డి ప్రాజెక్టు అసిస్టెంట్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్. ఫోన్: 9948270796 ఆచార్య భట్టు రమేష్ పీఠాధిపతి జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్. ఫోన్: 9440356386<noinclude><references/></noinclude> r3b6i739jescldmd1810cwiqvz4gg9l పుట:పటం కతలు.pdf/163 104 212059 552581 2026-04-10T05:30:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అడ్లూరి శివప్రసాద్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్. ఫోన్: 9441979905 డా॥ శ్రీమంతుల దామోదర్ ప్రాజెక్టు అసిస్టెంట్, జానపద గిరిజన వ...' 552581 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అడ్లూరి శివప్రసాద్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్. ఫోన్: 9441979905 డా॥ శ్రీమంతుల దామోదర్ ప్రాజెక్టు అసిస్టెంట్, జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వ విద్యాలయం, వరంగల్. ఫోన్: 9989139136 డా॥ చూరేపల్లి రవికుమార్ ప్రాజెక్టు అసిస్టెంట్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్, సెల్: 7981149432 నేతి మాధవి కె. 4, మంజీరా డైమండ్ టవర్స్ గోపనపల్లి, హైదరాబాద్. ఫోన్ : 9542835415 మామిడి హరికృష్ణ డైరెక్టర్ భాషా సాంస్కృతిక శాఖ ఆచార్య భట్టు రమేష్ పీఠాధిపతి జానపద గిరిజన విజ్ఞాన పీఠం<noinclude><references/></noinclude> 5d1ny06h43u35tx9wadsco4gyqtx1ka పుట:పటం కతలు.pdf/164 104 212060 552582 2026-04-10T05:31:03Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రికార్డింగ్ సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.... పటకతల్ని పరిశీలిస్తున్న జానపద గిరిజన విజ్ఞాన పీఠం సిబ్బంది ఆకాశవాణి చర్చల్లో డైరెక్టర్ ఉదయ్ శంకర్ గారితో కలిసి...' 552582 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రికార్డింగ్ సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.... పటకతల్ని పరిశీలిస్తున్న జానపద గిరిజన విజ్ఞాన పీఠం సిబ్బంది ఆకాశవాణి చర్చల్లో డైరెక్టర్ ఉదయ్ శంకర్ గారితో కలిసి...<noinclude><references/></noinclude> 7or5k9d2a5temnj8iovru4p9nmia5u1 పుట:పటం కతలు.pdf/165 104 212061 552583 2026-04-10T05:31:30Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Our Sincere Thanks to.... Sri ESL Narsimhan Hon'ble Governor Telangana State Sri Swamy Goud Hon'ble Chairman Legislative Council Sir Kadiyam Srihari Hon'ble Deputy Chief Minister Smt. Kalvakuntla Kavitha Hon'ble M.P. Nizamabad Sri T. Hareesh Rao Hon'ble Minister for Irrigation Sri Ch. Vidyasagar Rao Hon'ble Governor Maharashtra State Sri S. Madhusudana Chary Hon'ble Speaker, Legislative Assembly Sir Mahamood Ali Hon'ble Deputy Chief Minister... 552583 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>Our Sincere Thanks to.... Sri ESL Narsimhan Hon'ble Governor Telangana State Sri Swamy Goud Hon'ble Chairman Legislative Council Sir Kadiyam Srihari Hon'ble Deputy Chief Minister Smt. Kalvakuntla Kavitha Hon'ble M.P. Nizamabad Sri T. Hareesh Rao Hon'ble Minister for Irrigation Sri Ch. Vidyasagar Rao Hon'ble Governor Maharashtra State Sri S. Madhusudana Chary Hon'ble Speaker, Legislative Assembly Sir Mahamood Ali Hon'ble Deputy Chief Minister Sri Pocharam Srinivas Reddy Hon'ble Minister for Agriculture & Co-operation Sri K.T.Rama Rao Hon'ble Minister for IT & MAUD Sri S P Singh, IAS Chief Secretary Sri S. Narsinga Rao, IAS Principal Secretary to Hon'ble CM Sri B.P. Acharya, IAS Prl. Secretary, Planning Sri Bhoopal Reddy, IFS (Retd.) Spl. Secretary to Hon'ble CM Sri B.V.Paparao, IAS (Retd.) Hon'ble Advisor Sri C. Parthasarathi, IAS Prl.Secretary Agrl. & Coopn. Sri B. Narasinga Rao Film Maker .... Harikrishna Mamidi.<noinclude><references/></noinclude> pi4ys9uofe4pee6njkqbjavmmuygxt2 పుట:పటం కతలు.pdf/166 104 212062 552584 2026-04-10T05:31:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'חר డైరెక్టర్ భాషా సాంస్కృతిక శాఖ కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్ ISBN: 978-81-936345-4-7 ప్రపంచ తెలుగు నకలు 9788193634547' 552584 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>חר డైరెక్టర్ భాషా సాంస్కృతిక శాఖ కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్ ISBN: 978-81-936345-4-7 ప్రపంచ తెలుగు నకలు 9788193634547<noinclude><references/></noinclude> 071oqx18mtxo60xnm65em76ki328lkj పుట:పటం కతలు.pdf/1 104 212063 552585 2026-04-10T05:33:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 552585 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 1 |bSize = 450 |cWidth = 449 |cHeight = 429 |oTop = -6 |oLeft = -1 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> iswkhiucpljq5fedhagwchqsgtmbzkh 552586 552585 2026-04-10T05:33:33Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552586 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 1 |bSize = 450 |cWidth = 449 |cHeight = 429 |oTop = -6 |oLeft = -1 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> a9ic9acypgiguonxbl8jt21fsos6tmx పుట:పటం కతలు.pdf/2 104 212064 552587 2026-04-10T05:34:05Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పటం కతలు డా॥ ననుమాస స్వామి డా॥ బాసని సురేష్ - మామిడి హరికృష్ణ విష్ణుభట్ల ఉదయశంకర్ సలహామండలి డా॥ భట్టు రమేష్ చావలి దేవదాసు ఎన్. విజయ రాఘవ రెడ్డి నిర్వహణ - కూర్పు అయినంపూడి శ్...' 552587 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పటం కతలు డా॥ ననుమాస స్వామి డా॥ బాసని సురేష్ - మామిడి హరికృష్ణ విష్ణుభట్ల ఉదయశంకర్ సలహామండలి డా॥ భట్టు రమేష్ చావలి దేవదాసు ఎన్. విజయ రాఘవ రెడ్డి నిర్వహణ - కూర్పు అయినంపూడి శ్రీలక్ష్మి డా॥ గడ్డం వెంకన్న సి. ఎస్. రాంబాబు డైరెక్టర్ భాషా సాంస్కృతిక శాఖ కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్. ఫోన్ : 040-23212832<noinclude><references/></noinclude> bdvdh1qc7nq65mpouutzer8s6lhbul4 పుట:పటం కతలు.pdf/3 104 212065 552588 2026-04-10T05:34:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'PATAM KATHALU (A collection of All India Radio talks on Scroll Narratives of Telangana) Edited by Mamidi Harikrishna, Director Dept. of Language and Culture, Telangana. V. Udaya Sankar, Director All India Radio, Hyderabad. Dept of Language and Culture First Edition: 2017 December 1000 copies ISBN: 978-81-936345-4-7 Price: 250/- Layout & Design K. Padma Publisher The Director, Dept. of Language and Culture, Kalabhavan, Ravindra Bharathi, Hyde... 552588 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>PATAM KATHALU (A collection of All India Radio talks on Scroll Narratives of Telangana) Edited by Mamidi Harikrishna, Director Dept. of Language and Culture, Telangana. V. Udaya Sankar, Director All India Radio, Hyderabad. Dept of Language and Culture First Edition: 2017 December 1000 copies ISBN: 978-81-936345-4-7 Price: 250/- Layout & Design K. Padma Publisher The Director, Dept. of Language and Culture, Kalabhavan, Ravindra Bharathi, Hyderabad. Printed at Samhitha Graphics Hyderabad. Ph: 040-23731620/23741620 For Copies The Director, Dept. of Language and Culture, Kalabhavan, Ravindra Bharathi, Hyderabad. Ph: 040-23212832 Cover and other Nakashi illustrations Madhu Merugoju- 9848581044<noinclude><references/></noinclude> 3jlnpjsvq361eq52anypbp00zjpr97i పుట:పటం కతలు.pdf/4 104 212066 552589 2026-04-10T05:35:22Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552589 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 4 |bSize = 450 |cWidth = 452 |cHeight = 419 |oTop = -3 |oLeft = -4 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> b1nkun1y08pfbdln7zdgnaoarixm2ak పుట:పటం కతలు.pdf/5 104 212067 552590 2026-04-10T05:36:25Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552590 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 5 |bSize = 450 |cWidth = 447 |cHeight = 420 |oTop = -1 |oLeft = 0 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> aqyf4kuk93kfadrmjdwgobbexi9fvoq పుట:పటం కతలు.pdf/6 104 212068 552591 2026-04-10T05:37:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 6 |bSize = 450 |cWidth = 440 |cHeight = 423 |oTop = -1 |oLeft = 5 |Location = center |Description = }}' 552591 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 6 |bSize = 450 |cWidth = 440 |cHeight = 423 |oTop = -1 |oLeft = 5 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> p4z78xvc89px8y0jdqip2spjy01csmi పుట:పటం కతలు.pdf/7 104 212069 552592 2026-04-10T05:38:58Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 552592 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 7 |bSize = 450 |cWidth = 450 |cHeight = 417 |oTop = 0 |oLeft = 2 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 9akhcxh4gknrffn41ib7tf1de7qbww5 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/28 104 212070 552599 2026-04-10T06:26:27Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552599 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}3 వ పశ్చిమ గోదావరిజిల్లా సభ</p>}} {{Center|{{p|fs125}}౪ వ భీమవరము తాలూకా గ్రంథాలయ మహాసభ</p>}} ది ౨౪-౧౭౧౯౯౩౭ తేది ఆదివారము పగలు ౨ గంట లకు సాలకోడేరు గ్రామములోని మహాదేవ గోవింద రానడే గ్రంథాలయ భవనమందు పైమహాసభలు శ్రీయుత మారేపల్లి రామచంద్రశాస్త్రి, డాక్టరు తేతలి సత్యనారాయణమూర్తిగార్ల అధ్యక్షతలను మహా వైభవముతో జరిగినవి. అన్ని తాలూకాల నుండియు గ్రంథాలయ ప్రతినిధులును, గ్రంథాలయాభిలాషులును సుమారు 3౦౦ మంది సభలకు దయ చేసిరి. జిల్లా గ్రంథాలయ మహాసభాధ్యక్షులు, ఎటుల గ్రంథాలయములు ప్రజోపయోగములో, ఎవ్విధమున, ప్రజల దృక్పధమును సక్రమమార్గమున మార్పగలవో, ఎవ్విధమున విజ్ఞాన సాంఘికాధ్యాత్మికాభివృద్ధి కలుగునో మొదలగు విషయములతో విపులముగ మహోపన్యాసము గావించిరి. డాక్టరుగారు గ్రంథాలయాభివృద్ధికి చేయు ప్రయత్నములలో ఎట్టి ఆటంకములు కలుగునో, ముఖ్యముగ జిల్లా బోర్డు పంచాయతీ గ్రంథాలయములు ఎట్టిహీన స్థితిలో యున్నవో, అందరకు విజానము కలుగ చేయు వార్తాపత్రికలు సహితము పంచాయతీ గ్రంథాలయములు తెప్పించుకోవలయుననిన ఎంత కృషి చేయవలెనో, అట్టి ఖర్చులకు పూర్వమే యిన స్పెక్టరు అఫ్ లోకల్ బోర్డ్సు అనుమతి జిల్లా పంచాయతీ ఆఫీసరుద్వారా పొందుట ఎంత కష్టమో, జిల్లాపంచాయతీ ఆఫీసరుగారి ఆఫీసులో మాసముల తరబడి యిట్టి దరఖాస్తులు ఎట్లు నిలువబడియున్నవో గ్రంథములు కొనుటలో కూడ విద్యాశాఖాధికారి అనుమతి పొందుటలోని కష్టము లెట్టివో, యీ విద్యాశాఖాధికారులు గ్రంథాలయముల నుండి వారు కొనదలచిన గ్రంధముల పట్టికలో ఏవిధమైన సబబు లేక ఒక పట్టికలో ఆమోదించిన గ్రంధములను ఇంకొక పట్టికలో తీసివేయుట కలుగుచున్నదో మొదలగు విషయములతో స్వానుభవము మీద ఉపన్యాసమిచ్చిరి. ఈ మహాసభలను ప్రారంభించుచు, శ్రీయుత మందలపర్తి ఉపేంద్రశర్మ గారును, అంధ్రదేశ గ్రంథాలయ సంఘ కార్యదర్శి శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్య పంతులు గారును గ్రంథాలయావశ్యకత, వానినడవడిక, వానిఅభివృద్ధి మొదలగు విషయములను విపులముగా నుపవ్యసించిరి. తరువాత శ్రీ ఆత్మకూరి గోవిందాచార్యులు గారు రైతు, పన్ను భారము, శాసనసభల బాధ్యతలను గురించియు, ఇతర విషయములను గురించి తాడిమేటి కుటుంబశాస్త్రి గారు, విఠాల వీరభద్రరావుగారు మొదలగు పెక్కుమంది ఉపన్యాసము లిచ్చిరి. రాబోవు సం॥ రము జిల్లా గ్రంథాలయ మహాసభను శ్రీ చందారెడ్డి గ్రంథాలయమువారు, నిడదవోలికి ఆహ్వానించిరి. భీమవరము తాలూకా గ్రంథాలయ మహాసభను శ్రీ రామమోహన గ్రంథాలయమువారు జువ్వల పాలెమునకు ఆహ్వానించిరి. {{rule |6em }} విజ్ఞప్తి ప్రాచీన హిందూ దేశ రాజ్యాంగ చరిత్ర శొరకు గుంటూరుమండల గ్రంథాలయ సంఘో పాధ్యక్షులు, కస్తూరి కుటుంబరావుగారు, కన గాల, అని వ్రాయుచున్నారు. పై పుస్తకము కావలసిన గ్రంథాలయములవారు రేపల్లె తాలూకా గ్రంథాలయ సంఘము, రేపల్లె. అని వ్రాయవలెను. లేనియెడల సకాలమునకు పుస్తకములు రావు. రేపల్లెతాలూకా గ్రంథాలయ సంఘము, 11-3 37. కాండూరి సీతారామయ్య, కార్యదర్శి.<noinclude><references/></noinclude> d5w3i3l4o5p0zf9bai777ow56s3c8n0 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/29 104 212071 552602 2026-04-10T06:55:20Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552602 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}భీమవరం తాలూకా గ్రంథాలయ సంఘసభ</p>}} {{Center|{{p|fs125}}ఈ సభ 24-1-1937 తేదీన శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి అధ్యక్షతకింద జరిగినది</p>}} {{Center|{{p|fs125}}కార్యదర్శి నివేదిక</p>}} భీమవరము తాలూకా గ్రంథాలయ మహాసభ ది 3-౫-3౬ తేదిని జరిపియున్నారము. అప్పటికి పాలకోడేరు గ్రామంలోని శ్రీ మహదేవ గోవిందనారడే గ్రంధాలయము వారు ఆహ్వానించినందున వారి ఉత్సాహమువలన ఈ సంఘ మహాసభ ఈ సం॥రము జనవరి నెల లోనే జరపవలసి వచ్చినది. అందువల్ల సంవత్సరము పూర్తి కాలేదు గనక ఈ నివేదిక 3-౫-3౬ నుండి ౨౪-౧-3౭ వరకు అనగా సుమారు ౮ మాసములది మాత్రమే యని మనవి చేయుచున్నాడను. ఈ తాలూకాయందు ఈ సం॥ రమ నూతనముగా ౧ కలసెపూడి గ్రామములో శ్రీరామగ్రంధాలయమును, ౨ అయిభీమవరము గ్రామములో నారాయణరాజ గ్రంధాలయమును, నెలకొల్పబడినవి. మొత్తము మన తాలూకా యందు ౫౮ గ్రంథాలయములు కలవు. వెనుకటి సంవత్సరమున ౩౨ గ్రంథాలయములు తాలూకా సంఘమునకు చందా చెల్లించియుండగా ఈ సం॥ రము ౧౪ మాత్రమే చెల్లించియున్నవి. తతిమ్మా సంఘము లన్ని యుకూడ తాలూకా చందా చెల్లించిగాని, గ్రంథాలయ సర్వస్వమునకు చందాదారులుగా చేరిగాని ఈ ఉద్యమమును ప్రోత్సాహించగలందులకు కోరనైనది. ఈ గ్రంథాలయములు ఏకోన్ముఖముగాను, సక్రమముగాను పనిచేయుటకు, తరుచు తాలూకా సంఘము వారు చూడవలసియున్నది. ఇందుకుగాను ఈ సంఘకార్య నిర్వాహక వర్గమువారిని కొన్ని గ్రంధాలయములు తరుచు చూడగలందులకు కోరియున్నాము. కాని చురుకుగా పని జరగలేదనియే చెప్పవలెను. చాల గ్రంథాలయముల యందు శ్రద్ధ తక్కువగానే ఉన్నది. కొన్ని గ్రామముల యందు పత్రిక లైనను గ్రంథాలయములకు చేరుటలేదు. గ్రామములోని ఏ పెద్దలో ఆపత్రికలను దారిలోనే తీసికొని, వారి గుమ్మము వద్దనే కూర్చుండి చదువుకోనెదరు. అందువలన గ్రంథాలయములలో గ్రామస్థులు చేరుట లేదు. ఈ విషయములన్నియు చూచియే కార్యక్రమము సక్త్రమముగా జరుగుటకును, గ్రంథాలయాభిలాషను ప్రజలలో కలిగించుటకును, తరచు గ్రంధాలయ యాత్రలు ఏర్పాటు చేయబడుచున్నవి. ఈ నెలలలోను సుమారు ౮ గురు యాత్రికులు ౧౬ రోజులలో 3౭ గ్రంథాలయములను దర్శించిరి. రెండు నూతన గ్రంథాలయములను స్థాపించిరి. అన్ని గ్రంథాలయములలోను కునూతనోత్సాహము కలుగ చేసి సుమారు 3౧ గ్రామములలో బహిరంగ సభలు జరిపిరి. ఇందు వృద్ధులయ్యు మిగుల ఉత్సాహముతో సంచారము చేయుచున్న యీగ్రంథాలయ సంఘాధ్యక్షులగు శ్రీయుత భూపతిరాజు తిరుపతిరాజు గారి నెక్కువగ కొనియాడతగి యున్నది. వారికంటె చిన్నవారమగు మాబోటి సేవకులు వారి పట్టుదలను ఉత్సాహమును చూచి సిగ్గుపడవలసి యున్నది. ఈ సాలున హౌరా జిల్లా గ్రంథాలయ సంఘ కార్యదర్శియు దత్తుగారును వారి సతీమణియు, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ కార్యదర్శికూడ మాతాలూకాలో ౧౨ గ్రంథాలయములను చూచిరి. మాకు యాత్రలలో ఎక్కువ సహాయముచేసి అనేక కష్టములకు పాల్పడిన శ్రీయుతులు మారేపల్లి రామచంద్రశాస్త్రి కవిశేఖరులకును, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ కార్యదర్శియగు అయ్యంకి వెంకటరమణయ్య గారికిని గుంటూరు హిందూ కళాశాలోపన్యాసకులగు మందలపర్తి ఉపేంద్రశర్మ బి ఏ. అనర్సు గారికిని తాలూకా గ్రంథాలయ సంఘ కార్యదర్శియగు వే. సూరప రాజుగారికిని, వ. రాజారావు గారికిని ఆంధ్ర విశ్వవిద్యాలయములో గ్రంథాలయ శిక్షణము పొందు విద్యార్థి శ్రీధర నారాయణమూర్తి గారికిని ఈ సంఘపక్షమున అనేక వందనము లర్పించుచున్నాను. వీరందరును తిరిగి యీ సం॥ రము కూడ ఉత్సాహముతో యాత్రలు జరిపి గ్రంథాలయోద్యమమును పెంపొందచేయ ప్రార్థితులు. అన్ని గ్రామములలో ఈ గ్రంథాలయములు పని చేయుటకు ఈతాలూకాకు మంచి అవకాశములు కలవు. ఈగ్రంథాలయములే గ్రామ పునర్నిర్మాణమునకును ప్రజల భావి భాగ్యోదయమునకును మూలాధారములని గ్రహించవలసి యున్నది. {{Center|{{p|fs150}}తీర్మానములు</p>}} ౧. ఆదాయ వ్యయ పట్టికను ఆమోదింపనైనది. ౨. జిల్లా గ్రంథాలయ సంఘము వారిచే తయారు కాబడిన ప్రణాళికను త్వరలో ఆచరణయందుంచుటకు తగిన ప్రయత్నములు చేయగలందులకు జిల్లా గ్రంథాలయ సంఘమువారిని కోరనైనది. 3. తాలూకా కేంద్రస్థాన మందలి జిల్లాబోర్డు పటేలు గ్రంథాలయమును తాలూకా గ్రంథాలయ సంఘమునకు పరిపాలన నిమిత్తము స్వాధీనపర్చ గలందులకు ఏలూరు జిల్లాబోర్డు అధ్యక్షులను కోరనైనది.<noinclude><references/></noinclude> naookwaiscbmtw1lh8d9m2n4zo51ew6 పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/30 104 212072 552608 2026-04-10T07:22:40Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552608 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>౪. తాలూకా యందలి బీద గ్రంథాలయములకు ఆంధ్రపత్రికకు సాలీనా చందా రు ౧ూ/- లకు తగ్గించి నందులకు ఈ సభవారి కృతజ్ఞతావందనములు ఆంధ్రపత్రికాధిపతులగు శ్రీ దేశోద్ధారక విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారికి అర్పించుచూ, భారతి మాసపత్రికకు కూడ సాలీనా చందా రు 4/- లకు తగ్గించగలందులకు కోరినైనది. ౫. తాలూకా లోని గ్రామ గ్రంథాలయములు తాము గ్రంధములు కొనదలచినప్పుడు తాలూకా సంఘము వారి సలహా తీసికొన గలందులకు కోరనైనది. ౬. తాలూకాలోని అన్ని గ్రంథాలయములును గ్రంథాలయ సర్వస్వముకు చందాదారులుగ చేరి, అందువల్లనే తాలూకా, జిల్లా, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘములలో సభ్యులు కాగలందులకు ఆ అ గ్రంథాలయ నిర్వాహకులను కోరనైనది. ౭. గ్రంథాలయముల వారందరును వార్షికోత్సవములు జరిపి, వార్షిక నివేదికలు తాలూకా గ్రంథాలయ సంఘమునకు పంపవలెనని కోరనైనది. ౮. ఈ దిగువ వారిని ౧౯౭౭-3౮ సం॥ రమునకు కార్యనిర్వాహకవర్గ సభ్యులుగా ఏర్పర్చి, వారి గ్రూపు పేర్ల యెదుట వ్రాసిన గ్రంథాలయములు వారి తనిఖీ క్రింద ఉండునట్లు ఏర్పర్చి, వారు గ్రంథాలయాభివృద్ధి చేయవలెనని కోరనైనది. (౧) భూపతిరాజు తిరుపతిరాజు గారు, కుముదపల్లి (౨) వేగేగ్ని సూర్పరాజు గారు, పాందువ్వ (3) పెద్దాడ నరసింహమూర్తిగారు, భీమవరము (౪) పస్తుల సాగరం గారు, చెన్నరంగనిపాలెము (౬) నల్లపరాజు వెంకటతిరపతి రాజుగారు, శృంగవృక్షము (౬) రాయని శ్రీ రామమూర్తి గారు, నౌడూరు (౭) ఇందుకూరి సోమరాజు గారు, పెద అమిరము (౮) కొండేపూడి వెంకట చలపతిరావు గారు, బొండాడ (౯) పిన్నంరాజు రామరాజు గారు, దుంపగడప (౧౦) గోకరాజు శ్రీరామరాజు గారు, జువ్వల పాలెం (౧౧) గాదిరాజు సుబ్బరాజు గారు, మహదేవపట్నము (౧౨) కొత్తపల్లి వెంకట్రాజు గారు, పాలకోడేరు (౧3) పాలకోడేటి సత్యనారాయణశర్మగారు, భీమవరము. ఇందులో వేగేశి సూర్పరాజు గారిని అధ్యక్షులు గాను, పాలతోడేటి సత్యనారాయణశర్మ గారిని, కార్యదర్శి గాను, గోకరాజు శ్రీరామరాజు గారిని సహాయ కార్యదర్శిగాను ఎన్నుకొననైనది. {{Center|{{p|fs125}}గూపులు</p>}} '''భీమవరము గూపు''' రాయలము, కొమరాడ, గొరగనమూడి, కుముదవల్లి. '''చెన్నరంగని పాలెము''' గునుపూడి, తాడేరు, ఎనమదుఱ్ఱు, దిర్సుమఱ్ఱు. '''శృంగవృక్షము''' కొండేపూడి, వేండ్ర, గొర్లమూడి, విస్సాకోడేరు, వీరవాసరము '''కొణితివాడ''' నౌడూరు, ఆండలూరు, నేలపోగులు, రాయకుదుకు, తోలేకు, సూర్పరాజు పేట '''పెద అమిరము''' చినఅమిరం, వాండ్రము, పెదపుల్లేరు, '''బొందాడ''' కోపల్లె, జక్కరము, వేంపాడు, సీసలి. '''దుంపగడప''' సిద్దాపురము, ఆకివీడు '''జువ్వలపాలెము''' అయిభీమవరము, చెరుకుమిల్లి, కాళ్ళకూరు, కాళ్ళ, కోలనపల్లి, '''మహాదేవపట్టణము''' ఉండి, చిలుకూరు, చెఱకువాడ, కలిసెపూడి. '''పాలకోడేరు''' మోగల్లు, కోరుకొల్లు, గొల్లలకోడేరు, గరగపఱ్ఱు, లైప. {{Center|{{p|fs125}}భీమవరం తాలూకా గ్రంథాలయయాత్ర</p>}} కవిశేఖరుడు, దేశ నాయకుడు, గ్రంథాలయ సేవకాసరుడునగు శ్రీయుత మారేపల్లి రామచంద్రశాస్త్రి గారి నాయకత్వమున ఈ యాత్ర 16-4-37 వ తేదీన కోపల్లి గ్రామమున ప్రారంభింపబడినది. ఈయాత్ర 27-4-37 తేదీ వరకు జరుగును. దినమునకు రెండు గ్రామములు ప్రతి గ్రంథాలయమునకు వార్షికోత్సవము గూడ ఏర్పాటు చేయబడినది. భీమవరం తాలూకా తాడేపల్లిగూడెం తాలూకా లోని సుప్రసిద్ధ నాయకులు అధ్యక్షత వహించుచున్నారు.<noinclude><references/></noinclude> nl0e2bmu36gwsxr9vzf3753q6bqj4nw 552609 552608 2026-04-10T07:24:28Z Brjswiki 6801 552609 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>౪. తాలూకా యందలి బీద గ్రంథాలయములకు ఆంధ్రపత్రికకు సాలీనా చందా రు ౧ూ/- లకు తగ్గించి నందులకు ఈ సభవారి కృతజ్ఞతావందనములు ఆంధ్రపత్రికాధిపతులగు శ్రీ దేశోద్ధారక విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారికి అర్పించుచూ, భారతి మాసపత్రికకు కూడ సాలీనా చందా రు 4/- లకు తగ్గించగలందులకు కోరినైనది. ౫. తాలూకా లోని గ్రామ గ్రంథాలయములు తాము గ్రంధములు కొనదలచినప్పుడు తాలూకా సంఘము వారి సలహా తీసికొన గలందులకు కోరనైనది. ౬. తాలూకాలోని అన్ని గ్రంథాలయములును గ్రంథాలయ సర్వస్వముకు చందాదారులుగ చేరి, అందువల్లనే తాలూకా, జిల్లా, ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘములలో సభ్యులు కాగలందులకు ఆ అ గ్రంథాలయ నిర్వాహకులను కోరనైనది. ౭. గ్రంథాలయముల వారందరును వార్షికోత్సవములు జరిపి, వార్షిక నివేదికలు తాలూకా గ్రంథాలయ సంఘమునకు పంపవలెనని కోరనైనది. ౮. ఈ దిగువ వారిని ౧౯౭౭-3౮ సం॥ రమునకు కార్యనిర్వాహకవర్గ సభ్యులుగా ఏర్పర్చి, వారి గ్రూపు పేర్ల యెదుట వ్రాసిన గ్రంథాలయములు వారి తనిఖీ క్రింద ఉండునట్లు ఏర్పర్చి, వారు గ్రంథాలయాభివృద్ధి చేయవలెనని కోరనైనది. (౧) భూపతిరాజు తిరుపతిరాజు గారు, కుముదపల్లి (౨) వేగేగ్ని సూర్పరాజు గారు, పాందువ్వ (3) పెద్దాడ నరసింహమూర్తిగారు, భీమవరము (౪) పస్తుల సాగరం గారు, చెన్నరంగనిపాలెము (౬) నల్లపరాజు వెంకటతిరపతి రాజుగారు, శృంగవృక్షము (౬) రాయని శ్రీ రామమూర్తి గారు, నౌడూరు (౭) ఇందుకూరి సోమరాజు గారు, పెద అమిరము (౮) కొండేపూడి వెంకట చలపతిరావు గారు, బొండాడ (౯) పిన్నంరాజు రామరాజు గారు, దుంపగడప (౧౦) గోకరాజు శ్రీరామరాజు గారు, జువ్వల పాలెం (౧౧) గాదిరాజు సుబ్బరాజు గారు, మహదేవపట్నము (౧౨) కొత్తపల్లి వెంకట్రాజు గారు, పాలకోడేరు (౧3) పాలకోడేటి సత్యనారాయణశర్మగారు, భీమవరము. ఇందులో వేగేశి సూర్పరాజు గారిని అధ్యక్షులు గాను, పాలతోడేటి సత్యనారాయణశర్మ గారిని, కార్యదర్శి గాను, గోకరాజు శ్రీరామరాజు గారిని సహాయ కార్యదర్శిగాను ఎన్నుకొననైనది. {{Center|{{p|fs125}}గూపులు</p>}} '''భీమవరము గూపు''' రాయలము, కొమరాడ, గొరగనమూడి, కుముదవల్లి. '''చెన్నరంగని పాలెము''' గునుపూడి, తాడేరు, ఎనమదుఱ్ఱు, దిర్సుమఱ్ఱు. '''శృంగవృక్షము''' కొండేపూడి, వేండ్ర, గొర్లమూడి, విస్సాకోడేరు, వీరవాసరము '''కొణితివాడ''' నౌడూరు, ఆండలూరు, నేలపోగులు, రాయకుదుకు, తోలేకు, సూర్పరాజు పేట '''పెద అమిరము''' చినఅమిరం, వాండ్రము, పెదపుల్లేరు, '''బొందాడ''' కోపల్లె, జక్కరము, వేంపాడు, సీసలి. '''దుంపగడప''' సిద్దాపురము, ఆకివీడు '''జువ్వలపాలెము''' అయిభీమవరము, చెరుకుమిల్లి, కాళ్ళకూరు, కాళ్ళ, కోలనపల్లి, '''మహాదేవపట్టణము''' ఉండి, చిలుకూరు, చెఱకువాడ, కలిసెపూడి. '''పాలకోడేరు''' మోగల్లు, కోరుకొల్లు, గొల్లలకోడేరు, గరగపఱ్ఱు, లైప. {{Center|{{p|fs125}}భీమవరం తాలూకా గ్రంథాలయ యాత్ర</p>}} కవిశేఖరుడు, దేశ నాయకుడు, గ్రంథాలయ సేవకాసరుడునగు శ్రీయుత మారేపల్లి రామచంద్రశాస్త్రి గారి నాయకత్వమున ఈ యాత్ర 16-4-37 వ తేదీన కోపల్లి గ్రామమున ప్రారంభింపబడినది. ఈయాత్ర 27-4-37 తేదీ వరకు జరుగును. దినమునకు రెండు గ్రామములు ప్రతి గ్రంథాలయమునకు వార్షికోత్సవము గూడ ఏర్పాటు చేయబడినది. భీమవరం తాలూకా తాడేపల్లిగూడెం తాలూకా లోని సుప్రసిద్ధ నాయకులు అధ్యక్షత వహించుచున్నారు.<noinclude><references/></noinclude> ojm7u5kw3l2haty7uwn08rl4snbpr0j పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/31 104 212073 552610 2026-04-10T07:47:01Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552610 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}దీవి తాలూకా</p>}} {{Center|{{p|fs125}}ద్వితీయ గ్రంథాలయ మహాసభ,</p>}} {{Center|{{p|fs125}}పెదకళ్లేపల్లి - కృష్ణాజిల్లా</p>}} పై సభ ది 11-3-37 తేదీన మధ్యాహ్నం 1-30 గంటలకు పెదకశ్లేపల్లి గ్రామమునందు కృష్ణాజిల్లా సేషన్స్ జడ్జీగారగు టి. యస్. రామచంద్రన్ యం. ఏ, ఐ.సి.యస్. బార్ అట్లా గారి అధ్యక్షతన జయప్రదముగా జరిగినది. మార్గమధ్యమున శ్రీజడ్జీ గారికి మాజేరు భోగిరెడ్డిపల్లి పూషడం లంకపల్లి గ్రామముల గ్రంధాలయముల వారు పుష్పమాలలను సమర్పించిరి. శ్రీవారు లక్ష్మీపురం పెదకళ్లేపల్లి గ్రామములయందలి గ్రంథాలయములను దర్శించిరి. శ్రీయుత బుద్దుకుటు౦బరావు గారి చేకోరబడి అధ్యక్షులు ఆధ్యక్షపీఠ మలంకరించిరి. దివి తాలూకా గ్రంధాలయ సంఘాధ్యక్షులగు టేకుమళ్ళ రామచంద్రరావు పంతులు ఎం. ఏ. బి. ఎల్. గారిచే స్వాగత మీయబడెను. అధ్యక్షుని తొలిపలుకులు సంఘకార్యదర్శి మాజేటి రామచంద్రరావుగారిచే నివేదిక చదవబడియె. శ్రీయుతులు డాక్టరు గుంటూరు సుబ్బారావు, బుద్దు కుటుంబరావు బి. ఏ. బి. యిడి, పుచ్చా శివరామకృష్ణశాస్త్రి బి. ఏ.ఎల్. టి. కాజ రాధాకృష్ణ శాస్త్రిగార్లుపన్యసించిరి. యీ దిగువ తీర్మానములు గావింపబడిన పిమ్మట అధ్యక్షుల ముగింపు ఉపన్యాసము శ్రీయుత బుద్దు కుటుంబరావు గారి అభివందనములతో సభ జయప్రదముగా ముగిసినది. {{Center|{{p|fs125}}తీర్మానములు</p>}} 1. దివి తాలూకా ప్రజల తరఫునను గ్రంధాలయముల తరఫునను శ్రీషష్టమ జార్జి చక్రవర్తిగారి పట్టాభిషేకమున తమ రాజభక్తిని వెల్లడించుచున్నారు. 2. ఈ తాలూకాయందలి అన్ని గ్రామములందును సర్వజనీన గ్రంధాలయములను స్థాపించుటకు ఆయా గ్రామవాసులను యీసభవారు హెచ్చరించుచున్నారు. 3. ఈ తాలూకాకును దేవరకోట ఎస్టేటుకును కేంద్రస్థానమగు చల్లపల్లియందు తాలూకా కేంద్ర గ్రంథాలయమును వెంటనే స్థాపించవలెనని శ్రీచల్లపల్లి రాజాగారిని తూర్పు కృష్ణాజిల్లాబోర్డు వారిని, యీ సభవారు కోరుచున్నారు. 4. గ్రామసేవా పద్ధతులందును, అందు ముఖ్యముగ గ్రంథాలయ విషయములందును తరిబీతుపొందుట గ్రామ గ్రంథాలయముల వారికి అత్యవసరమనియు, ఇందుకుగాను బందరు అకాడమీ అఫ్ కల్చరు వారిచే ఏటేట ఏర్పాటు చేయబడుచున్న వేసవి తరగతులలో చేరుట యుక్తమనియు యీ సభవారు తీర్మానించుచున్నారు. 5. ప్రతి గ్రామమందును పనిచేయుచున్న బోర్డు ఉపాధ్యాయులు విద్యావ్యాప్తి కొరకై గ్రంధాలయములలో కార్య నిర్వాహక సభ్యులుగ నుండుటకు తగిన అవకాశము దయ చేయించగలందులకు తూర్పు కృష్ణాజిల్లా బోర్డు వారిని యీ సభవారు కోరుచున్నారు. 6. తాలూకాలోని గ్రంధాలయములు 1 స్థలమును, 2 భవనమును, 3 గ్రంధములను 4 గ్రంధాలయ సేవకులను కలిగి యుండుటకు అవసరమగు ఏర్పాట్లను చేయవలెనని 1 జిల్లాబోర్డు వారిని 2 శ్రీ చల్లపల్లి రాజా గారిని దివి తాలూకా గ్రంథలయ సంఘమువారు కోరుట యుక్తమని యీసభవారు తీర్మానించుచున్నారు. 7. దివి తాలూకాలోని పరిశ్రమల విషయమై తూర్పు కృష్ణాజిల్లా బోర్డువారు నియమించిన ఉపసంఘము వారు దివి తాలూకా గ్రంథాలయ సంఘముతో సంప్రతించుట అవసరమని యీసభవారు అభిప్రాయపడుచు జిల్లా బోర్డు వారిని దివి తాలూకా గ్రంథాలయ సంఘము వారిని యీవిషయమై తగు కృషి చేయవలయునని కోరుచున్నారు. 8. దివి తాలూకా తృతీయ గ్రంథాలయ మహాసభ సంగేగడ్డలో జరుపుటకు డాక్టరు గుంటూరి సుబ్బారావు గారి ఆహ్వానము అంగీకరించడ మైనది. {{rule |6em }} {{Center|{{p|fs150}}విశాఖపట్నము జిల్లా</p>}} {{Center|{{p|fs125}}అచ్యుతరామ గ్రంథాలయం</p>}} {{Center|{{p|fs125}}శాసనము, టెక్కలిపోస్టు</p>}} ఈ గ్రంథాలయపు 17వ వార్షికోత్సవము 27-3-37 వ తేదీని మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారి అధ్యక్షత క్రింద జయప్రదముగా జరిగినది. మొత్తము 350 ఫుస్తకములు కలవు. సంవత్సరాదాయము రు. 26 లు. సదరుత్సవమునకు నూటికి పైగా సభికులే తెంచిరి. పై గ్రామస్థులు, స్త్రీలు కూడ వచ్చిరి. కార్యనిర్వాహక సంఘమునకు రావి ఫల్గుణ రావుగారు కార్యదర్శిగను, నిష్టల కామేశ్వరరావు గారు అధ్యక్షులుగను, మల్లపరెడ్డి బైరాగి నాయుడు గారు కోశాధ్యక్షులుగను నెన్నుకొనబడిరి. {{rule |6em }}<noinclude><references/></noinclude> 6yeyuhokemsogmjg1rrfh3rvlfo8srh పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/33 104 212074 552611 2026-04-10T08:08:13Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552611 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}తూర్పు కృష్ణాజిల్లా గ్రంథాలయ మహాసభ</p>}} 18-4-37 తేదీ సాయంకాలము దివి తాలూకా మాజేరు గ్రామమున కృష్ణాజిల్లా మెడికల్ ఆఫీసరుగారగు కె. వి. రమణారావు, ఐ. ఎం. ఎస్. గారి అధ్యక్షత క్రింద జరిగినది. జిల్లా యందలి వివిధ గ్రంథాలయముల నుండి ప్రతినిధులే తెంచిరి. రాబోవు సభ గుడివాడ తాలూకాకు ఆహ్వానింపబడినది. {{Center|{{p|fs125}}ఆహ్వాన సంఘాధ్యములగు అయినంపూడి గుర్నాథరావుగారి యువన్యాసము</p>}} గ్రంథాలయోద్యమం పై గల అభిమానంతో వ్యయప్రయాసలు గడించకుండా ఈ కుగ్రామానికి దయచేసిన మీ కెల్లరకు ఈ మహాసభ యొక్క ఆహ్వాన సంఘ పక్షమున హృదయ పూర్వకమైన స్వాగతమును పలుకుటకు సంతసించుచున్నాను. ఏ విశాలభావంతో హర్ష పూర్వకంగా విూరీ పరిశ్రమపథంలో ప్రవృత్తులై నారో అట్టివిశాల భావముతోనే మాస్వాగత సత్కారాల్లోని లోపాలవల్ల కలిగే కష్ట పరంపరను గూడ లెక్కింపకుందురని నావిశ్వాసం. సుమా రేబదిసంవత్సరాల క్రిందట విశాఖపట్నంలో ఒక ఉపాధ్యాయునిచే నెలకొల్పబడిన చిన్ని గ్రంథాలయ మొకటి, ఆయజ్ఞాత సేవకుని సంకల్పబలముచేత, నేడు సహస్రశాఖాసమన్వితమైన ఆంధ్ర గ్రంథాలయ మహాసౌధానికి మూలబంధమై మన కెల్లరకు చిరస్మరణీయమైన దనుమాట విస్మరింపదగ్గది కాదు. అత్యల్పకాలంలో శ్రీయుతులు అయ్యంకి వేంకటరమణయ్య, నాళం కృష్ణారావు, మారేపల్లి రామచంద్ర శాస్త్రి ప్రభృతుల కృషి నిమిత్తముగా విశేష వ్యాప్తిని పొందిన ఈ ఉద్యమం తన ప్రాశస్త్యాన్ని చెప్పకయే చెప్పుచున్నది. దేశంలో విజ్ఞాన ప్రచార బాధ్యత వహింపదగ్గ ప్రభుత్వము యొక్క ఉపేక్షాభావ మొకవైపున, ప్రజాసముదాయాన్ని ఆవేశించి విడిచిపెట్టకుండా ఉన్న అవిద్యాపిశాచం ఒక వైపునా, క్రుంగదీస్తున్నా ఈఉద్యమం ఇంతటి పురోభివృద్ధిని గాంచడం ఆశ్చర్యకరమనుటలో సందేహములేదు. కాని మొగమోటమివిడిచి ఒకమారు స్థితిగతులను పర్యాలోచించి చూస్తే ఈ ఉద్యమ ప్రచారకులు చేస్తున్న శ్రమకు అనురూపమైన ఫలితం కన్పించకుండా ఉన్నదని అంగీకరింపక తప్పదు. ప్రజావిద్యయొక్క వికాసానికి అర్హ ప్రయత్నాలు జరగక పోవడం, జరుగుచున్న కొద్దిప్రయత్నం దౌర్భాగ్యవశంచేత తప్పుతోవలు పట్టడం గ్రంథాలయోద్యమం యొక్క నిజమైన ఔన్నత్యానికి ప్రబలాటంకములని నానిశ్చితాభిప్రాయం. జాతీయ సౌధానికి విద్యాసంస్థలు పునాది. గ్రంధాలయాలు పైకప్పు. గ్రంధాలయోద్యమానికి ఎడమీయని విద్యాప్రణాళిక గాని విద్యాసంస్కృతికి తల పెట్టని గ్రంధాలయోద్యమంగాని యెన్నిటికీ సమగ్రంకాజాలదు. హార్టాగ్ కమిటీ యొక్క మదింపు ప్రకారం ప్రారంభ విద్యకై వ్యయింపబడుచున్న మొత్తంలో నూటికి అరవై వంతులు దుబారాయగుచున్నది. మొదటి తరగతిలో ప్రవేశించిన నూరుమంది విద్యార్ధుల్లో నాల్గవ తరగతి వచ్చునప్పటికి 18 మంది మాత్రమే నిల్చుచున్నారు. గ్రంధ పఠనాభ్యాసం లేకపోవడంచేత వీరిలో ఎందఱుతిరిగి అవిద్యాపధాన పడుతున్నారో చెప్పనక్కరలేదు. అక్షరాస్యులందఱినీ లెక్కిస్తేనే నూటికిపది లేనపుడు గ్రంధాలయాలకు వెళ్లి తత్ సమగ్ర ప్రయోజనం<noinclude><references/></noinclude> j6m4uponbcho59nwzq3ajdh2g8eznqq పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/34 104 212075 552612 2026-04-10T08:10:49Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 552612 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>పొందడానికి సమర్ధతగల విద్యావంతుల సంఖ్య ఇంకను అల్పంగా ఉండకతప్పదు. కాబట్టి విద్యాసంస్థలను సమీచీనపద్ధతులపై నడిపించడానికి ప్రజాందోళన జరగాలి. అవకాశం ఉన్నంతలోనే విద్యావిధానాన్ని గ్రామజీవితాని కనుకూలంగా పారులేకుండా ఉండేటట్టు సంస్కరించడానికి విద్యాశాఖకు బాధ్యతవహించిన అధికారులు అనధికారులు అందరు పూనుకొనుటకు ప్రజలవైపుననుండి ఒత్తిడి కలగాలి. బరోడాలోని గ్రంథాలయోద్యమం ఆదర్శ ప్ర్రాయంగా ఎందుకు పరిగణింప బడుతున్నది? 1906లో నిర్బంధోచిత ప్రారంభ విద్యను అమలు జరిపి తద్వికాసమునకై 1914 లో అమెరికా పండితుల సంచాలకత్వం కింద గ్రంధాలయో ద్యమానికి పునాది వేసినా డా మహారాజు తత్ఫలి తంగా ఆసంస్థానంలో సుమారు వెయ్యిగంధా లయాలను సంస్థానప్రజలలో నూటికి సుమారు 74 గురు ఉపయోగించుకొనగలుగుతున్నారు. అట్లు కాకుండా విద్యాసంస్థలలోని కుళ్లును అట్లే యుంచి ఎన్ని గ్రంధాలయాలు నెలకొల్పినా, తన్మార్గమున ఇంకేవిధమైనకృషి సల్పినా పర్యా ప్తమైన ప్రయోజనం లభించడం అసాధ్యమని నాయూహ. కాబట్టి గ్రంధాలయ సంఘాలయొక్క కార్య ప్ర్రణాళికలో విద్యాప్రచారానికి కూడ యధో చితమైన స్థానం యిచ్చి విద్యాప్రచారం' పేరిట 'నేడు దేశంలో జరుగుచున్న కపటనాటకానికి భరతవాక్యం పలికించి ఎంత త్వరలో అనుకూల వాతావరణం కల్పిస్తే అంత శ్రేయస్సు కలు గుతుంది దేశానికి; గ్రంధాలయోద్యమం విజృం భించడానికి అపు డెంతో సౌలభ్యం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులకు తగిన శిక్షణా, ప్రోత్సాహమూ 32 ఉంటే గ్రంథాలయోద్యమానికీ గ్రామ పున ర్నిర్మాణోద్యమానికీ అల్పప్రయత్నంతో అన ల్పమైన దోహదం లభించగలదు ఈ విషయా లన్నింటిని గూర్చి ఈ గ్రంథాలయ సంఘం అర్హ రీతిని సమాలోచన చెయ్యాలని నా ప్ర్రార్ధన. ܣܘ గ్రంధాలయోద్యమం సఫలం కావాలంటే బడికిహాజరు కాలేని వయస్కులలో విద్యాప్రచా రం చాలఅవసరమని అందరు అంగీకరించిన విషయం ఈ వయోజన విద్యకోసం యూరప్ దేశాలలో గడచినశ తాబ్దమునుంచి జరుగుతున్న కృషి ఇంతా అంతా అని చెప్పడానికి వీలులేనిది. ఒక ఇంగ్లాండులోనే కొన్ని వేల రాత్రి పాఠశాలలు దేశౌన్నత్యాన్ని హృదయపూర్వకముగా కోరి పనిచేస్తున్న కమిటీల ఆధిపత్యం కింద నడుప బడుచున్నవి. మన దేశమునకట్టి సౌభాగ్యంలేదు. గడచినపది పండ్రెండు సంవత్సరాల్లో సక మంగా పనిచేయడం లేద నేకారణాన్ని పురస్కరించు కొని ప్రత్యేకం పగలు తీరిక లేని వారికి ఉద్దేశింపబడిన రాత్రి పాఠశాల టికి స్వస్తిచెప్పబడ్డది. అంతటితో వయోజన విద్యకై కావింపబడుతున్న కించిద్యత్నంకూడ నిర్మూలమగుట తటస్థించింది. తిరిగి రాత్రి పాఠ శాలలు, వేసంగిబడులు ఏర్పాటు చేసి అవి సక్రమంగా పనిచేసే మార్గాలు ఆలోచించి కృషిచేయవలసిన అవసరం ఉన్నది. జబల్ పూరులో రాబర్టుసన్ కాలేజి విద్యా ర్ధులు ఉపాధ్యాయులు సెలవుదినాల్లో పరిసర గ్రామాలకు వెళ్ళి వయోజనులందు విద్యా ప్రచారం చేయడానికి పూనుకొనడం చాల ప్రశంసనీయమైన విషయం. మన ప్రాంతాలలో కూడ విద్యాధికులంతా ఇట్టి మహత్కార్యా నికి పూనుకుంటే అనతికాలంలోనే వయస్కు<noinclude><references/></noinclude> t2ulg5no344h34f03yjfq3qtjmbxwd7 552619 552612 2026-04-10T09:01:13Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552619 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>పొందడానికి సమర్ధతగల విద్యావంతుల సంఖ్య ఇంకను అల్పంగా ఉండకతప్పదు. కాబట్టి విద్యాసంస్థలను సమీచీనపద్ధతులపై నడిపించడానికి ప్రజాందోళన జరగాలి. అవకాశం ఉన్నంతలోనే విద్యావిధానాన్ని గ్రామజీవితాని కనుకూలంగా పారులేకుండా ఉండేటట్టు సంస్కరించడానికి విద్యాశాఖకు బాధ్యతవహించిన అధికారులు అనధికారులు అందరు పూనుకొనుటకు ప్రజలవైపుననుండి ఒత్తిడి కలగాలి. బరోడా లోని గ్రంథాలయోద్యమం ఆదర్శప్రాయంగా ఎందుకు పరిగణింప బడుతున్నది? 1906 లో నిర్బంధోచిత ప్రారంభ విద్యను అమలు జరిపి తద్వికాసమునకై 1914 లో అమెరికా పండితుల సంచాలకత్వం కింద గ్రంధాలయోద్యమానికి పునాది వేసినాడా మహారాజు తత్ఫలితంగా ఆసంస్థానంలో సుమారు వెయ్యిగంధాలయాలను సంస్థానప్రజలలో నూటికి సుమారు 74 గురు ఉపయోగించు కొనగలుగుతున్నారు. అట్లు కాకుండా విద్యాసంస్థలలోని కుళ్లును అట్లేయుంచి ఎన్ని గ్రంధాలయాలు నెలకొల్పినా, తన్మార్గమున ఇంకేవిధమైన కృషి సల్పినా పర్యాప్తమైన ప్రయోజనం లభించడం అసాధ్యమని నాయూహ. కాబట్టి గ్రంధాలయ సంఘాల యొక్క కార్యప్రణాళికలో విద్యాప్రచారానికి కూడ యధోచితమైన స్థానం యిచ్చి విద్యాప్రచారం పేరిట నేడు దేశంలో జరుగుచున్న కపటనాటకానికి భరతవాక్యం పలికించి ఎంత త్వరలో అనుకూల వాతావరణం కల్పిస్తే అంత శ్రేయస్సు కలుగుతుంది దేశానికి; గ్రంధాలయోద్యమం విజృంభించడానికి అపుడెంతో సౌలభ్యం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులకు తగిన శిక్షణా, ప్రోత్సాహమూ ఉంటే గ్రంథాలయోద్యమానికీ గ్రామ పునర్నిర్మాణోద్యమానికీ అల్పప్రయత్నంతో అనల్పమైన దోహదం లభించగలదు ఈ విషయాలన్నింటిని గూర్చి ఈ గ్రంథాలయ సంఘం అర్హరీతిని సమాలోచన చెయ్యాలని నా ప్రార్ధన. గ్రంధాలయోద్యమం సఫలం కావాలంటే బడికిహాజరు కాలేని వయస్కులలో విద్యాప్రచారం చాల అవసరమని అందరు అంగీకరించిన విషయం ఈ వయోజన విద్యకోసం యూరప్దేశాలలో గడచినశ తాబ్దమునుంచి జరుగుతున్న కృషి ఇంతా అంతా అని చెప్పడానికి వీలులేనిది. ఒక ఇంగ్లాండులోనే కొన్ని వేల రాత్రి పాఠశాలలు దేశౌన్నత్యాన్ని హృదయపూర్వకముగా కోరిపనిచేస్తున్న కమిటీల ఆధిపత్యం కింద నడుపబడుచున్నవి. మన దేశమునకట్టి సౌభాగ్యంలేదు. గడచినపది పండ్రెండు సంవత్సరాల్లో సక్రమంగా పనిచేయడం లేదనే కారణాన్ని పురస్కరించు కొని ప్రత్యేకం పగలు తీరిక లేని వారికి ఉద్దేశింపబడిన రాత్రి పాఠశాల లన్నింటికీ స్వస్తిచెప్పబడ్డది. అంతటితో వయోజన విద్యకై కావింపబడుతున్న కించిద్యత్నంకూడ నిర్మూలమగుట తటస్థించింది. తిరిగి రాత్రి పాఠశాలలు, వేసంగిబడులు ఏర్పాటు చేసి అవి సక్రమంగా పనిచేసే మార్గాలు ఆలోచించి కృషి చేయవలసిన అవసరం ఉన్నది. జబల్పూరులో రాబర్టుసన్ కాలేజి విద్యార్ధులు ఉపాధ్యాయులు సెలవుదినాల్లో పరిసరగ్రామాలకు వెళ్ళి వయోజనులందు విద్యా ప్రచారం చేయడానికి పూనుకొనడం చాల ప్రశంసనీయమైన విషయం. మన ప్రాంతాలలో కూడ విద్యాధికులంతా ఇట్టి మహత్కార్యానికి పూనుకుంటే అనతికాలంలోనే వయస్కు<noinclude><references/></noinclude> sn72lj3b3pyziye6qz5zioeuz7ljosc 552620 552619 2026-04-10T09:02:35Z Brjswiki 6801 552620 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>పొందడానికి సమర్ధతగల విద్యావంతుల సంఖ్య ఇంకను అల్పంగా ఉండకతప్పదు. కాబట్టి విద్యాసంస్థలను సమీచీనపద్ధతులపై నడిపించడానికి ప్రజాందోళన జరగాలి. అవకాశం ఉన్నంతలోనే విద్యావిధానాన్ని గ్రామజీవితాని కనుకూలంగా పారులేకుండా ఉండేటట్టు సంస్కరించడానికి విద్యాశాఖకు బాధ్యతవహించిన అధికారులు అనధికారులు అందరు పూనుకొనుటకు ప్రజలవైపుననుండి ఒత్తిడి కలగాలి. బరోడా లోని గ్రంథాలయోద్యమం ఆదర్శప్రాయంగా ఎందుకు పరిగణింప బడుతున్నది? 1906 లో నిర్బంధోచిత ప్రారంభ విద్యను అమలు జరిపి తద్వికాసమునకై 1914 లో అమెరికా పండితుల సంచాలకత్వం కింద గ్రంధాలయోద్యమానికి పునాది వేసినాడా మహారాజు తత్ఫలితంగా ఆసంస్థానంలో సుమారు వెయ్యిగంధాలయాలను సంస్థానప్రజలలో నూటికి సుమారు 74 గురు ఉపయోగించు కొనగలుగుతున్నారు. అట్లు కాకుండా విద్యాసంస్థలలోని కుళ్లును అట్లేయుంచి ఎన్ని గ్రంధాలయాలు నెలకొల్పినా, తన్మార్గమున ఇంకేవిధమైన కృషి సల్పినా పర్యాప్తమైన ప్రయోజనం లభించడం అసాధ్యమని నాయూహ. కాబట్టి గ్రంధాలయ సంఘాల యొక్క కార్యప్రణాళికలో విద్యాప్రచారానికి కూడ యధోచితమైన స్థానం యిచ్చి విద్యాప్రచారం పేరిట నేడు దేశంలో జరుగుచున్న కపటనాటకానికి భరతవాక్యం పలికించి ఎంత త్వరలో అనుకూల వాతావరణం కల్పిస్తే అంత శ్రేయస్సు కలుగుతుంది దేశానికి; గ్రంధాలయోద్యమం విజృంభించడానికి అపుడెంతో సౌలభ్యం ఏర్పడుతుంది. ఉపాధ్యాయులకు తగిన శిక్షణా, ప్రోత్సాహమూ ఉంటే గ్రంథాలయోద్యమానికీ గ్రామ పునర్నిర్మాణోద్యమానికీ అల్పప్రయత్నంతో అనల్పమైన దోహదం లభించగలదు ఈ విషయాలన్నింటిని గూర్చి ఈ గ్రంథాలయ సంఘం అర్హరీతిని సమాలోచన చెయ్యాలని నా ప్రార్ధన. గ్రంధాలయోద్యమం సఫలం కావాలంటే బడికిహాజరు కాలేని వయస్కులలో విద్యాప్రచారం చాల అవసరమని అందరు అంగీకరించిన విషయం ఈ వయోజన విద్యకోసం యూరప్దేశాలలో గడచినశ తాబ్దమునుంచి జరుగుతున్న కృషి ఇంతా అంతా అని చెప్పడానికి వీలులేనిది. ఒక ఇంగ్లాండులోనే కొన్ని వేల రాత్రి పాఠశాలలు దేశౌన్నత్యాన్ని హృదయపూర్వకముగా కోరిపనిచేస్తున్న కమిటీల ఆధిపత్యం కింద నడుపబడుచున్నవి. మన దేశమునకట్టి సౌభాగ్యంలేదు. గడచినపది పండ్రెండు సంవత్సరాల్లో సక్రమంగా పనిచేయడం లేదనే కారణాన్ని పురస్కరించు కొని ప్రత్యేకం పగలు తీరిక లేని వారికి ఉద్దేశింపబడిన రాత్రి పాఠశాల లన్నింటికీ స్వస్తిచెప్పబడ్డది. అంతటితో వయోజన విద్యకై కావింపబడుతున్న కించిద్యత్నంకూడ నిర్మూలమగుట తటస్థించింది. తిరిగి రాత్రి పాఠశాలలు, వేసంగిబడులు ఏర్పాటు చేసి అవి సక్రమంగా పనిచేసే మార్గాలు ఆలోచించి కృషి చేయవలసిన అవసరం ఉన్నది. జబల్ పూరులో రాబర్టుసన్ కాలేజి విద్యార్ధులు ఉపాధ్యాయులు సెలవుదినాల్లో పరిసరగ్రామాలకు వెళ్ళి వయోజనులందు విద్యా ప్రచారం చేయడానికి పూనుకొనడం చాల ప్రశంసనీయమైన విషయం. మన ప్రాంతాలలో కూడ విద్యాధికులంతా ఇట్టి మహత్కార్యానికి పూనుకుంటే అనతికాలంలోనే వయస్కు<noinclude><references/></noinclude> ps2hmaaacxmqu7blkivou723ibat6ev పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.11 (1937).pdf/35 104 212076 552622 2026-04-10T09:11:49Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 552622 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>లందు విజ్ఞానవ్యాప్తి కల్గడం చాల సులభం. ఇట్టివి మరియింకను అర్హమని తోచినట్టివియునగు మార్గాల ననుసరించి వయోజన విద్యా వ్యాప్తికి కృషిచేయడం అవసరం. ఇక ప్రజాగ్రంథాలయాలను ఏరీతిగా నిర్వహించవలెనో, గ్రామస్థులందు గ్రంథ పఠనాభిలాషను ఏరీతిగా అభివృద్ధిపరచవలెనో ఇత్యాది ఆవశ్యక విషయాలు చర్చిఁపదగిన వెన్నో గలవు. కాలహరణమునకు వెఱచి ఆ విషయాలన్నింటినీ విజ్ఞానధనులైన ప్రతినిధుల సమగ్ర చర్చకు చర్చకు వదలి గ్రంథాలయోద్య మాభిమానులందరు సమరసభావంతో ఆచరణయోగ్యమైన యొక కార్య ప్రణాళిక ననుసరించి ఇతోధికంగా కార్యోన్ముఖు లయ్యెదరని విశ్వసించు చున్నాను. పూజ్యులు విద్యాధికులునగు లెఫ్టినెంటు కల్నల్ కె. వి రమణారావు ఐ. యం. ఎస్. గారిని మహాసభాధ్యక్ష స్థాన మలంకరించడానికి వినయపూర్వకంగా అర్ధించుచున్నాను. {{rule |6em }} కాని ప్ర ప ం చ (ధర్మక ర్తయు లోకసంచారియు ప్రవేశింతురు ధర్మ:-లోక సంచారీ ! నిన్ను నియమించి సంవత్సరములై నది. ప్రపంచము శాంతి మార్గము కొఱకు తహతహ లాడుచున్నది. శాంతిస్థాపన ప్రయత్నములు ఆపుటకు ఇక వీలులేదు. నీవు గ్రహించిన విషయము లేవో మెటనే చెప్పుము. లోక సం:-మీ ఆజ్ఞప్రకారం ప్రపంచ శాంతి మార్గముల కొఱకు అప్పటినుండి పరిశోధ నలు చేయుచున్నాను. అనేకమంది చిత్త వృత్తులు పరిశోధించినాను. పెక్కు రహస్య ములు గ్రహించితిని. అన్నీ బయలు పెడి తే లోకుల దూషణకు పాల్పడతానేమోనని భయమగుచున్నది. ధర్మ:-మానవశాంతిఱకు నీపరిశోధనలు ఉప యోగపడే యెడల నీ 'వట్టి దూషణకు పాత్రు డవు కాజాలవు. కాన నీ పరిశోధనల వివర నుల తెలియబఱపుము. 433 పు గుట్టు తి లోక సం :- సరే ! వినండి. ప్రపంచములో ప్రతి దేశమునకు ఇతర దేశములతోను, వాటివిజ్ఞాన ములతోడను సన్నిహితసంబంధము ఏర్పడి ఉన్నది. ఏ దేశమువారు ఆ దేశపరిస్థితులు మాత్రము చూచుకొని సరిచేసుకొందా మంటే పూర్వమువలె వీలులేదు. ధర్మ:- ఇందువలన ప్రమాదములేదు. కాముకులకు ఒక దేశము నుద్దేశించి పని చేయుటకంటె ప్రపంచ మంతటిని గూర్చి చేయుటలో ఉత్సాహము హెచ్చుగా ఉండునుగదా! నేను ఒక మాట అడుగు తాను. దానికి సమాధానము చెప్పుము. ప్రజలలో ఈశ్వరవాదము హెచ్చా ? నిరీశ్వర వాదము హెచ్చా ? లోక సం:-ఈశ్వర వాద మే హెచ్చు; నిరీశ్వర వాదము కొద్దిగా మాత్రమున్నది. ఇప్పుడు సుమారు 200 కోట్ల ప్రజలలో నాల్గోవంతు క్రైస్తవ సిద్ధాంతములకిండను, ఎనిమిదవవంతు హిం దూ సిద్ధాంతముల క్రిందను, ఎనిమిదోవంతు<noinclude><references/></noinclude> 4cg91e470cvjzcrsv9l9eeplu2jhi3n అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/శైలబాల 0 212077 552623 2026-04-10T10:25:01Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = శైలబాల | previous = [[..//]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="248" to="262" /> {{PD-India}} [[వర్గం:కథలు]]' 552623 wikitext text/x-wiki {{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = శైలబాల | previous = [[..//]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="248" to="262" /> {{PD-India}} [[వర్గం:కథలు]] 5euog6oqm2ka3zkggshm20bw865p2gp 552624 552623 2026-04-10T10:25:54Z Rajasekhar1961 50 552624 wikitext text/x-wiki {{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = శైలబాల | previous = [[..//]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="248" to="257" /> {{PD-India}} [[వర్గం:కథలు]] 2hrhywrdffth6nct0qqneooek8f4mai అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల 0 212078 552625 2026-04-10T10:26:57Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = శైలబాల | previous = [[..//]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="240" to="357" /> {{PD-India}} [[వర్గం:కథలు]]' 552625 wikitext text/x-wiki {{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = శైలబాల | previous = [[..//]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="240" to="357" /> {{PD-India}} [[వర్గం:కథలు]] soa3t5o9i8yv9zo1nnwzxb8ogwww7s3 552626 552625 2026-04-10T10:27:53Z Rajasekhar1961 50 552626 wikitext text/x-wiki {{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = శైలబాల | previous = [[..//]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="247" to="357" /> {{PD-India}} [[వర్గం:కథలు]] rntcwhw98g2mzj9z990uem4k02zfohu 552627 552626 2026-04-10T10:29:50Z Rajasekhar1961 50 552627 wikitext text/x-wiki {{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = శైలబాల | previous = [[..//]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="247" to="370" /> {{PD-India}} [[వర్గం:కథలు]] mxobr7c515bzp7ugdqsscwxpd3nv0vk 552628 552627 2026-04-10T10:30:30Z Rajasekhar1961 50 552628 wikitext text/x-wiki {{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = శైలబాల | previous = | next = [[../శైలబాల/]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="247" to="370" /> {{PD-India}} [[వర్గం:కథలు]] 80jp03dmczxhpcwabytxv0abeloovej అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/నాగలి 0 212079 552629 2026-04-10T10:32:20Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = నాగలి | previous = [[../శైలబాల/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="258" to="279" /> {{PD-India}} [[వర్గం:కథలు]]' 552629 wikitext text/x-wiki {{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = నాగలి | previous = [[../శైలబాల/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="258" to="279" /> {{PD-India}} [[వర్గం:కథలు]] dvh0dsjvz7sligenvmrga0kw84qbm0n అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/పాడు దేవాలయం 0 212080 552630 2026-04-10T10:45:46Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = పాడు దేవాలయం | previous = [[../నాగలి/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="280" to="283" /> {{PD-India}} [[వర్గం:కథలు]]' 552630 wikitext text/x-wiki {{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = పాడు దేవాలయం | previous = [[../నాగలి/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="280" to="283" /> {{PD-India}} [[వర్గం:కథలు]] edwnmpx7tcw8vzg93m444u8s54lv452 552631 552630 2026-04-10T10:46:09Z Rajasekhar1961 50 552631 wikitext text/x-wiki {{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = పాడు దేవాలయం | previous = [[../నాగలి/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="280" to="282" /> {{PD-India}} [[వర్గం:కథలు]] dggclaf0hlwo16aoliu96m6tlexpgk7