వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.46.0-wmf.23
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
వాడుకరి:శ్రీరామమూర్తి
2
20449
552990
551839
2026-04-15T02:14:57Z
శ్రీరామమూర్తి
1517
/* పాఠ్యంకూర్పు వివరాలు */
552990
wikitext
text/x-wiki
నా పేరు శ్రీరామమూర్తి
[[దస్త్రం:Srirama murthy.jpg|thumb|శ్రీరామమూర్తి]]
==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు==
* [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.]
==వికీసోర్స్ గణాంకాలు==
* [https://tools.wmflabs.org/phetools/statistics.php అన్ని వికీసోర్సులలో తెలుగు వికీసోర్స్ స్థానం యొక్క విశ్లేషణ.]
¼ - ¾
½
== పాఠ్యంకూర్పు వివరాలు==
* మొత్తం పుటలు=39078
* మొత్తం పుస్తకాలు=160
{| class="wikitable sortable"
!క్రమ సంఖ్య
!పుస్తకం పేరు
!పుటలు
!ఈ బుక్
|-
|1
|[[సూచిక:AndhraRachaitaluVol1.djvu|ఆంధ్రరచయితలు]]
|407
|ఉంది
|-
|2
|[[సూచిక:Naajeevitayatrat021599mbp.pdf|నాజీవితయాత్ర]]
|830
|ఉంది
|-
|3
|[[సూచిక:AndhraKavulaCharitamuVol2.pdf|ఆంధ్ర కవులచరిత్రము]]
|268
|ఉంది
|-
|4
|[[సూచిక:DivyaDesaPrakasika.djvu|దివ్యదేశ ప్రకాశిక]]
|398
|ఉంది
|-
|5
|[[సూచిక:Kankanamu020631mbp.pdf|కంకణం]]
|26
|ఉంది
|-
|6
|[[సూచిక:SampurnaNeetiChandrikaPart1.pdf|సంపూర్ణ నీతిచంద్రిక]]
|104
|ఉంది
|-
|7
|[[సూచిక:Pranayamamu.pdf|ప్రాణాయామము]]
|134
|ఉంది
|-
|8
|[[సూచిక:GanapathiMuniCharitraSamgraham.djvu|గణపతిముని చరిత్ర]]
|135
|ఉంది
|-
|9
|[[సూచిక:Womeninthesmrtis026349mbp.pdf|స్మృతికాలపు స్త్రీలు]]
|220
|లేదు
|-
|10
|[[సూచిక:Abalaa sachcharitra ratnamaala.pdf|అబలా సచ్చరిత్ర రత్నమాల]]
|276
|లేదు
|-
|11
|[[సూచిక:SamardaRamadasu.djvu|సమర్థ రామదాసు]]
|68
|ఉంది
|-
|12
|[[సూచిక:Nanakucharitra021651mbp.pdf|నానకు చరిత్ర]]
|131
|ఉంది
|-
|13
|[[సూచిక:Abraham Lincoln (Telugu).pdf|ఆబ్రహాము లింకను]]
|238
|ఉంది
|-
|14
|[[సూచిక:Andhraveerulupar025903mbp.pdf|ఆంధ్ర వీరులు]]
|137
|-
|15
|[[సూచిక:Andhraveerulupar025958mbp.pdf|ఆంధ్ర వీరులు-రెండవభాగము]]
|177
|-
|16
|[[సూచిక:Andrulasangikach025988mbp.pdf|ఆంధ్రుల సాంఘిక చరిత్ర]]
|423
|ఉంది
|-
|17
|[[సూచిక:Srivemanayogijiv00unknsher.pdf|శ్రీవేమనయోగి జీవితము]]
|35
|ఉంది
|-
|18
|[[సూచిక:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf|వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము]]
|224
|ఉంది
|-
|19
|[[సూచిక:Chandamama 1947 07.pdf|చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947]]
|52
|-
|20
|[[సూచిక:Aandhra deishamu videisha yaatrikulu.pdf|ఆంధ్రదేశము విదేశయాత్రికులు]]
|175
|-
|21
|[[సూచిక:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf|దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు]]
|235
|ఉంది
|-
|22
|[[సూచిక:Andhra bhasha charitramu part 1.pdf|ఆంధ్ర భాషా చరిత్రము 1. వ భాగము]]
|450
|-
|23
|[[సూచిక:Aliya Rama Rayalu.pdf|అళియరామరాయలు]]
|245
|-
|24
|[[సూచిక:Bhaarata arthashaastramu (1958).pdf| భారత అర్థశాస్త్రము]]
| 453
|ఉంది
|-
|25
|[[సూచిక:Bharatiyanagarik018597mbp.pdf|భారతీయ నాగరికతా విస్తరణము]]
|87
|-
|26
|[[సూచిక:Adhunikarajyanga025633mbp.pdf|ఆధునిక రాజ్యాంగ సంస్థలు]]
|332
|-
|27
|[[సూచిక:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf|ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు]]
|83
|-
|28
|[[ సూచిక:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf|బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము]]
|145
|-
|29
|[[సూచిక:Aandruu kaarnegii, Telugu (1955).pdf|ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)]]
|242
|-
|30
|[[సూచిక:Jeevasastra Samgrahamu.pdf|జీవశాస్త్ర సంగ్రహము]]
|370
|-
|31
|[[సూచిక:The Verses Of Vemana (1911).pdf|వేమన పద్యములు (సి. పి. బ్రౌన్)]]
|190
|-
|32
| [[సూచిక:2015.372412.Taataa-Charitramu.pdf|తాతాచరిత్రము]]
|180
|-
|33
|[[సూచిక:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf|సుమిత్ర చరిత్రమ్]]
|27
|ఉంది
|-
|34
|[[సూచిక:Bobbili yuddam natakam.pdf|బొబ్బిలియుద్ధనాటకము]]
|113
|-
|35
|[[సూచిక:PadabhamdhaParijathamu.djvu|పదబంధ పారిజాతము]]
|875
|-
|36
|[[సూచిక:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf|చిన్నయసూరి జీవితము]]
|110
|-
|37
|[[సూచిక:Anandam Manishainavadu.pdf|ఆనందం మనిషైనవాడు]]
|71
|-
|38
|[[సూచిక:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf|అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము]]
|29
|-
|39
|[[సూచిక:2015.373190.Athma-Charitramu.pdf|ఆత్మచరిత్రము]]
|660
|-
|40
|[[సూచిక:Kumbharaana020881mbp.pdf|కుంభరాణా(మీరాబాయి)]]
|88
|-
|41
|[[సూచిక:2015.392383.Kavi-Kokila.pdf|కవికోకిల గ్రంథావళి - 3 : నాటకములు]]
|330
|లేదు
|-
|42
|[[సూచిక:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf|బిల్వమంగళ]]
|122
|-
|43
|[[సూచిక:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf|సాహిత్య మీమాంస]]
|225
|-
|44
|[[సూచిక:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf|అబలాసచిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము]]
|295
|-
|45
|[[సూచిక:Mana-Jeevithalu.pdf|మన జీవితాలు]]
|325
|-
|46
|[[సూచిక:2015.328360.Andhra-Mahaniyulu.pdf|ఆంధ్ర మహనీయులు]]
|80
|-
|47
|[[సూచిక:2015.329863.Vallabaipatel.pdf|వల్లభాయి పటేల్]]
|155
|-
|48
|[[సూచిక:Little Masters Sulabha Vyakaranamu.pdf|లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము]]
|145
|ఉంది
|-
|49
|[[సూచిక:Jagattu-Jiivamu.pdf|జగత్తు - జీవము]]
|60
|-
|50
|[[సూచిక:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf|ఇంద్రాణీ సప్తశతీ]]
|260
|-
|51
|[[సూచిక:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf|స్వీయ చరిత్రము-ప్రథమ భాగము]]
|380
|ఉంది
|-
|52
|[[సూచిక:Mahaapurushhula-jiivitamulu.pdf|మహాపురుషుల జీవితములు]]
|385
|-
|53
|[[సూచిక:Bhagira Loya.djvu|భోగీరలోయ, ఇతరకథలు]]
|115
|-
|54
|[[సూచిక:Kavijeevithamulu.pdf|కవి జీవితములు]]
|690
|-
|55
|[[సూచిక:Sasi Kala, Adavi Bapiraju.pdf|శశికళ]]
|110
|-
|56
|[[సూచిక:2015.393685.Umar-Kayyam.pdf|ఉమర్ ఖయ్యామ్]]
|220
|లేదు
|-
|57
|[[సూచిక:Gona gannareddy, Adavi Bapiraju.pdf|గోన గన్నారెడ్డి]]
|320
|లేదు
|-
|58
|[[సూచిక:Kashi-Majili-Kathalu.pdf|కాశీ మజిలీ కథలు]]
|175
|లేదు
|-
|59
|[[సూచిక:సత్యశోధన.pdf|సత్యశోధన]]
|425
|లేదు
|-
|60
|[[సూచిక:Chandragupta-Chakravarti.pdf|చంద్రగుప్త చక్రవర్తి]]
|165
|లేదు
|-
|61
|[[సూచిక:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf|ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరి నరసయ్య]]
|190
|లేదు
|-
|62
|[[సూచిక:Maha-Purushula-Jeevitacaritramulu.pdf|మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)]]
|180
|లేదు
|-
|63
|[[సూచిక:MaharshulaCharitraluVol6.djvu|మహర్షుల చరిత్రలు, ఆరవ సంపుటము]]
|100
|లేదు
|-
|64
|[[సూచిక:నారాయణీయము.pdf|నారాయణీయము]]
|64
|లేదు
|-
|65
|[[సూచిక:Maharshula-Charitralu.firstpart.pdf|మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)]]
|166
|లేదు
|-
|66
|[[సూచిక:మాటా మన్నన.pdf|మాటా మన్నన]]
|65
|లేదు
|-
|67
|[[సూచిక:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf|దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర]]
|390
|లేదు
|-
|68
|[[సూచిక:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf|ప్రపంచచరిత్ర మొదటి భాగము, 1]]
|108
|లేదు
|-
|69
|[[సూచిక:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf|భారతదేశమున బ్రిటీష్ రాజతంత్ర యుగము అను బ్రిటీష్ ఇండియా చరిత్ర]]
|762
|లేదు
|-
|70
|[[సూచిక:Tikkana-Somayaji.pdf|తిక్కన సోమయాజి]]
|130
|లేదు
|-
|71
|[[సూచిక:Thimmarusumantri.pdf|తిమ్మరుసు మంత్రి]]
|160
|లేదు
|-
|72
|[[సూచిక:Parama yaugi vilaasamu (1928).pdf|పరమయోగి విలాసము]]
|685
|లేదు
|-
|73
|[[సూచిక:Venoba-Bhudanavudyamamu.pdf|వినోబా బూదాన వుద్యమము]]
|49
|లేదు
|-
|74
|[[సూచిక:Sri-Srinivasa-Ayengar.pdf|శ్రీమా౯ ఎస్. శ్రీనివాస అయ్యంగారి జీవితము]]
|160
|లేదు
|-
|75
|[[సూచిక:Jajimalli by Adivi Bapiraju.pdf|నరుడు మరియు జాజిమల్లి]]
|73
|లేదు
|-
|76
|[[సూచిక:హంసవింశతి.pdf|హంసవింశతి]]
|70
|లేదు
|-
|77
|[[సూచిక:హాస్యవల్లరి.pdf|హాస్యవల్లరి]]
|170
|లేదు
|-
|78
|[[సూచిక:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf|సింహాసన ద్వాత్రింశిక]]
|53
|లేదు
|-
|79
|[[సూచిక:Saundarya-Lahari.pdf|సౌందర్యలహరి (వావిళ్ల 1929)]]
|75
|లేదు
|-
|80
|[[సూచిక:Andhra-Bhashabhushanamu.pdf|ఆంధ్రభాషాభూషణము]]
|63
|లేదు
|-
|81
|[[సూచిక:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf|కొప్పరపు సోదర కవుల కవిత్వము]]
|322
|లేదు
|-
|82
|[[సూచిక:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf|తెనాలి రామకృష్ణకవి చరిత్రము]]
|70
|లేదు
|-
|83
|[[సూచిక:Kavikokila-Granthamala3-Khandakavya.pdf|కవికోకిల గ్రంథావళి, ఖండకావ్యములు]]
|310
|లేదు
|-
|84
|[[సూచిక:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf|కవికోకిల గ్రంథావళి, వ్యాసములు]]
|270
|లేదు
|-
|85
|[[సూచిక:శ్రీ రామాయణము - బాలకాండము.pdf|శ్రీరామాయణము, మొదటిసంపుటము]]
|570
|లేదు
|-
|86
|[[సూచిక:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf|బసవపురాణము]]
|350
|లేదు
|-
|87
|[[సూచిక:Dvipada-basavapuraanamu.pdf|ద్విపద బసవపురాణము]]
|300
|లేదు
|-
|88
|[[సూచిక:Oka-Yogi-Atmakatha.pdf|ఒక యోగి ఆత్మకథ]]
|850
|లేదు
|-
|89
|[[సూచిక:తెలుగు వాక్యం.pdf|తెలుగు వాక్యం]]
|112
|లేదు
|-
|90
|[[సూచిక:Navanadhacharitra.pdf|నవనాథచరిత్ర]]
|308
|లేదు
|-
|91
|[[సూచిక:Kavijanaashrayamu-Chandashastramu.pdf|కవిజనాశ్రయము]]
|120
|లేదు
|-
|92
|[[సూచిక:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf|శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి]]
|400
|లేదు
|-
|93
|[[సూచిక:Naayakuraalu.Play.pdf|నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)]]
|130
|లేదు
|-
|94
|[[సూచిక:Rangun Rowdy Drama.pdf|రంగూన్ రౌడీ]]
|110
|లేదు
|-
|95
|[[సూచిక:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf|శ్రీమహాభారత శ్రీమద్రామయణ విమర్శము]]
|200
|లేదు
|-
|96
|[[సూచిక:Tenugutota.pdf|తెనుగు తోట]]
|40
|లేదు
|-
|97
|[[సూచిక:Prabhutvamu.pdf|ప్రభుత్వము]]
|110
|లేదు
|-
|98
|[[సూచిక:Manooshakti.pdf|మనోశక్తి]]
|55
|లేదు
|-
|99
|[[సూచిక:Ambati Venkanna Patalu -2015.pdf|అంబటి వెంకన్న పాటలు]]
|400
|లేదు
|-
|100
|[[సూచిక:Kaashii-Majilee-Kathalu-V10.pdf|కాశీమజిలీకథలు, పదవభాగము]]
|420
|లేదు
|-
|101
|[[సూచిక:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf|కాశీమజిలీకథలు, ఎనిమిదవభాగము]]
|395
|లేదు
|-
|102
|[[సూచిక:కాశీమజిలీకథలు -01.pdf|కాశీమజిలీకథలు, మొదటిభాగము]]
|305
|లేదు
|-
|103
|[[సూచిక:కాశీమజిలీకథలు -02.pdf|కాశీమజిలీకథలు, రెండవభాగము]]
|245
|లేదు
|-
|104
|[[సూచిక:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf|కాశీమజిలీకథలు, మూఁడవ భాగము]]
|300
|లేదు
|-
|105
|[[సూచిక:కాశీమజిలీకథలు -09.pdf|కాశీమజిలీకథలు, తొమ్మిదవ భాగము]]
|299
|లేదు
|-
|106
|[[సూచిక:కాశీమజిలీకథలు -04.pdf|కాశీమజిలీకథలు, 4వ భాగము]]
|321
|లేదు
|-
|107
|[[సూచిక:కాశీమజిలీకథలు-05.pdf|కాశీమజిలీకథలు, అయిదవ భాగము]]
|330
|లేదు
|-
|108
|[[సూచిక:కాశీమజిలీకథలు-06.pdf|కాశీమజిలీకథలు, ఆఱవ భాగము]]
|325
|లేదు
|-
|109
|[[సూచిక:కాశీమజిలీకథలు -07.pdf|కాశీమజిలీకథలు, ఏడవ భాగము]]
|290
|లేదు
|-
|110
|[[సూచిక:కాశీమజిలీకథలు-12.pdf|కాశీమజిలీకథలు, పండ్రెండవ భాగము]]
|290
|లేదు
|-
|111
|[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ సంపుటం]]
|132
|లేదు
|-
|112
|[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ సంపుటం]]
|385
|లేదు
|-
|113
|[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ సంపుటం]]
|311
|లేదు
|-
|114
|[[సూచిక:Srikrishnudu-Choopina-Maargamu.pdf|శ్రీకృష్ణుడు చూపిన మార్గము]]
|150
|లేదు
|-
|115
|[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ సంపుటం]]
|380
|లేదు
|-
|116
|[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ సంపుటం]]
|180
|లేదు
|-
|117
|[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ సంపుటం]]
|300
|లేదు
|-
|118
|[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ సంపుటం]]
|300
|లేదు
|-
|119
|[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - పదవ సంపుటం]]
|179
|లేదు
|-
|120
|[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ సంపుటం]]
|600
|లేదు
|-
|121
|[[సూచిక:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf|బ్రహ్మోత్తరఖండము]]
|348
|లేదు
|-
|122
|[[సూచిక:పద్మపురాణము (మడికి సింగన).pdf|పద్మపురాణము]]
|300
|లేదు
|-
|123
|[[సూచిక:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF|అనుభవసారము]]
|53
|లేదు
|-
|124
|[[సూచిక:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf|చతుర్వేదసారము]]
|150
|లేదు
|-
|125
|[[సూచిక:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf|ఇంద్రాణీ సప్తశతీ]]
|260
|లేదు
|-
|126
|[[సూచిక:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf|నారదీయపురాణము]]
|192
|లేదు
|-
|127
|[[సూచిక:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf|ఆంధ్రకామందకము]]
|254
|లేదు
|-
|128
|[[సూచిక:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf|వావిలాల సోమయాజులు సాహిత్యం - 2]]
|550
|లేదు
|-
|129
|[[సూచిక:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf|సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము మూడవ సంపుటము]]
|700
|లేదు
|-
|130
|[[సూచిక:రామాయణ విశేషములు.pdf|రామాయణ విశేషములు]]
|241
|లేదు
|-
|131
|[[సూచిక:Bala Neethi.pdf|బాలనీతి]]
|150
|లేదు
|-
|132
|[[సూచిక:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf|ఆంధ్రనాటక పద్యపఠనం]]
|160
|లేదు
|-
|133
|[[సూచిక:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu|సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
|390
|లేదు
|-
|134
|[[సూచిక:Na-Jevitha-Katha-Navyandramu.pdf|నా జీవిత కథ - నవ్యాంధ్రము]]
|500
|లేదు
|-
|135
|[[సూచిక:Bharatiya Chitrakala (Telugu) By T.Rama Rao, 1930.pdf|భారతీయ చిత్రకళ]]
|230
|లేదు
|-
|136
|[[సూచిక:Garimellavyasalu019809mbp.pdf|గరిమెళ్ళ వ్యాసాలు]]
|185
|లేదు
|-
|137
|[[సూచిక:Golakonda patrika sampadakeeyalu.pdf|గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
|235
|లేదు
|-
|138
|[[సూచిక:దొంగాటకం.djvu|దొంగాటకం]]
|80
|లేదు
|-
|139
|[[సూచిక:Arya Katha Nidhi.pdf|ఆర్యకథానిధి]]
|330
|లేదు
|-
|140
|[[సూచిక:Kabir (TeluguBook).pdf|కబీరు]]
|24
|లేదు
|-
|141
|[[సూచిక:కృష్ణరాయ విజయము (1981).pdf|కృష్ణరాయ విజయము]]
|150
|లేదు
|-
|142
|[[సూచిక:ఓయూ సాహితి.pdf|ఓయూ సాహితి (వార్షిక సంచిక-2023)]]
|76
|లేదు
|-
|143
|[[సూచిక:వేటూరివారి పీఠికలు, మొదటిభాగము.pdf|వేటూరివారి పీఠికలు, మొదటిభాగము.]]
|341
|లేదు
|-
|144
|[[సూచిక:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf|వేటూరివారి పీఠికలు, రెండవభాగము.]]
|485
|లేదు
|-
|145
|[[సూచిక:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf|సూత పురాణము ద్వితీయాశ్వాసమ]]
|89
|లేదు
|-
|146
|[[సూచిక:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf|అనుభవాలూ - జ్ఞాపకాలూను]]
|586
|లేదు
|-
|147
|[[సూచిక:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf|పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?]]
|113
|లేదు
|-
|148
|[[సూచిక:Srungaramaruka Kavyam By Veturi Prabhakara Sastry In Telugu.pdf|శృంగారామరుకావ్యము]]
|18
||లేదు
|-
|149
|[[సూచిక:Science Ela Putti Perigindhi VBS JVV.pdf|సైన్సు ఎలా పుట్టి పెరిగింది?]]
|60
|లేదు
|-
|150
|[[సూచిక:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf|కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/తృతీయభాగము]]
| 296
|-
|151
|[[సూచిక:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf|కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/నాలుగవభాగము]]
|390
|-
|152
|[[సూచిక:Upanyaasapayoonidhi (1911).pdf|ఉపన్యాస పయోనిధి]]
|-
|153
|[[సూచిక:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf|ఆత్మవిచారము (పూర్వ భాగము)]]
|345
|-
|154
|[[సూచిక:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu|ఆత్మవిచారము, ఆత్మవిచారము (ఉత్తరభాగము)]]
|438
|-
|155
|[[సూచిక:అగస్త్యలింగశతకము తాడికొండ పూర్ణమల్లికార్జునఅయ్యవార్లంగారు 1935 110 P Ask01q124 హ్హు.pdf|అగస్త్యలింగ శతకము]]
|100
|-
|156
|[[సూచిక:VedantaRatnakaramu1919.pdf|వేదాంత రత్నాకరము]]
|28
|-
|157
|[[సూచిక:Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf|అడివి బాపిరాజు రచనలు–8; కథలు]]
|230
|-
|158
|[[సూచిక:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf|అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]]
|170
|-
|159
|[[సూచిక:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf|అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం, సంపుటి-2]]
|100
|-
|160
|[[సూచిక:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf|ధమ్మపదము]]
|150
|}
== చిత్రం ==
{{Css image crop
|Image = DivyaDesaPrakasika.djvu
|Page = 30
|bSize = 378
|cWidth = 311
|cHeight = 477
|oTop = 45
|oLeft = 66
|Location = center
|Description =
}}
kk3ipyofs8zt4vg5do0s2e48cxfm964
వాడుకరి:Arjunaraoc/common.js
2
30003
552981
360822
2026-04-15T00:50:38Z
Arjunaraoc
364
activate cropimage.js
552981
javascript
text/javascript
/* User:Arjunaraoc/common.js */
importScript( 'User:Arjunaraoc/scripts/cropimage.js' );
dmpyk4q75p63um9il442umzcflpff8s
పుట:Sarada Lekhalu Vol 1.pdf/28
104
59182
552994
552941
2026-04-15T03:36:23Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
552994
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|4|శారదలేఖలు|}}</noinclude>యూరు వెళ్లవలసివచ్చినను తదనుగుణ్యముగ బ్రయాణమగుట నేర్చుకొంటిని.
తఱుచు మార్పులు గలుగు చుండెడి యుద్యోగికి యిల్లాలైన స్త్రీ కొద్ది యుపకరణములతో గృహకృత్యములను
పచనకార్యములను నెరవేర్చెడి నేర్పును గలిగియుండవలెనని నే నిప్పుడు నా యనుభవమువలన తెలిసికొన గలిగితిని. మన యాంధ్ర స్త్రీలు అందు ముఖ్యముగ నుత్తర సర్కారులకుఁ జెందిన మన మీ విషయమున అసమర్థలమని యొప్పుకొనక తప్పదు. ఊరగాయ జాడీలకు, పచ్చడి బానలకు మాత్రమే రైలులో నొకపెట్టెయు యింటియందొక గదియు మనకుఁ గావలయును. కావుననే "తమిళ స్త్రీలవలె మీకు క్లుప్తత
చేతగాదు. ప్రయాణమునకు మీరు పనికి రా"రని మగవారనుట మనకు పరిపాటియైనది. ఈ మధ్య మన ప్రాంతమునుండి యొక రీగ్రామమున కుద్యోగసందర్భమున నేతెంచిరి. వారి సామాను నాలుగైదు బండ్లనిండ యుండెను. అయిదాఱు మంచములను గూడ దెచ్చిరి. ఈ ప్రాంతమున మంచముల వాడుకొను అభ్యాసములేదు. శిశువులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, నిండుచూలింతలు, పచ్చి బాలెంతలుగూడ క్రిందనే
పడుకొందురు. కాన పైఁజెప్పిన వారి సామానులను ముఖ్యముగా మంచములను బండ్లనుండి దింపుచుండగా నిచ్చటి వారాబాలవృద్ధు లతిచోద్యముతో సర్కసు కంపినీవారి సామానును చూచినట్లు మూగిమూగి చూడసాగిరి. నా కూరక<noinclude></noinclude>
l9doapxzt7xwid3fyb7pfe0b2z98aah
పుట:Sarada Lekhalu Vol 1.pdf/29
104
59183
552995
552942
2026-04-15T03:39:52Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
552995
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|5}}</noinclude>నవ్వువచ్చెను. ఇది తెలుఁగు దేశమే యైనను నీదత్తమండలములకును మన ప్రాంతమునకును ఎంతయో వ్యత్యాసము కలదు. ఇచ్చటి దేశ్యపదము లన్యభాషాపదములవలెనే అబోధకములై ప్రయత్నపూర్వకముగా నేర్చుకొనవలసివచ్చినది. ఆ విషయములనెల్ల మరియొక కమ్మయందు లిఖించెదను.
{{rh|భావపురి||నీప్రియచెలి,}}
{{rh|1928 సం॥ మార్చి||శారద.}}<noinclude></noinclude>
7h6j63u9t7lzh3r0fehg6uuro1yl7z7
552997
552995
2026-04-15T03:55:04Z
శ్రీరామమూర్తి
1517
552997
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|5}}</noinclude>నవ్వువచ్చెను. ఇది తెలుఁగు దేశమే యైనను నీదత్తమండలములకును మన ప్రాంతమునకును ఎంతయో వ్యత్యాసము కలదు. ఇచ్చటి దేశ్యపదము లన్యభాషాపదములవలెనే అబోధకములై ప్రయత్నపూర్వకముగా నేర్చుకొనవలసివచ్చినది. ఆ విషయములనెల్ల మరియొక కమ్మయందు లిఖించెదను.
{{rh|భావపురి||నీప్రియచెలి,}}
{{rh|1928 సం॥ మార్చి||శారద.}}
{{rule|2cm}}<noinclude></noinclude>
gwjuc6knd0z05dixh6i99pawxbt507j
పుట:Sarada Lekhalu Vol 1.pdf/30
104
59184
552996
552943
2026-04-15T03:47:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
552996
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|6|శారదలేఖలు|}}</noinclude>'''సౌభాగ్యవతియగు కల్పలతకు :-'''
'''నెచ్చెలీ,'''
నీవు వ్రాసిన యుత్తరమందినది. మనము పూర్వము జాబులు వ్రాసికొనెడి కాలమునకును నేటికిని సమస్త విషయములయందు నెంతయో మార్పుగలిగినదని వ్రాసితివి. సత్యమే. కాని భాషావిషయమునగూడ మిక్కిలి మార్పుగలిగినదే, ఆవిషయము నీవేల గమనింపలేదు? గమనించియు ననర్హమని యుజ్జగించితివా? భారతి మున్నగు మాసపత్రికలలో వాడుక భాషయందు వ్రాయబడెడి కథలు, నాటకములు, ప్రహసనములు, చదివినకొలది నాకు వాడుక భాషయందు మక్కువెక్కువగుచున్నది. 'కథగాదు, కావ్యముగాదు, ఈ యుత్తరములలో మధురమైన వ్యవహారభాష మనమేల యుపయోగింపరాదు? సొగసైన వాడుకభాషలో లేఖలు వ్రాసికొనుటకు నీకుగల సందేహమేమియో తెలుపగోరెదను' అని వ్యవహార భాషయందు నీకుగల మక్కువకొలది కడు దీర్ఘముగ వ్రాసితివి. వ్యవహార భాషయందు వ్రాయుట నీకు ప్రీతికరమగుచో నీవటులనే వ్రాయుము. కాని యాంధ్రదేశమున నలువైపుల గ్రుమ్మరుచున్నకొలది వాడుకభాషయందు వ్రాయుట వలన గలిగెడి యిబ్బందు లధికముగ గన్పట్టుచున్నవి. ఆ విషయమై నాకుగల సందేహములను ననుభవములను రాగల లేఖలో విశదపఱచెదను. ఏలనందువా శ్రీకాళహస్తీ క్షేత్రమందు మహాశివరాత్రి సందర్భమున నేగాంచిన విశేషములు<noinclude></noinclude>
rwrj2685tbv7a2u4sk6247r5dfkpf0e
పుట:Sarada Lekhalu Vol 1.pdf/31
104
59185
552999
552944
2026-04-15T04:00:50Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
552999
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|7}}</noinclude>నీకు సాకల్యముగఁదెలుప మానసం బువ్విళులూరుచున్నది. కాన యొకటిగోర నొకటి వ్రాసితినని నాపైఁ గోపింపకుమా!
శ్రీకాళహస్తి పురాతన పుణ్యక్షేత్రములలో నొక్కటి. ఈ పుణ్యక్షేత్రమునకు దక్షిణ కైలాసమని గూడ మఱియొక నామధేయముగలదు. ఇచ్చట స్వామికి శ్రీకాళహస్తీశ్వరుఁడనియు, అమ్మవారికి జ్ఞానప్రసూనాంబిక యనియు
పేర్లు. శ్రీ అనగా సాలెపురుగు. కాళ్ళమన సర్పము. హస్తి యన నేనుగు. ఈ మూటికిని ఈశ్వరుఁడు మోక్షమిచ్చెనుగాన భక్తవాత్సల్య చిహ్నముగా నీశ్వరుఁడా మూఁడు జీవముల పేరఁబిలువబడుచున్నాడు. కాని ఈస్వామి నిజనామధేయము నాగలింగేశ్వరుఁడు. శివరాత్రి సందర్భమున నిచ్చట పదిదినములు గొప్ప యుత్సవము జరుగును. దూరస్థలముల నుండి గూడ చాలమంది యాత్రికు లేతెంతురు. మొదటి దినమున స్వామికిఁ గడుగూర్చిన భక్తుడగు కన్నప్ప ధ్వజారోహణము. మఱునాడు స్వామి ధ్వజారోహణము. ఆదినమునుండియు స్వామి, పూటకొక వాహనముపై రెండు పూటల పదిదినము లూరేగును. వాహనములలో పెక్కులు వెండివి. ఒకటి రెండు మాత్రమే లక్క, కొయ్య మున్నగువానితోఁ జేసినవి. నిత్యము స్వామితోఁబాటు విఘ్నేశ్వరుఁడు, కుమారస్వామి యను నిద్దరు కుమారులును, కన్నప్ప, చండికేశ్వరులను నిరువురు భక్తులును, గంగ, జ్ఞానప్రసూనాంబిక యను నిరువురు దేవేరులును గూడ
నూరేగుదురు. గంగ స్వామికి ప్రక్కనేయుండును. కాని<noinclude></noinclude>
tqf4nej30y1n0zlyknklxfzm9hl7b0d
పుట:Sarada Lekhalu Vol 1.pdf/32
104
59187
553000
552945
2026-04-15T04:07:52Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553000
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|8|శారదలేఖలు|}}</noinclude>జ్ఞానప్రసూనాంబికకు మాత్రము ప్రత్యేక వాహనము. స్వామికి, అమ్మణ్ణికిగూడ వెలలేని నగలున్నవి. విలువైన వాహనములున్నవి. దిన దినము స్వామియు నమ్మణ్ణియు నవనవాలంకారములతో నమూల్యాభరణములతో నవ్యంబులగు వాహనములపై వచ్చుట జూచుటకెంతయో నేత్రపర్వముగ నుండును. అన్నిటికంటె శివరాత్రికి పూర్వరాత్రి చొక్కంపు వెండితోఁ జేయబడిన శేష వాహనముపై నవరత్నములు తాపిన కంఠహారములు, కరకంకణములు, అంగుళీయకములు, కర్ణభూషలు, తురాయి కిరీటము మున్నగు, వెలలేని యాభరణములచే నలంకరింపఁబడి వేంచేసిన యా స్వామి సౌందర్యము ఆరంగు రంగు మతాబులు వెలుగున నెంత శోభస్కరముగనుండెనో, ఎంత దర్శనీయముగ నుండెనో వివరింపజాల. నాడు దేవి
యలంకారముగూడ నతిమనోహరముగ నుండెను. నాఁటి స్వామియొక్కయు అమ్మణ్ణియొక్కయు, రమణీయాకారములు నాకిప్పటికిని కనుల గట్టినట్లున్నవి. మిత్రమా! విష్ణుక్షేత్రములనే గాని శివక్షేత్రముల నిట్టియలంకారములను నుత్సవములను నిచ్చటనేగాని మఱెచ్చటను గానము.
ఇచ్చటిజనులకు స్వామియందుకంటె నమ్మణ్ణియందు భక్తి యధికము, ప్రతిశుక్రవారమునను అమ్మణ్ణికి కుంకుమార్చన జరుగును. ఆనాడు పురుషులకంటె స్త్రీ లెక్కువగా వచ్చెదరు. దేవిని, వారు తల్లిని పిలిచినట్లెంతయో చనవుగ నెంతయో ప్రేమగ ‘తాయీ, 'అమ్మణీ, అమ్మా, జ్ఞానప్రసూ<noinclude></noinclude>
sliyqsb4u4wf9wlin36behfw29nmm7c
పుట:Sarada Lekhalu Vol 1.pdf/33
104
59188
553133
552946
2026-04-15T09:14:26Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553133
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|9}}</noinclude>నాంబా' యని సంభోధింపుచు లెంపలు వాయించుకొని సాష్టాంగ పడుదురు. చిన్నలుమొదలు పెద్దలవఱకు 'మా అమ్మణ్ణి మా అమ్మణ్ణి' యని బహుప్రేమతో మన్ననమీర చెప్పుచుందురు. ఊరిలో మెఱవడికి వచ్చినప్పుడుగూడ స్వామికి కంటె నమ్మణ్ణికి నమస్కరించువారే యధికము. అమ్మణ్ణి త్రోవ నెదురపడినచో రక్షకభటులు తమ యెఱ్ఱటోపీని దీసియు, నధికారులు తమ తలపాగ దీసియు నమ్మణ్ణికి నమస్కరించి యామె కుంకుమను నొసట బెట్టుకొనక నావలపోరు. ఇఁక మన స్త్రీల విశ్వాసము వివరించుటకే సాధ్యముకాదు. ఆమె తమపాలిట కల్పతరువనియే మనవారిభావన. ఆమెను పూజించిన పత్ర పుష్పములేమి పసుపు కుంకుమలేమి ఎంతమాత్రము లభించినను మహద్భాగ్యముగ నెంతురు. ఆ పుష్పాదులను పసపు కుంకుమలను దాల్చినచో దమ మాంగల్యము చిరస్థాయిగ నుండగలదని మనవారి విశ్వాసము. మన స్త్రీల యభీష్టములలో నీ సువాసినీత్వవాంఛ ప్రముఖమైనదిగదా! అట్టి సువాసినీత్వము నమ్మణ్ణి పెంపొందించునను విశ్వాసముగల యప్పుడామెయందు మనస్త్రీలకుగల భక్తి నిరుపమాన మనుటలో నాశ్చర్యమేమి?
అచ్చటి ప్రభువుల కామె యిష్టదైవము. అచ్చటి ప్రజల కామె కన్నతల్లి. అచ్చటి జనులలో పెక్కుమంది యామె నామధేయము గలవారే. తండ్రియందుకంటె తల్లియందు ప్రేమ యగ్గలమై యుండుట మనుష్య సాధారణముగదా. శ్రీకాళ<noinclude></noinclude>
heki7btetqp3vjven3vijjwke8ozl0p
పుట:Sarada Lekhalu Vol 1.pdf/34
104
59189
553135
552947
2026-04-15T09:22:06Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553135
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|10|శారదలేఖలు|}}</noinclude>హస్తీశ్వరుని యాలయము చాల గొప్పది. మన తెలుగుసీమలో నంత గొప్ప దేవాలయము వేఱొండు లేదని చెప్పుదురు. కడు చిన్నదియయ్యు స్వర్ణముఖినది యాక్షేత్రమునకు శోభను గూర్చుచున్నది, ఆదేవాలయమునం దఱువదిమువ్వురు భక్తులు గలరు. వారిలో నగ్రేసరుఁడు కన్నప్ప. కన్నప్ప స్వామికి
గడు గూర్చిన భక్తుడు. స్వామి విగ్రహ మెచ్చట ప్రతిష్ఠితమై యున్న నచ్చట కన్నప్పవిగ్రహము ప్రతిష్ఠితమై యుండితీరును. మెరవడిసమయమున స్వామి కభిముఖుడై కన్నప్ప వచ్చును. స్వామి యాలయమునకు సమీపముగనే కన్నప్పకొండ యున్నది. కన్నప్ప కొడియనగా ధ్వజారోహణమైన వెనుకనే స్వామి కొడి. ఈ కన్నప్ప యింతటి సత్కారమునకు భగవదనుగ్రహమునకు పాత్రుఁడెట్లయ్యెనన నాతని చరిత్ర మిట్లు చెప్పుదురు.
కన్నప్ప యొక యెఱుకరాజునకు లేక లేక బుట్టిన కొడుకు. ఆతడొకనాడు వేఁటకుబోవ నచ్చట నీ ఈశ్వరలింగము కనుపించెను. దానిని చూడగనే కన్నప్ప భక్తిభరితుడై యా నాగలింగేశ్వరునకు నమస్కరించి యదివఱ కర్చకు డర్చించి పోయిన పుష్పపత్రాదులు తొలగఁద్రోచి సమీపారణ్యమునకుఁబోయి యొక పందిపిల్లను వేటాడి చంపి తెచ్చి దానిని పక్వముచేసి రుచికరముగ నున్నదో లేదోయని నోట వేసికొని
రుచిచూచి రుచ్యముగ నుండుటకు సంతసించి యా నంజుడొక చేత బట్టుకొని బిల్వపత్రము లొక కొన్ని కోసి నెత్తిపై నిడుకొని యొకచేత నంజు డొకచేత విల్లునంబు లుండుటంజేసి యభి<noinclude></noinclude>
sode22zkc20x6nz09sh7g87qvcbcp3f
పుట:Sarada Lekhalu Vol 1.pdf/35
104
59190
553137
552948
2026-04-15T09:29:21Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553137
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|11}}</noinclude>షేకజలము తెచ్చుటకు సాధ్యముకామి సువర్ణముఖిలోని యుదకమొకింత పుక్కిట నింపుకొనివచ్చి స్వామిపై నాజల ముమిసి యభిషేకముచేసి తాఁదెచ్చిన పుష్పపత్రాదులఁ బూజించి తాఁదెచ్చిన నంజుడు నైవేద్యముపెట్టి భక్తిభరితుడై యా స్వామిని విడనాడజాలక యందే నిలిచియుండెను. ఆతని వెంటవచ్చిన వేటగాండ్రు ఇంటికి వెళ్లుదము రమ్మని కోరిరి. కాని కన్నప్ప బదులు చెప్పలేదు. వారును పలుమాఱులు పిలిచి పిలిచి వేసారి వీని కిచటనుండు దేవుడావేశించినట్లున్న దని తలంచి యా విషయమును బోయ రాజునకుఁ దెలుప వైడలి పోయిరి. కొమారుని వృత్తాంతమును వినుట తోడనే తలిదండ్రు లిరువురు మహాదుఃఖితులై కన్నప్ప వద్దకువచ్చి యాతని నింటికిఁ గొనిపోవ యత్నించిరి. కాని భగవద్ధ్యాన నిమగ్నుడై విశ్వము మఱచియున్న కన్నప్ప కాపలుకులు చెవిదూరలేదు. ఇంతలో ప్రొద్దు గ్రుంకెను. మేటి విలుకాడైన కన్నప్ప విల్లు నమ్ములు ధరించి స్వామిని కావలిగాయుచు నారాత్రిపుచ్చెను. ఉదయము కాగానే స్వామికి రుచ్యములైన నంజుడులు తెచ్చుటకు కన్నప్ప వెడలిపోయెను. తరువాత స్వామికి నిత్యము కైంకర్యము జేసెడు శివగోచరియను పూజారి సువర్ణముఖిలో స్నానముచేసి మడుఁగులుకట్టి విభూతి రుద్రాక్షలు ధరించి శిరమున నభిషేకజలమును హస్తముల పూజా ద్రవ్యములను బట్టుకొని యటకేతెంచి చూడగనే యాతని ఒడలు జల్లు మనెను. అయ్యో ఇదియేమి? స్వామి సన్నిధి మాంసపు<noinclude></noinclude>
gdf60dnrqfh1bdpnd1qx893xrfbsieh
పుట:Sarada Lekhalu Vol 1.pdf/36
104
59191
553154
552949
2026-04-15T11:23:48Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553154
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|12|శారదలేఖలు|}}</noinclude>ముక్కలున్న వేమి? ఏక్రూరకిరాతకుడీ యమంగళము చేసిపోయె? పూజ్యుడగు స్వామికిట్టి యపచారము గావించినవాడు తప్పక వధ్యుడుగదా యని చింతించి యా మాంసపుముక్కలనెల్ల నెత్తి పాఱవైచి మరల స్నానముచేసి స్వామినర్చించి వెడలిపోయెను.
అట స్వామికి నంజుడు తే నేగిన కన్నప్ప పెక్కుమేలి మెకంబుల జంపి వానిని చక్కగా తేనెతో పక్వముగావించి తాను తినిచూచి మిక్కిలి రుచ్యముగా నున్నదని సంతసింపుచు నెప్పటివలె పుక్కిట నభిషేకజలమును శిరమున బిల్వపత్రములను చేత నంజుడును పట్టుకొనివచ్చి శివగోచరి యర్చించిన
పుష్పపత్రాదులను దనచెప్పుకాలితో దొలఁగద్రోచి యెప్పటి వలెనే స్వామినర్చించి యా రాత్రి మరల నాస్వామి సన్నిధినే గడపి తెల్లవారగనే మరల నైవేద్యపు నంజుడుల కొఱకు నడవి కేగెను. ఇంతలో శివగోచరివచ్చి మరల స్వామి సాన్యిధ్య మమంగళమై యుండుటకుఁ దద్దయు దుఃఖించి మరల నన్నియు చక్కఁజేసి స్వామి నర్చించి వెడలిపోయెను. ఈ విధముగా నైదు దినములు గడచెను. శివగోచరి దుఃఖ మగ్గలమగుచుండెను. కాన స్వామి యాతనిదుఃఖ ముడుపగోరి యా రాత్రి యాతని కలయందుగన్పడి భక్తశిరోమణీ! నిత్యము మాసాన్నిధ్యమశుద్ధమై యున్నదని నీవేల వాపోయెదవు. ఆ మాంసపు ముక్కల మాకు నివేదించుచున్నవాడు పాపాత్ముడుగాడు. పాషండుడు గాడు. మాకుఁ గడుగూర్చిన భక్తుడు. అవి<noinclude></noinclude>
9l2asj083wvadu2l8386n9b65gulwsm
పుట:Sarada Lekhalu Vol 1.pdf/37
104
59192
553157
552950
2026-04-15T11:30:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553157
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|13}}</noinclude>యామిష ఖండములుగావు, యమృతపు ముక్కలు సుమా! నాయందు భక్తిభరితుఁడగువాడు నాకెట్టి హేయపదార్థ మిడినను నాకది రుచిరాన్నమే సుమా! కావుననే యాతని నంజుడులు నేనంత ప్రీతికరముగ స్వీకరింపుచున్నాను. అతఁడు మహాభక్తుడు కాన యతని హృదయమే నాకాలయము. వాని పలుకులే నాకు స్తుతివాక్యములు. అతని భక్తితత్పరత నెఱుంగ గోరుదువేని రేపుదయమునవచ్చి మఱువుననుండి పరీక్షింపుమని చెప్పి యంతర్హితుడయ్యెను. వెంటనే శివగోచరి అదరిపడి లేచి యప్పటికి తెలతెల వాఱుచుండుటం దెలిసి కాలకృత్యంబుల దీర్చికొని సువర్ణముఖిలో మజ్జన మాడివచ్చి దేవాలయమునకేగి స్వామి చెప్పిన తెఱుఁగున నొకమఱుఁగున నక్కియుండి కన్నప్పరాక ప్రతీక్షించు చుండెను. వాడుకమేరకు
కన్నప్ప పూజాద్రవ్యాదులను నభిషేకజలమును నైవేద్యపు నంజుడులను గైకొని స్వామి సన్నిధి కేతెంచెను. కాని యేమి చిత్రము! నాడు స్వామి నిత్యమువలె సుఖముగలేఁడు. అతని కొక కంటినుండి ఘోరముగ రక్తము ప్రవహించుచున్నది. అది చూడగనే కన్నప్ప దుఃఖముజెంది హోరుహోరుననేడ్చుచు తెచ్చిన పదార్థము లక్కడనే పాఱవైచి "స్వామీ! నీ కిట్టియాపద యెట్లుతటస్థించె? నా పగవారగు వేఁటకాండ్రు చేసిరా? లేక మృగములు చేసెనా? విశాల విశ్వమునంతను పరికించెడు నీ నేత్రమున రక్తము స్రవించిన నే ది మందు?
అయ్యో! యేమిచేయుదు. నీకపకారము గావించిన యా<noinclude></noinclude>
k6qxqitl0dq4udus3hp8fg4wfmnqrxt
పుట:Sarada Lekhalu Vol 1.pdf/38
104
59193
553158
552951
2026-04-15T11:37:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553158
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|14|శారదలేఖలు|}}</noinclude>దుష్టులెవ్వరో కనుపించిన కత్తికి రెండు తుండ్లుగా నఱికి వేయనా? అయ్యో! ఏమిదారి! ఎట్లీరక్తస్రావము కట్టును? ఏదియైన మందాకుల రసము పిండిచూతునా యని చెంతనున్న యడవి కేగి రకరకముల మందాకులు తెచ్చి రసము పిండిచూచెను. కాని లాభములేదు. రక్తము కారుచునేయున్నది. కన్నప్ప
చేయునదిలేక దిగులొంది కన్నీరు కాల్వలై పాఱుచుండ మ్రాన్పడినట్లు నిలిచెను. కొంతతడ విట్లునిలువ కండకు కండయను సామ్యము తోఁచెను. ఆహా! మంచిమందు తోఁచెను. స్వామి కంటికి నాకంటి నంటింతు ననుకొనెను. తోడనే కత్తితో తాటికాయనుండి ముంజె నెత్తినట్లు తనకన్ను నూడదీసి
స్వామికంటి కంటించినాడు. అద్భుతముగాస్వామికన్ను చక్కఁబడిపోయినది. కన్నప్పకు పరమానంద మైనది. స్వామిని కౌఁగలించు కొనినాడు. ముద్దు పెట్టుకొనినాఁడు. సాష్టాంగ పడినాఁడు. ఆడినాడు. పాడినాడు. భగవంతుడు భక్తునిచేతి ముద్దుబిడ్డ. భక్తు డెన్నెన్ని విధముల నుపలాలించిన యన్నన్ని విధముల ప్రియము
గూర్చుట యా మహామహునకు సంతోష ప్రదము. ఈ విధముగా గొంతసే పానందనమగ్నుడై కన్నప్ప నృత్యముచేసి స్వామివంక చూచినాడు. ఆహా! ఏమి చెప్పుదు నాభీభత్సము! స్వామి రెండవకంటినుండి నెత్తురు కారుచున్నది. స్వామి నేత్రము చక్కఁబడుటకు దగిన యౌషధము తనవద్దనే యుండ కన్నప్ప కిక దిగులేమి ? కాని తన రెండవకన్ను గూడ నూడబెఱికినచో దాని నంటించుటకు స్వామి కన్నెక్కడగలదో<noinclude></noinclude>
hfobit1ik41rj1qa1o272q2ghbpotrx
పుట:Sarada Lekhalu Vol 1.pdf/39
104
59194
553159
552952
2026-04-15T11:43:45Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553159
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|15}}</noinclude>తన కెట్లు తెలియును? కాన గుర్తుకొరకు కన్నప్ప నిశ్శంకముగా తన చెప్పుకాలినెత్తి స్వామికంటిపైనిడి చేతనున్న కత్తితో రెండవ కన్నును బెఱుక సాహసించినాడు. ఆహా! కన్నప్పకు స్వామియందెంత ప్రేమ! ఎంత విశ్వాసము! ఎంత భక్తి! అద్భుతము! అసదృశము! కృపా సాగరుఁడగు పరమేశ్వరుఁడది చూచి సహించునా! మేలు కన్నప్పా! నీ యపూర్వ భక్తికి మెచ్చు వచ్చెనని చేయి పట్టుకొనినాడు. శివగోచరి యాశ్చర్య నిమగ్నుడై పోయినాడు. కన్నప్పా ! నీకేమి కావలెననినాఁడు స్వామి. నీసాన్నిద్ధ్యము నీయనుగ్రహము నీకైంకర్యము అనినాఁడు కన్నప్ప. మూటి కొక్కటే మాటగ నటులనే యనినాడు స్వామి. కన్నప్ప మొదటి పేరు తిన్నప్ప. కన్ను నొసఁగుఁటఁజేసి తిన్నప్ప కన్నప్పగా ప్రసిద్ధుఁడైనాఁడు. నెచ్చెలీ, కన్నప్ప కథ సత్యమా? అసత్యమా? అను విచారణ మనకువలదు. భగవంతుని యందు మనకుండవలసిన భక్తి
విశ్వాసము లట్టివని గ్రహించుటకు కన్నప్ప చరిత్ర ముత్తమోత్తమోదాహరణ మనుటకు సందియము లేదుగదా!
ఇచ్చట చక్కని నాణెమైన కొయ్య దువ్వెనలు నల్లగాజులు తయారగును. రంగురంగు విదేశపు గాజులు దేశమంతట వ్యాప్తమై యుండుటవలన గాజుల పరిశ్రమ చాల క్షీణించెను. కాని దువ్వెనల పరిశ్రమ మాత్ర మింకను కొంత వ్యాప్తిలోనే యున్నది. సాధారణముగా నొక దువ్వెన వెల యొక<noinclude></noinclude>
e8muds39jak21a1rqffgr80xw18ka4e
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/130
104
178863
553149
552916
2026-04-15T11:14:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553149
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop
|Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf
|Page = 130
|bSize = 381
|cWidth = 305
|cHeight = 78
|oTop = 15
|oLeft = 42
|Location = center
|Description =
}}
{{Center|శ్రీ}}
{{p|ac|fs150}}జైమినిభారతము</p>
{{p|ac|fs125}}అశ్వమేధపర్వము, సప్తమాశ్వాసము</p>
{{Telugu poem|type={{Css image crop
|Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf
|Page = 130
|bSize = 381
|cWidth = 77
|cHeight = 146
|oTop = 176
|oLeft = 29
|Location = left
|Description =
}}|lines=<poem>
చికురబంధగంధఫ
లీచంచద్గంధభరములిమ్లుచనుతవా
చాచణకవికర్ణసుధా
సేచనసల్లాప నారసింహమహీపా.</poem>|ref=1}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అవధరింపుము జైమునిమునీంద్రుండు జనమేజయనరేంద్రున కిట్లనియె నివ్విధంబున
బభ్రువాహనుండు పాండవమధ్యముం దొడరు సమయంబున.</poem>|ref=2}}
{{Telugu poem|type=తే.|lines=<poem>హంసకేతుండు సుతులు గయ్యమునఁ బడిన, యపుడు తను శౌరి మన్నించినట్టితగవు
హృదయమున మాటిమాటికి నెచ్చరింప, నచ్చలంబున బభ్రువాహనునిఁ దాఁకి.</poem>|ref=3}}
{{Telugu poem|type=మ.|lines=<poem>బలిమిన్ వేవురుపార్శ్వరక్షకు లెదుర్పన్ దున్మి తూఁటాడి బి
ట్టలుకన్ వానిఁ దెరల్చి తీవ్రతరణామంబులన్ దేరు చె
క్కలుగా చేసి తదస్త్రముల్ విఫలము ల్గావించి సంగ్రామదో
హలియై గీ టణఁగించె మార్కొనినపంచాక్షౌహిణీసైన్యమున్.</poem>|ref=4}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అప్పుడు.</poem>|ref=5}}
{{Telugu poem|type=చ.|lines=<poem>చలమున నొండుతేరు రభసంబున నెక్కి కిరీటినందనుం
డలమి మరాళకేతను శతాంగము రూపఱ నేయుచున్ శరం
బులు నిగిడించి వానిఁ బెనుమూర్ఛితుఁ జేసి సహస్రమేదినీ
శులఁ గలనన్ సరథ్యరథిసూతముగా దెగటార్చి యార్చినన్.</poem>|ref=6}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కినుక సువేగుఁ డడ్డపడి క్రీడికుమారునురంబు గాఁడ బా
ణనవక మేసి మూఁడుబలునారసముల్ దొడి గాతపత్రమున్</poem>|ref=}}<noinclude><references/></noinclude>
g14b86myf6xumwgrvge4xf60um8fa2e
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/132
104
178865
552976
496205
2026-04-14T19:22:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
552976
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నవభృథస్నానసమయంబున సముచితమాల్యానులేపనమణిమయవిభూషణాంబర
విరాజమానం బైన గౌరీసహస్రంబు కరకమలంబులు ధరియించు కాంచనదండ
మండితచమరవాలచాలనప్రచారంబు దూరం బయ్యె రుక్మిణీసహాయుం డగు
పుండరీకాక్షునగ్రపూజాప్రసంగంబును భంగంబయ్యె కావున మదీయజీవనం బప్ర
యోజనంబు తనకు సంగరమరణంబ శరణంబు నీవు కృష్ణధర్మజులపాలికిం జను
మనిన వృషకేతనుండు కపికేతనున కి ట్లనియె.</poem>|ref=14}}
{{Telugu poem|type=మ.|lines=<poem>పలుకుల్ వేయును నేల తూలి రవిబింబం బుర్విపై వ్రాసినన్
గలఁకన్ వైరికి వెన్ను సూపుదునె మూఁకల్ గట్టి బృందారకుల్
దలపడ్డన్ బలిమిన్ జయింపఁగల నేతన్మాత్రు లీశాత్రవుల్
నిలువన్ శక్తులె న న్నెదిర్చి కలనన్ నీప్రాపు నా కుండఁగన్.</poem>|ref=15}}
{{Telugu poem|type=తే.|lines=<poem>స్వామి సఖి గోమహీసుపర్వప్రయోజ, నార్ధమై మేను దొఱఁగుధన్యాత్ముఁ డెవ్వఁ
డతఁడు కైవల్యసౌఖ్యంబు లనుభవించు, ననుచుఁ జెప్పుదు రఖిలధర్మార్థవిదులు.</poem>|ref=16}}
{{Telugu poem|type=క.|lines=<poem>ననుఁ జిత్తగింపు మని చ, య్యన మ్రొక్కి రథాధిరూఢుఁ డై భుజగర్వం
బున బభ్రువాహు నెదిరిం, చెను వృషకేతుండు రెండుసేనలుఁ బొగడన్.</poem>|ref=17}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అ ట్లెదిర్చిన వృషకేతు నపుడు గ్రీడి, సుతుఁడు మార్కొని సాయకత్రితయ మేయ
నవి యురము గ్రుచ్చి ధరఁ దూఱె నధికతృష్ణ, భోగవత్యంబువులు గ్రోలఁబోవునట్లు.</poem>|ref=18}}
{{Telugu poem|type=క.|lines=<poem>నరసూను నపుడు కర్ణజుఁ, డిరుమూఁడుశిలీముఖంబు లెద నించిన నొ
చ్చి రయంబునఁ గోల్కొని వా, నరదముఁ దునిమెన్ సకేతుహయసూతముగన్.</poem>|ref=19}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆరవిపౌత్రుఁ డొండొకశతాంగముఁ గైకొని హేమపుంఖవి
స్ఫారశిలీముఖౌఘములఁ బార్ఖసుతుం దెరలించి క్రమ్మఱన్
దేరుల గూల్ప వెండియును దీవ్రత నొండురథంబుతోడ న
వ్వీరుఁ డెదుర్పఁగాఁ దునిమె వేయిరథంబులదాఁక నాతఁడున్.</poem>|ref=20}}
{{Telugu poem|type=మ.|lines=<poem>నరరాధేయతనూభవుల్ మఱియు నానాదివ్యబాణంబులన్
సరిపోరన్ వృషకేతనుం డనలపర్జన్యాంతకార్కాదిని
ష్ఠురనారాచపరంపరం బొదువ నాటోపంబు మీఱన్ బురం
దరపౌత్రుం డవి త్రుంచె నన్నియును దా నారాయణాస్త్రంబునన్.</poem>|ref=21}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కర్ణజునిఁ జూచి యిట్లనుఁ గార్ష్ణి యపుడు, పొలిసె నీసేన మద్భుజావిలసనమున
వృత్రుఁ డమరేంద్రు నెదిరించువిధము గాక, యెందుఁబోవచ్చు నీకు నాయెదుర ననుచు.</poem>|ref=22}}
{{Telugu poem|type=మ.|lines=<poem>దరహాసంబున బభ్రువాహనుఁడు రాధాపౌత్రు మాద్యద్భుజాం
తరమున్ దూఱ మరుచ్ఛిలీముఖము సొప్పన్ దూలి బ్రహ్మాండక</poem>|ref=}}<noinclude><references/></noinclude>
relcniculvp12plq9i19oz6yml6tk5i
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/133
104
178866
552977
496206
2026-04-14T19:40:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
552977
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ర్పరముం దాఁకి ధరిత్రిపైఁ బడక సర్వక్ష్మాభృదాశావధిన్
శరధుల్ చుట్టుక ముమ్ముహూర్తమున కాజన్యస్థలిన్ వ్రాలుచున్.</poem>|ref=23}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కుదురుకొని కర్ణజుఁడు క్రీడికొడుకు నుద్ధు
రాస్త్రహతి నొంప నతఁడుఁ జోద్యముగఁ దరణి
బింబ మొరయంగ నెగసి రథంబు దిరిగి
పడియె ధరమీఁద సంపాతిపక్షిఁ బోలె.</poem>|ref=24}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇత్తెఱంగునం బడివబభ్రువాహను నవలోకించి.</poem>|ref=25}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తొడరి మరాళకేతనునిఁ ద్రుంచినదుష్కృతిఁ దీర్తు నంచు బ
ల్విడి వృషకేతనుం డురుశిలీముఖము న్నిగిడింపఁ ద్రుంచి క
వ్వడితనయుండు బిట్టెగసి వానిపయిం దరికొండకైవడిన్
బడి వడి గెంటి మింట శరపంచకముం దొడి గేసి యార్చినన్.</poem>|ref=26}}
{{Telugu poem|type=తే.|lines=<poem>క్రీడితోడుత నను వృషకేతనుండు, అరద మిలఁ గ్రుంగ రాధేయునంతవాఁడు
నిలువు మనె నిన్ను నివ్వీరునలవు గంటె, యొకమొగిన ప్రతాపించుచున్నవాఁడు.</poem>|ref=27}}
{{Telugu poem|type=క.|lines=<poem>అను నెడఁ బార్ధజుఁ డొకశర, మునఁ బగిలిచెఁ గర్ణసుతునిమూర్ధ మతఁడు నా
తని ముంచెఁ బెక్కుశరముల, జనమేజయ యిట్లు భయదసమరం బయ్యెన్.</poem>|ref=28}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అరుదుగ ధాత్రిఁ గొంతదడ వంబరమార్గమునందుఁ గొంతప్రొ
ద్దరదము లెక్కియున్ విరథు లయ్యును బోరిరి పంచరాత్రముల్
శరములు తచ్చరీరపలలంబులఁ ద్రించుక పాఱ నల్గడన్
గెరలి యహర్నిశంబుఁ దమకించుచుఁ బైకొనఁ గాకఘూకముల్.</poem>|ref=29}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇప్పరుసున నయ్యిరువురు, డెప్పరముగఁ బోరునెడఁ గడిఁది బాణములన్
నొప్పించి బభ్రువాహనుఁ, డప్పుడు వృషకేతుఁ బలికె నాగ్రహ మెసఁగన్.</poem>|ref=30}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇన్నిదినంబులు మార్కొని, న న్నెదిరితి నిలిచి మే లనందగుఁ గలనన్
నిన్నుఁ బొరిగొనక విడువ మ, ది న్నిలుపుము నేఁడు వాసుదేవుని ననుచున్.</poem>|ref=31}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కనుఁగొని యర్ధచంద్రవిశిఖం బడరించినఁ గర్ణసూతి ము
త్తునియలు సేయుచుం జెలఁగఁ దోడనె హేమవిచిత్రసాయకం
బున మెడ ద్రుంపఁ దచ్ఛిరము మొండెముపై నటియించి చెండుభం
గి నెగసి కృష్ణుఁ బేర్కొనుచుఁ గ్రీడిపదంబులమీఁద వ్రాలినన్.</poem>|ref=32}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అక్కబంధంబు వడుచుఁ బ్రత్యర్థిసేన, నద్భుతంబుగ మడియించె నపుడు పార్థుఁ
డతనిమణికుండలాన్విత మగుశిరంబు, కరమున ధరించి మిగుల శోకము వహించి.</poem>|ref=33}}<noinclude><references/></noinclude>
h2k5q7g0tkktj3o98t2fmhk1rrfh605
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/134
104
178867
552978
496207
2026-04-14T22:39:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
552978
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}అర్జునుఁడు వృషకేతనునిమరణంబునకు శోకించుట</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>రక్తాక్తమౌక్తికారాతిమూర్ధాబ్జాంఘ్రిశాలి నాఱడి రిత్త చంపుకొంటిఁ
బుత్త్రపౌత్రాలంభమునకు మైకొని యబ్జహితునితోడ విరోధ మియ్యకొంటి
నభిమన్యుపిమ్మట నన్వయస్థితికి నెన్నఁగ నీవు గలవని నమ్ముకొంటి
గుణనిధానము నిన్నుఁ గోల్పోయి హరియుధిష్ఠిరులచిత్తము దప్పజేసికొంటి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నకట మఖవాజి సాధించినపుడు భీము, నెదురఁ బ్రతిపక్షులను సమయించి నేఁడు
నాకుఁ దో డయి వచ్చి జన్యమున సమసి, యిచటఁ బక్షులపాలైతివే కుమార.</poem>|ref=34}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అంబుజాప్తుండు లేనినభంబు దివియ, లేనిగేహంబు లింగంబు లేనిపీఠ
మప్రయోజన మైనయ ట్లనఘ నాకు, నీవు లేనిజయం బది నిష్ఫలంబు.</poem>|ref=35}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని ధనంజయుండు తచ్ఛిరంబు శరీరంబునం జేర్చి మూర్ఛితుండై తెలిసి బహు
ప్రకారంబులం బలవింప నతనిం గనుంగొని బభ్రువాహనుం డిట్లనియె.</poem>|ref=36}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వైశ్యజుఁడఁగాన సంగ్రామవనధిలోని, వీరకోటీరమణులకు విలువ గంటిఁ
గర్ణసూనునిశిర మనర్ఘంబు దీని, భవున కర్పించి పడయుము పాశుపతము.</poem>|ref=37}}
{{Telugu poem|type=క.|lines=<poem>అన విని కిరీటి కర్ణసు, తునిమస్తము రథముపైఁ గుదుర్పఱచి మదిం
గనలుచును బభ్రువాహనుఁ, గని యిట్లనుఁ జటులసజ్యగాండివధరుఁ డై.</poem>|ref=38}}
{{Telugu poem|type=చ.|lines=<poem>బిరుసుగ నేటికిన్ దఱచు ప్రేలెదు శూరుఁడ వైన నిల్చి
పరుసఁదనంబు చూపుమని పాండుతనూజుఁడు చిత్తజల్లుగాఁ
గురియుపయోధరంబుక్రియ ఘోరశిలీముఖవృష్టి ముంచినన్
దురమున బభ్రువాహనుఁడు దూలె బలంబులు గూలె నల్గడన్.</poem>|ref=39}}
{{Telugu poem|type=శా.|lines=<poem>మూఁకల్ గట్టినయోధయూధపహరుల్ మొండెంబు లై రాలఁగాఁ
దూకంబుల్ సెడి తేరు లాకసమునన్ దూలంబులై తూలఁగా
నాకౌంతేయశరాగ్ని మించి జటిలం బై గోపురోట్టాలక
ప్రాకారంబులు మున్నుగా మణిపురిన్ భస్మంబు గావించినన్.</poem>|ref=40}}
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆసంరంభము బభ్రువాహనుఁడు బాహాశక్తి మాయించి తో
డ్తో సూతాశ్వకపీంద్రులన్ వరుస మూఁడున్నాల్గునేనమ్ములన్
వే సోలించుచు నుగ్రభల్లముల నవ్వీరుండు గారింపఁగా
గాసిం బొందెఁ గిరీటి సన్నిహితగంగాశాపసంవిష్టుఁ డై.</poem>|ref=41}}
{{Telugu poem|type=క.|lines=<poem>అవ్వేళ దివ్యబాణము, లెవ్వియుఁ బని సేయకున్న నెదవడి మదిలోఁ
గవ్వడి దూలఁగఁ గని యెల, నవ్వుచుఁ జిత్రాంగదాతనయుఁ డిట్లనియెన్.</poem>|ref=42}}<noinclude><references/></noinclude>
l9cne416z4cbrcnx792ls02d7yl9o32
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/135
104
178868
552983
496208
2026-04-15T01:21:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
552983
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=శా.|lines=<poem>మాతల్లిన్ వనితామతల్లిని సభామధ్యంబునం దొల్లి య
ప్రీతుల్ పల్కినపాతకంబునకుఁ జేరం గాల మివ్వేళ ని
న్నాతంకంబునఁ బెట్టుచున్న పితృపుత్త్రాశల్ విసర్జించి నీ
సూతుం గృష్ణుఁ దలంచుకొమ్మనఁగ నచ్చోఁ బుట్టె నుత్పాతముల్.</poem>|ref=43}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>నెత్తురు వర్ణించె నీరదంబులు వీచె శర్మరాభీలజంఝామరుత్తు
విరివిగాఁ గప్పెఁ గావిరి గంతముల సంగ్రామభూస్థలి మూఁడువ్రయ్య లయ్యె
రాలె నుల్కాసహస్రము లెల్లెడల నిల్చి దట్టించె భూతబేతాళగణము
పొగ లేక యాయుధంబులు మండె నుజ్జ్వలప్రతిసూర్యమండలప్రభలు వెలిఁగె</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>బభ్రువాహనుండు పాండవమధ్యమ, ప్రాణహరణనిష్టురప్రచార
జాగ్రదుగ్రశరధిసంచితజ్వాలాభి, ధానశరము వింటఁ బూనుటయును.</poem>|ref=44}}
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆవిఖ్యాతశరంబు హాలహలసప్తార్చిశ్ఛటల్ గ్రాయుచున్
రా వీక్షించి సురేంద్రసూతి వివిధాస్త్రప్రౌఢి వారింప ది
గ్ద్యావాపృథ్వ్యవరోధమై నిగిడి క్రౌర్యస్ఫూర్తిమై బంధుర
గ్రీవంబున్ వడిఁ ద్రుంచె దచ్ఛిరము లక్ష్మీనాథుఁ గీర్తింపఁగన్.</poem>|ref=45}}
{{p|ac|fwb}}బభ్రువాహనుం డర్జునుఁ దెగనేయుట</p>
{{Telugu poem|type=తే.|lines=<poem>అహిమకరుఁ డుత్తరాగతుం డైనశుక్ల, పక్షకార్తికైకాదశీభానువాస
రమున నిను నస్తమయవేళ వ్రాలె నతని, తలయు వట్టయు వృషభకేతనునిమ్రోల.</poem>|ref=46}}
{{Telugu poem|type=క.|lines=<poem>అప్పుడు కర్ణజపూర్వక, కుప్పసుతాస్యములు రత్నకుండలరోచుల్
గప్పుకొని మెఱసె ధరఁ బడి, యొప్పారెడు సూర్యబింబయుగళముఁబోలెన్.</poem>|ref=47}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునం బభ్రువాహనుం డాహవముఖంబున వృషకేతనకపికేతనుల వధించి
జయోత్సాహంబునం బొదలి మగడునప్పు డప్పురంబున.</poem>|ref=48}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కొలఁదిఁగాఁ బన్నీరు చిలికించి కప్పురంబున గృహాంగణముల మ్రుగ్గు దీర్చి
సమకట్టుచీనాంబరములతో బెరయఁ జిత్రములుగా మకరతోరణము లెత్తి
యెడనెడ వారమృగేక్షణానృత్యయోగ్యము లైనవివిధమంత్రము లమర్చి
సాంబ్రాణిధూపవాసనఁ గదంబించు వీథుల మంగళద్రవ్యములు ఘటించి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>భూరిజయవాద్యఘోషముల్ బోరు కలఁగఁ, బౌరజను లెదుర్కొనెడుసంభ్రమము బభ్రు
వాహుచే నింద్రసుతుఁ డాహనమునఁ దెగుట, గా విచారించి చిత్రాంగదావధూటి.</poem>|ref=49}}
{{p|ac|fwb}}అర్జునునిమరణంబు విని చిత్రాంగదాదులగు నంతఃపురస్త్రీలు దుఃఖించుట</p>
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఉల్లము వ్రక్కలై కలఁగ నొత్తినమూర్ఛ వహించి ధారణిం
దెళ్ళినఁ జేరి యత్తరుణిఁ దేర్చి యులూచి యురంబు మోము జొ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
r6hwz1h173fqerzsxjxfl8q4gxtqbcj
552984
552983
2026-04-15T01:22:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
552984
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=శా.|lines=<poem>మాతల్లిన్ వనితామతల్లిని సభామధ్యంబునం దొల్లి య
ప్రీతుల్ పల్కినపాతకంబునకుఁ జేరం గాల మివ్వేళ ని
న్నాతంకంబునఁ బెట్టుచున్న పితృపుత్త్రాశల్ విసర్జించి నీ
సూతుం గృష్ణుఁ దలంచుకొమ్మనఁగ నచ్చోఁ బుట్టె నుత్పాతముల్.</poem>|ref=43}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>నెత్తురు వర్ణించె నీరదంబులు వీచె శర్మరాభీలజంఝామరుత్తు
విరివిగాఁ గప్పెఁ గావిరి గంతముల సంగ్రామభూస్థలి మూఁడువ్రయ్య లయ్యె
రాలె నుల్కాసహస్రము లెల్లెడల నిల్చి దట్టించె భూతబేతాళగణము
పొగ లేక యాయుధంబులు మండె నుజ్జ్వలప్రతిసూర్యమండలప్రభలు వెలిఁగె</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>బభ్రువాహనుండు పాండవమధ్యమ, ప్రాణహరణనిష్టురప్రచార
జాగ్రదుగ్రశరధిసంచితజ్వాలాభి, ధానశరము వింటఁ బూనుటయును.</poem>|ref=44}}
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆవిఖ్యాతశరంబు హాలహలసప్తార్చిశ్ఛటల్ గ్రాయుచున్
రా వీక్షించి సురేంద్రసూతి వివిధాస్త్రప్రౌఢి వారింప ది
గ్ద్యావాపృథ్వ్యవరోధమై నిగిడి క్రౌర్యస్ఫూర్తిమై బంధుర
గ్రీవంబున్ వడిఁ ద్రుంచె దచ్ఛిరము లక్ష్మీనాథుఁ గీర్తింపఁగన్.</poem>|ref=45}}
{{p|ac|fwb}}బభ్రువాహనుం డర్జునుఁ దెగనేయుట</p>
{{Telugu poem|type=తే.|lines=<poem>అహిమకరుఁ డుత్తరాగతుం డైనశుక్ల, పక్షకార్తికైకాదశీభానువాస
రమున నిను నస్తమయవేళ వ్రాలె నతని, తలయు వట్టయు వృషభకేతనునిమ్రోల.</poem>|ref=46}}
{{Telugu poem|type=క.|lines=<poem>అప్పుడు కర్ణజపూర్వక, కుప్పసుతాస్యములు రత్నకుండలరోచుల్
గప్పుకొని మెఱసె ధరఁ బడి, యొప్పారెడు సూర్యబింబయుగళముఁబోలెన్.</poem>|ref=47}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునం బభ్రువాహనుం డాహవముఖంబున వృషకేతనకపికేతనుల వధించి
జయోత్సాహంబునం బొదలి మగడునప్పు డప్పురంబున.</poem>|ref=48}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కొలఁదిఁగాఁ బన్నీరు చిలికించి కప్పురంబున గృహాంగణముల మ్రుగ్గు దీర్చి
సమకట్టుచీనాంబరములతో బెరయఁ జిత్రములుగా మకరతోరణము లెత్తి
యెడనెడ వారమృగేక్షణానృత్యయోగ్యము లైనవివిధమంత్రము లమర్చి
సాంబ్రాణిధూపవాసనఁ గదంబించు వీథుల మంగళద్రవ్యములు ఘటించి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>భూరిజయవాద్యఘోషముల్ బోరు కలఁగఁ, బౌరజను లెదుర్కొనెడుసంభ్రమము బభ్రు
వాహుచే నింద్రసుతుఁ డాహవమునఁ దెగుట, గా విచారించి చిత్రాంగదావధూటి.</poem>|ref=49}}
{{p|ac|fwb}}అర్జునునిమరణంబు విని చిత్రాంగదాదులగు నంతఃపురస్త్రీలు దుఃఖించుట</p>
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఉల్లము వ్రక్కలై కలఁగ నొత్తినమూర్ఛ వహించి ధారణిం
దెళ్ళినఁ జేరి యత్తరుణిఁ దేర్చి యులూచి యురంబు మోము జొ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
hm19qart0w9wd2fkrgtge4kyekqq5ar
552986
552984
2026-04-15T01:27:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
552986
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=శా.|lines=<poem>మాతల్లిన్ వనితామతల్లిని సభామధ్యంబునం దొల్లి య
ప్రీతుల్ పల్కినపాతకంబునకుఁ జేరం గాల మివ్వేళ ని
న్నాతంకంబునఁ బెట్టుచున్న పితృపుత్త్రాశల్ విసర్జించి నీ
సూతుం గృష్ణుఁ దలంచుకొమ్మనఁగ నచ్చోఁ బుట్టె నుత్పాతముల్.</poem>|ref=43}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>నెత్తురు వర్ణించె నీరదంబులు వీచె శర్మరాభీలజంఝామరుత్తు
విరివిగాఁ గప్పెఁ గావిరి గంతముల సంగ్రామభూస్థలి మూఁడువ్రయ్య లయ్యె
రాలె నుల్కాసహస్రము లెల్లెడల నిల్చి దట్టించె భూతబేతాళగణము
పొగ లేక యాయుధంబులు మండె నుజ్జ్వలప్రతిసూర్యమండలప్రభలు వెలిఁగె</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>బభ్రువాహనుండు పాండవమధ్యమ, ప్రాణహరణనిష్టురప్రచార
జాగ్రదుగ్రశరధిసంచితజ్వాలాభి, ధానశరము వింటఁ బూనుటయును.</poem>|ref=44}}
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆవిఖ్యాతశరంబు హాలహలసప్తార్చిశ్ఛటల్ గ్రాయుచున్
రా వీక్షించి సురేంద్రసూతి వివిధాస్త్రప్రౌఢి వారింప ది
గ్ద్యావాపృథ్వ్యవరోధమై నిగిడి క్రౌర్యస్ఫూర్తిమై బంధుర
గ్రీవంబున్ వడిఁ ద్రుంచె దచ్ఛిరము లక్ష్మీనాథుఁ గీర్తింపఁగన్.</poem>|ref=45}}
{{p|ac|fwb}}బభ్రువాహనుం డర్జునుఁ దెగనేయుట</p>
{{Telugu poem|type=తే.|lines=<poem>అహిమకరుఁ డుత్తరాగతుం డైనశుక్ల, పక్షకార్తికైకాదశీభానువాస
రమున నిను నస్తమయవేళ వ్రాలె నతని, తలయు వట్టయు వృషభకేతనునిమ్రోల.</poem>|ref=46}}
{{Telugu poem|type=క.|lines=<poem>అప్పుడు కర్ణజపూర్వక, కుప్పసుతాస్యములు రత్నకుండలరోచుల్
గప్పుకొని మెఱసె ధరఁ బడి, యొప్పారెడు సూర్యబింబయుగళముఁబోలెన్.</poem>|ref=47}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునం బభ్రువాహనుం డాహవముఖంబున వృషకేతనకపికేతనుల వధించి
జయోత్సాహంబునం బొదలి మగడునప్పు డప్పురంబున.</poem>|ref=48}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కొలఁదిఁగాఁ బన్నీరు చిలికించి కప్పురంబున గృహాంగణముల మ్రుగ్గు దీర్చి
సమకట్టుచీనాంబరములతో బెరయఁ జిత్రములుగా మకరతోరణము లెత్తి
యెడనెడ వారమృగేక్షణానృత్యయోగ్యము లైనవివిధమంత్రము లమర్చి
సాంబ్రాణిధూపవాసనఁ గదంబించు వీథుల మంగళద్రవ్యములు ఘటించి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>భూరిజయవాద్యఘోషముల్ బోరు కలఁగఁ, బౌరజను లెదుర్కొనెడుసంభ్రమము బభ్రు
వాహుచే నింద్రసుతుఁ డాహవమునఁ దెగుట, గా విచారించి చిత్రాంగదావధూటి.</poem>|ref=49}}
{{p|ac|fwb}}అర్జునునిమరణంబు విని చిత్రాంగదాదులగు నంతఃపురస్త్రీలు దుఃఖించుట</p>
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఉల్లము వ్రక్కలై కలఁగ నొత్తినమూర్ఛ వహించి ధారణిం
ద్రెళ్ళినఁ జేరి యత్తరుణిఁ దేర్చి యులూచి యురంబు మోము జొ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ckxps5hqas4sbora9uzop6t0s8s7fjq
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/136
104
178869
552991
496209
2026-04-15T02:33:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
552991
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>త్తిల్లఁగ మోఁదుకొంచుఁ బరిదేవన మొందఁ బురీవధూజనం
బల్లుక చేయురోదనము లంతిపురంబున నిండఁ బర్వినన్.</poem>|ref=50}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తత్కోలాహలం బాలకించి బభ్రువాహనుఁ డంతఃపురంబుం బ్రవేశించునప్పుడు.</poem>|ref=51}}
{{Telugu poem|type=శా.|lines=<poem>నేలన్ రాలినహారవల్లికలు ఖండీభూతపాటీరదూ
ర్వాలాజాక్షతహేమపాత్రికలుఁ బ్రభ్రష్టార్ధ్రనీరాజన
జ్వాలాకోరకితాంగణంబులు ననిశ్వాసంబునన్ భూవిభుం
డాలోకించుచు వచ్చి కన్గొనియె శోకాక్రాంతలం దల్లులన్.</poem>|ref=52}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కాంచి యిట్లను నర్హశృంగారరచన, లెడల నేటిని నింత వావిడిచి యేడ్వ
నసదృశానందకారణం బైనమద్వి, జయమునం దిట్లు శోకింపఁ జనునె యనిన.</poem>|ref=53}}
{{Telugu poem|type=క.|lines=<poem>తరువున జనించి వైశ్వా, నరుఁడు తరువుఁ గాల్చువిధమునను బుత్త్రుఁడ వై
నరున కుదయించి తండ్రిన, పొరిగొంటివి విధవ కేల భూషణ మింకన్.</poem>|ref=54}}
{{Telugu poem|type=క.|lines=<poem>కాంత ధనంజయముఖమునఁ, గాంతు ధనంజయముఖంబు గావునఁ గొనిపొ
మ్మంతముఁ బొందినవిజయా, భ్యంతికమున కన్నఁ బన్నగాత్మజ పలికెన్.</poem>|ref=55}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>నాయెలదోఁటలో మొదల నాటినదాడిమపంచకంబు నీ
పోయినరేయి దగ్ధ మయిపోయె నిమిత్తము లేక యల్లకౌం
తేయుని కీడు గంటిఁ దరుణీ యనఁ దల్లి కుమారుఁ జూచి పు
త్త్రా యెఱిఁ గిట్లు చేయుపితృహత్య జయం బని కోరె దేమనన్.</poem>|ref=56}}
{{Telugu poem|type=క.|lines=<poem>అన బభ్రువాహనుఁడు ప, ర్వినభయమునఁ గలఁగి మోము వెలవెల వాఱన్
గొనిపోయె నపుడ తల్లుల, జనకుఁడు పడియున్నఘోరసమరస్థలికిన్.</poem>|ref=57}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>చేర నరుగుదెంచి చిత్రాంగదయు భోగి, రాజసుతయు దివిజరాజసుతుని
పాదపంకజములపైఁ బడి యందంద, పొదలు శోకవహ్నిఁ బొగిలి పొగిలి.</poem>|ref=58}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>దివిజులఁ దఱిమి ఖాండవము సప్తార్చికి ధారవోసినయశోధనుఁడు వీఁడె
నిటలాక్షుతోడ నెక్కటి పోరి పాశుపతము గొన్నవిక్రమోద్ధతుఁడు వీఁడె
కాలకేయాదిరాక్షనుల నుక్కడఁగించి జయము గైకొనినదుర్జయుఁడు వీఁడె
కలన భీష్మాదియోధులగర్వ మెడలించి పసి మరల్చినబాహుబలుఁడు వీఁడె</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యగ్రజునకును రాజసూయాధ్వరప్ర, శస్తి నెరపిన భ్రాతృవత్సలుఁడు వీఁడె
యదుకుమారుల సరకు సేయక సుభద్ర, గడిమిఁ జేకొన్న హరిచెలికాఁడు వీఁడె.</poem>|ref=59}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అని విలాపించి వృషకేతనునిశిరంబుఁ, గాంచి తల్లులు దిగిచి వక్షమునఁ జేర్చి
తండ్రిపనిఁ దీర్ప కిట్లు నాతండ్రి నిలువ, నగునె నీ కంచు బభ్రువాహనునిఁ జూచి.</poem>|ref=}}<noinclude><references/></noinclude>
258308pebr06wezkezawlpfgsxgejx7
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/137
104
178870
552992
496210
2026-04-15T02:53:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
552992
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>తనయా చంపితి కర్ణనూను బుధమందారంబు నిం దేమికీ
ర్తిం నినుం జెందె హయంబువెంట నికఁ గూర్మిన్ హస్తినాపట్టణం
బునకుం బోవఁగఁగల్గె బంధువితతిం బూజింపఁగాఁగల్గె నం
దు నిజేశుం గలయంగఁగల్గె ననఁ దోడ్తోఁ ద్రుంచి తయ్యాసలన్.</poem>|ref=61}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనకునిఁ జంపినమాడ్కిని, జనయిత్రుల మమ్ము నిపుడ చంపుము జననీ
జనకవధం బొనరించినఁ, గనియెదు భార్గవునికన్న ఘనతరకీర్తుల్.</poem>|ref=62}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ప్రియుఁడు పరలోకగతుఁ డైనపిదప సతుల, కనుగమన మెందు నర్హకృత్యంబు దగిన
తెఱఁగు గావింపఁబనుపుము తీర్చికొనెద, మగ్నిముఖమునఁ బతివియోగాగ్ని యనిన.</poem>|ref=63}}
{{Telugu poem|type=శా.|lines=<poem>అంబా తండ్రికి మున్ హయంబుఁ గొనుచున్ సాష్టాంగదండప్రణా
మం బేఁ జేసిన నాదరింపక సభామధ్యంబునన్ దుచ్ఛవా
క్యంబుల్ పల్కఁగ సంభవించెఁ బితృహత్యాలబ్ధి యిక్కీడు నా
శం బైపోదు తపోవ్రతానశనయజ్ఞధ్యానదానాదులన్.</poem>|ref=64}}
{{Telugu poem|type=క.|lines=<poem>మును దా నుదయించినవే, ళనె పితృఘాతుకుఁడు గాఁ గలఁడు వీఁ డని నే
మ్మనమున నెఱిఁగిన ఫణిసుత, ననుఁ జంపక పెనుప నఘమునకు లో నైతిన్.</poem>|ref=65}}
{{Telugu poem|type=క.|lines=<poem>కావున నిత్తను వనలము, లో వేల్చెద ననిన విని యులూచి పలికె నే
లా వేగపడెదు మృతసం, జీవనమణి గలదు తండ్రి శేషునినగరన్.</poem>|ref=66}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కుళికవాసుకిశంఖకర్కోటకాది, ఫణులు మణిదీప్తఫణపరంపరలు మెఱయఁ
గాతు రది మృతభోగిరక్షణము గాన, గరుడభయపన్నగుల కిచ్చెఁ గాళగళుఁడు.</poem>|ref=67}}
{{p|ac|fwb}}ఉలూచి చిత్రాంగద నూరార్చి మృతసంజీవనీరత్నంబు దెచ్చుటకు<br>
పుండరీకుని పాతాళంబున కనుచుట</p>
{{Telugu poem|type=మ.|lines=<poem>బలిమిం జేకొనరాదు సామమునఁ దప్పన్ బుండరీకుండు దేఁ
గలఁ డారత్నము మత్ప్రధానుఁ డని యక్కల్యాణి తాటంకమం
గళసూత్రంబులు చేతి కిచ్చి ఫణిలోకస్వామి కీదుర్దశల్
తెలియంగా వినిపించి యమ్మణి వెసం దె మ్మంచు వీడ్కొల్పినన్.</poem>|ref=68}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వికృతిఁ బొందకయుండ నవ్విజయకర్ణ, సుతులమేనులు మూర్కొని యతఁడు వీరి
నేమఱక యుండుఁ డని వారి నెచ్చరించి, కదలి వెసఁ జొచ్చె వసుమతీగహ్వరంబు.</poem>|ref=69}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆయుతయోజనసువర్ణాశ్వత్థగహనఖేలత్పన్నగము వితలంబు సొచ్చి
ఫలితకాంచనశమీపాదపచ్ఛాయావిలాసవాసము సుతలంబు గడచి
శాతకుంభరసాలసాలచిత్రానేకతరుసంకులము మహాతలము దాఁటి
మరకతమాణిక్యమయచందనద్రుకాంతారాంతరము రసాతలము వెడలి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
gmhv508549jfq3lsawdqi3id18102r8
552993
552992
2026-04-15T02:54:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
552993
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>తనయా చంపితి కర్ణసూను బుధమందారంబు నిం దేమికీ
ర్తిం నినుం జెందె హయంబువెంట నికఁ గూర్మిన్ హస్తినాపట్టణం
బునకుం బోవఁగఁగల్గె బంధువితతిం బూజింపఁగాఁగల్గె నం
దు నిజేశుం గలయంగఁగల్గె ననఁ దోడ్తోఁ ద్రుంచి తయ్యాసలన్.</poem>|ref=61}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనకునిఁ జంపినమాడ్కిని, జనయిత్రుల మమ్ము నిపుడ చంపుము జననీ
జనకవధం బొనరించినఁ, గనియెదు భార్గవునికన్న ఘనతరకీర్తుల్.</poem>|ref=62}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ప్రియుఁడు పరలోకగతుఁ డైనపిదప సతుల, కనుగమన మెందు నర్హకృత్యంబు దగిన
తెఱఁగు గావింపఁబనుపుము తీర్చికొనెద, మగ్నిముఖమునఁ బతివియోగాగ్ని యనిన.</poem>|ref=63}}
{{Telugu poem|type=శా.|lines=<poem>అంబా తండ్రికి మున్ హయంబుఁ గొనుచున్ సాష్టాంగదండప్రణా
మం బేఁ జేసిన నాదరింపక సభామధ్యంబునన్ దుచ్ఛవా
క్యంబుల్ పల్కఁగ సంభవించెఁ బితృహత్యాలబ్ధి యిక్కీడు నా
శం బైపోదు తపోవ్రతానశనయజ్ఞధ్యానదానాదులన్.</poem>|ref=64}}
{{Telugu poem|type=క.|lines=<poem>మును దా నుదయించినవే, ళనె పితృఘాతుకుఁడు గాఁ గలఁడు వీఁ డని నే
మ్మనమున నెఱిఁగిన ఫణిసుత, ననుఁ జంపక పెనుప నఘమునకు లో నైతిన్.</poem>|ref=65}}
{{Telugu poem|type=క.|lines=<poem>కావున నిత్తను వనలము, లో వేల్చెద ననిన విని యులూచి పలికె నే
లా వేగపడెదు మృతసం, జీవనమణి గలదు తండ్రి శేషునినగరన్.</poem>|ref=66}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కుళికవాసుకిశంఖకర్కోటకాది, ఫణులు మణిదీప్తఫణపరంపరలు మెఱయఁ
గాతు రది మృతభోగిరక్షణము గాన, గరుడభయపన్నగుల కిచ్చెఁ గాళగళుఁడు.</poem>|ref=67}}
{{p|ac|fwb}}ఉలూచి చిత్రాంగద నూరార్చి మృతసంజీవనీరత్నంబు దెచ్చుటకు<br>
పుండరీకుని పాతాళంబున కనుచుట</p>
{{Telugu poem|type=మ.|lines=<poem>బలిమిం జేకొనరాదు సామమునఁ దప్పన్ బుండరీకుండు దేఁ
గలఁ డారత్నము మత్ప్రధానుఁ డని యక్కల్యాణి తాటంకమం
గళసూత్రంబులు చేతి కిచ్చి ఫణిలోకస్వామి కీదుర్దశల్
తెలియంగా వినిపించి యమ్మణి వెసం దె మ్మంచు వీడ్కొల్పినన్.</poem>|ref=68}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వికృతిఁ బొందకయుండ నవ్విజయకర్ణ, సుతులమేనులు మూర్కొని యతఁడు వీరి
నేమఱక యుండుఁ డని వారి నెచ్చరించి, కదలి వెసఁ జొచ్చె వసుమతీగహ్వరంబు.</poem>|ref=69}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆయుతయోజనసువర్ణాశ్వత్థగహనఖేలత్పన్నగము వితలంబు సొచ్చి
ఫలితకాంచనశమీపాదపచ్ఛాయావిలాసవాసము సుతలంబు గడచి
శాతకుంభరసాలసాలచిత్రానేకతరుసంకులము మహాతలము దాఁటి
మరకతమాణిక్యమయచందనద్రుకాంతారాంతరము రసాతలము వెడలి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ftlm9ddzq4abf5lcmd02ri7n66237rg
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/138
104
178871
552998
496211
2026-04-15T03:57:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
552998
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>కనియె భోగవతీతీరవనవిహార, హాటకేశ్వర భవనడోలాధిరూఢ
గూఢపాత్కన్యకాగానగుంభమాన, తాళకోలాహలమ్ము పాతాళతలము.</poem>|ref=70}}
{{Telugu poem|type=వ.|lines=<poem>కనుంగొని.</poem>|ref=71}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అచట భోగవతీస్నాన మాచరించి, నియతకృత్యంబు లెన్ని యన్నియును దీర్చి
పుండరీకుఁడు హాటకపుండరీక, షండములు హాటకేశు నర్చన మొనర్చి.</poem>|ref=72}}
{{Telugu poem|type=మ.|lines=<poem>ముకుటన్యస్తకరారవిందుఁ డగుచున్ ముగ్ధేందుచూడావతం
సకునిన్ వీడ్కొని నూత్నరత్నఖచితాస్థానిన్ విలోకించి వా
సుకికరోటకతక్షకాదిభుజగేశుల్ గొల్వ దీపించునం
దకపాణిస్మరణవ్యపోదయతవిద్యాశేషు నాశేషునిన్.</poem>|ref=73}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కని వినయంబు గ్రందుకొనఁగాఁ బ్రణమిల్లి యులూచి దాల్చుకుం
దనపుమెఱుంగుఁగమ్మలును దాళియుఁ జూపి కిరీటి ధర్మనం
దనమఖవాహరక్షణచణస్థితి నేగుచు బభ్రువాహు మా
ర్కొని హతుఁ డయ్యె నీతనయకుం బతిదానము సేయఁగాఁదగున్.</poem>|ref=74}}
{{Telugu poem|type=చ.|lines=<poem>ధరణితలంబు మస్తమునఁ దాల్చి యొనర్చితి జీవకోటికిన్
బరమసుఖానుకూలముగ మధ్యమలోకము శైలధ్వనికిం
బురజయ మిచ్చి వేలుపులఁ బ్రోచితి వేగతి నెన్ని చూచినన్
బరపురుషోపకారములు పన్నగనాయక నీవిహారముల్.</poem>|ref=75}}
{{Telugu poem|type=క.|lines=<poem>కావున నీనిలయమున స, దా విషధరముఖ్యరక్షితం బగుమృతసం
జీవని యొసఁగినఁ బునరు, జ్జీవితుఁ డగుఁ బార్థుఁ డనిన శేషుఁడు పల్కెన్.</poem>|ref=76}}
{{Telugu poem|type=క.|lines=<poem>హరిభక్తిపరాయణుఁ డ, న్నరుని జయింపంగ నాదినారాయణుఁ డొ
క్కరుఁడును దక్కఁగ నెవ్వరి, తర మతని నెదుర్ప నద్భుతం బిది యనినన్.</poem>|ref=77}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆపుండరీకుఁ డనుఁబృ, థ్వీపతు లెన గారు విజయు దీకొన గంగా
శాపహతిఁ బుత్త్రుచేతన, రూపఱెఁ గా కనిన విని కరుణ దళుకొత్తన్.</poem>|ref=78}}
{{Telugu poem|type=క.|lines=<poem>మృతసంజీవకమణియు న, మృతకుంభము నొసఁగెదను సమీకహతు శత
క్రతుసుతు బ్రతికించి జగ, త్త్రితయంబునఁ గీర్తి విస్తరించెద ననుచున్.</poem>|ref=79}}
{{Telugu poem|type=క.|lines=<poem>కృతనిశ్చయుఁ డగు శేషుని; ధృతరాష్ట్రుం డనెడుఫణి గదిసి యి ట్లను సం
చితవస్తుజాతములలో, వితరణులకు నొసఁగరానివియు లే వెచటన్.</poem>|ref=80}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అయిన నొకవిన్నపము మర్త్యు లనృతవాదు, లిచ్చినను వారియెడ ఫలియింపనేర
దమృతమును రత్నమును బోయినపుడ ఫణుల, బైసి చెడిపోవుఁ దుది నీరుపాము లగును.</poem>|ref=81}}
{{Telugu poem|type=క.|lines=<poem>గరుడుఁడు తోలుక తిరుగును, పురముల నాడింతు రుదరపోషణములకున్
బరిజోగులు పెట్టెల నిడి; తరుణు లొలుచుకొండ్రు మణులు తలతలవారిన్.</poem>|ref=82}}<noinclude><references/></noinclude>
64c7f6l1l23koowlbmpm870cul6pui6
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/139
104
178872
553001
496212
2026-04-15T04:14:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఆ.|lines=<poem>మును మతంగశాపమున వైనతేయుఁ డి, క్కడికిరాక తక్కెఁ గాక యివ్వి
ధం బెఱింగెనే సుధారసరత్నంబు, లేల మనకు మగుడ నిచ్చు నతఁడు.</poem>|ref=83}}
{{Telugu poem|type=క.|lines=<poem>మత్తకరివిభుఁ డమాత్యుఁడు, మెత్తనియంకుశము మేరమీఱి నడచెనే
నొత్తి మరలింపఁదగు నీ, చిత్తం బిఁక ననిన నగుచు శేషుఁడు పలికెన్.</poem>|ref=84}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గోపసూనులఁ గ్రేపుల గోధనములఁ, గమలజుఁడు దాఁచి సత్యలోకమున నున్న
నపుడె ప్రతిసృష్టి యొనరించె నాప్తుఁ డైన, క్రీడి బ్రతికించు టేదొడ్డు కేశవునకు.</poem>|ref=85}}
{{Telugu poem|type=క.|lines=<poem>వూరిపుడక కులిశం బగు, నారాయణుకరుణ గలిగినను లేకున్నన్
మేరువు తృణ మగు నవ్విభు, కారుణ్యము గాదె వజ్రకవచము మనకున్.</poem>|ref=86}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన ధృతరాష్ట్రుండు శేషున కిట్లనియె.</poem>|ref=87}}
{{Telugu poem|type=క.|lines=<poem>వనజోదరుండు వాసవ, తనయుని బ్రతికించునఁట సుధారసమణులన్
బని లేని ప్రయోజన మి, చ్చి నిరర్దక మేల ఫణులఁ జెఱచెద వనినన్.</poem>|ref=88}}
{{p|ac|fwb}}పుండరీకుఁడు శేషునిచే తిరస్కృతుండై మరల నులూచికడకు వచ్చుట</p>
{{Telugu poem|type=తే.|lines=<poem>పుండరీకునిఁ జూచి శేషుండు పలికె, మాకులమువారు సంజీవమణియు సుధయు
నీరు హరి క్రీడిఁ బ్రోచు నీ వేఁగు మనిన, తిరిగి యాతండు వచ్చినతెరువుఁ బట్టి.</poem>|ref=89}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>సంగరభూమిఁ జేరి ఘనసారసముజ్జ్వలదీపమాలికా
సంగతబభ్రువాహనిజసైన్యసురక్షితుఁ డైనపార్థు మ్రో
లం గడుఁదూలి దీనదశలం బరవించెడు నయ్యులూచిచి
త్రాంగదలం గనుంగొని దురంతవిషాదముతోడ ని ట్లనున్.</poem>|ref=90}}
{{Telugu poem|type=శా.|lines=<poem>తల్లీ నీజనకుడు శేషఫణిరత్నం లీక లోభంబు సం
ధిల్లం బల్కిన రోసి వచ్చితి విరక్తిం బుత్త్రదత్తాగ్నిలోఁ
జెల్లుం డిందఱు నన్నఁ గార్ష్ణి చెవికిం జేఁడై కఠోరక్రుధా
వేల్లద్భ్రూకుటిమండలుం డగుచుఁ జేవి ల్లంది పె ల్లీసువన్.</poem>|ref=91}}
{{Telugu poem|type=శా.|lines=<poem>ఏట్రా శేషుఁడు పోతరించి సభ న న్నెగ్గాడె నారత్న మీఁ
డట్రా వాసుకితక్షకాదిధృతరాష్ట్రామాత్యకర్కోటకుల్
చుట్రా నిల్తురుగాక నన్ను సమరక్షోణిన్ విజృంభించి యా
గట్రాచూలివిభుం డెదిర్చిన నహంకారంబు వారించెదన్.</poem>|ref=92}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని జనయిత్రులదెసఁ గ, న్గొని యిట్లను బభ్రువాహనుఁడు చిత్రముగాఁ
గొనివచ్చెద మృతసంజీ వనమణియు సుధారసంబు వగవకుఁ డనుచున్.</poem>|ref=93}}<noinclude><references/></noinclude>
5ehcu1i6axby2hf5hvi8jhosv2bdbz0
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/140
104
178873
553002
496213
2026-04-15T04:42:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553002
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}బభ్రువాహనుఁడు నురగులతోడి యుద్ధంబున కేఁగుట</p>
{{Telugu poem|type=క.|lines=<poem>మాతంగరథభటాశ్వప, రీతుఁ డగుచుఁ ద్రోవ పుండరీకుఁడు చూపన్
బాతాళంబున నిలువక, పాతాళంబునకుఁ బోయి పౌఁజులు సేయన్.</poem>|ref=94}}
{{Telugu poem|type=తే.|lines=<poem>శంఖభేరీమృదంగనిస్సాణభయద, రావములు దిక్తటంబుల వ్రక్కలింప
శేషుఁ డిట్లనుఁ దక్షకమూషకాద, కుళికవాసుకికర్కోటకులఁ గనుఁగొని.</poem>|ref=95}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>తెంపున బభ్రువాహుఁ డరుదెంచె రణంబునఁ బన్నగంబులన్
ద్రుంపక పోఁడు కట్టలుకతో ధృతరాష్ట్రునిదుర్వినీతు లా
లింపఁగఁ బట్టి పుట్టెఁ బనిలేనివిరోధము మీర లెల్ల నా
పంపునఁ బోరికిం జనుఁ డపారబలంబులతోడ నావుడున్.</poem>|ref=96}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>కుండలిరాజునాజ్ఞ భుజగుల్ వరరత్నకిరీటముద్రికా
కుండలమాల్యచందనదుకూలములన్ ధరియించి వాహవే
దండరథాథిరూడు లయి తార్కొని మార్కొన నొప్పె సేన లా
రెండు లయాంతకభ్రుకుటిరేఖలపెంపుఁ దృణీకరించుచున్.</poem>|ref=97}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అనికిం దూకొని దందశూకచతురంగానీకముల్ పంచయో
జనజన్యస్థలి నిండి భీషణవిషజ్వాలావలిన్ బభ్రువా
హనుసేనం బరిమార్పఁ దోన ధృతరాష్ట్రామోఘదివ్యాస్త్రశ
స్త్రనిపాతంబు లనేకవింశతిసహస్రవ్యూహముల్ మ్రగ్గినన్.</poem>|ref=98}}
{{Telugu poem|type=తే.|lines=<poem>విజయసుతుఁ డల్గి మయూరవిశిఖ మేయ, ద్విత్రిశతసంఖ్య ఫణముల విషధరముల
శిఖులు మర్దింపఁ జెదకుతచ్ఛీర్షమణులు, విలయమున రాలునుల్కలవిధము మెఱసె.</poem>|ref=99}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇత్తెఱంగునం గేకిలోకంబు కదిసి చీకాకుపడం గాకోదరంబులయుదరంబులు చం
చూపుటంబులం జించినఁ బ్రేవులు ప్రోవులువడం గెడసి నాలికలు పేలికలవిధంబు
నం దూలందూలుట గనుంగొని యక్కుమారుండు మధువర్షబాణంబు ప్రయోగించి.</poem>|ref=100}}
{{Telugu poem|type=క.|lines=<poem>నిలువక పిపీలకాస్త్రం, బలుకమెయిం దొడిగి యేయ నందువలనఁ బె
క్కులుచీమలు వెలువడి వడిఁ, దొలిచె శరీరాస్థు లెల్లఁ దొఱటలు వాఱన్.</poem>|ref=101}}
{{Telugu poem|type=క.|lines=<poem>చిలువదళవాయు లప్పుడు, తలబీకనకాయలై యథాయథలై కూ
కులువత్తులునై మొనతల, నిలువక శేషాహికడకు నెఱి చెడి పాఱన్.</poem>|ref=102}}
{{Telugu poem|type=వ.|lines=<poem>వారలం గనుంగొని భుజంగపుంగవుం డిట్లనియె.</poem>|ref=103}}
{{Telugu poem|type=క.|lines=<poem>మృతసంజీవని సురరా, ట్సుతులకు నిం డన్న నప్పుడు కుయుక్తులు చె
ప్పితిరి నరసూనుమగఁటిమి, ధృతరాష్ట్రప్రముఖు లెఱిఁగితిరె నేఁ డాజిన్.</poem>|ref=104}}<noinclude><references/></noinclude>
qs1fprij4znenoex232254lljbhrzvv
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/141
104
178874
553003
496214
2026-04-15T04:56:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553003
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}బభ్రువాహనుఁడు నురగుల నోడించి జీవమణి గొనివచ్చుట</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>అంచు వారల నిరసించి యాక్షణమ సుత్రామపౌత్రునకు నీఁదగినదివ్య
కవచంబు శతశలాకాఛత్రము నమూల్యకుండలాభరణదుకూలమాల్య
పరిలేపనములు నుపాయనంబుగ నిచ్చి గారవించి మనంబుకందు వాపి
గాండీవికిని మేలుకట్టనంబు లమర్చి స్వర్ణపేటికలందు సంతరించి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>తక్షకాదులు గొల్వఁ బాతాళగహ్వ, రంబు వెలువడి జీవరత్నంబుఁ గొనుచు
బభ్రువాహనుఁ గూడి ప్రాభవము మెఱసి, మణిపురంబున కేతెంచె ఫణివరుండు.</poem>|ref=105}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అపుడు ధృతరాష్ట్రుఁ డాత్మగేహమున కరిగి, దుఃఖితుండయి దుర్బుద్ధి దుస్స్వభావు
లను సుతులఁ గాంచి బభ్రువాహనునిచేత, బవరమున నైనతనపరాభవము దెలిపి.</poem>|ref=106}}
{{Telugu poem|type=క.|lines=<poem>పాండవులకు మనకు మొదల, నుండియు నెడతెగనివైర మురగవిభుం డా
ఖండలసుతు బ్రతికించును, రం డిందుకుఁ దలఁపు డంతరాయం బనినన్.</poem>|ref=107}}
{{Telugu poem|type=వ.|lines=<poem>వారలు తండ్రికి బ్రణమిల్లి యిట్లనిరి.</poem>|ref=108}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>రుండము దాఁచినన్ ఫణివరుం డొకఁ డేల కిరీటిఁ బ్రోవఁ గృ
ష్ణుండును జాలఁ డింద్రసుతుచొ ప్పణఁగన్ మఖసైంధవంబు నె
వ్వం డయినన్ హరింప నిలువంబడు జన్నము యజ్ఞకర్మహీ
నుం డయి చెల్లు నయ్యమతనూజుఁడు నీపగ దీఱు నంతటన్.</poem>|ref=109}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అనిన ధృతరాష్ట్రుఁ డలరి శేషాహిఁ గొల్వ, జనియె నెఱుఁగనియట్ల తత్క్షణమ శక్ర
తనయుతలఁ గొంచుఁ దత్సుతుల్ చనిరి గరుడ, వర్ణితంబైన బకదాల్భ్యువనమునకును.</poem>|ref=110}}
{{p|ac|fwb}}నాగకుమారులచే సవహరింపఁబడిన యర్జునుతల గానక చిత్రాంగదాదులు శోకించుట</p>
{{Telugu poem|type=వ.|lines=<poem>అప్పుడు.</poem>|ref=111}}
{{Telugu poem|type=క.|lines=<poem>అదరి యులూచియుఁ జిత్రాం, గదయును గాండీపిశిరముఁ గానక కలయన్
వెదకి వదనోదరము లద, వదలుగఁ దాఁటించుకొనుచు వసుధం బొరలన్.</poem>|ref=112}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తత్కోలాహలంబు బభ్రువాహనుం డాలకించి.</poem>|ref=113}}
{{Telugu poem|type=క.|lines=<poem>అరుదెంచి శక్రసూనుని, శిరము వెదకి కానలేక చెందిన మూర్ఛన్
ధర వ్రాలె నచటఁ గుంతియుఁ, గరిపురి నారాత్రి కీడుకల గని భీతిన్.</poem>|ref=114}}
{{Telugu poem|type=క.|lines=<poem>విన్ననయి ధర్మజాచ్యుతు, లున్నెడ కరుదెంచి యదుకులోత్తంసునకున్
విన్నపము చేసె మునుకుచుఁ, గన్నులఁ గ్రొవ్వేఁడిబాష్పకణములు రాలన్.</poem>|ref=115}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కంసమర్దన నేడు నాకలఁ గిరీటి, తైలదీర్షిక మునిఁగి గాత్రమున గోమ
యం బలందుక రక్తమాల్యములు దాల్చి, యరిగె ఖరవాహనము నెక్కి యామ్యదిశకు.</poem>|ref=116}}<noinclude><references/></noinclude>
on9u6ld5b46q8i2q4bzah9hnuu9uep1
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/142
104
178875
553004
496215
2026-04-15T05:20:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553004
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అప్పాండవమధ్యమునకు, నొప్పమి పుట్టంగవలయు నుల్లము కలఁగన్
దప్పదు నాకల నీసఖు, నొప్పి పరిహరించి దయం గనుగొను మనినన్.</poem>|ref=117}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సంస్మరించిన నెదుర సాక్షాత్కరించు, తార్క్ష్యుపై దేవకీయశోదలును గుంతి
యును బకారియు రా హుటాహుటి నుపేంద్రుఁ, డరిగె మణిపురమునకు నయ్యపరరాత్రి.</poem>|ref=118}}
{{Telugu poem|type=చ.|lines=<poem>ఒఱగిన వాణంబులను నున్నమితాతపహరణంబులన్
నుఱుమగుభీకరాసుల నణూకృతభూషణరత్నరాసులన్
దఱచగు దీపకోటుల గుణచ్యుతకర్కశచాపకోటులన్
మెఱసిన బభ్రువాహనుసమిత్{{ZWNJ}}స్థలి శౌరి సుపర్ణు డిగ్గఁగన్.</poem>|ref=119}}
{{Telugu poem|type=క.|lines=<poem>బకదనుజాంతక దనుజాం, తకజననులుఁ బన్యగాశనరథంబు నిరు
త్సుకత డిగి పార్ధునపమూ, కళేబరమెదురఁ గని రొదవు శోకమునన్.</poem>|ref=120}}
{{p|ac|fwb}}శ్రీకృష్ణుఁడు మొదలగువా రర్జునుకడకు వచ్చుట</p>
{{Telugu poem|type=ఉ.|lines=<poem>శ్రీవరుఁ డప్పు డర్జునునిఁ జేరి ధనంజయ వీరె కుంతియున్
దేవకియున్ యశోదయును నిన్నుఁ గనుంగొని పొక్కుచుండ నే
లా వగ పార్పవంచు నడలన్ విని భీముఁడు కృష్ణుఁ జూచి దే
వా విజయుండు మేల్కను నవశ్యము నీ విటు పేరఁ బిల్చుటన్.</poem>|ref=121}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అనునంత సూర్యోదయంబైన బభ్రువాహనుండు దల్లులు దాను నలముకొనిన
మూర్ఛలు పర్యాయమునఁ దేఱి దురములోఁ జిక్కిన ప్రద్యుమ్నుచే నెఱింగి
కృష్ణునకును దేవకీయశోదులకుఁ గుంతికిని భీమునకు సద్వినయభక్తిఁ
బ్రణమిల్లె నప్పు డప్పన్నగాధీశుండు చక్రిసన్నిధిఁ జేరు సమయ మరసి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దేవ జీవరత్నంబుఁ దెచ్చినాఁడఁ, గరుణ రక్షింపు నీచెలికాని నితని
మస్తకము దొంగిలిన నీచమతులఁ బట్టి, తునుము తొల్లిటి రాహుకేతువుల బలెను.</poem>|ref=122}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ధర్మజునియన్వయము రసాతలములోన, మునుఁగకుండఁగ నుద్ధరింపుము కిరీటి
శిరమునకుఁ ద్రోవ గానము చిత్తగింపు, దేవకీపుత్ర నీదివ్యదృష్టి ననిన.</poem>|ref=123}}
{{Telugu poem|type=మ.|lines=<poem>వినుఁడీ నాదుప్రతిజ్ఞ యే నఖిలపృథ్విన్ బ్రహ్మచర్యవ్రతం
బున బెంపొందితినేని కవ్వడిశిరంబున్ వచ్చుఁ దచ్చోరకుల్
పునుకల్ వ్రయ్యలు వాసి చత్తు రన నాలో గ్రీడిమస్తంబు చ
య్యన వచ్చెన్ విగతాసులైరి ధృతరాష్ట్రాపత్యముల్ కానలోన్.</poem>|ref=124}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అంత.</poem>|ref=125}}
{{p|ac|fwb}}శ్రీకృష్ణుం డర్జునుని బ్రతికించుట</p>
{{Telugu poem|type=క.|lines=<poem>నరవృషకేతనులతలల్, సిరివరుఁ డంగములఁ జేర్చి జీవదమణి పే
రురమున మోప నదికెఁ ద, చ్ఛిరము లయస్కాంత మినుముఁ జెందినమాడ్కిన్.</poem>|ref=126}}<noinclude><references/></noinclude>
lpfcbb5cvffvjcv2tqf5tal3qwmpv94
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/143
104
178876
553005
496216
2026-04-15T05:35:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553005
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>జీవదరత్నవైభవముచే వృషకేతుఁడు లేచి శ్రీహరిం
దా వినుతించుచున్ రిపు నదల్ప ముకుందుఁడు గౌఁగిలించె గాం
డీవియు నట్ల దేఱ సుతు నెమ్మిఁ గనుంగొనెఁ దల్లి వాడు స
స్యావలి వానఁ దెప్పిఱుక్రియన్ గనెఁ బాండవసైన్య మత్తఱిన్.</poem>|ref=127}}
{{Telugu poem|type=చ.|lines=<poem>మొరసె నసంఖ్యశంఖరవముల్ దివిఁ బువ్వులవాన సోనగాఁ
గురిసెఁ బునఃప్రజాతసుతఁ గుంతిఁ గనుంగొనువేడ్క వాహినుల్
బెరసె మురారిపట్టి కదలింపఁ జమూపసమూహ ముబ్బుగా
బెరసెఁ బురోపకంఠసరణిం దరుణీపరిణీతలాస్యముల్.</poem>|ref=128}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అన్నగరీజనంబు నెరయం గని వాళిగఁ జల్లు రత్నసం
పన్నతయుం దదంతికహిమక్షితిభృత్తటసీమ నోలగం
బున్నకుమారుఁ జూచి తల లూఁచి నృపుల్ గొనియాడఁ గ్రీడియున్
వెన్నుఁడు బభ్రువాహరమణీయసభాస్థలిఁ జొచ్చి యచ్చటన్.</poem>|ref=129}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఘనరత్నభద్రపీఠం, బున నిరువురు నుండి రితరభూపతు లర్హా
సనులై రప్పుడు నమితా, ననుఁ డగు నరుఁ జూచి భోగినాయకుఁ డనియెన్.</poem>|ref=130}}
{{Telugu poem|type=క.|lines=<poem>ధాత్రీశుల కర్జున స, ర్వత్ర జయముఁ బుత్త్రుచేఁ బరాభవముఁ గనం
బాత్రము భవదీయసుత, క్షాత్ర మెఱిఁగి మెచ్చ కిటు దగదు లజ్జింపన్.</poem>|ref=131}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అదియునుంగాక నీకు గంగాశాపనిమిత్తంబున నిట్టివిపత్తు సంభవించె చిత్తంబున
నుత్తలంబు నొందక ముకుందునికరుణావిశేషంబునం జెందినభవన్నందను సకల
రాజ్యభోగంబులు ననుభవింపుము నీకళత్రంబు లైనచిత్రాంగదాభుజంగరాజ
పుత్త్రికల హృజ్ఞనితశోకంబు లుజ్జగింప బుజ్జగింపుము లజ్జితుం డైనబభ్రువాహను
నుపగూహనంబున నాదరింపు మని వారిజోదరుం గనుంగొని.</poem>|ref=132}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>దేవ కవ్వడి నొప్పి దీఱ బోధింపు మిత్తఱి దేవకీయశోదలును గుంతి
యును దండ్రిబిడ్డల నొద్దిక సేయంగవలయు వీరుఁడు బభ్రువాహనుండు
విష్ణుభక్తుని దయాన్వీతుని భాతృవత్సలును నూర్జితయశోధనుని నాత్మ
జనకుని మార్కొన్న పెనుబాతకము వాయఁ బ్రాచితంబుగఁ దుషారాచలంబు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దండఁ దనమేను విడువంగఁ దమకపడెడు, ననినఁ జిత్రాంగదాతనూజునిమనంబు
తెంపుఁ గనుఁగొని యది నివారింపఁదలఁచి, పవనజుఁడు పల్కె గంభీరభాషణముల.</poem>|ref=133}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గురుఁ బితామహుఁ దోఁబుట్టుగుల వధించి, దురితములఁ జెంద మీయచ్యుతుని భజించి
కలుషమతి వైననిన్ను డగ్గఱునె శౌరి, జీవపిత వీవు వెఱయంగఁ బావనుఁడవు.</poem>|ref=134}}
{{Telugu poem|type=క.|lines=<poem>విను నాలవయుగమున నీ, తనినామస్మరణమునఁ గదా మర్త్యులు పా
వను లైరి కృష్ణుఁ గొలిచి, మనలకు భయశోకదైన్యమగ్నత గలదే.</poem>|ref=135}}<noinclude><references/></noinclude>
gwk5yrwl350vtn8oa7qfnkjmm0uiu7b
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/144
104
178877
553006
496217
2026-04-15T06:27:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553006
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అని పెక్కుచందములఁ బా, వని దెలిపిన నపుడు బభ్రువాహనుఁడు మనం
బున నెగులు విడువ నందఱుఁ, గొనియాడిరి విజయుపట్టిగుణకథనంబుల్.</poem>|ref=136}}
{{Telugu poem|type=క.|lines=<poem>నానావిధభోగంబుల, నేనుదినము లుండి రేకహేలమణిపురిన్
దానములచేత బహువిధ, గానంబులచేతఁ గౌతుకము రెట్టింపన్.</poem>|ref=137}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆసమయంబునఁ గృష్ణుఁడు, వాసవితో ననియె నిట భవత్సూనుని యా
వాసమున సుఖింప సునా, యాసంబుగ నేఁగె వరుస నైదుదినంబుల్.</poem>|ref=138}}
{{Telugu poem|type=క.|lines=<poem>మనతల్లుల నీదేవుల, ననిలతనూభవునిఁ గూర్చి యర్హము లగు నీ
ధనకనకవస్తురాసులఁ, బనుపఁదగు నజాతశత్రుపట్టణమునకున్.</poem>|ref=139}}
{{Telugu poem|type=క.|lines=<poem>వీరలు ధర్మజుయజ్ఞ, ప్రారంభము జరపెదరు తురగరక్షకు నీ
భూరమణులు భవదీయకు, మారులు రావలయుఁ గదలి మనబడి ననుచున్.</poem>|ref=140}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>దేవకి మున్నుగాఁ గలసతీనివహంబు ధనంబుఁ గూర్చి య
ప్పావనివెంట నంపుటయుఁ బన్నగరాజును బభ్రువాహన
క్ష్మావరుచేతిపూజ బహుమానముగా గొని సంతసిల్లి ల
క్ష్మీవరుఁ డంప భోగవతికిం సనియెన్ బరమానురక్తుఁడై.</poem>|ref=141}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనవరతము నీకృష్ణా, ర్జునయుతసంజీవకథ వరుస నాకర్ణిం
చిన వ్రాసినఁ బాఠము చే, సిన ధర నపమృత్యుభయముఁ జెందరు మర్త్యుల్.</poem>|ref=142}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనమేజయ విను గోవిం, దునియనుమతి విడువఁబడినతురగము నానా
జనపదములు గడచి క్రమం, బున బర్హిధ్వజునిరత్నపురమున కరుగన్.</poem>|ref=143}}
{{Telugu poem|type=క.|lines=<poem>త్రోవ మయూరధ్వజవసు, ధావరు క్రతుహయముఁ బుత్త్రు దామ్రధ్వజునిం
గావలిగా నిడి విడిచిన, దైవికముగ రెండు నెదురుతాఁకై నిలువన్.</poem>|ref=144}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అమ్మఖవాజిఁ బాండుతనయాధ్వరవాహ మెదిర్చి మోముమో
వ మ్మసి వెట్టి హేషితరవమ్మున వక్షముఁ బూర్వపత్ఖురా
గ్రమ్మున వ్రేయ ఱేసి యది కందము వట్టి విదల్పఁ దోన మి
త్రమ్మయి కేలికిం గడఁగి దంతములన్ గళ మప్పళింపఁగన్.</poem>|ref=145}}
{{Telugu poem|type=క.|lines=<poem>తామ్రధ్వజభూవరుఁ డా, తామ్రనయనుఁ డగుచుఁ గనలి తంత్రాధిపు నీ
సామ్రాణి యెవరి దన విని, నమ్రుఁ డగుచు లీలఁ గదలి నకులధ్వజుఁడున్.</poem>|ref=146}}
{{p|ac|fwb}}నకులధ్వజుఁడు పాండవహయంబుఁ బట్టుట</p>
{{Telugu poem|type=ఆ.|lines=<poem>చౌకళింపకుండఁ జతురంగబలముల, సొరిది వేడె వెట్టి చుంచు బిగియఁ
బట్టి చదివె నొసలిపట్టికమీఁదఁ గ, న్పట్టి మెఱయు బిరుదపద్య మపుడు.</poem>|ref=147}}<noinclude><references/></noinclude>
fkfstq1tjmnmvketxaqodmez5bpmyuo
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/145
104
178878
553096
496218
2026-04-15T06:59:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553096
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>దుర్జయరాజమండలవిధుంతుదమూర్తి యుధిష్ఠిరక్రతూ
త్సర్జిత మైనయీహయవతంసము ద్రిమ్మర నంగరక్షగా
నర్జునుఁ డేగుదెంచె నిటలాక్షుని గెల్చినజోదు విక్రమో
పార్జితలీలఁ బట్టుఁడు రయంబున శూరులు ధాత్రిఁ గల్గినన్.</poem>|ref=148}}
{{Telugu poem|type=క.|lines=<poem>అది విని నృపసూనుం డను, నదనఁ గ్రతువు లేడు జరపె నధిపతి మును నేఁ
డిది దొరకుటచే నెనిమిద, వదియును సిద్ధించె ననుచు హరిఁ బట్టింతున్.</poem>|ref=149}}
{{Telugu poem|type=క.|lines=<poem>రేయి సురమౌని చెప్పెన్, బ్రాయఃపౌరుషులు లేరు పాండవసేనన్
బ్రాయి గలమగలు నరరా, ధేయసుతులు దక్క ననుచుఁ దెలియఁగ నాకున్.</poem>|ref=150}}
{{Telugu poem|type=మ.|lines=<poem>నరనారాయణు లర్జునాచ్యుతులు జన్యం బబ్బెడిం గావుఁ డీ
హరి నన్నం దళవాయి నీబలములో నాసేన గానంగరా
దరయన్ శూరుఁడు బభ్రువాహనుఁడు గాఁడా పెట్టుముక్తామణుల్
పురినంతఃపురిఁ జూపు కేళికలకుం బుష్పాంజలుల్ సేయఁగన్.</poem>|ref=151}}
{{p|ac|fwb}}కృష్ణార్జునులు తామ్రధ్వజునితోఁ బోరుట</p>
{{Telugu poem|type=క.|lines=<poem>ఆహవ మొనరింపఁగ నిఁక, సాహను లం దెవ్వ రనుచు సైన్యాధీశుం
డాహయము నర్ధచంద్ర, వ్యూహంబునఁ బదిలపఱచె నొడయనియాజ్ఞన్.</poem>|ref=152}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>తామ్రకేతుఁ డనిఁ బ్రతాపించి మార్కొన్న, శౌరి పలికె సవ్యసాచిఁ జూచి
వీరయోధకు లని కారణంబున కెల్ల, కారణంబు దప్ప దీరణంబు.</poem>|ref=153}}
{{Telugu poem|type=క.|lines=<poem>వారు లయాంతకనిభులు మ, హారథు లని కార్షిఁ బిలిచి యస్మద్బలమున్
బోరికి గృధ్రవ్యూహము, గా రచియింపు మన నట్ల కాఁ జేయుటయున్.</poem>|ref=154}}
{{Telugu poem|type=వ.|lines=<poem>వారిజోదరుండును దారకప్రేరితం బైనతే రెక్కి మిక్కుటం బగురవంబుల దిక్కు
డుంగంబులు వ్రక్కలింప నొక్కమొగిఁ బాంచజన్యంబు పూరించె నమ్మహావ్యూ
హంబునకు ననుసాళ్వుండు కంధరంబును హంసధ్వజుం డీక్షణంబులును ప్రద్యు
మ్నానిరుద్ధులు పక్షంబులును భోజవర్ధనుం డైనశైనేయుండు చరణమధ్యంబును
చంచువు చిత్రాంగదాపుత్రచిత్రభానుపౌత్రులును నపరిమితసేనాసమేతుండైన
కపికేతనుం డుదరంబును తదీయరక్ష యౌవనాశ్వమేఘవర్ణునుగా నెదిర్చినం గనుం
గొని తామ్రధ్వజుండు గరుడధ్వజున కిట్లనియె.</poem>|ref=155}}
{{Telugu poem|type=క.|lines=<poem>శూరత నను నెదిరించితి, పోరికి దివ్యాయుధములు పూని నిజముగాఁ
బౌరుషము గలిగె నేనియు, నారాయణ పట్టవలదె నాహరి ననుచున్.</poem>|ref=156}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అలుకం గన్నులు విస్ఫులింగములఁ గ్రాయం దామ్రకేతుక్షమా
తలనాథుండు శతాంగముం దఱిమి పార్థవ్యూహరక్తంబులన్</poem>|ref=}}<noinclude><references/></noinclude>
kpdqmtuvn543x9ciaybg5q91z5vjkv3
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/146
104
178879
553102
496219
2026-04-15T07:19:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553102
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బలి చల్లెన్ నెలవంకబాణముల దృప్యడ్డాకినీహూతికృ
ద్గళితజ్యారవఘూర్ణితాఖిలదిశాకాశావకాశంబుగన్.</poem>|ref=157}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కంసారి నేడంబకంబుల స్రుక్కించి యేనింట సూతుని నే పడంచి
తేరివాజుల నాల్గునారాచములఁ ద్రుంచి త్రిదశేంద్రజుని డెబ్బదిటఁ గలంచి
శైనేయు తొమ్మిదిశరముల సొరిగించి కృతవర్మ నిరునాలుగింట నొంచి
ప్రద్యుమ్ను వేయిమార్గణములఁ దూలించి శతసహస్రములఁ దత్సుతుని ముంచి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యంతఁ దనియక మదిఁ జాల నాగ్రహించి, మఱియుఁ దక్కినయోధులమద మడంచి
పగటిసూర్యునిగతి ప్రతాపమున మించి, సింహనాదంబు గావించెఁ జెంగలించి.</poem>|ref=158}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అప్పుడు.</poem>|ref=159}}
{{Telugu poem|type=క.|lines=<poem>తనతనువున నంతట గిఱి, కొనినశరవ్రజము దుల్పుకొని యుద్ధతుఁడై
యనిరుద్ధుఁ డెదిరివీరుల, ననిరుద్ధులఁ జేసి భీషణాశుగనిహతిన్.</poem>|ref=160}}
{{Telugu poem|type=క.|lines=<poem>గ్రమ్మన నెత్తురుటేఱులు, గ్రమ్మ నఖండప్రచండకాలానలకీ
లమ్ములఁ దెగడు మెఱుఁగువా, లమ్ముల నక్షౌహిణీత్రయము మడియించెన్.</poem>|ref=161}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆయదువీరుఁడు మఱి విలు, మ్రోయిం చరిఁ జూచి తురగమును విడు లేదా
నాయెదుర బంటవై నిలు, మాయోధనమునకు నన్న నతఁ డరనగుచున్.</poem>|ref=162}}
{{Telugu poem|type=క.|lines=<poem>అలరువిలుకానికొడుకవు, బలివారఁడె నాఁడె పట్టి బాణుఁ డుషామం
గళసూత్రవైభవము నీ, తల గాచెం గాక నాకు దయలే దనినన్.</poem>|ref=163}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కటువుగ నల్గి బాడబసఖం బగు క్రొవ్విశిఖం బడర్చి హృ
త్పుటముఁ బగిల్చి తొమ్మిదిటఁ దొట్టినక్రొవ్వుఁ గదల్చి సూతు నొ
క్కటఁ దల డుల్చి తేరితురగంబులు నాల్గిటఁ గూల్చి యార్చినన్
దటుకున వాలుఁ గేడెమును దాల్చి సుచిత్రుఁ డదల్చి నిల్చినన్.</poem>|ref=164}}
{{Telugu poem|type=క.|lines=<poem>అరిగయుఁ గృపాణియును నతఁ, డురవడిఁకొని రథము డిగ్గనుఱికి నపు డ
య్యిరువురు సింగపుఁగొదమల, కరణి విజృంభించి తాఁకి ఖడ్గాఖడ్గిన్.</poem>|ref=165}}
{{Telugu poem|type=క.|lines=<poem>లాసియుఁ బొడిచియుఁ దట్టియు, వ్రేసియు నొడ్డించుకొనియు విసరియు మిగులం
డాసియు నొక్కటఁ గయ్యము, చేసిరి నిజసాధనములు చిద్రుపలు గాఁగన్.</poem>|ref=166}}
{{Telugu poem|type=క.|lines=<poem>జేగురుఁ గోరాడినమద, నాగంబులరీతి మార్గణవ్రణజాసృ
గ్రాగములఁ దొప్ప దోఁగియు, లాగమునకుఁ జొచ్చి యచ్చలంబునఁ బెనఁగన్.</poem>|ref=167}}
{{Telugu poem|type=క.|lines=<poem>దగదొట్టి శౌరిమనుమఁడు, జగతిం బడి మిగులఁ బరవశత నొంద దిరల్
వగులఁగ నార్చి సుచిత్రుం, డగలిచెఁ బ్రద్యుమ్నువక్ష మైదస్త్రములన్.</poem>|ref=168}}<noinclude><references/></noinclude>
1uspzehke1nfwgv4z343wqcajct2r7h
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/147
104
178880
553107
496220
2026-04-15T07:33:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553107
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఆ.|lines=<poem>అపుడు కర్ణసూనుఁ డాసుచిత్రునిమేన, శరము లాఱు గ్రుచ్చి విరథుఁ జేయఁ
దెమల కాతఁ డొండుతే రెక్కి విలుగుణ, ధ్వని యొనర్పఁ దునిమెఁ దద్రథంబు.</poem>|ref=169}}
{{Telugu poem|type=క.|lines=<poem>త్రిశతశతాంగము లీరీ, తి శకలములు సేయ వేఱుతే రెక్కి నిగు
డ్చుశరాలిఁ గర్ణజుని దు, ర్దశఁ బెట్టెను వ్యాధిగణము తనువును బోలెన్.</poem>|ref=170}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియును.</poem>|ref=171}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనుసాల్వు నైదిటను యౌ, వనాశ్వు నొక్కటను భోజవరు రెంట నొగి
ల్చిన సాత్యకి మార్కొని య, జ్జనపతిరథ్యములఁ దునిమి శంఖం బొత్తెన్.</poem>|ref=172}}
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆనారాచము మున్న సాత్యకియురం బాడన్ సుచిత్రుండు నా
రాచపరంపరన్ వెగడు నందం జేయ మూర్ఛావశుం
డై నిల్వంబడి లోచనంబు లరమూయం దోన చిత్రాంగదా
సూనుం డేనుశరంబు లేక నవియుం జూర్ణంబుగాఁ జేయుచున్.</poem>|ref=173}}
{{Telugu poem|type=చ.|lines=<poem>చిఱునగ వొప్ప ని ట్లను సుచిత్రుఁడు నీ విపు డింతలోపలన్
మఱచితె బభ్రువాహనుఁడ మాకు నుపాయన మిచ్ఛుముత్యము
ల్పెఱికలఁ దెచ్చు టంచు నదలించి శిలీముఖవృష్టి ముంచి క్రే
ళ్లుఱికి సురాళకేతను మహోగ్రశిరంబులఁ దూల నేసినన్.</poem>|ref=174}}
{{p|ac|fwb}}సుచిత్రార్జునుల ద్వంద్వయుద్ధము</p>
{{Telugu poem|type=వ.|lines=<poem>అప్పు డప్పాండవసైనికులకాండతాండవోద్దండఖండపరశుండునుం బోలె విహ
రించుతామ్రధ్వజుం గనుంగొని గతప్రాణులై వదలుకృపాణబాణాసనాదిసాధ
నంబులు వీరయోధయూధపతురంగమాతంగంబులం దొరఁగురుధిరప్రవాహంబు
లకు జలగ్రాహంబుల యొఱవు గఱప నాలంబునకు నూలుకొనక నరునిపాలికిం జని
గోత్రవధపాతకనివారణార్థం బశ్వమేధంబు సేయ సమకట్టి మమ్ము నెల్ల దీని గొఱి
యలం జేసి తిందు నేఫలంబు గట్టుకొంటి వని ముట్టనాడినం గ్రీడి యోడకుండుఁ
డని వారి నూఱడించి తేరు వైరిసమ్ముఖంబు చేయించి సాయకనికాయంబుల నతని
కాయంబు గాయంబుగా జేసి విరథునిం జేసిన చేసి యతండు వేఱొండురథం
బెక్కి యింక నెక్కడవోయె దీసవనసైంధవంబుతోడన బంధించుకొని నిన్నుఁ గొని
పోయెదనని వసుంధరాధరంబుపైఁ గంధరంబులు వర్షించుచందంబున సంక్రందన
నందనునిమీఁద నందంద విశిఖబృందంబుఁ గ్రందుకొల్పిన శరవేగంబున నతం
డాజిరంగంబునకు యోజనంబు దక్షిణంబున కరిగి యాక్షణంబ తిరిగి నిజబలం
బుల సమయించునవ్వీరునిం దేరితోన తారాపథంబున కెగయ ఘోరనారాచం
బులు వఱపి దేవదత్తం బొత్తె నిత్తెఱంగున నెత్తినచలంబున నేడహోరాత్రంబులు
చిత్రవిధంబునం బోరినం బోరు ఘోరం బయ్యె నయ్యవసరంబున.</poem>|ref=175}}<noinclude><references/></noinclude>
o8ga8xvbdaaxtz51nrd4c8wf1sajv3k
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/148
104
178881
553125
496221
2026-04-15T08:11:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553125
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>నరుచే సుచిత్రుఁ డెక్కెడు, నరదము లిరువేయిజమిలియక్షౌహిణియున్
ధరఁ బడియె నల్ల పౌరం, దరజలములు నట్ల మడసెఁ దామ్రధ్వజుచేన్.</poem>|ref=176}}
{{Telugu poem|type=చ.|lines=<poem>పలలము సాళువంబు గొనుభంగి సుచిత్రుడు క్రీడిఁ దేరితో
నలమి వియత్తలంబు గదియన్ రభసంబున వాఁటి సంగర
స్థలిఁ జదియంగ వైవ నిజసైన్యము కవ్వడి చచ్చెఁ జచ్చె సం
చలఁగ మురారి గ్రక్కునఁ గరాబ్జమునన్ బడకుండఁ బట్టినన్.</poem>|ref=177}}
{{Telugu poem|type=క.|lines=<poem>కలుషించి తామ్రకేతుఁడు, పలికె గదాధరునిఁ జూచి పాండవుతో న
చ్చలమునఁ బోరఁగ దొమ్మికిఁ, దలపడితివి నీకు వీరధర్మమె యనుచున్.</poem>|ref=178}}
{{Telugu poem|type=క.|lines=<poem>అదిరిపడి వింట భాస్వ, త్ప్రదరము సంధింప శౌరి తామ్రధ్వజునిన్
గదిసి వడి నురముఁ దన్నుచు, గదఁ గొని మస్తకముగాతు కలఁగఁగ నడిచెన్.</poem>|ref=179}}
{{Telugu poem|type=క.|lines=<poem>అందుఁ జలింపక చటుల, స్యందనముం దఱిమి పాండుసైన్యవరుల నిం
దంద పరిమార్ప నపుడు ము, కుందుఁడు గాండీవిఁ బేరుకొని యిట్లనియెన్.</poem>|ref=180}}
{{p|ac|fwb}}తామ్రకేతునితో నర్జునుఁడు బోరుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>దళములు వీనిఁ గన్గొని యథాయథ లయ్యె మరాళకేతనా
దులు సమరస్థలిం బడి రెదుర్కొని నీవును నేను వీనితో
దలపడి పోరనున్న బని తప్పు నిజం బని శార్ఙ్గి శింజినీ
కలకలముల్ గిరీటికరగాండివరావము నెచ్చరింపఁగన్.</poem>|ref=181}}
{{Telugu poem|type=క.|lines=<poem>బరవసముగ శరవసరము, గురియఁగ నవి దునిమి సరకు గొనక సుచిత్రుం
డిరువురవిలునారులు ని, ష్ఠురగతిఁ దెగనేయ నింద్రజుఁ డుపేంద్రునితోన్.</poem>|ref=182}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇన్నీచునకై దేవర, పన్ని పెనఁగ నేల యేన పరిమార్తు ననున్
మన్నించి సారథివి గ, మ్మన్న హరియు నియ్యకొని శతాంగము దఱుమన్.</poem>|ref=183}}
{{Telugu poem|type=క.|lines=<poem>అలిగి సుచిత్రుఁడు పదితూ, పులఁ గృష్ణుని నొంచి పాండుపుత్త్రునరద మ
మ్ముల ముంచి గొడుగుఁ ద్రుంచిన, బలభిత్సుతుఁ డతనితేరు భగ్నము చెసెన్.</poem>|ref=184}}
{{Telugu poem|type=క.|lines=<poem>అరదము రూపఱిన మద, ద్విరదము వెస నెక్కి విశిఖవితతి వఱపఁ ద
ద్గరుదనిలాహత జిఱజిఱ, హరిహయసుతురథము దిరిగె నాసమయమునన్.</poem>|ref=185}}
{{Telugu poem|type=క.|lines=<poem>తమమూర్ఛ లుడిగి కార్ష్ణి, ప్రముఖు లతనినిశితశరపరంపర నొంపన్
దెమలక సుచిత్రుఁ డతివి, క్రమమున దద్వీరవరుల గలనం గూల్చెన్.</poem>|ref=186}}
{{Telugu poem|type=క.|lines=<poem>అందులకుఁ జాల నలిగి ము, కుందుఁడు చక్రంబు కేలఁ గొని పాండుసుత
స్యందనము డిగ్గ నుఱుక ర, వీందుగ్రహతారకములు నిలయుఁ జలించెన్.</poem>|ref=187}}
{{Telugu poem|type=శా.|lines=<poem>మాయూరధ్వజి శౌరిఁ జూ నగిచి రమ్మా కృష్ణ ము న్నాజిఁ గౌం
తేయుం గావఁగఁబూని నీ సుకృతము న్వెచ్చించి తివ్వేళ నీ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
sxn67o8vsbyoga5lprfi276k8f9phm1
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/149
104
178882
553130
496222
2026-04-15T08:23:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553130
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>కాయంబున్ దెగనిమ్ము నాయెదురఁ జక్రం బెత్తితే చూడు వా
లాయంబు న్నిన్నుఁ గ్రీడి నిప్పు డవలీలం గట్టి కొంపోయెదన్.</poem>|ref=188}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని కరి డిగ్గ నుఱికి కృ, ష్ణునిచక్రము కేలువట్టి నులి వెట్టఁగ న
ర్జునుఁ డచ్యుతుపనుపున నా, తని నూఱస్త్రముల నొంపఁ దామ్రధ్వజుఁడున్.</poem>|ref=189}}
{{p|ac|fwb}}తామ్రధ్వజుఁడు కృష్ణార్జునుల జయించి హయంబుఁ గొని పురంబునకుఁ బోవుట</p>
{{Telugu poem|type=క.|lines=<poem>లెక్కఁగొనక నరుఁ గృష్ణుని, నుక్కణఁగ బిగించి మూర్ఛ నొందించి ధరన్
గ్రక్కదల వైచి హయము, న్నెక్కొనఁ గొనిపోయి జనకునిం గని మ్రొక్కెన్.</poem>|ref=190}}
{{Telugu poem|type=క.|lines=<poem>మ్రొక్కినఁ గని నకులధ్వజు, దిక్కు గనుంగొనిన వాసుదేవార్జునులన్
స్రుక్కించి హయము దెచ్చిన, యక్కథ వినిపించె నృపతి కాతఁడు తెలియన్.</poem>|ref=191}}
{{Telugu poem|type=క.|lines=<poem>విని కన్నులఁ గెం పొదవఁగఁ, దనయుని వీక్షించి సమరతలమునఁ గృష్ణా
ర్జునుల నటు డించి తురగముఁ, గొనివత్తురె యింతపడుచుగొడుకవు గలవే.</poem>|ref=192}}
{{Telugu poem|type=చ.|lines=<poem>క్రతుఫలదాత యైనహరిఁ గయ్యములోనఁ బరిత్యజించి శూ
రతఁ గొనివచ్చి తీమఖతురంగము నెవ్వరిఁ గూర్చి చేయ నీ
క్రతు విఁక నంచుఁ దానుఁ గులకాంతయుఁ కూడి మయూరకేతుఁ డీ
గతి వెతఁ బొందఁ బ్రొద్దు మసకంబడె నంతటఁ బాండుసైనికుల్.</poem>|ref=193}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>బన్నపుమావుఁ గాననివిచారపుమోములఁ బంకజంబుల
న్వన్నియదాఱమార్గణగణవ్రణజాస్రము సంధ్యపెంపు సం
పన్నత మీఱ నిద్రయుఁ దమంబుఁ గ్రమంబునఁ జేర మోడుపుం
గన్నులఁ గైరవంబులవికాసము దేఱఁగ మూర్ఛ దేలుచున్.</poem>|ref=194}}
{{Telugu poem|type=క.|lines=<poem>హరిఁ జూచి నరుఁడు మనతో, దురము సలిపినతఁడు సవనతురగముఁ గొని యే
తెరువునఁ జనె నా కెఱిఁగిం, పు రణంబున గెల్చి వాహముం దెత్తు ననన్.</poem>|ref=195}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>వీతి నిపుడు బర్హికేతుఁ డేలెడురత్న, పురికిఁ గొనుచు నతనిపుత్త్రుఁ డరిగె
వానితెగువఁ జూచెదేని నావెంట ర, మ్మనుచుఁ బురముచెంత మొనల నునిచి.</poem>|ref=196}}
{{p|ac|fwb}}కృష్ణార్జునులు మాయావిప్రరూపంబుల మణిపురంబు ప్రవేశించుట</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>కటిఁ బ్రాతముతుకనీర్కావిదోవతిపంచె భ్రూమధ్యమున నూర్ధ్వపుండ్రకంబు
వక్షఃస్స్థలమునఁ బద్మాక్షమాలిక కర్ణబిలమున నులివాడుతొలసి యెన్ను
సంసభాగంబున నాయవారపుసంచి దోర్మూలమున నిఱ్ఱితోలు సజ్జ
కుడికరంబున నఱగుడు వేణుదండంబు, గూనివీఁపునఁ జింపిగొడుగుఁ దడక</poem>|ref=}}<noinclude><references/></noinclude>
r7cxptmpma88d7d071xhgndfxeoyet3
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/150
104
178883
553131
496223
2026-04-15T08:56:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553131
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>తనకునలవడవృద్ధవిప్రునివిధంబు, దాల్చుటయుఁ గూర్మిసఖుఁడు సుత్రామసుతుఁడు
బ్రహ్మచారియై తనవెంట రా మురారి, రత్ననగరంబు సొచ్చి పూర్యత్రియామ.</poem>|ref=197}}
{{Telugu poem|type=క.|lines=<poem>పరిమళధూపము జాలక, సరణిఁ బిసాళింప సంతసముతోడుత న
న్నరనారాయణు లిరువురుఁ, జరియింపఁగఁ జంద్రకాంతసౌధములందున్.</poem>|ref=198}}
{{Telugu poem|type=చ.|lines=<poem>సురతసుఖంబులన్ మిగులఁ జొక్కుచు నొక్కవిటుండు కాంత నీ
కురులకుఁ గృష్ణవర్ణమును గుంకుమగుబ్బల కచ్యుతత్వమున్
దొర నన న్నిజేశుకరతోయరుహంబుఁ దెమల్చి నిన్ను నీ
కరముల శంఖచక్రములుగా పురుషోత్తముఁ జేసె నావుడున్.</poem>|ref=199}}
{{Telugu poem|type=క.|lines=<poem>సరసిజలోచనుఁ డిట్లను, హరిహయసుతుతోడఁ జూడు మాశ్చర్యం బీ
పురజనముభక్తి సురతపు, సరసతలను మామకప్రశంసలె యెపుడున్.</poem>|ref=200}}
{{Telugu poem|type=క.|lines=<poem>తలఁపులు హరిచింతనములు, పలుకులు హరికీర్తనానుభవములు పనిపా
టలు హరికృత్యంబులు భూ, తలవైకుంఠంబు పొగడఁదగు నిది యనుచున్.</poem>|ref=201}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>వేడుకతోడ నన్నగరవీథుల నీగతి సంచరించుచున్
గ్రీడియుఁ దాను వేకువతఱిన్ జని నర్మదలోన మజ్జనం
బాడి గమించి చొచ్చెను దదంతికరాజమరాళకూజితా
మ్రేడితకింకిణీరవపరిష్కృతఘోటము యజ్ఞవాటమున్.</poem>|ref=202}}
{{Telugu poem|type=క.|lines=<poem>చొచ్చి తదాస్థానమహిమ, కచ్చెరు వందుచు వియచ్చరాహ్వానోద్గా
త్రుచ్చరితసామమంత్రము, ఖోచ్చధ్వను లంతరిక్ష మూటాడింపన్.</poem>|ref=203}}
{{Telugu poem|type=మ.|lines=<poem>క్రతుదీక్షాపరు విశ్వధూవలయసమ్రాణ్మౌళి మాణిక్యభూ
షితపాదాంబుజు ఋత్విగావృతుఁ గుశాసీనున్ వధూసంయుతున్
గితవబ్రాహ్మణు లిద్దఱుం గదిసి కెంగే లెత్తి బర్హిధ్వజ
క్షితినాథోత్తను భద్రమ స్తనుచు నాశీర్వాదముం జేసినన్.</poem>|ref=204}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆనరనాథుఁడు ప్రత్యు, త్థానం బొనరించి మ్రొక్కి ధరణీసుర ము
న్నే నతి గావింపక మును, పే నను దీవించు టిది శపించుటగాదే.</poem>|ref=205}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఎందుండి యరుగుదెంచితి, విందుల కేఁ జేయుసేవ యెద్ది యన మహీ
బృందారకుండు పరమా, నందహృదయుఁ డగుచు ధరణినాథునితోడన్.</poem>|ref=206}}
{{Telugu poem|type=క.|lines=<poem>భూవల్లభ కార్యార్థుల, మై వచ్చుటఁ జేసి మాకు నాశీర్వాదం
బీవలసె నమస్కారము, గావింపకమున్న యెగ్గుగా దిది యనినన్.</poem>|ref=207}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనవరుఁడు పురాణములం, దనఘా 'యభ్యాగతస్స్వయంవిష్ణు' వునా
వినఁబడు నినుఁ జూచిన నా, జనార్ధనునిఁ జూచినట్ల సంతస మయ్యెన్.</poem>|ref=208}}<noinclude><references/></noinclude>
pzfyy7xvulsry6gr6kyqbblkigki8ak
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/151
104
178884
553136
496224
2026-04-15T09:23:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553136
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>కొంచక వేఁడుము తగ న, ర్చించెద నిపు డెద్ది నీయభీష్టము నాకున్
గించిత్తయిన మనోధన, వంచన మిచ్చోట లే దవశ్యం బనినన్.</poem>|ref=209}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>భూపాల విను ధర్మపురినుండి కృష్ణశరాభిధానుఁడ మదీయాత్మజుని వి
వాహంబునకు నీపురోహితుండు సుశీలు నింటఁ గన్నియ గల్గు టెఱిఁగి యడుగఁ
బయనమై వచ్చుచో భయదాటవీమధ్యసీమ నాఁకలి గొన్న సింహ మొకటి
కలిసి పుత్త్రుని ఘోటకముఁగూడఁ బట్టిన విడిపింప నా కొండువెరవు లేక</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>చింతతో 'నటవాంనారసింహ' యనుచు, నూటయెనిమిదిమాఱు లెన్నుకొని వరుస
నలఁతఁ గుత్తుక యెండఁగా నవ్విభుండు, గరుణఁ బ్రత్యక్షమై నన్నుఁ గానఁడయ్యె.</poem>|ref=210}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున మహావ్యధం బరితాపించుచున్న నన్ను రూక్షేక్షణంబుల నిరీక్షించు
చు హర్యక్షంబు వాలవిక్షేపణంబులం నధిక్షేపించి పుత్త్రగాత్రంబు నఖరదంష్ట్రాం
కురంబుల నప్పలించుచు మనుష్యభాషణంబుల గద్దించుచు నన్ను నుద్దేశించి నాచేఁ
బడిన జంతువుం గృతాంతవంతవానికైన బలవంతంబున విడిపింప నీఁతబంటి
శిష్యుండును నీవు నింటికిం జనుం డని నిరాశంబుగాఁ బలికినఁ గ్లేశంబున నా
శిశువుం బాసి పోవంజాలక బాలకవిహీనులకు మానవులకు నార్ధ్వదైహికంబులు
లేవు గావున నీవు మచ్ఛరీరంబు కబళంబు గొని సుతశరీరంబు విడువు మనిన
విని యక్కంఠీరవం బకుంఠారవంబున మావంటిదుష్టజంతువు లాసన్నమృత్యువు
నకు మూలభృత్యు లగుటం జేసి యిట్టిగతాయుషప్రాణులం గాని మీవంటి
దీర్ఘాయుఃప్రాణులం బట్టము పట్టికొఱకింత పట్టి పెనంగి వట్టిదురవస్థలం బొరలక
మరలు మనిన మత్కృతంబు లగు సుకృతంబు లర్పించెద నెప్పాట నిప్పాపని
నొప్పింపక నాకు నొప్పింపవే యనిన నీయకొనక నీయెడ నాకు నయ్యెడు
ప్రయోజనంబు లెయ్యవియు లేవు మయూరధ్వజునివలనం గాని యనియె నది
నీ నంగీకరించెద వేని నెఱింగించెద ననిన భూసురోత్తమునకు రాజసత్తముం
డి ట్లనియె.</poem>|ref=211}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆకేసరి నరకేసరి, గాకున్న మదీయదేశకాననగిరులన్
భీకరహరిదర్వీకర, సూకరనికరముల కెట్లు సుడియఁగ వచ్చున్.</poem>|ref=212}}
{{Telugu poem|type=క.|lines=<poem>అడిగినపదార్థ మెల్లను, దడయక నీ కిత్తు నని మొదల నాడితి నా
వొడువు వృథ గాదు వలసిన, నడుగుము నీ వన్న భూసురాగ్రణి విభుతోన్.</poem>|ref=213}}
{{Telugu poem|type=క.|lines=<poem>నీయెడ మముబోంట్లకు నే, లా యేసంశయము 'దుర్బలస్య బలం రా
జా' యని పలుకువిశిష్ట, న్యాయము గలుగుట మదార్తి హరియింపఁదగున్.</poem>|ref=214}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆసింహము నీదేహము, దా సగ మిచ్చినఁ గుమారు దండింప ననన్
గావిలి రాజులతనువులు, గో సిమ్మనఁదగునె పూనుకొని విప్రులకున్.</poem>|ref=215}}<noinclude><references/></noinclude>
k63x0pck8y913fi1gk40x4s04m0ddwr
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/152
104
178885
553138
496225
2026-04-15T10:28:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553138
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>నావుడు సింహ మిట్లను మనంబున నన్నరనాథచంద్రమున్
గేవలుఁగాఁ దలంపకు మకించనరక్షణశీలుఁ డాత్మవి
ద్యావిదుఁ డుత్తమోత్తముఁ డుదారుఁడు సూనృతవాది గావునన్
నీ విటు సంశయింప కతనిం గని వేఁడు ఫలించుఁ గోరికల్.</poem>|ref=216}}
{{Telugu poem|type=క.|lines=<poem>నీతనువు ముదిసి తపముల, చేతఁ బలులశూన్యమై కృశించిన దాధా
త్రీతలపతిగాత్రము నవ, నీతసమము బహుసుఖప్రణీతం బగుటన్.</poem>|ref=217}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇది సింహభాషితము ము, న్ను దశరథాత్మజుఁడు బ్రాహ్మణుని మృతశిశువుం
బ్రతికింపఁడె రామున కే, కొద నీ వెట్లయినఁ బుత్త్రకునిఁ గావు మనన్.</poem>|ref=218}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కువలయేశ్వరుఁ డియ్యకొని మంత్రిహితపురోహితబంధుజనమహీపతులఁ జూచి
రాజున కర్హంబు రణమునం దైన బ్రాహ్మణు నెడ నైన దేహంబు విడువ
మును శిబికర్ణజీమూతవాహులు పరార్థమకాదె నిజశరీరములు విడిచి
రే నీమహాత్మునకై నాతనువులోన నర్ధ మిచ్చితి దీని కడ్డపడకుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>డని సుచిత్రుని సకలరాజ్యాభిషిక్తుఁ, గాఁ బ్రతిష్ఠించి మేకలకన్యకాంబు
వులఁ గృతస్నానుఁడై దాన మేలు బహుప్ర, కారములఁ జేసి విప్రపుంగవునిఁ బిలిచి.</poem>|ref=219}}
{{p|ac|fwb}}రాజు విప్రకార్యార్థంబు దేవశరీరంబు నిచ్చుట</p>
{{Telugu poem|type=క.|lines=<poem>పూతజలాక్షతములు గొని, దాత 'మదీయార్ధదేహదానేనహరిః
ప్రీతోభవ' తని భూసురు, చేత నృపతి ధారవోసి చిత్త మెల్పరన్.</poem>|ref=220}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>సత్రవితర్ధికాస్థలి విశంక దృఢాసనుఁడై ముకుందు లో
కత్రయవందితున్ హృదయకంజమునం బదిలించి కేతకీ
పత్త్రములీల మౌళిఁ గరపత్త్రము పూనెడు నంతఁ బుణ్యచా
రిత్ర కుముద్వతీసతి యెఱింగి వడిన్ జనుదెంచి భర్తతోన్.</poem>|ref=221}}
{{Telugu poem|type=క.|lines=<poem>నీయర్ధశరీరము కా, నా యేను మదీయదేహ మర్పించి నిజం
బీయెడ నిలుపు మనిన విని, యా యవనీసురుఁడు పలికె నధిపునితోడన్.</poem>|ref=222}}
{{Telugu poem|type=క.|lines=<poem>సింగము నాతో నృప వా, మాంగము స్త్రీభాగ మది యనర్హము భుజియిం
పం గొఱగా దనె నీపు, ణ్యాంగదతను విచ్చగింప దమ్మృగ మనినన్.</poem>|ref=223}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>సుతుఁ డైనతామ్రధ్వజుఁడు శాంబరీవిప్రునకు నిట్టు లనియె వందన మొనర్చి
భూసుర 'యోవైపితాసపుత్త్ర' యటంచు ననియెడుశ్రుతిరహస్యంబు వినవె
జనకునిదేహంబు సగ మేల నాశరీరము సింహమునకు సర్వంబు నిత్తుఁ
దడయ కేనును ఋణత్రయవిముక్తుండనై తండ్రి గైకొన్నసత్యంబు నెఱపి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>శాంతనవరాఘవులకీర్తిఁ గాంతుననిన, బ్రాహ్మణుఁడు పల్కు మృగరాజు పలుకు వినుము
రాజదేహంబుఁ దత్కళత్రంబు సుతుఁడుఁ, గోయవలె ననె నది గల్ల సేయుఁదగునె.</poem>|ref=224}}<noinclude><references/></noinclude>
bgkdva7tl0ga815cnxe1vat0ibk2yid
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/153
104
178886
553141
496226
2026-04-15T10:45:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553141
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>అనిన దరహశితాస్యుఁడై యవ్విభుండు, సుతునిఁ దనరాణివాసంబు జూచి యట్ల
చేయుఁడని చేతి ఱంప మిచ్చిన సుచిత్రుఁ, డందనోడెఁ గుముద్వతి యందుకొనియె.</poem>|ref=225}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అ ట్లందుకొని.</poem>|ref=226}}
{{Telugu poem|type=లయగ్రాహి.|lines=<poem>ఆరమణియుం దనకుమారకు నదల్చి యతిదారుణతరక్రకచధార పతిమౌళిం
జేరిచి మదిన్ హరిహరీ రఘుపతీ యనుచు వారిరువురున్ దఱుగఁగా రుధిరముల్ ధా
త్రీరమణుగాత్రమున మేరుశిఖరిం దొరఁగు గైరికఝరంబులప్రకారముగ హాహా
కారములు చేసె హితసూరిజనబంధుపరివారనికరంబులు మహారవముతోడన్.</poem>|ref=227}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఇమ్మెయి వ్రక్కలింప ధరణీశ్వరుఁ డాపలికంట బాష్పతో
యమ్ములు గ్రమ్మఁ గన్గొని ధరామరుఁ డిట్లను నార్తి నిచ్చుదా
నమ్ము పరిగ్రహింపఁ దగునా యనపత్యతవంక నూర్ధలో
కమ్ములు లేకపోయినఁ బొ కాలఁగనిమ్మని యల్గి పోవఁగన్.</poem>|ref=228}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కాంత ప్రాణేశుమస్తంబుఁ గదియఁ బట్టి, యకట నీదేహ మూర కిట్లయ్యెఁ గాని
బ్రాహ్మణుఁడు నిన్ను లేని నెపంబు వెట్టి, యలిగిపోవుచు నున్నవాఁ డన విభుండు.</poem>|ref=229}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అపు డావిప్రునిఁ జూచి యిట్లను మహాత్మా మచ్ఛరీరంబులో
నపసవ్యాంగము దానయోగ్య మయి సవ్యాంగంబు గాకున్న దుః
ఖపడెన్ ఱంపమునొప్పి నైన నిరువంకం బాష్పముల్ రావె స
త్కృప నీభాగముఁ గొ మ్మనన్ విజయుఁతోఁ గృష్ణుండు ప్రత్యక్షమై.</poem>|ref=230}}
{{p|ac|fwb}}కృష్ణార్జునులు స్వస్వరూపంబులతో ప్రత్యక్షం బగుట</p>
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆరాజన్యునిఁ గౌఁగిలించి ధరణీశా నీవు ధన్యుండ వీ
ధీరత్వంబునకున్ వదాన్యతకుఁ బ్రీతిం బొందితి బుత్త్రసా
ధ్వీరత్నంబులతోడ నధ్వరము నీతిద్వంద్వయుక్తంబుగాఁ
బ్రారంభింపుము కర్మకర్త నయి నిర్వర్తింతు నే సర్వమున్.</poem>|ref=231}}
{{Telugu poem|type=క.|lines=<poem>పోర నెదిరి భవదీయకు, మారుం డొక్కరుఁడ గెల్చె మమునిద్దఱ నీ
వీరీతి దేహ మొసఁగితి, వేరీ మీసాటివీరవితరణగరిమన్.</poem>|ref=232}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అనిన నృపాలవర్యుఁ డను యజ్ఞఫలప్రదుఁ డైనదేవరం
గనుఁగొనఁ గల్గె నేటికి మఖం బొనరింపఁగ డప్పిగొన్న మ
ర్త్యునకు మనోహరాంబువులు గ్రోలక మంచున దాహ మాఱునే
ననుఁ బ్రహసింపవే బుధజనప్రవరోదితవేదమంత్రముల్.</poem>|ref=233}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నేర్పు దప్పి నిధానంబు నేలఁ గ్రుమ్మ, రించి కొప్పెర దెచ్చు వీఱిఁడివిధమున
నాకుమారుఁడు మిమ్ము జన్యమున నెఱుఁగ, లేక వాహంబుఁ దెచ్ఛె వివేక ముడిగి.</poem>|ref=234}}<noinclude><references/></noinclude>
3dkhjffgppc7bl7npey9npc5q6xhf7e
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/154
104
178887
553146
496227
2026-04-15T11:03:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553146
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ఊహింప మర్తకోటికి, దేహము లస్థిరము లగుట దెలియఁగ నిక్కం
బీహరిఁ జేపట్టికదా, శ్రీహరి నినుఁ గంటి హరిహరీ కృతి నైతిన్.</poem>|ref=235}}
{{Telugu poem|type=క.|lines=<poem>శరధిచరకమఠకిటినర, హరివామనభృగుజరామహలభృజ్ఞినక
ల్కిరుచిరరూపాయ జగ, ద్భరణాయ నమో నమోస్తు భవతే యనుచున్.</poem>|ref=236}}
{{Telugu poem|type=వ.|lines=<poem>బహుప్రకారంబులం బ్రస్తుతించి సమస్తవస్తుజాతంబుల నమ్ముకుందు నానందితుం జేసి
పురందరనందనుం గౌఁగిలించి బంధుజనసమన్వితుండై నిజపురంబునకుం దోడ్కొని
పోయె నందు నగ్గోవిందుండు గాండీవికి మయూరధ్వజునిభక్తిఁ దెలుపవలసి బల
సమన్వితంబుగా దివసత్రయం బధివసించె ననిన విని జనమేజయుండు జైమినిం
గనుంగొని తరువాతివృత్తాంతం బానతీఁ జిత్తగింపు మని యడిగిన.</poem>|ref=237}}
{{Telugu poem|type=శా.|lines=<poem>పాంచాలద్రవిళాంగమాళవశకప్రాగ్జ్యోతిషక్షోణిభృ
త్పంచాస్యప్రతివర్షదత్తవివిధోపగ్రాహ్యరత్నాంశుమ
త్కాంచీవేంకట కాళహస్తినగరీకల్యాణసౌధాంచల
ప్రాంచచ్ఛాసనసాళ్వశంకితశశప్రాలేయరుఙ్మండలా.</poem>|ref=238}}
{{Telugu poem|type=క.|lines=<poem>రాధాతనూజశిబిధా, రాధరకల్పద్రుఖేచర ప్రకటయశో
గాధాధికరణకృతసం, ధాధికరణదానశౌండ యైవరగండా.</poem>|ref=239}}
{{Telugu poem|type=భుజంగప్రయాతము.|lines=<poem>స్థిరశ్రీమనోహారిశృంగారగేహా, గిరీశప్రభాహాసికీర్తిప్రవాహా
నిరూఢారిబాహాసినిర్వాపణేహా, రిరంసోగ్రవాహాధరిత్రీవరాహా.</poem>|ref=240}}
{{Center|<poem>గద్యము.
ఇది భారతీతీర్థశ్రీచరణకరుణాపాత్ర గాదయామాత్యపుత్త్ర వినయవిద్యాసముద్ర
పినవీరభద్రప్రణీతం బైనజైమినిభారతంబునం దశ్వమేధపర్వంబున
సప్తమాశ్వాసము</poem>}}
{{Center|——————}}<noinclude><references/></noinclude>
ekamw289mstu331pfd42quisiegmyko
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/155
104
178888
553160
496228
2026-04-15T11:51:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553160
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop
|Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf
|Page = 155
|bSize = 377
|cWidth = 297
|cHeight = 78
|oTop = 18
|oLeft = 44
|Location = center
|Description =
}}
{{Center|శ్రీ}}
{{p|ac|fs150}}జైమినిభారతము</p>
{{p|ac|fs125}}అశ్వమేధపర్వము, అష్టమాశ్వానము</p>
{{Telugu poem|type={{Css image crop
|Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf
|Page = 155
|bSize = 377
|cWidth = 75
|cHeight = 144
|oTop = 177
|oLeft = 27
|Location = left
|Description =
}}|lines=<poem>
లలితశ్రవణకళా
నాళీకప్రభవపాదనఖచంద్రరుచి
క్షాళితపరనరపాలక
ఫాలఫలక నారసింహ పార్థివతిలకా.</poem>|ref=1}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అవధరింపుము జైమినిమునీంద్రుండు జనమేజయనరేంద్రున కి ట్లనియె నిత్తెఱంగున
రత్ననగరంబున వాసుదేవవాసవతనూజులు వాసరత్రయంబు గడపి మఱునాఁడు
సముద్ధతధ్వజనీపరంపరలతో మయూరధ్వజుండుఁ గొలిచి రా నధ్వరాశ్వంబులఁ
గదలింప నవియు నానాజనపదంబు లతిక్రమించి క్రమక్రమంబున.</poem>|ref=2}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఏరాజు పాలించు ధారణీమండలి ధర్మంబు నాల్గుపాదముల నడచుఁ
గలవరించియు బొంకు పలుకనేరని సత్యసంధు లేరాజురాష్ట్రంబుప్రజలు
యముఁ డిల్లఁటపుటల్లుఁడై యుండి సాక్షాత్కరించి యేరాజపుత్త్రిక వరించె
నేరాజు దానాంబుధారాధునీకోటిచేత మేదిని నదీమాతృ కయ్యెఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దత్పరత "బ్రాహ్మణో మమదైవ" మనెడు, బుద్ధి నేరాజు పూజించు బుధుల నట్టి
రాజరత్నంబు వీరవర్మకుఁ బ్రధాన, పురము సారస్వతముఁ జేరఁబోవుటయును.</poem>|ref=3}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈరీతి ధర్మతనయమ, యూరధ్వజయజ్ఞవాహయుగళవిహారం
బారా జెఱింగి తనపరి, వారము సెల విచ్చె వారువంబులఁ బట్టన్.</poem>|ref=4}}
{{p|ac|fwb}}వీరవర్మ పాండవహయంబుఁ బట్టుట</p>
{{Telugu poem|type=తే.|lines=<poem>అపుడు దివ్యరథారూఢులై సులోల, కువలసులలాఖ్యు లారాజుకూర్మిసుతులు
సైన్యములతోడ నరుసేన సరకు గొనక, హరులఁ బట్టి౦ప బభ్రువాహనుఁడు దాఁకి.</poem>|ref=5}}<noinclude><references/></noinclude>
h1k810ru3wcf1s26vs8wvi5os93rkda
553161
553160
2026-04-15T11:51:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553161
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop
|Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf
|Page = 155
|bSize = 377
|cWidth = 297
|cHeight = 78
|oTop = 18
|oLeft = 44
|Location = center
|Description =
}}
{{Center|శ్రీ}}
{{p|ac|fs150}}జైమినిభారతము</p>
{{p|ac|fs125}}అశ్వమేధపర్వము, అష్టమాశ్వాసము</p>
{{Telugu poem|type={{Css image crop
|Image = జైమినీభారతము_(పిల్లలమఱ్ఱి_పినవీరభద్రుడు).pdf
|Page = 155
|bSize = 377
|cWidth = 75
|cHeight = 144
|oTop = 177
|oLeft = 27
|Location = left
|Description =
}}|lines=<poem>
లలితశ్రవణకళా
నాళీకప్రభవపాదనఖచంద్రరుచి
క్షాళితపరనరపాలక
ఫాలఫలక నారసింహ పార్థివతిలకా.</poem>|ref=1}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అవధరింపుము జైమినిమునీంద్రుండు జనమేజయనరేంద్రున కి ట్లనియె నిత్తెఱంగున
రత్ననగరంబున వాసుదేవవాసవతనూజులు వాసరత్రయంబు గడపి మఱునాఁడు
సముద్ధతధ్వజనీపరంపరలతో మయూరధ్వజుండుఁ గొలిచి రా నధ్వరాశ్వంబులఁ
గదలింప నవియు నానాజనపదంబు లతిక్రమించి క్రమక్రమంబున.</poem>|ref=2}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఏరాజు పాలించు ధారణీమండలి ధర్మంబు నాల్గుపాదముల నడచుఁ
గలవరించియు బొంకు పలుకనేరని సత్యసంధు లేరాజురాష్ట్రంబుప్రజలు
యముఁ డిల్లఁటపుటల్లుఁడై యుండి సాక్షాత్కరించి యేరాజపుత్త్రిక వరించె
నేరాజు దానాంబుధారాధునీకోటిచేత మేదిని నదీమాతృ కయ్యెఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దత్పరత "బ్రాహ్మణో మమదైవ" మనెడు, బుద్ధి నేరాజు పూజించు బుధుల నట్టి
రాజరత్నంబు వీరవర్మకుఁ బ్రధాన, పురము సారస్వతముఁ జేరఁబోవుటయును.</poem>|ref=3}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈరీతి ధర్మతనయమ, యూరధ్వజయజ్ఞవాహయుగళవిహారం
బారా జెఱింగి తనపరి, వారము సెల విచ్చె వారువంబులఁ బట్టన్.</poem>|ref=4}}
{{p|ac|fwb}}వీరవర్మ పాండవహయంబుఁ బట్టుట</p>
{{Telugu poem|type=తే.|lines=<poem>అపుడు దివ్యరథారూఢులై సులోల, కువలసులలాఖ్యు లారాజుకూర్మిసుతులు
సైన్యములతోడ నరుసేన సరకు గొనక, హరులఁ బట్టి౦ప బభ్రువాహనుఁడు దాఁకి.</poem>|ref=5}}<noinclude><references/></noinclude>
daesjpakya5bvy5bt8qgxkj5roakk17
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/301
104
203645
553104
529716
2026-04-15T07:32:48Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553104
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇదీ దాని స్థితి.
అయితే, వనదాహం చేసే కార్చిచ్చు ఆదిమస్వరూపం యెంత వుంటుందీ?
అలాంటిదే యిదీనీ.
అది స్వల్పం అనడం పామరుల దృష్టి.
పండితుల దృష్టి వేరు.
పండితకవుల దృష్టి మరీ వేరు.
వారిలోనూ వ్యగ్రోత్సాహుల దృష్టి అంతా వేరే.
వారికి, ధర్మోల్లంఘన మయినా, దురాక్రమణ మయినా ఏర్పడ్డమే చాలు.
మరి ప్రయోజనం?
దానికేం?
తిరుపతివేంకట కవులకు కావలసినంత.
రామకృష్ణకవుల కంతకంటే యెక్కువ.
సాహిత్య ప్రియు లయినవారికి వారి కిద్దరికీ కంటే అధికం.
ఏమంటే?
దాంతోనే తిరుపతివేంకటకవుల ప్రతిభ పామరులకున్నూ బాగా తెలిసివచ్చింది.
రామకృష్ణకవుల ప్రాభవం పండితులకూ పామరులకూ గూడా ఏకకాలంలోనే అవగాహన అయింది, బాగా.
కావచ్చు, అయితే, కవులు జాతీయనిర్మాతలు గదా, మరి ఆంధ్రజాతికి కలిగినదేమిటీ అంటే?
తిరుపతివేంకట కవుల నిరంతర సంచారంతో అదివర కెంత జరిగివుందో, రామకృష్ణకవులు ఢీకున్న యీ కలహంవల్ల
దానికి పదిరెట్లు - వందరెట్లు - వెయ్యిరెట్లు సాహిత్య ప్రచారం జరిగింది, దేశంలో.
చరిత్రకారులు నిర్ధారణచేస్తా రీసంగతి, విపులంగా.
ఇక చెప్పవలసిందేమిటంటే?
ఈ పరిస్థితుల్లో రామకృష్ణకవుల దగ్గిర ప్రవేశించడం నాకెంతో శ్రేయస్కరం అయింది.
తిరుపతివేంకటకవుల దగ్గిర ప్రవేశించినా భంగ్యంతరంగా నాకీమేలు కలిగేదే, సందేహంలేదు.
కాని, రామకృష్ణకవులతో సవయస్కతా వారి నవ్యధోరణీ నాకు విశేషాలయినాయి.
మరి పర్యవసానం?
నా సాహిత్యతృష్ణా, సాహిత్యజ్ఞానమూ హెచ్చడంతోపాటు, నా కవితా ధోరణికి సానపట్టినట్టయింది.
నా దృక్పథం సుపరిష్కృతం కావడంతోపాటు నా జీవితమున్నూ సరి అయినదారిన పడింది.
జీవిత సాఫల్యాని క్కావలసిన అవకాశాలున్నూ పూర్తిగా అమరాయి.
కార్యక్షేత్రం బహూ విశాలం అయింది.<noinclude><references/>
{{rh|277||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
sku85a45sxsjjd733vtpetv75ge6iuo
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/302
104
203646
553112
529718
2026-04-15T07:40:30Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553112
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఆదిలో వచనరచనే యిష్టం అయినా, నల్లమిల్లి సత్తిరెడ్డిగారు యాదాలాభంగా అన్నమాటతో పద్యబంధంలో పడి, స్వయంకృషితో కొంత సాధించి, రామకృష్ణకవుల బోధతో వోహో అనిపించుకోగల స్థితికి వచ్చాను.
కాని, వుండుండి, పద్యబంధం కాదు, వచనరచనే ప్రధానం అన్న భావం స్థిరపడిపోయింది, చివరికి.
దాని క్కారణం, మొదట వేంకటరామశాస్త్రిగారూ, తరవాత యెక్కువగా రామకృష్ణశాస్త్రిగారూనూ.
అదొక వింతసంగతి.
{{c|<big><big>28</big></big>}}
రామకృష్ణశాస్త్రిగారితో షష్టిగడియలూ కవితావ్యాసంగంలో మునిగివుంటూ వుండిన్నీ, వీలయినప్పుడల్లా, బసలో సవిమర్శంగా విజయవిలాసం చదువుతూ దానిమీద సమీక్ష రాస్తూ వుండినా న్నేను.
విజయవిలాసం అన్నా నిద్రాహారాలు మరిచిపోయే టంతటి ప్రీతే నాకు.
ఆంధ్ర వాఙ్మయంలో వొక ధ్రువతార అది.
శ్రీకృష్ణుడు సత్య కాళ్లమీద పడ్డతరవాత పారిజాతాపహరణం చదవకపోయినా బాధలేదు.
మాయాప్రవరుడు వరూధినిని లోపుచేసుకున్న తరవాత మనుచరిత్ర చదవకపోయినా యిబ్బందిలేదు.
విజయవిలాసం మాత్రం ఆదినుంచి అంతందాకా చదివి తీరవలసిన గ్రంథం.
ఆమూలాగ్రంగా చదవ్వలసిన ఆంధ్ర గ్రంథాల్లో మహా భారతమూ, శృంగార నైషధమూ, ఆముక్తమాల్యదా, వసుచరిత్రా, పాండురంగ మాహాత్మ్యమూ, ప్రభావతీ ప్రద్యుమ్నమూ - ఈ శ్రేణిలో దది.
నాయకరాజుల కాలాన బయలుదేరిన ఆంధ్ర వాఙ్మయానికంతకీ మెరుపుపూస అది.
రసమహితమైన పూర్వ వాఙ్మయానికి పరసీమాను ఆది.
చదువుకుందా మంటే కొత్త గ్రంథాలు లేనిరోజుల్లో, పంచకావ్యాలే మళ్ళీ మళ్లీ తిరగవేసుకుంటూ వుండిన సందర్భంలో హఠాత్తుగా నా చేతికి వచ్చిందది.
సత్తి సుబ్బారాయడని మా పొలమూరిలో వొక రెడ్డి.
ఆంధ్రసాహిత్యం చవిచూసినవాడూ, రుచిమరిగినవాడూను అతను.
మను వసుచరిత్రలు తరచు తిరగవేస్తూనూ వుండేవా డతను.
పెద్దబ్బాయిగారి శిష్యుడున్నూ.
ఆర్థికంగా అసందర్భస్థితిలో వుండిన్నీ చదవకుండా వుండలేక కొన్నాడత నాగ్రంథం.
వేదం వేంకటరాయశాస్త్రిగారి ప్రచురణ అది.
"సంస్కృత గ్రంథాలే గాని మీరు తెనుగు గ్రంథాలు చూడరా?" అనడుగుతూ నాకు చూపించా డొకనా డతనది.
అదే మొదటిమాటు నేనది చూడడం.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||278}}</noinclude>
56l2npdwajpo3xjtd9lqh7yh93ajalw
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/303
104
203647
553117
529719
2026-04-15T07:47:55Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553117
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>తెలిసినంత తెలిసేది, లేనంతలేదు; కాని రచన చాలా మధురంగా కనపడేది.
మాటలు విరవడం నేర్పు నా కందులోనే కనపడింది, మొదట.
కొన్నాళ్ళపాటు నా కదే నిద్రహారాలయింది.
నా చేతిలోనే నలిగిపోయింది కూడా అది.
ఆ స్థితిలోనే సంభవించింది నేను పిఠాపురంలో చదువుకోడం.
అంతకి ముందే విజయవిలాసంమీద సమీక్ష రాయడం ప్రారంభించివున్నా న్నేను.
అప్పటికే నూరుపావుటావులు మించివుం దది.
ఒకనా డేదో పనిమీద నా గదికి వచ్చిన వేంకటరామశాస్త్రిగారి కళ్ళబడిందది హఠాత్తుగా.
చూస్తూనే చేతబుచ్చుకుని, పని అవుతూనే వెళ్ళిపోయారు వారది "చూసి యిస్తా” నంటూ.
వారి తరవాత రామకృష్ణశాస్త్రిగారు చదివారు.
మరికొన్నాళ్ళకి దాని ప్రస్తావన వచ్చింది మేము ముగ్గురమూ కూచుని వుండగా.
వేంకటరామశాస్త్రిగారే తెచ్చా రాప్రస్తావన.
"ఇలాంటి రచనలు వాఙ్మయాని కెన్నో కావాలి. మీ రచన విలవగల దవుతుంది. కనక, మీరిక పద్యరచన కట్టిపెట్టి, కనీసం తగ్గించి వచనరచన చెయ్యండి” - ఇదీ దాని పండితార్థం.
"మా బావ చెప్పింది బాగుంది" అంటూ రామకృష్ణశాస్త్రిగా రందుకున్నారు, వెంటనే
“కార్యకారణవిచారణ వద్దిప్పుడు. గద్యరచన అంటే మనవాళ్ళ కిప్పటికీ తృణీకార భావమే వుంది, మాకూ తెలుసు. ప్రారంభంలో మాకున్నూ రచన అంటే పద్యరచనే అన్నభావం వుండేది; కాని యీ కలహం ప్రారంభం అయాక వచనం విలవ మాకు తెలిసివచ్చింది. పద్యబంధం చాలా సుళువు. రసవంతమైన వచనం రాయడం మాటలు కాదు. మీ వచనరచన విలక్షణంగా వుంది. మీకదే తగిందనిపిస్తోంది. మా బావ మాట విన్నమీదట. కనక, పద్యాలకంటే మీరు వచనమే ప్రధానం చేసుకోడం మంచిది" అన్నారు వారు.
రమారమీ పావుగంటసేపు ఈ విషయం నలిగింది.
“మేము కవితాపత్రిక నడుపుతున్నాం గదా? మీరున్నూ సాధ్యమైనంత త్వరలో వొక పత్రిక ప్రారంభించండి. అందులో విమర్శలకే ప్రాధాన్యం యివ్వండి" అవిన్నీ చెప్పారు, రామకృష్ణశాస్త్రిగారు, చివరిమాటగా.
నేను నడపవలసిన పత్రిక పేరున్నూ వా రప్పుడే నిర్దేశించారు.
అయితే, అప్పటికే ప్రబుద్ధాంధ్ర అన్న పేరితో పత్రిక నడపాలని అనుకునివున్నా న్నేను.
రామకృష్ణశాస్త్రిగారు నిర్దేశించిన పేరున్నూ చాలా గొప్పదే.
కాని ప్రబుద్ధాంధ్ర ప్రాప్యం వేరూ, దాని ప్రాప్యం వేరున్ను.
రామకృష్ణశాస్త్రిగారు నిర్దేశించిన పత్రిక నడపడముమ్నా నా వుద్దేశమే కనక, స్వత్వం పోకుండావుండడానికి గోప్యంగానే వుంచుతా నా పేరు నేనిప్పటికి.<noinclude><references/>
{{rh|279||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
2nxgcpy8b1zd527dhgu66a810qt2up2
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/304
104
203648
553119
529720
2026-04-15T07:52:04Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553119
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పోతే, - రామకృష్ణకవుల మహోపదేశం యుక్తసమయాన అందింది నాకు.
వీరేశలింగంగారి రచనలు కొన్ని చదవడంతో నా కలవడ్డ సంస్కారదృష్టి లోకులకున్నూ కలిగించాలంటే, అందుకు తగ్గది వచనమే.
అంచేత, గురువుల ఆనతి శిరసావహించా న్నేను.
అయితే, పోలవరం వకీలు ఆదిమధ్యం భావనారాయణ స్వామిగారి కిచ్చినమాట నిలుపుకోవలసివుంది కనక, వెంటనే మాత్రం పద్యరచన కట్టిపెట్టలేకపోయాను.
{{c|<big><big>29</big></big>}}
రామకృష్ణకవుల దగ్గిర నేను చదువుకున్న కాలం మొత్తాని కొక్క సంవత్సరం పైని మాత్రమే.
చదివిన గ్రంథాలున్నూ, - విద్యానాథుని ప్రతాపరుద్రీయం పూర్తిగానూ, వామనుని కావ్యాలంకారసూత్రాలు సగమూ, ఉత్తర రామచరిత్రా శాకుంతలమూ సమగ్రంగానూ ఆముక్త మాల్యద కూడా పూర్తిగానూ, విశ్వగుణాదర్శం మూడువంతులూ మాత్రమే.
లెక్కలు కట్టి చూస్తే మనిషి జీవితంలో కొంచెం తక్కువ రెండు సంవత్సరాలు అంటే సముద్రంలో నీటిబొట్టు వంటిది.
పాండిత్యదృష్ట్యా చూస్తే ఆ చదివిన గ్రంథాలున్నూ బహూ తక్కువ.
అయితే, పదిపదిహేను సంవత్సరాలపాటు నిద్రాహారాలు విడిచి నూరుగ్రంథాలు చదివినా లభించనంత పరిజ్ఞానం లభించింది రామకృష్ణకవుల దగ్గిర నాకు.
చదువుల సందర్భంలో "నూరిపొయ్యడం” అనేమాట అక్కడే అవగాహన అయి, అనుభూతమున్నూ అయింది నాకు.
వారు నాయెడల కనబరిచిన ఆత్మీయతను బట్టిన్నీ నేనా కాలం మరచిపోలేను.
పద్యవ్యామోహంలో పడి కొట్టుకుపోతున్న నన్ను వచన రచనకు మళ్ళించడం రూపంగా వారు నాకు చేసిన మహోపకారం ఈ జన్మలోనే కాదు, మరెన్ని జన్మల్లోనూ మరిచిపోలే న్నేను.
ఏమంటే?
వచనరచనతోనే నా జీవితానికి సాఫల్యం.
పద్యాలు కట్టడం నాకు నడమంత్రపు సిరివంటిది.
అంటే, పద్యాలంటే నాకు ద్వేషం అనుకోవద్దు.
భావంతోనే కాక, భాషతో గూడా వీణానిస్వనం లాగ అవ్యక్తానందం కలిగించే పద్యాలు ద్వేషించడం నాకు చేతకాని పని.
ఛందోబద్ధాలయిన సంస్కృతాంధ్రగ్రంథాలు చదివే యీ స్థితికి వచ్చిన నేను, అసలే ద్వేషించలేను పద్యాలు.
నా దృష్టిలో పద్యానికీ గద్యకూ గూడా సాహిత్యపు విలువలు సమానమే.
దురదృష్టంవల్ల తెనుగు గ్రంథాలన్నీ పద్యబంధాలయిపోయాయి.
అన్నీ అంటే, యేకొద్దిగానో వచనరచనలు లేకపోలేదు.
కానీ, వాటికి ప్రచారం రాలేదు.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||280}}</noinclude>
gboz2zg3ez4ctup97kjt05nztxepakl
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/305
104
203649
553121
529750
2026-04-15T07:57:05Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553121
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పండితులు వాటికేసి చూడలేదు.
పండితులమీదే దృష్టి పెట్టుకున్న ప్రకటనకర్తలున్నూ వాటిని స్మరించలేదు.
బహూ రసవంతాలయిన ద్విపదరచనలనే యీసడించారు మన పండితులు, వచన రచనల నాదరిస్తారా మరి?
గతానుగతికమైన లోకం, తనకు తావయి పండితుల మార్గం విడిచి సరి అయిన దారి తొక్కగలదా?
కనక, నవ్యదృక్పథంతో సమర్థులయినవా రందుకు పూనుకోవాలి.
అప్పుడు మారుతుంది ప్రజాభిరుచిన్నీ, నదీమార్గం లాగ.
గతానికి అగతానికీ కూడా వీరేశలింగంగా రొక్కరే ఆ పని చేశారు.
పంతులుగారి పూనికవల్లనే గద్యవాఙ్మయం విలవలు మనకు తెలిసివచ్చాయి.
పంతులుగారి మధురరచనలతోనే మనకు గద్యప్రీతిన్నీ కలిగింది, బలాపడింది.
జనసామాన్యమున్నూ బాగా కళ్లు తెరచింది.
పంతులుగారు కటిబద్ధులు కాకపూర్వమూ పంతులుగారి వరవడితో గద్యవాఙ్మయమూ పత్రికావాఙ్మయమూ పెద్దయెత్తున ప్రారంభం అయిన తరవాతా, జనసామాన్యం అంతస్థు పెరగడం గుర్తించగలవారి కిది చెప్పనక్కరలేదు.
నిన్నటిదాకా మెయిలువేగంలో వుండిన పద్యవాఙ్మయ ప్రచారం ఇవాళ వొంటెద్దుబండి నడకలో వుండడం చూస్తే, ఆంధ్రజాతి పురోగమనమున్నూ విశదంగా తెలుస్తుంది.
గొప్ప పూర్వకవులకు లేని ఆదరగౌరవాలు ఆధునిక పద్యబంధనిపుణు లనేకు లిప్పుడు పొందుతున్నారు, నాకు
తెలుసు.
జనులకు, శిక్షాపూర్వకంగా తెనుగు భాష అభ్యసించవలసిన రాజశాసనాలు లేకపోవడం దానికి మూలకారణం.
సమకాలికత్వం వొక ముఖ్యకారణం.
సంగీతమున్నూ మరో ప్రభలకారణం.
సభల్లో కావ్యపఠనం చేసే పద్దతి ఇంకో కారణం.
విమర్శకులు ముందుకి రాకపోడం పెద్దకారణం.
పాతదీ కొత్తదీ కూడా మన యూనివర్సిటీలు పద్దెనిమిదో శతాబ్దం నడకలు నడుస్తూవుండడం మరో దురదృష్టం.
అయితే, యిప్పటి పద్యబంధ నిపుణుల్లో మహాకవులు కొందరు లేకపోలేదు.
మహాకవులు కాగలవారున్నూ లేకపోలేదు.
కాని వచనరచన చేసే మహాకవుల సంఖ్య దగ్గిర, పద్యబంధం చేసే మహాకవుల సంఖ్య చాలా స్వల్పం.
ఆంధ్రజాతి అచిరకాలంలోనే సర్వతోముఖంగా వికసిస్తుందనడాని కిదొక సూచన.
దీనికి పునాది వీరేశలింగం పంతులుగారి గద్యరచన.
ఇంచేతనే పంతులుగారి వాఙ్మయసేవ కంత గౌరవం.
అంత ప్రఖ్యాతిన్నీ.
ఆధునికుల్లో మొదట ఈ కొత్తదారి తొక్కినవారు చిన్నయసూరిగారు.<noinclude><references/>
{{rh|281||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
i9ptzdomzokksvguss42tzbmdhpyth3
పుట:పటం కతలు.pdf/123
104
212019
553103
552541
2026-04-15T07:27:37Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553103
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|106||పటం కతలు}}</noinclude>
ఈ పురాణంలోని కథాంశాన్ని కూనపులి వారు రెండురోజులుగా విభజించుకుని ప్రదర్శిస్తారు. దీనికి సంబంధించిన వ్రాతప్రతులు గానీ, తాళపత్ర ప్రతులు గానీ లేవని, మౌఖికంగానే ఈ పురాణం సంప్రదాయంగా సంక్రమించిందని
చెప్తారు. అయితే కూనపులి వారు చెప్పే పురాణానికి క్రీ.శ. 1511-1568 మధ్యకాలానికి చెందిన ఎల్లకర నృసింహకవి రచించిన మార్కండేయ పురాణానికి బేధసాదృశ్యాలున్నాయి. ఇందులో కూనపులి వారి ప్రస్తావన మినహా మిగతా కథాంశం
ఒకే మాదిరిగా కనిపిస్తుంది.
కులపురాణాల లక్షణాలను చూస్తే ఏ పురాణమైన తనకంటూ ఒక ప్రత్యేకమైన కథానిర్మాణం కలిగి ఉంటుంది. ఏ కులానికి చెందిన మూలపురుషుణ్ణి తీసుకున్నా అతను దైవాంశ సంభూతుడు లేదా దేవకార్యం నిమిత్తం జన్మించినవాడై ఉంటాడు.
అయితే పద్మశాలి కులానికి చెందిన మూలపురుషుడు మార్కండేయుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించినవాడు. శ్రీ మహావిష్ణువే స్వయంగా 'ఓ మార్కండేయ నీ బ్రహ్మచర్యం వర్ణింపదగినది కాదు. నా రూపాన్ని దేవతలు కూడా తెలుసుకోలేక పోయారు. అట్టి రూపాన్ని నీవు చూశావని, మార్కండేయున్ని ఎన్నో విధాలుగా ప్రస్తుతించాడు. అటువంటి మహాపురుషుడు పద్మశాలి కులానికి మూలపురుషునిగా ఉండటమనేది ఏ ఇతర పురాణాల్లో కనిపించదు. ఇది కులానికి
గౌరవాన్ని, గొప్పదనాన్ని అందించడమే గాక.. కులం పట్ల ఉండే ఆత్మన్యూనతా భావాన్ని తొలగించడానికి దోహదం చేస్తుంది.
మౌఖికంగా సంక్రమించిన పురాణాన్ని కూనపులి వారు పద్మశాలి వారికి పురాణం పట్ల నిరాసక్తి లేకుండా ఉండేందుకు వృత్తిని ప్రతిబింబించే సామెతలు, పొడుపు కథలను ప్రయోగిస్తూ ఆసక్తిగా కథాగానం చేస్తారు. అంతేగాకుండా మగ్గం
నిర్మాణం ఎట్లా జరిగిందో వివరించడం, పద్మశాలి నేసిన బట్టలు ఎందుకు చినుగుతాయో అందుకు గల కారణాన్ని చెప్పడం, అట్లాగే బట్టలకు రంగులు ఏ విధంగా వచ్చాయో వివరించడం జరుగుతుంది.
పద్మశాలి పురాణం విన్న తర్వాత తమ వృత్తి పట్ల, కులం పట్ల గౌరవభావం పెరుగుతుంది. ఎందుకంటే తమ పూర్వీకులు దేవతల సంతతివారేనని, సృష్టిలో<noinclude><references/></noinclude>
8m3ggih83ts9efzjstaaxz9l1xxv38x
పుట:పటం కతలు.pdf/124
104
212020
553105
552542
2026-04-15T07:33:52Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553105
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||107}}</noinclude>
మొదట వస్త్రం నిర్మించి దేవతలకు సమర్పించామని, రాక్షసులను ఎదురించామని, కులం పుట్టుక, వృత్తి ఆవిర్భావంలో ఏర్పడ్డ ఆటంకాలు... ఆ ఆటంకాలను మూలపురుషుడు ఎదురుకున్న తీరు, ఆ సమూహం లేదా ఆ సమాజం
తెలుసుకున్నప్పుడే ఆ వృత్తిని, ఆ సమాజాన్ని ఇతరులు గౌరవంగా చూస్తారు. ఆ వృత్తిని చేసే వ్యక్తులను కూడా గౌరవంగా భావిస్తారు. ఈ తంతును తరతరాలుగా కూనపులి వారు నిర్వహిస్తూ ప్రధాన కులం యొక్క సంస్కృతిని పరిరక్షింప చేస్తున్నారనడంలో సందేహం లేదు.
కూనపులి వారు ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వారివారి నియమిత కట్టడి గ్రామాలకు వెళ్లి పద్మశాలి కులపెద్దను కలిసి పురాణం ప్రదర్శించడానికి ప్రతిఫలం మాట్లాడుకుంటారు. ఒకవేళ ప్రదర్శన వద్దనుకుంటే పద్మశాలి వానిదగ్గర ఇంటికి కొన్ని రూపాయలు వసూలు చేసుకుంటారు. కథా ప్రదర్శన ఉంటే రంగస్థలాన్ని కులపెద్ద ఇంటి దగ్గర గానీ లేదా పద్మశాలి వీధిలో గానీ ఏర్పాటు చేసుకుంటారు. పటం మీది బొమ్మలు కనిపించడానికి దాదాపుగా పగలే ప్రదర్శించడానికి కళాకారులు ఒప్పుకుంటారు.
కథ చెప్పడానికి ఐదుగురు కళాకారులు ఉంటారు. ఇందులో ఒకరు ప్రధాన కథకుడు. ఇతను కాళ్లకు గజ్జెలు, నడుముకు కండువా కట్టుకొని కుడిచేతిలో బెత్తంబరిగె, ఎడమ చేతిలో చిడతలు పట్టుకుని పాత్రలను పోషిస్తూ వినోదం, విషాదం,
యుద్ధం వంటి సన్నివేశాల్లో హావభావాలు ప్రకటిస్తూ మధ్యమధ్యలో హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు వంతలు ఉంటారు. వీరు ప్రధాన కథకుణ్ని అనుసరిస్తూ పునరావృతం చేస్తూ వంత పాడుతారు. మరో ఇద్దరిలో ఒకరు తబలా, మరొకరు హార్మోనియం వాయిస్తారు. కొన్ని సందర్భాల్లో ప్రధాన కథకుడు విశ్రాంతి తీసుకుంటే కథకు అంతరాయం కలగకుండా వంతలు పిట్టకథలు, హాస్యపు పాటలు పాడుతూ కథను రక్తికట్టిస్తారు. వీరు ఉపయోగించే వాద్యాల్లో తబలా, హార్మోనియం, చిడతలు తాళాలతో పాటుగా 'ఢంకా' అనే ప్రత్యేక వాద్యాన్ని వాడతారు. దీన్నే 'రణభేరిన అంటారు. కులపెద్ద ఇంటిదగ్గర ప్రదర్శన ప్రారంభంలో ప్రేక్షకులను సమీకరించడానికి, కథలో సందర్భాన్ని బట్టి యుద్ధం జరిగే సన్నివేశంలో ప్రత్యేకంగా ఈ వాద్యాన్ని వాయిస్తారు.<noinclude><references/></noinclude>
o5e23sjitpiccgzs424f1zwcs50plwb
పుట:పటం కతలు.pdf/125
104
212021
553110
552543
2026-04-15T07:38:39Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553110
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|108||పటం కతలు}}</noinclude>
కూనపులి వారు ప్రదర్శనకు పవిత్రతను ఆపాదించడం కోసం ప్రదర్శనలో సందర్భాన్ని బట్టి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కథలో భాగంగానే రెండోరోజు కాలువాసురుడనే రాక్షసున్ని సంహరించాలంటే రాక్షసునికి మరియు భావనాఋషి వద్ద ఉండే పులికి మేకపోతును బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కళాకారులు చేసి పద్మశాలి ఇండ్లమీద బలి చల్లుతారు. దీన్ని పద్మశాలీలంతా శుభసూచకంగా భావిస్తారు.
ప్రాచీనమైన మౌఖిక వారసత్వ సంపద కలిగిన కూనపులి కళారూపానికి ప్రాచుర్యం లేక అవసాన దశలో ఉంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పటం ద్వారాకథాగానం చేసే కళాకారులు మాత్రం కేవలం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట
మండల కేంద్రానికి చెందిన కూనపులి ఎర్రగట్టు, అతని కొడుకు రమేష్ మాత్రమే ఉన్నారు. రమేష్ కళారూపాన్ని బతికించుకోవాలనే తపనతో తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వరంగ సంస్థలు ప్రదర్శించేందుకు
అవకాశాలు కల్పించినప్పటికీ పురాణాన్ని ప్రదర్శించడానికి పటం వాద్యాలు లేని కారణంగా ప్రదర్శించేందుకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు.
ఎంతో ప్రాచీనత కలిగిన ఈ కళారూపాన్ని పరిరక్షిస్తే దీంతో పాటుగా ఇటు కూనపులి, అటు పద్మశాలి మౌఖిక సాహిత్య సంపద భవిష్యత్ తరాలకు అందించినట్లవుతుంది.
{{right|- డా॥ బాసని సురేష్}}<noinclude><references/></noinclude>
8o7390aonllivqacazjyr6hxiftticf
పుట:పటం కతలు.pdf/126
104
212022
553114
552544
2026-04-15T07:42:36Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
553114
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = పటం_కతలు.pdf
|Page = 126
|bSize = 450
|cWidth = 366
|cHeight = 87
|oTop = 39
|oLeft = 36
|Location = center
|Description =
}}
{{center|{{p|fs150}}'''12. మందెచ్చుల పటం కత '''</p>}}
మందెచ్చుల వారు యాదవకులం వారికి ఆశ్రితులు. యాదవుల ఇంట ఉన్న గొర్లు, మేకల మందలు హెచ్చుకావాలని కథలు చెప్పి గావు పట్టి, ఐలి చల్లె వారినే మందహెచ్చులు లేక మందెచ్చుల వాళ్ళు అని అంటారు. వీరు చెప్పే కథలను మందెచ్చుల కథలు అంటారు.
వీరు బుడిగె జంగాలలోని ఒక వర్గానికి చెందినవారు. తెలంగాణలో వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్ నగర్
జిల్లాలో మందెచ్చుల వారు అధికంగా నివసిస్తున్నారు. వీరిని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తున్నారు.
వరంగల్ జిల్లాలో మందెచ్చుల వారని, నల్లగొండ జిల్లాలో పొదపొత్రపు వాళ్ళని, పొగడుపోల్లు అని పోడారులు, బొమ్మలాటల వాళ్లు అనే పేర్లతో పిలుస్తున్నారు.<noinclude><references/></noinclude>
mh8bov14ac1qr5sjsinkn93pt5ftewa
పుట:పటం కతలు.pdf/127
104
212023
553115
552545
2026-04-15T07:43:54Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
553115
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = పటం_కతలు.pdf
|Page = 127
|bSize = 450
|cWidth = 432
|cHeight = 396
|oTop = 5
|oLeft = 8
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
rmgco6hq0e55ryw0mk4gop24jp59kwc
పుట:పటం కతలు.pdf/128
104
212024
553118
552546
2026-04-15T07:48:47Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553118
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||111}}</noinclude>
సాధారణంగా మందెచ్చుల వాళ్లు కథాగానం రూపంలో ప్రదర్శనలిస్తారు. కాని ఇటీవల కొన్ని బృందాలు తమ ప్రదర్శనలో మార్పులు చేసి, ప్రేక్షకుల అభిరుచి కనుగుణంగా పటం ఆధారంగా ప్రదర్శనలిస్తున్నారు. నకాశి వారితో పటంను
తయారు చేయించి తమ ధాతృకుల పెద్దలను ఆకట్టుకుంటున్నారు.
మందెచ్చుల వారికి మూలపురుషుడు వలగొల్ల జగ్గయ్య అని, ఇతను పూర్వం యాదవుల యొక్క మందల వద్దకు వెళ్ళి గొర్రెను గావు పట్టించి, మంద మీద, చేను మీద, చెలక మీద బలిచల్లి కథలు చెప్పేవాడని, దానివల్ల గొల్లవారి మందలు
బాగా పెరిగాయని, ఇలా మంద హెచ్చు కావడానికి కారకుడు అయిన ఆలగొల్ల జగ్గయ్య సంతతికి చెందినవారే మందెచ్చుల వారయ్యారని చెపుతారు.
'''మరొక కులోత్పత్తి గాథలో...'''
ఒక గ్రామంలో ఒక గొర్రెల మంద ఉండేది. అదే గ్రామంలో ఊరు ముందుండే గుడిసెలో నివసించే శారదాకాండ్ర స్త్రీకి, గొర్రెమంద యజమానికి రహస్యంగా సంబంధం ఏర్పడింది. ఆమె గర్భం దాల్చింది. ఆమెను తమ కులం వాళ్ళు వెలివేయడంతో మంద వద్దనే తొమ్మిది నెలలు గడిచి ఒక పిల్లాడికి జన్మనిచ్చింది.
గొర్ల మంద యజమానికి ఆమెకు పొడలున్న ఒక మేకపోతును ఇచ్చాడు. ఆ పిల్లవాడు మంద వద్దనే రొచ్చులో పెరిగి పెద్దవాడయ్యాడు. మందెచ్చలో పెరిగాడు కాబట్టి అతనిని మందెచ్చుల వాడని, పొడలున్న పోతును పెంచడం వల్ల పొదపోతుల వాడు అయ్యాడని వీరి సంతతి ఇలా మారిపోయిందనేది వీరి నమ్మకం. ఇలా ప్రాంతాన్ని బట్టి కులోత్పత్తి గాధలుంటాయి.
మందెచ్చుల వాళ్ళు గొల్లలకు, యాదవులకు మాత్రమే కథలు చెప్పి వారి నుంచి పుచ్చుకునే సంభావననే 'త్యాగం' అంటారు. దీనికే 'కట్టడి' అనిపేరు. కట్టడి ఉన్న గ్రామాలకు సంవత్సరానికి ఒకసారి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి శ్రావణ మాసం నుంచి ఎండాకాలం వరకు వెళ్లి కథలు చెబుతారు.
కట్టడిని తెలిపే విధంగా తరతరాల నుంచి వస్తున్న రాగిసన్నతి (రాగిశాసనం)ని వీరు ఆయా గ్రామాలకు వెళ్ళినపుడు వెంట తీసుకువెళ్తారు. ఆ గ్రామంలో గొల్ల<noinclude><references/></noinclude>
p24giklr908lirhaq8nbcibpqd0963q
పుట:పటం కతలు.pdf/129
104
212025
553120
552547
2026-04-15T07:56:46Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553120
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|112||పటం కతలు}}</noinclude>
కులపెద్ద ఏర్పాటు చేయించిన ఇంట్లో ఉంటారు. మందెచ్చులవారు తెచ్చుకున్న బొమ్మలు ఉన్న బుట్టలను దించుకుంటారు. గ్రామానికి వచ్చిన విషయాన్ని 'నపీర' అనే వాద్యాన్ని ఊదుతూ యాదవులందరికీ తెలియపరుస్తారు.
మరుసటి రోజున కులపెద్ద అంగీకారం మేరకు యాదవులు కోరుకున్న కథను చెపుతారు. దీనినే 'కులకథ' అంటారు. ఈ కథను మూడురోజుల పాటు చెబుతారు. ఈ కథ తర్వాత 'బలిచల్లి' 'పొలికథ'ను చెబుతారు. తరువాత రాజు
బొమ్మలతో కథలు చెపుతారు.
మందెచ్చుల వారు కథ చెప్పినందుకు ఎనిమిది మంది కళాకారులు ఒక బృందంగా ఉంటారు. అందులో ప్రధాన కథకుడు, ఇద్దరు సహాయ కథకులు, వాద్య సహకారం ఇద్దరు, వంతలు ఇద్దరు చొప్పున ఉంటారు.
వీరు ప్రదర్శనలో ఉపయోగించే వాద్యాలు 'డోలు' ప్రధానమైనది. దీనినే 'రడవీర' అని కూడా అంటారు. మరొక వాద్యం పేరు 'నపీర'. దీనిని ఊదుతూ కథ చెబుతారు. జగ్గు, హార్మోనియం, పెద్దతాళాలు, చిన్నతాళాలు వంటి వాద్యాలను
ఉపయోగిస్తారు. కథకుడు, సహకథకులు కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. కాళ్ల అడుగులతోనే గజ్జెల శబ్దం కథకు ఇంపునిస్తుంది.
కథలు చెప్పడానికి ప్రత్యేకమైన రంగస్థలం అంటూ ఉండదు. పటం ప్రదర్శన ఐతే పటం వ్రేలాడదీయడానికి అనువుగా స్టేజి ఏర్పాటు చేసుకుంటారు. కథాగాన ప్రదర్శన అయితే నేల మీదనే చాప వేసుకొని రాత్రి సమయాల్లో అయితే కుల పెద్ద ఇంటిముందు, పగలైతే చెట్ల కింద గొల్లవాళ్ళు నివసించే వీధులలోనే ప్రదర్శనలు ఉంటాయి.
వీరికి ప్రత్యేకమైన వేషధారణ అంటూ ఉండదు. ప్రధాన కథకుడు తెల్లధోతి, తెల్ల అంగి ధరించి మెదలో వెండి గొలుసులు, చేతికి వెండి పోంచి చిట్రేగు కర్రకు తొడిగిస్తారు. దీనినే అనుసుల కట్టె అంటారు. ఈ కట్టెను చేత్తో పట్టుకుని, మరోచేత్తో రుమాలు పట్టుకుంటాడు. కథలో స్త్రీ పాత్ర ఉంటే మగవారే స్త్రీ పాత్ర ధరిస్తారు.
మందెచ్చుల వారు చెప్పే కథల్లో ముఖ్యంగా -
పెద్దిరాజు కథ,<noinclude><references/></noinclude>
7s21wsybls9q8nzas3da04bkvsdf70k
పుట:పటం కతలు.pdf/130
104
212026
553122
552548
2026-04-15T08:00:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553122
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||113}}</noinclude>
:కరియావుల గంగురాజు కథ,
:కాటమరాజు కథ,
:ఎర్రన్న కథ
:పోలురాజు కథ,
:ఎలనూకరాజు కథ,
:నలనూకరాజు కథ,
:ఆదిబిడ్డ కొంరవ్వ కథ,
:పాపమ్మ కథ,
:కాంబోజరాజు కథ,
:కనకతార వధ,
:బొల్లావు కథ,
:సారంగధర కథ,
:సత్యహరిశ్చంద్ర,
:సిరితొండ మారాజు,
:మందోదరి,
:సువర్ణ సుందరి,
:అయిదు మల్లెపువ్వులు,
:బలిచక్రవర్తి,
నలచక్రవర్తి వంటి ఎన్నో కథలను చెపుతారు. ఈ కథలు ఒకరోజు నుంచి అయిదు రోజుల వరకు చెప్పే కథలు కూడా ఉన్నాయి. యాదవులు ఈ కథలను చెప్పించడానికి ముఖ్యోద్దేశం దొడ్డిహెచ్చు, మందెచ్చు అవుతుందనేది వీరి ప్రగాఢ
విశ్వాసం.
కథ ప్రారంభంలో గంగాదేవిని స్తుతిస్తారు.<noinclude><references/></noinclude>
2f9e5qi62tztiyo2kk8ivk4bcmcbw0i
పుట:పటం కతలు.pdf/131
104
212027
553123
552549
2026-04-15T08:05:17Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553123
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|114||పటం కతలు}}</noinclude>
:'శరణు శరణు మాకన్న తల్లీ శాంభవి రాణి,
:శాంభవి రాణి శరణు జూడు మా కన్నతల్లీ గంగాభవానీ,
:దేవిభవాని'
అంటూ గంగను శరణువేడి, తర్వాత ఆది గణపతిని తలుస్తారు.
మందెచ్చుల వారు చెప్పే కథల్లో కథావస్తువు యాదవుల ఘన చరిత్రకు సంబంధించినదే ఉంటుంది. యాదవులు గోవుల కోసం చేసిన యుద్ధాలు, చరిత్రకు సంబంధించిన ఇతివృత్తాలు గల కథలు చెపుతారు.
మందెచ్చుల వారు కులకథ చెప్పిన తరువాత యాదవులు తమ మంద వద్ద గొర్రెను గావుపట్టించి మందల మీద ఐలి చల్లించుకుంటారు. ఇలా అయితే తమ మందలు హెచ్చు అవుతాయనేది వీరి నమ్మకం. పొలి కథగా కాటమరాజు కథ
లేదా గంగాదేవి కథ చెపుతారు.
కథలు పూర్తిగా అయిన తర్వాత ఆది లేదా గురువారాల్లో గొర్ల మంద వద్ద మందెచ్చు నాయకుడు గొర్రె మెడను పండ్లతో కొరుకుతూ గావుపడతాడు. మంద చుట్టూ తిరుగుతూ.. ఆ రక్తాన్ని గడుక, పసుపు మొదలైన వాటితో కలిపి బలొ.. బలి అంటూ గొర్ల మంద మీద, యాదవుల ఇండ్ల మీద, చెలకల్లా చల్లుతారు. ఈ కార్యక్రమం రాత్రి నుంచి తెల్లవారే సరికి పూర్తిచేస్తారు. గావుపట్టి బలి చల్లినందుకు గొర్రెను లేదా మేకను మందెచ్చుల వారికి కట్నంగా ఇస్తారు.
యాదవుల ఇంట్లో పురుడు ఐతే పురుడుకట్నం పెరిగితే పెండ్లికట్నం చస్తే చావు కట్నాన్ని మందెచ్చుల వారు హక్కుగా పొందుతారు. వీరు కట్టడి సమయంలోనే కాకుండా యాదవుల ఇంట్లో మరణించిన వారి పేరుమీద కూడా ఈ కథలు చెప్పిస్తారు. ఇంటి పెద్ద అంగీకారంతో బుట్టబొమ్మల ప్రదర్శన ఇచ్చి చనిపోయన వారిని స్తుతిస్తారు. చనిపోయినవారు ధరించిన వెండి ఆభరణాలను దానంగా ఇస్తారు. కథకు అనుగుణంగా బొమ్మలు చూపిస్తూ దానికి సంబంధించిన సంక్షిప్త కథను చెపుతారు.<noinclude><references/></noinclude>
bcixk6v9o146m25axun6ivsfduumkol
పుట:పటం కతలు.pdf/132
104
212028
553124
552550
2026-04-15T08:09:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553124
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||115}}</noinclude>
ఈ బొమ్మల్లో కాటమరాజు, పెద్దిరాజు, పోలురాజు, గంగురాజు, పెద్దమదేవి, ఎర్రన్న, బత్తిరన్న, పావ్య, కౌంరవ్వ, పెద్దపులి, చిరుతగండు, కుక్క, తోడేలు, గంగాదేవి మొదలైన అనేక పాత్రలు గల బొమ్మలు నూట యాభై వరకు ఉంటాయి. బొమ్మల ప్రదర్శనలో చివరిన గంగాదేవి బొమ్మ తీసేటప్పుడు యాదవ కులస్త్రీ ఇంటిపెద్ద బోనం వండి తీసుకొని వస్తుంది. గంగాదేవికి బొట్టుపెట్టి హారతి వెలిగించి కొబ్బరికాయ కొడుతుంది. ప్రేక్షకులకు పసుపు బొట్టు పెట్టి అందరూ గంగాదేవి మీద అక్షింతలు వేసి దండం పెట్టుకుంటారు.
తర్వాత మందెచ్చు నాయకుడు గంగాదేవిని ఇంట్లోకి తీసుకునిపోయి మంగళం పాడి త్యాగంగా వడ్లు, జొన్నలు, యాదవులు ఒప్పుకున్న ప్రకారం గొర్రె, గంగాదేవికి చీర, రవికె, చనిపోయిన యాదవుడు తిన్న గిన్నె, చెంబు, దుస్తులు, బోల్కడియం, దండకడియం, కొనకు పోగు లాంటివి తీసుకుంటారు. కథ ముగింపులో మంగళహారతి పాడి ప్రేక్షకుల నుంచి కట్నాలు తీసుకుంటారు.
వీరు చెప్పే కథల్లో శోక, కరుణ, వీర, భయానక రస ప్రధానమైనవే ఎక్కువగా ఉంటాయి. ఈ కళాకారులు కథను చాలా నిదానంగా రాగం తీస్తూ ప్రేక్షకులకు అర్ధమగు భాషలో చెపుతారు. కథ మధ్యలో సామెతలు, పొడుపు కథలు, హాస్య
కథలు చెపుతూ.. ప్రేక్షకులకు సందేశాన్ని, సంతోషాన్ని అందిస్తారు. కథ చెబుతున్నప్పుడు ఆయా సన్నివేశాలను బట్టి ప్రేక్షకులు ఒసుగులు (కట్నాలు) చనిపోయిన వారి పేర్ల మీదుగా చదివిస్తారు.
కథ గాన రూపంలోనూ, వచన రూపంలోనూ ఉంటుంది. సహజ శైలిలో పాడేందుకు వీలుగా ఉంటుంది. కథలో పునరావృత్తులు, వర్ణనలు, వారాను వర్తనాలు అధికంగా వస్తాయి. సరళ ఛందస్సు కలిగి ఉంటుంది. కథకులు అశువుగా కథలు చెప్పడం, సందర్భానుసారంగా హాస్యగాడు ప్రాంతీయ కథలు, పిట్టకథలు చెప్పి ప్రేక్షకుల దృష్టి మరల్చకుండా చేస్తాడు. కథలో నీతిభావం, భక్తిభావంతో పాటు.. ప్రేక్షకులకు సందేశాన్ని అందిస్తుంది.
మందెచ్చుల వారి బొమ్మలను వెదురు బుట్టలలో చాలా జాగ్రత్తగా మరియు పవిత్రంగా భద్రపరుచుకుంటారు. ఈ బొమ్మలను 'నకాశి' అనే కులం వారు<noinclude><references/></noinclude>
enhodxx3psfjbvbjfms0wz1tuxk2kv4
పుట:పటం కతలు.pdf/133
104
212029
553126
552551
2026-04-15T08:13:11Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553126
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|116||పటం కతలు}}</noinclude>
తయారుచేసి రంగులు వేస్తారు. వారి దగ్గర మందెచ్చుల వారు కొనుక్కుంటారు.
మందెచ్చుల వారికి కథలు లేని సమయంలో కూలి పనులకు వెళ్తారు. త్యాగంలో వచ్చిన మేకలను, గొర్లను మేపుకుంటూ జీవిస్తారు. కట్నంగా వచ్చిన ధాన్యం, డబ్బులు, వెండినగలు కళాకారులు అందరూ సమానంగా పంచుకుంటారు.
మందెచ్చుల వారు సహజ సిద్ధంగా ధోతి కట్టుకొని తెల్లఅంగి ధరిస్తారు. జుట్టు పెంచుకుంటారు. మెదలో పొడవాటి వెండి గొలుసులు, చేతికి వెండి కడెం, వెండి పోంచి ధరించి ఉంటారు. వీరిని చూడగానే మందెచ్చుల వాళ్లు అని గుర్తుపట్టే
విధంగా వీరి దైనందిన వేషదారణ ఉంటుంది.
యాదవుల ఆదరణతో మందెచ్చుల కళారూపం ఇప్పటికీ సజీవంగా ఉండటం విశేషం. గతంలో కంటే వీరి జీవనశైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కథాగానమే వృత్తిగా జీవిస్తున్న వారికి శాశ్వత గృహాలు లేకపోవడం విచారకరం. వీరి ఉనికి తెలియచేసేందుకు వీలుగా ప్రభుత్వం, స్వచ్చంద సంస్థల విశ్వ విద్యాలయాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది.
{{right|- డా॥ శ్రీమంతుల దామోదర్}}<noinclude><references/></noinclude>
pcms1jr6cjeur1zio3krewu5h9flg77
పుట:పటం కతలు.pdf/134
104
212030
553128
552552
2026-04-15T08:16:58Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
553128
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = పటం_కతలు.pdf
|Page = 134
|bSize = 450
|cWidth = 363
|cHeight = 95
|oTop = 38
|oLeft = 39
|Location = center
|Description =
}}
{{center|{{p|fs150}}'''13. మాసయ్య పటం కత '''</p>}}
జానపద విజ్ఞానంలో ఆశ్రిత కులాలకు ఒక విశిష్టమైన సాహిత్యంతో పాటు.. వైవిధ్య భరితమైన సాంస్కృతిక జీవనం ఉంది. క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందిన పాల్కురికి సోమనాథుడు రచించిన 'పండితారాధ్య చరిత్ర'లో ఆశ్రిత కులాల ప్రస్తావన కనిపిస్తుంది. అంతటి ప్రాచీనత కలిగిన ఆశ్రిత కులాలు నేటికి సమాజంలో తమ సంస్కృతిని కాపాడుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయి. ఇవి హక్కుగా ఒక ప్రక్రియ ద్వారా దాతృ కులాలకు లేదా పోషక కులాలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే దాతృకులాల మూలపురుషులు వంశచరిత్ర లేదా కుల పురాణాన్ని వంశం యొక్క గోత్రనామాలను కీర్తిస్తున్నారు. ఇందులో కొన్ని ఆశ్రిత కులాలు కనికట్టు విద్యలు ప్రదర్శించి కూడా దాతృకులాన్ని ఆనందింపజేస్తున్నాయి. ఇటువంటి ఆశ్రిత కులాలను ఉపకులాలు, వృత్తి గాయకులు, భిక్షుక గాయకులు, ఆశ్రిత<noinclude><references/></noinclude>
thqzv9n2av1g9g0wgwees4hzio8oa9f
పుట:పటం కతలు.pdf/135
104
212031
553129
552553
2026-04-15T08:18:17Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
553129
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = పటం_కతలు.pdf
|Page = 135
|bSize = 450
|cWidth = 440
|cHeight = 396
|oTop = 5
|oLeft = 8
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
0piv1ppnzp3q2i8b4ejn4bd0kv2dslu
పుట:పటం కతలు.pdf/136
104
212032
553139
552554
2026-04-15T10:39:20Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553139
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||119}}</noinclude>కళారూపాలుగా పిలుస్తున్నారు. వీరంతా తరతరాలుగా సంప్రదాయంగా, మౌఖికంగా సంక్రమించిన విద్యనే దాతృకులం దగ్గర ప్రదర్శిస్తూ వారివారి హక్కులను కాపాడుకుంటున్నారు.
ఆశ్రిత కులాలు లేదా కళారూపాలు తెలంగాణ రాష్ట్రంలో 52కు పైగా ఉన్నాయి. ఇందులో వినూత్నమైన ప్రక్రియకు సంబంధించిన కళారూపాల్లో పటం కథలను ప్రముఖంగా చెప్పవచ్చు. ఇవి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కనిపించడం
ప్రత్యేకంగా చెప్పవచ్చు. మాదిగ కులకథ అయిన జాంబ పురాణాన్ని డక్కలివారు, మాలల మూలకథ బేతాళ పురాణాన్ని గుర్రపువారు, చాకలి కుల కథ అయిన మడేలు పురాణాన్ని మాసయ్యలు, పద్మశాలీల కుల కథ మార్కండేయ పురాణాన్ని
కూనపులివారు, యాదవుల కుల కథ కాటమరాజు కథలను తెరచీరలవారు, గౌదుల కుల కథ గౌడ పురాణాన్ని గౌడజెట్టీలు పటాలను చూపెడుతూ గానం చేస్తుంటారు. ఈ కులపురాణ కథా చిత్రాలను పొడవైన వస్త్రాలపైన చిత్రించి కథను ప్రదర్శిస్తారు. వీటినే పటం అంటారు.
ఈనాడు మారుమూల గ్రామాల్లో బతుకుతున్న పటం కథకు అతి ప్రాచీనమైన చరిత్ర ఉంది. వైదిక వాంజ్ఞయంలోనే యమపటాల' ప్రస్తావన ఉంది. ఆనాడు యమపటాల ద్వారా వైదిక సంస్కృతి ప్రచారం జరుగుతుండేది. బౌద్ధ, జైన మతాలు కూడా ఈ పటాల ద్వారా తమ మతాలను ప్రచారం చేసినందువల్ల సామాన్య, పామర జనులను ఆకట్టుకున్నాయి. ఆ మతాలు క్షీణించిన తర్వాత పామరులు తమ కుల పురాణాల ప్రచారానికి పటం కథలను స్వీకరించి ఉండవచ్చు. ఈనాడు భారతదేశంలోని బీహార్, బెంగాల్, ఒరిస్సా, కర్ణాటకలో ప్రచారంలో ఉన్న పటం కథలను 'పటచిత్రాలని', మహారాష్ట్రలో 'పటా'లని, రాజస్థాన్ లో 'బాబూజీకా పట్ అని అంటారు. పట చిత్రాల ప్రదర్శనలు మన దేశంలోనే గాక.. చైనా, ఇండోనేసియా, నేపాల్, టిబెట్లో కూడా ఉన్నాయి.
మన తెలుగు నేలలో ముఖ్యంగా తెలంగాణలో ఈ పటచిత్రాలను చిత్రించేవారు 'నకాశి' కులం వారు. చిత్రకళను కుల వృత్తిగా నమ్ముకుని బతికే వీరు చేర్యాలలో ఉన్నారు. వీరి వంశం వారు నిర్మల్, కొండపల్లి ప్రాంతంలో<noinclude><references/></noinclude>
fup3agazhq2yoqxjzwbzen1ek57nta0
పుట:పటం కతలు.pdf/137
104
212033
553140
552555
2026-04-15T10:45:07Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553140
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|120||పటం కతలు}}</noinclude>
ఉన్నారంటారు. నకాశి కులం వారు పటం తయారుచేయడానికి ముందు పొడవైన తెల్లటి సైను బట్టను చదునుగా ఉన్న నేలమీద పరుస్తారు. తర్వాత ఖడి, గోండు, గంజిని కలిపిన మిశ్రమాన్ని తయారుచేసి వెడల్పయిన కుంచెతో గానీ, గుడ్డముక్కతో గానీ బట్టపైన సమంగా పూస్తారు. బట్ట మీద మిశ్రమం తడి ఆరిన తర్వాత నల్లరంగు గీతలతో డ్రాయింగ్ వేసుకొని.. వివిధ రంగులతో నింపుతారు. ఎక్కువగా నీలం, నలుపు, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, పసుపుపచ్చ రంగులను వాడుతారు. వీరికి తాము చిత్రించే కథల గురించి ఎక్కువగా తెలియదు. పాత పటాలను చూసి 'నకలు' వేయడం లేదా కావలసిన చిత్రాలు గురించి కథకులు చెబితే చిత్రిస్తుంటారు. పటం కథకులు పటాన్ని కొన్న తర్వాత పూజచేసి వాడటం మొదలు పెడతారు. పటం వాడిన తర్వాత పాతదైతే దానిని పూజించి గంగలో వదిలేస్తారు.
ఇటువంటి పటం కథను వృత్తిగా చేసుకొని చాకలి కులానికి ఆశ్రితులుగా ఉంటూ చాకలి కులపురాణం అయిన మడేలు పురాణాన్ని చెప్పేవారిని 'మాసయ్యలు అంటారు. మడివేలయ్య లేక మదేలయ్య అనే పేరు చాకలి కులానికి మారుపేరుగా
ఎలా నిలిచిపోయింది.. మడివేలయ్య ఎవరు..? ఎలా ఉనికిలోకి వచ్చాడు అనడానికి ఒక కథ మౌఖికంగా ప్రచారంలో ఉంది. దాని ప్రకారం నేడు మడేలు పురాణకథ శక్తిపుట్టుకతో ప్రారంభమవుతుంది. దక్షశత మహాదేవి దంపతులకు పార్వతితో పాటు పరమేశ్వరుని వరప్రభావంతో 100 మంది సంతానం కలుగుతుంది. పార్వతి తండ్రిని ధిక్కరించి తపస్సు చేసి శివుణ్ణి వివాహమాడుతుంది. ఆ కోపంతోనే దక్షప్రజాపతి తాను నిర్వహిస్తున్న యజ్ఞానికి శివపార్వతులను పిలవడు. అయినా పార్వతి ఆ యజ్ఞగుండం వద్దకు వెళుతుంది. పార్వతి అవమాన భారంతో యజ్ఞగుండంలోకి దుమికి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు తన జట నుండి వీరభద్రుడిని ఉద్భవింపజేసి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపిస్తాడు. దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసిన తర్వాత త్రిమూర్తుల వద్దకు వెళ్లి దక్షున్ని చంపి, కాల్చి, మాడ్చి, ఊడ్చి ఉస్సోమన్నాని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు 'యజ్ఞాన్ని నాశనం చేయమంటే దానితో పాటు స్త్రీ హత్య, శిశుహత్య, బ్రహ్మ హత్యలు చేసి పాప పంకితుడైనావు కాబట్టి నీ నీడ మాపై పడకూడదు' అని అంటారు. నువ్వు పాలగుండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్తు అని<noinclude><references/></noinclude>
rspecz223mm9tzapchkwi3uji541bvn
పుట:పటం కతలు.pdf/138
104
212034
553142
552556
2026-04-15T10:50:48Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553142
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||121}}</noinclude>
అంటారు. అపుడు వీరభద్రుడు చెమట బిందువుల నుంచి ఇద్దర ప్రవాస కర్తలు మడేలయ్య, మాసయ్యలు భూమి మీద పుడతారు.
మడివేలయ్య బట్టలు ఉతకడం, మాసయ్య దేవునికి పూజచేయడం చేస్తుండేది. మాసయ్య అన్నం, ఆహారం లేకుండా పూజలోనే ఉండేది. ఎవరైనా వచ్చి ఇస్తేనే తినేది లేకుంటే లేదు. ఒకరోజు బాగా ఆకలి వేసిన మాసయ్య, మడేలయ్య అడుక్కుని తెచ్చుకున్న అన్నాన్ని ఒక్కడే తింటాడు. స్నానం చేసి భోజనానికి వచ్చిన మడేలయ్య కోపించి మాసయ్యతో 'పంచినదాన్ని మారు పంచుడయితే లేదు, నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నావు కాబట్టి ఏడాదికొకసారి అర్తివాడవై నా ఇంటికి వస్తే నీకు త్యాగం ఇస్తా' నంటాడు. అందుకే వీరి మధ్య కంచం పొత్తు ఉన్నప్పటికీ వియ్యపు
పొత్తు లేదు. చాకలి వారికి మాసయ్యలు ఆడబిడ్డలు అర్తివారు వంటివారు. అందుకే అర్తిబిడ్డ దీవెన, ఆడబిడ్డ దీవెన, జంగం దీవెన సమానం అంటారు.
వీరభద్రుని అవతారం అయిన మడేలయ్య సురా ముప్పది కోట్ల దేవతలు విడిచిన వస్త్రాలను పాపపరిహారం చేసుకోవడానికి పన్నెందు సంవత్సరాలు పిండుతాడు. పన్నెండు సంవత్సరాలు పిండడం పూర్తయిన తర్వాత ఒకసారి
పరమశివుడు మడేలయ్యను వృత్తిపరంగా పరీక్షించదలిచి ఒక బొంతనిచ్చి ఉతకమంటాడు. కానీ ఉతకడానికి కావలసిన నీటిని, చవుడును, భాండాన్ని మాయం చేస్తాడు. మడేలు తన భార్య సీతాలును చంపి ఆమె శరీరావయవాలతో ఉతకడానికి కావలసిన పరికరాలను తయారుచేసుకొని బొంతను ఉతికిస్తాడు. శివుడు మడేలయ్య మహత్తుకు భయపడి ముందు పారిపోయినా తర్వాత ప్రత్యక్షమై వరం కోరు కొమ్మంటాడు. అపుడు మడేలయ్య తనకు చాకలి వృత్తి కావాలని, వండని కూడు, వడకని బట్ట, పిండని పాడి, ఇంటిముందు తడి వస్త్రాలు, పొడి వస్త్రాలు తరగకుండా ఉండాలని, ఎటువంటి రాజపుంగవులు కోకలు అయినా తాము ధరించినప్పటికీ తననేమి అనకుండా ఉండాలని కోరుకుంటాడు. అపుడు పరమశివుడు అలాగేనని దీవించి 'ముందుగా నీకు అన్నం పెట్టినవారు ముక్తిపొందుతారు, పెట్టనివారు నరకం
వెళతారు, మరో జన్మలో నీకు కట్నాలు, కానుకలు ఇస్తార'ని ఆశీర్వదించి మాయమవుతాడు. ఈ విధంగా జీవించే మడేలయ్య వంశం వారే చాకలివారు.<noinclude><references/></noinclude>
0wk8c9qvq6k2wa1b2m69stmc8cuea1q
పుట:పటం కతలు.pdf/139
104
212035
553143
552557
2026-04-15T10:55:10Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553143
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|122||పటం కతలు}}</noinclude>
అందుకే మదేలయ్య రజక కులానికి మూలపురుషుడిగా చెప్పబడుతాడు. వీరభద్రాంశ సంభూతుడు. శివుని పరీక్షల నెదుర్కొని మెప్పించిన శివభక్తుడు. మాసయ్యలకు తమ కులకథను కీర్తించే హక్కును, భుక్తిని ప్రసాదించిన దయాకుడు.
శివానుగ్రహంతో బట్టలుతికే వృత్తిని గౌరవంగా స్వీకరించిన కులాభిమాని, ఇంతటి శైవభక్తుడు మడేలయ్య కథను గానం చేయడం వల్ల చాకలివారికి తమ కులవృత్తి పైనా, కులం పైనా, మూలపురుషుడైన మడేలయ్య పైనా భక్తి విశ్వాసాలు
పెరుగుతాయి. ఇటువంటి మడివేలయ్య పురాణంతో పాటు... మాసయ్యలు పటం సహాయంతో చాకలివారికి స్తంభ పురాణం, పార్వతీ కల్యాణం, దక్షయజ్ఞం వంటి శివపురాణాలకు సంబంధించిన కథలు చెబుతారు.
కథ చెప్పే ప్రదేశంలో వెడల్పు 8 అడుగులు, పొడవు 5 అడుగులు ఉండేవిధంగా నాలుగు గుంజల పందిరి వేస్తారు. రంగస్థలం వెనుకభాగంలో తెల్లని పరదాగుడ్డ కడతారు. ముందు భాగానికి పైన కుచ్చుల పరదాతో అలంకరిస్తారు.
వెనుక తెల్ల పరదా దగ్గర మరి రెండు గుంజలు నాటి ఆ గుంజల పైన చుట్టబడి ఉన్న పటం కడతారు. కథ చెప్పేటప్పుడు ఈ పటంను పైనుండి కిందకు లాగుతూ ఉంటారు. ఈ విధంగా లాగుతున్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో కథకు అనుకూలంగా దృశ్యాలు వస్తుంటాయి. అదే విధంగా కథ చెపుతున్నపుడు తప్పకుండా రాగిసన్నత్ ఉంటుంది. రాగిసన్నత్ రంగస్థలం మీద లేకుండా కథ చెప్పనివ్వరు.
పటం దగ్గర కథ చెప్పే వ్యక్తి నిలబడి కథాగానం ప్రారంభిస్తారు. ప్రదర్శన కోసం ఐదుగురు కళాకారులు ఉపయోగ పడతారు. ప్రధాన కథకుడికి ఇరుపక్కల ఇద్దరు తాళాలు వాయిస్తూ వంత పాడతారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మద్దెల, మరొకరు హార్మోనియం వాయిస్తారు. కథకుడు చేతిలో ఉన్న బెత్తంతో పటం చూపుతూ కథను వచనంగానూ, పాటగాను రాగయుక్తంగా వివరిస్తుంటే వంతలు వాద్య సహకారం ఇస్తూ వంతపాడుతూ కథ కొనసాగడంలో సహాయపడు తుంటారు. మధ్యమధ్యలో కథకుడు ప్రేక్షకులను ఉత్తేజితులను చేయడానికి ఎగరడం, హాస్యపు మాటలు చెప్పడం చేస్తుంటారు. ప్రధాన కథకుడు చేతిలో బెత్తం, కాళ్లకు గజ్జెలు, తలపై రుమాలు, చేతికి వెండి పొంచి, చెవులకు కుండలాలు, మెడలో వెండి గొలుసులు ధరించి కథాగానం చేస్తాడు. కథ మొదలుపెట్టేముందు ఊదుబత్తీలు<noinclude><references/></noinclude>
051ykhvmu9x0qs4vrpaffqrom5m4f1p
పుట:పటం కతలు.pdf/140
104
212036
553144
552558
2026-04-15T10:59:21Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553144
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||123}}</noinclude>
ముట్టించి కొబ్బరికాయ కొట్టి పటాన్ని కిందకు దించి మొదలుపెడతారు. పటం పైవైపున కడతారు కాబట్టి పైనుంచి కిందకు ఒక దృశ్యం తరువాత మరొక దృశ్యాన్ని లాగవలసి ఉంటుంది. పనుల కాలంలో ఎక్కువగా రాత్రిపూట కథ చెపుతారు. మాగి రోజుల్లో కూడా రాత్రిపూట చెపుతుంటారు. పనులు లేని తీరిక కాలంలో గ్రామాల్లో సంచార జీవనం కొనసాగిస్తూ కథలు చెపుతుంటారు. పూర్వం గుర్రాలు ఉన్నపుడు వాటి మీద సామాన్లు వేసుకొని వెళ్లేవారట. చాకలివారి ఇంటిపట్టునే వీళ్లు కూడా చూరు కింద ఆశ్రయం పొందుతారు. ఆ గ్రామాల్లో ఉన్నన్ని రోజులూ మాసయ్యలను పోషించవలసిన బాధ్యత ఆ చాకలి కులస్తులదే.
మాసయ్యల దగ్గర పూర్వం రాజులు ఇచ్చిన రాగిసన్నత్' ఉంటుంది. రాజులు లేక పాలకులు తమ ఇలాభాలోని గ్రామాలలోన వివిధ కులాలను ఆశ్రయించడానికి వచ్చిన ఉపకులాల వారికి ఉన్న హక్కును తెలియజేస్తూ రాసి ఇచ్చిన రాగి శాసనాన్ని సన్నత్ అంటారు. గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే చాకలి కులపెద్దను కలిసి ఈ రాగిసన్నత్ అతనికి చూపించి త్యాగం ఖరారు చేసుకుంటారు. తర్వాత కులపెద్దలు ఒక చాపలో ఉత్తరం లేదా తూర్పు వైపు ముఖం ఉండే విధంగా కూర్చొని రాగిసన్నత్ పైన కుడిచేయి ఉంచగా మాసయ్య వారికి బొట్టుపెట్టి దీవనార్తి పెడతారు. ఈ విధంగా అందరు కులపెద్దలకు చేస్తాడు మాసయ్య. 'త్యాగం' అంటే మాసయ్యకు హక్కు కింద చాకలివారు ఇచ్చే డబ్బు లేదా ధాన్యం అని అర్థం.
కథ మొదలుపెట్టే ముందు స్నానం చేసి శుచిగా రంగస్థలం వద్దకు వచ్చి ఊదుబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి ప్రేక్షకులకు కుంకుమ బొట్లు పెట్టి ఓంకార్ విరాట్తో కథ ప్రారంభిస్తారు. ఓంకార్ విరాట్ సృష్టికర్త, భూమి, ఆకాశం,
చిమ్మచీకట్లో ఉన్నపుడు ఓంకార్ విరాట్ మిణుగురు పురుగుగా అవతరిస్తాడు. ఈయనకు ఎడమ వైపుగా ఆది మహాశక్తి వెయ్యి హస్తాలతో, వెయ్యి ఆయుధాలతో నిలబడి ఉండగా.. కుడివైపున ఆది బసవేశ్వరుడు ఉంటాడు. ఈ విధంగా
ప్రారంభమైన శివపురాణానికి సంబంధించిన కథలు ఒక క్రమపద్ధతిలో చెప్పబడుతుంటాయి. వీరి కథలు వినడానికి చాకలివారే కాదు.. అన్ని కులాలవారు వీలును బట్టి వస్తుంటారు. కథ చెప్పడం పూర్తయిన తర్వాత మంగళహారతిలో
ప్రేక్షకులు డబ్బులు వేసి మాసయ్యల వద్ద దీవెన పొందుతారు.<noinclude><references/></noinclude>
awcgjgpxtp1pg2a38yo2odbbw6z87bu
పుట:పటం కతలు.pdf/141
104
212037
553145
552559
2026-04-15T11:01:11Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553145
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|124||పటం కతలు}}</noinclude>
ప్రస్తుతం మాసయ్య కథకులు చాలా తక్కువ మంది ఉన్నారు. కళకు సరైన ఆదరణ లేకపోవడంతో తమ పిల్లలకు ఈ కథను నేర్పించలేకపోతున్నారు. చాకలి కులం వారి పురాణం చెపుతూ వారి సంస్కృతిని పరిరక్షిస్తున్న మాసయ్యలకు
దాతృకులం ఆదరణతో పాటు.. ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరం. అప్పుడే ఇలాంటి కళలు అంతరించి పోకుండా ఉంటాయని చెప్పవచ్చును.
{{right|-డా॥ చూరేపల్లి రవికుమార్}}<noinclude><references/></noinclude>
11ernhvtu2bvg74ao015knougykc8t9
పుట:పటం కతలు.pdf/142
104
212038
553147
552560
2026-04-15T11:05:28Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
553147
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = పటం_కతలు.pdf
|Page = 142
|bSize = 450
|cWidth = 362
|cHeight = 86
|oTop = 42
|oLeft = 39
|Location = center
|Description =
}}
{{center|{{p|fs150}}'''14. పెక్కర్ల పటం కత '''</p>}}
శూన్యంలోంచి కుండ ఆకారాన్ని ఊహించి దాన్ని మట్టి ఆధారంగా రూపొందించిన సృష్టికారుడు గుండ్ర బ్రహ్మ. అపూర్వ సృజనశీలుడు. ఈయన మట్టితో పాత్రలని తయారు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు.
కుండను తయారుచేయడంతో మానవ నాగరికత వికాసం పొందింది. హిందూ సంస్కృతిలో కుండ అత్యంత ప్రాధాన్యం పొందింది. కర్మకాండల్లో కుండకు ఇస్తున్నంత విలువ మరేపాత్రకూ ఇవ్వడం లేదు.
మనిషి పుట్టినప్పుడు 'మాయికుండ' అవసరమైంది. పెళ్ళికి 'బరోండ్లు కుండలు' అవసరం. మనిషి చనిపోయి
నప్పుడు “పిండకుండ” ఇంకా అవసరం. ఇంకా సమాజంలో మానవులు ఎన్నో పనులకు కుండను ఉపయోగిస్తున్నారు.<noinclude><references/></noinclude>
svqyglrvauw362zo5y5affmdlutwfk7
పుట:పటం కతలు.pdf/143
104
212039
553148
552561
2026-04-15T11:10:19Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553148
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|126||పటం కతలు}}</noinclude>
కుమ్మరి జాతిమూల పురుషుని చరిత్రను వివరించేది 'కుమ్మరి పురాణం'. శాలివాహన శకం ప్రారంభం కుమ్మరి సామాజిక వర్గంలో పుట్టిన మైసూరురాజువల్ల ఏర్పడింది.
వృత్తి పురాణాల్లో కుమ్మరి పురాణానికి ఎనలేని గౌరవం ఉంది. శాలివాహన శకారంభం కూడ కుమ్మరి జాతి విజయానికి సంకేతంగా నిలిచింది. క్రీ.శ. 78లో ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుని ఓడించిన ఘనచరిత్ర శాలివాహనులకే దక్కింది.
అపూర్వమైన కుండను సృష్టించిన వృత్తి చరిత్రతోపాటు చారిత్రక పురుషుడు శాలివాహనుడికి సంబంధించిన చరిత్ర, సంస్కృతులను ఈ కుమ్మరి పురాణం వివరిస్తోంది.
ఈ కుమ్మరి పురాణం కథాగానం “పెక్కరులు” అనే ఆశ్రిత కులాలవారు చేస్తున్నారు. ఈ పురాణానికి చిత్రపటం మాధ్యమంగా ఉపయోగించుకుంటారు.
:తబల,
:హార్మోనియం,
:తాళాల
సహకారంతో యక్షగాన సాహిత్యరూపకంలో కథాగానం చేయడం విశేషం.
బుర్రకథ లాంటి వివిధ సాహితీ ప్రక్రియల్లో కూడా ఈ కుమ్మరి పురాణం చెప్పబడుతూ వస్తోంది.
'''కుమ్మరి వాళ్ల ఆవిర్భావం '''
ఆదిశక్తి పురాణగాథలో ఆమె దహనం అయిన తరువాత ఆ చితాభస్మం నుంచి సరస్వతి, లక్ష్మి, పార్వతులకు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులతో జరగబోయే వివాహానికి “బరోని” కుండలు అవసరమైనాయి. ప్రతిభగల పౌలస్త్యబ్రహ్మని ఏరోని
కుండలను చెయ్యమని దేవతలు నియమించారు. ఆయన కొడుకే గుండ్యబ్రహ్మ. ఆయనే శివపార్వతుల వివాహానికి బరోని (అరివెలి) కుండలను తయారుచేసి అందిస్తాడు.<noinclude><references/></noinclude>
bxer89yw7wvz6v28r9gdeofsx74wsl2
పుట:పటం కతలు.pdf/144
104
212040
553151
552562
2026-04-15T11:16:23Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553151
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||127}}</noinclude>
ఈ పురాణ కథ బీజం పౌరాణిక సంబంధమైన శివపురాణంలో మిళితమై ఉంది. చారిత్రకంగా శాలివాహనుని విజయంతో ఈ పురాణం పరిసమాప్తం అవుతుంది. కుమ్మరిజాతి మూలపురుషునిగా ఆయనను గుర్తించడంవల్ల దీనికి శాలివాహన పురాణం అనికూడ పేరు వచ్చింది. కాలాన్ని లెక్కించే శకచరిత్ర కూడ శాలివాహన నామంతో ఆరంభం కావడం నాగరికతకు చిహ్నంగా నిలిచింది.
'''పెక్టరు ఆవిర్భావం '''
కాకతీయ ప్రతాపరుద్రుడు ఈ ఆశ్రిత కులాలకు పెక్కర్లు అని పేరు పెట్టాడు. జన వ్యవహారాల్లో బాగా ప్రసిద్ధిపొందిన ఒక పురాణగాథ ఈ పెక్కర్ల వృత్తి ఆవిర్భావం గురించి వివరిస్తోంది. ఓరుగల్లు పట్టణంలో పూర్వం కుమ్మరి వృత్తివాడు కుండలు చేసుకునేందుకు రేగడిమన్ను తెచ్చి రాసిగా పోసుకున్నాడు.
తోటి కుమ్మరివాడు ఆ రాశిలో నుంచి కొంత మట్టిని దొంగిలించాడు. ఇది తెలిసి వృత్తిదారులంతా కలిసి ఆ మట్టి దొంగను పట్టుకొని వెలివేసారు.
అయితే ఆ రోజుల్లో సమాజం నుండి వెలివేసిన వారికి ఉపాధి చూపించడం కూడా ఒక ధర్మం. తమ కులంలో నుంచి విడిపోతున్న వారికి తమ కుల మూల పురుషుని యొక్క కుమ్మరి పురాణం కథాగానం చేయమని ఆజ్ఞాపించాడు. అయితే
ఆ వెలివేసిన కులానికి ఏ పేరు పెట్టారో తెలియక కాకతీయ ప్రభువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆయన అక్కడికి వచ్చిన పెక్క జనాలతో చర్చించాడు. పెక్కండ్రు కూడి పేరు పెట్టినందువల్లె వారికి పెక్కండ్రు అనే నామం కలిగింది. వారికి ప్రతాపరుద్రుడు మిరాశీ హక్కులను కల్పిస్తూ రాగి శాసనాల్లో రాసిచ్చాడు.
'''కుమ్మరి జాతి పురాణగాథ '''
ఈ పురాణకథ ప్రారంభంలో జగత్ సృష్టి గురించిన ఆదిపురాణం అంతా చెప్పబడుతుంది. భూమి, ఆకాశం, నీరు, వాయువులేని చీకటిలో ఓంకార శబ్దం పుట్టి అందులో నుంచి ఆదిశక్తి అవతరిస్తుంది. ఆమె త్రిమూర్తులకు జన్మనిస్తుంది.
అయితే ప్రేమ పేరున తన కోరికను కాదన్నందుకు బ్రహ్మ, విష్ణువులని త్రినేత్రంతో భస్మం చేస్తుంది. శివునివంతు వచ్చేసరికి, ఆయన బాగా ఆలోచించి ఆదిశక్తి దగ్గర నుండి త్రినేత్రాన్ని కానుకగా పొంది ఆమెని భస్మం చేస్తాడు. ఆ<noinclude><references/></noinclude>
iv1ge1hckw343qlutwbyjvchrs6o1or
పుట:పటం కతలు.pdf/145
104
212041
553153
552563
2026-04-15T11:22:46Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553153
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|128||పటం కతలు}}</noinclude>
చితాభస్మం నుంచి జన్మించిన సరస్వతి, లక్ష్మి, పార్వతులను త్రిమూర్తులు వివాహం చేసుకోబోతారు.
సనాతన సంప్రదాయం ప్రకారం పెళ్ళికి బరోని కుండలు కావలసి వస్తుంది. దాన్ని తయారు చేసే జ్ఞానం పౌలస్యబ్రహ్మకు ఉంది. ఆయనకు జన్మించిన గుండ్యబ్రహ్మ కుండపాత్రను తయారు చేసి ఇస్తాడు. ఆయన ప్రజ్ఞను మెచ్చుకొని
దేవతలంతా సూర్యవతితో పెళ్ళి చేయిస్తారు.
ఆయన సమాజం కోసం కుమ్మరి వృత్తిని సాగిస్తాడు కాని, ఆయనకు పుత్ర సంతానం కలుగలేదు. “న పుత్రస్య గతిర్నాస్తి" అంటూ చింతిస్తుంటే, ఆయనకి శివుడు జంగమరూపంలో దర్శనమిచ్చి సంతానభాగ్యం కలిగించాడు. ఆమె దైవ స్వరూపురాలు నాగవతి. ఆమె కన్యప్రాయంలో ఉండగానే నాగేంద్రుడు కలలో కనిపించి సంతానాన్ని ప్రసాదిస్తాడు. ఆయనే కారణజన్ముడు శాలివాహనుడు.
శాలివాహనుడు ప్రతిష్ఠానపురంలో దిన దిన వర్ధమానమవుతున్న తరుణంలో ఉజ్జయినిని ఏలుతున్న విక్రమార్కునికి అపశకునాలు ఎదురవుతాయి. తనకు శత్రువు పుట్టి పెరుగుతున్నట్టుగా కలగంటాడు. శత్రువుని వెతికి బంధించమని గూఢచారుల్ని పంపిస్తే వారు పట్టణాలన్నీ వెదుకుతూ ప్రతిష్ఠానపురం చేరుకొని శాలివాహనుణ్ణి బంధించబోయి మరణిస్తారు.
ఈ విషయం తెలిసి విక్రమార్కుడు స్వయంగా వేల సైన్యంతో దండెత్తిరాగా శాలివాహనుడు శివుని ప్రార్థించి మాయావిభూతి వరంగా పొందాడు. అంతకుముందు తాను చేసిన మట్టి ఏనుగులు, గుర్రాలు, సైన్యం, ఆయుధాలు కుమ్మరి వాములో పెట్టి వాటిమీద మాయ విభూతి చల్లగానే అవి ప్రాణం పోసుకొని శత్రుసైన్యం మీదపడి విక్రమార్కుణ్ణి ఓడిస్తాయి.
బందీగా చిక్కిన విక్రమార్కుడు కుమ్మరవాముని వాహనంగా చేసుకొని వచ్చావు. కాబట్టి "శాలివాహనుడివి”, మృణ్మయ ఆధారంగా సైన్యాన్ని తయారుచేసుకొని వచ్చావు గనుక ఉజ్జయిని నగరాన్ని “మహిమాసూరి"గా పాలించమని తనువు
చాలిస్తాడు.<noinclude><references/></noinclude>
07kgv8b5qu801qvipkop5d2mxm5eucn
పుట:పటం కతలు.pdf/146
104
212042
553155
552564
2026-04-15T11:26:52Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553155
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||129}}</noinclude>
'''సాహిత్యాంశాలు '''
చిత్రపటం ఆధారంగా ప్రదర్శింపబడుతున్న కుమ్మర పురాణంలోని సాహిత్యం సన్నివేశానికి తగిందిగానే కనిపిస్తోంది. సంతాన లేమితో కుమిలిపోతున్న గుండ్యబ్రహ్మ, సూర్యవతులకు జంగమ రూపంలో శివుడు సంతానమిచ్చిపోతాడు.
గుండ్యబ్రహ్మ కూతురిని తొట్టెలో పడుకోబెట్టినప్పుడు ఆమెకు ఎండ తాకకుండా నాగశేషు తన పడగను గొడుగుగా పట్టినతీరు చూసి దడుసుకొన్నారట. ప్రాణాలరచేతిలో పెట్టుకొని “భయమును చెందినిటు యిరుగువారిని, గ్రామంలోని వారికి రయమున రమ్ము రమ్మనుచు నెయ్యము రచ్చకు చేరియు కేకలేయ యిదియేమి వింతయని యావూరివారలు తరలి వచ్చి, నిశ్చయముగ నాగసర్పము చంపగ సంశయ మొందుచుండగను"న్నారంటూ వర్ణించి మనకి గగుర్పాటుని
కలిగిస్తాడు.
శాలివాహనుడు తన జన్మరహస్యం తెలుసుకొనేప్పుడు కథకుడు “ఒక బాలపడుచుకు ఒక భోగిపరుండు, తెలియక వర్తించే గర్భంబు నిలిచే, వీపు పుట్టితి వీవసుధలోన వీరింట కుమ్మరివారంట పెరుగ” అని వృత్తి గుర్తింపుని విశదపరుస్తాడు.
విక్రమార్కుడు గూఢచారులని పంపించే ఘట్టం ఆసక్తి రేకించే ఘట్టంగానే పేర్కొంది.
"దేశ దేశాలలో తిరుగుతూ ప్రతి యూరనుండు కుమ్మరిండ్ల నౌకటి రెండు నాడులు వరుసగ, నివశించి యచ్చోటగల వార్తలరసి రమ్ము” అని వర్ణించేది ప్రజల నుంచి ఎదిగే పాలకులమీద పెట్టే వేగుల వ్యవస్థలా కనిపిస్తోంది.
జానపదులు విశ్వసించే ఉత్పాతాలను కవి చక్కగా వర్ణించాడు. సందర్భమేదంటే, విక్రమార్కుడు, మహాకాళి గురించి ఘోరతపస్సు చేసి మెప్పించి, ఒక సంవత్సరం, ఒక దినం వయస్సు కన్యకు పుట్టిన బాలునిచేత మరణం సంభవించాలని వరం పొందాడు.<noinclude><references/></noinclude>
kvbflcq4m16b5ddm39i0ojiiir3ep08
పుట:పటం కతలు.pdf/147
104
212043
553156
552565
2026-04-15T11:28:46Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553156
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|130|పటం కతలు}}</noinclude>
బాలుడు శాలివాహనుడు పుట్టిన సందర్భంలో "భూపాలుందు పాలింపగా తత్పూర్వర్ణిత పుణ్యభోగముల కుత్సార్యత సంపాదులై యుత్సాతంబులు పుట్టె నుజ్జయినిలో నుల్కాది లక్ష్యంబులై" అంటూ కవి ఉత్పాతాలని ప్రస్తావించాడు.
కారణజన్ముడు శాలివాహనుని జననాన్ని గుండ్య బ్రహ్మ కూతురు "ఇద్ది ఏటిపై యొకదినం బేగుచో నాగేంద్రుడు ఈ పాపకూడిన నితడు పుట్టె, దీని కారణంబు దేవరకాక మొండెవ్వడెరుగునం" అంటూ సెలవిచ్చాడు.
{{right|- నేతి మాధవి}}<noinclude><references/></noinclude>
5s3cynchn96j6z9rn44ifuh1812a9bt
పుట:Sangitarasataran022902mbp.pdf/6
104
212089
552970
552878
2026-04-14T12:48:02Z
Brjswiki
6801
552970
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}సంగీతరసతరంగిణి</p>}}
{{Center|{{p|fs125}}యను</p>}}
{{Center|{{p|fs150}}బుద్ధ నాటకము</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమాంకము</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమరంగము —— అరణ్యము</p>}}
{{rule |6em }}
{{Center|'''(దేవదత్తుఁడును సేవకుఁడును జేశించుకున్నారు'''}}
దేవ - సేవకా ! అల్లదే యారాయంచపండును గనుఁగోమ్ము.
{{left margin|10em}}<poem>ఉ॥ నీలతరాభభాగమున నిద్రపుకాంతులు గుమ్మరించుచున్
మాలికగట్టిపొరు'కుసుమమ్ముల భంగిఁజెలంగిలీలవా
తూలహ౯ విదల్చుమునుదోరవుఁ బక్షములల్లనల్గన౯
వేలకొలందినంచలవింతగఁ జూడ్కులవిందొనర్చెడు౯॥</poem> </div>
సేవకా! వింటనుసాయకంబు సంధించి నాబాణవిద్యానైపుణ్యమును గనఁబఱ చెదఁగాక.
సేవ - స్వామి! ఆమోసుఫలసంధాయకంబగు మీ సాయకంబున కిచిట్టిపిట్టలేమిలెక్క?
దేవ - సేవకా ! అందున్నకైకాదు. హంసమ్ములమాంసమ్ము మిగులరుచ్యమ్మని వాడు కొందురు. కావున నేఁడువీనిఁబట్టి
మాససంబుఁజనికొనవలయును.
సేవ — దేవా ! అట్లయిన వేగమేబాణమును సంధింపుఁడు.
దేవ — ఇదిగో సాయకమువిడుచుకున్నాను. (బాణమును విడిచి పైనఁజూచి) ఔరౌరా! సేవకా! ఈయంచలపిండు పరుగుపరుగున నెగ్గురు టుంటచే నాకోల దగిలిన రాయంచయాదూరముననున్న చెట్టులపట్టునవాలియున్నట్లున్నది. పోయి వెదకివచ్చెదము గాక రమ్ము.
సేవ— అల్లదిగో వటవృక్షముచాయనుగూలెను. వేగమేరండు. (ఇద్దఱు ముందునకు నడుతురు).<noinclude><references/></noinclude>
rtyi9p8lac4ei24a9s5oc5kazk3hxcw
పుట:Sangitarasataran022902mbp.pdf/7
104
212090
552969
552922
2026-04-14T12:28:44Z
Brjswiki
6801
552969
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>
{{Center|'''(తెరయెత్తగా సర్వార్థసిద్ధుఁడును ఛన్నుఁడును బ్రవేశింతురు).'''}}
::సర్వా—(హస్తముసఁబక్షితో)
{{Center|<poem>చ॥ కటకటయెట్టి కాలమిది గాదిలి నెచ్చెలియీ పులుగునే
కుటిలకిరాతుఁడస్త్రమునఁగూల్చెను తన్మృదులాంగకంబుల౯
బొటపొటజారునెత్తురుకులు మోడ్చినచూడ్కులుజాలిగొల్ప నీ
చిటిపొటిమేను ఁజూచినను జిత్తమునీరయిపోవుజల్లున౯॥</poem>}}
మిత్రమా! ఈ సుకుమారశరీరంబున నరంబులంటి గ్రుచ్చుకొనిన సూదివంటి యీ శరీరంబుఁగనుఁగొమ్ము (బాణము పెణీకి) అక్కటా! రాజహంసమా! నీ వేమిదుష్కృత మొనర్చితివని యాదుష్టుండు నిన్నిట్లుగా శిక్షింపందొడంగె? కానిమ్ము ఛన్నా! నీయొద్దనున్న
పానీయమిటు లెమ్ము. కాసంతినీరమ్మునెు సంగిన నీపక్షిరాజముసేదఁదీర్చికొనునుగదా!
ఛన్ను - రాజకుమారా! ఇదిగోఁ బానీయము. (ఇచ్చుచున్నాఁడు) దేవా! యీ పిట్టం బడఁగొట్టినవాఁ డెవ్వఁడో యీచాయల
నేయుండును. వెదకిచూచెదఁ గాక.
(దూరమున నెదురుగా)
సేవ — (దేవదత్తునితో) స్వామి! అదిగో ముందర నెవ్వఁడో మనపిట్టంబట్టుకొనియున్నవాఁడు. (పాఱఁజూచి) ఔరా యెంకటిమూర్ఖత.
స్వామి! మఱియెవ్వరునుగారు. రాజకుమారుఁడైన సర్వార్ధసిద్ధుఁడేసుమా!
దేవ — మూర్ఖ! ఎవ్వరైననేమి? నేను గొట్టినపిట్టను వేఱోక్కఁడు పట్టుటకేమిక తంబు?
సర్వా -
{{Center|{{p|fs125}}పాట. కన్నడ - ఆదితాళము</p>}}
{{Center|{{Center|<poem>ఎటువ బెంగడఁగితి వింతటిపాపము॥ {{right|నెటు॥}}
కటకటయంతటి కఠినతఁబూనితి॥ {{right|నెటు॥}}
నిసితశరమ్ముల నెత్తురుగుఱియఁగ
నశనముకొఱకునై యంచలఁజంపఁగ॥</poem>}}}} {{right|నెటు॥}}
దేవదత్తా! జూలియాలి నూరులేని యీపులుఁగు నీయలుగువ నలయించినదిచాలక యీలీలఁగాలుదువ్విరవ్వచేసెదవేల?<noinclude><references/></noinclude>
q78w7a17qbg5giu9u9mw0qyhbhqtwuw
పుట:Sangitarasataran022902mbp.pdf/8
104
212091
552971
552966
2026-04-14T13:27:53Z
Brjswiki
6801
552971
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవ — రాజకుమారా! వాదులేల? అవును నాకోలతగిలి కూలినరాయంచను నాకిమ్మనుటయును దోషమేయాయెనా?
{{left margin|5em}}<poem>గీ॥ ఎగసిమింటనుజరియించు ఖగములందుఁ
నగ వనమ్ములఁజరియించు మృగములందుఁ
దగిలి పట్టినవారి స్వాతంత్య్రమెందు
దగవుదీనికిసుజనులు తప్పరెండు॥</poem> </div>
సర్వా — దేవదత్తా! నీధర్మోపదేశముంటుండనిమ్ము. కోమలాంగంబులురు, స్వచ్ఛములైన పక్షములును, స్వచ్ఛతరమైన మానసంబునుగల యీమానసౌకంబును నీవేలహింసింపఁదలంచితివో యెఱుఁగఁజాలను గదా!
దేవ---ఆహా ! ఆహారార్థమయ్యును, విమోదార్థమయ్యును.
సర్వా — (అధిక్షిపించి) ఆహారార్ధమంట. వినోదార్థమంట. ఔరా! మాంసాహారుల మానసంబెంతటి హింసకోరుచున్నది?
{{left margin|5em}}<poem>సీ॥ మేపినుచ్చికజేసి మెడద్రువ్వియెుకనాఁడు గోంతుఁగోసెడిజంతుహంతయొకఁడు
చిఱుతపాయమునుండి చేతులాఱఁగఁబెంచి కట్టిచంపెడుపాణిమాతియొకఁడు
దారిఁబోవుచునున్న నోరెఱుంగని జీవరాశిహింపించులాశయొకఁదు
దైవంబుపేరిట దయమాలిపనుల నోర్మూసిఖండించెడిమూర్ఖుఁడొకఁడు॥</poem> </div>
{{Center|<poem>గీ॥ చండి మగటిమిఁదనుమేనికండకొవ్వుఁ
బెంపవేఱోకజీవిని జంపువారు
నిర్ణయాత్ములుకఠినులు నీతిదూరు
లఖిలజగదపకారకులైనవారు॥</poem>}}
దేవ — ఔరా! రాజకుమారా! మిన్ను మన్నుఁగానక నన్నీ రీతి నెన్న రానిమిన్నత నంబున దూషింపసమకట్టితివి. నీకిదిధర్మంబుకాదు. నారాయంతను నాకొసంగుము.
{{Center|{{p|fs125}}పాట. జంఝూటి - ఆదితాళము</p>}}
{{left margin|5em}}<poem>విడువిడు రాయంచ విడువవదేలా
అడుగడుగున నిన్న డుగఁగనేలా
వడివడినీరీతి వాదములేలా॥</poem> </div> {{right|॥విడు॥}}
సర్వా - సరిసరియూపిరిసల్గిపెడు జీవీ
::శరమునఁగూల్సనీ కరములెట్లాడేమో<noinclude><references/></noinclude>
4zch8i4tdcs8w5agvczbxx6qib8rkot
552972
552971
2026-04-14T13:29:44Z
Brjswiki
6801
552972
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవ — రాజకుమారా! వాదులేల? అవును నాకోలతగిలి కూలినరాయంచను నాకిమ్మనుటయును దోషమేయాయెనా?
{{left margin|5em}}<poem>గీ॥ ఎగసిమింటనుజరియించు ఖగములందుఁ
నగ వనమ్ములఁజరియించు మృగములందుఁ
దగిలి పట్టినవారి స్వాతంత్య్రమెందు
దగవుదీనికిసుజనులు తప్పరెండు॥</poem> </div>
సర్వా — దేవదత్తా! నీధర్మోపదేశముంటుండనిమ్ము. కోమలాంగంబులురు, స్వచ్ఛములైన పక్షములును, స్వచ్ఛతరమైన మానసంబునుగల యీమానసౌకంబును నీవేలహింసింపఁదలంచితివో యెఱుఁగఁజాలను గదా!
దేవ---ఆహా ! ఆహారార్థమయ్యును, విమోదార్థమయ్యును.
సర్వా — (అధిక్షిపించి) ఆహారార్ధమంట. వినోదార్థమంట. ఔరా! మాంసాహారుల మానసంబెంతటి హింసకోరుచున్నది?
{{left margin|5em}}<poem>సీ॥ మేపినుచ్చికజేసి మెడద్రువ్వియెుకనాఁడు గోంతుఁగోసెడిజంతుహంతయొకఁడు
చిఱుతపాయమునుండి చేతులాఱఁగఁబెంచి కట్టిచంపెడుపాణిమాతియొకఁడు
దారిఁబోవుచునున్న నోరెఱుంగని జీవరాశిహింపించులాశయొకఁదు
దైవంబుపేరిట దయమాలిపనుల నోర్మూసిఖండించెడిమూర్ఖుఁడొకఁడు॥</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ చండి మగటిమిఁదనుమేనికండకొవ్వుఁ
బెంపవేఱోకజీవిని జంపువారు
నిర్ణయాత్ములుకఠినులు నీతిదూరు
లఖిలజగదపకారకులైనవారు॥</poem> </div>
దేవ — ఔరా! రాజకుమారా! మిన్ను మన్నుఁగానక నన్నీ రీతి నెన్న రానిమిన్నత నంబున దూషింపసమకట్టితివి. నీకిదిధర్మంబుకాదు. నారాయంతను నాకొసంగుము.
{{Center|{{p|fs125}}పాట. జంఝూటి - ఆదితాళము</p>}}
{{left margin|5em}}<poem>విడువిడు రాయంచ విడువవదేలా
అడుగడుగున నిన్న డుగఁగనేలా
వడివడినీరీతి వాదములేలా॥</poem> </div> {{right|॥విడు॥}}
సర్వా - సరిసరియూపిరిసల్గిపెడు జీవీ
::శరమునఁగూల్సనీ కరములెట్లాడేమో<noinclude><references/></noinclude>
63naatl2piru4f01eisjv7uvplknkal
పుట:Sangitarasataran022902mbp.pdf/9
104
212092
552973
2026-04-14T14:12:54Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
552973
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>
కరుణయొకించుక కలుగకయుండెనోట
దేవ - వెడవెడలింకము నుడివెదవేలా
::పొడిపొడిమాటల బొంకెదవేలా
::మిడిమిడినీతుల మీఱెదవేలా
సర్వా - కొరకొరయేటికిఁ గొరతనీకేటికి
::మురిపెపుటంచల ముట్టఁగనేటికి
::పరిపరివిధములఁ బలుకఁగ నేటికి
{{right|విడు}}
తమ్ముఁడా! దేవదత్తా! దయారాహిత్యంబునకును గాఠిన్యంబునకును గౌర్యంబునకును మూలబీజంబై తామసవృత్తికిఁ బ్రధానకారణంబై
పలువిధంబులయిన రోగంబులకు సాధనంబైన మాంసభక్షణమును బెద్దలుగర్హింతురుగదా! అట్టిదానిని నియట్టిజ్ఞానసంపన్నులైన మానవులంగీకరింపఁ బాడియగునె. ఆది యటుండఁగాఁ దమ్ముఁజూచునందఱిలి కన్నులకువిందొనర్చుచు నళ్లారుముద్దుగు సంచరించుచు మురిపెముగా ఱెక్కలల్లార్చుచు వింతవింతగాఁ దలయెత్తుచు నేమేమోయాటలాడుచుఁబాడుచుఁదనలోఁదానేసంతసించుచునేపున్నెమును
బాపము నెఱుంగక యొరులకించుకయును బాధయొనర్పక మింటినంటిచరియించునోరులేని యీరాయంచనలయింప నీకెట్లుమనసోప్పెనో రో యెఱుంగఁజాలను గదా! సూది మొనవంటి ముఖంబుగల నీ శిలీముఖము పూవుమొగ్గవలె సుకుమారమైన యీహంసశరీరంబునఁ జివుక్కునఁ గ్రుచ్చికొనినప్పుడది యెంతగాసుక్కెనో, యెట్టిబాధననుభవించెనో? ఆబాణప్రఘాతంబునకుఁ దాళకయెగయనేరక రాతివలెనింగినుండి భూమికింబడువేళ నెట్టుపరితపించెనో యూహింపఁజాలవైతినిగదా! అనుజా! ప్రాణికోటికెల్లను సుఖదుఃఖానుభవంబు లొక్కరీతినెయుండును
గదా! అట్టిప్రాణికోటి నసవసరంబుగాను విమోూదార్థమయ్యును హింసించుట స్థూలసూక్ష్మశరీరంబులు రెంటికి నపాయకరంబేకాని ప్రయోజన మొక్కింతయు లేదుగదా! మనుష్యశరీరపోషణార్థమై భూతలంబున నానావిధధాన్యంబులును, ఫలంబులును, శాకపదార్థంబులును,
బెక్కులుకొల్లలుగనుండఁ గ్రూరకర్మంబగు మాంసభక్షణంబునకు మనుజుఁడాసఁజెంద నేల? దేవదత్తా! నాచేఁజిక్కిన యీరాయంచనీకిచ్చునది కాదు. వృధాకలహమేటికి? నాదయిన కారుణ్యబుద్ధిచే దీనినే నార్జించుకొంటిని. మారాడకపొమ్ము.<noinclude><references/></noinclude>
1e9ufjo5qmchlghz6fj8ncjbcyl7lim
552974
552973
2026-04-14T14:15:43Z
Brjswiki
6801
552974
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>
కరుణయొకించుక కలుగకయుండెనోట {{right|సరి}}
దేవ - వెడవెడలింకము నుడివెదవేలా
::పొడిపొడిమాటల బొంకెదవేలా
::మిడిమిడినీతుల మీఱెదవేలా
{{right|విడు}}
సర్వా - కొరకొరయేటికిఁ గొరతనీకేటికి
::మురిపెపుటంచల ముట్టఁగనేటికి
::పరిపరివిధములఁ బలుకఁగ నేటికి
{{right|విడు}}
తమ్ముఁడా! దేవదత్తా! దయారాహిత్యంబునకును గాఠిన్యంబునకును గౌర్యంబునకును మూలబీజంబై తామసవృత్తికిఁ బ్రధానకారణంబై
పలువిధంబులయిన రోగంబులకు సాధనంబైన మాంసభక్షణమును బెద్దలుగర్హింతురుగదా! అట్టిదానిని నియట్టిజ్ఞానసంపన్నులైన మానవులంగీకరింపఁ బాడియగునె. ఆది యటుండఁగాఁ దమ్ముఁజూచునందఱిలి కన్నులకువిందొనర్చుచు నళ్లారుముద్దుగు సంచరించుచు మురిపెముగా ఱెక్కలల్లార్చుచు వింతవింతగాఁ దలయెత్తుచు నేమేమోయాటలాడుచుఁబాడుచుఁదనలోఁదానేసంతసించుచునేపున్నెమును
బాపము నెఱుంగక యొరులకించుకయును బాధయొనర్పక మింటినంటిచరియించునోరులేని యీరాయంచనలయింప నీకెట్లుమనసోప్పెనో రో యెఱుంగఁజాలను గదా! సూది మొనవంటి ముఖంబుగల నీ శిలీముఖము పూవుమొగ్గవలె సుకుమారమైన యీహంసశరీరంబునఁ జివుక్కునఁ గ్రుచ్చికొనినప్పుడది యెంతగాసుక్కెనో, యెట్టిబాధననుభవించెనో? ఆబాణప్రఘాతంబునకుఁ దాళకయెగయనేరక రాతివలెనింగినుండి భూమికింబడువేళ నెట్టుపరితపించెనో యూహింపఁజాలవైతినిగదా! అనుజా! ప్రాణికోటికెల్లను సుఖదుఃఖానుభవంబు లొక్కరీతినెయుండును
గదా! అట్టిప్రాణికోటి నసవసరంబుగాను విమోూదార్థమయ్యును హింసించుట స్థూలసూక్ష్మశరీరంబులు రెంటికి నపాయకరంబేకాని ప్రయోజన మొక్కింతయు లేదుగదా! మనుష్యశరీరపోషణార్థమై భూతలంబున నానావిధధాన్యంబులును, ఫలంబులును, శాకపదార్థంబులును,
బెక్కులుకొల్లలుగనుండఁ గ్రూరకర్మంబగు మాంసభక్షణంబునకు మనుజుఁడాసఁజెంద నేల? దేవదత్తా! నాచేఁజిక్కిన యీరాయంచనీకిచ్చునది కాదు. వృధాకలహమేటికి? నాదయిన కారుణ్యబుద్ధిచే దీనినే నార్జించుకొంటిని. మారాడకపొమ్ము.<noinclude><references/></noinclude>
d29i8satbdzoe4voriegcc32pfu1s4s
553056
552974
2026-04-15T06:46:25Z
Brjswiki
6801
553056
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కరుణయొకించుక కలుగకయుండెనోట {{right|సరి}}
దేవ - వెడవెడలింకము నుడివెదవేలా
::పొడిపొడిమాటల బొంకెదవేలా
::మిడిమిడినీతుల మీఱెదవేలా
{{right|విడు}}
సర్వా - కొరకొరయేటికిఁ గొరతనీకేటికి
::మురిపెపుటంచల ముట్టఁగనేటికి
::పరిపరివిధములఁ బలుకఁగ నేటికి
{{right|విడు}}
తమ్ముఁడా! దేవదత్తా! దయారాహిత్యంబునకును గాఠిన్యంబునకును గౌర్యంబునకును మూలబీజంబై తామసవృత్తికిఁ బ్రధానకారణంబై
పలువిధంబులయిన రోగంబులకు సాధనంబైన మాంసభక్షణమును బెద్దలుగర్హింతురుగదా! అట్టిదానిని నియట్టిజ్ఞానసంపన్నులైన మానవులంగీకరింపఁ బాడియగునె. ఆది యటుండఁగాఁ దమ్ముఁజూచునందఱిలి కన్నులకువిందొనర్చుచు నళ్లారుముద్దుగు సంచరించుచు మురిపెముగా ఱెక్కలల్లార్చుచు వింతవింతగాఁ దలయెత్తుచు నేమేమోయాటలాడుచుఁబాడుచుఁదనలోఁదానేసంతసించుచునేపున్నెమును
బాపము నెఱుంగక యొరులకించుకయును బాధయొనర్పక మింటినంటిచరియించునోరులేని యీరాయంచనలయింప నీకెట్లుమనసోప్పెనో రో యెఱుంగఁజాలను గదా! సూది మొనవంటి ముఖంబుగల నీ శిలీముఖము పూవుమొగ్గవలె సుకుమారమైన యీహంసశరీరంబునఁ జివుక్కునఁ గ్రుచ్చికొనినప్పుడది యెంతగాసుక్కెనో, యెట్టిబాధననుభవించెనో? ఆబాణప్రఘాతంబునకుఁ దాళకయెగయనేరక రాతివలెనింగినుండి భూమికింబడువేళ నెట్టుపరితపించెనో యూహింపఁజాలవైతినిగదా! అనుజా! ప్రాణికోటికెల్లను సుఖదుఃఖానుభవంబు లొక్కరీతినెయుండును
గదా! అట్టిప్రాణికోటి నసవసరంబుగాను విమోూదార్థమయ్యును హింసించుట స్థూలసూక్ష్మశరీరంబులు రెంటికి నపాయకరంబేకాని ప్రయోజన మొక్కింతయు లేదుగదా! మనుష్యశరీరపోషణార్థమై భూతలంబున నానావిధధాన్యంబులును, ఫలంబులును, శాకపదార్థంబులును,
బెక్కులుకొల్లలుగనుండఁ గ్రూరకర్మంబగు మాంసభక్షణంబునకు మనుజుఁడాసఁజెంద నేల? దేవదత్తా! నాచేఁజిక్కిన యీరాయంచనీకిచ్చునది కాదు. వృధాకలహమేటికి? నాదయిన కారుణ్యబుద్ధిచే దీనినే నార్జించుకొంటిని. మారాడకపొమ్ము.<noinclude><references/></noinclude>
8uq2nl1h86smx82ofw7ht0z0if8xsjq
సూచిక చర్చ:పటం కతలు.pdf
107
212093
552975
2026-04-14T14:30:32Z
Rajasekhar1961
50
/* బొమ్మల సమస్య */ కొత్త విభాగం
552975
wikitext
text/x-wiki
== బొమ్మల సమస్య ==
{{ping|Arjunaraoc}} బొమ్మలను క్రాపింగ్ చేస్తుంటే కొంతభాగం మాత్రమే వస్తుంది. ఒకసారి పరిశీలించి సహాయం చేయగలరా. ధన్యవాదాలు. [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:30, 14 ఏప్రిల్ 2026 (UTC)
k4w77ew6fippgt1fgza29cxtwf65104
పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/155
104
212094
552979
2026-04-14T23:37:16Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
552979
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}టిప్పణము.</p>
{{rule|2cm}}
1. అర్హతః (సంస్కృతము) అరహా (పాళీ) -
సర్వజ్ఞుఁడును, జితరాగాదిదోషుండు నగుటచేఁ ద్రైలోక్యపూజితుండును, యథాస్థితార్థవాదియు నగువాఁడు. అర్హతులలో రెండువిధములైనవారు పేర్కొనఁబడుచున్నారు. అరహత్తమగ్గిత్థులు, అరహత్త ఫలత్థులు. అందు ఆరహత్తఫలత్థులు వీతరాగులై నిర్వాణమును జెందినవారలై దేహాంతమునను పథ్యాభావంబుఁ జెందుదురని చెప్పంబడు చున్నారు.
{{p|fs125|ac}}2. అరియులు - (పాళీ-ఆరియో)</p> బౌద్ధమతములోఁ జతుర్గుణంబగుమార్గంబు ననుసరించువార లరియులని చెప్పంబడుదురు. చతుర్గుణమార్గం బెద్దియన — సోతాపత్తిమగ్గో, సకదాగామినుగ్గో, అనాగామిమగ్గో, అరహతమగ్గో.
సోతాపత్తి - స్రోతస్సును బ్రవేశించినవాఁడు. సోతం, సోతోవాసంశ్రీ, స్రోతస్సనఁగఁ బవిత్రతయనెడి సెలయేఱు. పవిత్రతామార్గమును బ్రవేశించినవాఁడు సోతాపన్నుఁడు; అట్టివానిస్థితి సోతాపత్తి.
సోతాపత్తియంగములునాల్గు: సప్పురిససంసేవ-సత్పురుషసంసేవ; సద్ధమ్మ సవనమ్=సద్ధర్మశ్రవణము; యోనిసోమనసికారో= సుజ్ఞానమునందుమనమును నిల్పుట; ధమ్మానుధమ్మపపత్తి=ధర్మానుధర్మప్రపత్తిః- ధర్మానుధర్మముల లెస్సఁగ నాచరించుట. సకదాగామిమగ్గో- సకృదాగామి<noinclude><references/></noinclude>
9r3b53829c7nig9jfa2wi45hf7z88k5
552980
552979
2026-04-14T23:38:06Z
శ్రీరామమూర్తి
1517
552980
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}టిప్పణము.</p>
{{rule|2cm}}
1. అర్హతః (సంస్కృతము) అరహా (పాళీ) -
సర్వజ్ఞుఁడును, జితరాగాదిదోషుండు నగుటచేఁ ద్రైలోక్యపూజితుండును, యథాస్థితార్థవాదియు నగువాఁడు. అర్హతులలో రెండువిధములైనవారు పేర్కొనఁబడుచున్నారు. అరహత్తమగ్గిత్థులు, అరహత్త ఫలత్థులు. అందు ఆరహత్తఫలత్థులు వీతరాగులై నిర్వాణమును జెందినవారలై దేహాంతమునను పథ్యాభావంబుఁ జెందుదురని చెప్పంబడు చున్నారు.
2. అరియులు - (పాళీ-ఆరియో) బౌద్ధమతములోఁ జతుర్గుణంబగుమార్గంబు ననుసరించువార లరియులని చెప్పంబడుదురు. చతుర్గుణమార్గం బెద్దియన — సోతాపత్తిమగ్గో, సకదాగామినుగ్గో, అనాగామిమగ్గో, అరహతమగ్గో.
సోతాపత్తి - స్రోతస్సును బ్రవేశించినవాఁడు. సోతం, సోతోవాసంశ్రీ, స్రోతస్సనఁగఁ బవిత్రతయనెడి సెలయేఱు. పవిత్రతామార్గమును బ్రవేశించినవాఁడు సోతాపన్నుఁడు; అట్టివానిస్థితి సోతాపత్తి.
సోతాపత్తియంగములునాల్గు: సప్పురిససంసేవ-సత్పురుషసంసేవ; సద్ధమ్మ సవనమ్=సద్ధర్మశ్రవణము; యోనిసోమనసికారో= సుజ్ఞానమునందుమనమును నిల్పుట; ధమ్మానుధమ్మపపత్తి=ధర్మానుధర్మప్రపత్తిః- ధర్మానుధర్మముల లెస్సఁగ నాచరించుట. సకదాగామిమగ్గో- సకృదాగామి<noinclude><references/></noinclude>
d96wyiwzyhvuc1isjw43o1steotpbf8
552982
552980
2026-04-15T01:12:04Z
శ్రీరామమూర్తి
1517
552982
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}టిప్పణము.</p>
{{rule|2cm}}
1. అర్హతః (సంస్కృతము) అరహా (పాళీ) -
సర్వజ్ఞుఁడును, జితరాగాదిదోషుండు నగుటచేఁ ద్రైలోక్యపూజితుండును, యథాస్థితార్థవాదియు నగువాఁడు. అర్హతులలో రెండువిధములైనవారు పేర్కొనఁబడుచున్నారు. అరహత్తమగ్గత్థులు, అరహత్త ఫలత్థులు. అందు ఆరహత్తఫలత్థులు వీతరాగులై నిర్వాణమును జెందినవారలై దేహాంతమునను పథ్యాభావంబుఁ జెందుదురని చెప్పంబడు చున్నారు.
2. అరియులు - (పాళీ-అరియో) బౌద్ధమతములోఁ జతుర్గుణంబగుమార్గంబు ననుసరించువార లరియులని చెప్పంబడుదురు. చతుర్గుణమార్గం బెద్దియన — సోతాపత్తిమగ్గో, సకదాగామిమగ్గో, అనాగామిమగ్గో, అరహతమగ్గో.
సోతాపత్తి - స్రోతస్సును బ్రవేశించినవాఁడు. సోతం, సోతోవాసంశ్రీ, స్రోతస్సనఁగఁ బవిత్రతయనెడి సెలయేఱు. పవిత్రతామార్గమును బ్రవేశించినవాఁడు సోతాపన్నుఁడు; అట్టివానిస్థితి సోతాపత్తి.
సోతాపత్తియంగములునాల్గు: సప్పురిససంసేవ-సత్పురుషసంసేవ; సద్ధమ్మ సవనమ్=సద్ధర్మశ్రవణము; యోనిసోమనసికారో= సుజ్ఞానమునందుమనమును నిల్పుట; ధమ్మానుధమ్మపపత్తి=ధర్మానుధర్మప్రపత్తిః- ధర్మానుధర్మముల లెస్సఁగ నాచరించుట. సకదాగామిమగ్గో- సకృదాగామి<noinclude><references/></noinclude>
nzhjagcs206p89fxpvlwnlrtqkfgmp0
పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/156
104
212095
552985
2026-04-15T01:24:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
552985
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|2}}</noinclude>యొక్కమార్గము. ఈమార్గమును జెందిన నరుఁ డొక్కజన్మమునేపొంది యట్టి జన్మాంతమున నిర్వాణమును జెందునని బౌద్ధులు నమ్ముదురు. ఈ మార్గస్థులకు నిర్వాణప్రాప్తియగుటకుఁ బూర్వము భూలోకమునఁగాని, దేవలోకంబునఁగాని యొక్కటియగు జన్మముండునని యామతస్థుల నమ్మకము. అట్టిమార్గమును బౌద్ధులు సకదాగామిమగ్గోయని చెప్పుదురు. అనాగామిమగ్గో = అనాగామిమార్గము; ఈమార్గమును జేరిననరుఁడు తిరిగి జన్మమును బొందఁడు. ఇయ్యది నిర్వాణమునకుం గొంపోవు చతుర్మార్గంబులలో మూఁడవది. అర్హతమగ్గో=అర్హతుని యొక్కమార్గము.
3. కాకశూరుఁడు = కాకమువలె లజ్జావిహీనుఁడు.
4. నిబ్బాణ = నిర్వాణము.
“జీవనము, వ్యథ” అనునది బౌద్ధమతమును మూలములుగఁ బరిగణింపఁబడుచున్న సత్యములలో నొక్కటి. అట్లైన జీవనము దుఃఖము; కారణమైన జీవన్ముక్తి యత్యధికంబగు శ్రేయస్సు. విద్వాంసులు
నిర్వాణపదార్థముంగూర్చి భిన్నభిన్నముగ యోచించుచున్నారు.
ప్రపంచమున జన్మముఁగాంచిన ప్రతిజీవజంతువును పునర్జన్మమునకు లోఁబడియుండును. మరణాంతమున ప్రాణి సుఖదాయకం బగునట్టి గాని, కష్టభూయిష్ఠంబగునట్టిగాని పునర్జన్మను దిరిగిపొందును. పాదములక్రిందఁబడి నశించినకీట మత్యంతప్రభాశాలియగు నిలింపుఁడై యుద్భవింపవచ్చును; లేక కర్మానుభవానుసారముగ నిర్జరుండు ఘోరంబగు నరకంబులోనికిఁ బడవచ్చును. సర్వమును మార్పుఁజెందుచుండును. సర్వముననిత్యము. వర్తమానసౌఖ్యంబు భావిదుఃఖమును రాకుండఁ జేయలేదు. స్వర్గసౌఖ్యంబునకును లోపంబు కలదు. జీవనము వ్యథ, దుఃఖము. వ్యధానాశంబు జన్మమునుండి ముక్తుఁడైనవానికిఁ గాని కలుగనేరదు.<noinclude><references/></noinclude>
ruz3ie7b6ev77yxcafxa2jkb9hr4fmh
పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/157
104
212096
552987
2026-04-15T01:36:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
552987
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|3}}</noinclude>జన్మపరంపరలు స్వార్జితపాపంబువలనఁ గలుగుచున్నవి. కానఁ బాప నాశంబువలనఁగాని పునర్జన్మరాహిత్యము కలుగనేరదు. దానధర్మంబుల నొనర్చుచు మనోవాక్కాయ కర్మములచేఁ బవిత్రుండై, ధ్యానపరాయణుండైన బుద్ధశిష్యుండు చతుర్మార్గప్రవేశంబుఁ గావింప సమర్థుఁడై జన్మదుఃఖవిముక్తుం డగును. ఈ చతుర్మార్గంబులును నిర్వాణప్రాప్తిని గలుగఁజేయును. అందు మొదటిమూఁడును వివిధకాలానంతరమున నిర్వాణమును గలుగఁజేయునుగాని, నాల్గవది కొలదిసంవత్సరముల లోపలనే నిర్వాణము నొసంగును. మొదటి మూఁడుమార్గములును నాల్గవమార్గమునకుఁ గొంపోవును గనుక యా నాల్గవ మార్గముంగూర్చి
యిచట వర్ణింతము : అయ్యది యర్హతులయొక్క మార్గము. పునర్జన్మ కారణములైన సంసారానురాగము, పుణ్యపాపములు, సుఖదుఃఖములు కామరాగములు నశించిననరుఁడు అర్హతత్వమును బొందును. అట్టి సుఖదుఃఖకామరాగాదిరహితుం డైన యర్హతుఁడు ప్రలోభ క్లేశాదుల కధీనుఁడైయుండు. మఱియు నట్టివాఁడు సామాన్యనరుని వలె మృత్యువునకు లోనైయుండు. రాగకామాదుల జయించుటచేఁ బ్రలోభితుండయ్యు నట్టివాఁడు పాపంబు చేయనేరఁడు. సంసార విరక్తింజెంది, జన్మజేతయైయుండి, యట్టివాఁ డెన్ని కష్టములు సంభవించినను, మనస్సంతాపహీనుండై, శాంతిమయుండై జీవించుచుఁ గాలవశ్యతంజెంది మృతిఁజెందినను, జన్మబీజనాశంబగుటచే నట్టివాఁడు పునర్జన్మమును బొందక నిర్వాణమును జెందును.
{{rule|2cm}}<noinclude><references/></noinclude>
n3lqbn87dxklk7eiu2cllumxnq47cqi
పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/159
104
212097
552988
2026-04-15T01:53:31Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
552988
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}ధమ్మపదము</p>
{{p|fs150|ac}}తప్పొప్పుల పట్టిక</p>
{{rule|2cm}}
{| class="wikitable" style="margin:auto;"
|-
| పుట || పంక్తి || తప్పు || ఒప్పు
|-
| 1 || 15 || వాని || వానిని
|-
| 14 || 10 || గని || గను
|-
| 17 || 2 || చేయకుము || జేయకుము
|-
| 20 || 2 || నిమిత్త || నిమిత్తా
|-
| 21 || 1 || విధాయ || ప్రదాయ
|-
| 28 || 16 || దగ్దుం || దగ్ధుం
|-
| 29 || 7 || విద్వసంబు || విధ్వసంబు
|-
| 30 || 3 || ప్రతోదకము...పెట్టి || ప్రతోదకమును...పెట్ట
|-
| 36 || 3 || సిద్ధిచే || బుద్ధిచే
|-
| 38 || 3 || ప్రబోధ. || ప్రబోధము
|-
| 39 || 15 || మానుషవ్యక్తి || మానుష శక్తియుక్తుం డగు నరుడు
|-
| 40 || 14 || దురాశాపరులమధ్యమున దురాశావిముక్తులమై జీవింతము || అనార్తులమై యార్తులమధ్య సుఖముగ జీవనం బొనర్తము
|-
| 42 || 10 || సమాగంబు || సమాగమంబు
|-
| 42 || 13 || నరియుని || నరియుని నరుఁడు
|-
| 49 || 5 || నవమార్గము || నపమార్గము
|}<noinclude><references/></noinclude>
riq4ydf7xvtoyta39wjjkyhj8x5oiz6
పుట:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf/160
104
212098
552989
2026-04-15T02:10:52Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
552989
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|2}}</noinclude>{| class="wikitable" style="margin:auto;"
|-
| 55 || 16 || మార్ద || మార
|-
| 59 || 2 ||సంకీర్ణము || ప్రకీర్ణకము
|-
| 59 || 10 || లయు | లయుఁ
|-
| 61 || 2 || మనంబుఱు || మనంబులు
|-
| 63 || 12 || నప్రమాద || సప్రమాద
|-
| 65 || 11 || గజావరోహణంబు || గజారోహణంబు
|-
| 66 || 3 || జంతువులలో || జంతువులతో
|-
| 66 || 5 || నుదాంతుండగు నరుండు సనును || సుదాంతప్రాణి యగు వినీతాత్మపైఁ జనును
|-
| 66 || 15 || ట్లే || ట్లేను
|-
| 68 || 2 || శ్రవణత్వము || శ్రమణత్వము
|-
| 71 || 4 || కొఱను || కొఱకును
|-
| 73 || 10 || వారలఁ || వారల
|-
| 89 || 17 || నియమములునష్టాంగ || నియమములును అష్టాంగ
|-
| 93 || 4 || సహభాజినులుగ || సహభాగులుగ
|-
| 94 || 19 || గ్యహస్థ || గృహస్థ
|-
| 105 || 11 || వారు || దేవతలు
|-
| 108 || 7 || విద్విష్ట || విశిష్ట
|-
| 112 || 5 || వేష || మేష
|}<noinclude><references/></noinclude>
iu7sipjh7sso4odu8wft0rqqewfzufm
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/394
104
212099
553007
2026-04-15T06:31:28Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '105 నై జాము రాజ్యాన ఉయ్యాలో నల్లగొండ జిల్లాలో ఉయ్యాల ఎట్టి చాకల్దమ్మ ఉయ్యాలో ఎత్తైన మనిషమ్మ ఉయ్యాల పెద్దపై సంతైన ఉయ్యాలో బొట్టైన పెట్టింది ఉయ్యాల పాలకుర్తిలోన ఉయ్యాలో ఎట్...'
553007
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>105
నై
జాము రాజ్యాన ఉయ్యాలో నల్లగొండ జిల్లాలో
ఉయ్యాల
ఎట్టి చాకల్దమ్మ ఉయ్యాలో ఎత్తైన మనిషమ్మ ఉయ్యాల
పెద్దపై సంతైన ఉయ్యాలో బొట్టైన పెట్టింది ఉయ్యాల
పాలకుర్తిలోన ఉయ్యాలో ఎట్టిన చాకల్దమ్మ ఉయ్యాల
ఎట్టి చాకల్దమ్మ ఉయ్యాలో గట్టిదే ఐలమ్మ ఉయ్యాల
సంగమే పెట్టింది ఉయ్యాలో తానె సంగామాయె ఉయ్యాల
సంగంలో యువకులూ ఉయ్యాలో తన తనయూలైరి
ఉయ్యాల
పాలకుర్తి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ,
ఎట్టి చాకలి ఐలమ్మ. అన్నీ ఆమె పేర్లే. అక్షరం తెలియదు.
కానీ హక్కుల పోరాటం తెలుసు. ఆర్థికంగా వెనుకబాటు
తనమే ఆకలి తీర్చుకోవడానికి ఆరాటపడక తప్పని పరిస్థితే.
అయినా ఆకలెరిగి అన్నం పెట్టడం, ప్రేమ ఆప్యాయత,
కలివిడితనం వంటి లక్షణాలకు ఆమె చిరునామా. ఆమె
పోరాట జెండా. ఉద్యమం ఆమె ఊపిరి. తెలంగాణ రైతాంగ
పోరాట భూమిక ఐలమ్మ చురుకుదనం ఆమెకే స్వంతం.
స్వార్థానికి ఆమడంత దూరం. ఆత్మనిబ్బరానికి మచ్చుతునక.
1895లో కృష్ణాపురం గ్రామం, రాయపర్తి మండలం,
వరంగల్లు జిల్లాలో పుట్టింది. చిట్యాల గ్రామానికి చెందిన
నర్సయ్యను పెండ్లి చేసుకోవడంతో చిట్యాల ఐలమ్మ అనే
పేరు ముందుకొచ్చింది. ఐదుగురు కొడుకులకు, ఒక బిడ్డకు
పాలకుర్తి ఐలమ్మ
- డా॥ తిరునగరి దేవకీదేవి
జన్మనిచ్చింది. ఆర్థిక ఒడిదొడుకులు, అందుబాటులో లేని
దవాఖానాలు; భూస్వాములకు తలకు మించిన భారంతో
వెట్టిచాకిరీ చేయాల్సిన పరిస్థితి. కారణాలేమైనా కావచ్చు.
అన్నీ కావచ్చు. ఆమె ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది.
స్వంతభూమి లేకున్నా కులవృత్తి బట్టలుతకడమే
అయినా ఆలుమగలు వ్యవసాయం చేసుకోవడానికి
ముందుకొచ్చారు. కౌలుగా తీసుకున్న నాలుగెకరాలలో
రెండెకరాలు నాట్లేసి, మిగిలిన రెండెకరాల్లో మెట్టపంట
వేసినారు. సహకరించడం సహకారం తీసుకోవడం రెంటికీ
ఆమె సిద్ధమే. వ్యవసాయానికి గ్రామరైతుల సహకారం
తీసుకోవటం ఆమెకు అందుబాటులోని వ్యవహారమే. పొలం
కౌలుకు తీసుకున్నది. మల్లంపల్లి మత్తేదారు నర్సింహారెడ్డికి
కన్నుకుట్టింది. విసునూరు రామచంద్రారెడ్డికి అతని కుట్రలు
పడగలు విప్పినాయి. అధికారదర్పాన్ని గాలంగా వేసినాడు.
మల్లంపల్లి మత్తేదారు కొడుకు కొండల్రావు, పోలీసు పటేల్
శేషగిరిరావు ఇద్దరూ ఆ గాలానికి చిక్కినారు. ఐలమ్మ పేరిట
ఉన్న పొలం విసునూరి రామచంద్రారెడ్డి పేరిట బదిలీ
అయింది.
నిజాం నిరంకుశ దొరలవారి భూస్వాముల పాలనలో
ప్రభుత్వం ఇజారాదారులపై గ్రామనిర్మాణం చెరువు నిర్మాణం
వంటి అనేక ఆంక్షలను మోపేది. అందువల్ల తమ్ముతాము
బలవంతులుగా నిలదొక్కుకునే క్రమంలో ఆ ఇజారాదారులు
తెలంగాణ (373) తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
7jlbzcg6owr66ptm4oiag9c71lkuwco
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/395
104
212100
553008
2026-04-15T06:31:53Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఇతర రైతులను కౌలుదారులను తమ దోపిడీతో దుర్మార్గంతో అనేక ఇబ్బందుల పాలేసేవారు. ఈ క్రమంలో ఇజారా దారులు ఏకమై సాధారణజనాన్ని మోసం చేసేవారు. అదే సమయంలో 1921లో తెరమీదికి వచ్చిన ఆంధ్ర...'
553008
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఇతర రైతులను కౌలుదారులను తమ దోపిడీతో దుర్మార్గంతో
అనేక ఇబ్బందుల పాలేసేవారు. ఈ క్రమంలో ఇజారా
దారులు ఏకమై సాధారణజనాన్ని మోసం చేసేవారు. అదే
సమయంలో 1921లో తెరమీదికి వచ్చిన ఆంధ్ర జనసభ
ఆంధ్రమహాసభగా పరిణామం చెందింది. అందరికీ
అక్షరజ్ఞానం, గ్రంథాలయోద్యమం ముందుకు వచ్చింది. ఆ
ముసుగులో సంఘం అనేక సమావేశాలను జరుపుకునేది.
ఆ సమావేశాలలో భూస్వాముల దుర్మార్గాలు, వెట్టివాకిరి,
అధిక పన్నులు, నిర్బంధ వసూళ్ళు వంటి అనేక అంశాలపై
చర్చలు జరిగేవి. ఆ క్రమంలోనే సంఘ సభ్యులు చైతన్య
మౌతూ వచ్చారు. సహకార సంఘాలుగా ఏర్పడినారు.
తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. భూస్వామి రామచంద్రారెడ్డి
వలన పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టిన బలమ్మ
సంఘం ఆశయాలను అర్థం చేసుకొంది. ఆ సమావేశాలకు
హాజరైంది. గ్రామ పరిస్థితులతో పాటు సంఘం లక్ష్యాలను
అవగాహన చేసుకొంది. కుటుంబ సభ్యులను సంఘంలో
చేరడానికి ప్రోత్సహించింది. అదే గురితో తానూ సంఘంతో
మమేకమైంది.
తన ఇంటిలోని ఒక భాగాన్ని సంఘం కార్యకలాపాలకై
కేటాయించింది. సంఘకార్యకలాపాలు జోరుగా పుంజు
కొన్నాయి. సంఘం తన శత్రువు. దాని వల్ల తనకు నష్టం
వాటిల్లబోతున్నదన్న విషయాన్ని విసునూరి రామచంద్రారెడ్డి
అర్ధం చేసుకున్నాడు. ఐలమ్మను పొలంనుండి బేదఖల్
చేయడంతోపాటు ఆమె కుటుంబాన్ని సంఘాన్ని
దెబ్బతీయడం ద్వారా తన దుర్మార్గాలు, దోపిడీని కొనసాగిం
చుకోవచ్చని భావించినాడు. బలమ్మ కౌలుభూమిని తన పేర
వ్రాయించుకొన్న తదనంతరం సంఘం కార్యక్రమాలను
అడ్డుకునే క్రమంలో పాలకుర్తి సభను భయాందోళనల పాలు
చేయాలని భావించాడు. ఒకవైపు గూండాలను, మరోవైపు
పోలీసులను ప్రజల మీదకు పురిగొల్పాడు. ఆరుట్ల
రామచంద్రారెడ్డిపై హత్యాయత్నం చేశాడు. అదే క్రమంలో
ఐలమ్మ భర్త, ఆమె ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు
చేసి పోలీస్ స్టేషనుకు తీసుకపోయినారు. లాఠీలకు పనిచెప్పి
నారు. గోర్లలో సూదులు గుచ్చినారు. జుట్టుకు తాడుకట్టి
వేలాడదీసినారు. ఆ దెబ్బలకు ఐలమ్మ భర్త నర్సయ్య చేయి
పడిపోయింది. ఈ విధంగా బలమ్మ కుటుంబంలోని
మగవాళ్ళంతా పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు, కోర్టు నుండి
రిమాండ్కు, రిమాండు తదుపరి ఖైదీలుగా వెళ్ళిన పరిస్థితి.
అయినా బలమ్మ గుండె నిబ్బరం కోల్పోలేదు. ధైర్యం
సడలలేదు. వెనుకంజ వేయడమంటే వినునూరి
రామచంద్రారెడ్డిని ప్రోత్సహించడమే. అతని దుర్మార్గాల
కొనసాగింపే అని భావించింది.
ఆమె ఇంట్లో సంఘం కార్యకర్తలు మూడునెల్లు
ఉన్నారు. ఐలమ్మ ఆదర్శంగా ఇతర కుటుంబాలు,
కార్యకర్తలకు ఆశ్రయం కల్పించినారు. సుమారు అరవైమంది
కార్యకర్తలు గ్రామంలో ప్రతిరోజు కవాతు చేసేవారు. బలమ్మ
కార్యకర్తలకు తిండిని సమకూర్చేది. ఆ తిండి సజ్జ గట్కో,
జొన్న గట్కో లేదా కేవలం సల్లబొట్టో. అవే కార్యకర్తలకు
పంచభక్ష్య పరమాన్నాలు. అవేవీ తనయింట్లో సమకూర్చలేని
సందర్భంలో ఐలమ్మ వారి ఆకలిని తీర్చేందుకు గ్రామంలో
ఇల్లిల్లూ తిరిగి అడుక్కొని వచ్చేది. ఈ విధమైన ఐలమ్మ
చైతన్యవంతమైన పనులకు సంబంధించిన వార్త పలు
గ్రామాలకు పాకింది.
ఐలమ్మ కుటుంబ సభ్యులు జైలుపాలు అయిన
అనంతరం అదే అదనుగా ఆమె కౌలుభూమిని జప్తు
చేసుకుంటున్నట్లు గూండాల ద్వారా తెలియ చెప్పినాడు.
బెదిరించినాడు, హెచ్చరించినాడు. ఐలమ్మ తన కౌలు
భూమిని తాను దక్కించుకునే క్రమంలో విసునూరి మాలీ
పటేల్ను కలిసింది. తన పొలం జోలికి రావద్దని
బ్రతిమిలాడింది. మూడువందల రూపాయలతో పాటు పది
తూముల వడ్లను దండుగ రూపంలో చెల్లించింది. మాలీ
పటేల్ తాత్కాలికంగా మౌనం వహించినాడు. ఐలమ్మను
వ్యవసాయం చేసుకోమని చెప్పినాడు. కాని ఐలమ్మ పొలం
కోతకు వచ్చిన సమయంలో రామచంద్రారెడ్డి గుండాలు
ఆమె పంటను ఆమెకు దక్కకుండా చేయాలనే ప్రయత్నాలను
ముమ్మరం చేశారు. అదే సమయంలో దేవులపల్లి
వెంకటేశ్వర్లు సూర్యాపేట నుండి కార్యకర్తలను వాలంటీర్లను
ఐలమ్మకు ఆసరాగా పంపించినాడు. కానీ గూండాలు వారిని
అడ్డుకున్నారు. అప్పుడు బలమ్మ ఆవర కాకకైంది. స్వయంగా
తాను పొలంలో ముందడుగేసి తన బొందిలో ప్రాణముండగా
ఇతరులకు పంట దక్కనీయనని హెచ్చరించింది. ఈ
భయానక వాతావరణంలో పంటపొలం కోయడానికి ఎవరూ
ముందుకు రాలేదు.
: తెలంగాణ (374 తేజోమూర్తులు bikes and<noinclude><references/></noinclude>
2ilw82rrmznwkzelywl2me2w9jshhdf
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/396
104
212101
553009
2026-04-15T06:32:09Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆ సమయంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి ప్రమేయంతో బాలెం సూర్యపేట నుండి వచ్చిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు ఐలమ్మ పంటను కోసి రాశి పోయడమే కాదు మూటలుగా సిద్ధం చేసినారు. పోలీసులు గూండా...'
553009
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆ సమయంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి ప్రమేయంతో
బాలెం సూర్యపేట నుండి వచ్చిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు
ఐలమ్మ పంటను కోసి రాశి పోయడమే కాదు మూటలుగా
సిద్ధం చేసినారు. పోలీసులు గూండాలు అడ్డుకుంటున్నా
సంఘం నాయకులూ అంటే భీంరెడ్డి నర్సింహారెడ్డి, కట్కూరి
రామచంద్రారెడ్డి, కోట వెంకటరెడ్డిలు కార్యకర్తలతో పాటు
స్వయానా ఆ మూటలను ఐలమ్మ యింటికి చేర్చినారు.
కానీ ఈ క్రమంలో చాలామంది కార్యకర్తలను పోలీసులు
అరెస్టు చేసినారు. అయినా ఎంతో మంది తప్పించుకున్న
కార్యకర్తలూ లేకపోలేదు. గూండాల రాక్షసకృత్యాలకు బలమ్మ
అదరకుండా బెదరకుండా కొంగు నడుముకు చుట్టింది.
కొడవలి చేతబట్టింది. ఆ అగ్నికణాన్ని చూసి గూండాలు
తోకముడిచినారు. కానీ ఈమెకు సాయంగా వచ్చిన వారిని
అరెస్టు చేసిన పోలీసులు అమానవీయంగా హింసించినారు.
వారి ఆచూకికై వచ్చి ఆపట్ల లక్ష్మీనర్సింహారెడ్డిని
రామచంద్రారెడ్డి గూండాలు రఘునాథపల్లి స్టేషన్లో
అడ్డుకొన్నారు. కచ్చరాన్ని పాలకుర్తి చెరువులో వేసి
తొక్కినారు. అతణ్ణి వివస్త్రుణ్ణి చేసి అవమానించి పంపినారు.
అటుపై ఐలమ్మ అరస్టైన తన కుటుంబ సభ్యులను
విడుపించుకునే క్రమంలో పడరాని పాట్లు పడింది. గూండాల
దాడి పొంచి ఉన్నా పేషీలకు పోవడానికి వెనుకాడలేదు.
జనగామ కోర్టులో తీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో
హైదరాబాదు కోర్టుకు అప్పీలు చేయించుకొన్నది.
నిద్రాహారాలను అధిగమిస్తూ నిరంతరంగా తన పొలం
విముక్తికై అడుగులు వేస్తూనే పోయింది.
మొత్తం మీద భర్త, కొడుకులకు జైలు నుండి విముక్తి
లభించింది. కాని విసునూరి రామచంద్రారెడ్డికి ఆమెపై కోపం
కసి రెట్టింపయినాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా
హైదరాబాద్ సంస్థానంగానే కొనసాగుతూ స్వతంత్య్ర
ప్రతిపత్తితో ఉండటం సంఘానికి మింగుడు పడలేదు.
ఆంధ్రమహాసభ అచ్చంగా కమ్యూనిస్టుల సంఘంగా
చెలామణిలోకి వచ్చింది. కమ్యూనిస్టులకు ఆశ్రయం
కల్పిస్తుందన్న నెపంతో ఐలమ్మ ఇంటిపై పోలీసుల రజాకార్ల
దాడులు అధికమయ్యాయి. ఆమె ఇంటికి నిప్పు పెట్టినారు.
ఇంట్లో వస్తువులను ధాన్యాన్ని ఇతర వస్తువులను ధ్వంసం
చేసినారు. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లైన బలమ్మ బిడ్డపై ఘోరంగా
అత్యాచారం చేసినారు. ఫలితంగా ఆమె భర్త ఆమెను
వదిలించు కొన్నాడు. సైనిక చర్యానంతరం నిజాం
లొంగిపోయినా కమ్యూనిస్టు రాజ్యం స్థాపించాలన్న
ఆకాంక్షతో సాయుధ పోరాటాన్ని కొనసాగించినారు. ఆ
పోరాటం నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలువు
తిరిగింది. ప్రభుత్వ మిలటరీ యంత్రాంగం రజాకార్లను
మించి ఉద్యమకారులను నానా హింసలు పెట్టింది.
దుర్భరమైన అణచివేతను తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లో
పార్టీ ఉద్యమాన్ని విరమించింది. పట్టికోట ఆళ్వారు స్వామి
గారు రచించిన ప్రజలమనిషి నవలలో అన్నమ్మ ఈ
బలమ్మకు ప్రతిరూపమే.
ఇంతగా పోరాటం చేసిన ఐలమ్మను, పోరాటానికి
వెనుదన్నై నిలిచిన ఐలమ్మను పోరాట విరమణానంతరం
పార్టీ విస్మరించింది. తాను కౌలు చేసిన భూమిని
అందుబాటులోకి తెచ్చుకునేందుకై ఆమె పైసలు చెల్లించక
తప్పలేదు. ఏది ఏమైనా సాయుధ పోరాట నాయకత్వం
ఆంధ్రా కమ్యూనిస్టు నాయకుల అభీష్టాలకనుగుణంగా
సాగటం వల్ల తెలంగాణా పోరాట వీరులు ఎంతగానో
నష్టపోయారు. అందుకు ఐలమ్మ ప్రజలెరిగిన సాక్ష్యం.
మరుగున పడిన మహావీరులెందరో. ఐలమ్మ 1985
సెప్టెంబర్ 10న మరణించింది. ఆమె పోరాటస్ఫూర్తిని
భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆ క్రమంలో ప్రభుత్వం టాంక్బండ్పై ఆమె విగ్రహాన్ని
ప్రతిష్టించి మన మట్టి పరిమళాన్ని గౌరవించాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.
చేతులు తెలంగాణ 375 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
8fj4nxtyjbmv72dj2lwlekekomiowzg
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/397
104
212102
553010
2026-04-15T06:32:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '106 పల్లా దుర్గయ్య 'ఆచార్య మసన చెన్నప్ప తె తెలంగాణ అనగానే కాకతీయుల రాజధాని వరంగల్లు గుర్తుకు వస్తుంది. వరంగల్లు జిల్లాలోని మడికొండ గ్రామం, మహాకవులకు, పండితులకు పుట్టినిల్ల...'
553010
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>106
పల్లా దుర్గయ్య
'ఆచార్య మసన చెన్నప్ప
తె
తెలంగాణ అనగానే కాకతీయుల రాజధాని
వరంగల్లు గుర్తుకు వస్తుంది. వరంగల్లు జిల్లాలోని
మడికొండ గ్రామం, మహాకవులకు, పండితులకు పుట్టినిల్లు.
పల్లా దుర్గయ్యగారి స్వగ్రామం ఈ మడికొండే.
దుర్గయ్యగారు 25-5-1914 తేదీన పల్లా నర్సమ్మ పాపయ్య
దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులకు వీరు 5వ
సంతానం. తండ్రిగారికి వ్యవసాయం ఉంది. పౌరోహిత్యం
కూడా చేసేవారు. కాని దుర్గయ్యగారికి పౌరోహిత్యం
అబ్బలేదు.
దుర్గయ్యగారి 3వ అన్నగారైన మడికొండ సత్తెయ్యగారు
మంచి హరికథకులుగా పేరుగాంచినారు. ఆకాశవాణి
హైద్రాబాద్ కేంద్రంలో అర్థశతాబ్దికి పైగా హరికథలు
వినిపించారు.
దుర్గయ్యగారికి వారి తల్లిగారి వల్ల చదువుపట్ల శ్రద్ధ
గలిగింది. పైగా బాల్యమిత్రులైన కాళోజి సోదరులు,
వానమామలై సోదరులు దుర్గయ్యగారిని ప్రోత్సహించడం
వల్ల కూడా దుర్గయ్యగారు విద్యపట్ల శ్రద్ధవహించారు.
బిరుదురాజు రామరాజుగారు, అనుముల కృష్ణమూర్తి
గారు మిత్రులే ఐనప్పటికీ - దుర్గయ్యగారి కంటే చిన్నవారు.
కాని వారి స్నేహం గొప్పది.
దుర్గయ్యగారు మడికొండలో ప్రాథమిక విద్యనభ్య
సించి, హనుమకొండలో హైస్కూల్వరకు చదువుకున్నారు.
మడికొండకు, హనుమకొండ 12 కి.మీ. దూరం.
ప్రతిరోజు నడిచి వెళ్లవలసి వచ్చేది బడికి. ప్రయాణ
బడలికవల్లనూ, ఆర్థికంగా పేదవారుకావడంవల్లనూ
బాల్యంలోనే దుర్గయ్యగారు అనారోగ్యానికి గురయ్యారు. ఐనా
దుర్గయ్యగారు పట్టువిడువని విక్రమార్కులై చదువులో
అందరికంటే మిన్నగా రాణించారు.
దుర్గయ్యగారి మీద బహుభాషాకోవిదులైన వాన
మామలై వెంకటచార్యుల ప్రభావం ఉంది. దుర్గయ్యగారికి
మెట్రిక్యులేషన్లో ఉండగానే పెళ్లైంది. ఐనా దుర్గయ్యగారు
వరంగల్లో ఇంటర్ చదివి, హైదరాబాదులో పరీక్ష రాసి
పాసైనారు. ఆ తర్వాత 1938లో ఉస్మానియా విశ్వవిద్యా
లయంలో బి.ఏ.లో చేరి 1940లో అందులో ఉత్తీర్ణు
లయ్యారు. 'వందేమాతరం' ఉద్యమం కారణంగా ఒక
సంవత్సరం వృథా ఐంది.
అదే సంవత్సరం తొలిసారిగా ఉస్మానియా విశ్వ
విద్యాలయంలో తెలుగులో స్నాతకోత్తర తరగతులు మొదలు
కావడం, అందులో దుర్గయ్యగారు విద్యార్థిగా చేరిపోవడం
జరిగింది. అంతేకాక, 1942లో జరిగిన ఎం.ఏ. తెలుగు
పరీక్షలో ఉత్తీర్ణులై మొత్తం విశ్వవిద్యాలయంలోనే పట్టభద్రులైన
తొలి ఎం.ఏ. తెలుగు విద్యార్థిగా కీర్తికెక్కారు.
మడికొండ నుంచి హనుమకొండకు వెళ్లడమే కష్టమైన
రోజుల్లో, హనుమకొండ నుండి హైదరాబాదుకు రావడం
యు తెలంగాణ 376 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
d7zmcu0wfbv6u4edge35ykf43ejg26b
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/398
104
212103
553011
2026-04-15T06:32:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఇండెంతో కష్టం. ఐనా దుర్గయ్యగారు హైదరాబాదుకు వచ్చి చదువుకోవడంలో వారి మూడవ అన్నగారైన సత్యనారాయణ గారి ప్రోత్సాహం ఎంతగానే ఉంది. అన్నగారు ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకంలో ద...'
553011
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఇండెంతో కష్టం. ఐనా దుర్గయ్యగారు హైదరాబాదుకు వచ్చి
చదువుకోవడంలో వారి మూడవ అన్నగారైన సత్యనారాయణ
గారి ప్రోత్సాహం ఎంతగానే ఉంది. అన్నగారు ప్రదర్శించిన
గయోపాఖ్యానం నాటకంలో దుర్గయ్యగారు కూడా గయుని
వేషం వేయవలసి వచ్చింది. వచ్చిన డబ్బుతో మొదటిసారి
హైదరాబాదుకు వచ్చి అప్పటి తెలుగుశాఖ అధ్యక్షులైన
రాయప్రోలు సుబ్బారావుగారిని కలుసుకోవడం, వారి
సహాయంతో ఫ్రీషిప్ రావడం, చదువుకొనసాగడం
దుర్గయ్యగారి విద్యాభ్యాసంలో మరువలేని సంఘటనలు.
దుర్గయ్యగారు 1948లో చాదర్
ఘాట్లో కొత్తగా
మొదలైన జూనియర్ కళాశాలలో మొదట పార్ట్ టైం
లెక్చరర్గా చేరి ఆ తర్వాత పూర్తికాలపు లెక్చరర్ 18
ఏండ్లు పని చేశారు. ఆ తర్వాతనే ఉస్మానియా యూనివర్శిటీ
నిజాం కళాశాలలో ఆచార్యులుగా నియమితులై 1976లో
పదవీ విరమణ చేశారు.
దుర్గయ్యగారి ఇల్లు కవులతో, పండితులతో నిండి
సరస్వతీ నిలయంగా భాసించేది. ప్రతిరోజు ఏవో
సాహిత్యగోష్ఠులు జరిగేవి. వాటిలో దాశరథి, రామరాజు,
నారాయణ రెడ్డి, కాళోజి, వానమామలై మొదలైన ఉద్దండ
పండితులు పాల్గొనేవారు. ఇంకా ప్రముఖ కవి చిత్రకారులు
డి. రామలింగంగారు, భాస్కరభట్ల కృష్ణారావుగారు నమా
వేశాలలో పాల్గొనేవారు.
మరొక్క ఆశ్యర్యకరమైన విషయం ఏమంటే వట్టికోట
అళ్వారుస్వామి స్థాపించిన దేశోద్ధారక గ్రంథమాల
శ్రీదుర్గయ్యగారి ఇంట్లోనే నడిచేది.
సమావేశాలకు, గ్రంథాలయానికి వచ్చే ప్రముఖులతో
డా॥ దుర్గయ్యగారి ఇల్లు ఎప్పుడు చూసినా సందడిగా
ఉండేది.
దుర్గయ్యగారు పిహెచ్.డి. పరిశోధనకి తీసుకున్న
అంశం "ప్రబంధవాఙ్మయ వికాసము - రాయల యుగము”
అనేది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు పర్యవేక్షకులు.
వారు రచించిన పిహెచ్.డి. సిద్ధాంతగ్రంథానికి సంబం
ధించిన ప్రాశస్త్యాన్ని తెలియజేసే సంఘటనను వివరించక
తప్పదు.
సమగ్రాంధ్ర సాహిత్యం రూపకల్పనలో తలమునకలైన
ఆరుద్రగారు ఒక రోజు పల్లా దుర్గయ్యగారింటిలో
ప్రత్యక్షమయ్యారు. వారికి తోడుగా దాశరథిగారు, గుమ్మడి
వెంకటేశ్వరరావుగారున్నారు.
పల్లా దుర్గయ్య గారింట్లో ఎవరు వెళ్లినా రుచికరమైన
భోజనం, ఫలహారాలు లభించేవి.
ఆరుద్రగారు కూడా ఫలహారం స్వీకరించి 'మీ సిద్ధాంత
గ్రంథం చూసి ఒక పావుగంటలో ఇస్తాను" అని థీసిస్
తీసుకొని దుర్గయ్యగారి స్టడీ రూంలోకి వెళ్లారట. ఉదయం
8 గం॥ల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఆరుద్ర
రూం నుంచి బయటకు రాలేదట. బహుశా ఆరుద్రగారికి
దుర్గయ్యగారి పరిశోధన గ్రంథం ఎంతో నచ్చిందని వేరుగా
చెప్పవలసిన పనిలేదు.
దుర్గయ్యగారి మీద కళాశాలలో ప్రభావం చూసిన
ఆచార్యులు రాయప్రోలువారు, ఖండవల్లివారు, వీరితో పాటు
నవ్యాంధ్ర సాహిత్యవీధులు కురుగంటి సీతారామయ్య గారు.
కూడా ప్రభావం చూపారు. రాయప్రోలువారు పద్యపాఠం
చెప్పేటప్పుడు కుర్చీలో కూర్చొనేవారు కాదు. నిలబడి
పద్యాన్ని గొంతెత్తి చదివేవారు. వారి ప్రభావం దుర్గయ్య
గారి మీద కూడా పడింది.
ఆ రోజుల్లో ఉర్దూలో బి.ఏ. చదివే ఏర్పాటుండేది.
దుర్గయ్యగారు బి.ఏ. దాకా ఉర్దూ మీడియంలోనే చదివారు.
తెలుగు ఐచ్చికాంశం మాత్రమే. తెలుగు భాషది విచిత్రమైన
దుస్థితి. ఇంటర్లోను, ఎం.ఏ. లోను ఒక్కరంటే ఒక్కరే తెలుగు
విద్యార్ధి. వారే దుర్గయ్యగారు. ఇక బి.ఏ.లో మాత్రం వారికి
ఒక తోడు దొరికింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారే ఆ
తోడు.
తెలుగు చదివి ఏం చేస్తారని హేళన చేసేవాళ్లు ఆ
రోజుల్లో ఉన్నారు. ఉర్దూకు గౌరవం. బనా, తెలుగులో చదివి,
తెలుగు గౌరవాన్ని ఇనుమడింప జేసిన దుర్గయ్యగారు 'దుర్గమే
అని చెప్పవచ్చు.
తెలుగును ఐచ్చికంగా చదివి, తెలుగు ఉపన్యాసకు
లుగా ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడు చాదర్ ఘాట్
కాలేజీలో నెలకు వారికి లభించే జీతం అనండి, భృతి అనండి
చతురుడు తెలంగాణ (377) తేజోమూర్తులు ఉండటంతో<noinclude><references/></noinclude>
f3mwll9uigqo76q1tm9bzvw4cknv02r
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/399
104
212104
553012
2026-04-15T06:33:01Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '- కేవలం 66 రూపాయలే. ఐనా శాశ్వతో ద్యోగాన్ని విడిచి కళాశాల ఉద్యోగానికి రావడం వారదృష్టం గానే భావించినారు. దుర్గయ్యగారికి ఆంధ్ర సాహిత్యచరిత్రను బోధించడ మంటే ఎంతో ఇష్టం. దానితో...'
553012
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>- కేవలం 66 రూపాయలే. ఐనా శాశ్వతో ద్యోగాన్ని విడిచి
కళాశాల ఉద్యోగానికి రావడం వారదృష్టం గానే
భావించినారు.
దుర్గయ్యగారికి ఆంధ్ర సాహిత్యచరిత్రను బోధించడ
మంటే ఎంతో ఇష్టం. దానితో పాటు విమర్శ అన్నా పద్య
కవిత్వం - వచన కవిత్వమన్నా, ఛందస్సు, అలంకార శాస్త్రం
అన్నా వారికంతో ఇష్టమైన బోధనాంశాలు.
పరిశోధనలో ఉద్ధండులైన దుర్గయ్యగారి దగ్గర చేరిన
పరిశోధకులలో మాదిరాజు రంగారావుగారు, జి.వి.
సుబ్రహ్మణ్యంగారున్నారు.
దుర్గయ్యగారిలో ఒక గొప్ప పరిశోధకులే కాదు, గొప్ప
సృజనాత్మక కవి కూడా.
వారి "ప్రబంధ వాఙ్మయవికాసం - రాయల యుగం”
అనే పరిశోధన గ్రంథం అటు పండితులకు ఇటు పరిశోధకు
లతో పాటు, సాహిత్య విద్యార్థులకు నేటికీ ఒక ఆధార
గ్రంథంగా భాసిస్తుంది. కుమార సంభవం, శృంగార నైషధం,
గార శాకుంతలం వంటి ప్రబంధ పూర్వయుగడావ్యాలలో
ప్రబంధ లక్షణాలున్నవి. ఐనప్పటికీ అవి అనువాదాలు కనుక
ప్రబంధాలుగా లెక్కింపబడలేదని దుర్గయ్యగారు తెలియ
జేశారు.
రసవంతములైన, స్వాపములైన స్వతంత్రకావ్యాలే
తెలుగులో ప్రబంధాలని, ఐతే, కిరాతార్జునీయం ఆధారంగా
మనుచరిత్ర, మాఘకావ్యం ఆధారంగా పారిజాతాపహరణం
రచింపబడినాయని వివరించినారు.
సంస్కృత భాషాసాహిత్యాలతో సమాన గౌరవాన్ని
సంపాదించి పెట్టినవి తెలుగు ప్రబంధాలని నిరూపించినారు.
దుర్గయ్యగారు సృజనాత్మక కవి. వారి లేఖిని నుండి
'పాలవెల్లి', గంగిరెద్దు' అనే రెండు సృజనాత్మక రచనలు
వెలువడ్డాయి. పాలవెల్లి, పద్యగీయ సమ్మిశ్రితమైన కవితా
సంపుటి. విద్యార్ధి దశ మొదలుకొని జీవితంలోని అనేక
సందర్భాలను పద్యాలలో, గేయాలలో వర్ణించిన తీరు
పాలవెల్లిలో వెల్లి విరిసింది.
దుర్గయ్యగారి అనల్పకల్పనాశక్తి, వర్ణనాపటిమ,
దేశీయలు, స్వభాషలోని అందచందాలు అనేవి 'గంగిరెద్దు'
అనే ఖండకావ్యంలో కనిపిస్తాయి.
సంప్రదాయబద్ధమైన ఛందస్సులో రచింపబడినప్పటికీ,
కథావస్తువు నవ్యమైంది. ఎవరూ అంతవరకు స్పృశించనిది.
మొత్తం కావ్యం కరుణరస స్లావితమై పాఠకుల హృదయాలను
ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులోని 'సంక్రాంతి'
పద్యాలు తెలుగువారి నాలుకల మీద నాట్యం చేశాయి.
తెలంగాణ పల్లెపట్టులను గూర్చి ఇంత సహజసుందరంగా
చిత్రించే ఖండకావ్యం మరొకటి లేదనిపిస్తుంది. ఈ
కావ్యరచన వల్లనే దుర్గయ్యగారికి 'పల్లికవి' అనే పేరు
సార్థకమైంది.
దుర్గయ్యగారి లఘుకృతిలో గ్రామాల్లో తిరిగే భిక్షుక
జానపద కళాకారుల ఆటపాటలను వాస్తవదృష్టితో
వర్ణించినారు.
ఇందులో గంగిరెద్దులవాడు ఎద్దుకు శిక్షణను ఇచ్చి
గంగిరెద్దుగా మార్చడం, ఊరూరా తిప్పుతూ ఆటలాడించడం
వంటి వర్ణనలు సహజమైనవి. పల్లె వాతావరణంపై కవికి
గల మమకారం, ప్రశంసనీయమైంది. ఇందులో తెలంగాణ
మాండలికాలను, నుడికారాలు, సామెతలను చూడవచ్చు.
గంగిరెద్దులవారు ఇచ్చిన శిక్షణను గూర్చి దుర్గయ్యగారు
ఎంతో చక్కగా వర్ణించినారు.
"కాళ్లు మోకరించి కఱ్ఱనేలను మోపి
పండుమనుచు భువి పరుండజేసి
కట్టమీది కెత్తి కడుచక్కగానిల్చి
లెమ్ముటంచుబలికి లేవనెత్తు" అని.
ఒకరోజు ఊరివారి హేళనకు గురైన ఎద్దు,
గంగిరెద్దుగా మారి బసవేశ్వరునిగా వారిచేతనే సత్కరింప
బడిందని చెప్పడం వల్ల లోకస్వభావం ఎలాంటిదో
తెలిపినట్లైంది.
ఆ పద్యం వినండి :
"గొప్ప విద్వాంసుగతి సేల్పగప్పుకొనియె
గజ్జెగట్టె గొప్పకళాధికారికరణి
ధనికువలె హేమభూషణాళిని ధరించె
భోగి క్రియ గంధమాల్యాను భోగముగనౌ”
లోకం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదనే దానికి
గంగిరెద్దు చక్కని ఉదాహరణ. ప్రథమ ముద్రణకు రాళ్లపల్లి
అంటుంటే తెలంగాణ 378 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
p3vknxwjpec7t5u0l7pzcfcysgf2bgd
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/400
104
212105
553013
2026-04-15T06:33:23Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అనంత కృష్ణశర్మగారు, ద్వితీయ ముద్రణకు దాశరధి గారు పీఠికలు రాయడం వల్ల 'గంగిరెద్దు' కావ్యవైశిష్ట్యం ఏ పాటిదో తెలుస్తుంది. "దుర్గయ్య గారిది ఇదొక గొప్ప సాహసమైన ప్రయత్నం" అని రా...'
553013
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అనంత కృష్ణశర్మగారు, ద్వితీయ ముద్రణకు దాశరధి గారు
పీఠికలు రాయడం వల్ల 'గంగిరెద్దు' కావ్యవైశిష్ట్యం ఏ పాటిదో
తెలుస్తుంది.
"దుర్గయ్య గారిది ఇదొక గొప్ప సాహసమైన ప్రయత్నం"
అని రాళ్లపల్లి తమ పీఠికలో రాయగా, దాశరథి తమ పీఠికలో
"కరుణరసం కట్టలు త్రెంచుకుని ప్రవహించే కావ్యం
గంగిరెద్దు" అని ప్రశంసించారు.
కన్నతల్లి చనిపోతే, కోడె ఇల్లు విడిచి పోవడాన్ని
దుర్గయ్యగారు ఇట్లా వర్ణించారు గంగిరెద్దులో
"తండ్రి గొట్టెనేని తల్లి కోపించిన
కనులు మూసికొని టికెట్టులేక
రైలుబండిలో జొరబడు బాలుని భంగి
ఇల్లు విడిచె కన్నతల్లి పోవ”
అంటారు. ఆధునికమైన ఉపమానాలకు ఈ కృతి
ఆలవాలమైంది.
దుర్గయ్యగారి రచనలలో "చతుర వచోనిధి" ఉత్తమ
విమర్శన గ్రంథం. మనుచరిత్రలో పెద్దన చూపిన చతురవ
చోనిధిత్వం, ఎన్నో వ్యాసాలలో ఇందులో నిరూపితమైంది.
'మను చరిత్ర' సమ్మగంగా దర్శనమిస్తుంది ఇందులో.
దుర్గయ్యగారి సృజనాత్మక రచనలలో ఒకటి
'పారిజాతాపహరణం' అనే గేయ కృతి. ఇది వారి
శతజయంతి సందర్భంగా ప్రచురితమైంది.
"ఏ వేళల ఏ సుందరి
ఏ విలాసములు గోరిన
ఆ వేళల ఆ సుందరి
నా విలాసముల దేల్చును”
అని శ్రీకృష్ణుని లీలలను చక్కగా గానం చేశారు.
దుర్గయ్య గారీ కావ్యంలో.
అధ్యాపకులుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ అటు
పరిశోధనలోనూ, ఇటు సృజనాత్మక రచనలోనూ తనదైన
ముద్రవేసిన పల్లా దుర్గయ్యగారు తెలంగాణ రచయితలలో
అగ్రశ్రేణికి చెందినవారని చెప్పక తప్పదు.
చేతులు తెలంగాణ (379 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
a40v9x1cdi43z6ua17aeypncap5sk0b
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/401
104
212106
553014
2026-04-15T06:33:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '107 చ రిత్ర ఒక శిల్పి సమరాలపు వ్యక్తిత్వాలను చెక్కుకుంటుంది. ఆ వ్యక్తిత్వాలే చరిత్ర పురుషులుగా మిగిలి పోతారు. అట్లాంటి తెలంగాణ చరిత్ర పురుషులలో 'దక్కన్ గాంధీ', 'తెలంగాణ కేసర...'
553014
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>107
చ రిత్ర ఒక శిల్పి సమరాలపు వ్యక్తిత్వాలను
చెక్కుకుంటుంది. ఆ వ్యక్తిత్వాలే చరిత్ర
పురుషులుగా మిగిలి పోతారు. అట్లాంటి తెలంగాణ చరిత్ర
పురుషులలో 'దక్కన్ గాంధీ', 'తెలంగాణ కేసరి' పల్లెర్ల
హనుమంతరావు ఒకరు.
పల్లెర్ల హనుమంతరావు బూర్గుల రామకృష్ణారావు గారి
మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారని చెప్పటం అంత
ముఖ్యమైన విషయం కాదు. ఆ మంత్రి వర్గంలో ఇతరులెంతో
మంది వుంటారు. వారిలో లేని ఎన్నో ఇతర విశిష్టత
లుండటం మూలంగా ప్రజలు 'దక్కన్ గాంధీ', 'తెలంగాణ
'కేసరి' అన్న బిరుదులు ఇచ్చి వారిని గౌరవించుకున్నారు.
హనుమంతరావు 1908లో జన్మించారు. తండ్రి పల్లెర్ల
శివరామయ్యగారు నిజాం ప్రభుత్వంలో పనిచేశారు.
హనుమంతరావు 15 సంవత్సరాల ప్రాయంలోనే తమ
తండ్రి, తల్లి గారిని కోల్పోయారు. దీంతో పెదనాయిన
కిష్టయ్యగారి పెంపకంలోనే వీరు పెరిగి పెద్దవారయ్యారు.
చరిత్ర పుటలు తిరగేస్తే హనుమంతరావు పూర్వీకులు
మహబూబ్నగర్ జిల్లాలోని లోకాయపల్లి సంస్థానానికి
చెందినవారు. ఈ సంస్థానాధీసుల దేశభక్తి అపారమైనంది.
1857లో మొదటి స్వాతంత్ర్య సమరాన్ని సమర్థించటమే
కాక, రాణి ఝాన్సీబాయి చేసిన తిరుగుబాటును బలోపేతం
సమరము
పల్లెర్ల హనుమంతరావు
- దా॥ అమ్మంగి వేణుగోపాల్
చేయటానికి లోకాయపల్లి మహారాణి తమ సైన్యాన్ని
పంపించారట! పల్లెర్ల వంశంవారు లోకాయపల్లి నుండి
మహబూబ్ నగర్ పట్టణానికి వలనవచ్చారు.
అచిరకాలంలోనే తమ సేవలతో ఆవూరి వారి మనసులు
గెలుచుకున్నారు.
ఆరవ నిజాం మహబూబ్ అలీపాదుషా పేరు మీద
నెలకొల్పబడ్డ మహబూబ్నగర్ ఎప్పుడూ నీటి సమస్యతో
సమమతమవుతూ వచ్చింది. చివరి నిజాం అస్తవ్యస్త
విధానాల మూలంగా తెలుగుతోపాటు కన్నడ మరాఠీ భాషలు
నిర్లక్ష్యానికి గురయ్యాయి. గస్తీ నిషాన్ 58 ఉత్తర్వుల ప్రకారం
వాక్ సభాస్వాతంత్ర్యాలు హరించబడ్డాయి. తెలుగులో
బోధించే వీధి బడులు మూతపడ్డాయి. తెలుగు మీడియంలో
బోధన సాగేది కాదు. ఈ నేపథ్యంలో పల్లెటూళ్ళనుంచి
చదువుకోసం వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థులకు
పల్లెర్లవారి ఇల్లు ఒక ఆశాకిరణంగా, ఒక శరణాలయంగా
వుండేది. కిష్టయ్య, శివరామయ్య, హనుమంతరావు,
శ్రీనివాసరావు, వినాయక రావు గార్లు తరతరాలుగా
మహబూబ్నగర్ జిల్లాలో విద్యావ్యాప్తికి కృషి చేస్తూ వచ్చారు.
మొదట హనుమంతరావు సతీమణి సరస్వతమ్మగారు,
ఆ తదుపరి శ్రీనివాసరావుగారి సతీమణి కమలమ్మగారు
అల్లసారి పెద్దన్న వర్ణించినట్లు 'వండినలయదు
వేవురువచ్చిరేని' అన్న పద్ధతిలో - చుట్టాలకు, మిత్రులకు,
తెలంగాణ (380 తేజోమూర్తులు bha
తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude>
cw55v17qhqp0ocakds62gaiie2bnpxm
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/402
104
212107
553015
2026-04-15T06:34:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విద్యార్థులకు వండి పెడుతూ వచ్చారు. ఇతరులకు ఆదర్శంగా వుండటం హనుమంతరావుకు బాల్యం నుండే అలవడ్డ లక్షణం. ఈ దశలో కుటుంబ వ్యక్తిగా కాక సమాజ వ్యక్తిగా తనకుతాను తీర్చిదిద్దుకునే...'
553015
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>విద్యార్థులకు వండి పెడుతూ వచ్చారు. ఇతరులకు ఆదర్శంగా
వుండటం హనుమంతరావుకు బాల్యం నుండే అలవడ్డ
లక్షణం. ఈ దశలో కుటుంబ వ్యక్తిగా కాక సమాజ వ్యక్తిగా
తనకుతాను తీర్చిదిద్దుకునే అవకాసం వారికి లభించింది.
మహబూబ్నగర్ లోనే హనుమంతరావు మెట్రిక్లో
ఉత్తీర్ణులై, ఆ తర్వాత హైదరాబాదులో న్యాయశాస్త్రంలో పట్టా
పొందారు. ప్రముఖ రచయిత నందగిరి వెంకటరావుతో
కలిసి మహబూబ్నగర్లో ప్రాక్టీసు మొదలుపెట్టారు.
తొందరలోనే అగ్రశ్రేణి వకీలుగా పేరు తెచ్చుకొన్నారు.
అయితే 1926 నాటికే వారికి జిల్లాలో కాంగ్రెస్ నేతగా
పేరు వచ్చిన సంగతి మరువరాదు. తమ 18వ ఏట వారు
హరిజనోద్ధరణకు నడుంకట్టి, మిత్రుల సాయంతో
పాత మహబూబ్నగర్ హరిజనుల దేవాలయ ప్రవేశ
కార్యక్రమం విజయవంతంగా జరిపించారు. ఈ సంఘటన
తర్వాత దగ్గరి బంధువులు, నాయీ బ్రాహ్మణులు పల్లెర్ల
కుటుంబాన్ని వెలివేసినట్లుగానే చూసేవారు. కాని
హనుమంతరావు గాంధేయ భావజాలం నుంచి రెప్పపాటు
కాలం కూడా దూరం జరగలేదు. ఈ దశలో
హనుమంతరావు వంటి యువకులను కదిలించే
సంఘటనలు, పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.
గ్రంథాలయ ఉద్యమానికి, తెలుగు పాఠశాలల ఏర్పాటుకు
పట్టుకొమ్మగా నిలిచిన ఆంధ్రజన సంఘం, తెలంగాణలో
సాంఘిక సంస్కరణలకు రాజకీయ చైతన్యానికి
ఆధారస్తంభంగా నిలిచిన ఆంధ్రమహాసభ, ఉస్మానియా యువ
విద్యార్థులను సానబెట్టిన వందేమాతర ఉద్యమం, నిషేధాల
మధ్య వికాసం చెందుతున్న కాంగ్రెస్ పార్టీ, నిజాం మూలంగా
చోటు చేసుకుంటున్న మతాంతరీకరణలు, వాటిని
ఎదుర్కుంటున్న ఆర్య సమాజ్ - ఇవన్నీ హనుమంతరావు
దృష్టిపథం నుంచి తప్పించుకుపోలేదు.
గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమ
సందర్భంగా వశీఖు వృత్తిని వదులుకుని పూర్తి స్థాయి కాంగ్రెస్
రాజకీయ కార్యకర్తగా రూపొందారు. అయితే అప్పటికే వారు
కల్వకుర్తి, అచ్చంపేట, ఆలంపూర్ ప్రాంతాలలో అనేక
సత్యాగ్రహ కార్యక్రమాలను చేపట్టి, ప్రభావ శీలంగా
పనిచేశారు. ఈ దశలో కాంగ్రెస్ బలహీనంగా వున్న
సమరము తెలంగాణ 381
ప్రాంతాలను గుర్తించారు. గుల్బర్గా, బీజాపూర్, ఔరంగాబాద్
ప్రాంతాలలో పార్టీ యూనిట్లను నెలకొల్పటం జరిగింది.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన తర్వాత ఖాధీ
గ్రామోద్యోగ
కార్యక్రమాలను ముమ్మరం చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం
వారిని 1937లో మొదటిసారి అరెస్టు చేసి 4 నెలలపాటు
జైలులో నిర్బంధించింది. గాంధీజీ 1942లో సత్యాగ్రహానికి
పిలుపునిచ్చారు. ఆ సందర్భంలో హనుమంతరావు
మహబూబ్నగర్ చౌరస్తా వద్ద వ్యష్టి సత్యాగ్రహం చేశారు.
వేలాది పట్టణ ప్రజలు చూస్తుండగా వారిని పోలీసులు అరెస్టు
చేశారు. ఈ సందర్భంలో వారు గుల్బర్గా, హైదరాబాదు
జైళ్ళలో వున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజాం ప్రభుత్వం
మీద ఒత్తిడి పెరిగింది. ఇండియన్ యూనియన్లో
హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చెయ్యాలన్న డిమాండు
రోజురోజుకు బలోపేతం కాసాగింది. దీంతో నిజాం
వత్తాసుతో కాశీం రజ్వీ తన హంతక ముఠాను రజాకార్లు
అన్న పేరుతో రంగంమీదకు దించాడు. ఈ దారుణ
పరిస్థితులలో ప్రతిచర్యకు గురయ్యేది అమాయకులైన
మైనారిటీ ప్రజలేనన్న అవగాహనతో హనుమంతరావు వారికి
రక్షణ కల్పించారు. తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి రక్షించటం
ద్వారా నిజమైన గాంధీ అనుచరుడునిపించుకున్నారు.
స్థానికులైన తెలుగు నేతల నుంచి ఈ విషయమై కొంత
వ్యతిరేకత వచ్చినా పల్లెర్ల వారు ఏమాత్రం
వెనుకంజవేయలేదు. ఈ సందర్భంలో నిజాం ప్రభుత్వం
మూడవసారి హనుమంతరావును అరెస్ట్ చేసింది. ఫలితంగా
1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు వివిధ జైళ్ళలో
రాజకీయ ఖైదీగా వున్నారు.
నిజాం పాలన అంతరించి హైదరాబాదు రాష్ట్రం
ఏర్పడిన తర్వాత హనుమంతరావు జీవితంలో రెండవదశ
ప్రారంభమయింది. 1952లో సాధారణ ఎన్నికలు వచ్చాయి.
వారు మహబూబ్నగర్ నియోజక వర్గం నుంచి శాసనసభకు
పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడే
వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పార్టీ విజయం కోసం
జిల్లా వ్యాప్తంగా పర్యటించారు. నెహ్రూగారి ఆశీస్సులతో
బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రి
వర్గ విస్తరణలో హనుమంతరావుకు మంత్రి పదవి
తెలంగాణ 381 తేజోమూర్తులు ksh<noinclude><references/></noinclude>
payya8nuvl8019jqogx6ff6ht0ds7bl
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/403
104
212108
553016
2026-04-15T06:34:14Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వరించింది. రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, దేవాదాయ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్విరామంగా పలు కార్యక్రమాలను చేపట్టారు. వీరి కృషి మూలంగా రక్షిత కౌలుదారీ చట్టం అమల...'
553016
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వరించింది. రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, దేవాదాయ శాఖల
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్విరామంగా
పలు కార్యక్రమాలను చేపట్టారు. వీరి కృషి మూలంగా రక్షిత
కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. వెట్టి చాకిరీ నిర్మూ
లించబడింది. ఒక కుటుంబానికి గరిష్ఠంగా 55 ఎకరాల
ఖుష్కే భూమిని నిర్ణయించటం జరిగింది. ఇంకా అనేక
ప్రగతిశీల చట్టాలను అమలులోనికి తెచ్చి భూ సంస్కరణలకు
శ్రీకారం చుట్టిన ఘనత హనుమంతరావుకే దక్కుతుంది.
ఈ కాలంలోనే పల్లెర్ల హనుమంతరావు జీవితంలో
అత్యంత ప్రధానమైన ఘటన చోటు చేసుకుంది. అదే
సర్వోదయ నాయకులు వినోబాభావే గారితో పరిచయం!
| వినోబాభావే 1961 ఏప్రిల్ నెలలో శివరాంపల్లిలో
సర్వోదయ సమ్మేళనం ప్రారంభించారు. అక్కడ నుండి
పాదయాత్ర చేసి పోచంపల్లి వెళ్ళారు. అక్కడ జరిగిన సభలో
హరిజనులకు 100 ఎకరాల భూమిని దానం చేయటానికి
వెదిరె రామచంద్రారెడ్డి గారు ముందుకు రావటంతో
వినోబాభావే భూదానోద్యమం ప్రారంభమయింది. దీని
ప్రభావంతో హనుమంతరావు మిత్రులతో కలిసి 'సర్వోదయ
ప్రేమ మండలి'ని స్థాపించి శ్రమదాస్, జీవన్ దాన్, భూటాన్
వంటి కార్యక్రమాల పట్ల చైతన్యం కలిగించారు. ఇది
వరకు క్రమశిక్షణతో నిర్వహిస్తూ వచ్చిన మద్యనిషేధం.
హరిజనోద్ధరణ, ఖాదీ గ్రామోద్యోగ్, వయోజన విద్య, హిందీ
ప్రచార్ వంటి గాంధీజీ కార్యక్రమాలు కూడా
ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత వినోబాభావే ఎప్పుడు వచ్చినా వారి వెంట
వుండి భూదానోద్యమం గొప్పదనాన్ని అర్థం
చేసుకుంటూ వచ్చారు. ఒకసారి తమ మహబూబ్ నగర్
జిల్లాలో కూడా పర్యటించమని ప్రార్థిస్తే - "మీ జిల్లా నుంచి
50,000 ఎకరాల భూమిని భూదానం కింద ఇప్పిస్తానని
మాట ఇస్తే తప్పక వస్తానని వినోబా అన్నారు. పల్లెర్ల
హనుమంతరావు ఏ మాత్రం వెనుకంజ వేయక 'తప్పకుండా
'ఇప్పిస్తాన'ని మాట ఇచ్చారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని
ధైర్యాన్ని నిరూపించే సంఘటన. వారు అప్పుడు రెవెన్యూ
మంత్రిగా వుండటం మూలంగా, ముఖ్యమంత్రి బూర్గుల
రామకృష్ణారావు మద్దతుతో జిల్లాలోని అన్ని తాలూకాలు
పర్యటించి భూస్వామ్యవర్గాలతో అనుకూల వాతావరణం
బీదవాళ్ళలో చైతన్యం సృష్టించగలిగారు. ఫలితంగా కల్వకుర్తి,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ తాలూకాలలో, భూస్వాముల
నుండి, ఇతర పెద్ద వ్యవసాయదారుల నుండి 50,000
ఎకరాలు సేకరించి వినోబాభావే గారికి సమర్పించుకున్నారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ సందర్భంలో రఘుపతిపేట
అనే ఊళ్ళో జరిగిన సభలో ప్రజలు పల్లెర్ల హనుమంతరావుకు
'తెలంగాణ కేసరి' అన్న బిరుదును చంద్రునికో నూలు
పోగుగా ప్రదానం చేసి ధన్యులైనారు. ఆ తర్వాత వారు
సోషలిస్టు భావాలున్న సర్వోదయనాయకులు జయప్రకాశ్
నారాయణ్ గారితో కూడా కలిసి పనిచేశారు. 1952 నుండి
1965 వరకు భారత్ సేవక్ సమాజ్క హనుమంతరావు
అధ్యక్షులుగా ఉన్నారు.
ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో వారు పార్లమెంటుకు
పోటీ చేయవలసి వచ్చింది. మహబూబ్నగర్
లోనే కాదు
తెలంగాణలో ఎక్కడపోటీ చేసినా హనుమంతరావు
గెలుస్తారన్న భావన అధిష్ఠానవర్గానికి కలిగిందంటే అది
సామాన్యమైన విషయం కాదు. వారు 1957, 1962
ఎన్నికలలో మెదక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి మంచి
మెజారిటీతో గెలుపొందారు. ఆయనతో పోటీ చేసింది
సామాన్యుడు కాదు. కమ్యూనిష్టునాయకుడు, మహాకవి
మంగ్యూం మొహియుద్దీన్. అందులో ఆయన మెదక్ జిల్లారు
చెందిన వాడు. పోటీ చేసిన ఇద్దరు పరస్పరం గౌరవించు
కున్నారు. ఒకచోట మగ్దూం మాట్లాడిన ఎన్నికల సభలోనే
అదే వేదిక మీద హనుమంతరావు ఉపన్యసించి ఓటర్ల
మనసు దోచుకున్నారు! స్వాతంత్య్ర పోరాటంలో, పార్టీ
నిర్మాణంలో, భూదానోద్యమంలో, త్రికరణశుద్ధిగా పాల్గొని
త్యాగధనులని పేరుపొంది, అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని
చూరగొనటంతోపాటు సమకాలికులలో ఉన్నతుడన్న గుర్తింపు
పొందారు. 11 నెలల పాటు జైల్లో వుండి 1948లో విడుదలై
వచ్చిన తర్వాత జరిగిన సభలో ప్రజలు హనుమంతరావును
'దర్శన్ గాంధీ' అని ప్రేమతో పిలుచుకున్నారు.
వారు పార్లమెంటు సభ్యులుగా వున్నప్పుడే మహబూబ్
నగర్కు చెందిన విద్యార్థినీ విద్యార్థులు డిగ్రీ చదువుల కోసం
ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తున్నదని గుర్తించారు. దీంతో
మిత్రులతో కలిసి వారు 'మహబూబ్నగర్ విద్యా సమితిని
స్థాపించారు. ప్రజల నుంచి, భూస్వాముల నుంచి విరాళాలు
చిరు తెలంగాణ 382 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
c9bszmc7h5qkc9so4yhu1xgqro1swb2
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/404
104
212109
553017
2026-04-15T06:34:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వసూలు చేసి, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొంది 1965లో ఎం.వి.ఎస్. కళాశాలను స్థాపించారు. ప్రజల విరాళాలతో పట్టణ శివారులో కళాశాల కోసం 45 ఎకరాల భూమిని కొన్నారు. ఇక్కడే కళాశాల భవనాలు వెల...'
553017
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వసూలు చేసి, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొంది 1965లో
ఎం.వి.ఎస్. కళాశాలను స్థాపించారు. ప్రజల విరాళాలతో
పట్టణ శివారులో కళాశాల కోసం 45 ఎకరాల భూమిని
కొన్నారు. ఇక్కడే కళాశాల భవనాలు వెలిశాయి. పల్లెర్ల
హనుమంతరావు ఆశీస్సులతో ఎం.వి.ఎస్. కళాశాల-
ప్రభుత్వ కళాశాలగా, పి.జి. కళాశాలగా కూడా అభివృద్ధి
చెంది జిల్లాలోనే అగ్రస్థానంలో వుంది.
హనుమంతరావు మహబూబ్నగర్ జిల్లా రాజకీయా
లకు దిక్సూచిగా వుండి, సామాజిక, ఆర్థిక వ్యవసాయ
రంగాలకే కాక విద్యారంగానికి కూడా అమూల్యమైన
సేవలందించారు. వినోబాభావే చెప్పిన శ్రమదాన్, జీవన్
దాన్, భూదాన్ వంటి సర్వోదయ ప్రణాళికలో విద్యాదాన్ను
కూడా చేర్చిన మహనీయులు హనుమంతరావు గారు
ధన్యజీవి.
చేతులు తెలంగాణ 383 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
kiso42u0jc7edmixga3zh9zs4quht1i
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/405
104
212110
553018
2026-04-15T06:34:48Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '108 'జా గ్రహ పాఠ్యం ఋగ్వేదాత్ సామభ్యో గీతమేవచ యజుర్వేదా దభినయాన్ రసాన్ అధర్వణ దపి' నాటకం ఒక సమాహార కళ. ముఖ్యంగా అది చతుర్వేద సార సంగ్రహమైన కళ. పాఠ్యం ఋగ్వేదమైతే గీతం సామవేదం, అ...'
553018
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>108
'జా గ్రహ పాఠ్యం ఋగ్వేదాత్
సామభ్యో గీతమేవచ
యజుర్వేదా దభినయాన్
రసాన్ అధర్వణ దపి'
నాటకం ఒక సమాహార కళ. ముఖ్యంగా అది
చతుర్వేద సార సంగ్రహమైన కళ. పాఠ్యం ఋగ్వేదమైతే
గీతం సామవేదం, అభినయం యజుర్వేదం, రసం అధర్వణ
వేదం. సర్వ వేద సారమైనది కనుకనే 'కావ్యేషు నాటకం
రమ్యం'. సాహిత్యంలో అత్యున్నత స్థాయిని నాటకానికి
ఇచ్చారు కాబట్టి "నాటకాంతం హి సాహిత్యం" అని కూడా
ప్రవచించారు.
ఓరుగల్లు కళల పుట్టిల్లు అని ప్రసిద్ధి. ఆ పేరు స్ఫురించ
గానే కాకతీయులు వారి సామ్రాజ్య వైభవం, నాటి రాజుల
కళాపోషణ, అప్పటి కళారూపాలు, నృత్య శాస్త్రాలు, శిల్ప
విన్యాసాలు కళ్లకు కడతాయి. కళారూపాలన్నీ రంగస్థల
చైతన్యంలో భాగాలే అయినా రంగస్థలమంటే నాటకంగా
మాత్రమే స్థిరపడింది. దీన్ని నాటక రంగానికే పరిమితం
చేసి ఆలోచిస్తే వరంగల్లోని నాటక చైతన్యం అపూర్వంగా
దృశ్యమానం అవుతుంది. ఆ చైతన్యంలో ఒక వెలుగు కిరణమే
ప్రసిద్ధ పౌరాణిక రంగస్థల నటుడు, దర్శకుడు కీర్తిశేషులు
పందిళ్ల శేషుబాబు.
ఆయనొక నటతపస్వి, ఆయన శ్వాసించింది నాటకం,
పందిళ్ల శేఖర్ బాబు
- డా॥ గన్నమరాజు గిరిజా మనోహర బాబు
ఆయన ప్రేమించింది నాటకం. ఆయన తన ప్రతిభ
చూపించింది నాటకం. సాధారణంగా సమాజానికి
దిశానిర్దేశం చేయడానికై కొందరు కారణజన్ములు జన్మించి
తమ కార్యాన్ని నిర్వర్తించి నిష్క్రమిస్తూ ఉంటారు. ఆ కోవలోని
వారే పందిళ్ల శేషుబాబు గారు.
1961 సెప్టెంబర్ 2వ తేదీన కీర్తిశేషులు పందిళ్ల
రాజయ్య శాస్త్రి, సుచేత దంపతులకు వరంగల్ జిల్లాలోని
ధర్మసాగర్ గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాస
మంతా స్వగ్రామంలోనే సాగింది. కొంతవరకు ఉన్నత విద్య
వరంగల్లో సాగింది. ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకున్న
శేఖర్ బాబు గారికి తండ్రిగారి హఠాన్మరణం కొత్త బాధ్యతలు
తెచ్చిపెట్టడం వలన ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించాల్సి
వచ్చింది. కుటుంబ బాధ్యతల్ని సక్రమ రీతిలో నిర్వహిస్తూనే
ఉద్యోగ బాధ్యతలను కూడా మరింత శ్రద్ధతో కొనసాగిస్తూనే...
ప్రైవేటుగా ఎం.ఎ. ఎల్.ఎల్.బి. విద్యను సాధించడం
వారిలోని అకుంఠిత దీక్షకు నిదర్శనం.
తన ప్రధానాభిరుచి పౌరాణిక నాటకం. దాని దిశగా
ప్రస్తావిస్తూ 1998లో 'తెలంగాణ డ్రెమొటిక్ అసోసియేషన్'
స్థాపించారు. పౌరాణిక పద్య నాటక పునరుత్తేజం నిమిత్తం
నడుంకట్టారు. కొంతకాలం వరంగల్ జిల్లా పద్యనాటక
కళాపరిషత్ కొరకు పనిచేసి తదనంతరం పద్యనాటక
ప్రాచుర్యం కొరకు తెలంగాణ డ్రెమొటిక్ అసోసియేషన్ ను
తెలంగాణ (384) తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude>
sv6zfvdosgxul7e0h3l1ets4j8drv33
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/406
104
212111
553019
2026-04-15T06:35:02Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'స్థాపించి ముందుకుసాగి తన ప్రతిభ జిల్లాస్థాయికే పరిమితం చేయక దాన్ని మరింత విస్తృతపరిచారు. వారు మొదటి నుంచి నాటకాభిమాని అయిన శేఖర్ బాబు గారు ధర్మసాగర్ హైస్కూల్లో 8వ తరగతి...'
553019
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>స్థాపించి ముందుకుసాగి తన ప్రతిభ జిల్లాస్థాయికే పరిమితం
చేయక దాన్ని మరింత విస్తృతపరిచారు.
వారు
మొదటి నుంచి నాటకాభిమాని అయిన శేఖర్
బాబు
గారు ధర్మసాగర్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పుడే
'ఆత్మహత్య' అనే సాంఘిక నాటకంలోని సన్యాసిరాజు పాత్ర
ద్వారా రంగస్థల ప్రవేశం చేసి అప్పుడే ఆ నాటికకు దర్శకత్వం
కూడా చేశారు. చేయడమే గాక.. ఆ నాటకం ద్వారా
ఉత్తమ నటునిగా, ఉత్తమ దర్శకునిగా బహుమతులు కూడా
పొందారు. వారి నాటకాభిమానానికి అదే గొప్ప స్ఫూర్తి
నిచ్చింది. అనుకోకుండా 1998లో 'పాలకుర్తి' జాతర
సందర్భంగా ఏర్పర్చిన నాటకోత్సవాల్లోని కృష్ణరాయబారం
పడక సీనులో కృష్ణ పాత్రధారి రాని కారణంగా శేఖర్
బాబు
గారు ఆ పాత్ర ధరించి మెప్పించారు. అదే వారి తొలి
పౌరాణిక నాటకరంగ ప్రవేశం.
అప్పటినుంచి వారు పౌరాణిక నాటక రంగంలో ఒక
గొప్ప నటునిగా వెలిగి తమదైన గుర్తింపును తెచ్చుకున్నారు.
తొలి సాంఘిక నాటకంలోని రెండు పేజీలున్న డైలాగును
ఏకబిగిన చెప్పడం, ఆపద్ధర్మంగా నటించిన శ్రీకృష్ణ పాత్రకు
సంబంధించిన పద్యాలను రాగయుక్తంగా ఆలపించడం
ద్వారా అనేకమంది పెద్దల ప్రశంసలు పొంది నాటకరంగంపై
మరింత మక్కువ పెంచు కున్నారు. పాత్ర హావభావాల్లో
ప్రత్యేక శ్రద్ధ చూపించే పాత్రధారికి నాటకరంగం పెద్దపీట
వేస్తుంది. కీర్తిశేషులు శేఖర్ బాబు గారి విషయంలోనూ అదే
జరిగింది. అటువంటి వారి పాత్రకు మంచి రాణింపు
లభిస్తుంది. కొత్తవారికి స్పూర్తిదాయకమై నిలుస్తుంది. అందుకే
వారి పౌరాణిక పాత్రలకు గొప్ప రాణింపు వచ్చి.. అనేక
బహుమతులకు, పురస్కారాలకు కారణమైంది.
శేఖర్ బాబు గారిలోని మునిశిత పరిజ్ఞానం, మేధాశక్తి
ఆయన వృత్తికి, ప్రవృత్తికి బాగా తోడ్పడ్డాయి. దేవాదాయ,
ధర్మాదాయ శాఖలోని తన ఉద్యోగం ఆయనలో ఒక దైవీ
భావనను ప్రోదిచేయడం కారణంగా శ్రీకృష్ణ, శ్రీరామ వంటి
పాత్రలు ఆయనలోని ఒకానొక గురుభావం ఆలంబనంగా
నిలిచి.. తన నట జీవితంలోనే అవి మైలురాళ్లుగా నిలిచాయి.
ప్రతిభావంతులైన ఇతర నటులతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని
వారి నటనలోని వైవిధ్యాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని
తనను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చివరివరకు చేస్తూనే
ఉండటం శేఖర్ బాబులోని నాటక తృష్ణకు ఒక సజీవ
ఉదాహరణ. కేవలం నటునిగానే కాక.. నిర్వహణ సామర్థ్యం
కలిగిన వ్యక్తి గనుక తాను స్వయంగా ప్రదర్శనలివ్వడమే
గాకుండా పౌరాణిక, సాంఘిక నాటక పరిషత్లు సమర్ధంగా
నిర్వహించిన దక్షుడు కీర్తిశేషుడు శేఖరా బాబు.
తన స్వయం కృషితోనే సాధించుకున్న శేఖర్
బాబు
గారు కంప్యూటర్ ద్వారా ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా
ప్రారంభించి తన అనేక ప్రదర్శనలను అందులో నిక్షిప్తం
చేశారు. అన్ని తరాల వారికి అందుబాటులో ఉంచి.. తెలుగు
పౌరాణిక నాటక రంగానికి కొత్త పాఠాలు, కొత్త రీతిలో
బోధించే యత్నం చేశారు. సమర్థుడైన కార్యకర్త కావడం
మూలాన దాదాపు 9 సంవత్సరాల పాటు రంగస్థల
కళాకారుల ఐక్యవేదికకు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి
వరంగల్లో నాటక కళాపరిషత్లను నిర్వహించి పలు
సంస్థల ప్రశంసలను అందుకున్నారు. వృత్తితో పాటు,
ప్రవృత్తిని కూడా సమర్ధంగా నిర్వహించగలడన్న కీర్తిని కూడా
సంపాదించుకున్నారు.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పాలకుర్తిలో ఈవోగా బాధ్యతలు
నిర్వహిస్తున్న సందర్భంలో స్వామి దర్శనం నిమిత్తం వచ్చే
భక్తుల సౌకర్యార్ధం అక్కడి రాతిగుహను విశాలపర్చి స్వామి
దర్శనాన్ని సులభం చేసి.. భక్తుల ఇబ్బందిని తొలగించేందుకు
చేసిన కృషి వారి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ఉద్యోగ
విషయంలో ఎవరికైనా సాయంచేస్తూ న్యాయశాస్త్రంలో
మెళకువలు తెలిసిన వ్యక్తి గనుక శాఖాపరమైన, సర్వీసు
పరమైన ఎన్నెన్నో చిక్కులను చక్కదిద్ది ఎన్నో సలహాలతో
తోటి ఉద్యోగులకు సాయపడేవారు. ఆ తత్వం వల్లనే వారు
అందరికీ స్నేహపాత్రులయ్యారు.
ఓరుగల్లు రంగస్థలానికి ముఖ్యంగా పౌరాణిక
రంగస్థలానికి శేఖర్ బాబు గారి ప్రవేశం ఒక కొత్త కదలికలు
తెచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటికే పలు
సంస్థలు ప్రదర్శనలిస్తున్నా వీరు ఈ రంగంలో కాలుమోపిన
పిదన ఓరుగల్లు పౌరాణిక రంగస్థలం రాష్ట్రమంతా తనదైన
ముద్రతో జైత్రయాత్ర చేసింది. తనదైన ముద్రవేసింది. కేవలం
తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. బెంగుళూరు, మైసూరు, మహారాష్ట్ర,
వంటి పలుచోట్ల కూడా అనేక ప్రదర్శనలిచ్చి వరంగల్
పౌరాణిక నాటక ఘనకీర్తి బాహుటా ఎగరడానికి కీర్తిశేషులు
చతురుడు తెలంగాణ (385) తేజోమూర్తులు ఓట<noinclude><references/></noinclude>
9g3dec6ahv3b0jxo3lobxdbhyd96jow
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/407
104
212112
553020
2026-04-15T06:35:16Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పందిళ్ల శేఖర్ బాబు గారి ఉనికి ప్రధాన కారణమన్నది నిర్వివాదాంశం. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ వారు 2007లో నిర్వహించిన నాటకోత్సవాలలో బాబుగారు 'శ్రీ కృష్ణరాయబారం'...'
553020
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పందిళ్ల శేఖర్ బాబు గారి ఉనికి ప్రధాన కారణమన్నది
నిర్వివాదాంశం.
తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ వారు
2007లో నిర్వహించిన నాటకోత్సవాలలో బాబుగారు
'శ్రీ కృష్ణరాయబారం' నాటకాన్ని ప్రతిభావంతంగా ప్రదర్శించి
రెండు బంగారు 'గరుడ అవార్డులను సాధించారు. 2001లో
శ్రీ కాళహస్తీశ్వరా లలిత కళాపరిషత్ నుంచి 'యయాతి'
నాటకానికై ఉత్తమ ద్వితీయ ప్రదర్శన పురస్కారం అందు
కోవడంతో పాటు అదనంగా నాలుగు జ్యూరీ అవార్డులు
సాధించారు.
వారిలో నటన, దర్శకత్వం వంటి వాటితో పాటు..
గుణనిర్ణయం చేయగలిగే సామర్థ్యం ఉన్నది కనుకనే
రాష్ట్రంలోని పలు నాటక సంస్థలు వారిని గుణనిర్ణేతగా
ఆహ్వానించాయి. రాష్ట్ర ప్రభుత్వ నంది నాటకోత్సవాల
ప్రాథమిక పరిశీలనలోనూ రవీంద్ర భారతిలో పీఎంకేఎం
సాంఘిక నాటక పోటీలకు వారు గుజనిర్ణయం నిమిత్తం
ఆహ్వానింపబడటం వారి నిర్ణాయక శక్తిపై నిర్వాహకులకు
ఉన్న గౌరవాన్ని తెలుపుతున్నది. సునిశిత దృష్టితో
నిష్పాక్షికంగా రాగద్వేషాలకతీతంగా ప్రతిభను గుర్తించగల
నిష్ణాతుడు కనుకనే పలు నాటక సంస్థలు వారిని గుణనిర్ణయ
కమిటీల్లోకి ఆహ్వానించారు. ఇది వారి రంగస్థల జీవితంలో
మరో కలిక తురాయి. వారిలోని సమర్థతకు గీటురాయి.
పౌరాణిక నాటక రంగంలో రిహార్సిల్స్ నిమిత్తం బాగా
కష్టాలు పడవలసిన అవసరం కలుగుతూ ఉంటుంది. ఈ
విషయంలో శేఖర్ బాబు గారు మిక్కిలి శ్రద్ధతో ప్రవర్తించే
వారు. తోటి పాత్రధారులకు గానీ, మహిళా పాత్రధారులకు
గానీ, హార్మోనిస్టులకు గానీ ఎటువంటి అసౌకర్యం
కలగకుండా ఆర్థిక విషయాలను కూడా పరిగణనలోనికి
తీసుకుని నిర్వహించుకునేవారు. ప్రదర్శన నిమిత్తం కూడా
ఎంతదూరం వెళ్లవలసి వచ్చినా ఎటువంటి వ్యయప్రయాస
లకు లెక్కచేయకుండా వెళ్లి వచ్చేవారు. బహుమతులు
అందుకున్నా, అందుకోకపోయినా నిరాశ చెందకుండా
నాటక ప్రదర్శనలే ప్రధానంగా భావించి ప్రవర్తించే శేఖర్
బాబు గారి కృషి అమోఘం. తమ జీవితమంతా పౌరాణిక
నాటక రంగానికి అంకితం చేసిన వ్యక్తి కాబట్టే ఇటీవల
వరంగల్లో వారి స్మృతితో వారంరోజుల పాటు పద్య
నాటకోత్సవాలు నిర్వహించబడ్డాయి.
ఈ పద్య నాటక సప్తాహారానికి స్థానిక వదాన్యులే
కాకుండా శేఖర్ బాబు గారి అభిమానులతో పాటు తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం కూడా తమవంతు సహకారాన్ని
అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పలు
నాటక సంస్థలు ఈ పద్యనాటక సప్తా హారంలో తమతమ
నాటకాల్ని ప్రదర్శించాయి. హుజూర్ నగర్, ధర్మపురి, మధిర,
హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల నుంచి అద్భుతమైన
తమ ప్రదర్శనలిచ్చి.. ఓరుగల్లు ప్రజలను పులకింపజేసి....
కీర్తిశేషులు పందిళ్ల శేషుబాబు గారికి నిజమైన నివాళు
అర్పించాయి.
ఈ సందర్భంలోనే ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే
శ్రీ దాస్యం వినయ భాస్కర్ గారు, స్థానికమేయర్
శ్రీ నన్నపనేని నరేందర్ గారు, రాష్ట్ర శాసనసభాపతి
శ్రీ సిరి కొండ మదుసూదనాచారి గారు, రాష్ట్ర ఆర్థిక
శాఖామాత్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, తెలంగాణ
రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి
గారు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు
మామిడి హరికృష్ణ గారు, మాన్య ముఖ్యమంత్రి గారి ఓఎస్టీ
శ్రీ దేశపతి శ్రీనివాస్ గారి వంటి ప్రముఖులే గాక, స్థానిక
ప్రజలు, ప్రజాప్రతి నిధులు పాల్గొని కీర్తిశేషులు పందిళ్ల
శేఖర్ బాబు గారి సేవ లను కొనియాడమే గాక ఆ
సందర్భంలో వారి జ్ఞాపకంగా "స్మృతి శేఖరం" అనే ఒక
ప్రత్యేక సంచికను కూడా ఆవిష్కరించుకోవడం విశేషం.
తమ 54వ యేటనే 2015, ఏప్రిల్ 4వ తేదీన తనువు
చాలించిన కీర్తిశేషులు పందిళ్ల శేఖరా బాబు గారి పౌరాణిక
నాటకం నిలిచినన్నాళ్లు వెలుగుతూనే ఉంటుంది. తెలుగు
నాటక రంగంలో చిరంజీవిగా శేఖర్ బాబు గారు నిలిచే
ఉంటారు.
అంటుంటే తెలంగాణ 386 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
5drntp0gjy7ob1ndvpej85xxv3sigwe
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/408
104
212113
553021
2026-04-15T06:35:35Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '109 క వి విద్వాంసులు, అష్టావధాని, కరీంనగర్ నన్నయ్య, బ్రహ్మశ్రీ పార్వెళ్ల గోపాలకృష్ణశర్మ గారు కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలము “చాకుంట” గ్రామములో శ్రీ పార్వెళ్ళ రఘుపతిశర్మ...'
553021
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>109
క వి విద్వాంసులు, అష్టావధాని, కరీంనగర్
నన్నయ్య, బ్రహ్మశ్రీ పార్వెళ్ల గోపాలకృష్ణశర్మ గారు
కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలము “చాకుంట”
గ్రామములో శ్రీ పార్వెళ్ళ రఘుపతిశర్మ - యశోదాబాయి
దంపతుల ద్వితీయ గర్భ జనితులుగా ఈశ్వర నామ సం.ర
ఆషాడశుద్ధ అష్టమి తేది 31.07.1937న జన్మించారు. వీరు
H.S.C. వరకు కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో
విద్యనభ్యసించినారు. స్వయం కృషితో తెలుగులో
పాండిత్యము సాధించి, ఆంధ్ర సారస్వత పరిషత, ప్రాచ్యభాష
అయిన D.O.L. మరియు B.O.L. పరీక్షలకు ప్రైవేటుగా
హాజరయి ఉత్తీర్ణులయినారు.
తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి
స్వయంకృషితో M.A. (తెలుగు) పట్టాను పొందారు. వీరు
సంస్కృతాంధ్ర పండితులు. సంస్కృతమును స్వయంగా
నేర్చుకొన్నారు. మరియు చిత్రకారులు. అష్టావదాన లబ్ధ
ప్రతిష్ఠులు. పంచాక్షరీ జప పరాయణులు. కృత యాత్రా
నుభవ కృతార్థులు. అనంత శ్రీ విభూషితులగు కరపాత్ర
స్వామి పూజ్య పాద కర కమలమంతి కృత పూర్ణాభిషిక్తులు.
శ్రీ విద్యాపాసకులు. వీరు మొట్టమొదట మాందాపురములో
SGBT ఉపాధ్యాయునిగా మొదటిగా నియమించబడినారు.
తరువాత తెలుగు పండితులుగా పదోన్నతి గావింపబడి వివిధ
ఉన్నత పాఠశాలలో పనిచేసినారు. జూనియర్ లెక్చరర్ గా,
పార్వెళ్ళ గోపాలకృష్ణశర్మ
- జి.వి. కృష్ణమూర్తి
సిరిసిల్లా జూనియర్ కాలేజి ప్రిన్సిపాలుగా, డిగ్రీ కాలేజి
లెక్చరరుగా పనిచేసి పదవీ విరమణ గావించినారు.
వీరు తెలుగులో రచించి ముద్రించిన పద్యకావ్యములు
మూడు. అవి 1. వాసంతి 2. పంచ ముఖాంజనేయము
3. సౌందర్య లహరి.
అముద్రిత రచనలు. 28. అవి వరుసగా 1. నానార్ధ
రత్నమంజూష 2. విషమ ప్రపంచము 3. పర్ణవిలాపము
4. వేణూదయము 5. వేంకటేశ్వర శతకము 6. ముక్తకములు
7. శివానందలహరి 8. కార్తీక మహోత్సవము 9. పాండు
రంగ శతకము 10. పాఱువేట 11. విష్ణు సహస్రనామములు
(శంకర భాష్యానువాదము) 12. కన్నీరు 13. సంగ్రమ
రామాయణము 14. భాగవత విశేషములు 15. పుష్ప
విలాపము 16. నాగపూజ 17. గణపతి 18. యంత్రాను
భవము 19. స్పర్శ 20. పంచకన్యలు 21. కల్యానావాణి
22. గీతా మహత్యము 23. స్వప్నములు 24. మధుర
స్మృతులు 25. పండుగలు 26. ఆచారములు - సంప్రదా
యములు 27. భువన విజయము 28. వైనపు వైనము
వాసంతి: ఇది పద్య ఖండకావ్య సంపుటి. ఇందులో
1. సుప్రభాతము 2. ప్రార్ధన 3. సౌమ్య వసంతము 4.
అభిలాష 5. త్రిమూర్తులు 6. ప్రణయాంచు 7. శిశింప 8.
ఆదిత్యము 9. విచికిత్స 10. విపరీతము 11. కవితా
మీమాంస 12. నిషర సత్యము 13. ఓ కవీ!
నా తెలంగాణ 387 తేజోమూర్తులు ఉంట<noinclude><references/></noinclude>
sd7fuejjndm5iihnhko5btz18hlyawk
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/409
104
212114
553022
2026-04-15T06:35:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '14.ఆత్మార్పణము 15. చంద్రశేఖరా! అను 15 ఖండితలు కలవు. వీరి రచనలలో భావ గాంభీర్యము, భావనాపటిమ, రచనా రమణీయకము, కల్పనాచమత్కృతి, రసపోషణ, ఉదాత్తశైలి పదపదమున వున్న దనుటలో అతిశయోక్తిలేదు....'
553022
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>14.ఆత్మార్పణము 15. చంద్రశేఖరా! అను 15 ఖండితలు
కలవు.
వీరి రచనలలో భావ గాంభీర్యము, భావనాపటిమ,
రచనా రమణీయకము, కల్పనాచమత్కృతి, రసపోషణ,
ఉదాత్తశైలి పదపదమున వున్న దనుటలో అతిశయోక్తిలేదు.
ఈ కావ్యము శివసుప్రభాతముతో మొదలై చంద్రశేఖర స్తుతి
పాఠముతో నంతమైనది. ఈ ఉపక్రమోప సంహారములు
శివాత్మకములై శివంకరములై కృతి విలక్షతను చాటుచున్నవి.
వీరి మొదటి పద్యములో ప్రకృతి కాంత తన మధుర పంజుల
గళపేటిక విప్పి విశ్వవీణపై శివరంజని రాగము మేళవించి
ప్రభాత గీతములు పాడును శివస్వామిని మేలుకొల్పుచున్న
రసవత్తర రమణీయ కల్పన ఆహ్లాదముగా నున్నది.
శ్రీ గిరిజా మనోహర విశించి ముహూర్తము వేళయయ్యె నీ
కై గళ పేటి విప్పి కలకంఠ రవంబున విశ్వ వీణ పై
రాగము మేళవించి శివరంజనియై నిను మేలుకొల్పేదున్
భోగి విభూషణ ప్రకృతి భోగిని కన్నులు విప్పుమా ప్రభూ!
ఇందులోని 'త్రిమూర్తులు' ఖండికలో వారు తెల్సిన
త్రిమూర్తులు. 1. సుభాస్ చంద్రబోస్ 2. గాంధీ మహాత్ముడు
3. వల్లభాబాయి పటేలు. ఆ త్రిమూర్తులవలెకాక వీరి
కర్తవ్యములు. ఆధునిక భారత జాబిత్యవసరమగు నేతృత,
మాతృత, సౌభాతృతయై యున్నవి. కవి జాతి శ్రేయస్సును,
సమాజ వికాసమును, విశ్వ కల్యాణమును, దృష్టిలో పెట్టుకొని
రచన చేసెననుటకు యిట్టి వెన్నెని ఈ కృతిలో కానవచ్చును.
పంచ ముఖాంజనేయము
మెదక్ జిల్లా సమీపమున గోసముద్రమను పేర ఒక
సరోవరము కలదు. దాని చివర శ్రీ పంచముఖాంజనేయ
స్వామి ఆలయమున్నది. కవిగారు ఆ స్వామిని దర్శించి,
ఆంజనేయ ఆవిర్భావాది సకల కృత్తమును సేకరించి,
భక్త్యావేశముతో స్వామి వృత్తమే వస్తువుగా ఈ కావ్యమును
రచించెను. ఇది భక్తి ప్రధాన రసముగా సాగిన కావ్యము.
వీర, శౌర్య, అద్భుతాది రసములును ప్రపంచింపబడినది.
ఇది చాతుర్వర్ణ వ్యవస్థ, స్వామి మహాత్మ్యముల నొప్పుడు,
భక్తి వైరాగ్య భావములతో విలసిల్లుచున్నది. శివకేశవుల
కభేద భావముతో సంఘమును సంస్కరింపబూనిన
దీకావ్యము. ఇందులోని భాష సరళ సుందర పై
సలక్షణమైనది. భావములు రమణీయము. ఇది మూడు
ఖండములుగా విభజింపబడినది. 1. ఆవిర్భావ ఖండము
2. విక్రమ ఖండము 3. ఉత్తర ఖండము.
కవిగారు ఇందు సందర్భోచితముగా హనుమన్
పటలము, హనుమత్ సుప్రభాతమును హనుమత్ మహత్య
యమును తెలియజేసినారు. ఈ కావ్యము ఆకృతిని
చిన్నదయ్యు, భక్తిభావ ప్రకటనమందున, కవితా కళా సంపన్న
తందును మిన్నయై విరాజిల్లుచున్నది. కథా కధనము
నందును, కథా సంగ్రహకరణమునందును, చూపిన నేర్పు
ప్రశంసనీయమైయున్నది. పద్యములన్నియు భావబంధు
రములు, ప్రసన్నములును, ధారామద్ది శోభితములునై
యున్నవి.
ఉదాహరణకు ఇందులోని పురవర్ణము...
శ్రీలకు తానకంబయి సమృద్ధిగ
పంట మంతి పంటలన్
చేల పొలాల రాసులుగ
జేయగనొప్పు మెదమ్మ రంబునన్
దాలయమై వసించుటకు
నక్కటికంబు వహించు స్వామినే
నా లలిత ప్రవృత్తులును
వాంచితమున్నెర పేర్చియేలుతన్
ఇటువంటి అందమైన పద్యములు ఈ కృతిలో
గలవు.
సౌందర్యలహరి
ఇది శంకర భగవతృదుల సౌందర్యలహరి సంస్కృత
శ్లోకాలకు తెలుగు పద్యములలో చేసిన అనువాద గ్రంథము
మూలభావములకు అనుగుణంగా సరళ సుందర శైలిలో
సాగిన కృతి.
సౌందర్యలహరిలోని మంత్ర రహస్యములు, యంత్ర
రహస్యములు, తంత్ర రహస్యములు, యోగ రహస్యములు,
సాధక రహస్యముల గల ప్రతి శ్లోకమునకు మూలము
సతిక్రమింపకుండా శంకర భాగవత్చదుల కవితా
హృదయము మార్గకవిత మరింత పరిపుష్ట మొనర్సు పద్ధతిలో
అనువాదము బహు రమ్యముగా సాగినది. మంత్ర తంత్ర
రహస్యాదులలో ప్రవేశము లేనివారు సైతము కవితా
యలు తెలంగాణ 388 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude>
qeldbjvi78npqn0vx0k2uwy32u38xyx
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/410
104
212115
553023
2026-04-15T06:36:02Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సౌందర్యముతో తృప్తులగునట్లు అనువాదము సాగినది. మచ్చునకు... శివశక్తియుక్తా అను శ్లోకమునకు శివశక్త్యాయుక్తోయడి భవతి శక్తః ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితురుని అత...'
553023
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సౌందర్యముతో తృప్తులగునట్లు అనువాదము సాగినది.
మచ్చునకు...
శివశక్తియుక్తా అను శ్లోకమునకు
శివశక్త్యాయుక్తోయడి భవతి శక్తః ప్రభవితుం
నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితురుని
అత్రస్యా మారాద్యాం హశిహర విశించాడిఖిరపి
ప్రణతు స్తోతంవా నా కథ మకృత పుణః ప్రభవతి
శివుడును శక్తియుక్త తనె సృష్ఠినొనర్పగ జాలు గానిచో
నవని కదల్పనుం గదల నైనను జాలడు నందు చేతనే
శివ హరి ధాత్మ రుద్ర పళిసేవ్యపు,
నిన్గత జన్మపుణ్య సం
భవ ఫలితంబుగా కొలువ పాడగ
మ్రొక్కగ గల్గు నేరితిన్
ఇంకొక శ్లోకము
మూలము:
హరిత్యా మూరాధ్య ప్రజత జన సౌభాగ్య జననీమ్
పురా నారీ భూ త్వా పురశిపు మపిక్షో భమనయత్
స్మరో విత్వాం సత్యా రతినయన లేహ్యేన వపుషో
మునీ నామవ్యంతః ప్రభవతి హిమోహాయ జగతామ్
అనువాదము:
హరి నిను గొల్చియే ప్రణతులైన
జనంబుల దీర్చిదిద్దు మా
తరొ పుర వైశి మోహమున దద్దయు
దేల్చెడి స్త్రీత్వ మందె నా
మరుడును నిన్నుగొల్చి రతి
మానసహారి సురూప మంది డు
స్తర తప మాచరించు ముని
చక్రమ వక్రత నిగ్రహించెదును
మూల భావమునకనుగుణముగా రచన సాగినది.
ఈ రచనలతోపాటు అనేక ప్రాంతములలో
అష్టావధానములు చేసి పంచి అవధానిగా పేరు గాంచినారు.
నిరాడంబరముగా, నియమబద్ధమైన జీవితమును సాగిస్తూ,
కరీంనగర్ మాలాంటి వారికి పెద్ద దయగా నుండి
సందేహాలను నివృత్తి కోస్తూ ప్రబంధ కార్యముల లోతులను
తెలియజేస్తూ మాకు విజ్ఞాన సంధాయియై తెలుగు
సాహిత్యములో విశేష కృషి సల్పి ' వాచస్పతి' బిరుదాంకితులై
విరాజిల్లిన బ్రహ్మశ్రీ పార్వెళ్ళ గోపాలకృష్ణ శర్మ గారు ధన్యులు.
చేతులు తెలంగాణ 389 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
q66p121l3yigmrublsipi25oocu5olm
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/411
104
212116
553024
2026-04-15T06:36:19Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '110 పేర్వారం జగన్నాథం - డా॥ తిరునగరి అ భ్యుదయ కవితోద్యమ తరువాత తెలుగు సాహితిలో అకర్షించినవారు చేతనా వర్తకవులు. మనిషి ఆత్మానుభూతి నుంచి సమాజ చైతన్యంలోకి ప్రయాణిస్తున్నాడనే...'
553024
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>110
పేర్వారం జగన్నాథం
- డా॥ తిరునగరి
అ
భ్యుదయ కవితోద్యమ తరువాత తెలుగు సాహితిలో
అకర్షించినవారు చేతనా వర్తకవులు. మనిషి
ఆత్మానుభూతి నుంచి సమాజ చైతన్యంలోకి
ప్రయాణిస్తున్నాడనే స్పృహతో వీరు కవిత్వం రాశారు. దీనిని
చేతనా వర్తమానిగా పిలిచారు. తెలంగాణకు చెంది, ఓరుగల్లు
నేలకు చెందినవారు సుప్రసన్న, పేర్వారం జగన్నాథం,
సంపత్కుమార, వేనరెడ్డి. చేతనావర్తకవిగా సుప్రసిద్ధులైన
పేర్వారం జగన్నాథం గారు ప్రధానంగా అధిక్షేప కవి.
పఠాభి 'ఫిడేలు రాగాలు డజన్, కవితా సంపుటిని
రచించి అధిక్షేప కవిగా ప్రసిద్ధులయ్యారు. పఠాభి తరువాత
వెంటనే గుర్తుకు వచ్చే కవి పేర్వారం జగన్నాథం గారు.
పఠాభి తరువాత వ్యంగ్యాన్ని సందర్భోచితంగా ప్రయోగించి
'ఔరా అనిపించిన కవి పేర్వారం. పఠాభి నగర జీవనాన్ని
వస్తువుగా స్వీకరించి వ్యంగ్యంగా, అధిక్షేపాత్మాకంగా వచన
కవిత్వం రచించి సఫలీకృతులయ్యారు. పేర్వారం సమాజం
ప్రజల ఆశల్ని కలల్ని ఎలా విచ్ఛిన్నంచేసిందో తమ
కవిత్వంలో శక్తివంతంగా ప్రదర్శించారు.
ఆధునిక వచన కవితలో ఇంతటి వ్యంగ్యాన్ని,
అధిక్షేపాన్ని రంగరించిన కవి పేర్వారం జగన్నాథంగారే
అంటే అతిశయోక్తికాదు. స్వతంత్రభారతదేశంలో పెరిగిన
దోపిడి, లంచగొండితనం, అవినీతి ఈ కవిని కలచివేసినై.
సునాయాసంగా సంపన్నులు కావడానికి రాజకీయ
రంగప్రవేశం ఒకటే మార్గం అని భావించిన వాళ్ళను చూసిన
తరువాత తన కవితలో వ్యంగ్యాన్ని ప్రతిష్టించడం అవశ్యమని
ఆయన భావించారు. రాజకీయ వాతావరణాన్ని, కుహనా
సంస్కారాన్ని చూసి పేర్వారం గుండెలో అగ్నిపర్వతాలు
ఆయన వక్రోక్తి, ని ఆశ్రయించి రచించిన కవిత్వం
వృషభపురాణం, కవిత్వానికి దేశ సంక్షేమాన్ని కోరి సందేశం
ఇవ్వడం ఎంత ముఖ్యమో, అభివ్యక్తి మార్గానికి చెందిన
శిల్ప నైపుణ్యం కూడా అంతే ముఖ్యం. 'దేశాన్ని జాతినీ
మానవతనూ విస్మరించిన కవిత్వం నేల విడిచిన సాము
లాంటిది. కేవలం నినాదాల్ని వల్లిస్తూ కవిత్వమని బుక్కా
యించకుండా రమణీయంగా వ్యంగ్య విలసితంగా చెప్పడమే
'నా లక్ష్యం' అన్నారు పేర్వారం జగన్నాథంగారు. పేర్వారం
జగన్నాథం గారు ప్రస్తుత జనగామ జిల్లా, రఘునాథపురం
మండలంలోని ఖిలా షాపురంలో 23-8-1934 నాడు
జన్మించారు. శ్రీమతి సయ్యమ్మ, సంతాజీ ఆయన జననీ
జనకులు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో, ఉన్నతపాఠశాల
విద్యను హనుమకొండలో అభ్యసించారు. ఉస్మానియా
విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పూర్తి
చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా
ఉన్న వరంగల్ ఆప్సి సైన్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాస
తెలంగాణ (390 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
kqph43h3ol5gbw51qxbnc1f3dn4szcw
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/412
104
212117
553025
2026-04-15T06:36:39Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కులుగా చేరారు. తరువాత వరంగల్ పోస్టుగ్రాడ్యుయేట్ సెంటరులో పని చేశారు. అదే కాకతీయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. అక్కడి నుండి ప్రొఫెసరుగా పదవీ విరమణ చేశారు. ఉద్యోగ జీవితంలో...'
553025
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కులుగా చేరారు. తరువాత వరంగల్ పోస్టుగ్రాడ్యుయేట్
సెంటరులో పని చేశారు. అదే కాకతీయ విశ్వవిద్యాలయంగా
అవతరించింది. అక్కడి నుండి ప్రొఫెసరుగా పదవీ విరమణ
చేశారు.
ఉద్యోగ జీవితంలో కాకతీయ విశ్వవిద్యాలయం
అధ్యక్షుడుగా, పాఠ్యప్రణాళికా సంఘ అధ్యక్షుడుగా కాకతీయ
అధ్యయాన కేంద్రం డైరెక్టరుగా. ఆం.ప్ర. సాహిత్య అకాడమీ
సహాయ కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు
ఉపాధ్యక్షుడిగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
వైసాన్సలర్గా ఆయన పనిచేశారు.
పేర్వారం మాతృభాష ఆరెభాష ఐనా విద్యార్థి దశ
నుంచే ఆయన సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నారు.
హైస్కూలులో చాల్లేటి నరసింహశర్మ గారు తెలుగు
అధ్యాపకులుగా రచనవైపు దృష్టిని మళ్ళించారు. ఉస్మానియా
విశ్వ విద్యాలయంలో ఎం.ఏ. చదివేకాలంలో ఆచార్య
దివాకర్ల వేంకటావధాని, కురుగంటి సీతారామయ్య, చెలమ
చర్ల రంగాచార్యులు, ఖండవల్లి లక్ష్మీరంజనం, బిరుదురాజు
రామరాజు గార్లు అధ్యాపకులు. ఆ సాహితీమూర్తుల బోధన,
స్ఫూర్తి జగన్నాథంగారిని కవిగా, సాహితీముర్తిగా తీర్చిదిద్దినై.
విశ్వ విద్యాలయ విద్యార్థిగానే జగన్నాథం గారు రచించిన
కవితాసంపుటి. సాగరసంగీతం, ఎందరో సాహితీపరుల
ప్రశంసలనందుకుంది.
పేర్వారం రచనలు
సాగర సంగీతం (1960); చేతనావర్తం (1,2,
భాగాలు) (1967-1970); వృషభపురాణం (1984);
ఎస్.ఇ.ఆర్.టి., మైసూర్ వారికి ప్రాంతీయ కళాశాలలో
పాఠ్యగ్రంథంగా నిర్ణయింపబడింది.
గరుడపురాణం (1995), సాహిత్యావలోకనం
సాహిత్యవాసి సంపుటి; సాహిత్యావలోకనం - సాహిత్యవ్యాస
సంపుటి (1982); సాహితీవసంతం, (వ్యాస సంపుటి)
(1992); ఆరె జానపద గాధలు (1986); ఆరె జానపద
గేయాలు (1957); ఆరె జానపద సాహిత్యం - తెలుగు
ప్రభావం - సిద్ధాంతం.
పేర్వారం జగన్నాథంగారు ప్రతిష్టాత్మక
పురస్కారాలనెన్నో అందుకున్నారు. ఆచార్యులుగా దక్షణ
భారత విశ్వ విద్యాలయాలలో జరిగిన సదస్సులలో పత్రాలు
ఎన్నో సమర్పించారు. పేర్వారం అనేక పత్రికలలో
ప్రచురించిన రచనలు పరిశీలించారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలోనే గొప్ప అధిక్షేప రచన
వృషభపురాణం అని పేరు పెట్టడంలోనే వ్యంగ్యం
కనిపిస్తుంది. పార్కురికి సోమనాథుని బసవపురాణం, ఈ
పేరుపెట్టడానికి ప్రేరణ. సమజా సంస్కరణ ధ్యేయంగా
బసవపురాణం రచన సాగింది. పేర్వారం వృషభపురాణం.
రాజకీయాలను, నాయకులను ఎత్తిపొడిచే, విమర్శించే
వ్యంగ్యకవిత్వం. ప్రజల్ని పీడించే ఆబోతుల వ్యంగ్యప్రదర్శనం.
రాజకీయ వృషభం గూర్చి చెబుతూ
'మరునాడు పొద్దుపొడవకముందే
వైతాళికలు నిదురులేపగా
బుద్ధగమలో బౌద్ధమతం స్వీకరించి
అశోకసమ్రాట్టు సమాధిపై
పూలగుచ్చం సమర్పించి
రాజధానికి తరలివస్తూ
దారిలో కనపడ్డ గోవుల్ని
పద్యశీలకు పంపింది.' అని వాడిగా వ్యంగ్యంగా
చెబుతారు.
తెలంగాణాలో ప్రజల్ని పీడించిన నాయకులు,
రజాకార్లు, స్వాతంత్య్రానంతరం రాజ ప్రముఖ బిరుదులు,
ఉన్నత పదవులతో సత్కరింపబడడాన్ని చూసి ఈ కవి
పూర్వాశ్రమంలో వారు
పక్కా రజాకారు
ప్రస్తుతం వారొక మంత్రి గారికి
బావమరిది
వారి పెద్ద కుమారుడు
ఖాదీ బోర్డుకధ్యక్షుడుగా
ఇటీవలే నామినేటెడ్, అంటూ మేడిపండ్ల
పొట్టలు చీల్చారు
నమ్మినవాళ్ళను మోసగించే వారిని పేర్వారం
మందలించిన వైనం. ఆయన ధర్మాగ్రహాన్ని వెల్లడిస్తుంది.
ఇక ముందెప్పుడూ
విశ్వాసంలేని కుక్కల్ని పెంచుకొని
A తెలంగాణ (391) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
lfi1dg9oxyynxst7lb9x1sh0gwu7kbx
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/413
104
212118
553026
2026-04-15T06:37:07Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గుర్రుపెట్టి నిద్రపోకండి చుట్టూ దొంగలున్నారు జాగ్రత్త, అన్న వంతుల్ని చదవగానే ఆ దొంగలెవరో పాఠకులు గ్రహిస్తారు రంగన్నాథంగారికి పేరు తెచ్చిన కవిత "స్వయంవరం, అందుకే నేను సా...'
553026
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గుర్రుపెట్టి నిద్రపోకండి
చుట్టూ దొంగలున్నారు జాగ్రత్త, అన్న వంతుల్ని
చదవగానే ఆ దొంగలెవరో పాఠకులు గ్రహిస్తారు
రంగన్నాథంగారికి పేరు తెచ్చిన కవిత "స్వయంవరం,
అందుకే నేను సావిత్రిలా నటించలేను.
యముడు మునుపటంత ధర్మరాజు కాడు
తెగించి వెంటబడితినా
యమునితో లేచి
స్త్రీ సమస్యలపట్ల ఆయనకున్న అవగాహనను పై
పంక్తులలో మనం గమనించవచ్చు.
వృషభ పురాణంలోని ప్రతి కవితలో పేర్వారం మ్యంగ్య
వస్తు వైభవాన్ని సహృదయాలు గుర్తిస్తారు. సమకాలీన
సమాజానికి సంబంధించిన వస్తువును ఎన్నకోవడంలోనూ
దాన్ని తనదైన బాణిలో శక్తివంతంగా వ్యక్తీకరించడంలోనూ
ఆయన నైపుణ్యం కన్పిస్తుంది. పేర్వారం వారు కావ్యకర్తేకాదు.
సాహితీబంధుబృందంవంటి సాహిత్యసంస్థను హన్మకొండలో
స్థాపించి ఎందరో సాహితీపరులను ప్రోత్సహించారు.
సదస్సులోద్భవించారు.
వివిధ రచయితల సాహిత్యవాస్తు సంపుటులను
ప్రచురించారు. వానిలో అభ్యుదయ కవితా ఇతర ధోరణుల
వంటి మంచి వ్యాస సంపుటలను ప్రచురించింది.
మరోసాహిత్యగ్రంథం. ఆయన ప్రచురించిన దేశీయ కవిత
ప్రస్థానం. పేర్వారం చకుని పరిశోధకుడు ఆయన పిహెచ్
సిద్ధాంత గ్రంథం 'ఆరెజానపదం సాహిత్యం తెలుగు ప్రభావం.
ఆచార్య రవ్వా శ్రీహరి గారితో కలిసి సిద్ధం చేసిన గ్రంథం
ఆరెభాషా నిఘంటువు చిరకాలం నిలిచే గ్రంథం.
అభ్యుదయ కవితానంతర ధోరణులు ఆయన సంపాద
కత్వంలో వెలువడిన ప్రసిద్ధ సాహితీవేత్తల వ్యాస సంకలనం,
సాహితీపరులకు సర్వకాలాలకు రిఫరెన్స్ గ్రంథం.
తెలంగాణాలో దాదాపు ఐదు దశాబ్దాలపాటు
సాహిత్యసంస్థల ద్వారా, కళీ వేదికల
ద్వారా, ఎందరినో
కవులుగా సాహితీ స్రష్టలుగా, విమర్శకులుగా వెలుగులోనికి
సాహితీస్రష్టలుగా,
తెచ్చారు. ఆధునిక యుగంలో తెలంగాణంలో సాహిత్య
తనను రావడానికి కారణభూతులుగా పేరొందారు. ఆయన
నిండుమానంబు నవనీత సమానం.
గ్రేట్ ఇండియన్ సర్కస్, వంటి కవితలను పేర్వారం
మాత్రమే రచించారు. ప్రాపంచిక అనుభవాలను ఇంత
సహేతకంగా సమగ్రంగా ఆవిష్కరించిన కవులు అరుదు.
ఇంత సరళ సుందరంగా చెప్పినవారు అరుదు.
'మానవ ప్రవృత్తుల మౌలిక స్వపాలన
వెలికితీయడంలోనూ సర్వమానవ సహోదర జీవనాశయానికి
అవరోధంగా ఉన్న సంఘర్షత శక్తుల్ని వెలువరించడంలోనూ
పేర్వారం కవిగా కొనసాగించిన కృషి అసాధారణమైంది.
అన్న డా।।పి.వి. రమణ మాటలు అక్షర సత్యాలు.
విశ్వశ్రేయస్సే లక్ష్యంగా జీవనానుభవాలను
అధిక్షేపరీతిలో అభినవంగా ఆవిష్కరించిన విశిష్ట కవి
తెలంగాణ ముద్దుబిడ్డ ఆచార్య పేర్వారం జగన్నాథం తెలుగు
సాహిత్య లోకానికి ప్రాతఃస్మరణీయులు,
అంటుంటే తెలంగాణ 392 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
0xkkveoqtrm7r028eb7is4ihvgg7h4o
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/414
104
212119
553027
2026-04-15T06:37:25Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '111 పొట్లపల్లి రామారావుగారు ఒక గొప్ప తాత్విక కవి. తమతరం సాహితీ మిత్రులచే 'అజ్ఞాత మహాకవి'గా పిలువబడ్డవారు. తొలితరం కథకులు. కవిత్వం, కథ, నవల, గల్పికలు, లేఖలు - ఇలా అనేక ప్రక్రియల్...'
553027
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>111
పొట్లపల్లి రామారావుగారు ఒక గొప్ప తాత్విక కవి.
తమతరం సాహితీ మిత్రులచే 'అజ్ఞాత మహాకవి'గా
పిలువబడ్డవారు. తొలితరం కథకులు. కవిత్వం, కథ, నవల,
గల్పికలు, లేఖలు - ఇలా అనేక ప్రక్రియల్లో సాహిత్య సృజన
చేసినవారు. ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప సభలకూ
సమావేశాలకూ, చర్చలకూ, ఉపన్యాసాలకు దూరంగా
ఉంటూ వచ్చారు. ఒక మారుమూల పల్లెటూల్లో రైతులతో,
పాలేరులతో, పనిమనుషులతో వాళ్ళలో ఒకరిగా జీవించారు.
పండ్ల తోటల్లో, కంచెల్లో, చెరువు కట్టమీద వాగుబడ్డున
కూర్చుని, గుట్టల శిఖర రేఖల్నీ తాకుతూ, చుట్టూ
కనుచూపుమేర ధ్యాన సరస్సు అలలుగా వ్యాపిస్తూ ప్రకృతిలో
కల్సిపోయి పక్షుల గొంతై, మబ్బుల తేమై, సూర్యోదయాల,
సూర్యాస్తమయాల వెలుగు రాశులై అతీతాన్ని తన
అణువణువులో నింపుకుని, కృత్రిమ విలువల్నీ, క్షణికమైన
గొప్పతనాల్నీ, ఆస్తుల్నీ, అంతస్థుల్నీ దులుపుకుని సహజమైన
'జీవితం' వేలుపట్టుకుని 'కాలిబాట' మీద సాగిపోయినవారు
పొట్లపల్లి రామారావు గారు. వారు కవి మాత్రమేకాదు,
ఒక తత్వవేత్త. దార్శనికులు. తెలంగాణ తాత్విక, సాంస్కృతిక,
రాజకీయ ప్రపంచాలకు వెలుగులు పంచిన నక్షత్రం.
పొట్లపల్లి రామారావుగారు 20 నవంబర్ 1917న
వరంగల్ జిల్లా 'తాటికాయల' గ్రామంలో చెల్లమ్మ,
శ్రీనివాసరావు దంపతులకు జన్మించారు. వీరిది పెద్ద
భూస్వామ్య కుటుంబం. తండ్రి శ్రీనివాసరావుగారు చుట్టూ
పొట్లపల్లి రామారావు
- వి.ఆర్. విద్యార్థి
నాలుగూళ్ళకు ఒక పెద్ద దొర. చిన్న వయసులోనే ఎంతో
పేరు ప్రఖ్యాతి సంపాదించినవారు. వ్యవసాయంలో ప్రతిభా
వంతులు. వీరు 'వెలమ సామాజిక వర్గానికి చెందినవారు.
ఎందరో జీతగాళ్ళు, ఆడ, మగ పనిమనుషులు వీరి పనులు
చూసుకునేవాళ్ళు. ఊరి పెత్తనమంతా తమ చేతుల్లో ఉం
డేది. వరంగల్ సుబేదార్ (నాలుగైదు జిల్లాలకు కల్పి ఒక
సుభా. ఆ సుభా ప్రభుత్వాధిపతి సుబేదార్)తో సాన్నిహిత్యము
ఉండేది.
శ్రీనివాసరావు గారికి నలుగురు కుమారులు, ఒక
కుమార్తె, రామారావుగారు మూడో సంతానం. ఐతే గొప్పగా
సాగిపోతున్న ఈ కుటుంబంలో పెను విషాదం చోటుచేసు
కుంది. శ్రీనివాసరావుగారి హటాన్మరణంలో కుటుంబం
ఆగమయింది. ఈ కుటుంబాన్ని గొప్పగా చూసిన
దాయాదులే, బంధువులే, ఆశ్రితులే, సన్నిహితులే వారి
ఆస్తుల్ని దోచుకున్నారు. వెండి, బంగారం, డబ్బును
తస్కరించారు. భూముల్ని ఆక్రమించారు. ఆస్తుల భూముల
వివరాలు తెలియని చెల్లమ్మ ఐదుగురు చిన్న పిల్లల్తో కష్టాల
కడలిలో మునిగిపోయింది. అప్పుడు రామారావుగారి
వయస్సు పన్నెండేళ్ళు. ఎలాగో రామారావుగారి పెద్దన్నయ్య
పదహారేళ్ళ వయస్సులో తేరుకొని ఇంటి పెత్తనం చేతబట్టారు.
ఏడవ తరగతి చదువుతున్న రామారావుగారి చదువు
అంతటితో ఆగిపోయింది. హన్మకొండకో, హైదరాబాద్ కో
వెళ్ళి చదువుకునే ఆర్థిక స్థోమతలేదు. ఊరికే పరిమిత
మయ్యారు.
A తెలంగాణ 393 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
44i289m0l5uz4v4lj74kynxaiiqro42
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/415
104
212120
553028
2026-04-15T06:37:40Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రామారావుగారికి తమ పదహారోయేట మేనమామ కూతురైన వెంకట నర్సమ్మగారితో వివాహమైంది. బీరిడి రమాదేవి, సుజాత, నిర్మల అని ముగ్గురు కూతుళ్ళు గోపాల రావు అని ఒక కుమారుడు. చిన్నతనం నుండే భ...'
553028
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రామారావుగారికి తమ పదహారోయేట మేనమామ
కూతురైన వెంకట నర్సమ్మగారితో వివాహమైంది. బీరిడి
రమాదేవి, సుజాత, నిర్మల అని ముగ్గురు కూతుళ్ళు గోపాల
రావు అని ఒక కుమారుడు.
చిన్నతనం నుండే భిన్నమైనతత్వం రామారావుగారిది.
వారిలో దొరతనపు ఛాయలు మచ్చుకైనా లేవంటారు.
కులమత భేదాలు, ధనిక, పేద తారతమ్యాలు లేకుండా.
అందరితో కలిసిమెలిసి ఉండేవారట. సమగౌరవం, ప్రేమ,
కరుణ పంచేవారట! ఉన్నంతలో ఏదో కొంత ఆర్థిక
సహకారం కష్టాల్లో ఉన్నవారికి అందించేవారట.
తాము వివాహితులైనా, ఆర్థిక పరిస్థితులు
బాగాలేకున్నా, కుటుంబ బాధ్యతలెన్నో ఉన్నా వారి
మనసంతా అధ్యయనం మీద, పోరాటాలమీద ఉండేది.
వరంగల్లులోని ప్రముఖ గ్రంథాలయాల్లోని గ్రంథాలన్నీ
చదివి, హైదరాబాద్ వెళ్ళి అక్కడ రెండేళ్ళపాటు ఉండి రెడ్డి
హాస్టల్లోని గ్రంథాల్నీ, స్టేట్ లైబ్రరీలోని గ్రంథాల్నీ
చదివివొచ్చారు. ఆ క్రమంలోనే సంస్కృతం, ఇంగ్లీష్, ఫార్సీ,
అరబ్బీ, ఉర్దూ భాషల్లో రచనలు చేశారు.
-
సాహిత్యం, దేశభక్తి నిజాం పాలనను అంతమొందించ
డానికి జరిగిన పోరాటం, గాంధీజీ నాయకత్వంలో నడిచిన
భారత స్వాతంత్య్ర సంగ్రామం వీరి జీవితంలో ముఖ్య
మైనవి. వందేమాతరం ఉద్యమానికి గూడా ఆకర్షితు
లయ్యారు రామారావుగారు. జీవితాంతం గాంధీయ వాదిగా
ఉన్నారు.
24 నవంబర్ 1988న నిజాంకు వ్యతిరేకంగా జరిగిన
పోరాటంలో పాల్గొని వరంగల్లులో అరెస్టయిన మొదటి
జట్టులో రామారావుగారున్నారు. వీరితో అరెస్టయిన వారిలో
హయగ్రీవాచారి, ఇటికాల మధుసూదన్
రావుగారున్నారు.
సుమారు ఆరు నెలలపాటు జైలు జీవితం గడిపి 10 ఏప్రిల్
1989న విడుదలయ్యారు. అరెస్టయినప్పుడు రామారావు
గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు. వీరు జైలులో ఉన్న
కాలంలో చాలా రచనలు చేశారు. 'జైలుకథలు' అక్కడ
రాసినవే! ప్రఖ్యాత బెంగాలీ కవి నజ్రుల్ ఇస్లాం సైనికుడిగా
యుద్ధ రంగానికి వెళ్ళి మొదటి ప్రపంచ యుద్ధం 1914లో
కవిగా తిరిగొచ్చినట్లు రామారావుగారు పోరాట యోధుడిగా
జైలుకు వెళ్ళి రచయితగా తిరిగి వచ్చారని కాళోజీ గారు
రామారావుగారి 'ఆత్మవేదన'కు ముందుమాటలో 1957లో
అన్నారు.
1928లో హైదరాబాద్ రాజ్యంలో రెండు సంస్థలు
పుట్టినవి. ఒకటి - నిజాం పాలనను సమర్థించే 'ఇత్తెహాద్
ముస్లిమీ', రెండవది - నిజాంను వ్యతిరేకించే, తెలుగు భాషా
సంస్కృతులను కాపాడుకునే 'ఆంధ్ర మహాసభ. అప్పటికే
ఆంధ్రజన సంఘం ఏర్పడ్డది. జాతీయోద్యమం, వందేమాతర
ఉద్యమం, ఆర్యసమాజం, తర్వాత స్థాపించబడిన అభ్యుదయ
రచయిత సంఘం, గ్రంథాలయోద్యమం వీటన్నిటి
ప్రభావం రామారావుగారిపై ఉంది. ఇవన్నీ కొంతవరకు
వీరి సాహిత్య జీవితాన్ని ప్రభావపరిచినా తమ స్వంత
ఆలోచన, తాత్విక ధోరణి మసకబారలేదు. 1952లో
సర్వోదయ నాయకులు వినోబాభావేరు తమకున్న కొద్ది
భూమిలో నుండి పదెకరాలు అప్పగించి భూదానోద్యమానికి
ఈ కొట్టారు.
స్వాతంత్య్రానంతరం, ముఖ్యంగా హైదరాబాద్ రాజ్య
విమోచనానంతరం గాంధీజీ సలహాని తు.చ. తప్పకుండా
పాటించారా అన్నట్లు రామారావుగారు కాంగ్రెస్ పార్టీ
క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒంటరిగా,
గ్రామానికే పరిమితమై ఋషిలాంటి జీవితం గడిపారు.
అసంఖ్యాకంగా రచనలు చేశారు. చివరి రోజుల్లో ఉర్దూ
కవిత్వం రాశారు.
వీరి ప్రచురిత కవితా సంపుటిలు 1. చుక్కలు 2.
మెరుపులు 3. ఆత్మవేదన 4. అక్షరదీప్తి 5. నాలో నేను
వచన రచనల్లో.
1. జైలు మరి కొన్ని కథలు 2. నాటికలు 3. నీలవేణి
(అసంపూర్ణ నవల) 4. సైనికుడి జాబులు 5. గ్రామ చిత్రాలు
(మా ఊరు) చుక్యులు మిత్రమండలి హన్మకొండవే 1968లో
ప్రచురింపబడింది. రెండోసారి కాళోజీ నారాయణరావు
గొర్రెపాటి వెంకటసుబ్బయ్యగారి సహకారంతో దేవీనగర్
(కర్ణాటక) 1874లో ప్రచురించారు.
బీరి కవిత్వం 'దిక్కులు' అనే వీడియో కవితా
సంకలనంలో రికార్డు చేశారు (వి.ఆర్. విద్యార్థి
సంపాదకులుగా).
యం. భూపాల్ రెడ్డిగారు వీరి రచనలన్నీ సేకరించి
పి.హెచ్.డి. పరిశోధనా గ్రంథం ప్రచురించారు (2012లో).
అదే సంవత్సరం భూపాల్ రెడ్డిగారి సంపాదకత్వంలో పొట్లపల్లి
వరప్రసాద్ రావు ఫౌండేషన్ వారు వీరి సమగ్ర సాహిత్యాన్ని
రెండు పెద్ద సంపుటాలు (కవిత్వం, వచనం)గా
య తెలంగాణ 394 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
k6cjwcifxgi2icfawwwux73fkp7i48z
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/416
104
212121
553029
2026-04-15T06:37:54Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రచురించారు. సుప్రసిద్ధ మూవీ మేకర్, డైరెక్టర్ వీరి కథల్ని 2012లోనే ప్రచురించారు. పొట్లపల్లి రామారావుగారి మేనల్లుడు (అల్లుడుగూడా) కె. లక్ష్మశ్రావుగారు కుమారుడు గోపాల్రావుగ...'
553029
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ప్రచురించారు. సుప్రసిద్ధ మూవీ మేకర్, డైరెక్టర్ వీరి కథల్ని
2012లోనే ప్రచురించారు. పొట్లపల్లి రామారావుగారి
మేనల్లుడు (అల్లుడుగూడా) కె. లక్ష్మశ్రావుగారు కుమారుడు
గోపాల్రావుగారు రచనల సేకరణలో సహకరించారు.
పొట్లపల్లి రామారావుగారికి కాళోజీ రామేశ్వర్
రావు(షాద్) కాళోజీ నారాయణరావు గారలు గౌరవనీయులు.
రచయితగా నిలిచిపోవడానికి చాలా సహకరించారు. కాళోజీ
సోదరులతోబాటు వట్టికోట ఆల్వారుస్వామి, బిరుదురాజు
రామరాజు, దాశరథి కృష్ణమాచార్యులు ఆప్తులు. వయసులో
చిన్నవారైనా వరవరరావుగారు చాలా సన్నిహిత మిత్రులు.
వారి కుటుంబాల మధ్య గొప్ప బాంధ్యవ్యం కొనసాగింది.
ఇది పొట్లపల్లి రామారావుగారి శతజయంతి
సంవత్సరం. తెలంగాణ ప్రభుత్వం, రామారావుగారి
అభిమానులూ వారి శతజయంతి ఉత్సవాల్ని ఘనంగా
జరపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారి
రచనలన్నిటినీ వారిపై పరిశోధన చేసిన భూపాల్ రెడ్డి గారి
సహకారంతో పునః ప్రచురించాలని కోరుతున్నాను.
కాళోజీ మాటలతో ఈ నా భాషణని ముగిస్తాను.
"పొట్లపల్లి రామారావు ప్రపంచ పౌరుడు. అతడు విశ్వ
కుటుంబి. రంగు, రూపు, దేశం, వేషం, భాష, సంస్కృతి
మొదలగు వాటి పేర పాటించబడే విభేదాలేవీ
పాటించేవాడుకాదు. మానవునిలోని ఆత్మీయతను
పెంపొందించి విశ్వమానవ సౌభాతృత్వం నెలకొల్పితేనే గాని
ప్రపంచ శాంతి చేకూరదని అతడి ధృడ విశ్వాసం".
పొట్లపల్లి రామారావుగారి కవితల్లో కొన్ని రచనలు -
"భూదేవి నాగటికి పొదివ్వబోకు
వరుణదేవా నువ్వు కురియబోకయ్యా
విత్తనాలూ మొలకెత్తబోకండి
నదులార మీరింక కదిలేరుసుమ
సాగరా నీవింక స్థంబించిపొమ్ము
గాలిదేవా నీవు కదిలేవు తండ్రీ
కోడెగిత్తల్లా కాడికందరు
కష్టజీవీ నువ్వు కడదొలగవయ్య
చూదాము ఈ ప్రభువు ఏ మేలుతారో
చూదాము ఏ ప్రజలు పన్నులిస్తారో
ప్రజలపక్షాన నిలబడి గళమెత్తిన కవి రామారావుగారు.
ఈ కవితలో సహాయ నిరాకరోద్యమ ఛాయలు కన్పిస్తాయి.
రామారావు కవిత్వాన్ని ఇష్టపడే మన మాజీ ప్రధాని పి.వి.
నర్సింహారావుగారు ఈ క్రింది కవితను ఎన్నికల్లో ఉపన్యాసం
చేస్తూ ఉటంకించేవారట.
"సెలుక్కించిన మేమే నిలువెక్కించిన మేమే
ఉరి ఎక్కించిన మేమే కరి ఎక్కించిన మేమే
ధూళి జల్లిన మేమే పూలు జల్లిన మేమే
ఎవరమో మేమెవరమో మీరించుకైన
ఎరుగుదురా?”
మరో కవితలోని కొన్ని పాదాలు-
"భూమి నుండి త్రవ్వి తీసిన
బంగారాన్ని కాపాడుకోవడం కోసం
గర్భంలో నుంచే
త్రవ్వి తీసిన ఇనుముతో
కటకటాలు నిర్మించి
దానిలో ఖైదీ అయ్యాడు మనిషి"
రామారావుగారి 'కాలిబాట' అనే గేయం బాగా
ప్రాచుర్యం పొందింది. అందులో నుండి -
"అదిగదిగో కాలిబాట
అందాల కాలిబాట
యెటనుండో మెటనుండో
ఏ సుదూర స్థలము నుండో
ఈ రాకో, మొరాకో
ఈజిప్టో, సిరియాకో
యెక్కడికో, యెక్కడితో
ఎవరెరుగని ఏ భూమికో
పాదమేసి పాదమెదక
స్వేచ్ఛా జీవన ప్రియుల
ఇచ్చతోడ జన్మించిన
కాలిబాట నాపినట్టి
ఘనుడు కానరాడు భువిని....
ఇట్లా పొట్లపల్లి రామారావుగారి ప్రతి కవితలో ఒక
ప్రత్యేకత ఉంటుంది. తాత్వికత ఉంటుంది.
చేతులు తెలంగాణ 395 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
3jzntk6r4xt8txjzzzbvdgvhu86zebk
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/417
104
212122
553030
2026-04-15T06:38:10Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '112 తె లంగాణ నుండి సినిమాల్లోకి వెళ్ళినవారు సంఖ్యాపరంగా తక్కువగానే ఉంటారు. అలా వెళ్ళిన వారిలో పూర్తిస్థాయిలో స్థిరపడినవారు అరుదుగా కనిపిస్తారు. ఆ అరుదైన వారిలో ఒకరు డాక్ట...'
553030
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>112
తె
లంగాణ నుండి సినిమాల్లోకి వెళ్ళినవారు
సంఖ్యాపరంగా తక్కువగానే ఉంటారు. అలా
వెళ్ళిన వారిలో పూర్తిస్థాయిలో స్థిరపడినవారు అరుదుగా
కనిపిస్తారు. ఆ అరుదైన వారిలో ఒకరు డాక్టర్ మందడి
ప్రభాకరరెడ్డి. విలక్షణ నటుడిగా ప్రభాకర్రెడ్డి పోషించిన
ప్రతినాయక పాత్రలే మనకు ముందుగా గుర్తుకు వస్తాయి.
నిజానికి ఆయన సినీ జీవితంలో విలనీ వేషాలకు
సమాంతరంగా సాత్వికమైన వేషాలు వేసి గొప్పగా మెప్పించిన
సంగతి చాలామంది దృష్టికి పోలేదేమోననిపిస్తుంది. ఇది
మాత్రమే కాదు, ప్రభాకర్రెడ్డి గారు గొప్ప రచయితగా,
దర్శక నిర్మాతగా విభిన్నమైన సినిమాలు తీశారు.
తెలుగు సినిమా రంగంలో ఈవిధంగా తెలంగాణ
సత్తా చాటిన డా॥ ప్రభాకరరెడ్డి 1936 జూలై 1న నల్లగొండ
జిల్లా తుంగతుర్తిలో జన్మించారు. లక్ష్యారెడ్డి - కౌసల్య
తల్లిదండ్రులు, నిజానికి సినిమాల్లోకి ప్రవేశించే నాటికి
ఆయన జీవితంలో సినిమా అంత కథ జరిగింది. అప్పటి
వరకూ సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం
చాలా తక్కువమందికి తెలుసు. ఆయన చదువు తొలుత
సూర్యపేటలో జరిగింది. నిజాం వ్యతిరేక పోరాటం చాలా
ఉదృతంగా జరుగుతున్న రోజులవి. సాహిత్యం, కళలపట్ల
మోజు పెంచుకున్న యువకుడైన ఆయన తన కర్తవ్యాన్ని
గుర్తెరిగి బుర్రకథల్లో పాత్రధారి అయ్యారు. "సై సై” అంటూ
రౌద్రంగా కళ్ళు పెద్దగా చేసి ప్రేక్షకుల రక్తాన్ని ఉడుకెత్తించే
ప్రభాకర్
రెడ్డి
- హెచ్. రమేష్ బాబు
వారు. దాంతోనే ప్రభాకర్రెడ్డిలోని నటనా శక్తి నెమ్మదిగా
బయటికి రాసాగింది. ఏదో నాటకంలో అవకాశం వస్తే
ఏం మాట్లాడకుండానే వెళ్ళి వేషం వేయించుకుని స్టేజిపై
మంచి నటననే ప్రదర్శించారు. ఇంక తనకు నటన వచ్చుననే
మనసును మెల్లగా రంగస్థలంవైపు మళ్ళించారు. అదే ఆయన
నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయన మనసు సినిమాల
వైపు వచ్చింది. అంతలో అతను మెట్రిక్ పాసయ్యారు.
అంతటితో చదువు ఆపేసి హాయిగా సినిమాల్లో ప్రయత్నాలు
చేద్దాం అని నిర్ణయించుకున్నారు. తనకెలాగూ తెలుగు,
ఉర్దూ, హిందీ భాషల్లో మంచి ప్రవేశం ఉండటంవల్ల హిందీ,
తెలుగు రంగాల్లో గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా
అంత సరైన ప్రతిస్పందన రాలేదు. దాంతో హైదరాబాదు
వెళ్ళి ఇంటర్లో చేరారు. నాటకాల్లో వేషాలు వేయడం
కొనసాగించారు. ఇంటర్ పూర్తవగానే ఎం.బి.బి.ఎస్.లో
చేరారు. వైద్య కళాశాలలో అప్పటిదాకా ఆగిపోయిన
నాటకాల ప్రదర్శన ప్రభాకర్రెడ్డి రాకతో మళ్ళీ ఊపందు
కున్నవి. అప్పటి వరకూ మెడికల్ కాలేజీలో తెలుగు
నాటకాలు అంతగా వేసేవారుకారు. ప్రభాకర్రెడ్డి చేరిన
తర్వాత నాటక పోటీల్లో మెడికల్ కాలేజీ తరఫున ప్రధానంగా
పాల్గొనడం మొదలైంది. ఆయన ఉత్సాహాన్ని చూసి ప్రొఫెసర్లు
మరింత ప్రోత్సహించడం మొదలుపెట్టారు. పాల్గొన్న ప్రతి .
పోటీలోనూ ఏదో ఒక బహుమతి ప్రభాకర్ రెడ్డి గెలుచుకు
వచ్చేవారు.
* తెలంగాణ 396 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
csm0npljj6ior00mr5jkg0tru8xyb9q
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/418
104
212123
553031
2026-04-15T06:38:29Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఈ పోటీల పరంపరలో హైదరాబాదులో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ నాటక పోటీల్లో తన బృందంతో ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వచ్చిన ప్రముఖ దర్శకులు జి. రామి...'
553031
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఈ పోటీల పరంపరలో హైదరాబాదులో జరిగిన
అంతర్ విశ్వవిద్యాలయ నాటక పోటీల్లో తన బృందంతో
ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా
వచ్చిన ప్రముఖ దర్శకులు జి. రామినీడు, తాపీ చాణుక్యులు
ప్రభాకర్ రెడ్డి నటనను చూసి ప్రత్యేకంగా అభినందించి తమ
సినిమాల్లో అవకాశం ఇస్తామని మాటిచ్చారు. ఎన్నాళ్ళుగానో
ఎదురు చూస్తున్న సినిమా అవకాశం తానుగా నడచి
వచ్చినట్లయ్యింది ప్రభాకర్రెడ్డికి.
ఇంతలో తెలంగాణ నుండి ఒక భిన్నమైన సినిమా
తీద్దామని ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి తన మిత్రులతో
కలిసి మంజీరా పతాకంపై తీసిన "చివరకు మిగిలేది”
(1960) చిత్రంలో మానసిక వైద్యుడి పాత్ర పోషణతో తెలుగు
సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. యాదృచ్ఛికమైన
విషయమేమిటంటే ఈ సినిమా దర్శకుడు జి. రామినీడు.
కాగా చాలా మందికి తెలియని విషయం ఒకటుంది. చివరికి
మిగిలేది సినిమా బెంగాలీ చిత్రం "దీప్ జలా జాయ్" కు
రీమేక్. అందులో కీలకమైన డాక్టర్ పాత్ర వేసింది ప్రసిద్ధ
బెంగాలీ నటుడు పహాడీ సన్యాల్. ఆ వేషం తెలుగులో
వేసింది మన ప్రభాకర్ రెడ్డి. 'చివరికి మిగిలేది' వ్యాపార
పరంగా విజయం పొందలేకపోయినా విమర్శకుల ప్రశంస
అందుకున్నది. ప్రభాకర్ రెడ్డి నటన చాలామందికి నచ్చింది.
సావిత్రిని నటిగా మరో మెట్టుపైన నిలబెట్టిందీ చిత్రం.
'చివరికి మిగిలేది' తరువాత వెంటనే ప్రభాకర్రెడ్డికి
మరో సినిమాలో అవకాశం రాలేదు. పెద్ద నటుడినైపోతా
ననుకున్న మనోడికి ఇదో నిరాశ. ఇక వెళ్ళి హైదరబాదులో
ప్రాక్టీసు పెట్టుకుందామని తిరిగి వచ్చి ఆ పని చేశారు.
కానీ ఇంతలో బి.ఎ. సుబ్బారావు 'భీష్మ (1962),
హేమాంబరధరరావు "తండ్రులూ కొడుకులు” (1961)
సినిమాల్లో వేషాలిచ్చి వెనక్కి పిలిపించారు. కానీ ఈ రెండు
సినిమాల తరువాత మరో వేషం రాలేదు. కానీ ఈ సారి
మాత్రం పోవాలనుకోకుండా "ఎలాగూ వచ్చాం... తాడో
పేదో తేల్చుకుందాం" అని కాస్త గట్టిగా ప్రయత్నాలే చేయ
సాగారు. అవస్థలుపడైనసరే సినిమాల్లో స్థిరపడిపోవాలని
నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదలే ఆయనకు 1968లో
పి.ఎ.పి. వారి 'పునర్జన్మ'లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో
నటించే అవకాశం వచ్చేలా చేసింది. 'పునర్జన్మ'లో నెగిటివ్
షేడ్స్ ఉన్న పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న ప్రభాకర్ రెడ్డికి
ఆ తరువాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే
కలుగలేదు. 1970 నాటికి 50 సినిమాల్లో నటించారాయన.
అసలు ప్రభాకర్ రెడ్డి సినిమాల్లోకి రావడమే పెద్ద
లక్ష్యంతో వచ్చారు. ఏదో ఉత్సాహంతో సినిమాల్లో నటించేసి
తెరపై కనిపించి అక్కడితో తృప్తిపడాలని కాదు. తన అభిరుచి
మేరకు విభిన్న పాత్రల్లో నటించాలని, నూతన పంథాలో
కథలు సమకూర్చుకుని సినిమాలు తీయాలని తీర్మానించు
కున్నారు. వీలైతే తాను సైతం దర్శకుడవ్వాలనుకున్నారు.
దీంట్లో గొప్ప సంగతేమిటంటే ఆయన పైన అనుకున్న పన్నీ
చేసి చూపించారు. అయితే అప్పటి వరకు తెలంగాణ
వాళ్ళు సినిమాల్లో నటించి తృప్తిపడటంవద్దే ఆగిపోయారు.
కానీ మన ప్రభాకర్ రెడ్డి అక్కడే ఆగిపోకుండా కథా
రచయితగా, దర్శక నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు
తీశారు.
దర్శక నిర్మాతగా...
ప్రభాకర్రెడ్డికి తొలి చిత్రం 'చివరికి మిగిలేది'లో
నటిస్తున్నప్పుడే లక్ష్మీదీపక్తో పరిచయమైంది. ఆ చిత్రానికి
అసిస్టెంట్గా పని చేశారు దీపక్. ఈయన కూడా
తెలంగాణవాడే. హైదారాబాదీ కావడంవల్ల ఇద్దరికి మంచి
స్నేహం కుదిరింది. మంచి ప్రతిభ ఉన్న లక్ష్మీదీపకన్ను తానే
దర్శకుడుగా పరిచయం చేస్తూ తొలిసారిగా నిర్మించిన
సినిమా 'వచ్చని సంసారం' (1970), కృష్ణ వాణిశ్రీ
-
నటించారు. సినిమా హిట్ కావడంతో వీరి కాంబినేషన్లో
ఆ తర్వాత మంచి సినిమాలు వచ్చాయి. ఆ తరువాత
ప్రభాకర్రెడ్డి లక్ష్మీదీపక్ డైరెక్షనన్లో "పండంటి కాపురం”
(1972) తీసి పెద్ద విజయం సాధించారు. ఎస్.వి. రంగా
రావు, గుమ్మడి, కృష్ణలతో కలిసి నటిస్తూ తీసిన ఈ సినిమా
తెలుగు సినిమా కుటుంబ కథా చిత్రాల్లో మైలురాయిగా
నిలిచింది. ఇది మొదలు ప్రభాకర్
రెడ్డి సక్సెఫుల్
ప్రొడ్యూసర్గా, లక్ష్మీదీపక్ డైరెక్టర్గా పేరు పొందారు.
మద్రాసులో ప్రభాకర్రెడ్డి కనిపించినచోట మళ్ళీ వేరేగా
లక్ష్మీదీపక్ని వెదుక్కునే అవసరమే ఉండేదికాదు ఆ రోజుల్లో.
"పండంటి కాపురం" తరువాత ప్రభాకర్రెడ్డి లక్ష్మీదీపక్
డైరెక్షన్లో 'గాంధీ పుట్టిన దేశం (1973), "నాకూ స్వతంత్రం
చేతులు తెలంగాణ 397 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
ctnegi4wxzep37xxhqay87sr3t9n6ic
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/419
104
212124
553032
2026-04-15T06:38:44Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వచ్చింది" (1976), 'కార్తీకదీపం' (1979) వంటి విజయ వంతమైన సినిమాలు నిర్మించారు. ప్రభాకరెడ్డి పరిశ్రమలో అడుగుపెట్టిన తరువాత తొలుత అర్థం చేసుకున్నదేమిటంటే మొదట తన భాషను మార్చుకోవడం. భ...'
553032
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వచ్చింది" (1976), 'కార్తీకదీపం' (1979) వంటి విజయ
వంతమైన సినిమాలు నిర్మించారు. ప్రభాకరెడ్డి పరిశ్రమలో
అడుగుపెట్టిన తరువాత తొలుత అర్థం చేసుకున్నదేమిటంటే
మొదట తన భాషను మార్చుకోవడం. భాష మార్చుకున్నా
తన మూలాలను మరిచిపోలేదు. ఆయన లక్ష్మీదీపక్ తరువాత
మరో హైదరాబాద్ డైరెక్టర్ బి. భాస్కరరావును ప్రమోట్
చేయడం ప్రారంభించారు. 'గృహప్రవేశం' (1982),
'ధర్మాత్ముడు', 'కుంకుమతిలకం' (1983) సినిమాలు
భాస్కర్రావు దర్శకత్వంలో నిర్మించారు. ఆ రకంగా తెలుగు
సినిమా రంగంలో తెలంగాణ వారిని ప్రోత్సహించారాయన.
ఇంకా ఆయన 'పల్లె పిలిచింది', యువతరం కదిలింది.
(1980) చిత్రాలు నిర్మించారు. మొత్తం 21 చిత్రాలకు కథలు
సమకూర్చి 27 చిత్రాలను నిర్మించిన ప్రభాకరరెడ్డి చిత్రాల్లో
మధ్య తరగతి కుటుంబ గాథలు, సామాజిక చైతన్య
కథాంశాలే ఉండటం గమనార్హం.
విలన్ గానే కాదు విలక్షణ పాత్రల్లో కూడా....
ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలన్నింటిలో సింహ
భాగం ప్రతినాయక పాత్రలు వేసినవే ఉన్నా ఆయన
సాత్వికమైన పాత్రల్లో కూడా తనదైన ముద్ర వేశారు.
రక్తసంబంధం (1962), బొబ్బిలియుద్ధం (1964),
పల్నాటియుద్ధం, నవరాత్రి (1966), ఉమ్మడి కుటుంబం,
రక్తసింధూరం (1867), భలే తమ్ముడు, మాతృదేవత
(1969), అక్కాచెల్లెలు, రెండు కుటుంబాల కథ (1970),
మట్టిలో మాణిక్యం (1971), అమ్మమాట, పండంటికాపురం
(1972), ఒకసారి వంద తుపాకులు (1973), అల్లూరి
సీతారామరాజు (1974), తీర్పు (1975), భక్తకన్నప్ప
(1976), కల్పన (1977), దేవదాసు మళ్లీ పుట్టాడు,
యుగపురుషుడు (1978), గోరింటాకు (1979),
నకిలీమనిషి (1980) ముందడుగు (1983), అనుబంధం
(1984), హరిశ్చంద్రుడు (1981), ఓ తండ్రి తీర్చు
(1985), చిన్నకోడలు (1990) వంటి సుమారు వంద
చిత్రాల్లో తండ్రి, తాతగా, మామగా, అన్నగా స్నేహితుడిగా
పాత్రలు పోషించి మెపొందారు.
పౌరాణిక జానపదాల్లోనూ...
మళ్ళీ నటుడుగా ప్రభాకర్రెడ్డి సినిమాల విషయానికి
వస్తే ఆయన పౌరాణిక, జానపదాల్లో కూడా నటనకు మంచి
అవకాశమున్న వేషాల్లో కనిపించారు. 'భీష్మ'లో శంతనుడిగా,
నర్తనశాల, పాండవ వనవాసం. 'శ్రీకృష్ణ పాండవీయం'
చిత్రాల్లో కర్ణుడిగా, దాన వీర శూర కర్ణ, శ్రీమద్విరాట
పర్వంలో ధర్మరాజుగా, సరస్వతి శపథంలో బ్రహ్మగా, శ్రీ
కృష్ణావతారంలో బలరాముడుగా జీవించారాయన. ఇక
దుష్టమంత్రిగా, సేనానిగా జానపదాల్లో నటించారు. రణభేరి,
గండికోట రహస్యం, విక్రమార్కు విజయం, కంచుకోట,
సింహాసనం వంటివి వాటిలో కొన్ని.
విలనీకి విశ్వరూపం
ప్రభాకర్ రెడ్డి విలన్ వేషాలతో మెప్పించిన చిత్రాలనేకం
ఎన్.టి.ఆర్., కృష్ణ, శోభన్బాబు, కృష్ణంరాజు, చిరంజీవిల
వరకు హీరోలను ఢీకొనగలిగిన విలన్ ఆయనే. ప్రతినాయక
పాత్రలు వేసిన ఆయన చిత్రాల్లో కొన్ని: ఉయ్యాల జంపాల,
దొరికితే దొంగలు (1965), బ్రహ్మచారి (1967),
ఆత్మీయులు, గండికోట రహస్యం, జగత్ కిలాడీలు, నాటకాల
రాయుడు (1969), మారిన మనిషి (1970), మోసగాళ్ళకు
మోసగాడు, జగత్ జంత్రీలు, మోసగాడొస్తున్నాడు జాగ్రత్త,
రామాలయం, జీవితచక్రం, కూతురు కోడలు (1971),
పెత్తందార్లు (1970), కిలాడి బుల్లోడు, పాపం పసివాడు,
పిల్లా? పిడుగా? ((1972), మాయదారి మల్లిగాడు, నేనూ
నా దేశం (1973), సంసార సాగరం, నిప్పులాంటి మనిషి,
నిజరూపాలు, భూమి కోసం, అందరూ దొంగలే, దీక్ష,
కన్నవారి కలలు (1974), ఎదురులేని మనిషి,
కథానాయకుని కథ, గుణవంతుడు (1975), మహాకవి
క్షేత్రయ్య, రామరాజ్యంలో రక్తపాశం (1976), ఖైదీకాళిదాసు,
యమగోల (1977), కటకటాల రుద్రయ్య, కె.డి. నెం.1,
సొమ్మొకరిది సోకొకడిది, లాయర్ విశ్వనాథ్ (1978),
రంగూన్ రౌడి, యుగంధర్, మండేగుండెలు (1979), శ్రీ
వాసవీ కన్యకాపరమేశ్వరి మహాత్మ్యం, గురు, సర్దార్
పాపారాయుడు, రాముడు పరశురాముడు (1980),
తోడుదొంగలు, సత్యం శివం, పార్వతీ పరమేశ్వరులు,
కిరాయి రౌడీలు (1981), బొబ్బిలిపులి, నా దేశం,
సంఘర్షణ, కలియుగదైవం (1988), అల్లుళ్లొస్తున్నారు.
జాగ్రత్త, మెరుపుదాడి (1984), అగ్ని పర్వతం, బుల్లెట్,
కళ్యాణ తిలకం, చట్టంతో పోరాటం (1986), విశ్వనాథ
య తెలంగాణ 398 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
hwghncx49uy9u8vy16xjt51287n93o3
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/420
104
212125
553033
2026-04-15T06:38:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నాయకుడు (1987), అంతిమతీర్చు చిన్నోడు పెద్దోడు (1988) తదితర చిత్రాలు. కథా రచయితగా, నిర్మాతగానేగాక ప్రభాకర్ రెడ్డి దర్శకుడుగా మరో అడుగు ముందుకు వేసి హీరో కృష్ణతో 'ప్రతిభావంతుడు' (1986)...'
553033
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నాయకుడు (1987), అంతిమతీర్చు చిన్నోడు పెద్దోడు
(1988) తదితర చిత్రాలు.
కథా రచయితగా, నిర్మాతగానేగాక ప్రభాకర్ రెడ్డి
దర్శకుడుగా మరో అడుగు ముందుకు వేసి హీరో కృష్ణతో
'ప్రతిభావంతుడు' (1986) తీశారు. ప్రయోగాత్మకంగా
కృష్ణకు అన్ని పాటలూ కేసుదాసుతో పాడించి సక్సెస్
సాధించిన ప్రభాకర్ రెడ్డి ఎన్టీఆర్తో రాజకీయంగా విభేదించి
ఆయనకు వ్యతిరేకంగా "మండలాధీశుడు" (1987)
'ప్రచండ భారతం' (1988), 'గండిపేట రహస్యం' (1989)
సినిమాలు తీసిన ధైర్యశాలి. ఆయన దర్శకత్వంలో చివరగా
తయారైన చిత్రం 'కామ్రేడ్'. ఈ చిత్రంలో కె.జి. సత్యమూర్తి,
మాష్టార్జి పాటలున్నాయి. కాని సినిమా విడుదల కాలేదు.
తన 36 సంవత్సరాల సినీ జీవితంలో 450కి పైగా
సనిమాల్లో నటించిన ప్రభాకర్రెడ్డి నటునిగా, నిర్మాతగా,
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. 'పండంటి
కాపురం (1972) సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ
ప్రాంతీయ చిత్రం అవార్డును అందుకోగా, 1980లో
'యువతరం కదిలింది' సినిమాకు ఉత్తమ ద్వితీయ చిత్రంగా,
ఉత్తమ నటునిగా 1981లో 'పల్లె పిలిచింది' సినిమాకు
ఉత్తమ నటునిగా 'గృహ ప్రవేశం' చిత్రానికి ద్వితీయ
ఉత్తమ కథా రచయితగా నంది అవార్డులు అందుకున్నారు.
ఆయన ప్రధాన పాత్ర పోషించిన “తీర్పు" (1974) తృతీయ
ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకున్నది. పోతే మన
'ఎన్
కౌంటర్' శంకర్ని సినిమా రంగానికి తెచ్చింది డాక్టర్
ప్రభాకర్ రెడ్డి గారే
ప్రభాకర్ రెడ్డి తెరముందు, తెర వెనుకనే గాకుండా
పరిశ్రమలో సినీ కార్మికుల సంక్షేమం కోసం విశేషమైన
సేవలందించారు. మద్రాసు నుండి పరిశ్రమ హైదరాబాదుకు
తరలి వచ్చాక 1991లో 'ట్విన్సి క్లబ్'ను స్థాపించి పేద
కళాకారులకు రూ.500 పెన్షన్ అందజేశారు. ఫిలిం వర్కర్స్
హౌసింగ్ సొసైటి చీఫ్ ప్రమోటర్గా సినిమా కళాకారులకు
పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చారు. 'చలన చిత్ర పరిశ్రమ
కార్మికుల సమాఖ్య నెలకొల్పి ఆ సంస్థ అధ్యక్షునిగా కార్మికుల
సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు. పరిశ్రమలో
ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చే
ప్రభాకర్రెడ్డి ఎందరో సినీ కార్మికులు అనారోగ్యంతో
బాధపడినపుడు వారికి వైద్య సౌకర్యాలు కల్పించడానికి
చూపిన చొరవ వారి ప్రాణాలను కాపాడింది. డా॥ ప్రభాకర్ రెడ్డి
చలన చిత్ర కార్మిక చిత్రపురి' ఆయన పేర వెలసింది. ఆ
మహా నటుడు 1997 నవంబర్ 26న తన 62వ ఏట
కాలం చేశారు.
ఎన్.టి.ఆర్. వంటి మహా నటుడికి ధీటైన విలన్గా
పేరు తెచ్చుకుని, ఇతర విలన్ పాత్రధారులకన్నా విభిన్నంగా
నట జీవితాన్ని గడిపారు. నటన, రచన, దర్శక నిర్మాణం,
కార్మిక సంక్షేమం వీటన్నింటి కలబోతే మన ప్రభాకర్రెడ్డి
సినీ జీవితం. వారు తెలంగాణ కళాపుత్రుడు కావడం
మనం గర్వకారణం.
చేతులు తెలంగాణ 399 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
r2iqn6dhudj6cnjuk19ntoo5256ffvu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/421
104
212126
553034
2026-04-15T06:39:10Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '113 పులిజాల గోపాలరావు - పున్న అంజయ్య ను తెలుంగు పల్కులు నిజామున మా తెలంగాణ సీమ మాగాణ పొలాలలో విరివిగా ఫలియించిన పంటలోని విన్నాణపు దివ్యమౌ మణుల నైపుణితో జతచేసి మీ పదధ్యానముల...'
553034
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>113
పులిజాల గోపాలరావు
- పున్న అంజయ్య
ను తెలుంగు పల్కులు నిజామున మా తెలంగాణ
సీమ మాగాణ పొలాలలో విరివిగా ఫలియించిన
పంటలోని విన్నాణపు దివ్యమౌ మణుల నైపుణితో జతచేసి
మీ పదధ్యానములో మునింగితి -" అంటూ తిరుపతి
వేంకటేశ్వరునికి భక్తితో విన్నవించుకున్న కవి పులిజాల
గోపాలరావు.
వృత్తి వ్యవసాయమైనా కవితా వ్యవసాయం చేసి
తెలుగు పంటపొలాలలో అనేక కవితామృద ఫలాలనం
దించిన గోపాలరావు 1911లో చండూరు మండలం
దోనిపాముల గ్రామంలో శ్రీమతి పులిజాల క్రిష్ణవేణమ్మ -
నర్సింహారావు దంపతులకు జన్మించారు. చండూరు సాహితీ
మేఖల సంస్థ సభ్యులు. ఈ సంస్థ వ్యవస్థాపకులైన
అంబటిపూడి వెంకటరత్నంశాస్త్రి ప్రభావం ఈ కవిపై ఎంతో
వుంది.
1949-50లో స్థాపించబడిన ఆంధ్ర సారస్వత
పరిషత్ సభ్యులుగా కొంతకాలం వున్నారు. పులిజాల
హనుమంతరావుతో కలిసి సాహిత్యగోష్టులలో, కవి
సమ్మేళనాలలో చురుకుగా పాల్గొన్నారు.
దోనిపాముల గ్రామానికి చెందిన మరోకవి అలువాల
శేషయ్యతో కలిసి జంటకవులుగా కవితా రచన, నాటక
రచనలు చేశారు. వీరిరువురి గురించి గోలకొండ కవుల
సంచికలో సురవరం ప్రతాపరెడ్డి ప్రస్తావించడం జరిగింది.
గోపాలరావు రచనలు
1. రామచంద్ర ప్రభూ శతకం, 2. ఖడ్గ తిక్కన
(పద్యకావ్యం), 3. శతక మంజరి, 4. తెలుగు పొలము,
5. వియోగ గీతి, 6. ధర్మజీవన్ (నాటకం)
"ఇతరుల కష్టాలు చూచి సహించలేని మెత్తదనం,
వీలయిన సహాయం ఆర్తులకు అందించే కారుణ్యం, రసాన్ని
అనుభవించగలిగే రసహృదయం అందరిలో వుండవేమో
కానీ ఇవన్నీ కలిగిన కవి గోపాలరాయడు" అని అంబటి
పూడిచే ప్రశంసలకు పాత్రులైన కవి గోపాలరావు,
గోపాలరావు ఆర్ద్రకవి. మెత్తటి గుండె. కానీ వీరు రాసిన
ఖడ్గ తిక్కన వీరకావ్యం. కత్తిని, కలాన్ని సమానంగా
నడిపించిన వంశానికి చెందిన ఖడ్గ తిక్కన శౌర్యం ఎందరో
కవులను ఉత్తేజితుల్ని చేసింది. ఆంధ్రప్రతికలో ప్రచురితమైన
తిర్చున కథను చదివి గోపాలరావు దాన్ని పద్యకావ్యంగా
మలిచారు. ఇందులో ఆయన కవితాధార అనర్హళమై, తిక్కన
చేతి ఖడ్గధార వలె అలరారిందనుటలో అతిశయోక్తి లేదు.
"భాగవతము నారు పఠనీయ గ్రంథము
భారతమ్ము నాకు ప్రాణరక్ష' అని కవి తన ప్రస్తావనలో
తెలుపుకోవడం అభినందనీయం.
గోపాలరావు రచించిన 'శతకమంజరి' ఒక భక్తిరస
విభావరి. ఇది వెంకటేశ్వర శతకం, భద్రాద్రి రామశతకం
మరియు రామయ తండ్రీ శతకాల త్రయం. ఈ శతరంలో
తెలంగాణ ( 400 తేజోమూర్తులు ఉ
(400<noinclude><references/></noinclude>
7afupzb7ym1tsvg6kvx1cnxkp9ke9pa
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/422
104
212127
553035
2026-04-15T06:39:23Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కవి కొండపై వెలసిన వెంకటపతి స్తుతి ఏ యెండకాగొడుగు పట్టినట్టు, లోకున మనకస్థితిని చాలా చక్కగా వర్ణించారు. ఇద్దరు లేక ముగ్గురంటూ సంతానపు తోక పెంచొద్దని కందంలో అందంగా ఎలా చెప...'
553035
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కవి కొండపై వెలసిన వెంకటపతి స్తుతి ఏ యెండకాగొడుగు
పట్టినట్టు, లోకున మనకస్థితిని చాలా చక్కగా వర్ణించారు.
ఇద్దరు లేక ముగ్గురంటూ సంతానపు తోక పెంచొద్దని
కందంలో అందంగా ఎలా చెప్పారో చూడండి.
రెండే కన్నులు కరములు
రెండే కర్ణములు కాళ్ళు రెండే రెండే
రెండైన సంతు ఇక చా
లండీ యని చాటుమయ్య రామయ్య తండ్రీ
ఈ కవి మూడోరచన "తెలుగు పొలము'. ఇది
1981లో అచ్చయ్యింది. ఇందులో 14 శీర్షికా ఖండిక
లున్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఆనాటి పల్లె బతుకును,
పోలీన్ యాక్షన్ కన్నా ముందున్న స్థితిగతులను
ప్రతిబింబించారు. "సాగు ముచ్చట్లు" శీర్షికలోని అన్ని
పద్యాలు వేమన్న పోకడలను గుర్తుకు తెస్తాయి. ఉదాహరణకు
ఈ క్రింది పద్యాన్ని పరిశీలించండి.
కొద్ది మూల్యమిచ్చి కొనరాదు గొడ్డును
బట్టకధిక ధరను పెట్టరాదు.
కర్రు గుచ్చునేల కరువేల యుండురా!
తెలిసి నడుచుకొనరు తెలుగు రైత
ఇలాంటి పద్యాలింకెన్నెన్నో....
1986లో "వియోగ గీతి" అనే ఖండ కావ్యాన్ని
అచ్చువేయించారు. కవి తన ప్రణయనీ వియోగ వేదనా
తరంగాలను లేఖినీ ముఖ పరిశ్రుతముగా 'వియోగ గీతి'లో
నింపి అవ్యక్తానుభూతి పొందారు. ఇందులో ప్రణయాంకము,
దివ్యస్మృతులు, బాల్యస్మృతులు మొదలగు శీర్షికలున్నాయి.
గోపాలరావు చివరి రచన "ధర్మ జీవన్” నాటకం
దోనిపాముల గ్రామానికి చెందిన కవి మిత్రుడు అలువాల
శేషయ్య కూడా "శివధనుర్భంగమనే నాటకాన్ని రచించారు.
పద్యవిద్యలో ప్రావీణ్యత సంపాదించిన గోపాలరావు
పద్యనాటక రచనలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఈ నాటకం గోపాల రావు ధర్మానురక్తినీ, పరోపకార
చింతననూ ఎత్తి చూపుతుంది.
సాహితీమేఖలతో తనకున్న అనుబంధాన్ని
చదువుకొనంగ నాకు తమ సన్నిధిలో
నవకాశముండియున్
జదువగ నోచనైతినని "భక్త్యంజలి"లో చెప్పుకునే
నిజాయితీ వుంది.
"మాదు తెలంగాణ పొలాల కలాల దున్ని
బంగారము పంటలు పండిస్తామనే” ఆత్మ
బిశ్వాసం వుంది.
దేశాన్ని బాగు చేయడం మాని, దేశాన్ని దోచుకునే
స్వార్ధపరులు, నాయకుల ఆటలను ఎండగడుతూ రాసిన
పద్యం.
తెలుగునేలపైన తెగలు రెండయిపోయి
తెగినదాక లాగదీయవెండ్రు
తెలుగుతల్లికంటే తేమలద్దునెవారు
దేశభక్తి కిదియ దిటవురామ' అంటూ భద్రాద్రి
రామునితో తన సంశయాన్ని వెల్లడించారు.
తెలంగాణ రాకముందే ఈ కవి ఇష్టదైవంతో
మొరపెట్టుకున్న తీరు అద్భుతం,
"మాదు తెలుగు సంస్కృతి సమాధులు వందలు
వేయి హైదరాబాదున వింతలై కనులవండుపుగా
తిలకింపనైను ఆచ్ఛాదను నిల్పుమా” అంటూ తెలంగాణాలో
పోలీసు చర్య జరిగినప్పటి నుండి అప్పుడప్పుడు తటస్థ పడిన
పరిస్థితులను భక్తితో విన్నవించుకున్న తీరు అమోఘం.
పలుకుతేనెలో మధురభావాలు, భాష సరళమైన
కవిత్వం భావోపేతమై ప్రతి పద్యంలో తెలుగుదనం
ఉట్టిపడేలా, ప్రతిపాదంలో తెలుగుసీమ ప్రతిబింబించేలా
తెలుగు భాష ఔన్నత్యానికి ఎంతో కృషి చేసిన గోపాల్రావు
చిరస్మరణీయులు. ఈ కవి 1986లో అస్తమించారు.
చతురుడు తెలంగాణ ( 401 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
5uq2zyos2njzct861stt2nvr2senapb
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/423
104
212128
553036
2026-04-15T06:39:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '114 స్వా తంత్ర్యం త్వరగా సిద్ధించి తీరుతుందని విశ్వసించి, ఆ దిశలో ఎంతో కృషి చేసిన మహనీయులు శ్రీ పులిజాల వెంకటరంగారావుగారు. వీరొక మంచి రచయిత, బహుభాషా పాండిత్యం గల మేధాలి. 1929లో...'
553036
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>114
స్వా
తంత్ర్యం త్వరగా సిద్ధించి తీరుతుందని విశ్వసించి,
ఆ దిశలో ఎంతో కృషి చేసిన మహనీయులు శ్రీ
పులిజాల వెంకటరంగారావుగారు. వీరొక మంచి రచయిత,
బహుభాషా పాండిత్యం గల మేధాలి. 1929లో స్థాపింప
బడిన ఆంధ్రమహాసభ స్థాపన కారులలో ఒకరైన శ్రీ పులిజాల
వెంకటరంగారావుగారు చరితార్థులు, చిరస్మరణీయులు,
నిజాంకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర ఉద్యమానికి
ఊపిరిపోసి, వేలాది మంది కార్యకర్తలను స్వాతంత్య్ర సమర
యోధులుగా రూపొందింపజేసినవి ఆంధ్రమహాసభలే.
1934లో ఖమ్మంలో జరిగిన మూడవ ఆంధ్రమహాసభకు
అధ్యక్షత వహించి యున్నారు పులిజాలవారు. ఎన్నో సాహసా
లతో కూడిన రంగారావుగారి జీవితం సమాజానికి,
ముఖ్యంగా యువతరాలకు ఆదర్శప్రాయం.
1901వ సం॥రం ఫిబ్రవరి నెలలో 01వ తేదీన
పులిజాల రంగారావుగారి జననం. వీరి విద్యాభ్యాసం
1912లో (స్పెషల్) హన్మకొండలోనూ, 1912 నుండి 1916
వరకు చాదర్ ఘాట్ హైస్కూల్, హైదరాబాదులోను కొన
సాగింది. 1916 నుండి 1919 వరకు మరల హన్మకొండలో
జరిగింది. ఆ తరువాత 1920-21వ సంవత్సరాల్లో
హైదరాబాద్లో న్యాయవాడ పట్టాను వుచ్చుకున్నారు.
ఆనాటి ఆచారం ప్రకారం పులిజాలగారి వివాహం
1914లో అనగా 14వ యేటనే, రాంబాయమ్మతో జరిగింది.
ఆమె (రాంబాయమ్మగారు) ఒక పుత్రునికి జన్మనిచ్చి, కన్ను
పులిజాల వెంకట రంగారావు
- వేణు సంకోజు
మూసినారు. ఆమె కుమారుడు కూడా 28 సంవత్సరాలకే
అన్ని విధాల యోగ్యుడనిపించు కొని, యింకా బాగా
అభివృద్ధిలోకి వస్తాడనుకుంటున్న సమయంలో కాలధర్మం
చెందినాడు.
చేతికందిన కుమారుని మరణం రంగారావుగారికి
తీరని వ్యథను మిగిల్చింది. పుత్రశోకాన్ని ఆయన చిరకాలం
తన గుండెల్లోనే దాచుకున్నారు. తరువాత 1924లో
రంగారావుగారి రెండవ వివాహం కమలాబాయితో జరిగింది.
ఆమె దోమలపల్లి వారి ఆడపడుచు. దోమలపల్లి వారిది
పెద్ద ఆస్తి, సంపన్నమైన కుటుంబం.
కమలాబాయిగారి ద్వారా రంగారావుగారికి యిద్దరు
కుమారులు, యిద్దరు కుమార్తెలు కలిగినారు. పెద్ద
కుమారుడు - పులిజాల రామ్మోహన్రావు, నల్లగొండలోనే
నివాసముంటూ, తండ్రిగారి నుండి వకాలత్ వృత్తిని
స్వీకరించి, సమర్థవంతంగా వృత్తి ధర్మాన్ని నిర్వహించటంతో
పాటు, "రెడ్ క్రాస్" నిర్వహణ బాధ్యతను స్వీకరించి,
సమర్ధవంతంగా నిర్వహిస్తూ వచ్చినారు. కొండుపల్లి
వాసుదేవరావుగారి కుమార్తె డా॥ పద్మ (శిశువైద్య నిపుణు
రాలు) ను వివాహమాడియున్నారు. ఈ మధ్యనే అనారోగ్యం
వల్ల - రామ్మోహనరావుగారు తమ తనువును చాలించి
యున్నారు. రెండవ కుమారుడు శ్యాంమోహన్ రావుగారు
పట్టభద్రులు, మెడికల్ రిప్రజెంటేటివ్ గా హైదరాబాదులో
స్థిరపడి యున్నారు. చేతినిండా, విసుగులేకుండా పని
Shah తెలంగాణ 102 తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude>
beyo71tnq8tzeriskdjwyxxrope2cvi
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/424
104
212129
553037
2026-04-15T06:39:51Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేయటానికి తమను తాము రూపొందించుకున్నారు. విద్యార్ధి దశ నుండీ పుస్తకాల మీద శ్రద్ధ, విస్తృత అధ్యయనపు సామర్థ్యం మెండుగా వుంటూ వచ్చినవి పులిజాల రంగారావుగారికి. సాహిత్యంతోపా...'
553037
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చేయటానికి తమను తాము రూపొందించుకున్నారు.
విద్యార్ధి దశ నుండీ పుస్తకాల మీద శ్రద్ధ, విస్తృత
అధ్యయనపు సామర్థ్యం మెండుగా వుంటూ వచ్చినవి
పులిజాల రంగారావుగారికి. సాహిత్యంతోపాటుగా
సంగీతంలో కూడా ప్రవేశం కలిగి, అతి త్వరలోనే వారు
శ్రావ్యంగా రాగాలాపనలు చేస్తూ రాగలిగినారు. శాస్త్రీయంగా
పాడుకునేందుకు మిక్కిలిగా యిష్టపడేవారు. ముఖ్యంగా,
పద్యాలను రాగ- భావయుక్తంగా పాడుతూ, యువతరానికి
ప్రేరణ కలిగించాలనెంచుతూ వుండేవారు. నాటకాలను
ఎంతో యిష్టపడటమే కాకుండా, కొన్ని కొన్ని పాత్రలను
కూడా ధరిస్తూ వుండేవారు. స్త్రీ పాత్రలను కూడా పోషిస్తూ,
ప్రేక్షకులను రంజింపచేస్తూ వచ్చేవారన్నది సమకాలికుల
అభిప్రాయం.
-
సాహిత్యం విషయంలో కేవలం అభిమానంతో
చర్చించడానికే పరిమితం కాకుండా, ఉత్తమ రచనలను చేస్తూ
వచ్చినారు రంగారావుగారు. వారి కాలానికి చెందిన
అనేకానేక అంశాలమీద, వాంఛితమూ ఉదాత్తమూ
అయిన భావాలకు చోటిస్తూ, ఆనాటి దిన - వార - మాస
పత్రికల్లో వ్యాసాలను ప్రకటిస్తూ వచ్చేవారు. తమ కాలానికి
అవసరమూ, అనివార్యమూ అయిన రచనలతో పాటుగా,
పద్యరచనక్కూడా సముచితమైన స్థానాన్ని కల్పించుకుంటూ
వచ్చేవారు రంగారావుగారు,
లక్ష్యాన్ని సాధించే విషయంలో ఎన్నెన్నో సాహసాలకు,
అకుంఠిత దీక్షకు తార్కాణమౌతూ, యువతకు ఆదర్శ
ప్రాయంగా నిలిచేవారు. 1929లో స్థాపింపబడిన 'ఆంధ్ర
మహాసభల స్థాపనకూ, నిర్వహణకూ శ్రీరంగారావుగారు
కనబరచిన శ్రద్ధ, నిబద్ధతలన్నవి నిస్సందేహంగా, అనితర
సాధ్యాలే అవుతాయి.
ప్రజాక్షేమమే ప్రతిఫలాపేక్ష అనుకున్న రంగారావుగారు
ప్రతి ఒడిదుడుకు నుండి బయటపడటానికి ఒక ప్రశాంత
పథం వుండి తీరుతుందని నమ్మినట్టి శాంతి కాముకులు.
అదే సమయంలో, రంగారావుగారిది అతి కఠినమైన
నిజాయితీ కూడా. అందువల్ల వారి సరసన నిలబడి
పనిచేయడానికి జంకేవారు చాలామంది. మీటింగులు పెట్టి,
పది పర్యటనలు చేసి, డబ్బును వృథా చేసే బదులు, ఒక
గ్రంథాలయాన్ని స్థాపించడమో, ఒక సహకార సంఘాన్ని
నెలకొల్పడమో చేయబూనితే అది ఉత్తమ సేవకాగలదని
భావించేవారు. అందువల్లనే పేరాకలు గలవారి మధ్య ఆయన
యిమడలేకపోయారు. పెద్దపనిలోను, చిన్నపనిలోను వారిది
ఒకేవిధమైన శ్రద్ధ. వారికి అప్పగించిన ఏ బాధ్యతలోను,
యింకొకరి సహాయాన్ని వారు కోరలేదు. అందువల్లనే
'అసాధారణ కార్యసాధనా
పరునిగా పెద్దల ప్రశంసలను
పొందగలిగినారు. పిన్నవయస్సులోనే అందరి దృష్టిని
ఆకర్షించగలిగినారు.
ఇరవయ్యవ శతాబ్దంలో రంగారావుగారు నల్లగొండ
జిల్లాకు భీష్మాచార్యుల వంటివారు. ఏ పనిని మొదలుపెట్టినా,
అది పూర్తయ్యేవరకు వారు నిద్రపోలేదు. సహచరులనూ
నిద్రపోనివ్వలేదు. విపరీతమైన పట్టుదలతో పనిలో
నిమగ్నమౌతూ వుండిపోయేవారు.
1921లో ప్రారంభమైన ఆంధ్రోద్యమం ఎనిమిది
సం||ల పాటు అనగా 1929 వరకు మొదటిదశను పూర్తి
చేసుకొని, ఆ తరువాతి 2వ దశలోకి ప్రవేశించిన పిదప -
ఈ ఉద్యమం గ్రంథాలయాల స్థాపన, వెట్టిచాకిరి విముక్తి.
వర్తక సంఘాల అభివృద్ధి కొరకు కృషి; వార్తాపత్రికల
ప్రచురణ, చిన్నపుస్తకాల ముద్రణ వంటి వాటితో తెలంగాణా
- ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసింది.
నల్లగొండలో జరిగిన ఆంధ్రజనసంఘం సమావేశంలో
పాల్గొన్న స్ఫూర్తితో పులిజాల వెంకటరంగారావుగారు ఆంధ్ర
మహాసభలకు తగిన సహాయమందించి, ఆంధ్రోద్యమానికి
పూర్తిగా అంకితులైనారు.
దాదాపు ఆరు దశాబ్దాల పాటు వివిధరంగాలలో
ప్రజాభ్యుదయానికి గణనీయమైన కృషి చేసిన పులిజాల
రంగారావుగారు నిరాడంబర, నిస్వార్థ, ప్రజాసేవాతత్పరులు,
పూర్ణ పురుషులు, ప్రజానాయకులు. నిద్రాణమైవున్న
తెలంగాణ ప్రజలలో జాగృతి కలిగించడానికి అవిరళ
కృషిచేసిన వైతాళికులు, కృషీవలురు. కనుకనే వారిని గురించి
'నూరుశరత్తుల పులిజాల రంగారావు" గ్రంథ రచయిత శ్రీ
జి. వెంకటరామారావుగారు - "కవితారసపు జల్లు / ఖడ్గాల
గలగలు / పులిజాలకే చెల్లు నని శ్లాఘించి యున్నారు.
చేతులు తెలంగాణ 403 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
bxqdlrshbhd3t0ridvt3hid6hlhorwz
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/425
104
212130
553038
2026-04-15T06:40:07Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '115 ఆర్. విద్యాసాగర్ రావు - డా॥ జె. విజయకుమార్ జీ సాగునీటిపై సాధికారికంగా మాట్లాడమేకాదు. నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటాపై విద్యాసాగర్ రావు చేసిన కృషి తెలంగాణ...'
553038
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>115
ఆర్. విద్యాసాగర్ రావు
-
డా॥ జె. విజయకుమార్ జీ
సాగునీటిపై సాధికారికంగా మాట్లాడమేకాదు. నదీ
జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన
వాటాపై విద్యాసాగర్ రావు చేసిన కృషి తెలంగాణ ప్రజలకు
మార్గదర్శకత్వంగా నిలుస్తుంది. ఆయన ఉద్యమ కాలంలో
నీటి నిజాలను నిగ్గుతేల్చి తెలంగాణ మట్టి రుణాన్ని తీర్చుకున్న
ముద్దుబిడ్డ. ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
అడుగులో అడుగై నడిచిన విద్యాసాగర్
రావు వీడు భూములకు
నీటిని ఎలా తరలించారో మేధో యజ్ఞం చేశారు. అందుకే
ఆయన 'సాగునీటి నిపుణుడి'గా యావత్తు తెలంగాణ
ప్రజలకు దీపపు స్థంభమై కనిపిస్తారు. కానీ, నటుడిగా,
నాటక రచయితగా, ప్రయోక్తగా ఈ తరానికి దాదాపు
తెలియదు. విద్యాసాగర్ రావు జీవితంలో జలవిజ్ఞానం, నాటక
విజ్ఞానం ఒక జమిలిగా కనిపిస్తాయి. ఆయన చేసిన వృత్తి
శాస్త్రవేత్తగా నిలబెడితే, ప్రవృత్తి నటుడిగా, రచయితగా
నాటకరంగంలో సుస్థిరం చేసింది.
ఆర్. విద్యాసాగర్ రావు నల్లగొండ జాజిరెడ్డిగూడెంలో
1939 నవంబర్ 14న ఆర్. రాఘవరావు, లక్ష్మయ్య
దంపతులకు జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు కావడంతో
ఇంట్లో వారంతా ఉన్నత చదువుల్లో రాణించారు. ఆయన
విద్యాభ్యాసం 10వ తరగతి వరకు మార్యాపేటలో సాగింది.
విద్యాసాగర్ రావు బాల్యం నుండి చదువుతో పాటు ఆటలు,
సాహిత్యం, నాటకాలపట్ల ఆకర్షితుడయ్యాడు. ఎక్కువ
సమయం లైబ్రరీలో గడిపేవాడు. గిరీశం కలం పేరుతో
కవిత్వాలు రాయడం, సినిమా పత్రికల్లో సినిమా రివ్యూలు
పంపడంతో ప్రారంభమైన రచనా వ్యాసాంగం తర్వాత
కాలంలో ఆయనను నాటక రచయితగా, కాలమిస్టుగా, వ్యాస
కర్తగా ఆవిష్కరించింది. ఉన్నత చదువులకు హైదరాబాద్
నిజాం కళాశాలలో చేరిన విద్యాసాగర్రావు ఇంటర్ కాలేజి
ఉత్సవాల్లో నాటకాలను ప్రదర్శించడం పోటీగా మార్చు
కున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజ నీరింగ్లో
చేరినప్పటికి ఆయన ధ్యాసంతా నాటకంపైనే ఉండేది.
ప్రతిరోజు సాయంత్రం నాటడం మిత్రులతో గడవడం
అలవాటయింది. ఇంజనీరింగ్ చదువుకుంటున్న సమయం
లోనే నాట్య విద్యాలయంలో నట శిక్షణలో డిప్లొమా కోర్సును
పూర్తి చేసారు. అబ్బూరి రామకృష్ణారావు, మంత్రి
శ్రీనివాసరావు, ఎ. ఆర్. కృష్ణలు అధ్యాపకులుగా ఉండేవారు.
మంత్రి శ్రీనివాసరావును నాటక రంగంలో తనకు మొదటి
గురువుగా విద్యాసాగర్రావు పేర్కొంటారు.
స్టాన్ విస్కీ నట శిక్షణతోనే తాను నటుడిగా
రూపొందానని అంటారు. ఆయన ఆనాటి తరగతి గది
జ్ఞాపకాలను గుర్తుచేస్తూ నట శిక్షణలో భాగంగా మంత్రి
శ్రీనివాసరావు తనను ఏదైనా పాత్రను నటించి చూపమని
అడిగితే దానికి ఆయన "సార్! ముందు మీరు చేసి
చూపించండి. నేను చేస్తానని సమాధానం చెప్పాడట. దానికి
మంత్రి "నేను చెబితే నీవు చేయడంకాదు, నీకు నీవుగా
తర h: తెలంగాణ ( 404 తేజోమూర్తులు kokkondhar
తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude>
f6ic3bxj55pd2dd4jcvyawbitz1ht0k
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/426
104
212131
553039
2026-04-15T06:40:34Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '- ప్రయత్నించాలి అని యు ఫీల్ ఇట్ అండ్ యాక్ట్ ఇట్ - నటుడు పాత్రలో జీవించడంకాదు, పాత్రలో నటించాలి” అని అన్నారట. దీనిని ప్రేరణగా తీసుకొని తాను నటుడుగా మారానని అంటాడు విద్యాసాగర...'
553039
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>-
ప్రయత్నించాలి అని యు ఫీల్ ఇట్ అండ్ యాక్ట్ ఇట్ -
నటుడు పాత్రలో జీవించడంకాదు, పాత్రలో నటించాలి”
అని అన్నారట. దీనిని ప్రేరణగా తీసుకొని తాను నటుడుగా
మారానని అంటాడు విద్యాసాగర్రావు గారు.
నాట్య విద్యాలయంలో సినీ నటులు త్యాగరాజు,
ప్రఖ్యాత రంగస్థల నటులు భానుప్రకాష్, లక్ష్మీ కనకాల,
రవీందర్రెడ్డి వంటి వారు ఆయనకు సహ విద్యార్థులు. అక్కడ
మృచ్ఛకటికం, కన్యాశుల్కంవంటి నాటకాలు ప్రయో
గాత్మకంగా ప్రదర్శించబడ్డాయి. నాట్య విద్యాలయం
విద్యార్థులు ప్రదర్శించిన అనేక నాటకాల్లో నటుడిగా
పాల్గొన్నారు. వాటిలో 'తప్పివరిది', 'కీర్తిశేషులు' వంటి
నాటకాలు నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.
విద్యాసాగర్ రావులోని సాహిత్యాభిరుచి తెలుగు
భాషావేత్త చేకూరి రామారావు అదేవిధంగా అభ్యుదయ
రచయిత వరవరరావులకు దగ్గరయ్యేలా చేసింది.
కొంతకాలం కవిత్వ రచనలు సాగించిన ఆయన నాటకాలు
ప్రదర్శించడంలోనే సంతోషాన్ని వెతుకున్నాడు. నాటకాలతో
పాటు ఆల్ ఇండియా రేడియోలో యాంకర్గాను, రేడియో
నాటకాలలోను పాల్గొనేవారు. అక్కడే మాజీ గవర్నర్
వి.యస్. రమాదేవితో పరిచయం ఏర్పడింది. ఆమెతో కలిసి
నాటకాలను ప్రదర్శించడంతోపాటు రేడియో కార్యక్రమాలకు
వ్యాఖ్యాతగా పనిచేసారు.
ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక కోఠి ఉమెన్స్
కళాశాలలో మెయింటెనెన్స్ ఇంజనీర్ గా, రాష్ట్ర నీటిపారుదల
శాఖలో ఇంజనీర్గా పని చేశారు. 1960 నుండి
ప్రారంభమైన విద్యాసాగర్ రావు ఉద్యోగ ప్రస్థానం కేంద్ర
జలవనరుల సంఘం చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగేలా
చేసింది. ఒకవైపు ఉద్యోగం మరోవైపు నాటకం ఆయన
జీవితంలో భాగంగా మారాయి. దేశ విదేశాల్లో పర్యటనలు,
ఉద్యోగం కొనసాగుతున్నప్పటికి ఆయన నాటకరంగాన్ని
విస్మరించలేదు. వృత్తిలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికి ప్రవృత్తిగా
నాటకంతో అనుబంధాన్ని కొనసాగించాడు. విద్యాసాగర్ రావు
జీవితంలో జల విజ్ఞానం, నాటక విజ్ఞానం ఒక జమిలీ
కలయిగా కనిపిస్తాయి. ఇంజనీర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్
రావుకు డబ్బులు ఆర్జించాలనే ద్యాస ఏనాడు ఉండేదికాదు.
ఉద్యోగాన్ని తన కుటుంబానికి ఆసరాగా చేసుకున్నాడేశాని
తన మనసుకు నచ్చిన నాటకం, సాహిత్యాన్ని వదల్లేదు.
ఆయన తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టే వరకు నాటకం
ఆయనతోనే కొనసాగింది. “నాటకంలో వేషం లేకున్నా.
పర్వాలేదు. కర్టిన్ లాగినా చాలనుకునే విద్యాసాగర్ రావు
నాటకాన్ని అమితంగా ప్రేమించాడు, ఆరాధించాడు. తెలుగు
నాటక రంగంలో వీలునామా', 'తొప్పివరిది', 'కీర్తిశేషులు '
వంటి నాటకాలు ఆయనకు నటుడిగా గుర్తింపు
తెచ్చిపెట్టాయి. ఆయన పరిషత్తు నాటకాల్లో మద్దూరి
విజయలక్ష్మి, గరిమెళ్ళ రామ్మూర్తి, సోమేశ్వరరావు వంటి
వారితో కలిసి నాటకాలు ప్రదర్శించారు.
1962లో విద్యాసాగర్ రావుకు యు.పి.యస్.సి.
ఇంటర్వ్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వరించింది.
ఈ కొత్త ఉద్యోగంలో చేరాలా వద్దా అని ఆలోచిస్తున్న
సమయంలో ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి నాటక
సంస్థలు ఆయనను ఢిల్లీ వెళ్ళేందుకు ప్రేరేపించాయి. అక్కడ
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రదర్శించే నాటకాలను
తప్పకుండా చూస్తూ ఆయన తనలోని నటున్ని మరింత
పదును పెట్టుకున్నాడు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వంటి
కళాసంస్థలతో జతకట్టి తెలుగు నాటకాలను, హిందీ
నాటకాలను ప్రదర్శించేవారు. 'మట్టె బంగారం', 'పంజరంలో
పక్షులు', 'ఇదేమిటి', 'ఈ ఇల్లు అమ్మబడును', 'వానవెలసింది'
వంటి ఎన్నో నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందారు.
సుదీర్ఘకాలం ఢిల్లీ, అహ్మదాబాద్, రూర్కెలాలో పని
చేయడంవల్ల ప్రతిచోట నాటక మిత్రులను ప్రోది చేసింది.
తొలి రోజుల్లో 'గిరీశం' పేరుతో కవిత్వం రాసిన ఆయన
కలం నాటక రచనలవైపు పరుగులు తీసింది. ఎన్నో
సృజనాత్మక నాటకాలు ఆయనచే ఆవిష్కరించబడ్డాయి.
విద్యాసాగర్
రావు నటుడిగానే కాకుండా నాటక
రచయితగా, దర్శకుడుగా నాటక రంగంలో ఆయన
పాదముద్రలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 1980 నుండి 75
వరకు ఆయన నాటక రచనా ప్రస్థానంలో 2 నాటకాలు,
11 నాటికలు రచించారు. ఆనాటి సంఘటనలు
సమాజంలోని నెలకొన్న అంశాలు వీరి నాటక రచనకు
కథావస్తువులయ్యాయి.
చేతులు తెలంగాణ 405 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
3w61p7dbhili6193l504z7uq2onvxza
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/427
104
212132
553040
2026-04-15T06:41:04Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆయన 'క్షంతవ్యులు', 'గుడ్బై నాటకాలు రాశారు. అదేవిధంగా 'దేవుడయ్య', 'గంధర్వులే తీరుస్తారు', 'కొత్తదారి', 'ఆల్కీ అదాలత్', 'నారు మనది నీరు వాడిదా', 'ప్రధానం', 'వార్శికోత్సవం', 'ఓ ఆఫీసు కథ', 'న...'
553040
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆయన 'క్షంతవ్యులు', 'గుడ్బై నాటకాలు రాశారు.
అదేవిధంగా 'దేవుడయ్య', 'గంధర్వులే తీరుస్తారు', 'కొత్తదారి',
'ఆల్కీ అదాలత్', 'నారు మనది నీరు వాడిదా', 'ప్రధానం',
'వార్శికోత్సవం', 'ఓ ఆఫీసు కథ', 'నిన్న నేడు - రేపు',
'ఇంటర్వ్యూ'లను నాటికలుగా రచించారు. 1972లో
ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా రేడియో,
దూరదర్శన్ లు సంయుక్తంగా కుటుంబ నియంత్రణపై
జాతీయ నాటక పోటీలను ఆహ్వానించాయి. విద్యాసాగర్
రావు తెలంగాణ మాండలికంల 'నారు మనది - నీరువాడిదా'
నాటికను వ్రాసి పోటీకి పంపారు. గంపెడు సంతానంతో
సంసారాన్ని పోషించలేక చేతులెత్తేసి, తప్పుకాదని
సమర్ధించుకునేవారిని, భవిష్యత్తు తరాన్ని ప్రశ్నార్థంగా
మార్చిన పెద్ద తరాన్ని సున్నితంగా మేల్కొలిపింది. ఈ నాటిక
జాతీయ పోటీల్లో మొదటి బహుమతి అందుకుంటే, కొర్రపాటి
గంగాధరరావు నాటిక రెండవ బహుమతి అందుకుంది.
ఆ తర్వాత 'నారు మనది - నీరు వాడిదా' నాటిక ఆకాశవాణి,
దూరదర్శన్లో ప్రసారమైంది. రంగస్థలంపై అనేకసార్లు
ప్రదర్శితమైంది.
'గుడ్బై' నాటకంలో స్వరూపం పురుషుడు. స్వభావం
స్త్రీ అయిన పాత్రను సృష్టించి కథను నడుపుతాడు.
అమాయకత్వాలను, అవసరాలను ఆసరాగా చేసుకుని
పరాన్నజీవులుగా బ్రతికే మనుషులు నిజస్వరూపాలను
రచయిత ఆవిష్కరిస్తాడు. హోమోసెక్సువల్ ఇతివృత్తంపై
తెలుగులో వచ్చిన మొదటి నాటకంగా పేర్కొనవచ్చు.
వికటించిన వ్యక్తిత్వాలకు పరివర్తనవైపు మళ్ళించేందుకు
'క్షంతవ్యులు' నాటకం రాశారు. అనుమానాల మధ్య జీవన
ప్రయాణం అసాధ్యమంటూనే అనుమానాలకు సమాధానం.
ఇవ్వకుండానే రచయిత నాటకాన్ని ముగిస్తాడు. 'దేవుడయ్య'
నాటికలో దేవుడుగా కీర్తించబడే వ్యక్తి అసలు రూపాన్ని
ప్రపంచానికి పరిచయం చేస్తాడు. బైటికి కనబడే వ్యక్తిత్వం,
లోపల అసలు తత్వం బొమ్మబొరుసులాగా ఉంటాయి.
గుండెలు పిండే ఉత్కంఠతో కథ సాగుతుంది. 'గంధర్వులే
తీరుస్తారు నాటకలో పెద్దతరం చిన్నతరం మధ్య ఉండే
అంతరాన్ని ఆవిష్కరిస్తాడు. కొడుకు పెంపకపై ఖర్చు పెట్టిన
డబ్బును పెళ్ళి చేసి కట్నంగా రాబట్టుకోవాలనుకుంటాడు.
తండ్రి. కట్నం లేకుండానే పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయి.
-
వీరిద్దరి మధ్య నలిగిన ఓ పెళ్ళీడుకొచ్చిన అబ్బాయి కథను
ఆసక్తికరంగా రాశారు. గత శతాబ్దపు పూర్వార్ధంలో
భారతదేశంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు
వేసి ఉద్యోగాన్ని పొందేందుకు పడే పాట్లు రచయిత
ఆసక్తికరంగా రచించారు. ప్రముఖ హిందీ నాటక రచయిత
శంకర్ శేష్ 'కిస్సాకుర్సికా' స్కిట్ను స్పూర్తిగా తీసుకుని 'ఓ'
ఆఫీసు కథ' నాటికగా మలచారు. ఫార్స్ నాటక ప్రక్రియలో
సాగుతుంది. గవర్నమెంటు ఆఫీసులో బాధ్యతలేని ఉద్యోగులు,
కాలానికి శిలువ వేసి స్వంత లాభం చూసుకునే ప్రబుద్ధుల
కథ ఇది. హాస్యానికి పెద్ద పీఠ వేసి వ్యంగ్యాత్మకంగా
సాగుతుంది. చెకోవ్ వ్రాసిన 'ప్రపోజల్ నాటికను ప్రధానంగా
''జూలీ' నాటికను 'వార్షికోత్సవం'గా అనువాదం చేసారు.
తెలుగు నేటివిటితో ప్రదర్శనకు అనువుగా రచయిత
నాటకీకరణ చేసారు.
విద్యాసాగర్రావు రచనలో 'కొత్తదారి' స్కిట్ ప్రక్రియకు
సంబంధించింది. యం.వి.యస్. హరనాథరావు 'యక్షగానం'
నాటిక తరహాలో కళాకారుడి ఆవేదనను ఆవిష్కరిస్తుంది.
పగటివేషగాడైన 'లత్కోరాబ్ కొడుకులేని తనకు తన కళను
ఎలా బ్రతికించుకోవాలో మదనపడుతుంటాడు. కూతురు
ముందుకొచ్చి 'లత్కోర్ సాబ్'నై జీవిస్తానంటూ తండ్రి కొత్త
ఆశలను చిగురింపచేస్తుంది. ప్రధాని మోడీ చేపట్టిన 'బేటి
బచావో - బేటీ పఢావో' స్పూర్తికి ఈ నాటిక ప్రతిరూపం.
ఓ ప్రముఖ టీవీలో రణత
శర్మ నిర్వహించే 'ఆల్కీ అదాలత్
షోను స్ఫూర్తిగా తీసుకొని 'ఆప్కీ అదాలత్' పేరుతోనే నాటికను
రాసారు. సమాజంలో ఉన్న భిన్న రూపాలను న్యాయస్థానంలో
ప్రవేశపెట్టి సమాజంపట్ల బాధ్యతలేని వారిని ఎండగడుతూ
పిడివాద మనస్తత్వాలపై కొరడా ఝలిపిస్తాడు రచయిత.
విద్యాసాగర్ రావు గారి నాటక రచనలో ఇది చివరిది.
-
ఎమర్జెన్సీ కాలంలో అనాటి రాజకీయాలను నిరసిస్తూ
'నిన్న, నేడు 'రేపు' నాటికను రచించారు. గరిమెళ్ళ
రాంమూర్తితో కలిసి ఈ నాటికను ప్రదర్శించాలనుకున్నారు.
నిర్బంధాలతో నెలకొన్న నాటి పరిస్థితులు
అనుకూలించకపోవడంతో ప్రదర్శించలేకపోయారట. అయితే
ఈ నాటిక ప్రతి దొరకలేదు. విద్యాసాగర్ రావు రాసిన
నాటికలు, నాటకాలను ఆయన స్వయంగా నటుడిగా,
దర్శకునిగా రంగస్థలంపై ప్రదర్శించారు. విద్యాసాగర్రావు
అంటుంటే తెలంగాణ 406 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
2z27djlzdllq5emxz7zt0dolmtiy8fw
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/428
104
212133
553041
2026-04-15T06:41:25Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రచనల్లోని ప్రతి నాటిక ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదే. విద్యాసాగర్ రావు ఉద్యోగ విరమణ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీని పూర్తి చేసారు. హైదరాబాద్ తిరిగి వచ్చా...'
553041
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రచనల్లోని ప్రతి నాటిక ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదే.
విద్యాసాగర్ రావు ఉద్యోగ విరమణ తర్వాత ఢిల్లీ
విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీని పూర్తి చేసారు.
హైదరాబాద్ తిరిగి వచ్చాక కొంతకాలం దూరదర్శన్లో
ప్రశ్నోత్తరాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జెమినీ టీవీలో
మూడు సీరియళ్ళను ప్రొడ్యూస్ చేసారు. ఈ సందర్భంలోనే
దర్శకుడు అల్లాణి శ్రీధర్ తో పరిచయం ఏర్పడింది.
విద్యాసాగర్ రావులోని జల విజ్ఞానాన్ని పసిగట్టిన అల్లాణి
వి. ప్రకాశ్ మరియు పత్రిక సంపాదకులు రామచంద్రమూర్తికి
పరిచయం చేసారు. వీరి ప్రోద్బలంతోనే వివిధ పత్రికల్లో
"నీళ్ళు - నిజాలు" పేరుతో వ్యాసాలు రాయడం
మొదలుపెట్టారు. విద్యాసాగర్ రావు రాసిన వ్యాసాలు,
ప్రసంగాలు తెలగాణ నీటిపారుదలపై మేధావులను సైతం
ఆలోచింపచేసాయి. ఆయనలోని జలవిజ్ఞానమే కల్వకుంట్ల
చంద్రశేఖర్రావుకు దగ్గరయ్యేలా చేసింది.
విద్యాసాగర్రావు గారి నాటక రచనలు ముద్రణా
రూపంలోకి తీసుకువచ్చి, ప్రదర్శింపచేయాలనే ఆయన కోరిక
మేరకు తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ ప్రయత్నాలు
ప్రారంభించింది. నాటక ప్రదర్శనకు సిద్ధంకమ్మని వారు
మమ్మల్ని ఆదేశించారు. వారే స్వయంగా మాతో వచ్చి మామిడి
హరికృష్ణ గారిని కలిసి నాటక ప్రదర్శనలకు రవీంద్రభారతి
వేదికపై ప్రదర్శించాలని 2017 మే 18, 19 మరియు 20
తేదీలను ఖరారు చేయించారు. ఒకవైపు నాటకాల రిహార్సల్స్
కొనసాగుతూనే ఉన్నాయి. ప్రదర్శనలకు సన్నద్ధమవుతున్నాం.
కానీ దురదృష్టవశాత్తు ఆర్. విద్యాసాగర్ రావుగారు 2017.
ఏప్రిల్ 29న ఆఖరి శ్వాస విడిచి తన జీవన నాటకరంగం
నుండి నిష్క్రమించారు.
ఈ స్థితిలో ఆర్. విద్యాసాగర్ రావు రచించిన నాటకాల
పుస్తక ముద్రణ మరియు ప్రదర్శనను వాయిదా వేయాల్సి
వస్తుందేమోనని పరిశోధకులు భావించారు. కానీ సర్వశక్తులు
కూడగట్టుకొని విద్యాసాగర్ రావు గారికి ఇచ్చిన మాటను
టిటిఆర్సి సంస్థ నిలబెట్టుకుంది. ఆయన రాసిన నాటకాలను
"ఆర్. విద్యాసాగర్ రావు నాటకాలు - నాటికలు”గా పుస్తకాన్ని
తీసుకురావడంతోపాటు ఆయన రచించిన నాటకాలను
రవీంద్రభారతి వేదికపై 2017, మే 18, 19 & 20 తేదీలలో
మూడు రోజులపాటు మనంగా నాటకోత్సవాలను
నిర్వహించింది. ఆర్. విద్యాసాగర్ రావు జలసాగరుడేకాదు,
కళాసాగరుడని తెలంగాణ సమాజానికి తెలంగాణ థియేటర్
రీసెర్చ్ సెంటర్ పరిచయం చేసింది. ఆయన నాటకాలను
ప్రదర్శించి విద్యాసాగర్ రావుకు కళానివాళిని అర్పించింది.
ఏ తెలంగాణ (407 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude>
3r1d4b6jzm8xj636smzv1d9t8mdan1j
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/429
104
212134
553042
2026-04-15T06:42:07Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '116 రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి డా॥ టి. గౌరీశంకర్ ఆ నాటి నిజాం రాష్ట్రంలో నిజాయితీకి, సాహసానికి, విద్యుక్త ధర్మానికి మారుపేరుగా నిలిచిన మహోన్నత వ్యక్తి రాజా బహద్దూర్ వె...'
553042
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>116
రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి
డా॥ టి. గౌరీశంకర్
ఆ
నాటి నిజాం రాష్ట్రంలో నిజాయితీకి, సాహసానికి,
విద్యుక్త ధర్మానికి మారుపేరుగా నిలిచిన
మహోన్నత వ్యక్తి రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి. ప్రభు
భక్తితోపాటు ప్రజాసేవానురక్తి కలిగిన వీరు తెలంగాణా
పోతుగడ్డపై పుట్టిన పులిబిడ్డగా చరిత్రకెక్కారు. క్రమశిక్షణ,
కఠోర పరిశ్రమ, గట్టి పట్టుదల - వీటితో జీవితంలో
రాణించిన రాజా బహద్దూర్ వారు ఎంతటి ఆజానుబాహులో
అంతటి హృదయ వైశాల్యం కలిగినవారు.
నేటి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానంలో
ఉన్న రాయణిపేట అనే గ్రామంలో వీరు 1869 ఆగష్టు
22వ తేదీన జన్మించినట్లు సురవరం ప్రతాపరెడ్డి ఒక చోట
పేర్కొన్నారు. వీరి తల్లిదండ్రులు బారమ్మ, కేశవరెడ్డి. వీరి
ఇంటిపేరు 'పాశం', గోత్రం 'ముదునోళ్ళ'. రెడ్డిగారు
చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్నారు. ఆయన
బాల్యం తొమ్మిది సంవత్సరాల వరకు రాయణిపేటలోని
అమ్మమ్మ కిష్టమ్మ వద్దనే గడిచింది. ఆనాటి విద్యావ్యవస్థలోని
ఆచారం మేరకు ఖాళీ అంటే ప్రైవేటు బడిలో తొమ్మిదో
ఏడు దాకా చదువుకొని, తొమ్మిది నుండి పన్నెండవ ఏడు
నాటికి ఉర్దూలో 'పహిలీ' పూర్తి చేసి, ఫారసీలో 'కరీమా'
అనే పుస్తకాన్ని చదివేశారు. బాల్యంలో ఊరిలోని భట్రాజుల
వద్ద పెద్ద బాలశిక్ష, సుమతీ శతకం, నరసింహ శతకం,
కూడికలు, తీసివేతలు, వడ్డీ లెక్కలు మొదలైనవి నేర్చు
కున్నారు. ఆ తరువాత మేనమామగారితో కలిసి రాయచూరు
వెళ్లి, అక్కడ పందొమ్మిదో ఏడు వచ్చే వరకు విద్యాభ్యాసం
చేశారు. ఉర్దూభాషలో ప్రావీణ్యాన్ని సంపాదించడంతోపాటు
తెలుగు, కన్నడ, మరాఠీ భాషలలో మంచి పట్టును
సాధించారు. చిన్నతనంలోనే భారత, భాగవతాలు చదివారు.
తెలుగులో జాబులు ఎంతో చక్కగా, కుదురుగా రాసేవారు.
రెడ్డిగారి మేనమామ అకస్మికంగా చనిపోవడంతో వారి
జీవితం అనుకోని మలుపు తిరిగింది. నజర్ మహమ్మదాఖాన్
అనే సీనియర్ పోలీసు ఉద్యోగి వెంకట్రామారెడ్డిని చేరదీసి
జీవితంలో ముందుకు నడిపించాడు. దాని ఫలితంగా
పద్దెనిమిదేళ్ళ ప్రాయంలోనే అంటే 1886లో రెడ్డిగారు
ముదిగల్లు ఠాణాకు నాల్గవ దర్జా పోలీసు అమీన్ అంటే
సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరారు. మేనమామ
ఉద్యోగంలోకి బదిలీ అయ్యి వచ్చిన పఠాన్ మహ్మద్ ఖాన్
పదిహేడు సంవత్సరాల రెడ్డిగారికి తమ పోలీసు శాఖలో
ఉద్యోగం ఇప్పిస్తానని వాగ్దానం చేసి వెంట తీసుకొని వెళ్లాడు.
అప్పట్లో రెడ్డిగారు కావలసినంత పొడుగు, తగినంత శారీరక
పుష్టి లేకపోవడం, దానికి తోడు ఎత్తు బూట్లు తొడుక్కొని,
దళసరి బట్టలు ధరించి వెళ్ళిన రెడ్డిగారిని చూసి అక్కడి
అధికారులు "ఇంత చిన్న పిల్లవాడికి ఉద్యోగమేమిటి? ఇంకా
కొంతకాలం చదువుకోనివ్వండి, అవసరమైతే నెలకు 50
రూపాయల ఉపకారవేతనం ఇద్దాం' అని అన్నారట. కానీ
తెలంగాణ ( 408 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
1puj0awvbd1zo3ock2avv7fcnvye42c
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/430
104
212135
553043
2026-04-15T06:43:01Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆనాటి రెడ్డిగారి ఆర్థిక పరిస్థితిని బట్టి అతనికి ఏదో ఒక ఉ ద్యోగం అనివార్యమని భావించిన పఠాను అక్కడి జిల్లా పోలీస్ డైరెక్టర్గా ఉన్న ఆంగ్లేయుడి సహాయంతో, అధిక ప్రయత్నంతో రెడ...'
553043
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆనాటి రెడ్డిగారి ఆర్థిక పరిస్థితిని బట్టి అతనికి ఏదో ఒక ఉ
ద్యోగం అనివార్యమని భావించిన పఠాను అక్కడి జిల్లా పోలీస్
డైరెక్టర్గా ఉన్న ఆంగ్లేయుడి సహాయంతో, అధిక ప్రయత్నంతో
రెడ్డిగారికి ఈ సార్జంట్ ఉద్యోగం ఇప్పించగలిగాడు. నెలకు
60 రూపాయల జీతం, గుర్రపు స్వారీ, దాని అలవెన్సు
కింద నెలకు 20 రూపాయలు ఇచ్చేవారు. మొదటి ఉద్యోగ
నియామకం లింగుసునూరులో జరిగింది. అక్కడికి
తహసీల్దారుగా వచ్చిన మౌల్వి బాబ్ గారితో రెడ్డిగారికి
పరిచయం ఏర్పడింది. వారి ద్వారా ఉద్యోగ నిర్వహణలో
మెళకువలను బాగా తెలుసుకొన్నాడు. ఇంకా ఉర్దూ భాషలోని
కవితలను విని, చదివి, రాయడం కూడా నేర్చుకున్నాడు.
ఆనాటి రాజ్యవ్యవస్థలో నాలుగు పాలనా విభాగాలుండేవి.
ప్రతి విభాగానికి ఒక పోలీసు సదర్ మోహతెమీం ప్రధానాధి
కారిగా ఉండేవాడు. పోలీసు సిబ్బందికి యూనిఫారమ్
ఉండేది కాదు. కొందరు ధోవతులు, కొందరు పట్కాలు,
కొందరు కోట్లు ధరించేవారు. చేతిలో కర్రగాని, కత్తిగాని
పట్టుకొనేవారు. అది ఆనాటి పోలీసు వ్యవస్థలోని వస్త్రధారణ.
ఆ సమయంలోనే ముదుగల్లు తహసీల్దారు 'మౌల్వీ
షాభాఖీ సాబ్' ఆదరణ లభించింది. ఆయన ద్వారా
ఉద్యోగంలోని మెలకువలన్నీ గ్రహించారు. అటు తరువాత
ముదగల్లు నుండి యాద్దీర్ రాణాకు బదిలీ అయ్యారు. ఆ
సమయంలో అక్కడ జరిగిన అరబ్బుల దోపిడీని ఎంతో
చాకచక్యంతో అరికట్టగలిగారు. అప్పుడు జరిగిన హిందూ
ముస్లింల మతకలహాలను రూపుమాపారు. వారి మధ్య
సృహద్భావ వాతావరణాన్ని నెలకొల్పారు. యాద్గిర్ నుంచి
తిరిగి లింగుసూనూర్ అంటే ఈనాటి కల్వకుర్తికి వచ్చారు.
అక్కడ కూడా చెలరేగిన దోపిడీ దొంగల ఆటకట్టించారు.
దానితో వీరికి మంచిపేరు రావడమే గాక, ఎక్కడ దొంగల
బెడద ఉంటే అక్కడికి వీరిని పంపడం పరిపాటి అయింది.
ఆ రకంగా వీరు నిజాయితీ, సమర్థత, విధుల
నిర్వహణలో చాకచక్యం వల్ల నాల్గవ దరా నుండి మూడవ
దర్గా అమీనుగా పదోన్నతిపై నాగర్ కర్నూల్ వెళ్ళారు. అప్పుడే
బ్రిటిష్ ఇండియా సైన్యం నుండి నేరం చేసి పారిపోయి
వచ్చిన డగ్లస్ అనే సోల్జర్ను పట్టుకోవడంలో రెడ్డిగారు
కృతకృత్యులయ్యారు. దానితో వీరి పేరు ప్రతిష్టలు
ఇనుమడించాయి. ఇందూర్ నుంచి ఎల్గందల్ జిల్లాకు వచ్చి,
అక్కడ కొంతకాలం కోర్టు ఇన్స్పెక్టర్గా, ఆ తరువాత పోలీసు
మొహతెమీంగా పనిచేశారు. అనంతరం జిల్లా పోలీసు
అధికారిగా నియమింపబడ్డారు. ఆ సమయంలోనే అక్కడ
ఒక హత్యకేసును ఎంతో నేర్పుతో ఛేదించగలిగారు. అటు
నుంచి గుల్బర్గాకు బదిలీ అయ్యారు. అక్కడ ప్లేగు వ్యాధి
బారిన పడిన వారిని కాపాడారు. ఆ తరువాత నిజామా
బాదుకు, ఆ పిదప ఔరంగాబాదుకు వెళ్ళారు. అక్కడ తల
ఎత్తిన హిందూ యువకుల ఆందోళనను అణచివేశారు.
పిమ్మట ఆక్రాఫ్ బట్టా అంటే ఈనాటి రంగారెడ్డి జిల్లాలో
రెండేళ్ళు పనిచేసి వనపర్తి సంస్థానానికి కార్యదర్శిగా
నియమింపబడ్డారు. అత్రాఫ్ విల్లా అంటే సర్ఫేఖాన్.
హైదరాబాద్ పొలిమేరలలో ఉన్న గ్రామాలతో కూడిన జిల్లా.
దీనిపై వచ్చే ఆదాయం నిజాం ప్రభువుకు చెందుతుంది.
ఈ బల్లాకు సమర్థుడైన పోలీసు అధికారి కావాలని నిజం
నవాబు ఆంగ్లేయాధికారిని సంప్రదిస్తే అతను రెడ్డిగారి కంటే
సమర్ధులు మరెవరూ లేరని కితాబునిచ్చాడట. అక్క
పనిచేస్తున్న కాలంలో రెడ్డి బంధువు, బాల్య స్నేహితుడు
వనపర్తి సంస్థానాధిపతి రెండవ రాజా రామేశ్వరరావు
ప్రభుత్వాన్ని సంప్రదించి రెడ్డి గారిని తమ వనపర్తి
సంస్థానానికి సెక్రటరిగా నియమించుకున్నారు. అక్కడ
రెండేళ్ళ పాటు పనిచేశారు రెడ్డిగారు.
నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్
పాలనా కాలంలో మొహతెమింగా ఉన్న రెడ్డిగారు ప్రాణాలకు
తెగించి ఆనాటి అరబ్బు దుండగుల ఆటకట్టించారు. దీనితో
నిజాం నవాబు దృష్టిని ఆకర్షించారు. ఆనాటి హైదరాబాదు
రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 44 లక్షల మంది ప్రజలలో డెబ్బై
లక్షల మంది తెలుగువారు. వీరిలో ఎంతోమంది పండితులు,
విద్యాధికులు ఉన్నప్పటికీ ఆంగ్ల విద్య పరిచయం లేని,
ఆధునిక నాగరికత అబ్చని, అతి సామన్యుడైన రెడ్డిగారు
నిజాం ప్రభువు మెప్పుకు పాత్రుడు కావడమంటే ఆయనలోని
గొప్పతన మేమిటో మనకు స్పష్టమవుతుంది. ఆయన
నిజాయితీ, సమదృష్టి, సేవానిరతి ఇందుకు కారణాలు.
హైదరాబాదు నగర కొత్వాలుగా ఉన్న ఆనాటి ఇమార్ఖంగ్
బహద్దూర్ ప్రధాన సహాయకునిగా రెడ్డిగారు నియుక్తు
లయ్యారు. ఇమార్జంగ్ మరణానంతరం నిజాం ప్రభువు
వెంకట్రామారెడ్డినే కొత్వాలుగా నియమించారు. నిజాం
పాలనలో హైదరాబాదు నగర కొత్వాలుగా
మొదటి హిందువు రెడ్డిగారే. అప్పటి నుంచి వీరు ఇటు
చేతులు తెలంగాణ (409 తేజోమూర్తులు విడు
నియమింపబడిన<noinclude><references/></noinclude>
k63wbpmjajuu7lp12qrxlcmyktufu2r
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/431
104
212136
553044
2026-04-15T06:43:15Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రభువుల సేవకు, అటు ప్రజాసేవకు అంకితమయ్యారు. ఆ కాలంలోనే బ్రిటిష్ ఇండియాలోని ఖిలాఫత్ అహ్మదాబాద్ నుంచి కొందరు దుండుగులు హైదరాబాదులోకి చొరబడి అల్లర్లు సృష్టించారు. చెలరేగ...'
553044
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ప్రభువుల సేవకు, అటు ప్రజాసేవకు అంకితమయ్యారు.
ఆ కాలంలోనే బ్రిటిష్ ఇండియాలోని ఖిలాఫత్ అహ్మదాబాద్
నుంచి కొందరు దుండుగులు హైదరాబాదులోకి చొరబడి
అల్లర్లు సృష్టించారు. చెలరేగిన అరబ్బులు, పఠానులు,
రోహిలల ఆగడాలను అడ్డుకొని ధైర్యసాహసాలతో
అహోరాత్రులు క్రమించి నగరంలో శాంతిభద్రతలను
కాపాడారు.
ఆనాడు హిందువుల పండుగలు, మహ్మదీయుల
పండుగలు వచ్చినాయంటే కొట్లాటలు జరుగడం తథ్యం.
ఇది ముందుగానే గ్రహించిన రెడ్డిగారు చాకచక్యంతో తగిన
ఏర్పాట్లు చేసి తగాదాలు తలెత్తకుండా చేసేవారు.
ఉన్నతాధికారులు తమ శాఖను తనిఖీ చేయడానికి వస్తారని
ముందే తెలుసుకొని రెడ్డిగారు శాఖను చక్కదిద్ది వారికి
తప్పులను, లోపాలను దొరకనివ్వకుండా వారి నుంచి
'చాలాక్ ఆద్మీ' అన్న మెప్పులను పొందేవాడు. ఒకసారి
బొంబాయి నగరంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్
గారికి బ్రిటీష్ ప్రభుత్వం రాజద్రోహం నేరం కింద జైలుశిక్ష
విధించింది. అప్పుడు బెంగాలులో రాష్ట్ర విభజనపై
బెంగాలీలు వందేమాతరం గీతాన్ని ప్రచారం చేస్తూ అహింసా
మార్గాన ఆందోళన చేపట్టారు. వీటి పర్యవసానంగా
ఔరంగాబాద్లోని యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున
అల్లర్లు చేసారు. వీటిని అణచివేయడానికి సమర్థుడైన
హిందువు పోలీసు అధికారిని నియమించాలని భావించిన
నిజాం ప్రభుత్వం రెడ్డిగారిని అక్కడికి బదిలీ చేసింది. రెడ్డిగారు.
అక్కడి ఆందోళనకారులను స్వయంగా కలిసి, వారి భుజం
తట్టి నచ్చచెప్పి పరిస్థితులను చక్కదిద్దారు.
రెడ్డిగారి కొత్వాల్ కచేరీ ఎప్పుడూ ప్రజలతో,
ప్రభుత్వాధికారులతో నిండి ఉండేది. ప్రజల రకరకాల
సమస్యలను స్వయంగా, సావధానంగా విని పరిష్కరించే
వారు. న్యాయస్థానాలలో కేసుల పరిష్కారాలలో జరిగే
జాప్యాన్ని నివారించేవారు. సరి అయిన న్యాయం జరగని
సందర్భాలలో తమ కచేరీలోనే విచారణలు జరిపి తీర్పు
లిచ్చేవారు. వారి న్యాయశాస్త్ర పరిజ్ఞానానికి న్యాయమూర్తులు
సైతం ముగ్ధులయి మెచ్చుకొనేవారట. గణపతి ఊరేగింపు
సందర్భంలో వచ్చిన తగాదాను అప్పటికప్పుడు పరిష్కరించి
ఊరేగింపును సజావుగా నడిపించారు. రైల్వే కూలీల సమ్మెను
సామరస్యంగా ఎదుర్కొన్నారు. వీరు ప్రభువుల పట్ల ఎంతో
విధేయంగా ఉండేవారో, ప్రజల పట్ల అంత దయాళువుగా
మెలిగేవారు.
బీరు కొత్వాల్ ఉన్నకాలంలో వేల్స్ యువరాజు,
వైస్రాయ్ హైదరాబాదు నగరానికి వచ్చినప్పుడు కొత్వాల్
వెంకట్రామారెడ్డిగారు చేసిన ఏర్పాట్లు, వ్యవహరించిన తీరు,
ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఆ యువరాజును సైతం
ఆకట్టుకొన్నాయి. వారి ప్రశంసలతో పాటు, వారి నుంచి
వెండి సిగరెట్ కేసును బహుమతిగా కూడా అందుకొన్నారు.
1921లో నిజాం ప్రభువు తమ జన్మదినోత్సవం నాడు
రెడ్డిగారికి 'రాజాబహదూర్ అనే బిరుదు ప్రదానం చేశారు.
1981లో బ్రిటీష్ ప్రభుత్వం జార్జి చక్రవర్తి నుంచి ఓ.. బి.బి.
అంటే ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ అనే బిరుదును కూడా
వీరు పొందారు.
గాంధీగారు రెడ్డిగారి హయాంలోనే నిజాం రాష్ట్రానికి
వచ్చారు. అప్పుడు కళాం మినిష్టర్గా ఉన్న సర్ ట్రెంచ్
సమయంలో జరుగుతున్న ఖాదీ ప్రదర్శనలను గాంధీజీ
చూడకూడదని నిషేధాజ్ఞ విధించారు. గాంధీగారికి కోపం
వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళి పోవడానికి సిద్ధమయ్యారు. ఆ
సమయంలో రెడ్డిగారు స్వయంగా కల్పించుకొని
సంయమనంతో గాంధీగారితో మాట్లాడి శాంతపరచి పరిస్థితి.
చక్కదిద్ది కార్యక్రమాన్ని అనుకున్నట్టుగానే జరిపించారు.
అప్పటి హరిజనులలో నెలకొని ఉన్న మురళీలు, బసవి
కాండ్రనే దురాచారాన్ని రెడ్డి గారు రూపుమాపారు. అంటే
ఆడపిల్లలను యావజ్జీవం వేశ్యావృత్తిలోకి దింపడం, ఈ
అనాచారాన్ని తుడిచి వేయడానికి రెడ్డి గారు నడుం బిగించి
విజయం సాధించారు. దీనితో పాటు ఆయన శాసన
సభ్యులుగా ఉన్న కాలంలో వితంతు వివాహ చట్టం,
వెట్టివాకిరీ వ్యతిరేక చట్టాలను కూడా చేయించారు.
ఆనాటి పోలీసు శాఖను అధునాతన పరచిన మేధావి
రెడ్డిగారు. దాదాపు 48 సంవత్సరాల ఉద్యోగ జీవితం
అనంతరం ఆయన 1933 ఏప్రిల్లో పదవీ విరమణ
చేశారు. ఉద్యోగ విరమణానంతరం ఆయన నిజాం సొంత
ఎస్టేట్ సర్ఫేఖాస్కు ప్రత్యేక అధికారిగా నియమింపబడ్డారు.
ధర్మరాజు శివరాజ బహద్దూర్ ఎస్టేట్ కమిటికి
అధ్యక్షునిగా ఉండి, 11 సంవత్సరాలలో ఆ ఎస్టేట్ అప్పులన్నీ
తీర్చడమే గాక, పాఠశాలలు నెలకొల్పి విద్యావ్యాప్తికి కృషి
చిరు తెలంగాణ 410 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
79vlucp8bwnc6camnpkiskbvl1zu9q0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/432
104
212137
553045
2026-04-15T06:43:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేశారు. ఈ రకంగా ధర్మవంత రాజ శివరాజ బహదూర్ సంస్థానాన్ని సముద్ధరించారు. బీదరైతులకు సహకరించారు. భూమి ఆదాయశాఖ, పోలీసు శాఖలను సంస్కరించి ముందుకు నడిపించారు. గ్రామ పునర్నిర్మా...'
553045
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చేశారు. ఈ రకంగా ధర్మవంత రాజ శివరాజ బహదూర్
సంస్థానాన్ని సముద్ధరించారు. బీదరైతులకు సహకరించారు.
భూమి ఆదాయశాఖ, పోలీసు శాఖలను సంస్కరించి
ముందుకు నడిపించారు. గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలను
నిర్వహించారు. బాల్య వివాహాలను రద్దు పరచి, వితంతు
వివాహాలను ప్రోత్సహించారు. మూఢాచారాలను
వ్యతిరేకించారు. అన్నిమతాల, కులాల వారిని చేరదీశారు.
సురవరం వారి 'గోలకొండ పత్రిక'కు అండగా నిలిచారు.
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, వేమనాంధ్ర
భాషానిలయం, బాల సరస్వతి గ్రంథాలయం పురోభివృద్ధికి
సహకరించారు. 1945లో ఓరుగల్లులో జరిగిన ఆంధ్ర
సారస్వత పరిషత్తు ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆయన
ప్రారంభించారు. ఆంధ్రోద్యమానికి చేయూతనిచ్చాడు.
స్త్రీ విద్య కోసం వీరు చేసిన సేవ మరువరానిది.
హైదరాబాదులో బాలికలకు మాతృభాషలో చదువు చెప్పే
పాఠశాల లేదని గ్రహించిన, మాడపాటి హనుమంత
రావుగారు నారాయణగూడలో ఏర్పాటు చేసిన బాలికల
పాఠశాలకు రెడ్డిగారి దక్షతను గ్రహించి అధ్యక్షులుగా
నియమించారు. రెడ్డిగారు తమ బంగళా వెనుక భాగంలోనే
పాఠశాల శాశ్వత భవన నిర్మాణం కోసం భూరి విరాళాలు
సేకరించి ఆడుకొన్నారు.
రెడ్డి విద్యార్థి వసతి గృహం, రెడ్డి బాలికల వసతి
గృహం, ఆంధ్ర విద్యాలయం పరోపకారిని బాలికల పాఠశాల
మొదలైన వాటిని తమ భవన భాగాన్ని ట్రస్టుగా మార్చి ఆ
ఆదాయాన్ని వాటికి సమంగా పంచారు. బర్కత్పురాలోని
మహిళా కళాశాల స్థాపనకు కారకు లయ్యారు. నాటి నుంచి
నేటికి ఆర్బివి, ఆర్ఆర్ కాలేజీగా రాణిస్తునే ఉంది. ఇటు
నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికల
పాఠశాల అటు ఐర్యత్పురలోని రావుబహద్దూర్ వెంకట్రావు
రెడ్డి మహిళ కళాశాల - ఈ రెండింటి మధ్య నెలకొల్పబడిన
రెడ్డిగారి నిలువెత్తు విగ్రహం ఆ సంస్థలను చేయ్యెత్తి సదా
దీవిస్తు ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది.
రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి గారు ఒక మహాసంస్థ
వంటి వారు. ప్రజా సంస్థలకు ఆనాటా రాజకీయపార్టీలకు,
యువజన సంస్థలకు, విద్యార్థులకు సన్నిహితులుగా ఉండే
వారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్యగానీ లేదా స్టేట్
కాంగ్రెస్ లోని రెండు వర్గాల మధ్య గానీ, వివాదాలు
తలెత్తినప్పుడు ఈయన మధ్యవర్తిగా వ్యవహరించి
ఇరుపక్షాలతో చర్చలు జరిగి తగవులు సామరస్యంగా
పరిష్కరించేవారు.
అస్పృశ్యత దురాచారాన్ని నిరసించారు. హరిజనోద్ధరణ
సంఘాలకు సహాయ మందించాడు. అనాథ బాలల
ఆక్రమాలకు, కుషనివారణ కార్యక్రమాలకు, జంతు హింసా
నివారణ సంస్థలకు ఆయన ఆర్థికంగా తోడ్పాటును
అందించారు. కుష్ఠు రోగుల చికిత్సాలయాలను స్వయంగా
నెలకొల్పారు. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో పర్వర్ణాలను
అంటే పెంపుడు పిల్లలను ధనికులు, రాజులు, నవాబులు
తమ సేవలో ఉంచుకొని వారిని శాశ్వతంగా బానిసలుగా
చేసుకొనేవారు. ఈ దురాచారానికి స్వస్తి పలకడానికి రెడ్డిగారు
శాసనసభలో శిశువుల సంరక్షక చట్టాన్ని చేయించారు.
వృద్ధాశ్రమాలను పోషించారు. ఆనాటి హైదరాబాద్
నగరంలో మహ్మదీయ స్త్రీలకు లేడి హైదరీక్లబ్ ఉన్నట్లుగానే
హైందవ స్త్రీల కోసం కూడా బొగ్గులకుంటలో లేడీస్
రిక్రియేషన్ క్లబ్ నిర్మించారు. ఆంధ్ర యువతి మండలి భవన
నిర్మాణానికి స్థలం కేటాయించారు.
రెడ్డిగారి 14-15 ఏళ్ళ వయస్సులోనే రంగమ్మగారితో
వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు. ఆయనే
రంగారెడ్డి గారు. రెండవ భార్య వల్ల లక్ష్మారెడ్డి అనే
కుమారుడు, నరసమ్మ అనే కుమార్తె కలిగారు. వీరంతా
విద్యావంతులై ఉన్నతోద్యోగాలలో, వివిధ పదవులలో
రాణించినవారే. రెడ్డిగారు ఇందూర్లో ఉన్న కాలంలో
గంగయ్య అనే అనాథ బాలుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశారు.
ఇంతటి సేవాపరాయణులు, మానవతామూర్తి అయిన
రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి 1951లో అనారోగ్య
పీడితులై 1958 మే ఒకటవ తేదీన హైదరాబాద్లో
కన్నుమూశారు. ఆయన వ్యక్తిత్వం, సేవానిరతి, అభ్యుదయ
కాంక్ష సంస్కరణా దృష్టి ఆదర్శ ప్రాయమైనవి. తెలంగాణ
ప్రజలకు ఆయన పెన్నిధి వంటి వారు.
అతను తెలంగాణ (411 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
n9bshfvq52g71696ev72it9yrcvam4w
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/433
104
212138
553046
2026-04-15T06:43:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '117 రాజన్ బాబు - పి.వి. రామమోహన్ నాయుడు యాచిత్ర కళాజగత్తులో తెలంగాణవాడి ప్రజ్ఞను జిగేల్ మనిపించిన కళాతపస్వి రాజన్ బాబు. చీకటి వెలుగులు, నలుపు తెలుపుల కలనేతలోని సౌందర్యాన్ని...'
553046
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>117
రాజన్ బాబు
- పి.వి. రామమోహన్ నాయుడు
యాచిత్ర కళాజగత్తులో తెలంగాణవాడి ప్రజ్ఞను
జిగేల్ మనిపించిన కళాతపస్వి రాజన్ బాబు.
చీకటి వెలుగులు, నలుపు తెలుపుల కలనేతలోని సౌందర్యాన్ని
తన చతురతతో కెమెరాలో బంధించి అద్భుతమైన ఫోటోలుగా
మంచిన ధన్యజీవి ఆయన. "సృజనాత్మక ఫోటోగ్రఫీ"లో
ఆయనకు ఆయనే సాటి. వైవిధ్యం ఆయన ఫోటోగ్రఫిలోని
సుగుణం. సృజనాత్మక ఛాయాగ్రహణమైనా, ఫ్యాషన్
ఫోటోగ్రఫియైనా, జర్నలిజం ఫోటోగ్రఫి అయినా అన్నింటి
లోనూ ఆయన చేయి తిరిగిన శిల్పి. బ్లాక్ అండ్ వైట్
ఫోటోగ్రఫిలో ఎన్నో రంగులు మెరిపించిన భావుకుడు రాజన్
బాబు. గిరిజన గుస్సాడి నృత్యమైనా, భామాకలాపంలోని
ప్రణయ ఘట్టమైనా, సూర్యుడి కిరణాలు దట్టమైన అడవిలో
ఆకుల కోణాలను తాకి నీడలుగా ప్రతిఫలించే కమనీయ
దృశ్యమైనా ఆయన కెమరాలో శాక్యతంగా ఒదిగి
పోవలసిందే. నలుపు తెలుపులో నగ్నచిత్రమైనా కవితా
స్పర్శను గుభాళించ వలసిందే.
కరీంనగర్ జిల్లా కోరుట్లలో పద్మశాలి కుటుంబంలో
1938, ఫిబ్రవరి 9 న జన్మించిన రాజన్ బాబు తండ్రి
తమ కులవృత్తిమైన చేనేతలో నేర్పరి. "లై అండ్ డై"
ప్రక్రియలో రంగులద్దడంలో మేటి కలంకారి. తండ్రి నుంచి
అనువశికంగా అబ్బిన కళేమో, రంగులు వాటి చాయలతో
కదంబాలు ఆదుకోవడం, బొమ్మలు గీయడం,
పెయింటింగ్లు వేయడం రాజన్ బాబుకు చిన్నతనం నుంచే
ఆసక్తి. ఊళ్ళోని పొలాలు, వాగులు, వంకలు, హనుమంతుని
బండ, ఇలా కనిపించిన ఎన్నో దృశ్యాలు, కదిలించిన
ఎన్నెన్నో అంశాలను కన్నులకింపుగా రూపొందించేవాడు.
ఇది గమనించి బొంబాయిలో ఉండే పెద్దమ్మ కొడుకు రాజన్
బాబుకు ఒక చిన్న కేమెరా బహూకరించాడు. అయితే కెమెరా
దొరికింది. మరి రీళ్ల మాటేమిటి? చుట్టాలు, స్నేహితుల
ఫోటోలు తీసి రీళ్ల మందం డబ్బులు పోగేసి, మిగిలిన రీల్లతో
తన అభిరుచిని కొనసాగిస్తూ మురిసిపోతుండేవాడు.
అప్పటినుంచి ఆయనకు కెమెరాయే లోకం అయ్యింది. ఆ
బుజ్జి పెట్టేతోనే లోకమంతా. పొద్దస్తమానం ఫోటోగ్రఫిలో
నిమగ్నమైన రాజన్ బాబు పదవ తరగతి పరీక్షలో మునక
వేసాడు. చదువుకు గండి పడింది. ఏమి చేయాలో తోచని
పరిస్థితి. ఎలాగో తెలుసుకొని హైదరాబాద్ వెళ్లి
జె.ఎన్.టి.యులో ఫైన్ ఆర్ట్స్ డిప్లమో కోర్సులో చేరాడు.
రాజన్ బాబు శ్రద్ధాసక్తులు, రంగులపై ఆయనకున్న పట్టును
గమనించిన అధ్యాపకులు మొదటి సంవత్సరం పూర్తికాక
మునుపే రెండవ సంవత్సరం లోకి ప్రమోట్ చేశారు. పైగా
లెక్చరర్లు దండ్లమూడి మధుసూదన రావు, సార్నికలు
డ్రాయింగ్ షీట్స్, రంగులు అన్నీ కొనిచ్చి మరీ
ప్రోత్సహించేవారు. దాంతో నిరాటంకంగా అభిరుచి మేరకు
బొమ్మల సృజనలో నిమగ్నమైపోయాడు.
అంటుంటే తెలంగాణ 412 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
8h59ys2cus7yg9s1zq2jj1iizji285b
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/434
104
212139
553047
2026-04-15T06:43:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఫైన్ ఆర్ట్స్ పూర్తి కావొచ్చింది. డిగ్రీలో చేరడానికి పదవ | తరగతి పాస్ అయివుండాలి. దాంతో రాజన్ బాబు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక పక్క డిప్లమో చేస్తూనే పదవ తరగతి పరీక్షలు రాసి పా...'
553047
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఫైన్ ఆర్ట్స్ పూర్తి కావొచ్చింది. డిగ్రీలో చేరడానికి పదవ
| తరగతి పాస్ అయివుండాలి. దాంతో రాజన్ బాబు
ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక పక్క డిప్లమో చేస్తూనే
పదవ తరగతి పరీక్షలు రాసి పాసయ్యాడు. దాంతో
కె.ఎస్.టి.యులో అప్లయిడ్ కోర్సులో ప్రవేశం లభించింది.
ఈ కోర్సులో ఫోటోగ్రఫి కూడా భాగం. అందుకుగాను
ప్రతిబింబాలు అనే అంశంపై ఫొటోలు తీసుకురమ్మని
లెక్చెరర్ ఇబ్రహీం ఆలి పంపించారు. తమ కాలేజి ఆవరణలో
నిలిపి ఉన్న ప్రిన్సిపాల్ కారుపై ప్రతిబింబిస్తున్న కాలేజి
భవనం ప్రతిమను క్లిక్ మనిపించి తీసుకెళ్ళి చూపాడు. అదే
ఫొటో రాజన్ పాల్గొన్న మొదటి పోటీలోనే రెండవ బహుమతి
సాధించి పెట్టింది. దీంతో ఆత్మస్థైర్యం పెరిగింది. అప్పటి
వరకు తాను పల్లెవాడినని, సామాన్య కుటుంబం నుంచి
వచ్చానని, ఆంగ్లం రాదని రాజన్లో దాగివున్న ఆత్మ న్యూనత
పటాపంచలై పోయింది. ఫొటోగ్రఫి తన బతుకుకు బరోసాగా
నిలుస్తుందనే నమ్మడం ఆరంభించాడు. అదే సమయంలో
స్మృజనాత్మక ఫొటోగ్రఫీ వైతాళికుడు, ఫొటోగ్రఫీ జీనియస్
రాజ త్రయంబక్ రాజబహద్దూర్ వద్ద శిష్యరికం చేసే
బంగారు అవకాశం లభించిది. ఇది రాజన్ బాబు జీవితాన్ని
మలుపు తిప్పింది.
ఒక దిశను, లక్ష్యాన్ని నిర్దేశించుకోనేట్లు చేసింది.
సాధారణ ఫొటోలు తీయడం నుంచి శైలి, శిల్పం ఉండే
కవితాత్మక ఫొటోలు తీయడం వరకు ఎన్నో మెళుకువలను
రాజ త్రయంబక్ రాజబహద్దూర్ తనదైన శైలిలో రాజన్కు
నేర్పారు. అప్పటి నుంచి నిరంతరం తనను తాను రాజన్
సాన బెట్టుకున్నారు. తనలోని అభినివేశానికి ప్రయోగాలు
తోడై సంపూర్ణ సృజనాత్మక ఫొటోగ్రాఫర్
రూపుదిద్దుకున్నారు. ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఫొటోగ్రఫిలో
తన సంతకాన్ని శాశ్వతంగా నిలుపుకున్నారు. మానవ
అనాటమీ, గిరిజన సంస్కృతి, సంప్రదాలపై ఫొటోలు
తీయడంలో రాజన్ బాబుది అరుదైన శైలి. గిరిజన జీవన
శైలిపై అధ్యయనం చేయడానికి, చిత్రీకరించడానికి ఆయన
అరకులో అణువణువు తిరిగారు. ఆదిలాబాద్ అడవుల్లో
గొండులతో సహవాసం చేశారు. అందుకే ఆ కథా
వస్తువులపై ఆయన చిత్రాలు సజీవంగా వుంటాయి.
గిరిజన వివాహాలు, గోండుల గుస్సాడి, ధింసా
దరువులు, ఆనందం, నావలయానం అన్నీ కళ్ళకు కట్టినట్లు
ఫొటోలు తీశారు. మానవ అనాటమీని ప్రకృతికీ
సారూప్యతను ఆపాదిస్తూ, దానికి వేదాంతాన్ని ముడివేస్తూ
ఎన్నో ఛాయాచిత్రాలు సృజియించారు. నగ్నత్వంపై
చిత్రించినా, గిరిజన జీవన శైలిపై క్లిక్ మనిపించినా
అందులో కళాత్మకతను జొప్పించి మనోహర చిత్రాలుగా
ఆవిష్కరించడం ఆయన శైలి. చుట్టూ ఉన్న ప్రకృతిని, వెలుగు
నీడలను, శరీరాకృతికి సంధించి కమనీయ శ్రుతులు
పలికించడం ఆయన కెమేరాకు అలవాటైన విద్య.
"స్త్రీ శరీరం- సౌందర్యం" అనే అంశంపై ఫోటోలను
తీయడంలో ఆయన నేర్పరి. హైదరాబాద్లో మోడళ్ళు
దొరకని కాలంలో అవగాహనలేని గిరిజన యువతిని
మోడల్గా తీసుకొని ఆమెకు తర్ఫీదు ఇచ్చి తన ఇతివృత్తానికి
తగ్గ ఫొటోలను తీయడానికి చాల అవస్థలు పడ్డారు. అయితే
ఆ ప్రయత్నం అనేక ఫొటోగ్రఫి ప్రదర్శనల్లో రాజన్ బాబుకు
మంచి ప్రశంసలు, పురస్కారాలు సాధించిపెట్టింది.
లండన్ జ్యూరీలో కూడా రాజన్ బాబు పనితనానికి
మంచి స్పందన లభించింది. "స్త్రీ నగ్న సౌందర్యం" అనే
ఇతివృత్తంపై ఆయన తీసిన ఛాయా చిత్రాలను జ్యూరీలోని
మహిళా సభ్యురాలు మెచ్చుకోవడం ఆయనకు మరింత
నైతికబలం కలిగించింది. ఈ అరుదైన గౌరవం కోసమే
ఆయన ఎన్నో కష్టనష్టాలకు ఎదురొడ్డి ఫొటోగ్రఫిలో కృషి
జరిపారు.
బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రఫిలో వెలుగు నీడలను ఆయన
వాడుకున్నట్లు. చీకటి వెలుగులతో ఆయన ఆడుకున్నట్లు
వేరెవ్వరికి సాధ్యపడదు. అందుకే బ్లాక్ అండ్ వైట్
ఫొటోగ్రఫీలో దేశమే గర్వించే స్థాయికి రాజన్ బాబు
ఎదిగారు. రాజన్ బాబు కృషిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న
ఫొటోగ్రఫి సంస్థలన్నీ గుర్తించాయి. 1970లో ఫ్రాన్స్లోని
ఆర్టిస్ట్ అఫ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫి ఆర్ట్,
1988లో లండన్లోని రాయల్ ఫొటోగ్రఫి సొసైటీల
అసోసియేటిప్ లభించింది. ప్రపంచ ఫొటోగ్రాఫర్ల బంగారు
కల వంటి రాయల్ ఫొటోగ్రఫి సొసైటీ ఫెలోషిప్ 1987లో
రాజన్కు లభించింది, నగ్న చిత్రాలపై (న్యూడ్ ఫొటోగ్రఫి)
ఆయన సమర్పించిన పరిశోధనా వ్యాసానికి రాయల్
ఫొటోగ్రఫి సొసైటీ ఆయనకు ఫెలోషిప్ ప్రధానం చేసింది.
చతురుడు తెలంగాణ (413) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
r9fn1940ejq21tc7vnmk02wnjgm61wb
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/435
104
212140
553048
2026-04-15T06:44:15Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నిజానికి ఈ పురస్కారాన్ని పొందిన ఏకైక తెలుగు వ్యక్తి కూడా ఆయనే. ఆనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫెలోషిప్ ఇచ్చి రాజన్ బాబును గౌరవించుకోంది. కంప్యూటర్లు, గ్రాఫిక్స్ ఏవీ లేన...'
553048
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నిజానికి ఈ పురస్కారాన్ని పొందిన ఏకైక తెలుగు వ్యక్తి
కూడా ఆయనే. ఆనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా
ఫెలోషిప్ ఇచ్చి రాజన్ బాబును గౌరవించుకోంది.
కంప్యూటర్లు, గ్రాఫిక్స్ ఏవీ లేని రోజుల్లో విజన్ మిక్సింగ్లో
ఎన్నో ప్రయోగాలు చేసిన పరిశోధకుడాయన
చాలా కాలంపాటు జె.ఎన్.టి.యు.లో లెక్చరర్ గా పని
చేశారు. తన ఛాయాచిత్ర కళా పాండిత్యాన్ని ముందు
తరాలకు పంచారు. అనంతరం రాజన్ స్కూల్ అఫ్ ఫొటోగ్రఫీ
నెలకొల్పి ఎందరికో విద్యాదానం చేశారు. ఎన్నో సెమినార్లు,
వర్క్ షాప్ నిర్వహణలో ముఖ్య భూమిక పోషించారు,
కొన్నాళ్ళు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఫొటో
గ్రాఫర్గా పని చేశారు. అక్కడే సర్ అనే బ్రిటిష్ ఇంజనీర్తో
పరిచయం ఏర్పడింది. ఆయన వద్దే ఇండస్ట్రియల్
ఫొటోగ్రఫిలో మెళుకువలు నేర్చుకున్నారు. 1991లో
హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ సదస్సులో
రాజన్ బాబు నిర్వహించిన చురుకైన పాత్రకుగాను "మాన్
అఫ్ ది కన్వెన్షన్" సత్కారం పొందారు. ఫొటోగ్రఫీ రాజన్కు
ప్రాణం సృజనాత్మక ఫొటోగ్రఫిలో ప్రచారం కల్పించి ఎక్కువ
మందికి తర్పీదు ఇచ్చి ఆ శైలికి దాని పరిధి విస్తృతపరచాలని
తహతహలాడేవారు.
రాజన్ బాబు శిష్య గణం రాష్ట్రంలోనే కాకుండా
దేశవ్యాప్తంగా విస్తరించి వున్నారు. ఫొటోగ్రఫి పట్ల అభిరుచి
ఉన్నప్పటికి ప్రభుత్వ డిప్లొమో లేదా డిగ్రీ పొందడానికి
విద్యార్హతలు ప్రతిబంధకంగా పరిణమించిన యువతీ
యువకులకు రాజన్ బాబు ఆశాకిరణమయ్యారు. రాజన్
బాబును ఆశ్రయించి ఫొటోగ్రఫీలో మెళుకువలు నేర్చుకొని.
ఆనక ఫొటోగ్రాఫర్లుగా వృత్తి జీవితంలో రాణించినవారు
కోకాల్లలు. పాత్రికేయ రంగంలో గుర్తింపు పొందిన
ఫొటోగ్రాఫర్లలో ఆయన శిష్యులు ఎందరెందరో...
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సహా చాల
ప్రాంతాల్లో వర్క్ షాప్లు నిర్వహించి స్థానిక యువతలో
ఫోటోగ్రఫిపట్ల అవగాహన, మక్కువ పెరగడానికి రాజన్
బాబు నిరంతరం శ్రమించేవారు.
రాజన్ బాబు శిష్య గణం రాష్ట్రంలోనే కాకుండా
దేశవ్యాప్తంగా విస్తరించివున్నారు. ఫొటోగ్రఫిపట్ల అభిరుచి
ఉన్నప్పటికి ప్రభుత్వ డిప్లొమో లేదా డిగ్రీ పొందడానికి
విద్యార్హతలు ప్రతిబంధకంగా పరిణమించిన యువతీ
యువకులకు రాజన్ బాబు ఆశాకిరణమయ్యారు. రాజన్
బాబును ఆశ్రయించి ఫొటోగ్రఫీలో మెళుకువలు నేర్చుకొని
ఆనక ఫొటోగ్రాఫర్లుగా వృత్తి జీవితంలో రాణించినవారు
లోకొల్లలు. పాత్రికేయ రంగంలో గుర్తింపు పొందిన
ఫొటోగ్రాఫర్లలో ఆయన శిష్యులు ఎందరెందరో...
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్తో సహా చాలా
ప్రాంతాల్లో వర్క్ షాప్లు నిర్వహించి స్థానిక యువతలో
ఫొటోగ్రఫిపట్ల అవగాహన, మక్కువ పెరగడానికి రాజన్
బాబు నిరంతరం శ్రమించేవారు. ఆగస్టు 25న తన 73వ
ఏట కన్ను మూశారు. అయినా చీకటి వెలుగులు సరగాలాడే
ప్రతి సన్నివేశంలోనూ మన తెలంగాణా బిడ్డడు రాజన్ బాబు
జ్ఞాపకాలు మెరుస్తూనే ఉంటాయి.
అయయం చేయుటయు తెలంగాణ (414 తేజోమూర్తులు ఉండి<noinclude><references/></noinclude>
9cn5o9xvno0hkua5ty4po6ify891j8x
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/436
104
212141
553049
2026-04-15T06:44:32Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '118 రామానంద తీర్థ - డా॥ టి. గౌరీశంకర్ మి రామానంద తీర్థ హైదరాబాదు సంస్థానంలో సో సమర శంఖారావాన్ని పూరించిన వీరసేనాని సంస్థాన విమోచనోద్యమంలో కీలకపాత్రను పోషించిన పోరాటయోధుడు....'
553049
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>118
రామానంద తీర్థ
- డా॥ టి. గౌరీశంకర్
మి రామానంద తీర్థ హైదరాబాదు సంస్థానంలో
సో సమర శంఖారావాన్ని పూరించిన
వీరసేనాని సంస్థాన విమోచనోద్యమంలో కీలకపాత్రను
పోషించిన పోరాటయోధుడు. సంస్థాన ప్రజల విముక్తి కోసం
ఉద్యమాలను నడిపిన విప్లవనాయకుడు. ఇక్కడి ప్రజలకు
ఉద్యమాల ఉగ్గుపాలుపోసి, తిరుగుబాటు తత్త్వానికి బాటలు
వేసిన మార్గదర్శి. అణచివేతల నుంచి తలలు పైకెత్తి, పిడికిలి
బిగించి నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్య
సాహసాలను నూరిపోసిన శౌర్యవంతుడు. యవ్వన దశలోనే
అవివాహితునిగా సన్యాసం స్వీకరించిన యోగి పుంగవుడు,
ఆధ్యాత్మిక ప్రవక్త. యావజ్జీవితాన్ని సమాజ సేవకు,
దేశారాధనకు వెచ్చించిన త్యాగధనుడు. నిజాం ప్రభుత్వాన్ని
ఢీకొన్న ఆయన సాహసం, ప్రజలను జాగృత పరచడంలో
ఆయన సలిపిన కృషి అసమానమైనది.
నిస్వార్ధపరుడు, నిరాడంబర జీవి, త్యాగశీలి, దేశ
"భక్తుడు, గాంధేయవాది సత్యాహింస సిద్ధాంతాల ద్వారానే
స్వాతంత్ర్యం సాధించవచ్చునని ప్రగాడంగా విశ్వసించిన
వాడు. నిరుపేదల పట్ల, అణగారిపోయిన అట్టడుగు వర్గాల
పట్ల, దళిత ప్రజల పట్ల ఆయనకు ఉండిన స్పందన
అపారమైనది. వారి జీవితాలు మెరుగుపడాలనీ, వెలుగులు
నిండాలని అహరహం ఆలోచిస్తూ, ఆ దిశగా అడుగులేస్తూ
ఉండేవాడు. కొందరు ఇతనిపై తీవ్రవాది అనే ముద్రను
కూడా వేశారు. ప్రజలలోని పేదరికాన్ని తొలగించాలంటే,
ధనస్వామ్య వ్యవస్థపై అదుపు ఉండాలనే వారు. సామ్యవాదం,
ప్రజాస్వామ్యపు విలువల పట్ల అత్యంత గౌరవం కలిగిన
వారు. వాటి విధానాల అమలు పట్లు అచంచలమైన దీక్ష
కలిగిన వారు.
స్వామి రామానంద తీర్థ కర్ణాటకలో పుట్టినప్పటికీ,
మహారాష్ట్రలో విద్యాభ్యాసం చేసి, రాజకీయ కార్యకలాపాలు
కొనసాగించినప్పటికీ ఆయన రాజకీయ నాయకత్వం
సంపూర్ణంగా వికసించి, విరాడ్రూపాన్ని ప్రదర్శించింది.
మాత్రం తెలంగాణలోనే,
స్వామిజీ పూర్వాశ్రమంలోని పేరు వెంకటేశ్
భావనావ్ ఖడ్గకర్. ఈయన 1903 అక్టోబర్ 3వ తేదీన
గుల్బర్గా జిల్లాలోని చిన్మెల్లా జాగీర్ అనే గ్రామంలో
జన్మించారు. ఇది పూర్వపు కర్ణాటక ప్రాంతంలోనిది. వీరు
షోలాపూర్లో మెట్రిక్యులేషన్ చదువుతూ, దానికి స్వస్తి పలికి,
1921లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకర
ణోద్యమంలో పాల్గొన్నారు. ఆ తరువాత పూణెలోని తిలక్
విద్యాపీఠం నుంచి ఎం.ఏ. పట్టా పొందారు.
ఆనాడు కార్మిక నాయకునిగా పేరు పొందిన ఎస్.ఎం.
జోషికి కార్యదర్శిగా కార్మిక రంగంలో కొంతకాలం
పనిచేశారు. బొంబాయి బట్టల మిల్లు కార్మికులను సంఘటిత
పరచడంలో వీరి ప్రజాసేవ ప్రారంభమైంది. ఆ తరువాత
1929లో ఉస్మానాబాద్ జిల్లా ఇప్పర్గి గ్రామంలోని ఉన్నత
A తెలంగాణ 415 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude>
965imoykzn5jnnh0m7d7ii7g41r0fzf
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/437
104
212142
553050
2026-04-15T06:44:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. నెలకు 70 రూపాయలు జీతం లభించేది. దానిలో నుండి ఒక్క పైసా కూడా తన కోసం వాడుకోకుండా, ఆ పాఠశాల వదిలి వెళ్ళేటప్పుడు జమ అయిన తన వేతనం మొత్తం...'
553050
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. నెలకు
70 రూపాయలు జీతం లభించేది. దానిలో నుండి ఒక్క
పైసా కూడా తన కోసం వాడుకోకుండా, ఆ పాఠశాల వదిలి
వెళ్ళేటప్పుడు జమ అయిన తన వేతనం మొత్తం డబ్బును
అదే పాఠశాలకు విరాళంగా ఇచ్చారు. మెట్రిక్ తరగతికి
ఇంగ్లీషు పాఠాలు చెప్పేవారు. ఆ పాఠశాలలో అనంతరావు
కులకర్ణి అనే దేశభక్తుడు కరస్పాండెంట్ గా పనిచేసేవారు.
ఆయన ధ్యానేశ్వరీమాత ఉపాసకుడు. యువకుడైన వెంకటేశ్
ఆయన ప్రభావంలో పడిపోయి ఆధ్యాత్మిక రంగంలోకి
అడుగుపెట్టాడు. దాదాపు ఆరేళ్ళు ఉపాధ్యాయవృత్తిలో
ఉండి, అనంతరం బీడ్ జిల్లాలోని మోయినాబాద్లో
యోగీశ్వరి పేరుతో స్వయంగా ఉన్నత పాఠశాలను
స్థాపించారు. భిక్షాటన చేస్తూ జీవితం గడిపారు.
గృహస్థ జీవితం రాజకీయోద్యమాలలో పని
చేయడానికి ఆటంకం అని భావించి వీరు వివాహం చేసుకో
లేదు. భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి గురుకుల
దీక్ష ఆత్మోన్నతికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఆ
జన్మ బ్రహ్మచారిగా ఉండి కఠోరమైన సన్యాసాశ్రమాన్ని తమ
29వ ఏటనే అంటే 1931లో స్వామి తీరా స్వీకృతిలో
స్వీకరించి స్వామి రామానందతీర్థగా మారిపోయారు.
1938లో మరాఠా ప్రాంత మహాసభకు స్వామీజీ
కార్యదర్శిగా పనిచేయడంతో వారి రాజకీయోద్యమ రంగ
ప్రవేశం జరిగింది. అప్పటి నుంచి వీరు రాజకీయాలలో
క్రియాశీలంగా పని చేస్తూ వచ్చారు. ఇందుకు హైదరాబాదు
నగరాన్ని వారు కార్యక్షేత్రంగా ఎంచుకొన్నారు.
తెలంగాణాలో ఒకవైపు ఫ్యూడల్ వ్యవస్థ, మరొకవైపు
దారిద్ర్యం, పేదరికం, వీటి వల్ల ప్రజలలో తిరుగుబాటు
తలఎత్తితే, ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణచివేతకు పూను
కొనేది. దాని వల్ల నిరంతరం ప్రభుత్వానికి, ప్రజలకు నడుమ
సంఘర్షణ జరుగుతూ ఉండేది. ఇది అరాచకానికి,
హింసాత్మక ఘటనలకు దారి తీసేది. దానివల్ల ఎల్లప్పుడు
అల్లకల్లోలం, అలజడి, అశాంతి చెలరేగుతుండేది.
ఇటువంటి పరిస్థితులను చక్కబెట్టి, ప్రజలకు
ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించ డానికి స్వామీజీ నడుం
బిగించారు. తెలంగాణ వెనుకబాటు తనానికి కేవలం మత
దురహంకారమో, నిరంకుశత్వమో కారణం కాదు. ఇక్కడి
సాంఘిక, ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని స్వామిజీ
భావించారు. అందువల్ల ముందుగా వాటిని సంస్కరిస్తే ప్రజల
సమస్యలు వాటంతట అవే పరిష్కరింపబడతాయని ఆయన
ఉద్దేశం.
1938 అక్టోబరు 24వ తేదీన హైదరాబాదు స్టేట్
కాంగ్రెసు ఏర్పడింది. దానికి స్వామిజీ కార్యదర్శిగా ఎన్నుకో
బడ్డారు. ఈ సంస్థకు సంపూర్ణ స్వరూపం ఏర్పడక ముందే
నిజాం ప్రభుత్వం దానిని నిషేధించింది. ఆ నిషేధాలను
అల్లంఘించినందుకు స్వామిజీ జైలు శిక్షకు గురయ్యారు.
ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి, కాళ్ళకు బేడీలు
తగిలించారు. ఒక నిక్కరు, గొంగలి, చెంబు, కంచం ఇచ్చారు.
ఆయనతో రోజూ ఎనిమిది గంటలు పనిచేయించారు.
మొదటిసారే ఆయను పదిహేను నెలలు జైలులో ఉంచారు.
రాష్ట్రంలో వందేమాతరం ఉద్యమం కూడా అప్పుడే వచ్చింది.
గాంధీజీ సూచనపై స్టేట్ కాంగ్రెసు తన వత్యాగ్రహాన్ని
విరమించుకుంది. నాయకులందరూ సేవాశ్రమం వెళ్ళి
గాంధీజీతో సంప్రదింపులు జరిపారు. సేవాశ్రమం నుంచి
తిరిగి రాగానే స్వామిజీ ఆనాటి సంస్థాన ప్రధాని సర్ అక్బర్
హైదరీకి లేఖ రాస్తూ ప్రజాపోరాటాలను, మతపోరాటాలుగా
భావించరాదని హెచ్చరిస్తూ తన పోరాటాన్ని తిరిగి
కొనసాగించారు. 1940 నవంబరు 11వ తేదీన స్వామిజీని
ప్రభుత్వం మళ్ళీ అరెస్టు చేసి పదిహేను మాసాలు
నిజామాబాద్ కోట జైలులో ఉంచింది. 1946-47లలో
స్వామిజీ మూడవసారి అరెస్టయి మరో 16 నెలలు కారాగార
జీవితం గడిపారు. 1946లోనే స్వామిజీ స్టేటు కాంగ్రెసుకు
అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. హైదరాబాదు సంస్థానం
స్వాతంత్య్ర్య పోరాట చరిత్రలో నాలుగున్నర సంవత్సరాలుగా
సుదీర్ఘ జైలు జీవితం అనుభవించింది స్వామి రామానంద
తీర్ధయే. దేశానికి స్వాతంత్య్రం లభించిన రోజున ఢిల్లీలో
నెహ్రూ ఇచ్చిన జాతీయ పతాకం తీసుకొని హైదరాబాదు
రాగానే స్వామిజీని పోలీసులు తిరిగి అరెస్టు చేసి చంచల్గూడ
జైలులో నిర్బంధించారు. పోలీసు చర్య తరువాత ఆయన
విడుదలయ్యారు.
హైదరాబాదు సంస్థానంలోని కాంగ్రెసు
రాజకీయోద్యమం ఆనాడు రెండు రకాలుగా నడిచింది. ఒకటి
బులు తెలంగాణ (416 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude>
pn52qa88eazinplrcfnau0xcknyb2el
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/438
104
212143
553051
2026-04-15T06:44:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మితవాద ధోరణితో, రెండోది తీవ్రవాద ధోరణితో. ఒక వర్గం నిజాం నవాబుతో సంప్రదింపులు జరుపుతూ సఖ్యంగా రాజకీయ పరిష్కార మార్గం గురించి సయోధ్యతో ఆలోచించడం మంచిదనే దృష్టితో ఉండేది....'
553051
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మితవాద ధోరణితో, రెండోది తీవ్రవాద ధోరణితో. ఒక
వర్గం నిజాం నవాబుతో సంప్రదింపులు జరుపుతూ సఖ్యంగా
రాజకీయ పరిష్కార మార్గం గురించి సయోధ్యతో
ఆలోచించడం మంచిదనే దృష్టితో ఉండేది. ఇక మరో వర్గం
తెలంగాణలోని యువత. వీరు తీవ్రవాద కార్యక్రమాలతో
తప్ప నిజాం పాలనను అంతమొందించడం సాధ్యం కాదనే
అభిప్రాయం కలిగి ఉండేది. ఈ వర్గం వరు స్వామిజీని
తమ నాయకునిగా బలపరిచారు. స్వామిజీ స్టేట్ కాంగ్రెస్
అధ్యక్షులుగా కాగానే సంస్థాన ప్రజా ఉద్యమంలో అతివాద
రాజకీయాలను ప్రవేశపెట్టారు. దానితో ఆయనపై తీవ్రవాది
అనే ముద్రపడింది.
స్వామిజీ స్టేట్ కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్న
సమయంలోనే ఆయన తెలంగాణలోని గ్రామాలలో పర్య
టించారు. ఆ రోజులలో గ్రామాలలోని పరిస్థితులు అత్యంత
దారుణంగా ఉండేవి. రజాకార్లు ఈ సంస్థానంలోని
ముస్లిమ్లు రాజులనీ, మహమ్మదీయేతరులందరూ వారికి
దాసులనే నినాదాలతో అరాచకాన్ని సృష్టించసాగారు.
ప్రజలపై అనేక రకాల అకృత్యాలు చేస్తూ భయోత్పాతం
కలిగించారు. ఒక వైపు మిలటరీ, పోలీసుల దాడులు,
మరొకవైపు కమ్యూనిస్టు దళాల దాడులు. ఈ రెండింటి
మధ్య ప్రజల జీవితం నలిగిపోయేది. పోలీసులను పగటి
దొరలని, కమ్యూనిస్టులను చీకటి దొరలని ఆ రోజులలో
అంటూ ఉండేవారు. దీన్న 'రాశికీ సర్కార్, దిన్ని సర్కార్
అనేవారు. ఇటువంటి అననుకూల వాతావరణంలో స్వామిజీ
గ్రామాలలోకి అడుగుపెట్టారు. ఆయనకు ఎటువంటి
అధికారం లేదు. పోలీసు రక్షణ లేదు. అయినా వెనుకడుగు
వేయలేదు. భయంతో గ్రామాలను వదిలి వెళ్ళిపోతున్న
రైతులను పిలిచి వారికి ధైర్యాన్ని నూరిపోశారు. వారిలో
ఆత్మస్థైర్యాన్ని నింపారు. పర్లి
ప్రాంతాలలో జీవచ్ఛవాల లా
ఉన్న ప్రజలకు మళ్ళీ ప్రాణం పోశారు. వారికి బ్రతుకుపై
ఆశలు చిగురింపజేశారు.
1947లో భారత స్వాతంత్య్రావతరణ అనంతరం
హైదరాబాదు సంస్థానం భారత యూనియన్లో కలవదనీ,
స్వతంత్ర రాజ్యంగానే ఉంటుందనీ నిజాం ప్రకటించడంతో
మళ్ళీ తెలంగాణలో స్వాతంత్ర్యోద్యమం తలయెత్తింది. ఆ
సందర్భంలో నిజాం ప్రభుత్వం వేలాది కార్యకర్తలను
నిర్బంధించింది. దారుణమైన విధానాలను అమలు జరిపి
ప్రజలను భయకంపితుల్ని చేసింది. ఆ భయంకర పోరాట
సమయంలో స్వామి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్
ఉద్యమానికి సారథ్యం వహించి నిజాం ప్రభుత్వాన్ని
ఎదుర్కొన్నాడు. చివరికి పోలీసుచర్యతో నిజాం నవాబు,
రజాకారు ముష్కర మూకలు భారత సైన్యానికి లొంగిపోయి
హైదరాబాదు సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం
చేయడం జరిగింది.
స్వామిజీ స్టేట్ కాంగ్రెసు అధ్యక్షులుగా ఉన్న కాలంలోనే
హైదరాబాదులో భూసంస్కరణలు జరిగాయి. హైదరాబాదు
కౌలుదారీ చట్టం వచ్చింది. ఇది అందరికీ ఆమోదయోగ్యం
గానే గాక ఆనందదాయకంగా మారింది. దేశానికంతటికీ
మార్గదర్శకంగా నిలిచింది. బూర్గుల ప్రభుత్వ హయాంలో
ఈ భూసంస్కరణలను వీరు వేగవంతం చేయించారు.
1952లో హైదరాబాదులో మొదటిసారిగా అఖిల
భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశాలు జవహర్లాల్
నెహ్రూ అధ్యక్షతన జరిగాయి. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా
స్వామిజీ సారథ్యంలో జరిగిన ఏర్పాట్లను పెద్దలందరూ
మెచ్చుకొన్నారు.
స్వామిజీ మొదటిసారి గుల్బర్గా నుంచి, రెండవసారి
ఔరంగాబాదు నుంచి లోక్సభకు పోటీ చేశారు. హైదరాబాదు
స్టేట్ కాంగ్రెసు నాయకత్వాన్ని వదిలేసిన తరువాత స్వామిజీ
నిర్మాణాత్మకమైన కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక
రంగంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. హైదరాబాదు ఖాదీ
సమితి అధ్యక్షునిగా పనిచేశారు. తెలంగాణ ప్రముఖ
కాంగ్రెసు నాయకులు పి.వి. నరసింహారావు, జమలాపురం
కేశవరావు, కోదాటి నారాయణరావు, ఇంకా కాళోజీ
మొదలైన ప్రముఖులంతా స్వామిజీ శిష్యులే.
స్వామిజీది ఒకరికి లోబడి ఉండే తత్త్వం కాదు. తలెత్తి
ప్రశ్నించే నైజం. పోలీసు చర్య తరువాత కమ్యూనిస్టులను
అణచివేసే తీవ్రహింసా పద్ధతిని ఆయన తీవ్రంగా
వ్యతిరేకించారు. స్వామిజీ కేంద్రంపై తీసుకొని వచ్చిన ఒత్తిడి
వల్లనే రాష్ట్రంలో మిలటరీ పాలనను తొలగించి ఎం.కె.
వెల్లోడి ముఖ్యమంత్రిగా సివిల్ ప్రభుత్వం ఏర్పాటయింది.
కమ్యూనిస్టులు జరిపిన సాయుధపోరాటాన్ని కూడా స్వామిజీ
సమర్ధించలేదు.
అతను తెలంగాణ (417) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
iht1cd7qbbm5amyz700nhfhilatuerj
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/439
104
212144
553052
2026-04-15T06:45:18Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ తాలూకా చిల్లేపల్లి అనే గ్రామంలో కుటీరం ఏర్పాటు చేసుకొని కొంతకాలం అక్కడి ప్రజలకు శాంతిబోధలు చేశారు. స్వామిజీ షష్ఠిపూర్తి ఉత్సవం హైదరాబాదులో...'
553052
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నల్లగొండ జిల్లా హుజూర్
నగర్ తాలూకా చిల్లేపల్లి
అనే గ్రామంలో కుటీరం ఏర్పాటు చేసుకొని కొంతకాలం
అక్కడి ప్రజలకు శాంతిబోధలు చేశారు. స్వామిజీ షష్ఠిపూర్తి
ఉత్సవం హైదరాబాదులో లాల్బహదూర్ శాస్త్రిగారి
అధ్యక్షతన అత్యంత వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో
ఆయన పట్ల అశేష జనవాహిని ప్రకటించిన భక్తి గౌరవాలు
స్వామిజీకి ప్రజలలో ఉన్న ఆదరణ ఎటువంటిదో స్పష్టం
చేశాయి. ఇంతటి మహనీయుడైన ఆయన 1972 జనవరి
22వ తేదీన హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.
పలురాష్ట్రాలలోని ఆయన శిష్యులు ఆయన స్మారకార్థం
'స్వామి రామానందతీర్థ సాంఘిక, ఆర్థిక పరిశోధన సంస్థ'ను
హైదరాబాదులో స్థాపించారు. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
నెలకొల్పిన 'గ్రామీణ విశ్వవిద్యాలయా'నికి స్వామి
రామానంద తీర్థ పేరును పెట్టి ఆయనకు నివాళులర్పించింది.
| తెలంగాణ (418) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
p5x9kzw9arwaj1tena4vrhxueast01f
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/440
104
212145
553053
2026-04-15T06:45:33Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '119 తె లంగాణ ఉద్యమ వనంలో తొలి గేయమైన "కదనాన శత్రువుల కుత్తుకల నవలీల - నుత్త రించిన బలోన్మత్తులేలిన భూమి - ధీరులకు మొగసాలరా! - తెలంగాణ వీరులకు కాణాచిరా” అనే పాటతో యాభైఏళ్ళ కిందన...'
553053
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>119
తె
లంగాణ ఉద్యమ వనంలో తొలి గేయమైన
"కదనాన శత్రువుల కుత్తుకల నవలీల - నుత్త
రించిన బలోన్మత్తులేలిన భూమి - ధీరులకు మొగసాలరా! -
తెలంగాణ వీరులకు కాణాచిరా” అనే పాటతో యాభైఏళ్ళ
కిందనే తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన కవి,
పెన్నుగన్ను సమానంగా ఉపయోగించి నిజాం నిరంకు
శత్వానికి ఎదురు నిలిచిన కవి రావెళ్ళ వెంకట రామారావు
వారి తండ్రి లక్ష్మయ్య తల్లి సుబ్బమ్మ. 1930 జనవరి
30న ఖమ్మం జిల్లా ముదిగొండ దగ్గర గోడెనపల్లిలో పుట్టారు.
ఒక అన్న ఇద్దరు తమ్ములు ఒక చెల్లి మొత్తం అయిదుగురు.
వారు రెండవ సంతానం. వారి అన్న రావెళ్ళ సత్యనారాయణ
ఖమ్మం సమితి ప్రెసిడెంటుగా పని చేశారు. సి.పి.యం.
తరుపున చిన్నతమ్ముడు రావెళ్ళ కృష్ణారావు పోస్టల్ శాఖలో
పని చేశారు. అందరికంటే ఆఖరున భాగ్యమ్మ గృహిణి.
1951 జులై
2న నుగుణమ్మతో పెళ్ళయ్యంది.
నలుగురు కొడుకులు. పెద్దకొడుకు మాధవరావు, ఆగ్రో
ఫార్మ్ ఉద్యోగి, రెండో కుమారుడు మహేశ్వరరావు
సింగరేణిలో, మూడవవాడు మనోహరవర్మ (కొత్తగూడెం)
సింగరేణి ఉద్యోగం, నాల్గోవాడు బుజ్జి అంటారు పేరు
లక్ష్మణవర్మ సింగరేణి ఉద్యోగం చేస్తున్నారు.
వీరు కవి, గేయ రచయిత, కథకులు. వీరి కథ 'తెలుగు
స్వతంత్ర'లో వచ్చాయి. కాసా సుబ్బారావు సంపాదకులు
రావెళ్ళ వెంకట్రామారావు
జ్వలిత
మద్రాసు నుండి వచ్చేది ఆ పత్రిక. ఇప్పుడు కాపీలు
లభించడం లేదు. కథ పేరు "దాగని నిజం”. కవులకు
సంబంధించిందే ఆరోజుల్లో నిజంగా జరిగిందే అనవచ్చు.
వారి మొదటి కవిత ఒకసారి పొలంలో కలుపు
తీస్తుంటే "మీకెందుకు బాబు ఈ కష్టం' అని కూలి మనిషి
వారించాడట అప్పుడే “కలుపు మొక్కల ఏరివేతతో చేసుకు
బలం - రజాకార్ల తరిమి వేతతో మనకు బలం" అన్నది
వారి మొదటి కవితా వాక్య. వారి మిగిలిన రచనలు
రాగజ్యోతులు, చైతన్యస్రవంతి, పల్లె భారతి, తాండవహేళ,
అనతల తల్పం మొదలైనవి.
వారు జాషువా స్మారక పురస్కారం, గురజాడ
అప్పారావు పురస్కారం, దాశరథి పురస్కారం అందుకున్నారు.
వారి తాతగారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి వాసి,
100 ఎకరాల ఆసామి పేరు వెంకట్రామయ్య "90 ఎకరాలు
అమ్ముకొని 10 ఎకరాలు మేము ఉంచుకుంటాం సంతకం
చెయ్యండి” అని కృష్ణా జిల్లా పెద్ద మనుషులు అంటే "నేను
సంతకం చెయ్యను, లేని వాళ్ళకు ఇవ్వండన్నారట ఖమ్మంలో.
హీరాలాల్ మోరియా, కొలిపాక మధుసూధనరావు ఇదికాల
నీలకంఠరావు, ఊటుకూరు రంగారావు ఇంకా చాలామంది
కవులు ఉండేవారు, గ్రంథాలయాలు దేవాలయాల కోసం
పని చేశారు కూడా చిన్నపుడు. ఉద్యమం నుండి
బయటికొచ్చిన తరువాత కూడ కలిసిపని చేశారు, కలిసి
ఈతకొట్టారు. గోడనపల్లి జూనియర్ కాలేజి వార్షికోత్సవాలకు
అంతు తెలంగాణ 419 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
fdsgj1349cmywtqzhifhullacjvrwr2
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/441
104
212146
553054
2026-04-15T06:45:52Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రముఖ నాగభైరవ కోటేశ్వరరావును ఒకసారి, ఐఏఎస్, ఐవైఆర్ కృష్ణారావును ఒక సారి తీసుకొచ్చారు. వారు ఉద్యమంలోకి రావటానికి కారణం సమాజంలో అసమానతలు వారిని ఇబ్బంది పెట్టేవి. దోపిడీకి...'
553054
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ప్రముఖ నాగభైరవ కోటేశ్వరరావును ఒకసారి, ఐఏఎస్,
ఐవైఆర్ కృష్ణారావును ఒక సారి తీసుకొచ్చారు.
వారు ఉద్యమంలోకి రావటానికి కారణం సమాజంలో
అసమానతలు వారిని ఇబ్బంది పెట్టేవి. దోపిడీకి వ్యతిరేకంగా
ఏదైనా చెయ్యాలనిపించేది వారికి. ఆ సమయంలో రజాకార్ల
రాక్షస కృత్యాలు ఎక్కువయ్యాం. రజాకార్ల తీరు నచ్చక నెత్తురు
ఉడికి పోయ్యేది వారికి. ఎన్నో కుటుంబాలు రజాకార్ల బారిన
పడ్డాయి. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు, భర్తలను
పోగొట్టుకున్న భార్యలు కళ్ళముందు కదులుతుండేవారు.
ఎందరో ఆడపడుచులను పొట్టన పెట్టుకున్నారు రజాకార్లు.
రజాకార్లు దేశముఖ్
పై తెలంగాణా అంతా తిరగబడ్డది.
14 ఏళ్ళ వయసులో ఉద్యమంలోకి వచ్చారు రావెళ్ళ
వేంకటరామారావు, ఆంధ్రమహాసభ సభ్యునిగా సొంత ఊరు
గోకినపల్లి కేంద్రంగా 100 గ్రామాల్లో దళాలు ఏర్పాటు
చేశారు. వందలాది మందికి శిక్షణనిచ్చారు.
వారు 'తెలంగాణ షేర్' అనే బిరుదు పొందారు.
తెలంగాణ వాదం, నైజాం వ్యతిరేకన్న కారణంగా అరెస్టు
చేశారు. దళ కమాండర్గా పని చేశారు. కేసు విచారణ
సందర్భంగా ఢిల్లీ సుప్రీం కోర్టులో హాజరు పరిచారు.
న్యాయవాదులు అబద్ధాలాడుతుంటే కోపంతో జడ్జి వెనర
ఉన్న గాంధీ చిత్రపటాన్ని చూపిస్తూ "ఉన్కూ వెళ్లాదో ముతా
షరమ్ ఆరహా హై ఉస్కా మూ నై దేఖనా చాహతా హూ
ఓతో ఝాటా బాత్ హై” అని గట్టిగా అరిచారట. అపుడు
న్యాయవాదులు "యే తెలంగాణ షేర్పై అన్నారట.
నిజాంకు వ్యతిరేకమే కానీ ఏ కేసులు లేనందున చేతిలో
30 రూపాయలు పెట్టి వదలి పెట్టారట.
ఆ కేసులో వారిని చాలా జైళ్ళకు మార్చారు. జైలు
నుండి తప్పించుకొనే ప్రయత్నాలు చేసి విఫలమయి నాలుగు
సంవత్సరాల ఆరు నెలలు ఆరు రాష్ట్రాలు తిప్పారు. ముందు
ఖమ్మం తీగల జైలు తర్వాత వరంగల్కు మార్చారు. అక్కడి
జైల్లో గోడలు పగలగొడుతున్న పిండిప్రోలు రాంబాయమ్మను
నిజాం సైనికులు కాల్చి చంపారు. ఆ ఘటనలోనే అదే
జైల్లో ఉన్న రావెళ్ళ తప్పించుకొని కాళోజి ఇంటికి వెళ్ళారు.
కొద్దికాలంలో మళ్ళీ పట్టుబడ్డారు. మిగిలిన ఖైదీలతో కలిసి
సొరంగం తవ్వుతుంటే పట్టుకున్నరు. ఖమ్మం, వరంగల్,
హైదరాబాద్, ఢిల్లీ, ఔరంగాబాద్ గుల్బర్గా, జల్నా జైళ్ళలో
మూడు నెలల కొకసారి మారుస్తూ తిప్పేవారట. జైలు నుండి
1948 జనవరి 30న విడుదలయ్యారు. తరువాత గాంధీగారి
సబర్మతీ ఆశ్రమంలో వారితో రెండురోజులున్నారు. వారికి
గాంధీగారంటే అభిమానం. ఒకసారి నాగపూర్ విద్యార్థులు
చింత చిగురు ఎండు చేపలు వండి పెట్టారట. వాంతులు
విరోచనాలయి బాధ పడ్డారట. ఇందిరాగాంధీ మన రాష్ట్రం
పచ్చినపుడు వేదిక మీద వీరు మాట్లాడారట.
రావెళ్ళ వెంకటరామారావు 1944లో రాసిన “కదనాన
శత్రువుల కుత్తుకల నవలీల సుత్తరించిన బలోన్మత్తులేలిన
భూమి ధీరులకు మొగసాలరా తెలగాణ వీరులకు
కాణాచిరా...” అనే పాట.... దేశపతి శ్రీనివాస్, జయరాజు,
యశపాల్ వంటి గాయకులు పాడుతుంటే వారు చాలా
-
ఆనందపడ్డారు. అప్పుడు అన్ని సభల్లో ఇదే పాట చాలా
ఉత్సాహంగా పాడేవారు.
వారికి ఉద్యమంలో బాగా నచ్చిన సంఘటన ఒకటి
ఉన్నది. ఓసారి వారి దళం నేలకొండపల్లి పోరుబండలో
రాత్రి మకాం వేసినపుడు రావెళ్ళ వారి తుపాకి కొరియర్
యానాది వెంకన్నకిచ్చి పడుకొన్నారట. మొత్తం 300 మంది
నిజాం సైన్యం వారిని చుట్టు ముట్టారట. యానాది వెంకటన్న
తుపాకి వదలి పారిపోతే రావెళ్ళ పై ఒకడు ఒక రౌండు
కాల్చడంతో తూటా తగిలిందట. అయినా తుపాకి అందుకొని
కాల్పులు జరిపారట. అవతలి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ
దగ్గర మంచి తుపాకులున్నాయి. అయినా తెగించి రావెళ్ళ
వెంకట్రామారావు వాళ్ళను సూటిగా కాల్చి వాళ్ళ తుపాకి
గుంజుకొని కాల్చి పారిపోయారట. అప్పుడు కొద్దిలో
ప్రాణాపాయం తప్పిందట లేకపోతే బుల్లెట్ గుండెలో దూరేది.
వారి జీవితంలో విచిత్రమయిన విషయంగా ఒకటి
చెప్పేవారు. అది రాజేశ్వర పురం కోట గురించి. ఆకోట
రైతులకు బాగుండేది. కొండపల్లి కోట కర్ణాలది. మహారాష్ట్ర
సెటిలర్స్ పెళ్ళికొడుకులను హత్య చేసి నిస్సంతులుగా 4
తరాలు పెత్తనం చేసారట అది ఆ కాలంలో విచిత్రం.
తెలంగాణ అనేది కోట్ల మంది ప్రజల కోరిక ఐక్యంగా
పోరాడితే తెలంగాణ తొందరగానే రావచ్చు అనేవారు. వారి
చివరి దశలో భార్య సుగుణమ్మతో తన స్వగ్రామం
గోకినపల్లిలో ఒక చిన్న ఇంట్లో వుంటూ, పక్షవాతంతో
బాధపడుతూ తెలంగాణ రాష్ట్రం కల నెరవేరక ముందే 10
డిశంబర్ 2013లో మరణించారు.
జ: ఉ
తెలంగాణ (420 తేజోమూర్తులు bikes and<noinclude><references/></noinclude>
sk3qlz9h5zwbo9b2m7scvy91hekqk5h
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/442
104
212147
553055
2026-04-15T06:46:06Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '120 రావి నారాయణరెడ్డి - డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి రా వి నారాయణ రెడ్డి గారిని నేను 30 సంవత్సరాల క్రితం కలిసాను. అప్పటికి ఆయన 70 యేండ్ల వయస్సులో కూడా మొహంలో తేజస్సు తగ్గని ఒక న...'
553055
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>120
రావి నారాయణరెడ్డి
- డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి
రా
వి నారాయణ రెడ్డి గారిని నేను 30 సంవత్సరాల
క్రితం కలిసాను. అప్పటికి ఆయన 70 యేండ్ల
వయస్సులో కూడా మొహంలో తేజస్సు తగ్గని ఒక
నాయకుడిలాగా కనిపించారు.
తెలంగాణ పేదరైతుల్లో శ్రమజీవుల్లో చైతన్యం
కలిగించిన ప్రజానాయకుడు రావి నారాయణరెడ్డి,
జాగీరుదారులు, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన
పోరాటాలకు నాయకుడు. తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలో
అగ్రనాయకుడు.
చిత్తశుద్ధి, త్యాగం, ఆత్మార్పణ, ప్రజాభ్యుదయాన్ని కోరే
దీక్షానిరతి, నిజాయితీని కలిగిన మహాపురుషుడు, తెలంగాణ
రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపిన
విప్లవవీరుడు రావి నారాయణ రెడ్డి
ఆయన నలగొండ జిల్లా, భువనగిరి తాలూకా,
గొళ్లపల్లి గ్రామంలో 1908 జూన్ 4వ తేదీన జన్మించారు.
ఆయన తండ్రి రావి గోపాల్ రెడ్డి, తల్లి వెంకటరావమ్మ, వారిది
దొరల కుటుంబం. తల్లిదండ్రులకు ఆయన 14వ సంతానం.
12 సంవత్సరముల వయస్సు వచ్చేవరకు రావి నారాయణ
రెడ్డి గొళ్లపల్లిలో విద్యాభ్యాసం చేశారు. భువనగిరిలోని మిడిల్
స్కూల్లో 4వ తరగతి చదివారు.
ఆ తరువాత ఆయన హైద్రాబాద్ లోని రెడ్డి విద్యార్థి
వసతిగృహంలో చేరినారు. రెడ్డి హాస్టల్కు అనుబంధంగా
వున్న బిడిల్ స్కూల్లో ఫరమ్ చదివారు. చాదర్ ఘాట్
లోని హైస్కూల్లో 1927లో మెట్రిక్యులేషన్ పాస్ అయి
నిజాం కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరారు.
అప్పటికే ఆయనకు ప్రజాసేవ చేయాలనే దృక్పథం
వుండేది. అందుకే ఆయన స్కౌట్స్లో చేరారు నిజాం
కళాశాలలో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే మహాత్మాగాంధీ
ఆత్మకథ చదివి, జాతీయభావాల పట్ల ప్రభావితులయ్యారు.
ఆ తరువాత ఆ ప్రభావంతో ఆయన బద్దం ఎల్లారెడ్డి
తదితరులతో కలిసి కాకినాడ వెళ్ళి సత్యాగ్రహంలో
పాల్గొన్నారు. ఆ ఉత్తేజంతోనే తమ ఊరు గొళ్లపల్లిలో ఖాదీ
ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించి నూలు వడకడం, ఇద్దరు నేయడం
వంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.
1938లో హైద్రాబాద్లో హరిజన సేవా సంఘాన్ని
ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి వామన్నాయక్
అధ్యక్షుడుకాగా, రావి నారాయణరెడ్డి కార్యదర్శి అశ్చ్యశ్వరా
నివారణ గురించి ప్రచారం చేయడం, సహపంక్తి భోజనాలతో
ప్రజల విద్యావికాసానికి కృషి చేయడం ఈ సంఘం యొక్క
లక్ష్యాలు.
హరిజనుల కోసం సుమారుగా 100 స్కూళ్ళను
స్థాపించారు. తరువాత ఆ సంఘానికి అధ్యక్షుడు కూడా
అయి 1988లో స్టేట్ కాంగ్రెస్లో చేరేదాకా కొనసాగారు.
ఈలోగా 1921వ సంవత్సరంలో ఆంధ్రజన సంఘం
ఏర్పడింది. ఒకవైపు విజ్ఞానాభివృద్ధి కోసం గ్రంథాల
యోధ్యమాలు, రైతుల ఇక్కట్లు తొలగించడం కోసం రైతు
చతురుడు తెలంగాణ (421 తేజోమూర్తులు ఓట<noinclude><references/></noinclude>
2ysc5f2bgyjvchl97m0icwwhniipsa8
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/443
104
212148
553057
2026-04-15T06:46:27Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంఘాలు, వ్యాపారుల పరిస్థితులు బాగుచేయడానికి వర్తక సంఘాలు నెలకొలిపినారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా తెలంగాణ పల్లెలు మేల్కొన్నాయి. ఆ రోజుల్లో అలుముకున్న గాంఢాంధకారంలో క...'
553057
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సంఘాలు, వ్యాపారుల పరిస్థితులు బాగుచేయడానికి వర్తక
సంఘాలు నెలకొలిపినారు.
వెట్టిచాకిరికి వ్యతిరేకంగా తెలంగాణ పల్లెలు
మేల్కొన్నాయి. ఆ రోజుల్లో అలుముకున్న గాంఢాంధకారంలో
కాంతిరేఖ ఆంధ్ర జన సంఘం. ఈ సంఘాలన్నింటికి ఒకే
కేంద్ర సంఘం వుండాలన్న సంకల్పంతో 1980లో ఆంధ్ర
మహాసభ ఏర్పడింది. యువ కార్యకర్తగా ఆంధ్రమహాసభల్లో
6వ సభవరకు కార్యకర్తగా పాల్గొని 1940 నాటి 7వ సభ
నాటికి కీలక స్థానానికి వచ్చారు.
ఈలోగా నెహ్రూ "డిస్కవరీ ఆఫ్ ఇండియా”
ఆ
జయప్రకాష్ నారాయణ గారి “సోషలిజం ఎందుకు” రచనలు
చదివి, సోషలిజం వైపు ఆకర్షితులైనారు. అప్రకటిత
కమ్యూనిస్ట్ పార్టీలో 1939 చివరిలో సభ్యులు అయినారు.
1941 సంవత్సరంలో చిలుకూరు సభకు ఆయన
అధ్యక్షుడైనారు. ఆ అధ్యక్షోపన్యాసంలో జాతీయ, అంతర్జాతీయ
సమస్యలను ప్రస్థావించి తమ కమ్యూనిస్ట్ దృక్పధంతో
తెలంగాణలో వున్నటువంటి స్థానిక సమస్యలను కూడా
ప్రస్థావించారు. అప్పటిదాకా జరిగినటువంటి ఆంధ్ర
మహాసభలకు భిన్నంగా ఇక్కడ రాజకీయ సమస్యలను
ప్రస్థావించడం ఈ సభయొక్క విశేషం.
అప్పటివరకు సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమిత
మైనటువంటి ఆంధ్రమహాసభ అప్పటివరకు మహాధనులకు,
విద్యార్థులకే పరిమితమైనటు వంటి ఆంధ్ర మహాసభ ఈ
సభతో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడమనేది గమనించ
తగినటువంటి విశేషం. ఈలోగా బ్రిటీష్వారు 1935లో
ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇతర
రాష్ట్రాలలో ఎన్నికలు. మంత్రివర్గాలు ఏర్పడు తున్నాయి.
ఆ ప్రభావంతో నిజాం రాష్ట్రంలో కూడా ఇటువంటి
బాధ్యతాయుత ప్రభుత్వం రావాలనే ఆలోచన అనాటి
నాయకులకు కలిగింది.
ఆ ఉద్దేశ్యంతోనే 1988లో స్టేట్ కాంగ్రెస్ ను
స్థాపించుకోవాలనే అభిప్రాయం రాష్ట్ర నాయకులకు
కలిగింది. రావి నారాయణ రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు
మొదలగు వారితో సన్నాహాక సంఘం కూడా ఏర్పాటు
చేయడం జరిగింది. ఆ సంఘం నుంచి సత్యాగ్రహం
చేయాలనే నిర్ణయం కూడా జరిగింది. అయితే ఆనాటి నిజాం
నిరంకుశపాలనలో సత్యాగ్రహానికి మించి ఆలోచించడం
కూడా సాధారణమైన విషయం కాదు. తెలంగాణలో
సత్యాగ్రహం చేయడానికి ముందుకు వచ్చిన ఏకైక
యువకుడు రావి నారాయణ రెడ్డి.
1988 నవంబరులో సుల్తాన్ బజారులో జరిగిన
సత్యాగ్రహంలో ఆయన అరెస్ట్ అయి 2నెలలు జైలుకెళ్ళారు.
సంస్థాన చరిత్రలో ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించడం ఒక
సాహసం. ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి ఈరకంగా సత్యాగ్రహ
దళాలు జైలుకి వెళుతున్నాయన్న వార్త ప్రజలలో విశేష
సంచలనాన్ని కలిగించింది. అయితే గాంధీ ఈ సత్యాగ్రహాన్ని
ఆపించారు. ఈలోగా ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు
జరుగుతూనే వున్నాయి. 1944లో రావి నారాయణ రెడ్డి
అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభలో
అతివాద, మితవాద వర్గాల మధ్య భిన్నమైన అభిప్రాయ
భేదాలు వచ్చాయి. ఆ తరువాత ఆంధ్ర మహాసభ రెండుగా
చీలిపోయింది.
ఒకటి జాతీయ ఆంధ్రమహాసభ, రెండవది రావి
నారాయణరెడ్డిగారి నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్ట్
ఆంధ్రమహాసభ. కమ్యూనిస్ట్ పార్టి నాయకత్వంలో
తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం భూస్వామి
వర్గాలకు వెన్నులో చలి పుట్టించింది. రైతులను జాగృతం
చేయడంలో ఆపార్టీ జరిపిన కృషి తెలంగాణలో
చారిత్రాత్మకమైంది.
భూస్వాముల ఆగడాలకు అడ్డుకట్టవేయాలంటే
పోరాటం తప్ప వేరే మార్గం లేదని ఆంధ్ర మహాసభ
అభిప్రాయపడింది. గెరిల్లా యుద్ధం ప్రారంభించాలని
తెలంగాణ రథసారథి రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్ట్
పార్టీలోపల వున్న బి.ఎన్. రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి
మొదలగువారు పోరాటం చేయాలని నిర్ణయించారు.
ఈ నాయకుల పిలుపు మేరకు తెలంగాణలో సాయుధ
పోరాటం ఉదృతంగా ముందుకు సాగింది, బ్రహ్మాండమైన
ఈ పోరాటానికి రావి నారాయణరెడ్డి నాయకత్వం
వహించారు. భారత స్వాతంత్య్ర సమరంలో తెలంగాణ
సాయుధ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖింప తగింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ పోరాటం ప్రఖ్యాతిగాంచింది.
కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటం
ఉదృతంగా ముందుకు సాగుతుంటే భయాందోళనకు గురైన
నిజాం ప్రభుత్వం 1946 నవంబరులో కమ్యూనిస్ట్ పార్టీని
చిరు తెలంగాణ 422 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude>
1gkbu80o0dlmcdmqxy53f4uw7447cer
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/444
104
212149
553058
2026-04-15T06:47:58Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నిషేదించింది. 1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారు. 1948 సెప్టెంబరు వరకు నైజాం పోలీసులు - ప్రజాకారులకు వ్యతిరేకంగా బ్రహ...'
553058
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నిషేదించింది. 1946 నుండి 1951 వరకు జరిగిన
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రావి
నారాయణరెడ్డి నాయకత్వం వహించారు.
1948 సెప్టెంబరు వరకు నైజాం పోలీసులు -
ప్రజాకారులకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన పోరాటం
జరిగింది. పోలీసు చర్య తరువాత కూడా ఈ పోరాటాన్ని
కొనసాగించాలనే వాదనని రావి నారాయణ రెడ్డి
తిరస్కరించారు.
సోషలిస్టు సమాజ స్థాపనకు హింసావాదమే ఏకైక
లక్ష్యమన్న పిడివాదాన్ని ఆయన అంగీకరించలేదు. తెలంగాణ
రైతాంగ సాయుధ పోరాటంలో పోలీసు చర్యకంటే ముందు
తక్కువమంది ప్రజలు మరణించారని, ప్రజలు వారిని
సమయస్ఫూర్తితో కాపాడు కున్నారని నారాయణ రెడ్డి
అభిప్రాయ పడ్డారు.
పోలీసు చర్య తరువాత పార్టీ సభ్యులు, ముఖ్య
నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో మరణించారని ఇది
యదార్ధ సత్యమని నారాయణ రెడ్డి పలు సందర్భాలలో
వ్యాఖ్యానించారు. యూనియన్ ప్రభుత్వ బలగాలు రంగంలోకి
దిగినపుడు పోరాటాన్ని నిలిపివేస్తే పార్టీకి ఎక్కువ నష్టం
జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైతేనేమి
1951లో పోరాటాన్ని నిలిపివేయక తప్పలేదు.
పోరాటాన్ని ఆపినప్పటికి హెూలిస్టిక్ గా తరువాత
జరిగిన సాయుధ పోరాటం గురించి, జరిగిన నష్టం గురించి,
కోల్పోయిన పార్టీ క్యాడర్ గురించి పార్టీ వేదికపై చర్చించక
పోవడాన్ని కూడా రావి నారాయణ రెడ్డిగారు తప్పుపట్టారు.
హైద్రాబాద్ సంస్థానంలో వయోజన ఓటింగ్
ఆధారంగా ప్రజాస్వామిక ప్రభుత్వం స్థాపించటానికి ఈ
పోరాటమే కారణ భూతమైంది. వెట్టిచాకిరి నుండి ప్రజలకు
విముక్తి లభించడానికి, అకున్నదేవి వసూళ్ళు పోవడానికి
ఈ పోరాటమే కారణం. తెలంగాణ సాయుధ పోరాటమే
భూ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి బాటలు వేసిందని రావి
నారాయణ రెడ్డి అన్నారు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఒక అభ్యుదయ
కౌలుదారి చట్టం ఇక్కడ ప్రవేశ పెట్టడం కూడా ఈ పోరాట
ఫలితమే. ఈ పోరాటం ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాల
భూమి పేదరైతుల స్వాధీనమైంది. రైతుల నుండి అక్రమంగా
భూస్వాములు లాక్కున్న భూములను తిరిగి రైతులు స్వాధీనం
చేసుకున్నారు.
ఉద్యమనేత, సాయుధ పోరాటయోధులకు తల
మానికంగా నిలిచారు రావి నారాయణ రెడ్డి. ఆయన కేవలం
సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు ఆయన. తండ్రి
3వేల ఎకరాల భూస్వామి. అతనికి నలుగురు కొడుకులు.
రావి నారాయణ రెడ్డిగారు తనవంతుగా 700 ఎకరాల
భూమివస్తే, అందులోనుంచి 500 ఎకరాల భూమిని
పేదలకు పంపిణీ చేసారు. అంతటి ఉత్తమ సంస్కారుడు
రావి నారాయణ రెడ్డి. ఈ సందర్భంలో ఆయన 5
సంవత్సరాల జైలు, రహస్య నిర్బంధాలను అనుభవించారు.
ఈలోగా 1952లో జరిగిన తొలి సారత్రిక ఎన్నికల్లో
నల్లగొండ పార్టీ నియోజకవర్గంలో పోటీచేసి భారతావని
మొత్తంమీద ఏ వ్యక్తికి రానటువంటి అతిపెద్ద మెజారిటీతో
ఎన్నికై భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ద్వారా
పార్లమెంటులో ఘనసన్మానం పొందారు.
1957 ఎన్నికల్లో భువనగిరి నుంచి శాసనసభకు
| ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను సమర్ధ
వంతంగా నిర్వర్తించారు. 1962లో కూడా తిరిగి భువనగిరి
నుండి పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు.
ఒక సందర్భంలో సొంత తన బావమరిదితో పోటీచేసి,
తన బావమరిదిని లెక్కచేయకుండా ఆయనమీద అఖండమైన
మెజారిటి సాధించి ఎన్నికైనారు.
చివరగా ఆయన 1967 నుండి స్వచ్ఛందంగా
రాజకీయాల నుండి నిష్క్రమించారు. తెలంగాణలో మొదటి
నుంచి చివరిదాకా తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలకు
నిబద్దుడై దానికి కట్టుబడి జీవితాంతం రాజకీయాలతో
పున్నటువంటి నిష్కల్మష హదయుడు రావి నారాయణ రెడ్డి,
చతురుడు తెలంగాణ (423) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
1hr7qjvpmc0rw84hnkff5s7p7n6ehbp
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/445
104
212150
553059
2026-04-15T06:48:17Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '121 తె లంగాణ బీళ్ళను తడిపిన గోదారి పాట సదాశివుడు "తలాపునా పారుతుంది గోదారి, నీ చేనూ, నీ చెలుకా ఎడారి, రైతన్నా! నీ బతుకు అమాస, నీ చుట్టూ సిరులు ఉన్నా నికేది దక్కదన్నా / నీ చేతిలోని...'
553059
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>121
తె
లంగాణ బీళ్ళను తడిపిన
గోదారి పాట సదాశివుడు
"తలాపునా పారుతుంది గోదారి, నీ చేనూ, నీ చెలుకా
ఎడారి, రైతన్నా! నీ బతుకు అమాస, నీ చుట్టూ సిరులు
ఉన్నా నికేది దక్కదన్నా / నీ చేతిలోని బువ్వే నీ నోటి
కందదన్నా / చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా /
మోసపోతివన్న అరిగోసపడితివన్నా "అంటూ ఆయన రాసిన
పాట ఉద్యమానికి ఊపిరి పనిచేసింది. ఆ పాటే అందరినీ
ఆలోచింపజేసే పోరు బాటైంది. ఆయన పాట దగాపడ్డ
తెలంగాణ పల్లె జీవితాల చిత్రికైంది. నీళ్ళు, నిధులున్నా
తెలంగాణలో ఎందుకు బతుకలేకపోతున్నామో... మోసం
చేసిందెవరో తన కవిత్వం, పాటలతో ప్రజల్ని చైతన్యవంతం
చేశారు.
తలాపున గోదావరి పారుతున్నా తెలంగాణ గొంతెండు
తున్న తీరును తన గొంతెత్తి పాడిన గాయకుడు. ఎండి
బీటలు వారిన తెలంగాణ బీళ్లను చూసి కన్నీళ్ళను సిరా
చుక్కగా మార్చి పాలకులను ప్రశ్నించిన కవిగాయకుడు.
బతికినంతకాలం తెలంగాణను పలవరించి, మన పాలన
మనకే కావాలని నినదించిన ఉద్యమకారుడు అతని పాటలు
విముక్తి ఉద్యమ సాంస్కృతిక కార్యాచరణకు చుక్కానిలా పని
చేసినాయ్.
సదాశివుడు
- వఝల శివకుమార్
ఆయన కీ.శే. మల్లావఝల సదాశివుడు. ఉత్తర
తెలంగాణా పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖని నుంచి
పాటల శివుడిగా ప్రసిద్ధుడైన ఆయన తన రాతలనిండా
జనసామాన్యం వాడుక భాషలో, చిన్న చిన్న పదాలతో లోతైన
భావాలను అగ్ని కీలలలాంటి భావనలను పలికించారు.
పాఠశాలలోనూ పాటల శాలలోనూ తన గురువు స్వర్గీయ
చొప్పకట్ల చంద్రమౌళి అని, తన పాటలో తడీ, తండ్లాట,
మార్ధవం తెలంగాణా మట్టి పెట్టిన భిక్ష అని సవినయంగా
చెప్పుకునేవాడాయన. సమాజాన్ని చూసి చేతనైనంతచేసి
పాట రాసి పల్లవించమన్న ఒక ప్రజాపోరాటయోధుని
మాటనే బాటగా కదిలి, అతనిచ్చిన చూపుతోనే సమాజాన్ని
చూసి సంక్షోభాల మూలాలను గ్రహించి ప్రజల పాలై
నినదించిన ప్రజా చైతన్య స్వరం సదాశివుడు.
తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి సైతం
వెనుకాడుతున్న కాలంలో నిర్బంధాన్ని ధిక్కరించి నీటి వాటా
పంపిణీలో జరుగుతున్న అన్యాయాలమీద పాటను ఎక్కుపెట్టి
తన తెగువను ప్రదర్శించిన కవి, గాయకుడు, బడిపంతులే
అయినా, కష్టాల చీకట్లలో కూరుకుపోయి ఉన్నా, తాను
బలహీనుడిని కాదూ, కలం గళం సంధించిన సంపూర్ణ
మానవుడిని అని సగర్వంగా ప్రకటించుకున్నా తెలంగాణా
తల్లి గుండె చప్పుడు ఆయన.
జ: తెలంగాణ 124 తేజోమూర్తులు ఉ
(424
తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude>
tg4srzz97h4wo22emapg8l72zzm8mwu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/446
104
212151
553060
2026-04-15T06:48:32Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మలిదశ ఉద్యమానికి సాంస్కృతిక ప్రేరణలోని సమయంలో ఆయన పాటే ఉద్యమానికి చుక్కానిలా పనిచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పాట దగాపడ్డ తెలంగాణ పల్లె జీవితాల చిత్రికైంది. నీళ్ళ...'
553060
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మలిదశ ఉద్యమానికి సాంస్కృతిక ప్రేరణలోని
సమయంలో ఆయన పాటే ఉద్యమానికి చుక్కానిలా
పనిచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆయన పాట దగాపడ్డ తెలంగాణ పల్లె జీవితాల
చిత్రికైంది. నీళ్ళు, నిధులున్నా తెలంగాణలో ఎందుకు
బతుకలేకపోతున్నామో, మోసం చేసిందెవరో తన కవిత్వం,
పాటలతో ప్రజల్ని చైతన్యం చేశారు. సదాశివుడు పుట్టింది.
02-09-1943న కరీంనగర్ జిల్లా (నేడు పెద్దపల్లి జిల్లా)
రామగుండం మండలంలోని మురుమూర్ గ్రామంలో తండ్రి.
వెంకట క్రిష్ణయ్య తల్లి లక్ష్మీనరసమ్మ. వృత్తిరీత్యా ప్రభుత్వ
ఉపాధ్యాయుడైనా అప్పటి సామాజిక పరిస్థితుల్లో విప్లవ
మార్గం పట్టి రైతుకూలీ పోరాటాలు, యువజన సంఘాల
నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. అనంతరం సామాజిక
ఉద్యమాల్లో కొనసాగుతూనే ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాన్ని,
కూడా కొనసాగించారు.
20 ఏళ్ళ పాటు విప్లవ, అభ్యుదయ గీతాలెన్నింటిలో
ఊపిరి పోశారు. ఆయన పాటలు నాటి పాలకులు తీరును
ప్రశ్నించినవే. వలస బతుకుల వలపోతకు అద్దంపట్టినట్టు
ఆయన రచించి, గానం చేసిన "ఏమున్నదక్కా.. ఈ పార్టీ
మనకింక ఏమున్నదక్కా.. ఇళ్ళు సర్దుకున్న... ముల్లె సర్దుకున్న
ఎళ్ళిపోతావున్నా ఈ ఊళ్ళే మనకింక ఏమున్నదక్కా” ఈ
పాట వినని తెలుగోడు ఉండడు. ఆర్. నారాయణమూర్తి
ఎర్రసైన్యం కోసం సదాశివుడు రాసిన ఈ పాట దిక్కులేని
పక్షుల్లా వలసపోయే తెలంగాణా రైతుల వెతలను కట్టింది.
ఈ పాట గురించి చెప్పుతూ నేనూ ఊరు విడిచి ముల్లె
సద్గురుకొని బయల్దేరిన్నాడు ఏ మట్టిమీది మమకారం తన
గాత్రాన్ని గద్దడం చేసిందో ఆ మమకారమే తన పాటకు
అశృలిపిగా అమరిందని ఇవాళ ఆ వేదనే వలసల దుఃఖంగా
ప్రవహించిందని అంటాడు. దళారులు తమ దోపిడీ
విధానాల కింద స్వార్ధ రాజకీయల అందతో అప్పుకింద
భూమిని, ఇళ్ళనూ లాక్కుంటే అన్నీ పోగొట్టుకున్న రైతు
గుండెకోత పాట నిలువెల్లా కన్నీటిస్నె కమ్ముకున్నది.
అంటాడు.
అంతేకాక "జాబిలమ్మకు జిలుగు పొగుల దుప్పటి
కప్పిన చేతులివి" అంటూ చేనేత కార్మికుల జీవనశైలిని
అర్ధంగా వర్ణించాడాయన. వరకట్న రక్కసి కోరలకు
బలవుతున్న ఆడబిడ్డల చూసి కళ్ళు చెమర్చాడాయన. చిన్న
వయస్సులోనే తనువు చాలిస్తున్న అబలలను చూసి "పారాణి
అరలేదు చెల్లిలా... అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా?
అని అన్నగా ఆక్రోశించాడు. ఇలా ఒక్కటని కాదు ఆయన
పాటలన్నీ వినేవారి గుండెకు సూటిగా గుచ్చుకుంటాయి.
ఆలోచనలు రగిలిస్తాయ్. ఆయన పాటల్లోని పల్లె వాతా
వరణం పల్లె ఆత్మకు అద్దంపడుతాది, పల్లె పాయిరానికి
పాదాలు కడుగుతాది.
బతుకు తత్వాలను బతుకమ్మ గొప్పంగా పల్లె పాడిన
పచ్చ పచ్చని పాటకు ఆనవాలు తానై ప్రతిధ్వనించిండు.
గత పాలకుల పన్నాగాలను ఎండగడుతూ "ఇంకుడు
గుంతల ఇగురుంజెప్పవ్ అన్నో ఓరన్నా! మా చెరువు
కుంటలను మింగిందెవరో చెప్పవేందిరోకన్నా! అంటాడు.
రైతులూ, చేనేత కార్మికులూ, కూలీలూ, కష్టాలు పడుతున్న
స్త్రీలూ, బాల కార్మికులూ, పల్లెలూ, రాజ్యం దౌష్ట్యానికి బలైన
ఎందరో అమరులు సదాశివుడి పాటల్లో ప్రాణమున్న
చరణాలైండ్రు.
వరంగల్ జనార్దనక్కు స్మృతిగీతాన్ని సమర్పిస్తూ”
మహర్షీ నా తెలంగాణా వాల్మీకీ! వలసవాదం అణచివేత
ఇంకా ఇకపై సాగవంటూ యుద్ధం ప్రకటించి /
నేలకొరిగిన వీరుడా! పరాజితుల కోసం సాగిన నీ పాట
మా దగ్గర స్వరంజీవిగా ఉంది / అది గాలై ఏరై హోరై /
అంతటా విస్తరిస్తోంది... మా కోటి రతనాల వీణపై కదన
కుతూహలమై మోగుతుంది / అంటూ ఆయన దీక్షను తన
గొంతుకెత్తుకొని ఉద్యమ ప్రస్థానానికి పునరంకితమౌతాడు.
తన పాటలను అభిమానించిన కాళోజీ, శివసాగర్ వంటి
మహాకవులతో ప్రేమగా శివుడూ అని పిలిపించుకుని తనదైన
నడకను సార్థకం చేసుకున్నాడు.
కేవలం ఉద్యమ పాటలే కాకుండా 90వ దశకంలో
కరీంనగర్ జిల్లాలో చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమం అక్షర
ఉజ్వల కోసం ఆయన ఎన్నో పాటలు రాశారు. రాయడమే
కాకుండా కంచుకంఠం లాంటి ఆయన గొంతుతో ఎన్నో
వేదికల మీద స్వయంగా ఆలపించాడు. పారిశ్రామిక
ప్రాంతంలో మరియు ఉత్తర తెలంగాణా పల్లెల్లో, కాలనీల్లో
చేతులు తెలంగాణ 425 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
p6x1icr3sl9p0zn6pajzb3cel70z1r6
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/447
104
212152
553061
2026-04-15T06:48:44Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వఝల శివకుమార్తో కలిసి ఔత్సాహికులైన ఏలేశ్వరం వెంకటేశ్వర్లు వంటి యువకులను ప్రోత్సహించి వారి సహకారంతో పలు సాహిత్య సాంస్కృతిక సంస్థల స్థాపనలో ముఖ్య భూమికను పోషించాడు. గ్రం...'
553061
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వఝల శివకుమార్తో కలిసి ఔత్సాహికులైన ఏలేశ్వరం
వెంకటేశ్వర్లు వంటి యువకులను ప్రోత్సహించి వారి
సహకారంతో పలు సాహిత్య సాంస్కృతిక సంస్థల స్థాపనలో
ముఖ్య భూమికను పోషించాడు. గ్రంథాలయోద్యమంలో
చురుకుగా పాల్గొని ఊరూరా నిర్వహింపబడిన గ్రంథాలయ
సభల్లో స్ఫూర్తివంతమైన తన ప్రసంగాలతో ప్రజలలో చైతన్య
బీజాలు నాటారు.
స్వయంగా ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణంలో
భాగంగా చేతన సాహితి సాంస్కృతిక సమాఖ్యను స్థాపించి
ఎందరో గాయనీ గాయకులను తీర్చిదిద్దారు. పారిశ్రామిక
ప్రాంతంలోని ఎందరో ప్రసిద్ధ గాయకుల గొంతుల్లో పాటలై
పరవళ్ళు తొక్కాడు.
సదాశివుడు రాసిన పాటలను ఎర్రకుంకుమ పేరుతో
ఆడియో క్యాసెట్, పుస్తకం, సైరన్ పేరుతో ఆయన కవితలను
పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. ఎర్రకుంకుమతో పాటై
పోటెత్తిన శివుడు కాలేరన్నల నిత్యఘర్షణలనూ, స్వేదనదుల్లో
తడిపి ఆరేసుకుంటున్న బండకిందిబతుకుల పెనుగు
లాటలనూ తన కవితా స్వరాలుగా ఈ సైరన్ కవితా
సంపుటిలోనూ మోగించాడు. తెలంగాణా నేల విముక్తి కోసం
పాటను ఉద్యమ బాటగా స్వీకరించి కలమెత్తి కవనమై,
గొంతెత్తి నాదమైన ఈ కవి గాయక యోధుడు 2005
నవంబర్ 25న ఆకస్మికంగా తనువు చాలించాడు.
మనకు అమూల్యమైన తన పాటలను, కవితలనూ
వదిలి ఆయన గొంతు మూగబోయింది. ఆయన పాట
మాత్రం ఉద్యమమై తెలంగాణను మోసుకొచ్చింది.
పల్లె గొంతు పెగిలితే పాట
నేల చెమ్మగిల్లితే పాట ఆ పాటే సదాశివుడు
ఎన్నెల కోనల ఊపిరి ధారలమీద
అక్షరాల అగ్ని కణం సదాశివుడు
కాలేరన్నల దిగులు చీకట్లమీద
జ్వలత్ కవనాల జైత్రయాత్ర సదాశివుడు.
2007 నుంచి ప్రతి ఏడాది సదాశివ స్మారక
అవార్డులను సాంస్కృతిక రంగంలో రాణిస్తున్న వారికి
అందజేస్తున్నారు. గోదావరిఖని కేంద్రంగా సదాశివుడి
సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏడాది ఒక
సాహితీ మూర్తిని ఆయన స్మారక అవార్డుతో సత్కరిస్తున్నారు.
తెలంగాణ (426 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
eqjlnolcvb7gpvdbqqq0siiklwxjf0b
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/448
104
212153
553062
2026-04-15T06:48:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '122 సాహు అన్నవరం దేవేందర్ ఆ యన గోండు గూడెం వెలుగురేక. గిరిజనుల గుండె చప్పుడు. గిరిజనుల చరిత్రను లోకానికి అందించిన దర్మానికుడు అడవిలో వెలుగులు పంచిన సూర్యుడు ఆయన సాహు ఈ మారు...'
553062
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>122
సాహు
అన్నవరం దేవేందర్
ఆ
యన గోండు గూడెం వెలుగురేక. గిరిజనుల
గుండె చప్పుడు. గిరిజనుల చరిత్రను లోకానికి
అందించిన దర్మానికుడు అడవిలో వెలుగులు పంచిన
సూర్యుడు ఆయన సాహు ఈ మారు పేరే గోండు
భాషకుచెందినది అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు ఆయన
కవి రచయిత ఉద్యమకారుడు. ఇతడు వెలుగునాట ఆ
మాటకు వస్తే అందరికీ పరిచయమైన 'కుమ్రం భీం' చరిత్రను
గిరిజనుల మౌఖిక గాథల్లోంచి వెలికి తీసి అందించిన
వారిలో ఆయన సహరచయిత. మరో కుమ్రం భీం నవలను
సాహు, అల్లం రాజయ్యలు కల్సి 1984లో వెలువరించారు.
ఉద్యమాల్లో ఉండి గొప్ప సాహిత్యం సృష్టించినవారు
అందరూ సాహిత్య చరిత్రలో ప్రాచుర్యం పొందకపోవచ్చు.
ఎందుకంటే వాళ్ళకు రచనలే అసలు పనికాదు. అసలు
వృత్తి ఉద్యమం. అందునా రహస్యోద్యయం. ఆ కారణాల
వల్ల పాటలు కళలకు సాహిత్య స్రవంతికి కొంచెం తక్కువగానే
తెలుస్తాయి. సాహు కథలు రాసిండు, పాటలు రాసిండు.
తెలుగు, గోండు, హిందీ భాషల్లోనూ రాసి పాడిన గాయకుడు.
"నీ కన్నీరు నా కన్నీరు
కలిగినోల్లకు పన్నీరాయె
ఒంటిగ నువ్వే శోకం పెడితే
ఎట్లా చిన్న తమ్మయా!
అని ఆయన రాసి పాడిన పాటలు 1980 దశకంలో
ఊరూర ఉద్యమ వేదికల మీద అందరూ పాడుకున్నారు.
ఇదేకాకుండా వెట్టిదారిరి బానిసత్వండు వ్యతిరేకంగా జరిగి
ఆందోళనల్లో పాటలీ ప్రధానం పాటలు జనం భాషలో
బాణిని పట్టుకొని ఆకట్టుకుంటాయి. ఆ పాటల్లో సమస్య
పోరాటం పరిష్కారం ఉండవచ్చు అందువల్ల జానపద జనం
బాణీల్లో ఉన్న సాహిత్యం విస్తృతమయింది. అట్లనే
"పొదల పొదల గట్ల నడుమ
పొడిచెనాళ్ళు చందమామ
కొమురెల్లి కొండల్లోనా! ఓ రాజన్న
కొలిమి అంటుకున్నదిరో... ఓ రాజన్న”
ఈ పాట ఆ కాలంలో రేతు కూలి సంఘాల విద్యార్థి
సంఘాల్లో సభల్లో ఊరురిల్లో పాడేవారు. ఆ కాలంలో ఈ
పాటలు ఎవరు రాసిండ్రో కూడా పేరు ప్రచారం అయ్యేది.
కాదు జన నాట్యమండలి పాటలుగా ప్రసిద్ధమయ్యేవి.
అనంతర కాలంలో ఇవి సాహు రాసిన పాటలు అనే
విషయం అవగాహనకు వచ్చేది.
ఇట్లా సాహు అనేక పాటలు రాసినాడు. ఇంద్రవెల్లిలో
గిరిజనుల సభ మీద కాల్పుల అనంతరం 'రగల్ జెండా'
అనే నృత్య రూపకం రూపొందించి కూడా సాహు ఈ
ప్రదర్శన మొత్తం ఆదివాసీలపై జరుగుతున్న దోపిడి అంసాలు
చూడు తెలంగాణ (427) తేజోమూర్తులు ఉండటంతో<noinclude><references/></noinclude>
8vg9c0pz4g2s3y94274w9fd1u0lcxlz
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/449
104
212154
553063
2026-04-15T06:49:14Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'త్యాగాలపై అక్కడ జరుగుతున్న నైజాన్ని కళ్ళకు కట్టినట్లు రూపొందించారు. ఈ 'రగల్ జెండా' వందలుకాదు ఆరోజుల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి. సాహు అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు కరీ...'
553063
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>త్యాగాలపై అక్కడ జరుగుతున్న నైజాన్ని కళ్ళకు కట్టినట్లు
రూపొందించారు. ఈ 'రగల్ జెండా' వందలుకాదు ఆరోజుల్లో
వేలాది ప్రదర్శనలు జరిగాయి.
సాహు అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు కరీంనగర్
జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యాపూర్లో 1955
అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జన్మదినంనాడే జన్మించారు.
ఆయన తండ్రి స్వాతంత్య్ర్య సమరయోధుడు. నైజాం వ్యతిరేక
పోరాటంలో గాంధేయ వర్గం అవలంబించిన మహనీయుడు.
మాణిక్యాపూర్ గ్రామమే మొత్తం స్వాతంత్ర్య పోరాట
వారసత్వం పుణికిపుచ్చుకున్నది. అక్కడి నుంచి ఎంతోమంది
పూర్తిస్థాయి ఉద్యమ కార్యకర్తలుగా జీవితాల్ని త్యాగం
చేసినవారున్నారు. వెరసి సాహు పూర్తిస్థాయి రాజకీయ
జీవితంలోకి వెళ్ళి మనకు 'కొమురంభీం'ను అందించిన
రచయిత.
1980కి ముందు మనందరికీ మన్యంలో అల్లూరి
సీతారామరాజు గురించే తెలుసుకాని మన నేలమీదనే నిజం
రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు
చెందిన కొమురంభీం గుర్చి తెలియదు. ఇప్పుడైతే
పాఠ్యపుస్తకాల్లో ప్రభుత్వ రికార్డుల్లో ఆదివాసి గిరిజన వీరున్ని
తలచుకొని గౌరవిస్తున్నాం. అసలు కొమురంభీం గూర్చి
ప్రపంచానికి సాహు, అల్ల రాజయ్యలు రాసిన నవలద్వారానే
తెల్సింది. సాహు అజ్ఞాత జీవితంలో ఉండగా గొండు భాష
నేర్చుకున్నారు.
1979 ప్రాంతంలో ఆదిలాబాద్ అడవుల్లో అజ్ఞాతంలో
ఉన్న క్రమంలో 'భీం' పోరాటం గూర్చి మాట్లాడుకోవడం
విన్నాడు. ఆయనకు అప్పటికే గొండు భాష తెల్సుకాబట్టి
ఒక రచయితగా పరిశోధకుడుగా ఆయన పుట్టింది,
పెరిగింది, పోరాటం చేసింది, ఆయా గోండు నాయకుల
ద్వార కొమురంభీ, వారసుల ద్వారా రీసెర్చి చేసిండు.
ప్రఖ్యాత కథ, నవలా రచయిత అల్లం రాజయ్యతో చంద్ర
పంచుకున్న ఇద్దరూ కల్సి నవలకు శ్రీకారం చుట్టిండ్రు.
ఇది 1983లో పుస్తకంగా బయటకు వచ్చింది. కొమురంభీం
1940లోనే అమరుడయ్యిండు. ఆనాటి పచ్చ పచ్చ జ్ఞాపకాల
చరిత్రను వెలికితీసిన తర్వాత ఆయన ఆదివాసుల హక్కుల
కోసం రాజ్యంపై తుపాకితో యుద్ధం చేసిన చరిత్రగా లోకానికి
తెల్చింది. అనంతరం ఇదే కథ సినిమాగా కూడ వచ్చింది.
ఇప్పుడు కామురంభీం విగ్రహాలు అంతటా కన్పిస్తున్నాయి.
సాహు, అల్లం రాజయ్య వెలికి తీసిన చరిత్రాత్మకమైన
చరిత్ర ఇది. ఇది గాకుండా సాహు ఎన్నో కథలు రాసిండు.
కరీంనగర్ బుక్ ట్రస్టీ వారు 1886లో వెలువరించిన 'అడవిలో
వెన్నెల' కథా సంకలనంలో కన్నీటి నీటికథ, పెళ్ళికావాలి,
కాయిదా, సాంప్రదాయం, ఐదు రూపాయల కథ, భూమి
కొరకు, రక్తపింజెర, జెండా కథ, ఆకలి, మరడ్యడుం
పాయం. నిర్ణయం కథలు ప్రఖ్యాతమైనవి. అవి కథలు అనే
కంటే ఆదివాసి జీవితాలు అంటే బాగుంటుంది.
సాహు విద్యార్థిదశలో ఉన్నప్పుడే విప్లవ రాజకీయ
అవగాహన ఏర్పరుచుకున్నాడు. 1975లో హుజురాబాద్లో
'జనసాహితీ సంస్థను అవునురి సమ్మయ్య, నరెడ్ల శ్రీనివాస్
తదితర మిత్రులతో కల్సి స్థాపించారు 1978లోనే మహా
కవి శ్రీశ్రీని హజూరాబాద్కు ఆహ్వానంచి బహిరంగ సభ
ఏర్పాటు చేశారు. అదే సభలో శ్రీశ్రీ ఊగరా ఊగరా ఊరి
కొయ్యందుకొని ఊగరా అనే పాటను రాసి పాడారు.
హుజురాబాద్ పురవీధులగుండా సాహు, ఆవునూరి
సమ్మయ్య తదితరులు ఊరేగింపు తీసారు. అనంతరం సాహు
విప్లవరాజకీయల్లోకిపోయి 1976లో 'మీసా చట్టం కింద
డిటెన్యూ అయి జైలుశిక్ష అనుభవించాడు. తిరిగి బెయిలుపై
1977లో బయటికి వచ్చారు. హుస్నాబాద్ ప్రాంతంలో
అడవిలోకి వెళ్ళారు. అప్పుడే అడవిలో 'గొండు' భాషను
అభ్యసించాడు.
జైలు జీవితంపై కూడా సాహు ఎన్నో కథలు రాసారు.
జైలులో 'బందీ' అనే రాత పత్రికను వెలువరించారు.
ఇంద్రవెల్లిలో గిరిజనులపై పోలీసు కాల్పుల అనంతరం
'రగలెండా' అనే బ్యాలెను రచించారు. రగల్ జెండా బ్యాలెను
దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జన నాట్యమండలి
ప్రదర్శించింది. సాహు తెలుగు, హిందీ, గోండు భాషలోనూ
పాటలు రాశారు. రెండవసారి ఆదిలాబాద్లో 1983లో
అరెస్ట్ అయి వరంగల్, విశాఖపట్నం జైల్లలో గడిపారు.
జైలు నుంచి 1988 లో విడుదల అయ్యేవరకు విరసం
సభ్యునిగా కొనసాగారు.
అయయం చేయుటయు తెలంగాణ (428 తేజోమూర్తులు ఉండి<noinclude><references/></noinclude>
d5s6xhzotkc55qxjxc8px410hsq43m7
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/450
104
212155
553064
2026-04-15T06:49:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సాహు అనంతరం బి.యస్. రాములుకు విప్లవ ఉద్యమాల సాహిత్యంపైన సామాజిక స్థితిగతుల లోటుపాట్లపై ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన విభేదిస్తున్న అంశాలను ఏ కరువుపెట్టారు. సాహు ఆదివాసి...'
553064
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సాహు అనంతరం బి.యస్. రాములుకు విప్లవ
ఉద్యమాల సాహిత్యంపైన సామాజిక స్థితిగతుల లోటుపాట్లపై
ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన విభేదిస్తున్న
అంశాలను ఏ కరువుపెట్టారు.
సాహు ఆదివాసి ప్రజల గుండెల చప్పుడు. గిరిజనుల్లో
వెలుగు నింపేందుకు వాల్ల భాషలోనే ఆడి పాడి మాట్లాడి ఆ
చరిత్రలో లీనమయిన సాహు సాహసి. చరిత్రకారుడు చరిత్ర
నిర్మాత.
1993 మార్చి 16న సాహు గుండె పోటుతో
మాణిక్యాపురం గ్రామంలోనే కన్ను మూసాడు. అయితే
ఆయన 'కొమురంభీం' జీవిత చరిత్రను వెలికితీసిన
రచయితగ గొప్ప పాటల రచయితగా తెలుగు సమాజంలో
సాహిత్యంలో పేరెన్నికగన్నాడు. సాహు ఒక వ్యక్తికాదు
ఆదివాసులు శక్తి. అతడు తెలంగాణ వైభవానికి స్థంభం
వంటివాడు.
సమరము తెలంగాణ
తెలంగాణ (429 తేజోమూర్తులు
ఓ<noinclude><references/></noinclude>
cwwk8tky8gu0nu6wq6c4ly9p81ayids
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/451
104
212156
553065
2026-04-15T06:49:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '123 సైబ పరంధాములు - - కందాళై రాఘవాచార్య పెద్దబజారు చిన్నసందులోని కళాత్మకమైన దర్వాజా లోంచి సన్నగా - సన్నని నడిమి పాపిట ఒత్తైన వెంట్రుకలతో, చేతిలో ఎన్నో పుస్తకాలతో స్టూడియో 'ఆక...'
553065
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>123
సైబ పరంధాములు
-
- కందాళై రాఘవాచార్య
పెద్దబజారు చిన్నసందులోని కళాత్మకమైన దర్వాజా
లోంచి సన్నగా - సన్నని నడిమి పాపిట ఒత్తైన
వెంట్రుకలతో, చేతిలో ఎన్నో పుస్తకాలతో స్టూడియో 'ఆకృతి'కి
నడిచి వెళ్తుంటే కళా సెలయేరు పారుతున్నట్లనిపిస్తుండేది...
ఆ కళామూర్తే సైబ పరంధాములు.
కీ.శే. సైబ పరంధాములు, శ్రీ సైబ లింయ్య, శ్రీమతి
గంగూబాయి దంపతులకు 08-4-1945న నిజామాబాద్
నగరంలో జన్మించారు.
అప్పటి మల్టీపర్పస్ లో చదివి గోల్డ్ మెడల్ సంపా
దించారు. అనారోగ్య కారణాల వల్ల బి.టెక్. పూర్తి చేయలేక
పోయారు. ఇది ఒకవైపు వారి శారీరక కోణం. కాని వారి
అంతరాంతరాల్లో అనేక కళలు సజీవంగా నడుస్తూ ఉండేవి.
కొంతకాలం శ్రీరాధాకృష్ణ విద్యాలయం ఎయిడెడ్
పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా వారి అనంతమైన
కళాజీవనానిక ఆ వృత్తి కట్టేసినట్లుగా అనిపించింది. తానే
స్వయంగా 'ఆకృతి' స్టూడియోను ప్రారంభించారు.
పూసలగల్లి - జవహరురోడ్లో ఉండే ఆ స్టూడియో,
కళాకారులను, చిత్రకారులకు, కవులకు కూడలైంది.
'ఆకృతి'ని అందరి చిరునామాగా మార్చివేసిన కళామూర్తి
సైబ. మనిషిలో ఒక కళ ఉంటేనే ఎంతో గొప్ప. సైబ
పరంధాములులో కవిత్వం, చిత్రకళ, ఫోటోగ్రఫీ, నఖచిత్రం
శిల్పం ఇలా అన్ని కళలు పూర్ణమై ఉన్నాయి.
1969 మకరసంక్రాంతి 14న ప్రారంభమైన ఇందూరు
భారతి మూలస్తంభాలలో వీరు ముఖ్యులు. ఇందూరు భారతి
ద్వారా 'చౌరస్తా' కవితా సంకలనానికి వీరు చిత్రాలు గీశారు.
ఇది సాహితీ చరిత్రలో అపూర్వఘట్టం. చౌరస్తా కవులని
తెలునాట సైబ, ఎ. సూర్యప్రకాష్, బద్ధూరి నరసింహం,
శ్రీపాద స్వాతి సుప్రసిద్ధులు.
వీరి ఇంట్లోనే గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యువ
కవులకు కొత్త కొత్త కవితా సంకనాలు ఇక్కడి నుండే
ప్రాప్తించేవి. అనేక మంది కవులకు మార్గదర్శకత్వం
వహించేవారు. ఇందూరు భారతి అనేక గ్రంథాలకూ సైబ
గీసిన బొమ్మలే ముఖ్యచిత్రాలు. చూస్తుండగానే మనిషి
ముఖాకృతిని క్షణంలో పెన్సిల్తో చిత్రించేవారు.
టౌను హాలులో జుగల్బంది ఉత్సవంలో ఒక కళా
కారుడు తబలా వాయిస్తుంటే దానికనుగుణంగా చిత్రాలు
పెయింట్ చేశారు. ఈ అద్భుత చిత్రాలు ఇప్పటికి
నిజామాబాద్ ఎఫ్.ఎమ్. ఆకాశవాణి కేంద్రంలో కుఢ్య
చిత్రాలుగా మనకు సైబను జ్ఞాపకం చేస్తాయి. అనాటి
ఉత్సవానికి కలెక్టర్ శంకరన్ విచ్చేసి సైబను అభినందించారు.
సైబసార్ గీసిన నిలువెత్తు గాంధీగారి ఫోటో అప్పట్లో
వ్యాపారవేత్త వెలాస్య సాయిరెడ్డి కొన్ని వేలకు దక్కించు
కున్నారు. చాలా కాలం శాంతినివాస్ లాడ్జ్ ఎదురుగా
ఉండేది. కవి మిత్రులు వచ్చినప్పుడు సైబ పెయింట్ చేసిన
తేజోమూర్తులు denied
జ: తెలంగాణ (430 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
oz3r1mzvptsjchs2o7tnybn0rr64kiz
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/452
104
212157
553066
2026-04-15T06:49:53Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గాంధీగారి అద్భుత కళా ఖండాన్ని చూపించేవాళ్లం. ఇడ ఫోటోగ్రఫీ అంటే సైబకు ఆరవ ప్రాణమే. దానిని వ్యాపారంగా భావించక ప్రవృత్తిగానే స్వీకరించేవారు. పెండ్లిల్లకు, సభా కార్యక్రమాలక...'
553066
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గాంధీగారి అద్భుత కళా ఖండాన్ని చూపించేవాళ్లం. ఇడ
ఫోటోగ్రఫీ అంటే సైబకు ఆరవ ప్రాణమే. దానిని వ్యాపారంగా
భావించక ప్రవృత్తిగానే స్వీకరించేవారు. పెండ్లిల్లకు, సభా
కార్యక్రమాలకు ఫోటో తీయడానికి వెళ్లినా అంత డబ్బు
కావాలని డిమాండ్ చేసేవారు కారు. గోలుకొండ కోటలో
అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల మేళ 1978లో జరిగినప్పుడు
సైబ తీసిన అనేక ఫోటోలకు అవార్డులు లభించాయి. కవి
మిత్రుల పెండ్లిల్లకు సైబ కెమెరాతో విచ్చేసేవారు. వారు
తీసిన ఆల్బమ్లు దాదాపు అందరి మిత్రుల ఇండ్లల్లో ఆయన
జ్ఞాపకంగా ఉన్నాయి.
సైబకు ఉన్నవి రెండే చేతులైనా కలంతో కవిత్వం
రాస్తూ- కుంచెతో చిత్రాలు వేస్తూ కెమెరాతో ఫోటోలు
తీసేవారు దారువును శిల్పాలుగా మలిచేవారు. వారు
మొదట్లో 'వెన్నెల' అనే లిఖిత మాసపత్రిక బాల సాహిత్యం
కోసం అవిష్కరించారు.
తరువాత ఇందూరు భారతి ద్వారా ఆవిష్కరింపబడ్డ
కొన్ని చిత్రాలు, వెలుగులో రావటానికి సంకలనాలుగా మలచ
బడటానికి రూపశిల్పి వీరే.
ప్రముఖుల సన్మాన పత్రాలకు సైబ డిజైన్లు
కూర్చేవారు. జగ్గయ్యకు సమర్పించిన చిట్టిబాబు, ఈమని
శంకర శాస్త్రులకు వేదికపై అందజేసిన అనేక సన్మాన
పత్రాలకు సైబ ఆకృతే ముఖ్యం.
కవిగా సైబ పరంధాములు అనేక రచనలు గావిం
చారు. సైబ పద చిత్రాలు, సైబ శబ్ద చిత్రాలు, భావ చిత్రాలు,
భావ గీతాలు మొదలైన సంకనాలకు అనేక అవార్డులు
లభించాయి. వీటికి తాను వేసిన చిత్రాలే అంతర్వాహినిగా
అద్భుతాలు! కేవలం కవిత్వమే కాకుండా వీరు అనేక సంగీత
రూపకాలు రచించారు. ఇవి రేడియోలోనూ వేదికలపై
ప్రసారము - ప్రదర్శన ఐనాయి.
వీరు రచించిన 'సిద్ధార్థ' నృత్యరూపకం మహారాష్ట్రలోని
నాందేడ్ జిల్లాలో ప్రదర్శింపబడి మన్ననలందుకుంది.
విషజ్వాల, ప్రత్యూష చిత్రాలకు కళాదర్శకత్వం వహించారు.
ఆర్మూర్ ప్రజలు సైబ పరంధాములు గారికి మహోన్నత
వేదికపై ప్రముఖులు, పెద్దలు, కవులు, కళాకారుల సమక్షంలో
'కళానిధి' బిరుదుతో సన్మానించారు. ఇటు కవులకు
శిక్షణనిచ్చి ఎందరో ప్రముఖ కవులుగా తీర్చిదిద్దారు. సాహితీ
సేవలో క్లుప్తగోష్టులు, చర్చలు, కవితా పఠన పోటీలు
నిర్వహించి కవులకు అండదండగా ఉండేవారు.
ఎందరో ఫోటోగ్రాఫర్లను అవుట్ డోర్ కు తీసుకువెళ్లి
శిక్షణ నిచ్చేవారు. ముఖ్యంగా వాటిలో జిల్లా, నందిగుట్ట,
సారంగపూర్, అలీసాగర్ యాత్రలు మరువలేనివి. ఈ
రోజున స్టూడియోలు పెట్టుకొని జీవితాన్ని గడుపుతున్నారు.
ఆయన శిష్యులు ఎందరెందరో!
నిజామాబాదులో తమ ఆకృతి సంస్థ ద్వారా అనేక
ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించారు అలిశెట్టి ప్రభాకర్, చిత్రాలు,
చంద్ర చిత్రాలు, సిద్దిపేట రాజయ్య గారి పెయింటింగ్స్
సై నిర్వహించి అనేక చిత్రకారులకు స్ఫూర్తి దాతలైనారు.
Lions, Lio లాంటి అనేక సంస్థలకు తమ సేవల
నందించి సభలు జయప్రదం జరిగేలా పర్యవేక్షణ
జరిపేవారు. వీరి స్టూడియోను దర్శించిన ప్రముఖులు
దాశరథి, ఆరుద్ర, జగ్గయ్య, సినారె గారలు.
ఇందూరు ఉత్సవాలకు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
సి. నారాయణరెడ్డి గారు విచ్చేసినప్పుడు అస్వస్థతగా ఉన్న
సైబను ఎన్నో మెట్లు ఎక్కి వచ్చి పలకరించారు. సైబ కృషిని,
చిత్రాలను చూసి ప్రశంసించారు. ఆ వేళ సైని ఇంట్లో వీధి
జాతరే ఐంది.
సైబ నిరంతరం సేవా కార్యక్రమాల్లో వుండటంవల్ల
ఒత్తిడి, ఎల్లవేళలా సంచారం, సమావేశాలు, అవుట్ డోర్
ఫోటోగ్రఫీ సమావేశాలు - పని ఒత్తిడితో సైబకు అనారోగ్యం
కలిగింది. ఎంత అనారోగ్యంగా ఉన్న సైబసార్ సమావేశం
అంటే సై అనేవారు. వారు చాలాసార్లు అనారోగ్యంగా
వున్నా, వారి మార్గదర్శకత్వంలో పెద్ద సమావేశాలు
నిర్వహించాం. సైబకి ముగ్గురు మగపిల్లలు, శశాంక, సారిక,
తూనిక. ఇప్పుడు సారిక మాత్రమే మిగిలున్నారు. భార్య
'అహల్య' సైబని అమ్మలా చూసేది. సైబకి ఆడపిల్లలంటే
ఎంతో ఇష్టం. ఇందూర్ వాస్తవ్యురాలు, అప్పుడే డిగ్రీ కళాశాల
మెట్లెక్కిన అయినంపూడి శ్రీలక్ష్మిని స్వంత కూతురిలా
చూసుకునేవారు. ఆ దంపతులు తాను ప్రముఖ
-
bash తెలంగాణ (431 తేజోమూర్తులు ఓడ
సమరము తెలంగాణ (431<noinclude><references/></noinclude>
5sr74v5yvbt4higqxj5js98ns2qmdx3
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/453
104
212158
553067
2026-04-15T06:50:06Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కవయిత్రిగా, వ్యాఖ్యాతగా నిలబడటానికి కారణభూతులు సైబ. అలాగే పంచారెడ్డి లక్ష్మణ్, చందనరావు, సమీర, బద్ధూరిల స్నేహం మర్చిపోలేనిది. ఒకసారి రక్తహీనతతో ప్రభుత్వ వైద్యశాలలో చేరిన...'
553067
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కవయిత్రిగా, వ్యాఖ్యాతగా నిలబడటానికి కారణభూతులు
సైబ. అలాగే పంచారెడ్డి లక్ష్మణ్, చందనరావు, సమీర,
బద్ధూరిల స్నేహం మర్చిపోలేనిది.
ఒకసారి రక్తహీనతతో ప్రభుత్వ వైద్యశాలలో
చేరినప్పుడు అనుకోకుండా విచ్చేసిన మహాకవి ఆరుద్ర
సైబను పరామర్శించారు. అంత అనారోగ్యస్థితిలోనూ
సైబసారు పెన్సిల్తో ఆరుద్ర చిత్రం గీసి అందించి చేతులు
జోడించి కృతజ్ఞతలు చెప్పారు. వరంగల్లు సమావేశాలకు
వెళ్లినప్పుడు సైబ ఆరోగ్యం చాలా క్షీణించింది. త్వరలోనే
కోలుకున్న వారిపై పనిభారం వేసేవారం కాదు. ఒక్కోరోజు
స్టూడియోకు వెళ్ళకున్నా - కవిమిత్రులను కలువకున్నా
సైబకు పొద్దుపోయేది కాదు.
తరువాత కాలంలో స్టూడియో ఆకృతిని పెద్దబజారుకు
మార్చారు. ఇంటికి దగ్గర అవడం కొంత అనుకూలం. ఇక్కడ
ఉన్నప్పుడే చాలా సంకలనాలు తన చేతితో రాసి ముద్రిం
చారు.
సైబ గీసిన చిత్రాలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి,
ఆంధ్రపత్రికల్లో ప్రచురణమైనాయి. అనేక కవితలకు
పత్రికలవారు వీరి ఫోటోలను సందర్భానుసారం కళాత్మకంగా
వేసేవారు.
అది 15-08-1997 భారత స్వాతంత్య్ర దినోత్సవం.
సైబ శ్వాస పీల్చుకోవడం చాలా కష్టమైంది. ఈ రోజే
అంతిమశ్వాసను ఈ లోకానికి ఇచ్చేసి సైబ కీర్తిశేషులైనారు.
అంతిమ యాత్రలో నిజామాబాద్ కళాకారులు కొన్ని
కిలోమీటర్ల పర్యంతం వాటికకు కదలివచ్చారు. కళామూర్తిని
కోల్పోయిన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.
కవిత్వం, ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం మూడు ముమ్మూర్తులా
కలిసిన త్రివేణి సంగమం కళానిధి మన సైబ పరంధాములు.
వీరు క్షణం క్షణం ఎప్పుడు కార్యక్రమం నిర్వహించినా స్మృతికి
వస్తూనే ఉంటారు.
తెలంగాణ ప్రభుత్వం సైతం కీ.శే. కళానిధి పర
రధాములు గారి కళాసేవను ప్రశంసించి పెద్ద సభను స్మృతిగా
నిర్వహించింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం
అందించింది. సైబ సహధర్మచారిణి శ్రీమతి అహల్యగారు
సభకు హాజరై సంభావనను గ్రహించారు. అలాగే రాష్ట్ర
ఆవిర్భావానంతరం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు
మామిడి హరికృష్ణగారు 'సైబ' ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు
చేసి, 75వేల రూపాయలు ఆర్థిక సహకారం అందివ్వటం
ద్వారా తెలంగాణ కళాకారులకు రాష్ట్రావిర్భావం ద్వారా
వెలుగురోజులు వచ్చాయనిపించింది. ప్రముఖ చలనచిత్ర
దర్శకులు బి. నరసింగరావు రూపొందించిన 'ఆర్ట్ @ తెలంగాణ
పుస్తకంలో కూడా సైబగారి చిత్రాల్ని వేసి వారికి కళా
నీరాజనం అందించడం ఇందూర్ వాసులకి గర్వకారణం.
కళామూర్తి సైబ పరంధాములు శరీరంతో భౌతికంగా
లేకున్నా ఇందూరు నగరం ప్రతి ఉత్సవంతో ఆయనను
జ్ఞాపకం చేసుకుంటూనే ఉంది. ఈనాడున్న కవులు,
ఫోటోగ్రాఫరులు, చిత్రకారులు ఆయన తీర్చిదిద్దిన జ్ఞాపికలే!
ఈనాటికి ఆకృతి స్టూడియో దగ్గరకు వెళ్లినా వారున్న
వీధిలోకి వెళ్లినా వారి మృదువైన కవితాగానం - వారి
వర్ణమయ చిత్రాలు వినిపిస్తాయి, కనిపిస్తాయి.
4 తెలంగాణ (432 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
r15qcjqy9wnbaegb3p5xsgybnlymgie
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/454
104
212159
553068
2026-04-15T06:50:21Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '124 తె లుగు వారికి ఉర్దూ భాష మాధుర్యాన్ని రుచి చూపిన వారిలో అగ్రగణ్యులు డా. సామల సదాశివ మాస్టారు. ఆదివాసులు జిల్లా, అడువుల జిల్లా అని పేరు వడసిన ఆదిలాబాదు జిల్లాకు సదాశివ మాస...'
553068
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>124
తె లుగు వారికి ఉర్దూ భాష మాధుర్యాన్ని రుచి
చూపిన వారిలో అగ్రగణ్యులు డా. సామల
సదాశివ మాస్టారు. ఆదివాసులు జిల్లా, అడువుల జిల్లా అని
పేరు వడసిన ఆదిలాబాదు జిల్లాకు సదాశివ మాస్టారు జిల్లా
అన్న ప్రాచుర్యం రావడానికి దశాబ్దాల ఆయన సాహిత్య
కృషితోపాటు, పెద్దవారితో విన్న వారితో వారేర్చరుచుకున్న
సాన్నిహిత్య ప్రేమానురాగాలు కూడా కారణాలు.
తన ప్రతిభ ప్రస్తావన రానీయకుండా ఎదుటి వారిలోని
ప్రతిభా పాటవాలు పసి గట్టడంలో ప్రసిద్ధులు సదాశివ
సారు. పనివారు, పసివారల నుండి పండితులు, ప్రతిభా
వంతులదాకా తనకు పరిచయమైన వారిలోని, ప్రావీణ్యాలను
మానవతా విలువలను, సౌజన్య సౌశీల్యాలను గుర్తించి
పనిగట్టుకుని ముచ్చట్ల రూపంలో ప్రజావళికి పలు పత్రికల
ద్వారా వెలువరించిన వితరణ శీలి సదాశివ. ఇప్పుడంటే
రవాణా సౌకర్యాలున్నాయి. ఫోన్ లున్నాయి. పత్రికలు, టీవీల
వంటి పలు మాధ్యమాలున్నాయి. ఊరూరికి బడులున్నాయి.
కాలేజిలున్నాయి. కాని ఏడెనిమిది దశాబ్దాల కిందటి
ఆదిలాబాదు జిల్లాను గురించి ఆలోచిస్తే, సదాశివ బాల్యాన్ని
తలచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. పుట్టిననప్పటినుండి.
చివరి శ్వాస వరకు ఏ కొన్నినాళ్ళో బయటి ఊళ్ళల్లో గడిపినా
జిల్లాను వదిలిపెట్టకుండానే అక్కడనుంచే ప్రపంచ వ్యాప్తంగా
పరిచయాలు పెంచుకున్నారంటే ఆయన లక్ష్యకుద్ధి ఎంత
గొప్పనైనదో ఊహించవచ్చు.
సామల సదాశివ (యాది)
-
తుమ్మూరి రాంమోహన్రావు
సదాశివ మాస్టారు పుట్టింది ఒకప్పటి ఆదిలాబాదు
ఇప్పటి కొమురం భీము జిల్లా కాగజునగరం ప్రాంతంలోని
తెనుగుపల్లె. అది అప్పటికీ పల్లెనే. ఆ పల్లెలోని పూరి
గుడిసెలో కన్ను తెరిచిన సదాశివ బాల్యం. తండ్రి నాగయ్య
పంతులు బడి పంతులుగా పని చేసిన కాగజ్ నగర్
సమీపంలోని నవెగాంలో గడచింది. అది నైజాం జమానా,
బళ్ళల్లో ఉర్దూ మీడియంలో బోధన జరిగేది. సారు కూడా
.
ఉర్దూ మీడియంలోనే చదువుకున్నా తండ్రి నేర్పిన తెలుగుతో
ఇంట్లో ఉన్న భారత భాగవతాలు చదివి తెలుగు భాష పై
పట్టు చేజిక్కించుకున్నారు. అలాగే అరబ్బీ తెలిసిన గురువు
దగ్గర అరబ్బీ నేర్చుకున్నారు.
వరంగల్లులో మెట్రిక్ వరకు చదివి స్వంత జిల్లాలో
ఉపాధ్యాయ వృత్తిలో చేరినారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు
నిర్వహిస్తూనే, మరోవైపు సాహిత్య రంగంలో ప్రవేశించి
పద్యాలు, కథలు, వ్యాసాలు రాసి పత్రికలకు పంపడం,
పండిత ప్రకాందులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరపడంతో
గుర్తింపదగిన స్థాయికి చేరుకోవడమేకాదు పలువురి
ప్రశంసలకు పాత్రులైనారు. సదాశివ గారు తొలుత తన
పద్యకృతి ప్రభాతము వెలువరించారు. ఆ పిదప సాంబశివ
శతకము, నిరీక్షణము లఘు కావ్యములను వెలువరించారు.
ఈ రెండింటికీ ముందు మాట వ్రాసిన కప్పగంతుల లక్ష్మణ
శాస్త్రి గారు సదాశివ పద్య రచనను మనసారా కొనియాడారు.
చూడు తెలంగాణ (433 తేజోమూర్తులు ఉండటంతో<noinclude><references/></noinclude>
1ccx2forzp8aldf5ocorb0nyv7dgiay
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/455
104
212160
553069
2026-04-15T06:50:34Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆ తరువాత మంచి మాటలు, ధర్మ వ్యాధుడు, విశ్వామిత్రము, అంబపాలి, వంటి పలు పద్య కృతులు రాసినారు. ఇవిగాక అర్జద్ రుబాయీలు అందమైన తేటగీతల్లోకి తర్జుమా చేశారు. వీరి రుబాయీల అనువాదాలు...'
553069
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆ తరువాత మంచి మాటలు, ధర్మ వ్యాధుడు,
విశ్వామిత్రము, అంబపాలి, వంటి పలు పద్య కృతులు
రాసినారు. ఇవిగాక అర్జద్ రుబాయీలు అందమైన
తేటగీతల్లోకి తర్జుమా చేశారు. వీరి రుబాయీల అనువాదాలు
చూసి మురిసిపోయిన వేలూరి శివరామ శాస్త్రి సదాశివలోని
నిష్ట పద్య రచనా శైలిని, భావ గాంభీర్యాన్ని ప్రస్తుతించారు.
ఒకవైపు తెలుగు రచనలు కొనసాగిస్తూనే మరోవైపు ఉర్దూ
పత్రికలకు వ్యాసాలు రాస్తుండేవారు. ఈ తరుణంలోనే
గోలకొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి గారు
పద్య కవిత్వం పక్కకు పెట్టి పారసీ, అరబ్బీ, ఉర్దూ భాషలలోని
విశేషాల గురించి రాయమని సూచించడంతో సదాశివ గారు
వారి మాటకు విలువనిచ్చి తన దిశను మార్చుకున్నారు.
ఇక అప్పటి నుంచి సదాశివ తన దృష్టినంతా ఉర్దూ
అరబ్బీ ఫారసీ భాషా సాహిత్యాలవైపు మళ్ళించి ఫారసీ కవుల
ప్రసక్తి, గాలిబు జీవిత చరిత్ర, ఉరుదూ సాహిత్య చరిత్ర
వంటి పుస్తకాలు ప్రచురించారు. గీటురాయి, మిసిమి
పత్రికల్లో గజల్ రుబాయీ వంటి ప్రక్రియల గురించిన
సాధికారిక వ్యాసాలు రాశారు. సియాసన్ పత్రిక ద్వారా
తెలుగులోని ప్రసిద్ధ కవులను ఉరుదూ వారికి పరిచయం
చేసి ఇరు భాషల వారధియైనారు. సామల సదాశివ.
ఇదంతా ఒక పార్శ్వమైతే సదాశివ సంగీతజ్ఞత
ఆయనకు ఎందరో అభిమానులను సమకూర్చింది.
ఆదిలాబాదుకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర సంస్కృతి
సంప్రదాయాల ప్రభావం తెలంగాణ ప్రాంతంపై ఉన్నది.
అది ఆదిలాబాదులో మరీ ఎక్కువ. తరచుగా హిందూస్తానీ
కచేరీలు వినడం ఆ మాధుర్యానికి అలవాటుపడటంతో
హిందూస్తానీ సంగీత గాయనీ గాయకులు, గాయన
పద్ధతులు, ఘరానాలు మొదలైన విషయాలపై పట్టు
సాధించారు. తనకు తెలిసిన విషయాలను, తాను
అనుభవించిన ప్రతి రసరమ్య సన్నివేశాలను ముచ్చట్లుగా
అటు పాఠకులకు, ఇటు తనను కలువడానికి వచ్చిన
అభిమాన శ్రోతలకు చెబుతుండేవారు. అవును ఆయన
రచనలు చదివే పాఠకులకు చదివినట్లుగా కాకుండా ఆయన
చెబుతుంటే విన్నట్లుగా ఉండేవి. అదే వారి వచన రచనలోని
విశేషం.
అవే తరువాత మలయ మారుతాలు, సంగీత
శిఖరాలు, యాది, స్వరలయలు పుస్తకాలుగా వెలువడ్డాయి.
ఇందులో ఒక్కో పుస్తకం ప్రత్యేకతను సంతరించుకుని
సదాశివకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాయి.
వాకాటి పాండురంగారావు గారి అభ్యర్ధనతో ఆంధ్రప్రభకు
మలయమారుతాలు రాస్తే ఎంతోమంది సంగీత సాహిత్య
ప్రేమికులు ఆయనకు అభిమానులయ్యారు. అట్లే మాన
వీయతా పరిమళాలతో యాది పేరుతో, వార్త ఆదివారం
అనుబంధంలో ఆయన రాసిన వ్యాసాలు ఆయనను యాది
సదాశివను చేశాయి. ఇక స్వరలయలు ఏకంగా ఆయనకు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిపెట్టింది.
హైదరాబాదుకు చెందిన సూఫీకవి అష్టద్ రుబాయీలను
సదాశివగారు అనువదిస్తే దానికి పరిచయం పేరిట ముందు
మాట రాసిన వేలూరి శివరామశాస్త్రి గారు సదాశివ నిర్దుష్ట
పద్య రచనా విధానానికి, భావ గాంభీర్యానికి మురిసిపోయి
ప్రశంసల జల్లులు కురిపించారు.
సూఫీయిజాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెప్పేవారు.
ఆయన సాహిత్యజ్ఞత ఎంత లోతైనదో సంగీతజ్ఞత అంత
గొప్పది. ఇంకో విచిత్రమైన విషయ మేమిటంటే ఆయన
మంచి తైల వర్ణ చిత్రకారుడు కూడ బళ్ళో చదువుకునే
రోజుల్లో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా దీనదయాళ్
నాయుడు, పిళ్ళై బొమ్మలు నేస్తుంటే స్ఫూర్తి పొంది
నేర్చుకున్నారు. దాంతో సదాశివ మాస్టారు ఉపాధ్యాయులపై
పని చేసిన కాలంలో నాటకాలకు అవసరమయ్యే పరదాలను
చిత్రించడం, తమ కవితలకు తగిన బొమ్మలు గీయడం,
ముఖాకృతల చిత్రాలు వేయడం చేస్తుండేవారు. ప్రసిద్ధ
చిత్రకారులు కాపు రాజయ్య తన తొలి దశలో సారు దగ్గర
చిత్రకళలో మెళుకువలు నేర్చుకున్నారట.
బహుముఖ ప్రజ్ఞాశాలియైన సదాశివ అనేక ప్రక్రియల్లో
పట్టు సాధించారు. వారు రాసిన కొన్ని కథలు అప్పట్లో
సుజాత పత్రికలో ప్రచురించబడ్డాయి. వారు అపశ్రుతి, రేవతి.
అనే రెండు నవలలు కూడా రచించారు. మరాఠీ నుండి
కేశవ సుత్ జీవిత కథ తెనిగించారు. పలు పుస్తకాలకు
ముందు మాటలు రాసారు. నాటకాలకు సందర్భోచిత
పద్యాలు రాసిచ్చారు. సదాశివ గారి జీవితంలో కాళోజీ
సోదరుల మైత్రి ఒక ప్రధాన ఘట్టం. వారి గురించి
ప్రస్తావించని ముచ్చట ఉండదు. తలచుకుని పరవశించని
చిరు తెలంగాణ 434 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
5p0n09ywl2ahy5jljglvbl4udn04q4a
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/456
104
212161
553070
2026-04-15T06:50:47Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రోజు ఉండదు. అదొక అపూర్వ మైత్రీబంధం, పూర్వజన్మల బంధం. దానికి ఒక కారణం ఆ సోదరుల అన్యోన్య ప్రేమానుబంధం ఆయనకు అన్ని వర్గాలవారితోనూ, అన్ని వాదాల వారితోనూ, అన్ని ప్రాంతాలవారితోన...'
553070
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రోజు ఉండదు. అదొక అపూర్వ మైత్రీబంధం, పూర్వజన్మల
బంధం. దానికి ఒక కారణం ఆ సోదరుల అన్యోన్య
ప్రేమానుబంధం
ఆయనకు అన్ని వర్గాలవారితోనూ, అన్ని వాదాల
వారితోనూ, అన్ని ప్రాంతాలవారితోనూ సత్సంబంధాలు
దేవి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి.
ఆదిలాబాద్కు చెందిన గొండి వీరుడు కొమురం భీం. నిజామ్
దురాగతాల నెదిరించి ప్రాణ త్యాగ మొనర్చిన ఉద్యమ
కారుడు. మాస్టారు పాఠ్యపుస్తక రచయితగా ఉన్నప్పుడు
కొమురం భీం జీవిత విశేషాలను తెలుగు పాఠ్యాంశంగా
చేర్చారు. ఉత్తర భారత దేశం నుండి వచ్చి ఆదిలాబాదులో
స్థిరపడి, ఆదివాసులతో మమేకమై, వారిలోని కళాశ్మర
నైపుణ్యాలను పునురుద్దరించడానికి కంకణం కట్టుకున్న
కళాక్రమ నిర్వాహకులను రవి కర్యంటే ఎంత అవ్యాజ ప్రేమో
మాటల్లో చెప్పనలవికానిది. ఆయన నుండి స్ఫూర్తి
పొందడానికి అనేక మందికి ఆయనను పరిచయం చేసిన
ఘనత సదాశివ గారికి దక్కుతుంది.
రచనలలో వ్యక్తులను పరిచయం చెయ్యడంలో
మాస్టారికి అనితర సాధ్యమైన శైలి. ప్రస్తుతించే పద్ధతిలోగాక
ప్రస్తావనలోనే వ్యక్తుల గొప్పతనాన్ని గోచరింపజేయడం
ఆయనలోని విశేషం. మంచిని పంచడం మమతల్ని
పంచడం, మానవతా విలువల్ని పెంపొందించడం ఆయన
నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన అంశం. యౌవన
దశలో యోగాభ్యాసం కూడా చేసేవారట. త్రాటకం అభ్యాసం
చేసిన వారని విన్నాను. అన్నీ నిర్చిన భావయోగి, కర్మయోగి
డా. సామల సదాశివ.
ఉద్యోగం చేస్తూనే స్నాతకోత్తర విద్యను సాధించిన
సదాశివ గారిని పదవులు, వరస్కారాలు వెతుక్కుంటూ
వచ్చాయి. ఉపాధ్యాయులుగా, పాఠశాలల తణిఖీ అధికారిగా,
ఉపాధ్యాయ శిక్షణ సంస్థ లోధకుడిగా పనిచేసిన సదాశివ
పదోన్నతిపై భద్రాచలం కళాశాల పరిని పాలుగా చేసి పదవీ
విరమణ పొందారు. ఉరుదూ భాషాభిజ్ఞులుగా రెండు
దశాబ్దాలు ఆం.ప్ర. సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘ
సభ్యులుగా, విజ్ఞులుగా, మూడేళ్ళు కాకతీయ విశ్వవిద్యాలయ
సెనేట్ మెంబరుగా గౌరవ పదవులలంకరించారు. వీరి
అనువాదాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
పురస్కారాన్ని పొందారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారాన్ని గౌరవ
డాక్టరేటును, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ
డాక్టరేటును పొందారు. వీరి 'స్వరలయల'కు కేంద్ర సాహిత్య
అకాడమీ అవార్డు లభించింది. అవికాక మరెన్నో సన్మాన
సత్కారాలు జరిగినా అవన్నీ చంద్రునికో నూలు పోగు
వంటివే. ఇటీవల వీరి రచనలపై పరిశోధనలు మొదల
య్యాయి.
ఆకాశవాణిలో వీరు చేసిన ప్రసంగాలు ఎందరో
రసజ్ఞులైన శ్రోతలనలరించాయి. తొణుకు బెణుకులేని వీరి
కంఠస్వరం, సహజసుందరి శైలి, చిన్న చిన్న వాక్యాలతో
వీరి ప్రసంగం శ్రోతల నలరించేదిగా ఉండేది. కరీంనగర్
విశ్వనాథ వీఠంవారు సదాశివ అభినందన సంచికగా
ఏడువందలకు పైగా పేజీలుగల జయంతి సంచిక
ఆదిలాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆవిష్కరణ జరిగినప్పుడు
ఒక పండుగలా అనిపించటం అతిశయోక్తి కాదు. మాటల
కందని మహనీయుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
తెలంగాణా వైతాళికులలో ఒకరయిన డా. సామల సదాశివ
మాస్టారు 11 మే 1928న జన్మించి 7 ఆగస్టు 2012లో
పరమపదించారు. భౌతికంగా లేకున్నా వారి స్ఫూర్తి
చిరకాలం ఉంటుంది.
చేతులు తెలంగాణ 435 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
m83axc7vqtsmaw9bf4pdfo5xmns3a5s
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/457
104
212162
553071
2026-04-15T06:51:04Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '125 శంకర్ (జైకిషన్) - హెచ్. రమేష్ బాబు హి ందీ సినిమా సంగీతాన్ని నౌషాద్, సి. రామచంద్ర, అనిల్బిశ్వాస్లు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న కాలం అది. నూనూగు మీసాలు కూడా రాని ఇద్దరు కుర్రాళ్...'
553071
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>125
శంకర్ (జైకిషన్)
- హెచ్. రమేష్ బాబు
హి
ందీ సినిమా సంగీతాన్ని నౌషాద్, సి. రామచంద్ర,
అనిల్బిశ్వాస్లు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న
కాలం అది. నూనూగు మీసాలు కూడా రాని ఇద్దరు
కుర్రాళ్లు ఆ ముగ్గురి అంశను కలబోసుకొని బాలీవుడ్ వెండి
తెరవెనుక ప్రత్యక్షమయ్యారు. వారే శంకర్ - జైకిషన్లు.
బాలీవుడ్లో భారతీయ సినీ సంగీతాన్ని రెండున్నర
దశాబ్దాల పాటు చకచ్చకితం చేసిన సంగీత కోవిదులు శంకర్
జైకిషన్లు. వీరు సినిమాలకు పని చేసిన కాలమంతా
ఒక 'స్వర్ణయుగమే'. ఈ శంకర్ - జైకిషన్లలోని శంకర్ సింగ్
రఘువంశీ అచ్చమైన మన హైదరాబాద్ పహిల్వాన్. 1922
అక్టోబర్ 15న హైదరాబాదులో పుట్టాడు. తండ్రి రాంసింగ్,
తల్లి ఎల్లమ్మ. చిన్నప్పటి నుంచే సంగీత నాట్యాలంటే ఆసక్తి
చూపి బడికి వెళ్ళే రోజుల్లోనే శాస్త్రీయ సంగీతంపై దృష్టి
పెట్టాడు. కథక్ నృత్యంలోనూ శిక్షణ పొందాడు. నెమ్మదిగా
అతని అడుగులు రంగస్థలం వైపు నడిచాయి. సత్య
నారాయణ, హేమావతి థియేటర్ గ్రూపులో చేరి నాటకాల్లో
వేషాలు వేయడం మొదలుపెట్టాడు. సంగీతానికి కూడా
చేరువగానే మసలుకునేవాడు.
హైదరాబాద్లో తాలింఖానాలో కసరత్తులు చేసిన
వస్తాదుగా కుస్తీలు పట్టిన మన శంకర్ సింగ్. అంతే ఇష్టంగా
తబాలాపై దరువు వేశాడంటే మోగిపోయేది లయగా. ఏది
ఏమైనా సరే, నేర్చుకున్నది చాలని బొంబాయి చేరుకున్న
శంకర్ కొంతకాలం హున్న్ బాల్ భగర్రా రాంల వద్ద
శిష్యరికం చేశాడు. ఆ తరువాత అనుకోకుండా పృథ్వీరాజ్
కపూర్ దృష్టిలో పడ్డాడు. పృథ్వీ థియేటర్లో నెల జీతానికి
కుదిరాడు. వారి నాటకాలకు తబలా వాయించేవాడు. 1929
నవంబర్ 21న గుజరాత్కు చెందిన బల్సార్లో జన్మించిన
జైకిషన్తో ఒకనాడు శంకర్ కి పరిచయం కలిగింది.
హార్మోనియం నేర్చుకున్న జైకిషన్తో ఏర్పడిన ఆ పరిచయం
మంచి స్నేహంగా మారింది.
జైకిషన్ను శంకరే తన వెంట తీసుకెళ్లి పృథ్వీరాజ్తో
చెప్పి ఉద్యోగం ఇప్పించాడు. అయితే జైకిషన్ ఎడమ
చేతివాటం. మన శంకర్ మాత్రం కుడిచేతినే ఉపయో
గించాడు. ఇలా ఈ కుడి ఎడమలు రెండూ కలిసి బాలీవుడ్లో
ఆనాడు మధుర స్వరాలను సృష్టించాయి. అద్భుతమైన
సినిమాలు తీయాలని కలలు గంటున్న రాజకపూర్, కవులు
హస్రత్ జైపూరి, శైలేంధ్రలు అప్పటికి అక్కడ ఉండనే
ఉన్నారు. వారికి శంకర్ జైకిషన్లు తోడైయ్యారు.
ఇంకేముంది, భారతీయ సినిమాలో నూతన అధ్యాయానికి
తెర లేచింది. రాజ్కపూర్ మొదటి సినిమా 'ఆగ్' (1948)
తీయాలనుకున్నప్పుడు రామ్ గంగూలీని మ్యూజిక్ డైరెక్టర్గా,
అసిస్టెంట్స్ గా శంకర్ జైకిషన్లను తీసుకున్నారు. కానీ,
తన సినిమా బాణీలను రామ్ గంగూలీ ముందుగానే
బయటకు వినిపిస్తున్నాడని తెల్చుకుని రాజకపూర్ తన
అంటుంటే తెలంగాణ 436 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
57vcn60lkhgmbf8kngeuc3r07pgiv8k
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/458
104
212163
553072
2026-04-15T06:52:05Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తరువాతి సినిమాకి శంకర్ - జైకిషన్ సంగీత దర్శకు లన్నారు. ఆ చిత్రం 1949లో వచ్చిన 'బర్సాత్, 'బర్సాత్ మె హమ్సే మిలే తుమ్ సజన్', 'హవామె ఉడ్తాజాయే', 'రాజాకీ ఆయేగీ బారాత్' పాటలు వీరిని మొదట...'
553072
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తరువాతి సినిమాకి శంకర్ - జైకిషన్ సంగీత దర్శకు
లన్నారు. ఆ చిత్రం 1949లో వచ్చిన 'బర్సాత్,
'బర్సాత్ మె హమ్సే మిలే తుమ్ సజన్', 'హవామె
ఉడ్తాజాయే', 'రాజాకీ ఆయేగీ బారాత్' పాటలు వీరిని మొదటి
చిత్రంతోనే హిమాలయ శిఖరాలపై కూర్చో పెట్టాయి.
ముఖ్యంగా 'రాజాకీ ఆయేగి బారాత్' పాట రాసిన శైలేంద్ర
కవిత్వం మన శంకర్ సంగీతానికి సరైన జోడి అయ్యింది.
అట్లానే - హస్రత్ జైకిషన్ బాగా కుదిరాడు. ఇట్లా థీమ్
సాంగ్స్ శంకర్ శైలేంద్రలు చేస్తే, డ్యూయెట్ సాంగ్స్
-
-
జైకిషన్ హస్రత్లు చేయడానికి ఎవరంతట వారే డిసైడ్
అయిపోయాడు. అయితే, ఏ పాటను ఎవరు చేశారన్నది
బయటికి చెప్పకూడదనేది వీరిరువురి మధ్య ఉన్న ఓ
ఒప్పందం. దీనికి లోబడే వాళ్లు చాలాకాలం పనిచేశారు.
శంకర్ - జైకిషన్లు ఇట్లా రాజ
కపూర్ సినిమాలకు శాశ్వత
సంగీత దర్శకులుగా చాలా కాలం పనిచేశారు.
ఈ ఈ నేపథ్యంలో శంకర్ - జైకిషన్ సంగీతం
సమకూర్చిన కొన్ని చిత్రాలు 1948లో బర్బాత్,
1951-60 దశకంలో ఆవారా, బాదల్, కాలీఘటా, నగీనా,
దాగ్, పరబత్, పూనమ్, ఆహ్, ఆస్, ఔరత్, నయాఘర్,
పతితా, షికస్త్, బాషా, బూట్పాలిష్, మయూర్ పంఖ్,
పూజా, సీమా, శ్రీ 420, బసంత్ బహార్, చోరీచోరీ, హాలాకు,
కిస్మత్కే ఖేల్, న్యూఢిల్లీ, పట రాణి, రాజార్, బేగునాహ్,
కట్పల్లి, బాఘీ సిపాహీ, యహూది, అనాడీ, ఛోటీ బహెన్,
కన్హయ్యా, లవ్ మేరేజ్, మై నషే మే హూ, షరారత్,
ఉడాలా, కాలేజ్ గర్ల్స్, దిల్ అప్పా ప్రీత్వరాయీ, ఏకే పూల్
చార్కాంటే, జిన్ దేశమే గంగా బత్తీ హై, గబన్,
సింగపూర్, 1961-1971 దశకంలో ఆస్కాపంచీ,
బాయ్
ఫ్రెండ్, జబ్బార్ కిసీసే హెూతాహై, జంగ్లీ, ససురాల్,
అవిక్, ఆప్షనరీ, హరియాలీ ఔర్ రాస్తా, ప్రొఫెసర్, రంగోలి,
దిల్ ఏక్ మందిర్, హమ్హీ, ఆయీ మిలన్ కీ బేలా,
రాజ్కుమార్, నంగమ్, సాంఝ బెర్ సవేరా, ఆర్దూ,
గుమ్నామ్, జాన్వర్, ఆమ్రపాలి, లవ్ ఇన్ టోక్యో, సూరజ్,
తీస్రీకసమ్, రాత్ ఔర్ దిన్, బ్రహ్మచారి, మేరే హుజూర్,
యకీస్, మేరానామ్ జోకర్ వంటి చిత్రాలకు శంకర్ -
-
జైకిషన్లు అందించిన సంగీతాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ
మర్చిపోలేరు.
హిందీ సినీ సంగీతంలో శంకర్-జైకిషన్లు ఎన్నో ప్రయోగాలు
మరెన్నో అద్భుతాలు చేశారు.
శంకర్ జైకిషన్ లు ఆ కాలంలో ఎక్కువ శాతం
పాటలన్నీ శాస్త్రీయ సంగీతంలో చేసినవే. ఆ సమయంలో
'ఐర్సాల్' పాటలతో మొత్తం భారతీయులనే వారు
సమ్మోహితం చేశారు. శంకర్-జైకిషన్లు ఎన్ని ప్రయోగాలు
చేశారో చెప్పడం అసాధ్యం.
పంకజ్ మల్లిక్ తప్ప ఆర్మిస్ట్రేషన్ కి అంత ప్రాధాన్య
మివ్వని ఆ కాలంలో భారీ సంఖ్యలో అర్నెస్ట్రాతో పాటలు
చేయడంలో వారు విజయం సాధించారు. నృత్య గీతాలకు,
క్లాసిక్ గీతాలను ట్యూన్స్ చేయడంలో శంకర్ది అందెవేసిన
చేయి. వీరి చిత్రాల్లో దాదాపు ప్రతి సినిమాలో టైటిల్ సాంగ్
చేసింది మన శంకరీ, శైలేంద్ర పాటలకు ఎక్కువ మ్యూజిక్
చేసింది కూడా శంకరే అని చాలా మందికి తెలుసు.
ఈ జంట 'చోరి చోరి' (1956), 'అనారీ' (1959),
స్నాత్ (1960), 'ప్రొఫెసర్ (1962),
'సూరజ్' (1966), 'బ్రహ్మచారి' (1968), 'పెహచాన్'
(1970), 'మేరానామ్ జోకర్ (1971), 'బేయిమాన్'
(1972), చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులు పొందారు. వీరి
సంగీతంలో పాడిన లత 'చోరిచోరి' చిత్రానికి, రవి
'నేనురాల్', 'సూరజ్' చిత్రాలకు, ఆషా భోంస్లే 'షికార్',
'నైనా' చిత్రాలకు గాను ఉత్తమ గాయనీ గాయకులుగా
అవార్డులు అందుకున్నారు.
శంకర్, జైకిషన్లు పాశ్చాత్య బాణీలు అనుకరిస్తారనే
అపవాదు ఒకటి ఉండింది. కానీ, వారి బాణీలుంటేనే
డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనే కాలం అది. అట్లాంటి
సమయంలో 'బసంత్ బహార్' వచ్చింది. ఈ చిత్రానికి
ముందుగా అనిల్ బిస్వాస్ ను ఎంపిక చేశారు భరత్ భూషణ్.
కానీ, డిస్ట్రిబ్యూటర్లు శంకర్ డైలే కావాలని తేల్చేశారు.
అయిష్టంగానే వీరిని ఎంపిక చేశారాయన. కానీ, మన శంకర్
జైలు దీన్నొక మహత్తర అవకాశంగా, సవాల్గా తీసుకుని
అద్భుతమైన పాటలు కూర్చారు.
శంకర్ - జైకిషన్లకు అత్యంత ప్రీతిపాత్రమైన రాగం
భైరవి. నిజానికి అప్పటికే నౌషాద్, అనిల్ బిస్వాల్ భైరవి
రాగాన్ని ఆధారం చేసుకొని అనేక పాటలకు స్వరకల్పన
చతురుడు తెలంగాణ (437 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
1405ufov1idgsruutubirbxku2m2q56
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/459
104
212164
553073
2026-04-15T06:52:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేశారు. అయితే అదే భైరవిని శంకర్ - జైకిషన్లు తమ సంగీతానికి ప్రాతిపదిక రాగంగా పెట్టుకొని పాటలను రూపొందంచారు. సునో చోటీసి గుడియాకి లంబి కహానీ (సీమా), బర్సాత్మే హమ్సే మిలే తుమ్ (...'
553073
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చేశారు. అయితే అదే భైరవిని శంకర్ - జైకిషన్లు తమ
సంగీతానికి ప్రాతిపదిక రాగంగా పెట్టుకొని పాటలను
రూపొందంచారు. సునో చోటీసి గుడియాకి లంబి కహానీ
(సీమా), బర్సాత్మే హమ్సే మిలే తుమ్ (బర్సాత్), కిసీసె
అప్పా బనాకె ముజు (పతిత), మైపియా తేరీ (బసంత్
బహార్), మెరానామ్ రాజు (జిన్ దేశ్మ గంగా బెహతీ
హై), బోల్ రాధాబోల్ (సంగమ్) ఇంకా ఎన్నో సుమధుర
స్వరకల్పనలు శంకర్ - జైకిషన్లు సృష్టించారు.
రాజపూర్ తరువాత ఆయ సోదరుడు షమ్మీకపూర్
చిత్రాలకు సంగీతం చేయడంలో కూడా శంకర్ - జైకిషన్లు
బాగా పాపులర్ అయ్యారు. అయితే, ఈ ఇద్దరి స్నేహం
కొందరికి కన్ను కుట్టి ఉంటుంది. ఎలా జరిగిందో ఏమో
కానీ, 'ఎవరు, ఏ పాట చేశారనేది బయటికి చెప్పకూడదన్న'
ఒప్పందం కాస్తా అనుకోకుండా ఉల్లంఘించబడింది.
'సంగం' (1964) లోని 'ఏ మేరా ప్రేమ్ పత్రే పడ్ కర్'
పాటకు తానే ట్యూన్ చేశానని తన భార్య పల్లవికి రాసిన
ప్రేమ లేఖలో, హస్రత్ చేత పాట రాయించానని 'ఫిలిం
ఫేర్ ' లో జైకిషన్ రాశాడు. దాంతో శంకర్ జైకిషన్ల
నడుమ విభేదాలు పొడసూపాయి. ఒప్పంద ఉల్లంఘన
జరిగిందని శంకర్ అభ్యంతర పెట్టాడు.
'దిల్ ఏక్ మందిర్ తరువాత వారిద్దరూ విడిపోయారు.
ఆ తరువాతి చిత్రాలకు విడిగానే సంగీతం సమకూర్చు
కున్నారు. అయితే, ఎవరికి వారు రెండు పేర్లను వాడు
కున్నారు. కొన్నాళ్లు అలా శంకర్, జైకిషన్లుగా కొనసాగారు.
వారు విడిపోయాక రాజ్కపూర్ కోరిక మేరకు 'మేరా నామ్
'జోకర్' సినిమాకు మాత్రం కలిసి పని చేశారు. 1948
నుండి 1971 వరకు శంకర్ - జైకిషన్లు చేసిన సినిమాల
సంఖ్య సుమారు 180. ఒక్కో సినిమాకు అయిదు లక్షలు
హరితోషికం తీసుకున్న రికార్డు వీరిది.
జై కిషన్ 1971 సెప్టెంబర్ 12న తనువు చాలించారు.
అప్పుడు సంగీతం అంతా జైకిషన్ చేశారని, శంకర్ దేనికీ
పనికి రాడని కొందరు నిందలు మోపారు. దీంతో
అవకాశాలు సన్నగిల్లాయి. రెండేళ్లు ఒక్క సినిమా కూడా
లేకుండా గడిపిన శంకర్ మళ్లీ 'సన్యాసి' చిత్రంతో పెద్ద
హిట్ కొట్టారు. ఆ తరువాత స్వతంత్రంగా 30 సినిమాలకు
సంగీతాన్ని సమకూర్చి తన సత్తాను చాటాడు.
శంకర్ వెండితెరపై తెలంగాణ బతుకమ్మ పాటకు పట్టం
కట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
శంకర్ చొరవపట్లే అప్పట్లో 'ఫిలింఫేర్' అవార్డుల్లో
గాయనీ, గాయకులకు చోటు కల్పించారు. ఫలితంగా లతాకు
వరుసగా 'ఉత్తమగాయని' అవార్డులొచ్చాయి. కాని తరువాతి
రోజుల్లో లతాతో శంకర్కు అభిప్రాయభేదాలు వచ్చాయి.
గాయనీ శారదను ఎక్కువగా ప్రోత్సహించడం ఇందుకు
కారణంగా చెప్తారు.
శంకర్ వెండితెరపై తెలంగాణ బతుకమ్మ పాటకు
పట్టం కట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, శంకర్
హైదరాబాదీ కావడం వల్ల ఆయన్ను హైదరాబాద్ తెలంగాణ
సంస్కృతి నీడలు వీడ లేదనడానికి తన కంపోజింగ్సే
సాక్ష్యాలుగా నిలిచాయి. 'శ్రీ 420'లో ముఖేష్తో పాడించిన
'రామయ్యా వస్తావయ్యా! రామయ్యా వస్తావయ్యా!' పాట
నేటికీ ఎవర్గ్రీన్ సాంగ్. అట్లాగే 1964లో విడుదలైన
'రాజ్కుమార్' చిత్రంలోని 'నాచ్ మన్ బతుకమ్మ పాట,
జెమీనీ వాళ్ళు 1969లో తీసిన 'షత్రంజ్ ' లో బతుకమ్మ
బతుకమ్మ బతుకమ్మ - ఎక్కడ పోతావ్, ఇక్కడ ఇక్కడ
రా!!” పాటను మహమూద్, రఫీ, శారదలచే పాడించా
రాయన.
ఆ రోజుల్లో ఈ ఒక్క పాట కోసమే చిత్రం హిట్
అయ్యింది. అదీ మన శంకర్ గొప్పతనమే. ఆ తరువాత
1971లో తెలుగులో వచ్చిన 'జీవిత చక్రం' సినిమాకి శంకర్
సంగీత దర్శకత్వం వహించారు. అందులో 'బతుకమ్మ
బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో...' పాట
తెలంగాణ సంస్కృతిని ఆయన మరచిపోలేదనడానికి
నిదర్శనం. అలా శంకర్ ఆనాడే మన బతుకమ్మకు పట్టం
శంకర్ సినిమా రంగానికి అందించిన సేవలకు
గుర్తింపుగా 1979లో 'పద్దుశ్రీ' పురస్కారం లభించింది.
ముంబాయిలో ఒక వీధికి శంకర్ డైరెషన్ పేరు పెట్టారు.
ఇండస్ట్రీలో కొచ్చి తొలిరోజుల్లోనే యోధాను యోధుల
సంగీతంతో పోటీపడి జయించిన ఆయన ఒక సందర్భంలో
డెబ్భైల్లో వచ్చిన ఆర్డీ బర్మన్, లక్ష్మీ-ప్యారే, కళ్యాణీ
ఆనందీల రణగొణుల హెూరులో ఇమడలేని తానుగానే
డు తెలంగాణ 438 తేజోమూర్తులు ఉయ<noinclude><references/></noinclude>
51dy2fkb3uceltw6mmrbt96au9x5l8m
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/460
104
212165
553074
2026-04-15T06:52:51Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సినిమాలు తగ్గించుకున్నట్టు చెప్పారు. బాలీవుడ్ వైభవానికి ఎంతో కృషి సల్పిన శంకర్ 1987 ఏప్రిల్ 26న కాలం చేసి తన స్వరయాత్రను ముగించాడు. హైదరాబాద్ నుండి హిందీ చిత్రసీమకు జైరాజ్ అ...'
553074
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సినిమాలు తగ్గించుకున్నట్టు చెప్పారు. బాలీవుడ్ వైభవానికి
ఎంతో కృషి సల్పిన శంకర్ 1987 ఏప్రిల్ 26న కాలం
చేసి తన స్వరయాత్రను ముగించాడు. హైదరాబాద్ నుండి
హిందీ చిత్రసీమకు జైరాజ్ అజిత్, చంద్రశేఖర్ల తరువాత
వెళ్లిన శంకర్ అక్కడ చేసిన స్వరయాత్ర దేశదేశాల్లో
మార్మోగింది. రష్యా, జపాన్ వంటి దేశాల్లో ఆవారా, శ్రీ420
సినిమా పాటలు మార్మోగినవి. రాజకపూర్ సినీ విజయాలలో
శంకర్ - జైల పాత్ర ఎంతైనా ఉంది. వారు బాణీలు
సమకూర్చిన ఎన్నో వందల పాటలు స్వర ప్రపంచాన్నింకా
ఏలుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలంతా గర్వించదగిన
సినీ సంగీత దర్శకుడు శంకర్ సింగ్ రఘువంశి.
ఏ తెలంగాణ (439 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude>
t8zazqsogziskp9v9l4tz3ruvsmyn81
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/461
104
212166
553075
2026-04-15T06:53:09Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '126 - శేఖర్ చేతన కె. పే జీల కొద్ది పూర్తిగా చదివితేగానీ అవగాహనకాని అంశాన్ని, ఒక కార్టూన్ చూడగానే తెలుసు కోవచ్చు. భాషకందని భావాన్ని, మాటలకందని సొగసుల్ని, కఠోర సత్యాన్ని, నగ్న నై...'
553075
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>126
-
శేఖర్
చేతన కె.
పే జీల కొద్ది పూర్తిగా చదివితేగానీ అవగాహనకాని
అంశాన్ని, ఒక కార్టూన్ చూడగానే తెలుసు
కోవచ్చు. భాషకందని భావాన్ని, మాటలకందని సొగసుల్ని,
కఠోర సత్యాన్ని, నగ్న నైజాన్ని, వెలుగునీడల సమ్మిశ్రంగా....
సమాజహితం కోసం అందించేదే కార్టూన్.
మాటల ద్వారాకాక కార్టూన్. ద్వారా ప్రయోజన
ద్వారాలు తెరువగల కళ ఒక కార్టూనిస్టుది మాత్రమే.
అటువంటి కార్టూన్ని ప్రేమించిన గొప్ప వ్యక్తి.
కీ॥శే॥ కంబాలపల్లి చంద్రశేఖర్
నల్లగొండ నేలలో పుట్టిన ఆయన, తెలుగు కార్టూన్కు
అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి, అమెరికా ప్రభుత్వ ఆహ్వానంతో
ఆ దేశంలోని పలు రాష్ట్రాల్లో అధ్యయన పర్యటన జరిపిన
తొలి తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. కార్టూన్ కళా రంగంలో
ఏకలవ్యుడై మార్గదర్శకులను ఎంచుకొని జనం పక్షాన
కుంచె పట్టి తనను తాను తీర్చిదిద్దుకుని, ప్రజా ఉద్యమాల్లో
తనవంతు సేవలు అందించినవారు శేఖర్.
కంభాలపల్లి వెంకయ్య, మల్లమ్మల రెండో సంతానమైన
శేఖర్ చిన్నప్పటి నుండి ఇక్కట్ల మధ్యనే పెరిగాడు.
తల్లిదండ్రులు రైతు కూలీలు. పిల్లల్ని ఇంటిదగ్గరే వదిలేసి
వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్ళాల్సిన దైన్యం
రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి. తోటి పిల్లలతో ఆడుకుంటూ
తనకంటే చిన్న పిల్లలు 6 గురి ఆలనా పాలనా చూసుకోవల్సి
వచ్చేది. ఎంత పేదరికాన్ని చవిచూసినా ప్రతిభను పెంచు
కోవటంలో వెనుకడుగు వేయలేదు శేఖర్. చిన్నప్పటి నుండి
లైబ్రేరిలకు వెళుతూ - ఊర్లలోకి వచ్చే జానపద కళాకారుల
జీవన విధానాలు గమనిస్తూ యువతతో మమేకమవుతూ
ఉండేవారు. 4వ తరగతి వరకు సూర్యపేటలోని అడవి
దేవులపల్లిలో చదువుకున్న శేఖర్ ఆ తర్వాత అన్నగారైన
చంద్రయ్యగారి దగ్గరకు వచ్చేశారు. ఆర్థికంగా పాఠశాల
బాధ్యతలు స్వీకరించలేని తల్లిదండ్రుల అన్నగారి దగ్గరకు
పంపిస్తేనన్నా నాలుగు రీతుల ప్రపంచజ్ఞానం తెలుస్తుందని
ఆశపడ్డారు. మొదటి మలుపు నల్గొండలో పడితే మరో
మేలిమలుపు బి.ఏ. చదవటానికి ఉస్మానియా యూనివర్శిటీకి
వచ్చినప్పుడు పడింది.
యూనివర్శిటీ వాతావరణం శేఖర్లో విపరీతమైన
మార్పుల్ని తెచ్చింది. సౌమ్యుడు, నిరాడంబరుడు, నిగర్వి,
స్నేహశీలి అయిన శేఖర్ ఆలోచనలు మరింత పరివ్యాపితమై
ఉద్యమాల వెంట, బడుగుజనాల బాధలవెంట పయనించటం
ఆరంభమయ్యింది. ఆలోచనల పరిధిని అడుగడుగునా
పెంచుకున్న శేఖర్ మిత్రబృందంలో నాయకత్వ లక్షణాలను
పెంచుకున్నారు. సహజంగా కార్టూనిస్టులందరూ
అంతర్మయిలు. కానీ శేఖర్ సవ్యసాచి. ఒక దశలో కార్య
నిర్వాహకుడుగా, కార్యకర్తగా, నాయకుడిగా, స్ఫూర్తి ప్రదాతగా
అనేక పాత్రల్ని ఒకేసారి పోషించేవాడు.
ఇక తెలంగాణ (440 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
o32zzgfqwswj3l4z6t1pkj9jhtz4u4k
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/462
104
212167
553076
2026-04-15T06:53:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చాలామంది ఎన్నెన్నో ఆశయాలున్నాయని చెప్తారు. 'చెప్తారు కోరి చెయ్యరు ఒక్కటి' అంటుంటారు అలాంటి వాళ్ళను చూసినప్పుడు కానీ శేఖర్ ఏది చెప్తాడో అదే చేస్తాడు. తాను నమ్మిన సిద్ధాంత...'
553076
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చాలామంది ఎన్నెన్నో ఆశయాలున్నాయని చెప్తారు.
'చెప్తారు కోరి చెయ్యరు ఒక్కటి' అంటుంటారు అలాంటి
వాళ్ళను చూసినప్పుడు కానీ శేఖర్ ఏది చెప్తాడో అదే చేస్తాడు.
తాను నమ్మిన సిద్ధాంతాన్ని చివరికంటూ నిలబెట్టుకుంటూ
నడిచిన ధీశాలి. అందుకే మనసుకు నచ్చిన అమ్మాయిని
పెళ్ళికి కలుపుతీసే స్థాయి నుండి కంప్యూటర్ ఆపరేట్ చేసే
చేర్చాడు. శేఖర్ అంటే అది. అది కుటుంబమైనా సమాజ
మైనా ఆశతో ఆశయాన్ని బ్రతికించుకుంటాడు. సమాజం
ఆరోగ్యంగా బ్రతకటం కోసం అహర్నిశలు కష్టపడ్తాడు.
ఆయన తన జీవితకాలంలో 46 వేల
కార్టూన్లు
వేసారు. సుమారు పది భాషల్లో ఆయన కార్టూన్లు
వెలువడ్డాయి. మెయిన్, పాకెట్, సండే శీర్షికల కార్టూన్లు,
పోస్టర్లు, చిన్నా చితకా ఉద్యమ పత్రికలకు వేసే కవర్ పేజీ
కార్టూన్లు, రాజకీయ పార్టీల ప్రచారానికి బినామి పేర్లతో
వేసే కార్టూన్లు అన్ని కలిపి వెలిసి అన్ని వేల సంఖ్యకు చేరాయి.
1996లో బెల్జియమ్లో జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్లో
పాల్గొని ఉత్తమ కార్టూనిస్ట్గా అవార్డు అందుకున్నారు.
హిందుస్తాన్ టైమ్ 1998లో నిర్వహించిన పోటీలో పాల్గొని
విజేతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ కార్టూనిస్టు
(2006) గ్రహీతగా, పదునైన చురకలు వేస్తూ పత్రికా
రంగంలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా పాతికి సంవత్సరాలు
పూర్తిచేసుకున్నారు. కార్టూనిస్టు శేఖర్.
1984లో అచ్చయిందని చెప్పేవారు
శేఖర్ గారు. తొలిరోజుల్లో ఆయన 'కంభా' అనే పేరుతో
కార్టూన్లు వేస్తూ ఉండేవారు. 1989 జూన్ 16న ప్రజాశక్తి
దినపత్రికలో ఆయన తొలి పొలిటికల్ కార్టూన్
ప్రచురింపబడింది. ప్రజాశక్తి దినపత్రికలో కార్టూనిస్టుగా
నిలద్రొక్కుకున్న తర్వాత ఆయన ఆలోచనాసరళ, కార్టూన్ల
స్వభావం, పూర్తిగా మారిపోయాయి అని అనేవారు.
అప్పటివరకు 'రంభా' పేరుతో 'అప్పడాల కర్ర' టైపు కార్టూన్లు
వేసిన ఆయన, మారిన తన ఆలోచన దృక్పథంతో 'శేఖర్'
పేరుతో రాజకీయ కార్టూన్లు వేయటం మొదలుపెట్టారు.
ప్రతి అంశాన్ని పీడితుల కోణంలో సమాజంలోని భిన్న
దొంతరల కోణంలో పరిశీలిస్తూ కార్టూన్లు వేయడం
ప్రారంభించారు.
ఎక్కువగా ఆర్.కె. లక్ష్మణ్ని గురుతుల్యుడిగా భావించే
వారు. రాజకీయాలను ఆయన విశ్లేషించే తీరును ఎక్కువగా
స్టడీ చేసేవారు. అవసరాలకొద్ది ఇతర సీనియర్ కార్టూనిస్టుల
శైలిని అనుకరిస్తూ కొంతకాలానికి తనదైన "శైలిని" క్రియేట్
చేసుకున్నానని చెప్తుండేవారు.
ఎమ్.ఎ., ఎల్.ఎల్.బి. చేసినా కూడా, కేవలం 1200
రూపాయల జీతానికి ఏరి కోరి కార్టూనిస్ట్ ఉద్యోగం
చేసేవారని వారి శ్రీమతి చంద్రకళ చెప్తుంటే, ఆశ్చర్య
పోయేవాళ్ళం. అది శేఖర్ గారికి కార్టూన్ రంగంమీద గల
ప్రేమ, కమిట్మెంట్ అని తరువాత అర్థమైంది. కార్టూన్
రంగం కోసం రెండూ ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న
ఘనత శేఖర్ గారిది.
దినపత్రికల్లో వృత్తిపరంగా వేసే కార్టూన్లకంటే ప్రవృత్తి
వరంగా, ఇతర ఆర్ధిక అవసరాల కోసం మారుపేర్లతో కనీసం
సంతకం చేయడం లేకుండా వేసిన కార్టూన్లు కోకొల్లలు.
ఇక సిండికేట్ ద్వారా ఇతర భాషల్లో వచ్చిన కార్టూన్లు తెలుగు
పాఠకులకు తెలియనే తెలియదు. అలా ఫ్రీలాన్సర్గా వివిధ
సంస్థలకు పనిచేస్తూ, “చేతన పబ్లికేషన్స్" పేరిట పుస్తక
ప్రచురణలు కూడా చేసారు. ఆ తరువాత ఆయన ప్రజాశక్తి,
ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రజ్యోతుల్లో పొలిటికల్
కార్టూన్ ఎడిటర్ గా పని చేసారు.
వృత్తిలో బిజీగా ఉన్నా, నిరక్షరాస్యురాలైన తన భార్య
చంద్రకళను చదివించుకున్నాడు. తనచేత 'కలుపు తీసిన....
కంప్యూటర్ చేసిన అనే పుస్తకం రాయించారు. అందుకే
“కొమ్మ చెక్కితే బొమ్మరో - కొలిసి మొక్కితె అమ్మరో” అన్నట్టు
నన్ను తయారుచేసారు అని శేఖర్ గారి గురించి ఆ పుస్తకంలో
చెప్పింది.
కేవలం రోజువారి రాజకీయ కార్టూన్లే కాకుండా,
అగ్రదేశాల పెత్తనం మీద, ప్రపంచీకరణం మీద, మతో
న్మాదం, అధిక ధరలు, అమెరికా డాలర్ రుబాబులపై ఇతర
కార్టూనిస్టులు ఎవరూ ముట్టని అంశాలపై లెక్కకు మిక్కిలి
కార్టూన్లు గీశారాయన. మారుతున్న కాలానికి అనుగుణంగా
'శేఖర్ టూన్స్' సిండికేట్ను దిగ్విజయంగా నడిపి తెలుగు
సత్తా చాటిన అత్యుత్తమ కార్టూనిస్ట్ శేఖర్.
మమమము తెలంగాణ 441
bash తెలంగాణ ( 441 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude>
254zgjz12ulffzvj5r9hf54k6apld9w
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/463
104
212168
553077
2026-04-15T06:53:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కార్టూన్ ఐడియాల మీద ఆయనకు వివరీతమైన కమాండ్ ఉంది. నిద్రలో లేపి అడిగినా దేనికి ఎలా వేయాలో చెప్పగలిగే నేర్పు అతని స్వంతం. కొందరు బొమ్మ మీద శ్రద్ధ పెడితే, ఆయన ఐడియాల మీద శ్రద్ధ...'
553077
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కార్టూన్ ఐడియాల మీద ఆయనకు వివరీతమైన
కమాండ్ ఉంది. నిద్రలో లేపి అడిగినా దేనికి ఎలా వేయాలో
చెప్పగలిగే నేర్పు అతని స్వంతం. కొందరు బొమ్మ మీద
శ్రద్ధ పెడితే, ఆయన ఐడియాల మీద శ్రద్ధపెట్టి 'రపీ' మని
పేల్చేవారు. ఇంట్లో ఎటు చూసినా నోట్సులు, ఆ నోట్సుల్లో
ఐడియాలు. ఆయన పూర్తిగా కార్టూన్ రూపంలోకి మలచని
ఐడియాలు అనేకానేకం అలానే ఉన్నాయి. అంత
శ్రమపడ్డానికి చాలా ఓపిక కావాలి. ఎంతో ప్రేమ వాటిమీద
ఉండాలి.
కార్టూనిస్టుగా శేఖర్ గారు గీసిన వేలాది కార్టూన్లు
దేశంలోని, విదేశాల్లోని అణేక భాషల్లో వచ్చాయి. ఒక
ప్రాంతీయ భాషా పత్రికలో కార్టూనిస్టుకి ఇంతగా
అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం అసాధారణ, వేలాది
కార్టూన్లు వేసిన కమ్యూనిస్టుగా తాను గోడలపై రాసిన రాతలే
తనకు స్ఫూర్తి అంటారు. “ఒక ఆర్ట్ ఫామ్గా కార్టూన్ చాలా
గొప్పది. కార్టూన్ రాత్రికి రాత్రి అద్భుతాలు సృష్టించక
పోవచ్చు. కానీ ఒక ఆలోచన సృష్టించే కార్జున్ దాని పని
అది చేసుకుపోతుంది" అంటారాయన.
'ప్రపంచంలో ఏ మూల పీడిత ప్రజలున్నా, చూసి
ఒక చిత్రకారుడిగా మనం స్పందిస్తాం. అలాంటిది మనం
పుట్టిన గడ్డమీదే సమస్యలు ఉన్నప్పుడు స్పందించకపోతే
ఎలా' అంటూ 'గిదీ తెలంగాణా' పుస్తకం వెలువరించారు.
తెలుగు కార్టూనిస్టులకి ఎవరికి రాని అమెరిగా ఆహ్వానం
తనకి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న అవకతవకలు అన్నీ
చమత్కారంగా చూపే కార్టూన్లతో 'కలర్స్ ఆఫ్ ఇండియా'
అనే పుస్తకం వేశారు.
వేర్వేరు అంశాలమీద అప్పటికే పారాహుషార్,
శేఖర్జూన్, బ్యాంక్ బాబు వంటి అనేక పుస్తకాలు ప్రచురించి
నప్పటికి, అచ్చయిన తన కార్టూన్లలో ఇప్పటికీ వాడిపోని
కార్టూన్లలో కసినం ఏడెనిమిది కార్డును సంపుటాలు తేవచ్చు.
అంటారు ఆయన.
పాతికేళ్ళ శేఖర్ కార్టూన్ ప్రయాణంలో అనేక అటు
పోట్లు ఉన్నాయి. పాత్రికేయ వృత్తిలో ఉండే కులం కుళ్ళు
పల్ల అనేక ఒత్తిళ్ళను ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు మానసిక
వ్యధకు గురయ్యేవారు. అయినా అధైర్యపడకుండా వాటిని
అధిగమిస్తూ అన్నేళ్ళు కార్టూనిస్టువ నిలదొక్కుకోవడం అంటే
సామాన్యమైన విషయంకాదు. క్యాన్సర్తో బాధపడిన ఆయన,
ఆరోగ్యం సహకరించకపోయినా నా చేయి కదులుతున్నది.
చాలు అని సంబరపడుతూ కార్టూన్లు వేయడం ఆయనకే
సాధ్యం.
ఈ
తన శరీరంలోని క్యాన్సర్లో ఆయనకు ఈ వ్యవస్థను
పట్టిపీడిస్తున్న కుల క్యాన్సర్ కనిపించింది. తాను వ్యక్తిగా
తనదైన ఈ క్యాన్సర్ మీద కాక, కుల క్యాన్సర్పై యుద్ధం
చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదొక సాహసం. శేఖర్
క్యాన్సర్ వ్యాధిపై పోరాడుతూనే సమాజంలో నెలకొన్న
కులవివక్షతను ఎండగడుతూ 'క్యాన్సర్' పేరుతో కార్టూన్ల
పుస్తకాన్ని తెచ్చారు.
చివరి రోజుల్లో ఒకవైపు అనారోగ్యం, మరోవైపు
కార్టూన్లతో రాజకీయ యుద్ధం చేస్తున్న శేఖర్బాబు, ఆయన
రజతోత్సవ కార్యక్రమంలో ఆప్యాయంగా అక్కున చేర్చుకుని
ఘనంగా సత్కరించుకున్నారు. అతని మిత్రబృందం.
దీర్ఘకాలంగా పోరాడుతున్న మృత్యువుకి అతను
తలొగ్గక తప్పలేదు. మరణం అనివార్యం. కానీ మరణాన్ని
కూడా సవాలు చేస్తూ చివరి వరకూ కార్టూన్ కళకి
అంకితమైన ఆయన్ను తలచుకుంటే, కార్ట్యూన్ల పట్ల ఆయన
తపన, ప్రేమ, అంకితభావం అన్నీ మనకు అవగత
మవుతాయి. దాదాపు రెండేళ్ళు క్యాన్సర్తో బాధపడిన
ఆయన, సంకల్ప బలంతో దాన్ని జయించే ప్రయత్నం చేసి
మే 19, 2014న కన్ను మూసారు. మే 20, కార్టూనిస్టుల
దినోత్సవానికి ఒకరోజు ముందు కన్ను మూసారు.
అతని వ్యక్తిత్వంలో ఎదురీదేతత్వం, సాధించే పట్టుదల
మొదటి నుండిబట్టి, కష్టకాలంలో అతనలా జీవించడం
సాధ్యపడింది. నేడు ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా
ఆయన కార్టూన్లు మాత్రం సజీవంగా ఉంటాయి.
అంటుంటే తెలంగాణ 442 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
pa8cza8jf775kbwreqf7gbnmspye21p
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/464
104
212169
553078
2026-04-15T06:53:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '127 దా దాపు వంద సంవత్సరాలు నిరంతరంగా కొనసాగి అంతిమ విజయంతో లక్ష్యాన్ని సాధించిన భారత జాతీయ, స్వాతంత్య్ర, ఉద్యమాలలో నిరంకుశ పాలకుల నిర్బంధాలకు, అమానుష చర్యలకు, అక్రమ ఆంక్షలక...'
553078
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>127
దా
దాపు వంద సంవత్సరాలు నిరంతరంగా కొనసాగి
అంతిమ విజయంతో లక్ష్యాన్ని సాధించిన భారత
జాతీయ, స్వాతంత్య్ర, ఉద్యమాలలో నిరంకుశ పాలకుల
నిర్బంధాలకు, అమానుష చర్యలకు, అక్రమ ఆంక్షలకు గురి
అయి చెఱసాలలో కఠిన శిక్షలు అనుభవించిన, ఉరికంబా
లెక్కిన, శరీరాలలో బుల్లెట్లు నిండిన, బాకుల పోట్లతో
శరీరాలు ఛిద్రమయి రక్తం చిందిన, చివరికి అమూల్య
ప్రాణాలను కోల్పోయిన దేశభక్తులు, స్వాతంత్ర్య సమర
యోధులు అనేకులు, అసంఖ్యాకులు, దేశభక్తి, మాతృభారతి
సేవానురక్తి జలపాతాలయి పొంగివచ్చి కొందరు గళమెత్తగా,
మరి కొందరు కలాలను ఎత్తినారు.
దేశభక్తులందరికి, స్వాతంత్య్ర యోధులందరికి, సకల
భారత జనకోటికి స్ఫూర్తినిచ్చింది. ఆలంబనమయినది.
ముందుకు నడిపించింది కఠోర వజ్ర సంకల్పం - స్వాతంత్య్ర
సాధన ప్రబల ఆకాంక్ష. స్వాతంత్య్ర సాధన అగ్నిహోత్రంలో
ఉతుతాభక్తిగ ఎవరికి అందిన సమిదలనువారు జ్వలింప
జేసారు. భారత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాల చరిత్రలో
భారతీయ పత్రికలు, పాత్రికేయులు, పత్రికా రచయితలు,
సంపాదకులు అత్యంత సాహసవంతంగా నిర్వహించిన పాత్ర
మహోజ్వలమయినది. అదొక ఉజ్వల అధ్యాయం. దేశభక్తి
ఉద్దేశించిన పత్రికల, స్వాతంత్య్ర యోధులయిన పాత్రి
కేయుల, పత్రికా రచయితల, సంపాదకుల గొంతు నొక్క
డానికి, వారి మేధస్సులను బంధించడానికి, వారి కలాలకు
షోయబుల్లాఖాన్
దేవులపల్లి ప్రభాకరరావు
సంకెళ్లు వేయడానికి బ్రిటిష్ పాలకులు పలు దుష్టచట్టాలను
ప్రవేశపెట్టి పత్రికా స్వేచ్చా స్వాతంత్య్రాలకు భంగం కల్గిం
చారు.
అయినప్పటికీ, అన్ని అవరోధాలను ఎదుర్కొంటూ
స్వాతంత్య్ర ప్రియులు పత్రికా ప్రచురణను కొనసాగించారు.
తమ పత్రికల ద్వారా స్వాతంత్ర్యోద్యమాన్ని విజృంభింప
జేయడానికి అపార కృషి జరిపారు. గాంధీజీ మొదట
దక్షిణాఫ్రికాలో, తరువాత స్వదేశంలో తన ఆశయాలకు
సిద్ధాంతాలకు కాహళిగా హరిజన్, నవజీవన్ పత్రికలను
స్వయంగా తన సంపాదకత్వంలోనే ప్రచురించారు. గాంధీజీ
కంటే ముందు గత శతాబ్ది ప్రారంభంలో భారత జాతీయ,
స్వాతంత్ర్య ఉద్యమాలలో ప్రముఖ స్థానం ఆక్రమించిన
లోకమాన్య బాలగంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు
అని గర్జించి యువతరాన్ని ఉత్తేజపరిచారు.
ఆయన సంపాదకత్వంలో, మార్గదర్శకత్వంలో
ప్రచురిత మయిన రెండు పత్రికలు కేసరి (మరాఠీలో)
మరాఠా (ఇంగ్లీషు). మహామేధావి తిలక్ ఈ రెండు
పత్రికలలో రాసిన వ్యాసాలు వాటిలో, ఆయన ఇతర రచనలు
ఆంగ్లేయ పాలకులకు ఆగ్రహం కల్గించాయి. ఆయనకు
వ్యతిరేకంగా 1898లో ఒక కేసుపెట్టి 18 మాసాల కఠిన
కారాగార శిక్ష విధించారు. 1908లో మరో కేసు పెట్టి 6
సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించి మాండలేల
తెలంగాణ (443) తేజోమూర్తులు ఉండటం<noinclude><references/></noinclude>
20ruq552d0lbsuvg1ledpzzuviv5vss
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/465
104
212170
553079
2026-04-15T06:54:09Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '(బర్మాల) నిర్బంధించారు. మండలే జైలులో తిలక్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. అయినప్పటికి ఆ జైలులోనే ఆ మహా భాష్యకారుడు గీతారహస్య వ్యాఖ్యానం రచించారు. బ్రిటిష్ ఇండియాతో పోల్చినప్...'
553079
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>(బర్మాల) నిర్బంధించారు. మండలే జైలులో తిలక్ ఆరోగ్యం
బాగా దెబ్బతిన్నది. అయినప్పటికి ఆ జైలులోనే ఆ మహా
భాష్యకారుడు గీతారహస్య వ్యాఖ్యానం రచించారు. బ్రిటిష్
ఇండియాతో పోల్చినప్పుడు హైదరాబాద్ తదితర సంస్థానా
లలో రాచరిక నిరంకుశత్వం ప్రజల హక్కులను జీవితాలను
విపరీతంగా అణగదొక్కింది. నాటి హైదరాబాద్ సంస్థానంలో
ఒకవంక నిజామ్ నిరంకుశ పాలన, మరోవంక నిజామ్
ప్రోత్సాహంతో మతోన్మాద పైశాచిక మూకల రాక్షసత్వం,
అమానుష కృత్యాలు భయంకర పరిస్థితిని సృష్టించాయి.
కవులు, రచయితలు, సంపాదకులు, పత్రికా
రచయితలు, మేధావులు, దేశభక్తితో, మానవతా దృక్పదంతో,
ఆవేశంతో ఆవేదన పొందిన భయానకమైన రోజులవి.
నిజాంరాజు నిరంకుశ పాలనల మతోన్మాదులు చెలరేగి
అరాచకం, అగ్నిగుండం సృష్టించిన భయంకరమయిన
రోజులవి. మారణ హోమం మండిన ఆ రోజుల్లో నిజాం
నిరంకుశత్వాన్ని, నిజాం నీడలో వడగలిప్పి బుసకొట్టిన
మతోన్మాదాన్ని అమానుషత్వంతో చెలరేగిన దుండగులను
నరరూప రాక్షసులను ధైర్యసాహసాలతో ప్రతిఘటించి,
వనవత్వ విలువల పరిరక్షణ నిమిత్తం కంకణం కట్టిన
నిరుపమాన యోధుడు.
పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు పోయబుల్లాఖాన్,
పూర్వపు హైదరాబాద్ రాష్ట్రవిముక్తి ఉద్యమ, స్వాతంత్య్ర
సమర చరిత్రలో ప్రముఖుడు షోయిబ్ పాత్ర రక్తాక్షరాలతో
లిఖితమవుతుంది. ఆయన అసమానత్యాగం ఉత్తేజ పరచే
ఒక ఉజ్వల అధ్యాయం. ఆ అమరవీరుని గాధ ఆదర్శ
ప్రాయం. చిరస్మరణీయం, హిందూ - ముస్లిం సోదరత్వానికి
సజీవ ప్రతీక షోయబుల్లాఖాన్,
షోయబ్ పుట్టింది వరంగల్లు జిల్లా మానుకోటలో,
ఆయన తండ్రి హబీబుల్లాఖాన్ నిజాం సర్కారులో ఒక పోలీసు
అధికారి. షోయబ్ జననానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది.
దాదాపు వంద సంవత్సరాల కిందట అప్పుడే భారత
రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఒక వినూత్న రీతి
స్వాతంత్ర్య సమరానికి శంఖారావం విన్పించిన గాంధీ
మహాత్ముడు దేశమంతటా పర్యటిస్తూ 1920 అక్టోబర్ 12న
తేదీన విజయవాడ నుంచి వార్ల రైలులో వెళ్ళుతూ మానుకోట
రైలు స్టేషనులో కొద్ది నిమిషాలు ఆగి అక్కడకి చేరిన
అసంఖ్యాక ప్రజలకు దర్శనం ఇచ్చారు. ఆ రోజు పోలీసు
అధికారి హబీబుల్లాఖాన్ మానుకోట స్టేషనులో శాంతి
భద్రతల బాధ్యత, విధి నిర్వర్తించడానికి నియుక్తులయ్యారు.
గాంధీ మహాత్ముడి నిరాడంబరత్వం, ఆయన ముఖం
లోని తేజస్సు హబీబుల్లాఖాన్ ను బాగా ఆకర్షించాయి.
స్టేషనులో విధి నిర్వహణ తరువాత ఇంటికి వెళ్ళిన
హబీబుల్లాఖాను కొడుకు పుట్టిన శుభవార్త తెలిసింది. తన
పసిబిడ్డ ముఖంలో హబీబుల్లాఖాన్ కు గాంధీ మహాత్ముడు
కన్పించాడు. ఆ బిడ్డకు షోయబుల్లాఖాన్ అని నామకరణం
చేసారు.
ముద్దుగా అందరు ఆ బిడ్డను 'గాంధీ షోయబ్' అని
పిలిచేవారు. షోయబ్లో చిన్నప్పటి నుంచే చురుకుతనం
ఎక్కువ. బాల్యంలోనే షోయబ్ రచనా పాటవం వికసించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన పట్టభద్రుడు.
పట్టభద్రత అనంతరం పత్రికా రచయితగా ఆయన జీవన
రంగంలో ప్రవేశించాడు. షోయబ్ పత్రికా రచన మొదట
తేజ్ వారపత్రికలో ప్రారంభమయింది. సామాజిక
ప్రయోజనంతో, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా,
మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ మతోన్మాదాన్ని ఖండిస్తూ తన
లేఖినిని శక్తివంతమయిన ఒక అస్త్రంగా ప్రయోగించడానికి
షోయబ్ కంకణం ధరించాడు.
నిజాం నిరంకుశ పాలనలో జరుగుతున్న అన్యాయా
లను, అక్రమాలను, అరాచకత్వాలను, తీవ్రంగా విమర్శిస్తూ
షోయబ్ రాసిన వ్యాసాలు తేజ్ పత్రికలో ప్రచురిత
"మయినాయి. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అధిపతి
కాసింరజ్వీ దుష్ట విధానాలను, మతతత్వాన్ని, అక్రమ
చర్యలను విమర్శించినందుకు నిజాం ప్రభుత్వం తేజ్ పత్రికను
నిషేదించింది.
ఆ రోజుల్లో ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకులు
మందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న
'రయ్యత్' ఉర్దూ పత్రికలో షోయబ్ రచయితిగా ప్రవేశించాడు.
రయ్యత్ పత్రికలో గూడ షోయబ్ నిర్భయంగా నిజాం
నిరంకుశత్వాన్ని, దమన నీతిని, మతోన్మాదాన్ని ఖండిస్తూ
రాసాడు. నిజాం ప్రభుత్వం రయ్యత్ను సైతం నిషేధించింది.
షోయబ్ స్వయంగా, తన సంపాదకత్వంలో ఇమ్రోజ్
చిరు తెలంగాణ 444 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
3h1oz30bospi13yk9uef9adzhajurov
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/466
104
212171
553080
2026-04-15T06:54:22Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పత్రికను ప్రారంభించాడు. నిజాం నిరంకుశ పాలనను, మతతత్వాన్ని అధికారుల దమన నీతిని బట్టబయలు చేసి ఖండించే వార్తలకు, వ్యాఖ్యలకు, సునిశితం విమర్శలకు, చురకలకు షోయబ్ తన పత్రికలో అత...'
553080
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పత్రికను ప్రారంభించాడు. నిజాం నిరంకుశ పాలనను,
మతతత్వాన్ని అధికారుల దమన నీతిని బట్టబయలు చేసి
ఖండించే వార్తలకు, వ్యాఖ్యలకు, సునిశితం విమర్శలకు,
చురకలకు షోయబ్ తన పత్రికలో అత్యధిక ప్రాధాన్యం
ఇచ్చాడు. స్వతంత్ర భారత యూనియన్లో హైదరాబాద్
సంస్థానం బేషరతుగా విలీనం కావాలని షోయబ్ తన
పత్రికలో గట్టిగా వాదించాడు.
ఆ రోజుల్లో అది అతి సాహసం. ఖాసిం రజ్వీ
బహిరంగంగానే షోయబ్ మీద విమర్శలు కురిపించసాగాడు.
తన పత్రికలో గాంధీ మహాత్ముడిని ప్రస్తుతిస్తున్న షోయబ్
ముస్లింలకు వ్యతిరేకి అని ఖాసిం రజ్వీ ప్రచారం
కొనసాగించాడు. షోయబ్ను బెదిరిస్తూ ఆకాశరామన్న
ఉత్తరాలు రాసాగినవి. నిజాలను వ్యతిరేకించే వారి చేతులను
నరికి వేస్తామని బెదిరించారు.
ఈ అనామకుల ఉత్తరాలతో 1948లో హైదరాబాద్
సంస్థానం పరిస్థితి అదుపు తప్పి భయంకర స్వరూపం
భరించింది. ఆ సంవత్సరం ఆగస్టు 20వ తేదీన ఇమ్రోజ్
సంపాదకుడు షోయబ్క మరో బెదిరింపు లేఖ వచ్చింది.
అందులో ఆయనను రజ్వీ అనుయాయులు ఘోరంగా
దూషించారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ నగరం
కాచిగూడలో గల ఇమ్రోజ్ పత్రిక కార్యాలయానికి వెళ్ళి
బూర్గుల రామకృష్ణారావు తదితరులు షోయిప్తో చాలసేపు
ముచ్చటించారు.
ఆ రోజే అందిన బెదిరింపు లేఖ ప్రస్తావన వచ్చింది.
రజ్వీ అనుచరులు మతోన్మాదులని, దుర్మార్గులని, జాగ్రత్తగా
ఉండాలని రామకృష్ణారావు ఆందోళన స్వరంతో షోయబ్
కు సలహా ఇచ్చాడు. నేను గాంధీ మహాత్ముడి అడుగు
జాడలలో, అహింసా మార్గంలో నడుస్తూ అన్యాయాలను,
అక్రమాలను వ్యతిరేస్తున్నాను. మతోన్మాదానికి వ్యతిరేకంగా
పోరాడుతున్నాను. నా మాతృభూమి భారతదేశం కోసం
ప్రాణత్యాగం చేయడానికయినా సిద్ధమే.... అని షోయబ్
నిశ్చలంగా రామకృష్ణారావుతో అన్నాడు. తరువాత అగస్టు
22వ తేదీన షోయబ్ రాత్రి 12 గంటలకు యధాప్రకారం
పత్రిక పని పూర్తి చేసి దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళుతున్నాడు.
ఆ నడిరాత్రి షోయబ్ మీద రజాకార్ రక్కసులు, మతో
న్మాదులు దాడి చేశారు. మొదట ఆయన మీద తుపాకి
కాల్పులు జరిపారు. తరువాత కత్తులతో ఆయన రెండు
చేతులను దుండగులు నరికివేసారు. షోయబ్ వెంట ఉన్న
సహచరుడు ఇస్మాయిల్ ఖాన్ గూడ దుండగుల దాడిలో
గాయపడ్డాడు. ఇస్మాయిల్ ఖాన్ బిగ్గరగా వేసిన కేకలు విని
చుట్టుపక్కల వారు బయటికి వచ్చారు. రజాకార్ దుండగులు
పారిపోయారు. రక్తపు మడుగులో షోయబ్ ను వెంటనే
ఆసుపత్రికి తరలించారు. 'ఇమ్రోజ్ పత్రిక ప్రచురణ
ఆగరాదు. ధర్మం జయస్తుంది...' అన్న చివరి సందేశంతో
దేశభక్తుడు, యువ సంపాదకుడు షోయబుల్లా ఖాన్
ఆసుపత్రిలో చేరిన కొన్ని గంటలకే అమరుడయ్యాడు.
అప్పుడు షోయబ్ వయస్సు ఇరవయి ఎనిమిది సంవత్సరాలు.
ఆ రోజుల్లో భారతప్రభుత్వపు ఏజెంట్ జనరల్గా
హైదరాబాదులో ఉన్న జాతీయ నాయకుడు. భారత రాజ్యాంగ
రచన కమిటీ సభ్యుడు కె.ఎమ్. మునీ. యువ సంపాదకుడు
షోయబ్ జాతీయవాది.
దేశభక్తుడు, సాహసవంతుడయిన జర్నలిస్ట్ అని మున్నీ
ప్రశంసించారు. పూర్వపు హైదరాబాద్ సంస్థానం విముక్తి
ఉద్యమ చరిత్రలో, విశేషించి నాటి పాత్రికేయులు అత్యంత
సాహసవంతంగా నిర్వహించిన పాత్రలో యువసంపాదకుడు.
స్వాతంత్ర్య సమరయోధుడు, మానవతావాది షోయబుల్లాఖాన్
త్యాగ గాథ నిరుపమానమయినది. ఉన్నత పాత్రికేయ
ప్రమాణాలకు విలువ ఇచ్చే పాత్రికేయులు, సంపాదకు
అందరికి షోయబ్ ఆదర్శప్రాయుడు.
చతురుడు తెలంగాణ ( 445
) తేజోమూర్తులు మీడ<noinclude><references/></noinclude>
eq9h4ovwqsrh3od655nl50i5z49yoou
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/467
104
212172
553081
2026-04-15T06:54:54Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '128 సిద్ధప్ప వరకవి - డా॥ బి.వి.ఎస్. స్వామి ఆ యన చదివింది ఏడవతరగతి. ఆరు భాషలపై ఆయనకు పట్టుంది. చేపట్టింది ఉపాధ్యాయ వృత్తి. సమాజ సేవ ఆయన ప్రవృత్తి. స్వరాజ్య ఉద్యమంలో రూమి టోపీకి బద...'
553081
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>128
సిద్ధప్ప వరకవి
- డా॥ బి.వి.ఎస్. స్వామి
ఆ
యన చదివింది ఏడవతరగతి. ఆరు భాషలపై
ఆయనకు పట్టుంది. చేపట్టింది ఉపాధ్యాయ వృత్తి.
సమాజ సేవ ఆయన ప్రవృత్తి. స్వరాజ్య ఉద్యమంలో రూమి
టోపీకి బదులుగా, గాంధీ టోపి ధరించి విధులకు వెళ్ళి
నందుకు ఉపాధ్యాయ ఉద్యోగం నుండి నిజాం ప్రభుత్వం
ఆయనను తొలగించింది. అప్పటి నుండి తన ప్రవృత్తి
కనుగుణంగా వాస్తు, వైద్య ఆయుర్వేద శాస్త్రాల్లో ప్రాముఖ్యం
సంపాదించి ప్రజలకు సేవ చేసారు. ఆయనే సిద్దప్ప వరకవి.
కోహెడ మండలం గుండారెడ్డి పల్లెకు చెందిన లక్ష్మమ్మ,
పెద్ద రాజయ్యలకు 1903లో జన్మించారు. 1984లో తాను
చనిపోయే రోజును ముందుగానే ప్రకటించి తేది.
23.3.1984 రోజున సాయంత్రం 3 గంటలకు ప్రాణాలు
విడిచారు. తెలంగాణ తొలి సమాజ వేదాంత కవి, గోల్గొండ
కవి, తత్వకవిగా పేరు పొందారు.
తెలంగాణాలో నిజాం కాలాన సంక్లిష్టమైన పరిస్థితు
లుండేవి. ఒకవైపు అవిద్య, అనారోగ్యం, అసమానతలు,
నిజాం సైన్యం, దొరలు, దేశముఖ్ ఆగడాలతో ఈ ప్రజలు
అసహాయులై దీనంగా కాలం గడిపారు.
అలాంటి ప్రజలను స్వాంతన పరచడానికి ఈ
ప్రాంతంలో వరకవులు పుట్టుకొచ్చారు. అందులో ప్రసిద్ధుడీ
సిద్దప్ప భక్తి భావన ముందు అసమానతలు, కుల భేదాలు
కానరావు కనుకనే అంతా ఒక్కటే అని నినాదించాడు.
ఆ మాట ప్రజలకు బలాన్ని ఇచ్చింది. మూఢ విశ్వాసాలను
ఖండించి ప్రజలకు జ్ఞానమార్గాన్న చూపించారు. తమ
కష్టసుఖాలను పట్టించుకొని, వాటి పరిగీతమార్గాలను
చూపించటంవల్ల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. అందుకే
శిష్యగణం తయారయ్యారు. జలస్థంబన ఊరి జనం మంచి
చెడ్డలు బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్లు, వీరు తన వద్దకు
వచ్చిన ప్రజలకు భవిష్యత్తు బోధించి వారికి ధైర్యాన్ని ఇచ్చి
పంపేవారు. ఆపాటి మాట సాయం అనేది ఆనాడు ఒక
పెద్ద బాధ్యత అది నెరవేర్చి సిద్దప్ప వరకవి చిరస్మరణీయు
డయ్యాడు.
సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని నాలుగు భాగాల్లో రచించి
వరకవిగా గొప్ప పేరుతోపాటు యక్షగానాలు, స్తోత్రాలు,
వర్ణమాలలు, సుభాషితాలు, హితబోధలు, వేదాంత
తత్వకీర్తనలు, కాలజ్ఞానములు, కందార్థ దరువులు,
నక్షత్రమాలలు వంటి ఎన్నో రచనలు చేసారు. సురవరం
ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రికలో రాసారు. నీల జంగయ్య,
తెలుగు తత్వకవి పరిశోధన గ్రంథంలో వేమన, కబీర్ దాస్
పద్య పోలికలు ఎలా ఉన్నాయో సిద్ధప్ప రచనలోనూ అలా
ఉన్నాయని అన్నారు.
పల్లెలో పుట్టి పెరిగినవాడవటంవల్ల, తన కులవృత్తిని
విడువకపోవటంవల్ల, నిత్యం ప్రజలలో సేవా సంబంధాలు
నెరపటంవల్ల సిద్దప్ప సాహిత్యంలో తెలంగాణ పలుకుబడులు
అంటుంటే తెలంగాణ 446 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
5k27tzt4r2v4y01kadki25veumernc4
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/468
104
212173
553082
2026-04-15T06:55:16Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తేలియాడతాయి. తన కులవృత్తిలో భాగంగా మట్టి తడపడం, కుండలు చేయడం, వాము పెట్టడంవంటివన్నీ చేస్తూనే మంత్రముగ్ధులను చేసే గొప్ప కవితాత్మక ప్రయోగాలు చేసారు. ఆయన తన గురించి గొప్పలు...'
553082
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తేలియాడతాయి. తన కులవృత్తిలో భాగంగా మట్టి తడపడం,
కుండలు చేయడం, వాము పెట్టడంవంటివన్నీ చేస్తూనే
మంత్రముగ్ధులను చేసే గొప్ప కవితాత్మక ప్రయోగాలు
చేసారు. ఆయన తన గురించి గొప్పలు ఎప్పుడు చెప్పుకోక
పోగా, తనలోని అక్షరశక్తి కతటికీ వానరమ్మ (బాసర
సరస్వతీదేవి) కృపాకటాక్షణాలే కారణమని ప్రకటించడం
విశేషం. సీసం, గీతం, కందం, ఆటవెలది, తేటగీతి వంటి
పద్యాల శైలిలో అద్భుతంగా, సరళసుందరమైన వద
ప్రయోగాలు చేసారు. వీరి పద్యాలు, వేమన పద్యాలవలె
పండిత పామర నాలుకలపై తారాడతాయి.
సామాజిక స్థితిగతులకు స్పందించి రచనలు చేయడం,
దురన్యాయాలను దునుమాడడం వీరికి ఇష్టమైన కర్తవ్యాలు.
దొరలు, పెత్తందారులు, దేశీయులు, దేశముఖ్ లు వంటి
పెత్తందార్లపై తన పద్యాలలో విరుచుకపడ్డారు.
బూతి
చేతులు రాతి లింగాలు
చేతురూ శివపూజ చెలుల ఇంట
చక్కనీ దండాలు చంక కమండలాల్
పడకవేతురు పడుచులకునూ!
అంటూ నేడు చూస్తున్న దొంగస్వాముల బాణాన్ని
నాడే తేటతెల్లం చేసారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,
యోగివేమనలను ఆదర్శంగా చేసుకొని సాహితీ సేద్యం
చేసారు.
ఆకాశమొక్కటే తెప్పలతీరులెన్నో
జలా ఒక్కటే అయినా చెట్ల సారంవేరు
మానవ జన్మ ఒక్కటేకాని గుణాలు వేరు.
ఇలా ఎన్నో తత్వ ప్రబోధనలు సిద్దప్ప వరకవి రచనల్లో
మనకు కనిపిస్తాయి.
"చదువులేదిక నాంధ్ర సంగ్రహంబులలెన్స.
కనిచూడలేదొక్క కావ్యమైన
నోట బల్కియు చేత నానరంగ వ్రాసింది చెలువొంద
మీ పాదసేవకుడను
అని వినమ్రంగా తెలిపాడు. వాడివరంచే కవిత్వానికి
చేరువై పద్యం రాయగలిగానని, అందుకే తాను వరకవినని
తెలుపుకున్నాడు. "గొప్పవాడనుగాను, కోవిదుడనుగాను
తప్పులున్నను దిద్దుడీ తండ్రులార” అని విశదపరిచాడు.
చాలామంది తాత్వికుల్లానే సిద్దప్ప కూడా వైరాగ్యాన్ని
బోధించారు. ప్రజలు ఈ బోధనలను కళ్ళకద్దుకున్నారు.
సీ. అజ్ఞానియే శూద్రుడవనిలో నెవడైన
సుజ్ఞానియే యాత్మ సుజనుతదు
వేదంబు జదివినా విప్రుడా విహితుండు
బ్రహ్మమెరిగిన వాడే బ్రాహ్మణుడు
వర్తకంబును జేయు వణిజుండు వైశ్యుందు
అవని పాలించె నరుడె ప్రభువు
సకల నిందలు నోర్చు సదయిడు నరుడౌను
మత భేద విడిచిన యతివరుండు
గీ. జన్మచేతను వీరింక కలియంషమున
పేరు గాంచిన యెవరెవరి బెర్మి పనులు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకముప్ప
అంటూ చాతుర్వర్ల లక్షణాలను పునర్నిర్వచించి,
భావజాలపరంగా సమతను సాధించాడు. చాలా పద్యాలలో
ఆర్తి, వేదన, సంఘరీతిపట్ల కసి, అసమానతలపట్ల అసహ్యం
కనపడుతుంటాయి.
సీ. ఏ కులంబని నన్ను ఎరుకతో నడిగేరు
నా కులంబును జెప్ప నాకు సిగ్గు
తండ్రి బొందిలివాడు తల్లి దాసరి వనిత
మా తాత మాలోడు మరియు వినుడి
మా యత్త మాదిగది మామ యెరుకలవాడు
మా బావ బలతడు మానవతుడు
కాపువారీ పడుచుకంత దొమ్మరి వేళ్ళు
భార్యగావలె నాకు ప్రాణకాంత
ఈ విధంగా కులవాదాన్ని నిరసిస్తాడు. సమస్త కులాల
బిరాట్ స్వరూపంగా కనిపిస్తాడు.
"రాతి బొమ్మల మొదట రాశిగా అన్నంబు
తినమన్న యా రౌతు తినదురన్న
తినెడి వాడవు నీవె తీవంబు చెందేవు
కానలేవు నీలోని తిమిరములను
పేదలకు అన్నంబు పెటు ధైర్యంబులేదు.
గట్టురాళ్ళకు తిండి పెట్టగలవే...." అంటాడు.
వీరి పద్యాల్లో జాషువా, కాళోజీల అడుగుజాడలు
కనపడతాయి. భక్తి మార్గంలో ఉంటూనే మూఢ భక్తిని
చతురుడు తెలంగాణ (447) తేజోమూర్తులు మీడ<noinclude><references/></noinclude>
e899labe7383kanff447vamq2iydg5y
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/469
104
212174
553083
2026-04-15T06:55:37Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నిరసించాడు. జ్ఞాన మార్గంలో పయనిస్తూ కొత్త దాడులు చూపాడు. ఛందస్సును పుక్కిట పట్టుకున్నా. వ్యాకరణాన్ని తోసివేయలేదు. తెలంగాణలో మరణం తరువాత కూడా బతికున్న సిద్దప్ప వరకవి అత్య...'
553083
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నిరసించాడు. జ్ఞాన మార్గంలో పయనిస్తూ కొత్త దాడులు
చూపాడు. ఛందస్సును పుక్కిట పట్టుకున్నా. వ్యాకరణాన్ని
తోసివేయలేదు.
తెలంగాణలో మరణం తరువాత కూడా బతికున్న
సిద్దప్ప వరకవి అత్యంత ప్రసిద్ధుడు. సిద్దప్ప జ్ఞాపకార్ధం
1996లో అతని సమాధి వద్ద విగ్రహప్రతిష్ట ఏర్పాటు
చేశారు. ప్రతి కార్తీక పౌర్ణమి రోజున నలుమూలల నుంచి
వచ్చిన వీరి శిష్యులు విగ్రహం సాక్షిగా గురుపూజోత్సవాన్ని
జరుపుతారు. కార్తీక పౌర్ణమే కాకుండా గురుపౌర్ణమి పాల్గుణ
బహుళ సప్తమి రోజుల్లో ఆశ్రమంలో అన్నదానాలు,
ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతుంటారు. 1984లో సిద్దప్ప
వరకవి భౌతికంగా ఈ లోకం నుండి వెళ్ళిపోయినా శిష్యుల
చేతుల ద్వారా సారస్వతిభిమానుల గుండెల్లో చిరస్థాయిగా
ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక, కొత్తగా
తీర్చిదిద్దబడిన తెలుగు వాచక పుస్తకాల్లో ఒకటైన తొమ్మిదవ
తరగతి తెలుగు వాచకంలో సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని
రెండవ భాగం నుంచి ఒక సీసపద్యం "కోపంబు మనుషులా
కొంపముంచు” అనే పద్యాన్ని చేర్చారు. అలా సిద్దప్ప
ఎదుగుతున్న చిన్నారుల నోళ్ళలో నానుతున్నాడు.
అద
తెలంగాణ (448 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
ed415l2m61rgx5xthl7eazcr7ixi08n
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/470
104
212175
553084
2026-04-15T06:55:50Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '129 రికొండ వెంకట్రావు గారు కరీంనగర్ జిల్లా సిరికొండ గ్రామంలో జన్మించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఎ., ఎల్.ఎల్.బి. వరకు చదివి, న్యాయవాదిగా సిద్ధిపేటలో స్థిరపడ్డారు. జులై నెల 13, 193...'
553084
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>129
రికొండ వెంకట్రావు గారు కరీంనగర్ జిల్లా
సిరికొండ గ్రామంలో జన్మించి ఉస్మానియా
యూనివర్సిటీలో ఎం.ఎ., ఎల్.ఎల్.బి. వరకు చదివి,
న్యాయవాదిగా సిద్ధిపేటలో స్థిరపడ్డారు. జులై నెల 13,
1933నాడు జన్మించిన వెంకట్రావు గారు మార్చి నెల 10,
2010 సంవత్సరంలో పరమపదించారు. మెదక్ జిల్లాకు
చెందిన సిద్ధిపేటలో బహు ప్రతిభావంతునిగా, సాహిత్య
ప్రియునిగా, సాహిత్య ప్రోత్సాహకునిగా, సంఘసేవకునిగా,
పుట్టపర్తి సాయిబాబా ప్రియభక్తునిగా, మెదక్ కరీంనగర్
జిల్లాల్లోనే కాక తెలంగాణా ప్రాంతంలో, హైదరాబాదు
నగరంలో చాలామంది మేధావులకు, సాహిత్యవేత్తలకు,
సంఘసేవకులకు తెలిసినవారు.
విమర్శకుల్లో ఎంతో చక్కని విమర్శనాత్మక, పరిశోధనా
త్మక దృష్టి దృక్పథమున్న వారుంటారు. వారు గ్రంథకర్తలు
కాకపోవచ్చు. వ్రాత రూపేణా వారి అభిప్రాయా లను అబ్బే
వెలిబుచ్చక పోవచ్చు. అయినా వారు బహు గ్రంథాలు
చదివినవారు కావచ్చు. సాహిత్య చర్చల్లో పాల్గొని వారి
ప్రతిభా పాటవాలతో ఎంతో మందిని ప్రభావితం చేసి
పలువురి ప్రశంసలందు కున్నవారు కావచ్చు.
సాహిత్య సభలకు, సదస్సులకు రచయితలెంత
ముఖ్యమో, బాగా తెలిసిన శ్రోతలు, విమర్శకులు కూడా
అంతే ముఖ్యం. వీరు లేకపోతే వారు లేరు, వారు లేకపోతే
సిరికొండ వెంకటరావు
- డా॥ వెల్చాల కొండలరావు
వీరు లేరు. రచయితలను ప్రొవోక్ చేసెడివారే సద్వి
మర్చకులు. విశ్వనాథ వారిని బాగా ఇన్స్పైర్న్ మాట్లాడించా
అంటే వారికి వాక్ చేసే విమర్శకుడైనా, శ్రోతైనా కావాలని
వారిని విన్నవారు అప్పట్లో అంటుండే వారు, అలా వారిని
ప్రొవోక్ చేసేవారు కూడా.
ఒకప్పుడు తెలంగాణలో కొందరి ఇళ్ళల్లో కావ్య
పఠనాలు జరిగేవి. వాటిని వినడానికి చాలామంది మంచి
సాహిత్యాభిరుచి కలవారు వచ్చేవారు. రచనలపై,
రచయితలపై చర్చా గోష్టులు జరిగేవి. అచటికి మేధావులు,
కవులు, విమర్శకులు, సాహిత్య ప్రియులు మాత్రమే ఎక్కువ
వచ్చేవారు. రచనలపై, రచయితలపై చర్చాగోష్టులు జరిగేవి.
అచటికి మేధావులు, కవులు, విమర్శకులు, సాహిత్య
ప్రియులు మాత్రమే ఎక్కువ వచ్చేవారు. అవి మేధో ప్రేరణకు,
హృదయ స్పందనకు, ఆలోచనా అవలోకనలకు ఎంతో
నిండుగా, మెండుగా, సరదాగా నడిచేవి. అలాంటి కొద్ది
మంది మేధావులు పాల్గొనే మితమైన ఇంటలెక్చువల్ మీట్స్
ఇపుడు బహు అరుదైపోయాయి. ఇపుడన్నీ పెద్ద వేదికల
పాలై ఎక్కువ ఆవిష్కరణ, అభినందన సభల్లాంటివై
పోయాయి.
అలాంటివి కరీంనగర్లో జువ్వాడి గౌతంరావు
గారింట్లో, సిద్ధిపేటలో సిరికొండ వెంకటరావు గారింట్లో
ఎంతో ఇంపుగా, సొంపుగా జరిగేవి. అవి తెలంగాణలోని
చేతులు తెలంగాణ (449 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
hn87nt7nrow2iurq549kkz83x88vyeo
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/471
104
212176
553085
2026-04-15T06:56:04Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సాహిత్య కృషీవలులను ఎంతో ప్రోత్సహించి, వారం సరిపోయే శ్రోతలను, విమర్శకులను, విశ్లేషకులను సమకూర్చేవి. అవి వికాసవంతమైన చర్చాగోష్టులు. అందరూ ఖులాసాగా కూర్చొని సాహిత్య కబుర్ల...'
553085
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సాహిత్య కృషీవలులను ఎంతో ప్రోత్సహించి, వారం
సరిపోయే శ్రోతలను, విమర్శకులను, విశ్లేషకులను
సమకూర్చేవి. అవి వికాసవంతమైన చర్చాగోష్టులు. అందరూ
ఖులాసాగా కూర్చొని సాహిత్య కబుర్లు చెప్పుకుంటూ, సాహిత్య
రచనల గురించి వినుకుంటూ మధ్య మధ్య 'అబ్బా ఎంత
బాగున్నాయండీ'యని ఆనుకుంటూ చప్పట్ల, పహ్వాల మధ్య
ఎంతసేపు విన్నా విసుగు రాకుండా ఉర్దూ ముషాయిరాలలా
సాగేవి.
ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఆ రోజుల్లో
అలాంటి ఇంటర్చువల్ గ్యాదరింగ్స్ లేకపోతే, వాటిద్వారా
చక్కని సాహిత్య వాతావరణాన్నే అవి సృష్టించకపోతే ఈనాటి
తెలంగాణా ప్రముఖ కవులెందరో వారి సృజనాత్మక రచనలు
చేయడానికి ఆస్కారముండేది కాదు. ఒకనాడు రాజులు,
ప్రభుత్వాలు, సాహిత్య సంస్థలు చేసినంత పనిని జువ్వాడ
గౌతమరావు గారిలాంటి, సిరికొండ వెంకటరావుగారి
లాంటివారు వారి ఇళ్ళల్లో చేసేవారు. అలాంటివేవీ ఈనాడు?
ఈనాటివన్నీ ఫార్మల్ సమావేశాలే కాని, ఇన్ఫార్మల్,
ఇంటలెక్చువల్ సమావేశాలు కావు? ఆనాటివి చిన్నవైనా
ఒక వ్యక్తియొక్క రచన యొక్క సాహిత్య విశిష్ఠతను అంచనా
వేయడానికి ఎంతో అక్కరకొచ్చేవి? ఎవరు ఔనన్నా కాదన్నా
ఆనాటి వాటికి రాసెక్కువ, ఈనాటి వాటికి వాసెక్కువ అని
అనవలసి వస్తుంది.
వెంకట్రావు గారు రచనలు అట్టే ఎక్కువ చేయక
పోవచ్చు కాని వాటికన్నా ఎక్కువ సాహిత్య విస్తరణకు
కావలసినవన్నీ చేస్తూ, పండితులచే, మేధావులచే, కవులచే
కొనియాడబడ్డారు. విమర్శకులచే సద్విమర్శకుడనిపించు
కున్నారు. పరిశోధకులచే, విద్యార్థులచే వారంతటి పుస్తక
ప్రియులు, సాహిత్యప్రియులు, పరిశోధనా ప్రియులు,
సాహిత్య ప్రోత్సాహకులు అరుదంటే అరుదని అనిపించు
కున్నారు. వారి ఇల్లే ఒక గ్రంథాలయం. అది ఎప్పుడూ
పదిమంది కవులచే, రచయితలచే కళకళలాడే ప్రతిభా
పరిమళ ప్రాంగణం. వారి చిరునవ్వుతో ఆహ్వానించే
ఆహ్వానమే అచటికొచ్చేవారికి పాయసం. వారి వినయితే,
వినమ్రతే వారు వారందరికందించే పరమాన్నం. వారి
స్వాగత సుస్వాగత పలుకులు, మర్యాదలు, వినయ
విధేయతలే వారింటికి వచ్చే వారందరికీ ఆనందం,
బ్రహ్మానందం. ఆయన ఒకరికి జ్ఞానిగా కనబడితే ఒకరికి
ధ్యానిగా కనబడేవారు. ఒకరికి మేధావిగా కనబడితే
మరొకరికి పుస్తకారాధకుడిగా, ఒకరికి వారు సృజనకు వారు
స్ఫూర్తి ప్రదాతగా, స్వరవరంగా వినబడితే, మరొకరికి
సద్విమర్క దృష్టి దృక్పథం గల పటవృక్షంగా కనబడేవారు.
ఒకరికి దాతగా కనబడితే మరొకరికి సాహిత్య సారస్వత
విధాతగా కనబడేవారు.
వారు ఎంతోమందిని ప్రభావితం చేశారు, ఎంతో
మందిని సాహిత్య పఠనంవైపు, సాహిత్య రచనవైపు
ప్రోత్సహించారు. ఎంతోమందిలో సాహిత్యాభిరుచిని పెంచి,
వారి స్వీయ సాహిత్యాభి రుచిని వారికి పంచి, ఎన్నో
పుస్తకాలు స్వయానా చదివి, ఇతరులకు 'ఇవిగో ఇవి
బాగున్నాయి చదవండని అందించేవారు. వాటిలో నుండి
మచ్చుకు కొన్ని వినిపించేవారు కూడా. ఇక ఇంతకన్నా
సాహిత్యసేవ మరేముంటుంది? మన విశ్వవిద్యాలయాలు,
అకామీలు, వివిధ విద్యా సాహిత్య సాంస్కృతిక సంస్థలు
చేయవలసిన ముఖ్యమైన పనులు ఇవేకదా మరి? ఇలా
చేసిన, చేస్తోన్న వారికి కూడా మనం మన తెలంగాణా
సాహిత్య చరిత్రలో తగిన స్థానం కల్పించాలి కదా మరో
అదే కదా మరి మనం వారికి అర్చించగల సరియైన
కృతజ్ఞతాంజలులు, నివాళులు....
అతడు
అతడెంతో తెలివైన వాడు, తెలిసినవాడు కూడా
వృత్తిరీత్యా న్యాయ వాది,
ప్రవృత్తిరీత్యా న్యాయ నిధి.
ఆదర్శరీత్యానే కాదు, ఆచరణరీత్యా కూడా
నిత్య సత్యవాది, ధర్మవాది.
చల్లని మెల్లని గొంతు,
సుతిమెత్తని మనస్సు,
చిగురులాంటి చిరునవ్వు
అగరులాంటి చుట్టుముట్టు
అన్నిటా ఒక సంస్కార సహృదయ పడికట్టు.
అతనితో గడపడమదొక శాంతి,
ఆత్మిక, ఆధ్యాత్మిక ప్రశాంతి
అతని ఒక్కమాట చాలు,
డు తెలంగాణ 450 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
gdkc3473i6edjqp6umczg2ohxrit64k
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/472
104
212177
553086
2026-04-15T06:56:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఒక్క పరామర్శ, ఒక్క సద్విమర్శ శుభాకాంక్ష ఒక్క అభినందన ఒక్క కంటితళుకు ఒక్క కంటి మెళుకు, ఒక్క కరచాలన ఒక్క “వెన్నుతట్టు”, “మునివ్రేళ్లతో ముట్టు”, అదొక అనిర్వచనీయ అనుభవం. అతడంద...'
553086
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఒక్క పరామర్శ,
ఒక్క సద్విమర్శ
శుభాకాంక్ష
ఒక్క అభినందన
ఒక్క కంటితళుకు
ఒక్క కంటి మెళుకు,
ఒక్క కరచాలన
ఒక్క “వెన్నుతట్టు”, “మునివ్రేళ్లతో ముట్టు”,
అదొక అనిర్వచనీయ అనుభవం.
అతడందరి బంధువు
దయా సింధువు
ప్రేమ విందువు
అమృత బిందువు
అజాత శతృవు.
సాంప్రదాయ వాదే కాని
వలువలకు చెందిన సాంప్రదాయ వాది కాదు.
విలువలకు చెందిన సాంప్రదాయ వాది,
సవ్యతతూ కూడిన నవ్యతావాది.
విశాలత, గాఢత, గాంభీర్యత, భారసామ్యత,
తులనాత్మకత
తెలిసినవాడు.
బెణకని నీతి, తొణకని రీతి కలవాడు,
స్థిర సుస్థిరతలు ఆశించేవాడు,
స్మిత వర్చస్సుడు, "స్థితప్రజ్ఞుడు”.
జీవితమంతా ఒక త్యాగంగా, యాగంగా గడిపినవాడు,
కుల మత భేదాలకతీతుడని అందరిచే కొనియాడ
బడినవాడు.
అంతిమ యాత్రలో అందరిచే కన్నీటి వీడ్కోళ్ళు
అందుకున్నవాడు.
నీతి నిజాయితీల్లో నిప్పులాంటివాడు,
విద్యావంతుడు, వికాసవంతుడు,
వినయవంతుడు, వివేకి,
అనేకానేక భావాలు, విలువలు,
సంస్కృతులు, సాంప్రదాయాలు,
సాహిత్యాలు, విశ్వాసాలెరిగినవాడు.
తన భావాలను ఇతరులపై రుద్దక
ఇతరులవి సావధానంగా వినేవాడు,
క్రమశిక్షణ, నియమపాలన, కృతజ్ఞతాశీలన
మాట, మర్యాద, మన్ననలు తూ.చ. పాటించేవాడు.
మనుష్యులను, వారి మనసులను, మమతలను
వ్యక్తిత్వాలను, మంచితనాలన, ప్రతిభలను
సహృదయాలను అట్టే పరికించి పట్టుకునేవాడు.
వాదనలో వేదంలా చిక్కని చక్కని వాక్వాడి కలవాడు.
ఎంతో లోతైన భావకుడు,
నిరంతర అధ్యయిని, సద్విమర్శకుడు
నవ్యత, సవ్యత, భావ్యత, తెలిసినవాడు.
క్రొత్తందనాన్ని, స్వచ్చందనాన్ని అట్టే పట్టుకునేవాడు.
సృజనాత్మకతను నచ్చేవాడు, మెచ్చేవాడు.
వ్యక్తిని వ్యక్తిత్వంతో కొలిచేవాడు,
అతిశయోక్తికి వెనుకాడేవాడే కాని
వలసిన చోట అభినందించుటకు
వెనుకంజవేసేవాడు కాదు.
ఎంత రూపపొడుగరో అంత గుణపొడగరి,
ఎంత ఆకర్షణీయుడో అంత ఆత్మీయుడు,
ఎంత బంధువులకు బంధువో,
స్నేహితులకు సింధువో
అంత అందరికీ ఆమోదమైన అందరివాడు.
ఎంతో ఆత్మీయంగా, సాత్మీయంగా, ఆదరంగా
సాదరంగా, అన్యోన్యంగా మనసిచ్చి మాట్లాడేవాడు.
'సత్యసాయి' సత్యాలు, విలువలు, ప్రేమలు
పెంచి పంచిన పరమ భక్తుడు.
అందరి మనసులు, మమతలు
మర్యాదలు చూరగొన్నవాడు.
తీర్ధంలాంటి, సార్ధంలాంటి, సారంలాంటివాడు.
అందరి గుండెల్లో గుడి ఘంటల్లా మ్రోగినవాడు.
అందరి మనస్సుల్లో ఆమనిలా నిలిచిపోయినవాడు.
అతడి లేడు.
ఉన్నట్టుండి కలలా మాయమయాడు,
కాలగర్భంలో కలిసిపోయాడు.
తెలంగాణ (451) తేజోమూర్తులు ఉండి ముం<noinclude><references/></noinclude>
i9d0qotskq4bw9bjbg4z42vk43cr1tg
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/473
104
212178
553087
2026-04-15T06:56:42Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '130 సిరిప్రెగడ భార్గవరావు - డా॥ తిరునగరి ల్లెలు మా నివాసములు పచ్చని పంట పొలాలు మా మనః పుల్లత గూర్చు చైత్రములు, బోదెల పైని రసాల శాఖికా పల్లవముల్ గ్రసించు చిరుపాటలదియాని తేనెత...'
553087
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>130
సిరిప్రెగడ భార్గవరావు
- డా॥ తిరునగరి
ల్లెలు మా నివాసములు పచ్చని పంట పొలాలు
మా మనః
పుల్లత గూర్చు చైత్రములు, బోదెల పైని రసాల శాఖికా
పల్లవముల్ గ్రసించు చిరుపాటలదియాని తేనెతేటలు
జిల్లు పికంబు మా యనుగుచెల్లెలు గానమె మాదు
ప్రాణమౌ
అని కంఠమెత్తి పాడిన కవికోకిల సిరిప్రెగడ భార్గవరావు.
ఎక్కడో నల్లగొండజిల్లాలోని చండూరు సమీపముగల
చిరుపల్లె గూడెపల్లిలో సిరిప్రెగడ జన్మించారు. ఆయన జనన
తేది కూడా సాహితీలోకానికి తెలియదు. చాలా పిన్న
వయస్సులోనే 1963లో ఆయన అస్తమించారు.
1934లో గుంటూరు జిల్లా 'ఏదుబాడు' నుండి
'కవిరత్న' అంబటిపూడి వేంకటరత్నంగారు నల్లగొండ
జిల్లాలోని చండూరుకు వచ్చి అక్కడే స్థిరనివాస మేర్పరచు
కున్నారు. కృష్ణభక్తులైన అంబటిపూడివారు సంస్కృతాంధ్ర
భాషా విశారదులు,విద్వత్కవులు. చండూరు పరిసరప్రాంతాల
ప్రజల ఆదరాభిమానాలు అనతికాలంలో ఆయనకు దండిగా
లభించాయి. ప్రజల సహకారంతో తమ ఆశ్రమంలో కృష్ణభక్త
సమాజాన్ని స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలతో
కృష్ణసంకీర్తన సభలు నిర్వహించారు. సహజంగా కవులైన
అంబటిపూడి 'సాహితీ మేఖల' అనే సంస్థను స్థాపించారు.
అనేకమంది శిష్యులను కూడగట్టుకున్నారు. వారితో సంస్కృత
కావ్యాలు పూర్వాంధ్ర కావ్యాలు, నవ్యాంధ్ర కావ్యాలు
చదివించారు. సాహిత్య దేశికులుగా వారికి భాష పట్ల,
సాహిత్యం పట్ల అభిమానం కలిగించడంలో కృతకృత్యు
లయ్యారు. వారి శిష్యులలో సిరిప్రెగడ భార్గవరావు, పులిజాల
హనుమంతరావు, ధవళ శ్రీనివాసరావు, పులిజాల గోపాల
రావు, మద్దోడు సత్యనారాయణ, తాడిశెట్టి నరసింహగుప్త,
మంచుకొండ శివలింగయ్య వంటి ప్రముఖులు ఉన్నారు.
వారిలో భార్గవరావు సంస్కృతాంధ్రభాషావ్యవసాయం
ఎక్కువగా చేసినవారు. ఆయనది కవితారూప తపస్సు,
పద్యరచనలో తనదైన శైలీ రమ్యతను సాధించారు.
గంగాఝరీ ప్రవాహ సదృశం అయన కవితాధార. ఆయన
జీవించి ఉండగా రచనలేవీ ముద్రింపబడలేదు. భార్గవరావు
మరణానంతరం 1967లో ఆయన పద్య రచనలన్నీ
'భార్గవానందలహరి' పేరుతో గ్రంథంగా వెలువడింది. అది
సాహితీ జగత్తును ఓ కుదుపు కుదిపింది. ఆకృతిని చదివి
ప్రశంసించని సాహితీపరుడు, సహృదయుడు లేడు.
సిరిప్రెగడ భార్గవరావు నవ్యభావకవి. కవితా తపస్వి,
రససిద్ధుడు. తెలంగాణపు ముద్దుబిడ్డ. భార్గవరావు శోకమే
పద్యమై పొంగివచ్చింది. భావకవుల కవిత్వం వలెనే
సిరిప్రెగడ కవిత్వమంతా ఆత్మాశ్రయమే. సంద్రాయ
మూల్యాలను పరిరక్షించి, అద్భుతమైన పద్యాలను రచించిన
భార్గవరావును, నవ్యభావకవి అని విమర్శకులు పేర్కొన్నారు.
తెలంగాణ 452 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
jxas08bwcu4cet2odg91knjb34taeq4
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/474
104
212179
553088
2026-04-15T06:56:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆనాటి కవి ప్రవరకందరికీ నీడనిచ్చిన కవితా మాకందం సాహితీమేఖల, భార్గవానందలహరిలో 'వీణానిక్వణనమ్ముతోడ, కబరివిన్యస్తపుష్పానన ధ్యానమ్ముక శ్రుతిగూర్చియున్ గళమునెత్తంబాపు ఆ సా...'
553088
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆనాటి కవి ప్రవరకందరికీ నీడనిచ్చిన కవితా మాకందం
సాహితీమేఖల, భార్గవానందలహరిలో
'వీణానిక్వణనమ్ముతోడ, కబరివిన్యస్తపుష్పానన
ధ్యానమ్ముక శ్రుతిగూర్చియున్ గళమునెత్తంబాపు ఆ
సానందద్యుతి చంద్రికా లలితలాస్యన్యాస మైసర్గిక
శ్రీ నైర్మల్యముఖంబు జూపగదె తల్లీ సాహితీ మేఖలా'
అంటూ ఆ సంస్థ గొప్పతనాన్ని సిరిప్రెగడ ప్రస్తు
తించారు. వృత్తరచనలో, శిల్పతో శబ్దాలంకార ప్రయోగము
ఆరితేరిన కవి సిరిప్రెగడ. భార్గవానందలహరిలో
పన్నీరు, కన్నీరు మున్నీరు, భక్త్యాంజలి అనేవి ప్రధాన
శీర్షికలు.
పన్నీరులో - ప్రాంజలి, గానేందిర, ఏకాంతగోష్ఠి,
నెలబాలుడు, మధురయామిని, తెలుగుతల్లి, మధులక్ష్మి,
ఓదార్పు ఆవేదన అన్న ఖండకావ్యాలున్నై.
కన్నీరు, సతీవియోగంతో రచించిన శోకకావ్యం.
మున్నీరులో యశోద పిలుపు, వేణుగానం, ఏకాంత
గోష్ఠి, రాధికా విరహగీతి, అందాల కలము, భావమైత్రి వంటి
పదమూడు ఖండికలున్నై.
భక్త్యంజలిలోని నాలుగు ఖండకావ్యాలు ఆయన
గురుదేవులైన అంబటిపూడి వేంకటరత్నంగారిని ప్రస్తుతిస్తూ
రచించినవే.
'కోతలు వడ్డె నాయెడ దక్కునే నవనీతము
భిక్షపెట్టి ప్ర
స్థిత మనోజ్ఞగానరస సిధువుచే నుపశాంతి గూర్చి లీ
లాతత పాదనూపుర ఝళంఝళ రమ్యరమమున్ స్ఫుర
ద్గీతికలందజేసి జగతిన్ నను నిల్పెడి వాణి మ్రొక్కెదన్
అని ప్రాంజలి
వాణిని కవి ప్రశంసించిన తీరు మనోజ్ఞం.
కన్నలరమోడ్చి కమ్మని కంఠమెత్తి
సుందరోహకరంబితానందగగన
యానములలోన మోహనగార ఝుల
నాలపింతుమురమ్ము నాయందునీవా వంటి పద్యాలు
(ఏకాన్త గోష్ఠి)
సిరిప్రెగడ భావకవితా సౌందర్యాన్ని ఎత్తి చూపుతాయి.
కృష్ణశాస్త్రిని తలపుకు తెస్తాయి.
'నాలోన వందబృందానమ్ములు లేచి
దిగ్దిగంత నల్లనిమ్ము
నాలోన వేయిరత్నాకరంబులు పొంగి
శంపాలతత గౌగిలింపనిమ్ము
నాలోన లక్షఘంటానాదములు మించి
నినదించి జగమెల్ల నిండనిమ్ము
నాలోన గోటి చందన సౌరభములూరి
ఆసీమ ఈ సీమ నలమనిమ్ము
నీ యశోవైభవ ప్రవాహయామాన
గౌతమీకృష్ణవేణి ప్రపూతశీత
నవ పయోధార నాహృదానందవిధి
కావ్య కమనీయసారై కదలనిమ్ము (తెలుగుతల్లి).
సిరిప్రెగడ పోతన్నలాగా పోతపోసిన సీసపద్యాల రచన
ఆయన కవితా ప్రౌఢిమకు శైలీరమ్యతకు పరమోదహరణాలు.
సిరిప్రెగడ 'కన్నీరు' పద్యాలు వింటే శిలలు ద్రవించి
ఏడుస్తాయి. భార్యవియోగంతో క్రుంగిపోయి ఆయనలోని
శోకం ఏరై పారింది. తెలుగు సాహిత్యంలో భార్యా వియోగం
వస్తువుగా దువ్వూరి, విశ్వనాథ వంటి ప్రముఖులు రచించిన
అందరికీ తెలిసినవే. నేనెరిగినంతవరకు 'కన్నీరు'
వంటి శోకకావ్యం తెలుగుసాహిత్యంలో రాలేదు.
శోకబంధురమైన జీవితం గడుపుతూ ఉండగా
భార్గవుడికి వివాహమయింది. తన జీవితం సుఖప్రదమైందని
ఆనందించాడు. కొద్దికాలం అర్ధాంగిలో స్వర్గాన్ని దర్శించాడు,
అనుభవించాడు. తాను సర్వస్వంగా భావించిన ఆమె
అకస్మాత్తుగా కన్ను మూసింది. భార్గవరావు భూనభోంత
రాళాలు ద్రవించి పోయేలా విలపించాడు. ఆయన జీవితపు
సొంపుల మేడలు కూలిపోయినాయి. కన్నీటి కణాలే
మిగిలినాయి.
'నా యానందయవై దరస్మితమవైన వెల్లువై చూడ్కివై
నా యుత్సాహమలై సుధారంజని నాశయ్యపై సుప్తివై
నా యిష్టంబుల ప్రోవువైమానసువై నా సర్వమై నేనయై
మాయంబైతివి నీవు నీవులేని జగతీ మధ్యన నే
మిధ్యగాన్.' (కన్నీరు)
తెలంగాణ (453) తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
ctxa3rawrg9z2ox4lduc0lnb7fn249n
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/475
104
212180
553089
2026-04-15T06:57:17Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అన్న ఒక్క పద్యం చాలు సిరిప్రెగడ హృదయం దుఃఖార్ణవమైందని చెప్పడానికి. కన్నీరులోని ప్రతిపద్యం ఘోషించిన కవినేత్రాల నుండి రాలిన అశ్రుకణం.. 'కనుదోయిన్ ముకుళించినన్ దెరచినన్ మస...'
553089
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అన్న ఒక్క పద్యం చాలు సిరిప్రెగడ హృదయం
దుఃఖార్ణవమైందని చెప్పడానికి.
కన్నీరులోని ప్రతిపద్యం ఘోషించిన కవినేత్రాల నుండి
రాలిన అశ్రుకణం..
'కనుదోయిన్ ముకుళించినన్ దెరచినన్
మస్మితంబొప్పమో
హనధావళ్య సుచేతవై
నూసితవర్ణాన్వీత సచ్చోళవై
కనువిందై త్రిజగన్మనోజ్ఞ
లలనాకల్యాణ ఖండంబ! నిన్
క్షణమైనన్ మరువంగ జాలన సుతుల్ జ్వాలారు
నందాకనున్ (కన్నీరు)
కన్నీరులో అసలైన కవి హృదయము పొంగి పొరలి
ప్రవహించినది అన్నారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి.
సిరిప్రెగడ భార్గవరావు అంబటిపూడి వేంకటరత్న
కుల అంతే వాసితంలో ఎదిగిన కవి కుమారుడు. ఆ
గురుదేవులకు శిష్యుడు భుక్తితో సమర్పించుకొన్న
సంజలి భక్త్యంజలి.
'బ్రతుకెల్లన్ వడగట్టి సత్కళకుధారస్వాసి యుద్రద్రసాం
చిత సత్కావ్యములన్ రచించి కవులన్ సృష్టించి
నిద్రాణమై
న తెలంగాణమునందు నింపె కవితానంద
ప్రవాహెూర్మిలా
లితరజ్యన్నవనాద సద్గళ కళాలీలా విభూతుల్ వేసన్
(ముగ్గురుదేవులు)
అని తెలంగాణలో అంబటిపూడి చేసి సాహితీసేవను
ప్రస్తుతించారు.
జీవితంలో దెబ్బలు తిన్నవాడు భార్గవరావు. ఆ
బాధలోంచి అద్భుత కవిత్వం పలికినవాడు. భార్గవుడు
వాఙ్మయ తపస్వి అన్నారు రాయప్రోలు.
ఈ కవి చక్కగా నిర్దుష్టముగా పద్యములు వ్రాయగల
వాడని, భావసంగ్రహణ బుద్ధియని తోచినది ఈ చిన్నికావ్య
మాతని యశఃపతాకగా నిలుచుగాక, ఇది విశ్వనాధ ప్రశంస.
'తెలంగాణము తెలుగుతల్లి అందాలకోరె. ఆ తల్లి తన
కొప్పులో ముద్దుగా ముడుచుకొన్న ఒక మల్లెమొగ్గ మన
భార్గవుడు' అన్నారు మహాకవి శేషేంద్ర.
జీవనగాధను కవితామయం చేసి పిన్న వయసులోనే
అస్తమించిన సిరిప్రెగడ భార్గవరావు. తెలుగు వారు గర్వించే
తెలంగాణ మహాకవి. ఒకే ఒక వేదనామయ కావ్యం
'భార్గవానందలహరి ద్వారా సాహిత్య ప్రపంచంలో
దేదీప్యమానంగా వెలిగే కవిద్యుమణి.
తెలుగువారికి పోతనలా ప్రాతఃస్మరణీయుడైన
మధురకవి. సిరిప్రెగడ భార్గవరావు వేలకలంబుగైకొని చిగిరిన
భావపరంపరా విమద్దాలల నాలలాడుచు రపోదయసిద్ధి
గడించుకొన్న రాగాలసమైన సత్కవిభావము సిరిప్రెగడది.
తెలుగు కవితా సామ్రాజ్యంలో కలకాలం నిలిచే
కవిచక్రవర్తి, ఆరని తెలంగాణ కవితాజ్యోతి సిరిప్రెగడ.
'జయన్తితే సుకృతినో
రస సిద్ధాః కవీశ్వరాః
నాస్తితేషాయశః కాయే
జరామరణ జంభయమ్'.
Sa
తెలంగాణ (454 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
rjl87rl00k5a5u6qxgqsbagiigxyt4o
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/476
104
212181
553090
2026-04-15T06:57:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '131 ప ల్లెటూరి పిల్లగాడా పసులుగాసే మొనగాడా పాలు మరిచి యెన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడా కాలువు రుదిరి ఎన్నాళ్ళయ్యిందో తెలంగాణలో ఈపాట పాడని పల్లె లేదు. పట్నం లేదు. జనుల న...'
553090
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>131
ప ల్లెటూరి పిల్లగాడా
పసులుగాసే మొనగాడా
పాలు మరిచి యెన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల
జీతగాడా
కాలువు రుదిరి ఎన్నాళ్ళయ్యిందో
తెలంగాణలో ఈపాట పాడని పల్లె లేదు. పట్నం లేదు.
జనుల నాలుకల మీదికెక్కిన ఈ అర్ద్ర మానవతాగీతం
రాసింది తెలంగాణా సాయుధపోరాటంలో పెన్నూ, గన్నూ
ధరించి పోరాడిన ప్రజాగెరిల్లాకవి సుద్దాల హనుమంతు.
సాయుద పోరాటకాలంలో ప్రజల్ని యోధులుగా మార్చిన
పాటలెన్నో ఆయన రాసాడు. ఆమరణాంతం నమ్మిన
సిద్ధాంతాలను ఆచరించినవాడు. ఆచరణకు అడ్డుపడ్డ
అన్నింటినీ తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్యజీవి. కాలం
కడుపుతో వుండి కన్న తెలంగాణ సాయుధ విప్లవకవి సుద్దాల
హనుమంతు.
సుద్దాల హనుమంతు నేటి యాదాద్రి భువనగిరి జిల్లా
ఆత్మకూరు (ఎం) మండలంలోని పాలడుగులో పుట్టాడు.
నిజానికి వీరి తాతలవూరు ఇడుకుడ. హనుమంతు తాత
పేరు కృష్ణహరి, వెంకటరావమ్మ నాయనమ్మ పేరు. తాతగారు
హరికథ కళాకారుడు. హనుమంతు తండ్రి బుచ్చిరాములు.
తల్లి లక్ష్మీనరసమ్మ. బుచ్చిరాములు, ఆయన సోదరులైదుగురు
కళాకారులే. 30 సంవత్సరాల పాటలు వీధినాటకాలు
సుద్దాల హనుమంతు
-
* శ్రీరామోజు హరగోపాల్
ప్రదర్శించినవారు. పాలడుగు గ్రామానికి వచ్చి స్థిరపడిన
బుచ్చిరాములు మంచి పేరున్న ఆయుర్వేద వైద్యుడు.
హనుమంతుకు చిన్నపుడు బాగా చదువుకోవాలని
ఉన్నా కనిగిబళ్ళల్లో వేసే శిక్షలకు భయపడి సరిగా బడికి
వెళ్ళేవాడు కాదు. తనకిష్టమైన ఆటలు, పాటలు, ఈత,
గుర్రపుస్వారీలలో ఆరితేరాదు. పాలడుగుకు వచ్చిన
లక్ష్మీనారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని కారణంగా
తిరిగి బళ్ళో చేరి రెండో తరగతి పూర్తిచేశాడు. గొప్ప మానవ
తావాదియైన ఆ గురువు నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా
నన్నాడు సుద్దాల. హరికథ చెప్పడానికి పాలడుగు వచ్చిన
ఆధ్యాత్మిక గురువు ఆత్మకూరి అంజనాసుగారికి
శిష్యుడైపోయి, ఆయన వెంట డ్రామా కంపెనీ సభ్యుడిగా
రెండేండ్లు వూళ్ళెన్నో తిరిగాడు. హనుమంతుగారిది కోకిల
గొంతు. పద్నాలుగేండ్ల వయసొచ్చేసరికి గొప్ప గాయకుడు,
నటుడయ్యాడు.
ఆరోజుల్లో గ్రామాల్లో వెట్టిచాకిరి విధానముండేది. ఆ
పనిచేసేవాళ్ళని వెట్టివాళ్ళని పిలిచేవారు. ఒక్కపైసా కూలీ
అడుగకుండా దొరలు, నిజాం ఉద్యోగులకు అడిగిన పనులన్నీ
చెయ్యాలి. వంతుకొచ్చిన బరువులను మోసేవాండ్లను
బరువొంతు లోండ్లు అనేవారు. ఒకరోజు పదిరోజుల్నుంచి
జ్వరంతో వుండి తిండిలేక వున్న పాపయ్యది బరువొంతుల
డ్యూటి. ఉద్యోగి అయింది. బరువులు మొయ్యలేనని
చేతులు తెలంగాణ 455 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
0sx7aia9csx7vlp9d44xua4xgohag66
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/477
104
212182
553091
2026-04-15T06:57:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కనికరించమని వేడుకున్న పాపయ్యను ఆ ఉద్యోగి తన్ని ఈడ్చుకపోవడం చూసి హనుమంతు మనసు కలతపడ్డది. ఆ సన్నివేశం మనసులో వుండిపోయింది. తర్వాతికాలంలో ఆ సంఘటనే 'వెట్టిచాకిరి విధానమో రైత...'
553091
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కనికరించమని వేడుకున్న పాపయ్యను ఆ ఉద్యోగి తన్ని
ఈడ్చుకపోవడం చూసి హనుమంతు మనసు కలతపడ్డది.
ఆ సన్నివేశం మనసులో వుండిపోయింది. తర్వాతికాలంలో
ఆ సంఘటనే 'వెట్టిచాకిరి విధానమో రైతన్న, ఎంత చెప్పిన
తీరదో కూలన్న' అనే పాటగా రచించబడ్డది.
:
ఊరు విడిచి హైదరాబాద్ పట్నం చేరి వ్యవసాయ
శాఖలో గుమస్తాగా పనిచేసాడు సుద్దాల హనుమంతు
ఆకాలంలో బుద్వేలులో వుండేవాడు. నైజాంపాలనను
వ్యతిరేకించే ఆర్యసమాజంలో చేరి, కార్యకర్తగా పనిచేసాడు.
అప్పుడే 'యదార్థ భజనమాల' అనే పాటలపుస్తకం రాసాడు.
ఆర్య సమాజంలో చేరి, విద్యాలంకార్ వినాయకరావ్,
రుద్రదేవ్, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి
వంటి వారితో పరిచయాలుండేవి. ఆర్యసమాజంతో
సంబంధాలున్నాయని వ్యవసాయశాఖ అధికారి హనుమంతు
ను పరుషంగా మందలించడంతో రోషంతో ఉద్యోగానికి
రాజీనామా చేసాడు. బుద్వేలులోనే వుంటూ బతుకుతెరువు
కొరకు దర్జీపనిని చేపట్టాడు.
ఆ తర్వాత 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర
మహాసభలో రావినారాయణరెడ్డి ఉపన్యాసం విని కమ్యూనిస్టు
గా మారాడు. జీవితాంతం కమ్యూనిస్టుగానే వుండిపోయాడు
సుద్దాల.
తెలంగాణ సాయుద ఉద్యమంలో భాగంగానే ఇప్పటి
జనగామ జిల్లాలోని సుద్దాలకు చేరుకుని స్థిరపడ్డాడు. అపుడు
సుద్దాల గ్రామం దొరలపాలన కిందనే నలుగుతూవుండేది.
సుద్దాలలో పొరుగు గ్రామాలలో 1946 ప్రాంతంలో
తొలిసారిగా ఎర్రజెండాను, జాతీయజెండాను ఎగరేసాడు.
హనుమంతు. అప్పటినుండి పార్టీ అప్పగించిన 'కళారంగం'
బాధ్యుడిగా, ప్రజలను పోరాటానికి సిద్ధపరిచే కర్తవ్యదీక్షతో
రచనలు చేసాడు. జానపద కళారూపాలైన బుర్రకథ,
గొల్లసుద్దులు, బుడబుక్కలపాట, పిట్టలదొర పడం, పరీక్ష
పదాలను ప్రక్రియలుగా ఎన్నుకొని పాటలు, పదాలు ఏన్నో
రాసాడు.
హనుమంతు జీవితం తెలంగాణ సాయుధపోరాటంతో
మమేకమైంది. ప్రజలమద్య పాటై ప్రవహించిన సాంస్కృతిక
జీవనది సుద్దాల. 'బాంచెన్ దొరా నీ కాల్మొక్తునన్న బడుగు
లతో బడితెలు, తుపాకులు పట్టించి పోరుబాటలో నడిపించిన
సాహసస్ఫూర్తి, సాంస్కృతిక సేనాని సుద్దాల హనుమంతు.
బతుకంతా నమ్మిన కమ్యూనిజానికి, నిజానికి అంకితం
చేసినవాడు. కడదాక పోరుబాట వొదలకుండ నడిచిన
కామ్రేడ్ ఆయన. పెన్నూ, గన్నూ చేతపట్టి ఉద్యమంలోకి
దూకిన సుద్దాల హనుమంతు తన జీవితంలో నిజాయితీని,
పోరాటతత్వాన్ని ఎప్పుడు ఎక్కడ ఎన్నడు విడిచి పెట్టలేదు.
తను నమ్మిన విలువల కొరకు బతుకంతా త్యాగాలు చేస్తూనే
వున్నాడు. ఏ ఆశలకు, ప్రలోభాలకు లొంగలేదు. ఆఖరికి
మృత్యువై వచ్చిన కాన్సర్కు కూడా.
ఆయన స్వప్నం సమసమాజం. ప్రజాస్వామ్య
కరించబడిన ప్రజాజీవనం. మానవత్వం నిండిన మరోలోకం.
ఆ ఆశావహమైన దృక్పథంతోనే
'ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
ప్రజా ప్రభుత్వం సాదిస్తాం
నిజాములో ప్రతిబజారులో మా
ధ్వజం ఎర్రనిది ఎగురేస్తాం
చేయెత్తి ప్రతిన చేసాము దేశ
క్షేమంబు కొరకు పోరాద్దాం' అని రాసాడు.
ఒకసారి ఓగ్రామంలో సభలో సుద్దాల హనుమంతు
పాట పాడుతుండగా రజాకార్ల దాడి మొదలైంది. భయపడి
పారిపోతున్న ప్రజల్ని చూసి అక్కడున ఓ ముసలమ్మ
'ఎందుకు బయపడి చస్తారు. వచ్చినోల్లు వందమందిలేరు.
మనం వెయ్యిమందిమున్నం. వెయ్యిర దెబ్బ వెయ్యెహె'
అనడం విన్న సుద్దాల అప్పటికప్పుడే ఆశువుగా అల్లినపాట
"వెయి దెబ్బ వెయ్
దెబ్బకు దెబ్బ వెయ్ రా వెయ్
దయ్యపు గుండా గొయ్యలు రాజాకారులు
కయ్యానికి మనపైబడి పచ్చిరి
ఇయ్యర మొయ్యర దంచర బడిశతో
కుయ్యో మొర్రన కోయర చురికతో అని ఆవేశంతో
పాడుతుంటే ప్రజలు తిరుగబడి, రజాకార్లను ఎదిరించి
తరిమికొట్టారట. అది నుద్ధాల పాటబలం ప్రజలకు
సాహసమిచ్చిన ఉద్యమగళం.
పోరాటకాలంలో దిన దిన గండాల నెదుర్కుంటూ,
చిరు తెలంగాణ 456 తేజోమూర్తులు ఉద<noinclude><references/></noinclude>
66y5j1be16in31dzi8axunjg9byr1pz
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/478
104
212183
553092
2026-04-15T06:58:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అజ్ఞాతంగా సంచరిస్తూ, సాయుధంగా దళంతో రాత్రింబవళు રે అడవుల్లో, గుట్టల్లో తిరుగుతూ, దొరల, భూస్వాముల ప్రైవేటు సైన్యాలను, రజాకార్లను ఎదుర్కొంటూ గెరిల్లా సైనికుడై పోరు సాగించా...'
553092
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అజ్ఞాతంగా సంచరిస్తూ, సాయుధంగా దళంతో రాత్రింబవళు
રે అడవుల్లో, గుట్టల్లో తిరుగుతూ, దొరల, భూస్వాముల
ప్రైవేటు సైన్యాలను, రజాకార్లను ఎదుర్కొంటూ గెరిల్లా
సైనికుడై పోరు సాగించాడు సుద్దాల హనుమంతు.
రజాకార్ల నాయకుడు గడ్డం అమీన్, గంటా పాపిరెడ్డిని
కాల్చివేసిన సమయంలో వెంట్రుకవానిలో చావును
తప్పించుకున్నాడు. ముళ్ళకంపలు కప్పుకుని కందకంలో
దాగి శత్రువుల కంటపడకుండ దాడినుండి బయటపడ్డాడు.
దళంతో తిరుగుతూ గ్రామాల్లో పంచాయితీ కమిటీలను
ఏర్పర్చడం, ప్రజల భూముల్ని తాకట్టుపెట్టుకున్న దొరల
దస్తావేజులను తగులబెట్టడం, పేదలకు దాన్యం పంచడం.
స్వాదీనం చేసుకున్న భూముల పంపకాల్లో పాల్గొన్నాడు
సుద్దాల..
1947లో ఏదో పురుగు ముట్టడం వల్ల తీవ్ర
అనారోగ్యం పాలైన హనుమంతుని అజ్ఞాతవాసానికి వెళ్ళమని
పార్టీ ఆదేశించింది. మారువేషాలతో బొంబాయికి చేరుకున్న
సుద్దాల హనుమంతు, జానకమ్మ దంపతుల్ని వరంగల్
రవివర్మ ఫోటో స్టూడియో అధినేత బిట్ల నారాయణ ఆదరించి,
ఆశ్రయమిచ్చాడు. హనుమంతు అజ్ఞాతంలో వున్నా ఆయన
పాటలు ప్రజలకు కంతో పాఠమైనాయి. పోరాట గీతాలైనాయి.
ప్రజలను పోరాటయోధులుగా మారడానికి స్పూర్తినిస్తూనే
వున్నాయి.
నైజాం పాలన అంతమైనాక తిరిగి సుద్దాలకు చేరాడు.
హనుమంతు, గ్రామపార్టీ కార్యదర్శిగా బాధ్యతలను
నెరవేర్చాడు. ఇంటి బాధ్యతల కొరకు ఆర్.ఎం.పి. వైద్యుడిగా
జీవితాన్ని ప్రారంభించాడు. ఆయుర్వేద వైద్యవర అన్నది
ఆయన వైద్యసేవలకు దక్కిన గౌరవం.
తెలంగాణా సాయుధపోరులో అమరులైన యోధులను
కీర్తిస్తూ
'జోహార్లు జోహార్లు జోహార్లు
అమరవీరులార మీకు జోహార్లు' అన్నపాట తెలంగాణ
సాయుధపోరాటం అనే గొల్లసుద్దులు రాసాడు సుద్దాల.
వేలాది వీరులు ప్రాణాలను దారవోసి సాధించిన తెలంగాణ
సాయుధపోరాట ఫలాలను దండుకున్నది మళ్ళీ దొరలు,
భూస్వాములే. భూస్వామ్యమూలాలు తుదముట్టలేదు.
స్వప్నించిన ప్రజారాజ్యం రానేలేదు. ఉద్యమవీరునిగా
గెలిచాడు. ప్రజగా ఓడిపోయాడు సుద్దాల హనుమంతు.
హనుమంతు ఒకరోజు సుద్దాల పొరుగు గ్రామం
తేరాలకు వెళ్ళి వస్తూ తొవ్వతో పసులను అధమాయించలేక,
కాళ్ళకు గుచ్చుకున్న ముండ్లను తీసుకోలేక రాతిగుండుమీద
కూర్చుని ఏడుస్తున్న పనులకాపరి పిల్లగాడు బత్తుల అబ్బయ్య
కాలిముండ్లు తీసి, ఓదార్చాడు. వాని బదులు తనే పసులను
అదమాయించాడు. వాని రూపమే కండ్లల్లో మెదులుతుంటే
సుద్దాల గుండెలో పాట గూడు కట్టుకుంది. ఇంటికి వస్తూ
దారిలో అల్లుకున్న పాటే
'పల్లెటూరి పిల్లగాడా
పసులుగాసే మొనగాడా
పాలుమరిచి ఎన్నాళ్ళయిందో ఓ పాలబుగ్గల జీతగాడా
కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో...' ఈ పాటను 'మా
భూమి' సినిమా టైటిల్ సాంగ్గా తీసుకున్నారు
బి. నరసింగరావు. కాని, అప్పటికి కవి ఎవరో తెలియదు.
ప్రజాకవుల సంప్రదాయమది. రాసిన పాటలను తమ
పాటలుగా ఎప్పుడూ చెప్పుకోరు. కాని, వాళ్ళని గౌరవించడం
సామాజికుల బాధ్యత.
సుద్దాల హనుమంతు వ్యక్తిగతంగా కరుణాకాతరుడు.
కళ్ళముందు ఎవరన్నా కష్టాల్లో వుంటే తట్టుకునేవాడు కాదు.
ఏదో ఒక సాయం చెయ్యందే మనసున పట్టనివాడు.
మంచిమాట విన్నా, మంచిపాట విన్నా ఆయన కళ్ళు
జలజలా వర్షించేవి. కూతురు భారతి 'పల్లెటూరి పిల్లగాడా'
పాటను పాడుతుంటే తాను హార్మోనియం వాయిస్తూనే
వలవలా ఏడ్చేసేవాడు. ఇంత మార్దవం, కోమలమైన
మనసున్న మనిషి అంత కర్కశమైన సాయుధపోరాటంలో
ఎట్లు పాల్గొన్నాడు. తుపాకీ పట్టి యుద్ధమెట్టా చేసాడు. అంత
మెత్తటి మనసున్నోడిబి ఎల్ల తుపాకి పట్టి పోరుచేసి
శత్రువులను మట్టుపెట్టినవని అడిగితే.
'ప్రజలబాధల పట్ల కూడా అంత తీవ్రంగానే
స్పందించగలిగాను కాబట్టి ఎంత కర్కశమైన తుపాకీనైనా
చేతపట్టి యుద్ధం చేసాను. కలంపట్టి అంతే తీవ్రతతో
ప్రజలకొరకు పాటలు రాసాను' అన్నాడు సుద్దాల హన్మంతు.
ఆయన పాటల్లో 'రణభేరి మ్రోగింది, సంఘం
చతురుడు తెలంగాణ (457 తేజోమూర్తులు ఓట<noinclude><references/></noinclude>
kujrvkbdzm2fzc9mtnffx4gwter97bd
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/479
104
212184
553093
2026-04-15T06:58:21Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వచ్చింది, ఔనంటావా ఇది కాదంటావా, చిందొర పెద్దార, వా వారెవా వహ్వారెవా, దొరలు - భూస్వాములు, మంటలు మంటలు మంటలు, ఇంకెన్నడు సోషలిజం, వ్యవసాయ కూలి, శివగోవింద పదం, నందామయా గురుడ పదం ప్...'
553093
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వచ్చింది, ఔనంటావా ఇది కాదంటావా, చిందొర పెద్దార,
వా వారెవా వహ్వారెవా, దొరలు - భూస్వాములు, మంటలు
మంటలు మంటలు, ఇంకెన్నడు సోషలిజం, వ్యవసాయ
కూలి, శివగోవింద పదం, నందామయా గురుడ పదం
ప్రసిద్ధమైనవి. సుద్దాల అసంపూర్ణంగా రాసిన 'వీర తెలంగాణ
యక్షగానాన్ని ఆయన పెద్దకొడుకు సుద్దాల అశోక్ తేజ
పూర్తి చేసి పుస్తకంగా అచ్చువేయించాడు.
తెలంగాణ సాయుధపోరాటం ప్రపంచ ప్రజోద్యమాల
లోనే మకుటాయమానమైంది. ఆ ఉద్యమంలో అసమాన
వీరగాయక పరంపరలో తలనెత్తుకోతగిన మనిషి సుద్దాల
హనుమంతు.
హనుమంతు జీవితం తెలంగాణ సాయుధపోరు వేరు
వేరు కావు ఒక్కటే. ఆయన పాటలన్నీ ఉద్యమ ప్రేరణనిచ్చే
అగ్నిగీతాలే. మానవత్వం పరిమళించే సౌమ్యగీతాలూ
వున్నాయి. బతుకే పాటైనవాడు. పాటను పోరుబాటగా
వేసినవాడు బతుకంతా సమసమాజ స్వప్నాన్ని శ్వాసించిన
సుద్దాల హనుమంతు తెలంగాణకే కాదు సమస్త ఉద్యమ
ప్రపంచానికి వైతాళికుడే.
తెలంగాణ (458 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
cqje8otnwb92mw0qc624q9d9x6vwljx
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/480
104
212185
553094
2026-04-15T06:58:43Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '132 సాంఘిక సేవా రంగంలో కృషి చేసిన మహిళలెందరో ఉన్నారు. సమాజంలో వున్న దురాచాలను రూపుమాపటానికి వారంతా దీక్ష పూనినవారే. అనాధలు, పతితలు, భ్రష్టులు లాంటి వారెవరైనా సరే, వారందరికీ...'
553094
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>132
సాంఘిక సేవా రంగంలో కృషి చేసిన మహిళలెందరో
ఉన్నారు. సమాజంలో వున్న దురాచాలను
రూపుమాపటానికి వారంతా దీక్ష పూనినవారే. అనాధలు,
పతితలు, భ్రష్టులు లాంటి వారెవరైనా సరే, వారందరికీ
తమవంతు సేవలందించటానికి వెనుకాడక ముందుకొచ్చే
సాంఘిక సేవా తత్పరులైన మహిళామణులకు సమాజం
ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే.
సాంఘిక సేవారంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని
పొంది, తెలంగాణా ప్రాంతం నుంచి వచ్చిన గొప్ప నాయకురాలు
సుమిత్రాదేవి. దళితవాడలో పుట్టి, మహోన్నత వ్యక్తిత్వంతో
అలరారిన సుమిత్రాదేవి విశిష్టమైన సేవలందించిన
సంఘసేవిక, సంస్కారహృదయం మానవీయ విలువలకు
పట్టం కట్టిన ఆదర్శమహిళ దళితురాలై, సాంఘిక
సేవాతత్పరురాలై విశేషమైన కీర్తి నార్జించిన వ్యక్తి సుమిత్రా
దేవి.
ఈమె వివాహమాడిన వ్యక్తి క్షత్రియవంశీయుడైన
దేవీప్రసాద్. సుమిత్రాదేవి, దేవిప్రసాద్ ది ఆదర్శదాంపత్యం.
భర్తను గురువుగా భావించి వారి అడుగుజాడలలో నడిచి,
వారి ఆశయాలకు అనుసరించింది సుమిత్రాదేవి. సంఘసేవ,
దేశసేవ లక్ష్యంగా జీవితాన్ని సార్థకం చేసుకుంది సమిత్రాదేవి.
తన భార్య కూడా తనతోబాటు రాజకీయల్లోకి రావాలని,
తోటి మానవులకు సేవలందించాలని కోరుకున్నారు
సుమిత్రాదేవి
- డా॥ ముక్తేవి భారతి
దేవీప్రసాద్ గారు. భార్య సుమిత్రాదేవిని గాంధీయవాదిగా
తీర్చిదిద్దారు. గాంధీ సిద్ధాంతాలు ప్రచారం చేస్తూ, గాంధీ
శిష్యురాలయింది సుమిత్రాదేవి. సత్యాహింసలు గాంధీగారి
ఆయుధాలైతే, అవే తనూ స్వీకరించాలని త్రికరణశుద్ధిగా
విశ్వసించింది సుమిత్రాదేవి. గాంధీగారి వార్థా ఆశ్రమం
ఆమెను చాలా ఆకర్షించింది. వార్ధా ఆశ్రమంలో గాంధీ
గారితోపాటు సేవాకార్యక్రమాలు చేస్తూ మూడు సంవత్సరాలున్నా
రక్కడ. అక్కడనుంచి శ్రమసేవిక శిక్షను పొందటం
సుమిత్రాదేవి జీవితంలో గొప్ప మలుపు.
సుమిత్రాదేవి కులమతాలకు అతీతంగా ఎదిగి
పోయారు. గొప్ప కవయిత్రి అయిన సరోజినీ నాయుడుతోను,
గడ్డిమోపు నెత్తినపెట్టుకు అమ్ముకునే ఆడవాళ్ళతోను సమంగా
సమరస భావంతో మెలిగి అందరి మన్ననలను పొందారు.
సుమిత్రాదేవిని అందరూ కూడా అక్క అని ఆత్మీయంగా
పిలిచేవారు. అలాగే భావించి గౌరవించేవారు.
సుమిత్రాదేవి ఎన్ని పదవుల్లో వున్నా, అపదవులు
ప్రజాసంక్షేమం కోసమే ఉపయోగించారు.
సుమిత్రాదేవి రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలయ్యారు
నగరపురపాలక సంఘం ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు.
గృహపరిశ్రమల సలహా సంఘ సభ్యురాలు. జిల్లా డెవలప్
మెంటు బోర్డు సభ్యురాలు. వెనుకబడిన తరగతుల సంస్థకు
ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ సర్వీసుకు సభ్యురాలు
తెలంగాణ 459 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
9udbuu5kkftvnzfjf0e4lw32ekwtukp
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/481
104
212186
553095
2026-04-15T06:59:09Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గౌరవ మెజిస్ట్రీటు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సిండికేట్ సభ్యురాలు. ఈ పదవులేవీ ఆమెకి అధికారాన్ని, అహం కారాన్ని అందియలేదు. ఈ పదవులు బాధ్యతలు ఆమెను సంఘ సంస్కర్తగా, దళిత వర్గాల స...'
553095
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గౌరవ మెజిస్ట్రీటు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సిండికేట్
సభ్యురాలు. ఈ పదవులేవీ ఆమెకి అధికారాన్ని, అహం
కారాన్ని అందియలేదు. ఈ పదవులు బాధ్యతలు ఆమెను
సంఘ సంస్కర్తగా, దళిత వర్గాల సేవలె దోహదం చేస్తాయి.
శాసన సభ్యులు ఆమె మాటను గౌరవించి సుమిత్రక్కా అని
పిలిచేవారు.
సుమిత్రాదేవి చేసిన మంచి పనులెన్నెన్నో. తన డబ్బు
ఖర్చు చేసి ఓ మంచి పనికి అంకురార్పణ చేసారు. అదే
చిక్కడపల్లి (హైదరాబాద్) లోని ఆర్య యువజన పాఠశాల.
ఈ పాఠశాలను ఎంతో విజయవంతంగా నడిపి, విద్యార్థులు
జీవితాలలో వెలుగు నింపారు.
గాంధీ మార్గాన అయిన సుమిత్రాదేవి, శాదీ,
చెరఖా ప్రచార కేంద్రాలు నెలకొల్పారు. అంతేకాక, సుమిత్రా
రాష్ట్ర కాంగ్రెస్ సభ్యురాలయినప్పుడు జగ్జీవన్ పాఠశాల
నడిపారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా
సత్యాగ్రహం చేసి అరెస్టయ్యారు.
సుమిత్రాదేవి గారి సంఘిక సేవాకార్యక్రమాలు ఎన్నో
మార్గాలలో సాగేవి. నిజాం ప్రభువు, కోడలు దుర్రెషనబేగమ్
గారి ఆధ్వర్యంలో నడుపబడే ఆహార ధాన్యాల చౌక
దుకాణాలలో సభ్యురాలిగా చేసారు.
సుమిత్రాదేవి గారు సంఘంలో సభ్యురాలిగా వుంటూ
కార్యనిర్వహణ దక్షురాలిగా పేరు పొందారు. అంధ్రయువతీ
మండలి కార్య నిర్వాహక సభ్యురాలిగా పనిచేసారు. నిజాం
రాష్ట్రంలో నిమ్నజాతి మహా సభకు అధ్యక్షురాలిగా ఎన్నికై,
చాలా సేవలందించారు దళిత సంఘాలకు చేయూతనిచ్చారు.
స్త్రీలకై సేవచేయుట ఆమె లక్ష్యమైంది. పోలీసు చర్య
తర్వాత, రెస్క్యూ వర్క్ ఆర్గనైజేషన్లో సభ్యురాలిగా చేరి స్త్రీలను
ఎన్నోవిధాలు రక్షించారు. దళితులకై ఐదువందల యిళ్ళ
కట్టించి, ఆ ఇళ్ళలో వారిని ప్రవేశపెట్టడం కోసం చాలా
శ్రమించారు. శాసన సభ్యురాలిగా ప్రజలమధ్యకెళ్ళి వారి
అవసరాలు కనుగొనేవారు సుమిత్రాదేవిగారు. ఆవిధంగా
రాజేంద్రనగర్, హయతనగర్, మేడ్చల్లకు ఎంతో మేలు
జరిగింది.
దళిత వాడలో మంచినీటి కరువును గుర్తించిన
సుమిత్రాదేవి చాలా ఆవేదన చెందారు. ఆమె బాధ్యతగా
అరవై మంచినీటి బావులు చెరువులు తవ్వించటం, మరపు
రాని మహోపకారం, విద్యుత్ దీపాలు పెట్టించారు. ఆమె
చేసే సేవా కార్యక్రమాలు చాలామందికి జీవనోపాధి
కల్పించాయి.
సుమిత్రాదేవి గారి మనసు సహకార వ్యవసాయ
పద్ధతిపై నిల్చింది. రెండువేలకు పైగా సహకార వ్యవసాయాన్ని
ప్రవేశపెట్టి గొప్ప ఉపకారం చేసారు. ఉప్పల అన్నోజీగూడ
గ్రామంలో దళితులకు భూమి మాత్రమే కాకుండా, భూమి
దున్నటానికి వారికి ఎద్దులను కూడా పంచిపెట్టడం ఎంత
ప్రత్యేకమైన పనో తల్చుకుంటే సుమిత్రాదేవి గారి సమర్థతకి
ఆశ్చర్యపోక తప్పదు.
సమాజంలో జరిగే అక్రమాలను, అన్యాయాలను
చూసి సహించలేకపోయేవారు. భార్య ఉండగా ద్వితీయ
వివాహం చేసుకోరాదనే చట్టం వచ్చింది. ప్రభుత్వోద్యోగులు
చేస్తే వారి ఉద్యోగాలు పోతాయి. ఇతరులు శిక్షార్హులే. ఈ
చట్టం స్త్రీలకు న్యాయం చేస్తుందనిపించింది సుమిత్రాదేవికి.
కాని ఒక విషయం ఆమె దృష్టికొచ్చింది. ఇద్దరు ప్రభుత్వ
డాక్టర్లు భార్యలుండగా మళ్ళీ వివాహం చేసుకున్న విషయం
ఆమెకు తెలిసింది. సుమిత్రాదేవి మనసు రగిలిపోయింది.
ఆ ఇద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆమె రాష్ట్ర
శాసనసభ వద్ద ఆ సంఘటనను పలువిధాల విమర్శించి,
స్త్రీకి జరిగే అన్యాయాన్ని సాటి స్త్రీగా తను క్షమించనని,
అందరి మనసులు కరిగేట్టుగా ప్రసంగించింది సుమిత్రాదేవి.
"ఆ ప్రసంగం చాలా చారిత్రాత్మకమైంది. ఇప్పటి
సభ్యుల హృదయాల్లో ఇంకా ఆ ప్రసంగం నిలిచేవున్నది
ప్పటికి” అని 'తేజోమూర్తులు' గ్రంథంలో ఇల్లిందల
సరస్వతీదేవిగారన్నారు.
సుమిత్రాదేవి దళిత జాతుల సంక్షేమానికే ఆమె
జీవితాన్ని అంకితం చేసిందంటే అతిశయోక్తికాదు. ఆమె
చదువుకోకపోయినా, దళిత పిల్లలుగూడ చదువుకోవాలని
ఆమె కాంక్షించింది. దళిత స్త్రీ జనాభ్యుదయ లక్ష్యంతో
ఉప్పుల గ్రామాలలో బాపుజ్ సేవా సదనాన్ని నిర్మించింది.
ముప్పయి మందిదాకా దళిత స్త్రీలు ఆ సమాజంలో చేరి
చేతిపనులలో శిక్షణ పొంది జీవనోపాధిని పొందారు.
బాలబాలికలు దగ్గర పాఠశాలల్లో చదువుకున్నారు. ఆర్య
చిరు తెలంగాణ (460 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
5jl67upqx7j2x2auj1pz5s54sq44jip
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/482
104
212187
553097
2026-04-15T06:59:32Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సమాజ పద్ధతులు ఆ సేవాసదనంలో ప్రవేశపెట్టారు. ప్రార్థన చేయుటం, కవాతు చేయటం, కర్రసాము నేర్వటం మొదలైనవి నిత్య కార్యక్రమాలు. నిస్వార్ధ సేవాపరాయమురాలైన సుమిత్రాదేవి రాజకీయ బాధ...'
553097
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సమాజ పద్ధతులు ఆ సేవాసదనంలో ప్రవేశపెట్టారు. ప్రార్థన
చేయుటం, కవాతు చేయటం, కర్రసాము నేర్వటం
మొదలైనవి నిత్య కార్యక్రమాలు.
నిస్వార్ధ సేవాపరాయమురాలైన సుమిత్రాదేవి
రాజకీయ బాధితుల కోసం ప్రభుత్వం యిచ్చిన పదెకరాల
భూమిని ఈ సంస్థకు విరాళంగా యిచ్చేసారు. ఆమెకు మంత్రి
పదవి ఇస్తామంటే తిరస్కరించారన్న విషయం వింటే ఆమె
వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలుస్తుంది.
సుమిత్రాదేవి విశిష్ఠ వ్యక్తిత్వం గురించి ఎన్నో కోణాల
లో ఆవిష్కరించారు. ఇన్మందుల సరస్వతీదేవిగారు. “మా
తల్లి సల్లగుంటే మాకు బుక్కెడు బువ్వ దొరుకుద్ది” “మా
యమ్మ సల్లగుంటె తల దాచుకోటానికి గుడిసెయిస్తది” “ఆ
తల్లి సల్లగుంటే దున్నుకోటానికి చేరడు భూమియిస్తుంది”
చల్లటివేళ ఇలా దళిత వర్గాలు ఆమె దొడ్డ మనసునూ శక్తి
సామర్ధ్యాలను తలుచుకుని ఆశలను వెలిబుచ్చుకుంటూ
వుంటారు” అన్నారు. దీన జన బంధువుగా, కరుణామయిగా,
బీదలపాలిట పెన్నిధిగా సుమిత్రాదేవి అందించిన సేవలు
చిరస్మరణీయాలు.
సుమిత్రాదేవి గొప్ప సాహసవంతురాలు. చాలాసార్లు
రజాకార్లను ఎదిరించారు. చాలాసార్లు ఏదో వంకతో నేరం
మోపి, అరెస్టు చేసి వ్యానులో ఎక్కిస్తే సుమిత్రాదేవి
వారందరితో పోట్లాడి, వాదించి, వారిని బెదరగొట్టినపుడు,
రజకార్లు వ్యానులో ఆమెను ఊరంతా తిప్పి, ఆమెముందు
నిలువలేక, చివరకు, ఆ వ్యాన్ ఎక్కించిన స్త్రీలందర్నీ
హుస్సేన్
సాగర్ కట్టమీద వదలి వెళ్ళిపోవటం సుమిత్రాదేవి
ధైర్యసాహసాలకి, స్త్రీల విజయానికి ఉదాహరణలు.
రాజబహదూర్ వెంకటరామరెడ్డి కళాశాల భవనానికి
శంఖుస్థాపన జరగాలి. ఆ స్థలంలో దళితుల గుడిసె
లున్నాయి. ఆ గుడిసెలు తియ్యాలి. నాయకురాలు
సుమిత్రాదేవి ఆ గుడిసెలు తీయడానికి వీల్లేదంది.
మేమండ వున్న మాడపాటి హనుమంతరావుగారు
సుమిత్రాదేవిని బతిమాలాడారు. ఎన్నోవిధాల నచ్చచెప్పారు.
సుమిత్రాదేవి పట్టువీడలేదు. గుడిసెల సంగతి తేల్చకుండా
కళాశాల శంఖస్థాపన చేయనీయనంది. మరొకచోట స్థలం
చూపించండి. గుడిసెలు అక్కడ వేసుకోటానికి తగిన డబ్బు
ఇయ్యండి అని హనుమంతరావుగారితో మాట్లాడింది. ఆమె
మాట నెగ్గింది. వేరొకచోట గుడిసెల నిర్మాణం పూర్తయింది.
సుమిత్రాదేవి కళ్ళలో ఆనందభాష్పాలు. హనుమంతరావు
గారితో వాగ్వాదానికి దిగినా, ఆయనపై తనకున్న గౌరవంతో,
ఆ కాలనీకి హనుమంతరావు కాలని అని పేరు పెట్టడం
సుమిత్రాదేవి సహృదయం.
దళిత వర్గాలు అందరితో సమంగా హక్కులు
పొందాలనీ, వారిని ఉన్నతస్థాయిలో చూడాలని సుమిత్రాదేవి
కోరిక. దళిత వర్గాలు ఆమెను దేవతలా సేవిస్తారు. ఆమె
వారిపాలిట కల్పతరువని విశ్వసిస్తారు. ఆమె దళిత స్పృహతో
వారి జీవితాలలో వెలుగులు ప్రసరింపజేసిన తేజోమయి.
ఏ తెలంగాణ (461 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude>
if1ktnp8qfu3wgjq7k0j0fs0xy3p9e8
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/483
104
212188
553098
2026-04-15T07:00:18Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '133 చ రిత్ర గిరుల్ని చీల్చుకుంటూ సంస్కృతి సరితుల్ని గవేషించే నిశితమైన చూపు, గంభీరగళంతో స్వచ్ఛందమైన అభిప్రాయాల్ని ధీరంగా వెల్లడించే వాక్కు ఆత్మగౌరవాన్ని ప్రతిపదంలో విరజి...'
553098
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>133
చ రిత్ర గిరుల్ని చీల్చుకుంటూ సంస్కృతి సరితుల్ని
గవేషించే నిశితమైన చూపు, గంభీరగళంతో
స్వచ్ఛందమైన అభిప్రాయాల్ని ధీరంగా వెల్లడించే వాక్కు
ఆత్మగౌరవాన్ని ప్రతిపదంలో విరజిమ్మేగమనం, ఇతిహాస
పురాణ శాస్త్ర ప్రబంధాల ఆంతర్యాన్ని ఆకళించు కొన్న
జ్ఞానపిపాసి, సురవరం వారి ఆత్మీయగుణాలు. గోలకొండ
పత్రిక ఫిరంగి మోతలతో నిజాం గుండెలో దడ పుట్టించి
తెలంగాణ జనావళిని జాగృతం చేసిన ధీరుడాయన.
రాజకీయాలలోని కాలుష్యానికి దూరంగా స్వాతంత్య్ర
సమయసంజనితమైన ఉత్తమాభి రుచితో జీవితం సాగించిన
సంస్కార సంపన్నుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు.
విద్యార్థి దశలో వేదం వేంకటరాయశాస్త్రి, వీరేశలింగం
పంతులు, మానవల్లి రామకృష్ణకవిగారి జీవితాల నుంచి ఉ
త్తేజం పొంది రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. విద్యార్థి దశలో
ఎన్నో వైఫల్యాలను రుచిచూసి మేథాస్థాయిని పెంచుకున్నారు.
పరాజయాలను విజయసోపానాలుగా మలచుకోవడం
విద్యార్థి దశలోనే అలవరించు కున్నారు. వకీలు వృత్తిని
చేపట్టినా అది ఆయనకు రుచించలేదు. చిన్నప్పుడే వారి
పితృవ్యులు రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో హైదరబాదులో
కొత్వాలు వెంకటరామారెడ్డి గారి సహకారంతో తరువాత
హైదరాబాదును కార్యరంగంగా చేసుకున్నారు. విద్యార్థి
దశలోనే 'దేశబంధు' అనే పత్రికను స్థాపించాలని దినచర్య
పుస్తకంలో రాసుకున్నారు. హైదరాబాదు వాతావరణం
సురవరం ప్రతాపరెడ్డి
- డా॥ ఎల్లూరి శివారెడ్డి
రానురాను ఆయనకు నచ్చలేదు. తిరిగి వెళదామనుకున్నారు.
రాజా బహద్దరు వెంకటరామారెడ్డిగారు హైదరాబాదులోనే
ఆయనను ఉంచాలనే భావించి ప్రతాపరెడ్డికి ఇష్టమైన
పత్రికాస్థాపనకు అంగీకరించి ఆర్థికంగా సహకరించారు.
ఆ విధంగా 10-5-1026 నాడు గోలకొండ పత్రికను
ద్వైవార పత్రికగా వెలువరించారు. ఉర్దూ పత్రికలే తప్ప
తెలుగు పత్రికల ముఖం చూడని ఆనాటి పాఠకుల్లో
ప్రతాపరెడ్డిగారు తెలుగుభాషపట్ల భాషాభిమానాన్ని పెంచారు.
గోలకొండ పత్రికలో నిర్వహణలో ఆయన ఎన్నో చేదు
అనుభవాల్ని ఎదుర్కొన్నారు. ప్రతి చేదు అనుభవం ఆయనలో
కార్యదీక్ష పెంచింది. గోలకొండ పత్రిక సంపాదకత్వాన్ని
తరువాతి కాలంలో వదలుకోవలసి వచ్చినపుడు మిత్రుల
కోరిక మీద 'ప్రజావాణి' పత్రికకి కొన్నాళ్లు సంపాదకులుగా
వ్యవహరించారు. తెలుగుదేశం ఆ రోజుల్లో ఉద్దండపండితులై
పత్రికా సంపాదకత్వాన్ని స్వీకరించిన వారిలో కాశీనాధుని
నాగేశ్వరరావు పంతులుగారు, ముట్నూరి కృష్ణారావుగారు,
సురవరం ప్రతాపరెడ్డిగారు ప్రముఖులు.
సురవరం వారు గ్రంథాలయోద్యమానికి గణనీయసేవ
చేశారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావుగారు
గ్రంథాలయోద్యమానికి వారు చేసిన కృషి విశిష్టమైనదని
ప్రశంసించారు. 1930 మార్చినెలలో నిజాం రాష్ట్రాంధ్ర
ప్రధమ మహాసభ జోగిపేటలో వైభవంగా జరిగింది. ఆ
సభకు ప్రతాపరెడ్డిగారు అధ్యక్షులు. 'ఆంధ్రదేశపు మట్టి అది
తెలంగాణ 462 తేజోమూర్తులు booki<noinclude><references/></noinclude>
f88ski062bgro3liuf0eviy34eyo4ym
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/484
104
212189
553099
2026-04-15T07:01:19Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మాకు కనకము' అని గీతావళితో మారుమ్రోగిన ఆ సభలో రెడ్డిగారు భాషాసంస్కృతుల పరిరక్షణకు జనం నడుంకట్టాలని ప్రబోధించారు. ఆ రోజుల్లో హైదరాబాదులో ఏ సమావేశం. జరిగినా అందులో సురవరం వ...'
553099
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మాకు కనకము' అని గీతావళితో మారుమ్రోగిన ఆ సభలో
రెడ్డిగారు భాషాసంస్కృతుల పరిరక్షణకు జనం నడుంకట్టాలని
ప్రబోధించారు. ఆ రోజుల్లో హైదరాబాదులో ఏ సమావేశం.
జరిగినా అందులో సురవరం వారిది ప్రముఖపాత్ర. నిజాం
పరిపాలనలో అన్నివిధాలా మగ్గుతున్న తెలంగాణ జనావళిని
ఉద్బోధించటానికి ఎంతగా కృషిచేశారో గోలకొండ
పత్రికలోని రాతలు, రచనలు ఉదాహరణలు.
ప్రతాపరెడ్డిగారి రచనల్లో అన్నీ విశిష్టమైనవే. అయినా
ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషములు,
హిందువుల పండుగలు జాతి చెప్పుకోదగిన గొప్ప రచనలు.
కచకుచ వర్ణనలతో నిండిన ప్రబంధ రచనల్ని, సూక్ష్మేక్షికతో
పరిశీలించి అందులో జనసామాన్య జీవితాన్ని దర్శించారు.
ఆంధ్రుల సాంఘిక చరిత్రలో తూర్పు చాళుక్యయుగం నుంచి
పందొమ్మిదవ శతాబ్ది పర్యంతం ఆంధ్ర సంస్కృతిలోని ప్రధాన
విషయాల్ని తేటతెల్లం తెలిపి తెలుగువారికి సాంఘిక చరిత్ర
తత్త్వాన్ని చాటారు. 1949లో వెలువడ్డ ఆ గ్రంథం ఈనాటికి
అద్వితీయం. మర్యోగంథం తత్తుల్యమైనది. ఈనాటికి
వెలువడలేదు. అదే ఈనాటికి పరిశోధకులకు కరదీపిక.
ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రసాహిత్య బహుమతి పొందిన
తొలిగ్రంథం. ఈ బహుమతిని వారు అప్పటికి కీర్తిశేషులు
రావడం వల్ల వారి శ్రీమతి స్వీకరించారు. 'హిందువుల
పండుగలు' భారతీయుల - ముఖ్యంగా తెలుగువారి పర్వాల్ని,
వ్రతాల్ని గురించి విశదపరుస్తుంది. పండుగల వెనుక ఉన్న
పరమార్థాన్ని చారిత్రక దృష్టితో సమీక్షించారు. ఆయన
సత్యదృష్టి ముందు ఏ మతమౌధ్యాల అడ్డుగోడలు నిలువవు.
శాస్త్రీయ దృక్పథంతో విషయ విశ్లేషణ చేయడం వారికి
వెన్నతో పెట్టిన విద్య 'రామాయణ విశేషములు' ఆయన
గ్రంథావలోకన దక్షతకూ, విచక్షణ శీలానికి నిదర్శనం.
వాల్మీకి రామాయణాన్ని ఆధ్యాత్మిక కోణం నుంచి భావించడం
వేరు, శాస్త్రీయ దృక్పథంతో అనుశీలించడం వేరు. ఒక్కొక్క
శీర్షిక క్రింద చర్చించిన విషయం ఆయన విషయ
పరిజ్ఞానానికి మచ్చుతునక. మనకు తెలియని ఎన్నో విశేషాల్ని
రాసులుగా పోసి రచనలు చేశారు. ఈనాడూ అది చాలా
విలువైన గ్రంథం.
సురవరం వారు మంచి కవితలు సృజించారు.
మహబూబునగరు భాషలో సీసాలు దండకాలు రచించారు.
అవి బాగ నీవు అట్టుడు సోని కిష్కింత సేపు కాక్షాత్తి పోసే
కసేపు, ఫైటాలదుకునంలో పది పేర్లనంజర ఇవ్చిచ్క రారోరి
ఎల్లపోడు' అని రచించడం మాండలికం మీద ఆయన కున్న
అభిమానానికి నిదర్శనం. ప్రబంధరచనల్ని పుసిలించిన
సురవరంవారు ఆ స్థాయిలోనే గొప్ప పద్యాలు నిర్మించారు.
చూడండి.
పరిపూర్ణాభావనాంభస్తరంగోద్వేగ
గౌతమీ గంభీర గమనమునకు
ఆలంపురీ నందనారామ విభ్రాజి
మల్లో ఫలరాజి మధురరుచికి
ఇంద్రకుమారీ సమాయుక్త పరిపూత తుంగాపయస్సు
మాధుర్యటనకు
ఖండశర్కర జాజఖర్జూదగోక్షీర ద్రాక్షాదియుత
రామరసమునకును
అమృతనిష్యంద వల్లకాహ్లాదమునకు, రాగిణీ
దివ్యనమ్మోహరాగమునకు
తేనెతేటంపు నవకంపుసోనలకును, సాటియగును మా
తెనుగు భాషామతల్లి
ప్రాంతీయాభిమానం ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తు
న్నది. జాతీయాభిమానం, రాష్ట్రీయాభిమానం, ప్రాంతీయాభి
మానం ఆయన మనసులో ముప్పేటలుగా అల్లుకున్నాయి.
మద్యపానం గురించి దానివల్ల సంక్రమించే అవలక్షణాలను
గురించి సరళంగా, సరసంగా చెప్పారు. "ధనమా వ్యయమై
పోవును, మనమా చురుకుందనమును మానును, యశమా
దినదినమును క్షీణించును. తనువా చెడిపోవు కల్లు ద్రావుట
చేతన్” అన్నారు. ప్రతాపరెడ్డిగారి పద్యాలను సేకరించి
ప్రచురించగలిగితే ఒక చక్కని కవితా సంపుటి సిద్ధమవు
తుంది. సురవరం వారు తెలంగాణా గ్రామీణ జీవితాన్ని
చిత్రిస్తూ ప్రముఖంగా పదమూడు కథలు రచించారు. ఆ
కథల్లో నిజాం ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తు వస్తున్న
యువకుల్లోని ఆవేశాన్ని చిత్రించారు. ఇక ఆయన కథారచన
శిల్పానికి తలమానికం 'నిరీక్షణ' కథ. ఇది అనేక భారతీయ
భాషల్లోకి అనూదితమైంది. 'నా కథల్లో ఉర్దూపదాలు కొంచెం
ఎక్కువే అని ఆయనే చెప్పుకున్నారు. అవి ఒక సంపుటంగా
వెలువడ్డాయి. ముఖ్యంగా 'వింత విడాకులు' కథ చదివితే
నాటి తెలంగాణ సామాజిక వాతావరణం కళ్లముందు
చతురుడు తెలంగాణ (463 తేజోమూర్తులు ఉండటం<noinclude><references/></noinclude>
a3oxn2u5pfic90eoo94c0pixvgphhj0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/485
104
212190
553100
2026-04-15T07:01:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కదలాడుతుంది. వారు అణాగ్రంథమాల పక్షాన రెండు చిన్నకథా సంపుటులు 'మొగలాయి కథలు' అనే పేరుతో వెలువయించారు. అవి చక్కని అధిక్షేప రచనలు. నిజాం కాలం నాటి అధికారుల దౌర్జన్యాన్ని అధిక...'
553100
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కదలాడుతుంది. వారు అణాగ్రంథమాల పక్షాన రెండు
చిన్నకథా సంపుటులు 'మొగలాయి కథలు' అనే పేరుతో
వెలువయించారు. అవి చక్కని అధిక్షేప రచనలు. నిజాం
కాలం నాటి అధికారుల దౌర్జన్యాన్ని అధిక్షేపించిన ఈ కథల్లోని
వ్యంగ్యధోరణి ఎంతో సరసంగా ఉంది.
'హైందవ ధర్మవీరులు'లో ప్రతాపరెడ్డిగారి దేశాభిమానం
నిలువెత్తుగా నిలిచింది. సోమనాద్రి, తానాజీమాలు సురే
లాంటి కథలు కణకణలాడే నిప్పుకణికలు. ఇది ఆనాడూ
ఈనాడూ పఠనీయగ్రంథం. రాజతరంగిణిలోని వస్తువును
ఆధారంగా తీసుకొని ''ఉచ్ఛల విషాదం' నాటకాన్ని రచించారు.
ఇది విషాదాంత నాటకం. 'మనసువాసనలిచ్చి గాలికి
తలయూచి మరునాడువాడునే మల్లెపువువ' లాంటి
మనోజ్ఞమైన పద్యాలు ఇందులో ఉన్నాయి. ఇక మరొక
నాటకం 'భక్త తుకారాం'. భక్తతుకారాం నాటకాన్ని భక్తి
అనురాగాల భావసంగమంగా, రసతీర్థంగా తీర్చిదిద్దారు.
చక్కని నుడికారంతో వ్యావహారిక భాషలో రచించింది ఈ
నాటకం. భక్త చరిత్రలో మహిమల జోలికి పోకుండా
జీవితంలోని ఉదాత్తతను ప్రకటించడం సురవరంవారి
మానవతాదృష్టికి ఎత్తిన మణిదీపం. ఆయన వందలకొలది
వ్యాసాలు రచించారు. ఎవరూ ఊహించని అంశాలపై వారు
వ్యాసాలు రచించారు. మామిడిపండు, తాంబూల సేవనం
లాంటివి నాటికి సరికొత్త అంశాలు. లిపి సంస్కరణ గురించి
లఘుపుస్తకం వెలువరించారు. అందులో కన్నడ తెలుగులకు
ఏకలిపి ఎలా ఉండవచ్చో సూచనలు చేశారు.
ప్రపంచభాషలకు ఏకలిపిని ప్రతిపాదిస్తూ జార్జ్
బెర్నాడెకు లేఖరాశారు. వయోజనవిద్య కోసమని
'యుమున విజ్ఞానము' అనే గ్రంథాన్ని సంతరించారు.
సామాన్యజనానికి రాజ్యంగ విధానాన్ని తెలియపరచటానికి
ప్రణాధికారములు, ప్రాథమిక స్వత్వములు' అనే గ్రంథాలను
రచించి ప్రకటించారు. ఆయన సంఘసంస్కరణ వాంఛ ఎంత
ప్రగాఢమైందో ' సంఘోద్ధరణం' గ్రంథం చెబుతుంది.
పల్లెపట్టుల వన తెలిసినవారు గనుకనే 'గ్రామజనదర్పణం
గ్రంథం రచించారు. అనేక జానపద గాధలు సేకరించి
అనాదృతాలైన ఆ పాటల విశిష్టతను లోకానికి చాటి చెప్పారు.
గోలకొండ పత్రికలో అనేక జానపద గేయాలు ప్రకటించి
వాటి ప్రాముఖ్యతను స్పష్టీకరించారు. తాళపత్రగ్రంథాలు
సంపాదించి పండిత పరిషత్తులకు అందించారు. సురవరం
వారి గ్రంథ పరిష్కరణకు, పీరికారచనకు వావిళ్లవారు
ప్రకటించిన 'శుకసప్తతి' ఒక నిదర్శం. ఎవరో తెలంగాణలో
కవులు లేరు అని చులకనగా మాట్లాడితే అలాంటి వారి
నోరు మూయించడానికి తెలంగాణలోని ప్రముఖులైన 354
మంది కవులతో 'గోలకొండ కవుల సంచిక' వెలయించి
తెలంగాణ సాహిత్యవేత్తల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. 'విజ్ఞాన
వర్ధినీ పరిషత్తు స్థాపించి ఎందరో రచయితల్ని పరిశోధకు
లను తీర్చిదిద్దారు. ప్రతాపరెడ్డిగారు వ్యక్తికాదు ఒక సంస్థ
అన్నది అక్షరాలా యథార్థమే.
ప్రతాపరెడ్డిగారు రాజకీయాల్లోకి ప్రవేశించినా
పులు గడిగిన ముత్యంలా ప్రకాశించారు. వనపర్తి నుండి
1952లో శాసనసభా సభ్యులుగా ఎన్నికయ్యారు. తెలుగు
వారందరూ ఆయన విద్యామంత్రి అవుతారని ఆశించారు.
జరిగిన పరిణామాలను చూసి సురవరం వారు 'నేనూ నా
వంటివారు రాజకీయాల చీకటి బజారులో పనికిరామని'
స్నేహితునికి లేఖ రాశారు. ఆయనవి ఎప్పుడూ తెలుగువారి
అలసత్వానికి పరితపించే పెదవులు. తెలుగువారిలో
రవీంద్రనాథులు, బంకించంద్రులు, జగదీశచంద్ర బోసులు,
తిలర్లు, భండార్కర్లు మృగ్యమైపోయారని ఆయన ఆవేదన.
ఆయన తెలుగువారికి వెలుగులు చూపిన దీపస్తంభం.
అంటుంటే తెలంగాణ 464 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
jnyzgd5pkbg1u5ppy228dni4hn5vuky
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/486
104
212191
553101
2026-04-15T07:02:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '134 టి. మాధవరావు -వారాల ఆనంద్ తె లంగాణ తొలితరం సినీ దర్శకుల్లో తాళిబొట్టు మాధవరావుది ప్రముఖస్థానం. 1970లో తీసిన మొట్టమొదటి చిత్రం 'తాళిబొట్టు'తో టి. మాధవరావు ఇంటిపేరు తాళి బొట్ట...'
553101
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>134
టి. మాధవరావు
-వారాల ఆనంద్
తె లంగాణ తొలితరం సినీ దర్శకుల్లో తాళిబొట్టు
మాధవరావుది ప్రముఖస్థానం. 1970లో తీసిన
మొట్టమొదటి చిత్రం 'తాళిబొట్టు'తో టి. మాధవరావు
ఇంటిపేరు తాళి బొట్టు అయిపోయింది. ఆ సినిమాలో కృష్ణ,
విజయనిర్మల, కృష్ణంరాజు, రాజబాబు, రమాప్రభలు ముఖ్య
తారాగణంగా పనిచేశారు. కె.వి. మహదేవన్ సంగీతాన్ని
అందించిన ఈ సినిమాకు తానే స్వయంగా రచన
చేసుకున్నారు మాధవరావు. 1984లో హనుమకొండలో
జన్మించిన మాధవరావు ఇంటిపేరు తిరునగరి. వరంగల్
మెట్రిక్ పూర్తయింతర్వాత కొంతకాలం టీచర్ గా
పనిచేశారాయన. చిన్నప్పటినుంచే నటనపట్ల ఆసక్తికలిగిన
మాధవరావు మాద్రాస్ సినీరంగంలో ప్రవేశించాడు. హాస్య
పాత్రలు, మోనోయార్టింగ్ బాగా చేసే మాధవరావు గాత్రం
కూడా బాగా వుండేది. బాగా పాడేవారు. కొంతకాలం
హిందూస్థానీ సంగీతం కూడా నేర్చుకున్న మాధవరావు
మిత్రులందరి ప్రోత్సాహంతో సినిమాలో చేరేందుకు
1968లో మద్రాస్ రైల్ ఎక్కేశాడు.
మొదట గాయకుడిగా సినిమాల్లో చేరేందుకు
ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ అప్పటికే అనేకమంది
గాయకులు రంగంలో వుండడం మాధవరావు తెలంగాణ
నుంచి రావడం వల్ల సంగీత రంగంలో ఆయనకు ప్రవేశం
లభించలేదు. అయినా నిరాశ చెందకుండా ఎట్లో ఒకతీరు
సినిమాల్లో ప్రవేశించడమే లక్ష్యంగా మద్రాసులో వుండి
పోయాడు. సినిమాలకు సంబంధించి ఏ అవకాశం వచ్చినా
వదలకుండా పనిచేయడం ఆరంభించాడు. మద్రాస్ వెల్ళినా
రెండేళ్లకు దర్శకుడు జగన్నాథ్ వద్ద 'శ్రీకృష్ణ రాయబారం'
సినిమాకు సహాయ దర్శకుడిగా చేరిపోయాడు. దాని తరువాత
వెంటనే సేలంలో తయారయిన బి. ఎస్. నారాయణ
దర్శకత్వం వహించిన 'మాంగల్యం' సినిమాకు సహాయ
దర్శకుడిగా పనిచేశాడు. అక్కడే ఆయనకు ప్రముఖ కవి,
సినీ రచయిత ఆత్రేయతో పరిచయం ఏర్పడింది.
ఆత్రేయకు మాధవరావులోని అంకితభావం నచ్చి
అభిమానంతో సహకరించడం మొదలు పెట్టాడు. ఆ
పరిచయం ముందుకు వెళ్లడానికి మాధవరావుకు ఎంతో
వుపయోగపడింది. అప్పటికీ ఆత్రేయ సినీరంగంలో విజయ
వంతమయిన కవిగా నిలబడ్డాడు. ఆదుర్తి సుబ్బారావు లాంటి
వాళ్లతో కలిసి అనేక సినిమాలకు పనిచేశాడు. ఆత్రేయ
సూచనల మేరకు మాధవరావుకు ఆదుర్తి దగ్గర సహాయ
దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. 1961 నుంచి
దాదాపు దశాబ్ద కాలంపాటు వారి సహచర్యం నిలిచింది.
ఆదుర్తి వద్ద దర్శకత్వం, ఫిల్మ్ టెక్నికకు సంబంధించి అనేక
అంశాలు నేర్చుకున్నానని మాధవరావు చెప్పుకున్నారు.
1962లో 'మంచి మనసులు', 1964లో 'మూగమనసులు',
1965లో 'తేనెమనసులు', 1966లో 'కన్నె మనసులు',
1968లో 'సుడిగుండాలు' తదితర సినిమాలకు సహాయ
దర్శకుడిగా పనిచేశారు. తర్వాత హిందీ సినిమాలు మిలన్,
చేతులు తెలంగాణ 465 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
r55na8ps6outui94l8zgj20wpeptlz2
పుట:Sangitarasataran022902mbp.pdf/10
104
212192
553106
2026-04-15T07:33:53Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553106
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవ.— ఆహా! యేమి యీరాజపుత్రుని వేదాంతము? నానాట వెట్టితనమునఁబడు చున్నదే. అందుచేనెుకయుక్తివెదకి వీనియున్మాదము
పోఁదోలేదఁగాక.
{{right|(ఒక ఋషి ప్రవేశించును)}}
{{Center|{{p|fs125}}పాట. సురటి - ఆదితాళము</p>}}
{{left margin|5em}}<poem>ఋషి —— దయాసత్యశాచంబులే గురుతపఃఫలం బెంచు౯ ఇల {{right|దయా}}
తత్వముశాస్త్రము ధర్మము లెల్ల౯
{{right|దయా}}
ధర్మంబిదియంచు౯ గణించు౯
పరపీడనమే పాపంబనుచు౯
ప్రాజ్ఞుఁడుయోజించు౯ ద్యజించు౯</poem> </div>
{{right|దయా}}
దేవ— (తనలో) ఎవ్వఁడో మునివర్యుఁడిట్లు వచ్చుచున్నాఁడు. ఇది మంచి సమయము గదా! (ప్రకాశముగా) మునివర్యా! నమస్కరించుచున్నాను. వెదుకఁబోయిన తీఁగపాదములకుఁ దగిలెనన్న రీతిని మాపుణ్యవశమున మీదర్శనము చేకూఱెను. ఆయెదుటనున్న రాజకుమారునకును నాకును నొకధర్మసందేహము కల్గి యింతవఱగును వాదులాడుచుంటిమి. నాకోలందగిలి నింగినుండి యాతని చేతను వ్రాలిన నారాయంచను నాకొసంగుమనిన నీయకున్నవాఁడు. ఇదియేటితగవు?
సర్వా - కరుణామయా! ఈ పులుఁగు తనయొడలినంటిన బాణంబుతోఁగూడి బొట బొట నెత్తురులుగురియుచు నాకరంబుల దైవికంబుగా వాలిన, నాబాణము నూడ్చి నాశక్తికొలంది సాయమొసంగి ప్రాణరక్షణము సేయఁజూచుచున్నాఁడను. ఈ పక్షిరాజముపై, దీనింజంపిన శత్రువునకు స్వాతంత్య్రమెట్లుగలదు?
ఋషి - ఓహో! కార్యావసరంబున వేవేగంబోవుచున్న నాకిదియొక పెద్దచిక్కుపెట్టితిరే? రాజకుమారులారా! కానిండు. వినుండు.
గీ బాణహతిఁదీర్చి పోనున్నప్రాణమిచ్చి
కరుణఁజూపినమాత్రనే కాదుసుమ్ము
దైవికంబుగమెకనికై ధరణిఁగూలె
దేవదత్తార్థమిదికాదె తెలివిలేదె
రాజకుమారులారా! నేనింక నిలువఁదడవులేదు.
{{right|(అని నిష్క్రమించుచున్నాఁడు)}}<noinclude><references/></noinclude>
aik4o58jogknkqora1ueuug5xf3dht0
553108
553106
2026-04-15T07:34:51Z
Brjswiki
6801
553108
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవ.— ఆహా! యేమి యీరాజపుత్రుని వేదాంతము? నానాట వెట్టితనమునఁబడు చున్నదే. అందుచేనెుకయుక్తివెదకి వీనియున్మాదము
పోఁదోలేదఁగాక.
{{right|(ఒక ఋషి ప్రవేశించును)}}
{{Center|{{p|fs125}}పాట. సురటి - ఆదితాళము</p>}}
{{left margin|5em}}<poem>ఋషి —— దయాసత్యశాచంబులే గురుతపఃఫలం బెంచు౯ ఇల {{right|దయా}}
తత్వముశాస్త్రము ధర్మము లెల్ల౯
ధర్మంబిదియంచు౯ గణించు౯
పరపీడనమే పాపంబనుచు౯
ప్రాజ్ఞుఁడుయోజించు౯ ద్యజించు౯</poem> </div>
{{right|దయా}}
దేవ— (తనలో) ఎవ్వఁడో మునివర్యుఁడిట్లు వచ్చుచున్నాఁడు. ఇది మంచి సమయము గదా! (ప్రకాశముగా) మునివర్యా! నమస్కరించుచున్నాను. వెదుకఁబోయిన తీఁగపాదములకుఁ దగిలెనన్న రీతిని మాపుణ్యవశమున మీదర్శనము చేకూఱెను. ఆయెదుటనున్న రాజకుమారునకును నాకును నొకధర్మసందేహము కల్గి యింతవఱగును వాదులాడుచుంటిమి. నాకోలందగిలి నింగినుండి యాతని చేతను వ్రాలిన నారాయంచను నాకొసంగుమనిన నీయకున్నవాఁడు. ఇదియేటితగవు?
సర్వా - కరుణామయా! ఈ పులుఁగు తనయొడలినంటిన బాణంబుతోఁగూడి బొట బొట నెత్తురులుగురియుచు నాకరంబుల దైవికంబుగా వాలిన, నాబాణము నూడ్చి నాశక్తికొలంది సాయమొసంగి ప్రాణరక్షణము సేయఁజూచుచున్నాఁడను. ఈ పక్షిరాజముపై, దీనింజంపిన శత్రువునకు స్వాతంత్య్రమెట్లుగలదు?
ఋషి - ఓహో! కార్యావసరంబున వేవేగంబోవుచున్న నాకిదియొక పెద్దచిక్కుపెట్టితిరే? రాజకుమారులారా! కానిండు. వినుండు.
గీ బాణహతిఁదీర్చి పోనున్నప్రాణమిచ్చి
కరుణఁజూపినమాత్రనే కాదుసుమ్ము
దైవికంబుగమెకనికై ధరణిఁగూలె
దేవదత్తార్థమిదికాదె తెలివిలేదె
రాజకుమారులారా! నేనింక నిలువఁదడవులేదు.
{{right|(అని నిష్క్రమించుచున్నాఁడు)}}<noinclude><references/></noinclude>
33d5n6tvzbe5f3vp0ri81qj5ty9zlys
553109
553108
2026-04-15T07:38:07Z
Brjswiki
6801
553109
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవ.— ఆహా! యేమి యీరాజపుత్రుని వేదాంతము? నానాట వెట్టితనమునఁబడు చున్నదే. అందుచేనెుకయుక్తివెదకి వీనియున్మాదము
పోఁదోలేదఁగాక.
{{right|(ఒక ఋషి ప్రవేశించును)}}
{{Center|{{p|fs125}}పాట. సురటి - ఆదితాళము</p>}}
{{left margin|5em}}<poem>ఋషి —— దయాసత్యశాచంబులే గురుతపఃఫలం బెంచు౯ ఇల {{right|దయా}}
తత్వముశాస్త్రము ధర్మము లెల్ల౯
ధర్మంబిదియంచు౯ గణించు౯॥
పరపీడనమే పాపంబనుచు౯
ప్రాజ్ఞుఁడుయోజించు౯ ద్యజించు౯॥</poem> </div>
{{right|దయా}}
దేవ— (తనలో) ఎవ్వఁడో మునివర్యుఁడిట్లు వచ్చుచున్నాఁడు. ఇది మంచి సమయము గదా! (ప్రకాశముగా) మునివర్యా! నమస్కరించుచున్నాను. వెదుకఁబోయిన తీఁగపాదములకుఁ దగిలెనన్న రీతిని మాపుణ్యవశమున మీదర్శనము చేకూఱెను. ఆయెదుటనున్న రాజకుమారునకును నాకును నొకధర్మసందేహము కల్గి యింతవఱగును వాదులాడుచుంటిమి. నాకోలందగిలి నింగినుండి యాతని చేతను వ్రాలిన నారాయంచను నాకొసంగుమనిన నీయకున్నవాఁడు. ఇదియేటితగవు?
సర్వా - కరుణామయా! ఈ పులుఁగు తనయొడలినంటిన బాణంబుతోఁగూడి బొట బొట నెత్తురులుగురియుచు నాకరంబుల దైవికంబుగా వాలిన, నాబాణము నూడ్చి నాశక్తికొలంది సాయమొసంగి ప్రాణరక్షణము సేయఁజూచుచున్నాఁడను. ఈ పక్షిరాజముపై, దీనింజంపిన శత్రువునకు స్వాతంత్య్రమెట్లుగలదు?
ఋషి - ఓహో! కార్యావసరంబున వేవేగంబోవుచున్న నాకిదియొక పెద్దచిక్కుపెట్టితిరే? రాజకుమారులారా! కానిండు. వినుండు.
{{left margin|5em}}<poem>గీ॥ బాణహతిఁదీర్చి పోనున్నప్రాణమిచ్చి
కరుణఁజూపినమాత్రనే కాదుసుమ్ము
దైవికంబుగమెకనికై ధరణిఁగూలె
దేవదత్తార్థమిదికాదె తెలివిలేదె॥</poem> </div>
రాజకుమారులారా! నేనింక నిలువఁదడవులేదు.
{{right|(అని నిష్క్రమించుచున్నాఁడు)}}<noinclude><references/></noinclude>
2jf8mel3adlkwfj3ea8r3cb6i1mkzw5
553111
553109
2026-04-15T07:39:28Z
Brjswiki
6801
553111
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవ.— ఆహా! యేమి యీరాజపుత్రుని వేదాంతము? నానాట వెట్టితనమునఁబడు చున్నదే. అందుచేనెుకయుక్తివెదకి వీనియున్మాదము
పోఁదోలేదఁగాక.
{{right|(ఒక ఋషి ప్రవేశించును)}}
{{Center|{{p|fs125}}పాట. సురటి - ఆదితాళము</p>}}
{{left margin|5em}}<poem>ఋషి —— దయాసత్యశాచంబులే గురుతపఃఫలం బెంచు౯ ఇల
తత్వముశాస్త్రము ధర్మము లెల్ల౯
ధర్మంబిదియంచు౯ గణించు౯॥
పరపీడనమే పాపంబనుచు౯
ప్రాజ్ఞుఁడుయోజించు౯ ద్యజించు౯॥</poem> </div>
{{right|దయా}}
దేవ— (తనలో) ఎవ్వఁడో మునివర్యుఁడిట్లు వచ్చుచున్నాఁడు. ఇది మంచి సమయము గదా! (ప్రకాశముగా) మునివర్యా! నమస్కరించుచున్నాను. వెదుకఁబోయిన తీఁగపాదములకుఁ దగిలెనన్న రీతిని మాపుణ్యవశమున మీదర్శనము చేకూఱెను. ఆయెదుటనున్న రాజకుమారునకును నాకును నొకధర్మసందేహము కల్గి యింతవఱగును వాదులాడుచుంటిమి. నాకోలందగిలి నింగినుండి యాతని చేతను వ్రాలిన నారాయంచను నాకొసంగుమనిన నీయకున్నవాఁడు. ఇదియేటితగవు?
సర్వా - కరుణామయా! ఈ పులుఁగు తనయొడలినంటిన బాణంబుతోఁగూడి బొట బొట నెత్తురులుగురియుచు నాకరంబుల దైవికంబుగా వాలిన, నాబాణము నూడ్చి నాశక్తికొలంది సాయమొసంగి ప్రాణరక్షణము సేయఁజూచుచున్నాఁడను. ఈ పక్షిరాజముపై, దీనింజంపిన శత్రువునకు స్వాతంత్య్రమెట్లుగలదు?
ఋషి - ఓహో! కార్యావసరంబున వేవేగంబోవుచున్న నాకిదియొక పెద్దచిక్కుపెట్టితిరే? రాజకుమారులారా! కానిండు. వినుండు.
{{left margin|5em}}<poem>గీ॥ బాణహతిఁదీర్చి పోనున్నప్రాణమిచ్చి
కరుణఁజూపినమాత్రనే కాదుసుమ్ము
దైవికంబుగమెకనికై ధరణిఁగూలె
దేవదత్తార్థమిదికాదె తెలివిలేదె॥</poem> </div>
రాజకుమారులారా! నేనింక నిలువఁదడవులేదు.
{{right|(అని నిష్క్రమించుచున్నాఁడు)}}<noinclude><references/></noinclude>
dmx5yxgyrmfw7755mp3wrchbli6cea2
553113
553111
2026-04-15T07:41:43Z
Brjswiki
6801
553113
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవ.— ఆహా! యేమి యీరాజపుత్రుని వేదాంతము? నానాట వెట్టితనమునఁబడు చున్నదే. అందుచేనెుకయుక్తివెదకి వీనియున్మాదము
పోఁదోలేదఁగాక.
{{right|(ఒక ఋషి ప్రవేశించును)}}
{{Center|{{p|fs125}}పాట. సురటి - ఆదితాళము</p>}}
{{left margin|5em}}<poem>ఋషి —— దయాసత్యశాచంబులే గురుతపఃఫలం బెంచు౯ ఇల
::తత్వముశాస్త్రము ధర్మము లెల్ల౯
::ధర్మంబిదియంచు౯ గణించు౯॥
::పరపీడనమే పాపంబనుచు౯
::ప్రాజ్ఞుఁడుయోజించు౯ ద్యజించు౯॥</poem> </div>
{{right|దయా}}
దేవ— (తనలో) ఎవ్వఁడో మునివర్యుఁడిట్లు వచ్చుచున్నాఁడు. ఇది మంచి సమయము గదా! (ప్రకాశముగా) మునివర్యా! నమస్కరించుచున్నాను. వెదుకఁబోయిన తీఁగపాదములకుఁ దగిలెనన్న రీతిని మాపుణ్యవశమున మీదర్శనము చేకూఱెను. ఆయెదుటనున్న రాజకుమారునకును నాకును నొకధర్మసందేహము కల్గి యింతవఱగును వాదులాడుచుంటిమి. నాకోలందగిలి నింగినుండి యాతని చేతను వ్రాలిన నారాయంచను నాకొసంగుమనిన నీయకున్నవాఁడు. ఇదియేటితగవు?
సర్వా - కరుణామయా! ఈ పులుఁగు తనయొడలినంటిన బాణంబుతోఁగూడి బొట బొట నెత్తురులుగురియుచు నాకరంబుల దైవికంబుగా వాలిన, నాబాణము నూడ్చి నాశక్తికొలంది సాయమొసంగి ప్రాణరక్షణము సేయఁజూచుచున్నాఁడను. ఈ పక్షిరాజముపై, దీనింజంపిన శత్రువునకు స్వాతంత్య్రమెట్లుగలదు?
ఋషి - ఓహో! కార్యావసరంబున వేవేగంబోవుచున్న నాకిదియొక పెద్దచిక్కుపెట్టితిరే? రాజకుమారులారా! కానిండు. వినుండు.
{{left margin|5em}}<poem>గీ॥ బాణహతిఁదీర్చి పోనున్నప్రాణమిచ్చి
కరుణఁజూపినమాత్రనే కాదుసుమ్ము
దైవికంబుగమెకనికై ధరణిఁగూలె
దేవదత్తార్థమిదికాదె తెలివిలేదె॥</poem> </div>
రాజకుమారులారా! నేనింక నిలువఁదడవులేదు.
{{right|(అని నిష్క్రమించుచున్నాఁడు)}}<noinclude><references/></noinclude>
dnv5139q16ybgl1nb3v062f7xi9h0g6
553116
553113
2026-04-15T07:44:22Z
Brjswiki
6801
553116
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దేవ.— ఆహా! యేమి యీరాజపుత్రుని వేదాంతము? నానాట వెట్టితనమునఁబడు చున్నదే. అందుచేనెుకయుక్తివెదకి వీనియున్మాదము
పోఁదోలేదఁగాక.
{{right|(ఒక ఋషి ప్రవేశించును)}}
{{Center|{{p|fs125}}పాట. సురటి - ఆదితాళము</p>}}
ఋషి —— <poem>దయాసత్యశాచంబులే గురుతపఃఫలం బెంచు౯ ఇల
తత్వముశాస్త్రము ధర్మము లెల్ల౯
::ధర్మంబిదియంచు౯ గణించు౯॥
పరపీడనమే పాపంబనుచు౯
::ప్రాజ్ఞుఁడుయోజించు౯ ద్యజించు౯॥</poem>
{{right|దయా}}
దేవ— (తనలో) ఎవ్వఁడో మునివర్యుఁడిట్లు వచ్చుచున్నాఁడు. ఇది మంచి సమయము గదా! (ప్రకాశముగా) మునివర్యా! నమస్కరించుచున్నాను. వెదుకఁబోయిన తీఁగపాదములకుఁ దగిలెనన్న రీతిని మాపుణ్యవశమున మీదర్శనము చేకూఱెను. ఆయెదుటనున్న రాజకుమారునకును నాకును నొకధర్మసందేహము కల్గి యింతవఱగును వాదులాడుచుంటిమి. నాకోలందగిలి నింగినుండి యాతని చేతను వ్రాలిన నారాయంచను నాకొసంగుమనిన నీయకున్నవాఁడు. ఇదియేటితగవు?
సర్వా - కరుణామయా! ఈ పులుఁగు తనయొడలినంటిన బాణంబుతోఁగూడి బొట బొట నెత్తురులుగురియుచు నాకరంబుల దైవికంబుగా వాలిన, నాబాణము నూడ్చి నాశక్తికొలంది సాయమొసంగి ప్రాణరక్షణము సేయఁజూచుచున్నాఁడను. ఈ పక్షిరాజముపై, దీనింజంపిన శత్రువునకు స్వాతంత్య్రమెట్లుగలదు?
ఋషి - ఓహో! కార్యావసరంబున వేవేగంబోవుచున్న నాకిదియొక పెద్దచిక్కుపెట్టితిరే? రాజకుమారులారా! కానిండు. వినుండు.
{{left margin|5em}}<poem>గీ॥ బాణహతిఁదీర్చి పోనున్నప్రాణమిచ్చి
కరుణఁజూపినమాత్రనే కాదుసుమ్ము
దైవికంబుగమెకనికై ధరణిఁగూలె
దేవదత్తార్థమిదికాదె తెలివిలేదె॥</poem> </div>
రాజకుమారులారా! నేనింక నిలువఁదడవులేదు.
{{right|(అని నిష్క్రమించుచున్నాఁడు)}}<noinclude><references/></noinclude>
6bf185poaadmj3p04stsxmair9zs624
పుట:Sangitarasataran022902mbp.pdf/11
104
212193
553127
2026-04-15T08:16:15Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
553127
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>సేన — రాజకుమారా! ఈ యంచమాదేవదత్తునిదేయనియును నీయదికాదనియును నీ ఋషి చెప్పిపోయె. పక్షిని మాకొసంగుము. (లాగిపుచ్చుకోనఁబోవును).
దేవ - ఔను. సేవకా! సరియైనమాటచెప్పితిని. పక్షి మొసంగకున్న నీవేగ్రహింపుము.
ఛన్ను - సరిసరి. ఈఋషిసత్తముని వాక్యమును యదార్థముగా గ్రహింపనేరక దేవదత్తార్థనుని పలికినంతనే నీదేయనుకొంటివి కాఁబోలును.
సర్వా — ఆహా! యేమియీవినెూదము! కారుణ్యబుద్ధి కనపఱచుటంజేసియును దేవుఁడే నాచేతంబడునట్లు చేయుటచే దేవదత్తంబగుటను, ఈపక్షి నాదేయని ఋషివక్కాణించెంగాని నీ పేరు దేవదత్తుఁడనియు నదినీసొమ్మనియు నతఁడెఱిఁగి చెప్పినది కాదు. కావున నీమానసౌకంబు నీకియ్యంబనిలేదు.
దేవ —( కోపముతో) సేవకా! వీనితో వాదాడంబనియేమి? వీనిస్వభావమిదివఱకే యెఱింగియుంటిమి. నానాటనునున్మాదము ప్రబలమగు
చున్నది. తొండముదిరియు సరివెల్లియయ్యె. వీనింగూర్చి దీని తండ్రి కడనెఱింగింపవలసిన విషయము చాలఁగానున్నది. పోదము. రమ్ము.
{{right|(అని సేవకునితో నిష్క్రమించుచున్నాఁడు)}}
సర్వా — అవురా! కాలగతి! ఎంతవిపరీతముగానున్నది? మదమాత్సర్యాది దుర్గణ సమేతులై క్రూరులును, హింసాపరాయణులునగు మానవులకన్నులకు దయాసత్యాదిసాత్విక గుణంబులధర్మంబులుగానే తోచునుగదా!
గీ॥ పదుగురాచరించు పాపమేధర్మంబు
నీతిఁగఱపబోవ నిందయగును
కామిలోపహతుల కన్నులకఖిలంబు
గానిపించు||
లేని పసిమి
(అని ఛన్ను నితో ' నిష్క్రమించుచున్నాఁడు)<noinclude><references/></noinclude>
4ockqnpdy2bxe6sb775t84j0zdjbm6n
553132
553127
2026-04-15T09:06:15Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553132
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సేన — రాజకుమారా! ఈ యంచమాదేవదత్తునిదేయనియును నీయదికాదనియును నీ ఋషి చెప్పిపోయె. పక్షిని మాకొసంగుము. (లాగిపుచ్చుకోనఁబోవును).
దేవ - ఔను. సేవకా! సరియైనమాటచెప్పితిని. పక్షి మొసంగకున్న నీవేగ్రహింపుము.
ఛన్ను - సరిసరి. ఈఋషిసత్తముని వాక్యమును యదార్థముగా గ్రహింపనేరక దేవదత్తార్థనుని పలికినంతనే నీదేయనుకొంటివి కాఁబోలును.
సర్వా — ఆహా! యేమియీవినెూదము! కారుణ్యబుద్ధి కనపఱచుటంజేసియును దేవుఁడే నాచేతంబడునట్లు చేయుటచే దేవదత్తంబగుటను, ఈపక్షి నాదేయని ఋషివక్కాణించెంగాని నీ పేరు దేవదత్తుఁడనియు నదినీసొమ్మనియు నతఁడెఱిఁగి చెప్పినది కాదు. కావున నీమానసౌకంబు నీకియ్యంబనిలేదు.
దేవ — ( కోపముతో) సేవకా! వీనితో వాదాడంబనియేమి? వీనిస్వభావమిదివఱకే యెఱింగియుంటిమి. నానాటనునున్మాదము ప్రబలమగు
చున్నది. తొండముదిరియు సరివెల్లియయ్యె. వీనింగూర్చి దీని తండ్రి కడనెఱింగింపవలసిన విషయము చాలఁగానున్నది. పోదము. రమ్ము.
{{right|(అని సేవకునితో నిష్క్రమించుచున్నాఁడు)}}
సర్వా — అవురా! కాలగతి! ఎంతవిపరీతముగానున్నది? మదమాత్సర్యాది దుర్గణ సమేతులై క్రూరులును, హింసాపరాయణులునగు మానవులకన్నులకు దయాసత్యాదిసాత్విక గుణంబులధర్మంబులుగానే తోచునుగదా!
{{left margin|5em}}<poem>గీ॥ పదుగురాచరించు పాపమేధర్మంబు
నీతిఁగఱపబోవ నిందయగును
కామిలోపహతుల కన్నులకఖిలంబు
లేనిపసిమివన్నె గానిపించు॥</poem> </div>
{{right|(అని ఛన్ను నితో నిష్క్రమించుచున్నాఁడు)}}
{{rule |6em }}<noinclude><references/></noinclude>
5404nditx7itufzd7ftmd33hrh1009t
పుట:Sangitarasataran022902mbp.pdf/12
104
212194
553134
2026-04-15T09:18:25Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
553134
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}సంగీతరసతరంగిణి</p>}}
{{Center|{{p|fs125}}యను</p>}}
{{Center|{{p|fs125}}బుద్ధ నాటకము</p>}}
{{Center|{{p|fs125}}ద్వితీయరంగము ౼ రాజసదనము</p>}}
{{Center|'''(శుద్దోదనుఁడు మంత్రి దేవదత్తుఁడు మిత్రాచార్యుఁడు ప్రవేశించుచున్నారు)'''}}
శుద్దో - దేవదత్తా! నీవు పల్కినరీతీయెల్ల నాహృదయంబునకు నిక్కవముగానే కన్పట్టుచున్నది. చూడఁజూడ నా కొమరునిచర్యటెల్ల నాశ్చర్యమునే కల్గించుచున్నవి.
సీ॥ కాలెవ సంహార పాత్రలు లైనట్టి
కడ్యలబుద్ధిగలఁపఁడొర
రాజ్యతంత్రక్రియా ప్రాజ్యమార్గములందు ప్రాజ్ఞుఁడైబుద్ధిక స్పఱవఁడేన
రమ్య హవ్మ్యతిరాది కామ్యార్థ విచితిపై సౌమ్యానుభవలద్ధిఁజాటం ని
శృంగార వైభవానంద యాలాప ఫింగ్యా ల్ల సిత బుద్ధిఁ బడయఁడార
గీ కులుకుచునే తొండు తలంచునౌర
నిజనతలమున నేమొ భాపించునౌర
తోడి వారల
జన ఇడ వాడు కార
లవ లెనుండు సెఱుఁగంగఁ జాలనౌడ
దైవ మహాప్రభూ ! ఆపక్షి నిదానయెడీలో నిడుకొని యాతఁడొఁదినదుఃఖమిఁతని
వర్ణింపఁజాలనుగదా ! ఇట్టి మూర్ఖతగల రాజకుమారుఁడెట్లు నీ రాజ్యఁబు పరిపా
లించుమో చెప్పఁజాలను, 'మోరెత్తిన నాతోడయుద్ధమునకు సిద్ధమాయెను.
వీని నేమి సేయఁదలంచితివో నీవేయోజించవలయును.
దో— ఆచార్యవర్యా ! నాసుతునిజననంబు మహత్తరంబయినదనియును, నతఁడు
నియమకుభలు, ణలక్ష్మీ తుఁడనియును, సఖఁడ తేజోధనండనియును సప్తద్వీ
వసంయుతంబగు భూతలం బేలు చక్రవర్తియైన గావలయుననియు లేకున్న నస
మానతపోబలార్జిత అత్వజ్ఞానసంపన్నుండైనట్టి ధర్మగం స్థాపకుఁడైనను గావల
-<noinclude><references/></noinclude>
c9k7k9m9p4ho26jrb3dvlys0cx8ow05
553150
553134
2026-04-15T11:16:22Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553150
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}సంగీతరసతరంగిణి</p>}}
{{Center|{{p|fs125}}యను</p>}}
{{Center|{{p|fs125}}బుద్ధ నాటకము</p>}}
{{Center|{{p|fs125}}ద్వితీయరంగము ౼ రాజసదనము</p>}}
{{rule |6em }}
{{Center|'''(శుద్దోదనుఁడు మంత్రి దేవదత్తుఁడు మిత్రాచార్యుఁడు ప్రవేశించుచున్నారు)'''}}
శుద్దో - దేవదత్తా! నీవు పల్కినరీతీయెల్ల నాహృదయంబునకు నిక్కవముగానే కన్పట్టుచున్నది. చూడఁజూడ నా కొమరునిచర్యటెల్ల ::నాశ్చర్యమునే కల్గించుచున్నవి.
{{left margin|5em}}<poem>సీ॥ కాత్రవసంహారపాత్రంబులైనట్టి పౌత్రవిద్యలబుద్దిసలుపఁడౌర
రాజ్యతంత్రక్రియా ప్రాజ్యమార్గములందు ప్రాజ్ఞుఁడైబుద్ధికన్పఱచఁడౌర
రమ్యహవ్మ్యతిరాది కామ్యార్థ వితితిపై సౌమ్యానుభవలబుద్ధిఁజాటడౌర
శృంగారవైభవా నంగప్రియాలాప భంగ్యల్లసితబుద్ధిఁబడయఁడౌర</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ పలుకుఁబలుకుచు వేఱొండు తలంచునౌర
నిజనతలముననేమొ భాపించునౌర
తోడివారలజత విడవాడునౌర
బేలవలెనుండు సెఱుఁగంగఁ జాలనౌర</poem> </div>
దేవ - మహాప్రభూ! ఆపక్షినిదనయొడీలోనిడుకొని యాతఁడొఁదినదుఃఖమిఁతని వర్ణింపఁజాలనుగదా! ఇట్టి మూర్ఖతగల రాజకుమారుఁడెట్లు
::నీరాజ్యఁబు పరిపాలించుమో చెప్పఁజాలను. మోరెత్తిన నాతోడయుద్ధమునకు సిద్ధమాయెను. వీనినేమిసేయఁదలంచితివో నీవేయోజించ ::వలయును.
శుద్దో — ఆచార్యవర్యా! నాసుతునిజననంబు మహత్తరంబయినదనియును, నతఁడు నిరుపమశుభలక్షణలక్షితుందనియును, నఖండ
::తేజోధనుండనియును సప్తద్వీపసంయుతంబగు భూతలంబేలు చక్రవర్తియైనగావలయుననియు లేకున్న నసమానతపోబలార్జిత
::తత్వజ్ఞానసంపన్నుండైనట్టి ధర్మసంస్థాపకుఁడైనను గావల
-<noinclude><references/></noinclude>
nxr2lntgeuriws4ql7hf7gzxjoxk4j3
553152
553150
2026-04-15T11:17:57Z
Brjswiki
6801
553152
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}సంగీతరసతరంగిణి</p>}}
{{Center|{{p|fs125}}యను</p>}}
{{Center|{{p|fs125}}బుద్ధ నాటకము</p>}}
{{Center|{{p|fs125}}ద్వితీయరంగము ౼ రాజసదనము</p>}}
{{rule |6em }}
{{Center|'''(శుద్దోదనుఁడు మంత్రి దేవదత్తుఁడు మిత్రాచార్యుఁడు ప్రవేశించుచున్నారు)'''}}
శుద్దో - దేవదత్తా! నీవు పల్కినరీతీయెల్ల నాహృదయంబునకు నిక్కవముగానే కన్పట్టుచున్నది. చూడఁజూడ నా కొమరునిచర్యటెల్ల ::నాశ్చర్యమునే కల్గించుచున్నవి.
{{left margin|5em}}<poem>సీ॥ కాత్రవసంహారపాత్రంబులైనట్టి పౌత్రవిద్యలబుద్దిసలుపఁడౌర
రాజ్యతంత్రక్రియా ప్రాజ్యమార్గములందు ప్రాజ్ఞుఁడైబుద్ధికన్పఱచఁడౌర
రమ్యహవ్మ్యతిరాది కామ్యార్థ వితితిపై సౌమ్యానుభవలబుద్ధిఁజాటడౌర
శృంగారవైభవా నంగప్రియాలాప భంగ్యల్లసితబుద్ధిఁబడయఁడౌర</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ పలుకుఁబలుకుచు వేఱొండు తలంచునౌర
నిజనతలముననేమొ భాపించునౌర
తోడివారలజత విడవాడునౌర
బేలవలెనుండు సెఱుఁగంగఁ జాలనౌర</poem> </div>
దేవ - మహాప్రభూ! ఆపక్షినిదనయొడీలోనిడుకొని యాతఁడొఁదినదుఃఖమిఁతని వర్ణింపఁజాలనుగదా! ఇట్టి మూర్ఖతగల రాజకుమారుఁడెట్లు
::నీరాజ్యఁబు పరిపాలించుమో చెప్పఁజాలను. మోరెత్తిన నాతోడయుద్ధమునకు సిద్ధమాయెను. వీనినేమిసేయఁదలంచితివో నీవేయోజించ ::వలయును.
శుద్దో — ఆచార్యవర్యా! నాసుతునిజననంబు మహత్తరంబయినదనియును, నతఁడు నిరుపమశుభలక్షణలక్షితుందనియును, నఖండ
::తేజోధనుండనియును సప్తద్వీపసంయుతంబగు భూతలంబేలు చక్రవర్తియైనగావలయుననియు లేకున్న నసమానతపోబలార్జిత
::తత్వజ్ఞానసంపన్నుండైనట్టి ధర్మసంస్థాపకుఁడైనను గావల
-<noinclude><references/></noinclude>
lhfyjroyken9dn9rfla3uceuuc383m4