వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.46.0-wmf.24
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
పుట:Sarada Lekhalu Vol 1.pdf/40
104
59195
553164
552953
2026-04-15T12:24:24Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553164
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|16|శారదలేఖలు|}}</noinclude>కానీ యుండును. కాని యా దువ్వెనకే యొక రూపాయ వెలచేయు పనితనము చేయగల నిపుణులున్నారని వింటిని. కాని యా పనితన మరయు వారెవ్వరు? విదేశములనుండి దిగుమతియైన యా దువ్వెనల నిగనిగలరసి మోహపడువారేగాని మానుతో జేయఁబడిన యీమేలి దువ్వెనల జూచి మెచ్చువారెవ్వరు? చెక్క దువ్వెనయా! ఛీ ఛీ. ఎంత యవమానము. తలలో బెట్టగనే పుటుకు పుటుకున పండ్లు రాలుచున్ననుసరే, తల దూరక పోయిననుసరే, పేలు రాక పోయిననుసరే, మెఱుఁగున్న చాలును. మెఱుగే మన కన్నులలో కంపుకొట్టుచున్నది. దువ్వెనలకు మెఱుగు, గాజులకు మెఱుగు, గుడ్డలకు మెఱుగు, మొగములకు మెఱుగు! అన్నిటను మెఱుగే నవనాగరికులకు కావలసినది. ఈ విదేశపు మెఱుఁగులు మన మెఱుగును రూపుమాపుచున్నవను మెఱమెఱయొక్కరికిని లేదు. అది యట్లుండె; మిత్రమా! నే నొక్క మేలు బడసితిని. స్వదేశపు వస్త్రములతోఁబాటు స్వదేశపు గాజులనుగూడ ధరింతునని వ్రతముపూనితినని నీకుఁదెలియునుగదా! ఆగాజు లొక మాఱు దొరకియు నొకమారు దొరకకయు నేపడినశ్రమ వర్ణనాతీతము. ఈగాజులు లభ్యపడక వట్టి చేతులతోనుండ, గాజులు మానివైచితినని పెద్దవారలపోరు. అయ్యో! స్వదేశీగాజులు లభింపకపోయె. చూచి చూచి విదేశపు గాజులెట్లుధరింతునని నాకుచింత. ఈ స్థితియం
దొకానొకప్పుడుగాజుల గూర్చిన దీక్ష మిక్కిలి యవిచార్యముగ<noinclude></noinclude>
ens0zvrzn18vvntlrmbbdpw17jtiee3
పుట:Sarada Lekhalu Vol 1.pdf/41
104
59196
553168
552954
2026-04-15T12:29:52Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553168
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|17}}</noinclude>బూనితినిగదా యని భావించితిని. కాని విదేశపు గాజులుతొడిగి కొనుటకు మాత్రము పాల్పడలేదు. ఒకానొక మహానీయు డొకానొక స్త్రీలసభలో "తల్లులారా, మీరు విదేశపు గాజులు ధరించుట వలన సంవత్సరమునకు కోటి రూప్యములు విదేశముల పాలై పోవుచున్నవి. కోటి రూప్యములన నెన్నియనుకొంటిరి? ఆ రూప్యములన్నియు సంచులు కట్టివేసిన ఈహాలంతయు నిండి పోవును. అన్ని రూపాయలు విదేశపు వన్నెగాజులకు ధారపోయుచున్నారు.” అనిచెప్పిన వాక్యము లహర్నిశలు నాహృదయమున ప్రతిధ్వనించుచుండును. అందువలననే నేను విదేశపు గాజులనుండి రక్షింపఁబడితిని. ఇప్పుడు శ్రీజ్ఞానప్రసూనాంబిక కృపవలన రెండువందల యేబదిగాజులు కాళ్ళహస్తిలో చేయించి తెచ్చుకొంటిని. నాకఱవు తీరినది. గొల్ల పేరమ్మలాగున్నావని నీవు నవ్విన నవ్వుదువు గాక. చేతినిండ తొడిగికొనిన నల్లగాజులనుచూచుకొని నేను మహానందమున నుప్పొంగిపోవుచున్నాను. నా నల్లగాజులెంత చక్కగ నున్నవనుకొంటివి? బహు చక్కగ నున్నవి. సన్నమునకు నాబంగారుగాజులతో గలసిపోయినవి. మెఱుఁగునకు విదేశపుగాజులకు మించిపోయినవి. ఆ గాజులు వేసికొనగనే యానందముతో నా హృదయము నిండిపోయినది. కాని యా గాజులను చూడగనే నాకొక విధమైన విచారము గూడ గల్గినది. ఏలనందువా? ఇట్టి చక్కని గాజులు చేయగల<noinclude></noinclude>
ns0enepcdruwl386tzyw03tkq1ihwuk
పుట:Sarada Lekhalu Vol 1.pdf/42
104
59197
553169
552955
2026-04-15T12:33:52Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553169
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|18|శారదలేఖలు|}}</noinclude>సామర్థ్యముగల పనివారుండియు నేటేట కోటిరూపాయలు విదేశములకు ధారపోయు చుంటిమిగదా యని. - కాని మనస్త్రీలకు వన్నెచిన్నెలపై వ్యామోహము నశింపనివఱకు మనదేశపు పరిశ్రమ లభివృద్ధిజెందవు. దేశీయపరిశ్రమ లభివృద్ధిజెందినగాని మనదేశ మభివృద్ధిజెందదు. ప్రియమిత్రమా! అట్టి కళ్యాణదినములు మన భారతభూమి కెప్పుడు వచ్చునోగదా!
{{rh|భావపురి||ప్రేమంపుచెలి,}}
{{rh|1928 మే||శారద}}
{{rule|2cm}}<noinclude></noinclude>
nm52a61qifczjakymb586bqqjzeubj4
పుట:Sarada Lekhalu Vol 1.pdf/43
104
59198
553191
552957
2026-04-15T23:02:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553191
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|19}}</noinclude>'''సౌభాగ్యవతియగు కల్పలతకు :—'''
నెచ్చెలీ, ఒక శుభసమాచారము. ఏ కవయిత్రీమణి వాగమృతముల సెవులార గ్రోల ఖండ ఖండాంతర వాసులెల్ల రభిలాషతో నెదురుజూచుచుందురో, ఏవిదుషీమణి విమల వాగ్ఝరి ప్రవహించిన తమకష్టములెల్ల గొట్టుకొనిపోవునని వలస రాష్ట్ర భారతీయు లాసతో నాహ్వానింపుచుందురో ఏసాధ్వీమణి గంభీరోపన్యాస మాలింపవలెనని భారతీయులెల్ల రనిశ ముత్కంఠపడుచుందురో అట్టి సుప్రసిద్ధకవయిత్రియు, విదుష
మణియు నారీరత్నమునునగు శ్రీమతి సరోజినీదేవిగారి మహత్తరోపన్యాసమును ఈనెల 28 - 4 - 28 తేదీని మదనపల్లియందు వింటిని. నీవు వినలేదని యనుకొంటిని. లేఖామూలముగా దెలుపవచ్చును గదా యని మరల తృప్తిగంటిని.
ఈ పురము నందలి హిందూ స్త్రీసమాజమువారి యాజమాన్యమున పైసభ జరుపఁబడినది. నెమలి పట్టాభిరామరావు పంతులుగారి కొమార్తెయగు శ్రీమతి పద్మాసనీదేవి (బి.ఏ.,) గారు నాటిసభ కగ్రాసనాధిపురాలు. సమావేశమైన స్త్రీలు కొద్దిమందియైనను, వచ్చిన స్త్రీ లెల్లరు దాదాపుగా నాంగ్లభాషా పరిచయము లేని తెలుగు స్త్రీలేయైనను, శ్రీమతి సరోజినీ దేవిగారు మిక్కిలి శాంతముతో స్త్రీలకు సంబంధించిన పెక్కు విషయములను గుఱించి యుపన్యసించిరి. దేవి చెప్పిన<noinclude></noinclude>
i29k50li2w4ddhf3ow23y0npqi1z56y
పుట:Sarada Lekhalu Vol 1.pdf/44
104
59199
553192
552958
2026-04-15T23:11:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553192
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|20|శారదలేఖలు|}}</noinclude>ప్రతివాక్యమును నొక మహనీయుఁడు తెలుఁగుచేసి చెప్పెను. శ్రీ సరోజినీదేవిగారి యుపన్యాస సారాంశ మీవిధముగనుండెను.
"సోదరీమణులారా!
నేను నా కొమార్తె కనారోగ్యముగా నుండుటచే నిక్కడకువచ్చి యుంటిని. నేను వచ్చిన సందర్భము సంతాపకరమైనదేయైనను మిమ్ములనందఱను గలిసికొనుట సంభవించుటచే నాకు మిగుల సంతోషకరముగా నున్నది. నేను తెలుఁగుదేశపు స్త్రీని కాకపోయినను మీభాషా పరిచయము నాకు లేకపోయినను నేనుగూడ మీస్త్రీజాతికిఁ జెందిన దాననగుటచే మీకును నాకును సన్నిహిత సంబంధముగలదు. మీ సమాజ
స్థాపకురాలగు కజిన్సుదొరసానిగారు ఐరిషుదేశపుస్త్రీ. సర్వ విషయములను నామెకును మీకును నెంతయో భేదముగలదు. అయినను ఆమెవచ్చి మనదేశమున స్త్రీ సమాజమును స్థాపించి స్త్రీల యభివృద్ధికై పాటుబడుటకు గారణము ఆమెకును మీకునుగల స్త్రీత్వమే గదా. ఈమధ్య ఢిల్లీయందు భారత
మహిళాసభ జరిగినది. దానికి అధ్యక్షురాలు భోపాలు బేగముగారు. అమె మహమ్మదీయ స్త్రీ. ఆసభకు పూర్వము జరిగిన సభ కధ్యక్షురాలు బరోడామహారాణిగారు. ఆమె హిందూ యువతి. చూడుడు. ఒకామె హిందువు. ఒకామె ముసల్మాను. అయినను సభా విషయములలో నెట్టి యసందర్భము గలుగ లేదు. కాన ఆశయ మొక్కటైనపుడు జాతి మత భేదము లేవియు నడ్డుకొనవు. పైడిల్లీ మహిళాసభవారు స్త్రీలకు
సంబంధించిన పెక్కువిషయములనుగూర్చి చర్చించి<noinclude></noinclude>
5jvpn6amustttq0cccg2ap44qzej4su
పుట:Sarada Lekhalu Vol 1.pdf/45
104
59200
553193
552959
2026-04-15T23:17:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553193
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|21}}</noinclude>యున్నారు. బాలికలకు విధిగా విద్య నేర్పవలెననినారు. స్త్రీలకు నియోజక నియోజిత స్వాతంత్య్రము కావలెననినారు. అతిబాల్య వివాహము లనిర్ధకమనినారు. ఇంకను పెక్కు తీర్మానములు గావించియున్నారు. పై విషయములను గూర్చి మనదేశమునందు తీవ్రమైన యాందోళన జరుగుచునేయున్నది. కొన్నిట మనకనుకూలములుగూడ జరుగుచునేయున్నవి, ఇతర విషయములలో మన దేశపుస్థితి యెట్లున్నను నియోజిత నియోజక స్వాతంత్ర్యము మాత్రము మన స్త్రీలకు శీఘ్రముగానే లభించినది. పాశ్చాత్య స్త్రీలు విశేష పరిశ్రమచే గాని బడయజాలక పోయిన ఎన్నిక హక్కులు మనదేశపు స్త్రీలకు సులభముగా లభించినవి. తత్ఫలితముగా మీ మదరాసు రాష్ట్రశాసనసభకు ఒకస్త్రీ డిప్యూటీ ప్రెసిడెంటుగా నెన్నుకొనబడి
యున్నది. తిరువాన్కూరులో నొకస్త్రీ మంత్రిణిగా నియమింపఁబడి సమర్థతతో నిర్వహింపుచున్నది. ఇంకను పెక్కు స్థానికసభలలోను విద్యా సంఘములలోను స్త్రీలు సభ్యురాండ్రుగా నియమింపఁబడుచున్నారు. కాని యీ స్వాతంత్ర్యపు హక్కులు సమర్థతతో నిర్వహింప గోరుచో స్త్రీలు మంచి విద్యావతులుగా నుండవలెను. మనదేశపు స్త్రీల విద్యాభివృద్ధికి బాల్యవివాహములు ప్రతిబంధకముగా నున్నవి. వానిని రూపు మాపవలెను. మీరు లక్ష్మీపూజచేయుదురు, సరస్వతీ పూజచేయుదురు. గాని మీ బిడ్డలకు లక్ష్మీ ప్రసన్నతలేదు. సరస్వతీ ప్రసన్నత యసలేలేదు. లక్ష్మియన వేరేలేదు. సరస్వతి యన వేరేలేదు. స్త్రీ శక్తి స్వరూపము. కాన స్వశక్తిచే స్త్రీ,<noinclude></noinclude>
nvywh4nczdfpu4c9a6ucbl0m48apa6q
పుట:Sarada Lekhalu Vol 1.pdf/46
104
59201
553194
469850
2026-04-15T23:27:03Z
శ్రీరామమూర్తి
1517
/* మూల్యాంకన చేసారు */
553194
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{rh|22|శారదలేఖలు|}}</noinclude>లక్ష్మియు సరస్వతియు కావచ్చును. కాని యట్టిశక్తి యిప్పుడు విూలో స్తంభించిపోయినది. ఎట్టి సాహసకార్యములనైన చేయవలసిన విూ రిప్పుడు బిడియమునకును పిఱికిఁదనమునకును గుఱియై యశక్తలై పోయినారు. సీత, సావిత్రి మున్నగు విదుషీమణు లిట్టిబిడియమును పిఱికిఁదనమును గలిగియున్నచో నట్టి ప్రసిద్ధములైన కార్యముల చేయగలిగెడి వారేనా? కృష్ణుని వంటి బిడ్డలను కనగలిగెడివారేనా? ఇప్పుడు చూడుడు! కృష్ణుని వంటి కుమారుఁ డెక్కడైన కన్పడునేమో?
విూరు కాశీరామేశ్వరాది పుణ్యయాత్రల చేయతలంచు చుందురు. కాని యది చిన్నతనమున చేయవలసినది కాదనియు వార్థక్యమే దానికర్హ సమయమనియు అప్పుడే దానధర్మాది పుణ్యకార్యముల చేయవలయుననియు విూతలంపు. కాని భూతదయాపశ్చాత్తాపములచేతను జాతిమత భేదములు లేని విశ్వమానవ భ్రాతృత్వముచేతను నకల్మష హృదయముచేతను మనతనువే పుణ్యక్షేత్రముగా జేసికొనవచ్చును. జీవితమే యాత్ర. అన్నిటికిని మనస్సే ప్రధానము. చిత్తసంస్కారములేని యాత్రలవలన ఫలములేదు. తోడి మానవుల నస్పృశ్యులనుగా భావించుట తప్పు. మానవులంద ఱొకటె. స్త్రీ ప్రేమకు స్థానము. ఒక జంతువును చూడుడు. దానిబిడ్డ నెవరైన నేమియైన చేయవచ్చిన నెట్లు పోరాడునో, అట్లే స్త్రీగూడ తన బిడ్డల కేమైన ప్రమాదము వచ్చినచో తన ప్రాణమునైన నర్పించుటకు సాహసించును. అట్టి ప్రేమను స్త్రీలొక్క తమ బిడ్డలవిూదనే గాక తమ యిరుగు పొరుగువారి విూదను తమదేశము విూదను<noinclude></noinclude>
sryhuf7k761o0czbousd1z1ztsia5ur
పుట:Sarada Lekhalu Vol 1.pdf/47
104
59202
553197
186279
2026-04-16T01:13:14Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553197
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
23
అంతియేగాదు సర్వమతములవారి యెడలను సర్వ మానవుల
యెడను సమ స్తభూత జాలముల యెడలను గూడ గలిగి యుండ
వలెను. స్త్రీలకు సౌందర్య భ్రమ యధికము. సౌందర్యము వెల
లేని సగలు ధరించుటలో లేదు. విలువైన చీరలను ధరించు
టలోలేదు. మొగమును పలుమారు సబ్బులతో గడుగుటలో
లేదు. నిర్మలమును కరుణాభరితమును ప్రేమపూర్ణమునునగు
హృదయమును గలిగియుండుటయే స్త్రీకినిజమైన సౌందర్యము.
అట్టి సౌందర్యమును మీరు బడయగో రెదను.”
శ్రీమతి సరోజినీ దేవి యుపన్యాసమును ముగింపు
ఖద్దరునుగూర్చి కొంచెము చెప్పుడని యొక సభ్యు రాలడి గెను.
దానినిగూర్చి యామె యిట్లు చెప్పెను.
“ఖద్దరనగా గాంధీగారి సందేశము. గాంధీగారి సందేశ
మనగా ఖద్దరు, ఈమధ్య ఆఫ్గన్ స్థానపు ప్రభువు బొంబాయికి
వచ్చియుండెను. ఆయన సభలోనికి రాగనే యెక్కువ ముతుక
చీరను గట్టియున్న మహాత్ముని భార్యనుచూచి “ఓ, యెక్కువ
ముతుకచీరను గట్టియున్న దే యీమెయే గాంధిగారి సతి యని
యామెను గురుపట్టి ఆఫ్ఘన్ రాజు యెంతయో సత్కరించినాడు.
ఆయన తన స్వతంత్ర రాష్ట్రమునుండి తెచ్చిన సందేశమేమనగా
"మా రాజ్యమునందు విదేశవస్త్రమునువాడు నలవాటు లేదు.
నారాష్ట్రవాసులెల్లరు తమ చేతులతో స్వయముగా వడుక బడి
నేయబడిన గుడ్డలనే ధరింతురు. ఎంత శ్రీమంతులై ననుగూడ
ఆఫ్గనులు స్వదేశవస్త్రములనేగాని విదేశ వస్త్రముల ధరింపరు.
ఈవిషయమై మీకు సందేశ వినాయగలిగినందులకు నేను చాల<noinclude></noinclude>
mcwxi96g7jxebeszrlw61y3uwmq9bzr
553224
553197
2026-04-16T01:29:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553224
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|23}}</noinclude>అంతియేగాదు సర్వమతములవారి యెడలను సర్వ మానవుల యెడను సమస్తభూత జాలముల యెడలను గూడ గలిగి యుండవలెను. స్త్రీలకు సౌందర్యభ్రమ యధికము. సౌందర్యము వెలలేని నగలు ధరించుటలో లేదు. విలువైన చీరలను ధరించుటలోలేదు. మొగమును పలుమారు సబ్బులతో గడుగుటలో లేదు. నిర్మలమును కరుణాభరితమును ప్రేమపూర్ణమునునగు హృదయమును గలిగియుండుటయే స్త్రీకినిజమైన సౌందర్యము. అట్టి సౌందర్యమును మీరు బడయగోరెదను.”
శ్రీమతి సరోజినీదేవి యుపన్యాసమును ముగింపగ ఖద్దరునుగూర్చి కొంచెము చెప్పుడని యొక సభ్యురాలడిగెను. దానినిగూర్చి యామె యిట్లుచెప్పెను.
“ఖద్దరనగా గాంధిగారి సందేశము. గాంధిగారి సందేశమనగా ఖద్దరు, ఈమధ్య ఆఫ్గన్ స్థానపుప్రభువు బొంబాయికి వచ్చియుండెను. ఆయన సభలోనికిరాగనే యెక్కువ ముతుక చీరను గట్టియున్న మహాత్ముని భార్యనుచూచి “ఓ, యెక్కువ ముతుకచీరను గట్టియున్న దే యీమెయే గాంధిగారి సతి" యని యామెను గురుపట్టి ఆఫ్ఘన్ రాజు యెంతయో సత్కరించినాడు. ఆయన తన స్వతంత్రరాష్ట్రమునుండితెచ్చిన సందేశమేమనగా "మా రాజ్యమునందు విదేశవస్త్రమునువాడు నలవాటులేదు. నారాష్ట్రవాసులెల్లరు తమ చేతులతో స్వయముగా వడుకబడి నేయబడిన గుడ్డలనే ధరింతురు. ఎంత శ్రీమంతులైననుగూడ
ఆఫ్గనులు స్వదేశవస్త్రములనేగాని విదేశవస్త్రముల ధరింపరు. ఈవిషయమై మీకు సందేశ మీయగలిగినందులకు నేను చాల<noinclude></noinclude>
9e10cvfecre5sl1hb5wmqrp5a6ephaz
పుట:Sarada Lekhalu Vol 1.pdf/48
104
59203
553225
469409
2026-04-16T01:36:17Z
శ్రీరామమూర్తి
1517
/* మూల్యాంకన చేసారు */
553225
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{rh|24|శారదలేఖలు|}}</noinclude>సంతోషింపుచున్నా"నని చెప్పియున్నాడు. ఖద్దరు వస్త్రములను ధరించుటయనగా నిరుపేదలకన్నమిడుట యన్నమాట. విూశరీరములు స్వదేశీయములేగాని విూరు ధరించిన వస్త్రములు మాత్రము స్వదేశీయములుగా లేనట్లు కన్పట్టుచున్నది. కాన విూరందఱు నూలువడికి స్వదేశవస్త్రముల ధరింపవలెనని కోరుచున్నాను."
మిత్రమా, సరోజినీదేవి యుపన్యాసమునందలి ముఖ్యాంశము లివియని జ్ఞాపకము. వీనిలో నేదైన పొరపాటులున్న నదినావియేయని యెంచుము. మేము వేసవిని చల్లగఁ గడుపవలెనని యిచ్చట కేతెంచితిమి. ఇచ్చట యెండలు తక్కువ. వేడిగాడ్పులసలేలేవు. చెమట పోయుటయేకానము. ఈదినములలో మన ప్రాంతములనుండెడి మండుటెండలు, వేడిగాడ్పులు, చెమట స్నానములు, తనియని దాహములు తలఁచుకొని యీ యూరి యొండలను తలంచినప్పుడు యేపుష్యమాఖమాసపు యొండలుగనో గాన్పింపుచుండును కాని యీ యెండలకే అడలి పోవుచున్నా రిచ్చటివారు. చూచితివా చిత్రము!
{{rh|భావపురి||నీప్రియమైన}}
{{rh|1928 జూలై||శారద.}}
{{rule|2cm}}<noinclude></noinclude>
t2gazo0mtnooki66dnvf2qy7e726jc8
పుట:Sarada Lekhalu Vol 1.pdf/49
104
59204
553198
186281
2026-04-16T01:13:34Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553198
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>సౌభాగ్యవతియగు కల్పలతకు:-
నెచ్చెలీ,
ణము.
మాసము దినములనుండి నా కొకటే రైలు ప్రయా
అందువలననే నీకు జాబు వ్రాయుటకు గూడ వీలై నది
కాదు. నీవు రెండుత్తరములు వ్రాసినను ప్రత్యుత్తరము
వ్రాయకపోతిని. ఏమనుకొనుచుంటివోయని పలుమా అను
కొంటిని. కాని భుజించినచోట నిద్రింపక, నిద్రించినచోట
భుజింపక నిరంతర ప్రయాణము చేయుచున్న నేను నీకు జా బెట్లు
వ్రాయుదును? కాన ఉత్తరము వ్రాయునప్పుడు నా యలసత్వ
మునకు క్షమింప వేడుకొనవచ్చునని మిన్నకుంటిని . జాబునకు
జవాబు వ్రాయక స్వస్తివాచకములు చదువుచున్నదని మిత్ర
మా, నాపై కొనియకు. నీకు జాబు వ్రాయకపోయినను ఈ
నెలదినముల రైలుప్రయాణములో నీకు పదిజాబులు వ్రాయ
జాలు పదార్థమును సేకరించుకొని వచ్చితిని సుమా! దాదాపు
పగలు ఒంటిగంట వేళ మేము గూడూరులో తిరుపతి బండి దిగి
చెన్న పురినుండి వచ్చు ప్యాసింజెరు నెక్కితిమి. నేను కూర్చుం
డిన స్త్రీల పెట్టెలో దాదాపు పదునాఱుమంది లుండిరి.
వారం తొక్క కులమునకుగాని మతమునకుగాని భాషకు
చెందినవారు కారు. ఒక వైపున వైష్ణవ స్త్రీ
ని
వస్త్రీ
లిద్దఱు
ర అరవమున మాట్లాడుచుండి రి. మఱి
యొక దిక్కున దత్తమండలమునుండి వచ్చు మధ్వ స్త్రీ లిరు<noinclude></noinclude>
ptkrxbwr3xviscl1p45rd6tekpkvfee
553226
553198
2026-04-16T01:43:05Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553226
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|25}}</noinclude>సౌభాగ్యవతియగు కల్పలతకు:-
నెచ్చెలీ,
మాసము దినములనుండి నా కొకటే రైలుప్రయాణము. అందువలననే నీకు జాబు వ్రాయుటకుగూడ వీలైనది కాదు. నీవు రెండుత్తరములు వ్రాసినను ప్రత్యుత్తరము వ్రాయకపోతిని. ఏమనుకొనుచుంటివోయని పలుమా ఱనుకొంటిని. కాని భుజించినచోట నిద్రింపక, నిద్రించినచోట భుజింపక నిరంతరప్రయాణము చేయుచున్న నేను నీకు జా బెట్లు వ్రాయుదును? కాన ఉత్తరము వ్రాయునప్పుడు నా యలసత్వమునకు క్షమింప వేడుకొనవచ్చునని మిన్నకుంటిని . జాబునకు జవాబువ్రాయక స్వస్తివాచకములు చదువుచున్నదని మిత్రమా, నాపై కినియకు. నీకు జాబు వ్రాయకపోయినను ఈ నెలదినముల రైలుప్రయాణములో నీకు పదిజాబులు వ్రాయజాలు పదార్థమును సేకరించుకొని వచ్చితిని సుమా! దాదాపు పగలు ఒంటిగంటవేళ మేము గూడూరులో తిరుపతిబండి దిగి చెన్నపురినుండి వచ్చు ప్యాసింజెరు నెక్కితిమి. నేను కూర్చుండిన స్త్రీలపెట్టెలో దాదాపు పదునాఱుమంది స్త్రీ లుండిరి. వారంద ఱొక్క కులమునకుగాని మతమునకుగాని భాషకుగాని చెందినవారుకారు. ఒకవైపున వైష్ణవస్త్రీ లిద్దఱు కూర్చుండి అరవమున మాట్లాడుచుండిరి. మఱియొక దిక్కున దత్తమండలమునుండి వచ్చు మధ్వస్త్రీ లిరు<noinclude></noinclude>
9xohxt02hub61wfmne9rw0gtdl07lr5
పుట:Sarada Lekhalu Vol 1.pdf/50
104
59205
553199
186282
2026-04-16T01:13:50Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553199
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>26
శారద లేఖలు
-వురు “హాకు బేకు” మనుచు కన్నడమున మాట్లాడుచుండిరి.
మలొక బల్లపై దేశస్థ బ్రాహ్మణ స్త్రీలు మువ్వురు కూర్చుండి
“హైస్ బైస్" యని మహారాష్ట్రమున మాట్లాడుచుండిరి.
వేరొక దిక్కున మహమ్మదీయ స్త్రీలు నల్వురు కుతకుత నుడికి
-పోవుచున్న యా మధ్యాహ్నపుటెండలో తెగమాసిన యా
మేలిముసుగు దుప్పటులు కప్పుకొనజాలకయు తీసివేయజాల
కయు కులస్థుడు కనపడగనే ముసుగును దిగదీసికొనుచు, వెళ్ల
గనే యెగదీసికొనుచు "కౌనుసీగామ్ గయే, కహసే ఆతీహా
ఒకరినొకరు ప్రశ్నించుకొనుచు మాట్లాడుచుండిరి.
-తక్కినవారు మన తెలుఁగువారు. భాషాపరిచయము కాని
యా యపరిచితలతో నేటి ప్రసంగమని చేతిలోనున్న నాటి
యాంధ్రపత్రికను తిరుగవేయుచు నేనుగూడ నొకవైపున
గూర్చుంటిని. రైల లు గూడూరు విడిచెను. బండిలోనివా
రెక్కడివా రక్కడ సర్దుకొని కూర్చుండి పరస్పర సంభాషణల
కుపక్రమించిరి. ఒక మహమ్మదీయ స్త్రీ హిందూస్థానీ భాషలో
మీ దేయూరని దేశస్థ బ్రాహ్మణస్త్రీల నడిగెను. మాది
యిందోరు రాజ్యమని వారనిరి. ఇందూరుమాట వినగానే
యీమధ్య జరిగిన శర్మిష్ఠీకల్యాణము జ్ఞాపకమువచ్చి వారితో
ప్రసంగింపవలెనని నాకు కుతూహలము కలిగెను. అంత చదువు
చున్న పత్రికను ముడిచి, వచ్చియు రాని హిందీ ముక్కలతో
“ఈమధ్య దొరసానిని 'పెండ్లాడినది మీదేశపు ప్రభువేగదా”
-యని నేను వారి నడిగితిని. “అవునని వారనిరి. "చాల
ఆశ్చర్యకరమైన సంగతి” యని నేనంటిని. "పదిరూపాయ<noinclude></noinclude>
235p11tpqrw1bd8fevpe8cbzcg6t63z
553228
553199
2026-04-16T01:50:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553228
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|26|శారదలేఖలు|}}</noinclude>వురు “హాకు బేకు” మనుచు కన్నడమున మాట్లాడుచుండిరి. మఱొక బల్లపై దేశస్థ బ్రాహ్మణస్త్రీలు మువ్వురు కూర్చుండి “హైస్ బైస్" యని మహారాష్ట్రమున మాట్లాడుచుండిరి. వేరొకదిక్కున మహమ్మదీయస్త్రీలు నల్వురు కుతకుత నుడికి పోవుచున్న యా మధ్యాహ్నపుటెండలో తెగమాసిన యా
మేలిముసుగు దుప్పటులు కప్పుకొనజాలకయు తీసివేయజాలకయు కులస్థుడు కనపడగనే ముసుగును దిగదీసికొనుచు, వెళ్లగనే యెగదీసికొనుచు "కౌనుసీగామ్ గయే, కహసే ఆతీహా" అని ఒకరినొకరు ప్రశ్నించుకొనుచు మాట్లాడుచుండిరి. తక్కినవారు మన తెలుఁగువారు. భాషాపరిచయము కాని యా యపరిచితలతో నేటి ప్రసంగమని చేతిలోనున్న నాటి యాంధ్రపత్రికను తిరుగవేయుచు నేనుగూడ నొకవైపున
గూర్చుంటిని. రైలు గూడూరు విడిచెను. బండిలోనివా రెక్కడివా రక్కడ సర్దుకొని కూర్చుండి పరస్పర సంభాషణల కుపక్రమించిరి. ఒక మహమ్మదీయస్త్రీ హిందూస్థానీభాషలో మీ దేయూరని దేశస్థ బ్రాహ్మణస్త్రీల నడిగెను. మాది యిందోరు రాజ్యమని వారనిరి. ఇందూరుమాట వినగానే యీమధ్య జరిగిన శర్మిష్ఠాకల్యాణము జ్ఞాపకమువచ్చి వారితో ప్రసంగింపవలెనని నాకు కుతూహలము కలిగెను. అంత చదువు
చున్న పత్రికను ముడిచి, వచ్చియు రాని హిందీముక్కలతో “ఈమధ్య దొరసానిని పెండ్లాడినది మీదేశపు ప్రభువేగదా” యని నేను వారి నడిగితిని. “అవున"ని వారనిరి. "చాల ఆశ్చర్యకరమైన సంగతి” యని నేనంటిని. "పదిరూపాయ<noinclude></noinclude>
ka4uhsf6ra3uurtp375t8c4ad7s41ao
పుట:Sarada Lekhalu Vol 1.pdf/51
104
59206
553200
186283
2026-04-16T01:14:09Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553200
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>ద లే
లు
27
లాసచూపగనే పాశ్చాత్య క్రైస్తవ స్త్రీ హిందూ మరాటా
గా మారు టాశ్చర్యము గాదా” యని వారు నవ్విరి.
“ఆయన కిదివఱ కిద్దఱు భార్యలున్నారట గాదా” యని నే
నంటిని. “ఇద్దఱుగాదు ముగ్గురని వారనిరి. ముగ్గురా అని
నే నాశ్చర్యముతోడను సందేహముతోడను బ్రశ్నింప “ముంత
జుబేగ మొక భార్య యుండలేదా? దానితో ముగ్గురని” నవ్విరి.
“సరిసరి అట్టిభార్య ఆమె యొక్క తేయని చెప్పుటెట్లు? ఎంద
ఱున్నారో, దాని
కేమిగాని మీ రాజు రాజ్యచ్యుతుఁడు
గదా” యని నే నంటిని. “అవును. ఆయన కిరువదేండ్ల వయ
స్సుగల కొడుకున్నాడు, ఆయన యిప్పుడు రాజు” అని
రనిరి. "తుకోజీ హోల్కారు కెంత వయస్సుండునని నే
నంటిని. "సుమారు నలుబదైదేండ్లుండవచ్చు”నని వారనిరి.
“అహో! కాంతా మోహ మని, నే నాశ్చర్యముతో నవ్వి
తిని తెల్లపిల్లిని నల్లపిల్లిగా మార్చినందుకు స్వాములకిచ్చిన
సంభావన తొంబదివేలని గూడ వారే చెప్పిరి.
వా
అందు అతిశ
యో.
క్తులుగూడ కొంత యుండెనేమో కాని కొంతయైన
నిజమే యనుమాట మనము పత్రికలలో చదివిన విషయము
లనుబట్టి నిశ్చయింపవచ్చును గదా యని నే ననుకొంటిని.
మే మిట్లు ప్రసంగింపుచుండ నా ప్రక్కను గూర్చుండిన యొక
స్త్రీ యేమి మాట్లాడుచున్నారని నన్నడిగెను. శర్మిష్ణాకల్యాణ
మునుగూర్చి నేను పత్రికలలోఁ జదివిన విషయముల నామెకు
జెతిని అ నొక వృద్దురాలు నా దిక్కుమొగమై
“పద్నాలుగేండ్లు నిండితేనెకాని ఆడపిల్లలకు పెండ్లి చేయరా<noinclude></noinclude>
aqbd2xkev4m5v1f1o8wm7ufj0zy8y3g
553229
553200
2026-04-16T01:58:30Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553229
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|27}}</noinclude>లాసచూపగనే పాశ్చాత్య క్రైస్తవస్త్రీ హిందూ మరాటాస్త్రీగా మారు టాశ్చర్యము గాదా” యని వారు నవ్విరి.
“ఆయన కిదివఱ కిద్దఱు భార్యలున్నారట గాదా” యని నే నంటిని. “ఇద్దఱుగాదు ముగ్గుర"ని వారనిరి. ముగ్గురా అని నే నాశ్చర్యముతోడను సందేహముతోడను బ్రశ్నింప “ముంతజుబేగ మొకభార్య యుండలేదా? దానితో ముగ్గురని” నవ్విరి. “సరిసరి అట్టిభార్య ఆమె యొక్కతేయని చెప్పుటెట్లు? ఎందఱున్నారో, దాని
కేమిగాని మీరాజు రాజ్యచ్యుతుఁడు గదా” యని నే నంటిని. “అవును. ఆయన కిరువదేండ్ల వయస్సుగల కొడుకున్నాడు, ఆయన యిప్పుడు రాజు” అని వా రనిరి. "తుకోజీ హోల్కారు కెంత వయస్సుండు"నని నే
నంటిని. "సుమారు నలుబదైదేండ్లుండవచ్చు”నని వారనిరి. “అహో! కాంతా మోహ"మని, నే నాశ్చర్యముతో నవ్వితిని. తెల్లపిల్లిని నల్లపిల్లిగా మార్చినందుకు స్వాములకిచ్చిన సంభావన తొంబదివేలనిగూడ వారే చెప్పిరి. అందు అతిశయోక్తులుగూడ కొంత యుండెనేమో కాని కొంతయైన నిజమే యనుమాట మనము పత్రికలలో చదివిన విషయములనుబట్టి నిశ్చయింపవచ్చును గదా యని నే ననుకొంటిని. మే మిట్లు ప్రసంగింపుచుండ నా ప్రక్కను గూర్చుండిన యొక స్త్రీ యేమి మాట్లాడుచున్నారని నన్నడిగెను. శర్మిష్ఠాకల్యాణమునుగూర్చి నేను పత్రికలలోఁ జదివిన విషయముల నామెకు జెప్పితిని. అంత నొక వృద్దురాలు నా దిక్కుమొగమై “పద్నాలుగేండ్లు నిండితేనెకాని ఆడపిల్లలకు పెండ్లి చేయరా<noinclude></noinclude>
gcvv1q5svxtc5dt9ms3ffokzlul9qz7
పుట:Sarada Lekhalu Vol 1.pdf/52
104
59207
553201
186284
2026-04-16T01:14:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553201
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>28
లేఖలు
దని మన దేశంలో గూడ శాసనం వస్తున్నదట గాదా” అని
నన్నడిగెను. అవునని నేనంటిని. “ఏమి కాని కాలం వచ్చిం
దమ్మ! అన్నేండ్లు పెంచితే పిల్ల పెద్దమనిషి కాదా?” అని
యామె యడిగెను. “కావచ్చు”నని నేనంటిని. యితే
బ్రాహ్మణీకం బండలై పోయినట్లేగా, శూద్రులతో పాటే మన
30
65
తప్పు
మూను?'' అని ఆమె కోపముగా బలికెను. నేనేమియు
మాట్లాడలేదు. ఇంతలో ఒక లేబ్రాయపు వితంతువు అందు
కొని "పోతేపోనీ పదునాలు గేండ్లయినా రాని పిల్లకు పెం
డైమిటి? అయిదేండ్ల కుంకకు పెండ్లిచేశారు. ఇట్లా ముసు గేసు
కొని యేడుస్తున్నాను. అయినదేమో అయినది. ఇక ముందు
వాండ్ల నా న్యాయం జరిగితే అంతేచాలు” అనెను. “పిచ్చి
దానా, ఎవరికర్మము వారిది. ఎవరి నొసటివ్రాలు వారిది.
పద్నాలుగేండ్లకు పెండ్లిచేస్తేమాత్రము విధవరికము
తుందా” అని వెనుక ప్రశ్నించి నామె పలికెను. “పదునాలు
గేండ్లలోపు వైధవ్యమైన తప్పుతుంది గాదా? పెనిమిటి సంగతీ
పెండ్లిసంగతీ కొంచెమైనా బోధపడుతుందిగాదా? ఇపుడు యే
మట్టీ లేదుగా, నామట్టుకు నాకు అయిదో యేట 'పెండ్లిచేశా
రుట. ఆ తరువాత మూడు నెలల కే ఆ పిల్లవాడు పోయినా
డట. నాకు ఆ 'పెనిమిటిపోలికై నా గుర్తులేదు. ఇది న్యాయ
మని విూరంటారా?” అని యా వితంతువు పలికెను.
లమ్మ నీరు తరయయ్యెను. ఇంతలో మరొక స్త్రీ అందుకొని
"దేవుని దయవల్ల ఆ శాసనము రావలసినదే; అపుడుగాని
ముస
తల్లిదండ్రుల ఆటలు కట్టువడవు. రామ! రామ! తల్లి<noinclude></noinclude>
h1cyiu83sb3j37x18elpgqfqr5ifryb
553240
553201
2026-04-16T04:26:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553240
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|28|శారదలేఖలు|}}</noinclude>దని మన దేశంలోగూడ శాసనం వస్తున్నదట గాదా” అని నన్నడిగెను. అవునని నేనంటిని. “ఏమి కానికాలం వచ్చిందమ్మ! అన్నేండ్లు పెంచితే పిల్ల పెద్దమనిషికాదా?” అని యామె యడిగెను. “కావచ్చు”నని నేనంటిని. "అయితే బ్రాహ్మణీకం బండలైపోయినట్లేగా, శూద్రులతోపాటే మనమూను?" అని ఆమె కోపముగా బలికెను. నేనేమియు మాట్లాడలేదు. ఇంతలో ఒక లేబ్రాయపు వితంతువు అందుకొని "పోతేపోనీ పదునాలుగేండ్లయినా రాని పిల్లకు పెండ్లేమిటి? అయిదేండ్ల కుంకకు పెండ్లిచేశారు. ఇట్లా ముసుగేసుకొని యేడుస్తున్నాను. అయినదేమో అయినది. ఇక ముందు వాండ్లకైనా న్యాయం జరిగితే అంతేచాలు” అనెను. “పిచ్చిదానా, ఎవరికర్మము వారిది. ఎవరి నొసటివ్రాలు వారిది. పద్నాలుగేండ్లకు పెండ్లిచేస్తేమాత్రము విధవరికము తప్పుతుందా” అని వెనుక ప్రశ్నించి నామె పలికెను. “పదునాలుగేండ్లలోపు వైధవ్యమైన తప్పుతుంది గాదా? పెనిమిటిసంగతీ పెండ్లిసంగతీ కొంచెమైనా బోధపడుతుందిగాదా? ఇపుడు యే మట్టీలేదుగా, నామట్టుకు నాకు అయిదోయేట పెండ్లిచేశారుట. ఆ తరువాత మూడునెలలకే ఆ పిల్లవాడు పోయినాడట. నాకు ఆ పెనిమిటిపోలికైనా గుర్తులేదు. ఇది న్యాయమని విూరంటారా?” అని యా వితంతువు పలికెను. ముసలమ్మ నిరుత్తరయయ్యెను. ఇంతలో మఱొకస్త్రీ అందుకొని "దేవుని దయవల్ల ఆ శాసనము రావలసినదే; అపుడుగాని యీ తల్లిదండ్రుల ఆటలు కట్టువడవు. రామ! రామ! తల్లి<noinclude></noinclude>
a65i83m86cpknk4t7e8pe9qqqw3fdre
పుట:Sarada Lekhalu Vol 1.pdf/53
104
59208
553202
186285
2026-04-16T01:14:44Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553202
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నాకు
శారద లేఖలు
29
దండ్రులు ఆడపిల్ల నెంత అన్యాయము చేస్తున్నారు? అమ్ము
కోవడము, అప్రయోజకుడి కియ్యడము. బదులుకు బదులిచ్చి
చేసుకోవడము. ఒకటా అకృత్యము? ఆడపిల్లంటే అమ్మా
నాయనలచేతి చెలామణి నాణెము; కాకపోతే పుచ్చిన పిక్క,
చిల్లిగవ్వ, ఎంత నిస్సారం” ఇట్లనుచుండగా నామెకన్నుల
నీళ్లు గిట్టునదిరిగినవి. పలుకులు గద్దదికమైనవి. ఆ స్థితినిజూడ
తల్లిదండ్రులచే నామెగూడ నేదియో సంసారపు కష్టమునకు
లోనై
ఆమె వృత్తాంతమును
పూర్తిగా నెఱుగవలెనని యూహించితిని, కాని
నెట్లడుగనగునో, ఏమడిగిన నేమనుకొనునో యని క్షణమాత్ర
మాలోచించితిని. తుదకు యేమైన ననుకొననిమ్ము చెప్పిన
విందును. చెప్పకున్న నూరకుందును. అడిగిన తప్పేమియని
సాహసించి "అమ్మా మిమ్ములనుచూడ చాల కష్టపడిన
వారుగా గన్పట్టుచున్నారు. తల్లిదండ్రు లనాలోచితముగా
గావించిన వివాహమే మీ కష్టములకు కారణమని యూహ
గలుగుచున్నది” అని నేను పిఱికిపిఱికిగా వ్యత్య స్తముగా
..
నడిగితిని.
“తల్లికి నేను నోచుకొన లేదు. తండ్రిచేసిన యువకారము
వల్లనే యిట్లా అల్లాడుచున్నాను.” ఆమెకు మరల కన్ను లనీళ్లు
క్రమ్మెను. పైట చెఱగుతో నదుకొనెను.
ఆమె యిచ్చిన
జబాబువలన నాప్రశ్నకు సుముఖయైయున్నట్లు నాకుదో చెను.
కాన"పాపము! మీకు తల్లి చిన్నత తనముననే పోయినదా? ఆడఁది
చేసికొనిన పాపములలో చిన్న తనముననే తల్లి కఱవుటొక<noinclude></noinclude>
qlndosrte0umvj2o2fv1p7bkt9tymyi
553243
553202
2026-04-16T04:35:23Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553243
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|29}}</noinclude>దండ్రులు ఆడపిల్ల నెంత అన్యాయము చేస్తున్నారు? అమ్ముకోవడము, అప్రయోజకుడి కియ్యడము. బదులుకు బదులిచ్చి చేసుకోవడము. ఒకటా అకృత్యము? ఆడపిల్లంటే అమ్మా నాయనలచేతి చెలామణి నాణెము; కాకపోతే పుచ్చినవక్క, చిల్లిగవ్వ, ఎంత నిస్సారం” ఇట్లనుచుండగా నామెకన్నుల నీళ్లు గిఱ్ఱునదిరిగినవి. పలుకులు గద్దదికమైనవి. ఆ స్థితినిజూడ తల్లిదండ్రులచే నామెగూడ నేదియో సంసారపు కష్టమునకు లోనైనట్లుగా నాకు దోఁచెను. ఆమె వృత్తాంతమును పూర్తిగా నెఱుగవలెనని యూహించితిని. కాని యామె నెట్లడుగనగునో, ఏమడిగిన నేమనుకొనునో యని క్షణమాత్ర మాలోచించితిని. తుదకు యేమైన ననుకొననిమ్ము చెప్పిన విందును. చెప్పకున్న నూరకుందును. అడిగిన తప్పేమియని సాహసించి "అమ్మా మిమ్ములనుచూడ చాల కష్టపడినవారుగా గన్పట్టుచున్నారు. తల్లిదండ్రు లనాలోచితముగా గావించిన వివాహమే మీ కష్టములకు కారణమని యూహ గలుగుచున్నది” అని నేను పిఱికిపిఱికిగా వ్యత్యస్తముగా
నడిగితిని.
“తల్లికి నేను నోచుకొనలేదు. తండ్రిచేసిన యువకారము వల్లనే యిట్లా అల్లాడుచున్నాను.” ఆమెకు మరల కన్నులనీళ్లు క్రమ్మెను. పైట చెఱగుతో నద్దుకొనెను. ఆమె యిచ్చిన జబాబువలన నాప్రశ్నకు సుముఖయైయున్నట్లు నాకుదోచెను. కాన"పాపము! మీకు తల్లి చిన్నతనముననే పోయినదా? ఆడఁది
చేసికొనిన పాపములలో చిన్నతనముననే తల్లి కఱవగుటొక<noinclude></noinclude>
92vq2tjhiatqjh41wi55bh6xz5hnter
పుట:Sarada Lekhalu Vol 1.pdf/54
104
59209
553203
186286
2026-04-16T01:14:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553203
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>30
శారద లేఖలు
పెద్దపాప”మని నేనంటిని. “అవును, మాతల్లి పోవునప్పటికి
నావయస్సైదేండ్లు, మా పెద్దక్కయ్యకు పద్దెనిమిదేండ్లు,
మా చిన్న అక్కయ్యకు పదైదేండ్లు, మా పెద్దన్నయ్య పది రెం
డేండ్లవాడు, మాచిన్నన్నయ్య యెనిమిదేండ్లవాడు. అప్పటికే
మాఅక్క లిద్దఱు కాపురమునకు వెళ్ళినారు. మా పెద్దన్నకు
వడుగై నది. తక్కిన పసికూనలమైన మమ్ము కష్టపరంపరలకు
గుఱిచేసి మాతల్లి చనిపోయినది. మా నాయనకప్పటి కేబదేం
డ్లున్నవి. తల పులగము పదునుగా నెఱసియున్నది. అప్పటికి
మా పెద్దక్క కొక కొడుకుగూడ పుట్టియుండుటచే తాత
గూడయైనాడు. న్యాయమున కాయన వివాహము మాట
మనస్సునగూడ స్మరింపరాని సమయమది.
అయిననేమి.
పాపిష్ఠి లోకము పెండ్లము చావద్దనే మగవానిని పెండ్లికొడు
కును జేయుచుండునుగదా. “నాయనా! వచ్చేది పెత్తనము.
ఇంట్లో ఆడదిక్కు లేకపోతె ఎట్లా జరుగుతుంది? కోడళ్లు కూతుళ్లు
ముప్పుగడుపుతారా? - చేసుకున్న దానికంటే తప్పదు. ఏదో
పదిరూపాయలు కర్చైనా ఒక చిన్న దాన్ని ముడి పెట్టుకుం టే
సరిపోతుంది.” అని బంధువులలోను పరిచయులలోను
పెద్ద పెద్దలందఱు పదే పదే సలహా చెప్పుట సాగించినారు.
భార్య చావగనే పెండ్లాడుద మనెడి కోరిక మనదేశములో ప్రతి
వానికి, అందులో యేండ్లుచెల్లినవాని కుండుట సర్వసాధారణమే
కదా! మగడు చావగనే మగువ వాంఛ లేవిధముగా నడుగంటి
పోవునో మగువ చావగనే మగవాని కోరికలావిధముగా నీరిక
లెత్తుచుండును. భర్తృహీన పనిచేయగుగాక, యామెవాంఛ<noinclude></noinclude>
h7gzilyaas3invbbgyh7jwffd7kpurg
553245
553203
2026-04-16T04:43:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553245
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|30|శారదలేఖలు|}}</noinclude>పెద్దపాప”మని నేనంటిని. “అవును, మాతల్లిపోవునప్పటికి నావయస్సైదేండ్లు, మా పెద్దక్కయ్యకు పద్దెనిమిదేండ్లు, మా చిన్నఅక్కయ్యకు పదైదేండ్లు, మాపెద్దన్నయ్య పదిరెండేండ్లవాడు, మాచిన్నన్నయ్య యెనిమిదేండ్లవాడు. అప్పటికే మాఅక్క లిద్దఱు కాపురమునకు వెళ్ళినారు. మాపెద్దన్నకు వడుగైనది. తక్కిన పసికూనలమైన మమ్ము కష్టపరంపరలకు గుఱిచేసి మాతల్లి చనిపోయినది. మా నాయనకప్పటి కేబదేండ్లున్నవి. తల పులగము పదునుగా నెఱసియున్నది. అప్పటికి మా పెద్దక్క కొక కొడుకుగూడ పుట్టియుండుటచే తాత గూడయైనాడు. న్యాయమున కాయన వివాహము మాట మనస్సునగూడ స్మరింపరాని సమయమది. అయిననేమి. పాపిష్ఠి లోకము పెండ్లము చావగనే మగవానిని పెండ్లికొడుకును జేయుచుండునుగదా. “నాయనా! వచ్చేది పెత్తనము. ఇంట్లో ఆడదిక్కులేకపోతె ఎట్లాజరుగుతుంది? కోడళ్లు కూతుళ్లు ముప్పుగడుపుతారా? చేసుకున్నదానికంటే తప్పదు. ఏదో పదిరూపాయలు కర్చైనా ఒకచిన్నదాన్ని ముడిపెట్టుకుంటే సరిపోతుంది.” అని బంధువులలోను పరిచయులలోను పెద్ద పెద్దలందఱు పదే పదే సలహా చెప్పుట సాగించినారు. భార్యచావగనే పెండ్లాడుద మనెడి కోరిక మనదేశములో ప్రతివానికి, అందులో యేండ్లుచెల్లినవాని కుండుట సర్వసాధారణమే కదా! మగడు చావగనే మగువ వాంఛ లేవిధముగా నడుగంటిపోవునో మగువ చావగనే మగవాని కోరికలావిధముగా నీరిక లెత్తుచుండును. భర్తృహీన పసిదేయగుగాక, యామెవాంఛ<noinclude></noinclude>
sj4p0udv1xrr35nkiawh92via54juub
పుట:Sarada Lekhalu Vol 1.pdf/55
104
59210
553204
186287
2026-04-16T01:15:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553204
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>లే ఖలు
31
లడవి పువ్వులవలె నిరుపయోగముగ రాలిపోవలెను. కళత్ర
విహీనుడు వృద్ధుడేయగుగాక,
వాని వాంఛలు మ్రోడు
మ్రాకున చిరువులె తినట్లు చిగిరించవలెను. ఇది యెట్టి
న్యాయము? బాలవిధవ వైరాగ్యమునకు సిద్ధపడవలెనా? నష్ట
కళత్రుఁడగు వృద్ధుడు భోగలాలసతకు సిద్ధపడవలెనా? ఆ పసి
దాని మోమున భస్మరేఖలును నీ ముసలివాని మోమున
చాదు చుక్క_యునా? అయ్యో! ధర్మాధర్మ విచక్షణ లోక
ములో నడుగంటినదనుట కీతార్కాణము చాలదా? వివరింప
సాధ్యముగాని యా దురన్యాయములనుగూర్చి మనలో మన
మూహించుకొనిన చాలును. న్యాయము మనకే తెలియును.
అదియట్లుండె. వెఱిధోరణిలోబడి విషయము మఱచితిని.
మా నాన్న పెండ్లికి సిద్ధమైనాడు. కన్యాన్వేషణ మారంభించి
నాడు. బహుయత్నముమీద, బహు ధనవ్యయమువిూద,
బహు దారుణపు టేర్పాటులమీద నొక కన్య లభించినది.
తలిదండ్రు లాకన్యను మా నాన్న కిచ్చుటకు కొన్ని షరతు
లను కోరిరి. అవి యేనియనగా తమ కన్యను మా నాన్న
కిచ్చుటకు నన్ను తమ కొమారునకు బదులియ్యవలెను.
మఱియు తమకు వేయిరూపాయలు కన్యాశుల్కముగూడ
నీయవలేను. ఈ యుభయవివాహములను తన కర్చుతో తన
యింటనే మా తండ్రి జరుపుకొనవలెను. అంతియేగాక మా
యిరువురకును వేయిరూపాయలకు తక్కువగాని నగలను మా
నాన్న పెట్టవలెను. మా తండ్రి యన్నిటికిని యొప్పుకొనెను.
వివాహము జరిగెను. మా తండ్రి యప్పటికి కొంచెము స్థితి<noinclude></noinclude>
n3pr4d43h461ovydvqpyyg4mf8cf583
553248
553204
2026-04-16T05:53:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553248
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|31}}</noinclude>లడవి పువ్వులవలె నిరుపయోగముగ రాలిపోవలెను. కళత్రవిహీనుడు వృద్ధుడేయగుగాక, వాని వాంఛలు మ్రోడు మ్రాకున చిరువులెత్తినట్లు చిగిరించవలెను. ఇది యెట్టి న్యాయము? బాలవిధవ వైరాగ్యమునకు సిద్ధపడవలెనా? నష్టకళత్రుఁడగు వృద్ధుడు భోగలాలసతకు సిద్ధపడవలెనా? ఆ పసిదాని మోమున భస్మరేఖలును నీ ముసలివాని మోమున చాదుచుక్క_యునా? అయ్యో! ధర్మాధర్మ విచక్షణ లోకములో నడుగంటినదనుట కీతార్కాణము చాలదా? వివరింప సాధ్యముగాని యా దురన్యాయములనుగూర్చి మనలో మన మూహించుకొనిన చాలును. న్యాయము మనకే తెలియును. అదియట్లుండె. వెఱ్ఱిధోరణిలోబడి విషయము మఱచితిని. మా నాన్న పెండ్లికి సిద్ధమైనాడు. కన్యాన్వేషణ మారంభించినాడు. బహుయత్నముమీద, బహు ధనవ్యయమువిూద, బహు దారుణపు టేర్పాటులమీద నొక కన్య లభించినది.
తలిదండ్రు లాకన్యను మా నాన్నకిచ్చుటకు కొన్ని షరతులను కోరిరి. అవి యేవియనగా తమ కన్యను మా నాన్న కిచ్చుటకు నన్ను తమ కొమారునకు బదులియ్యవలెను. మఱియు తమకు వేయిరూపాయలు కన్యాశుల్కముగూడ నీయవలేను. ఈ యుభయవివాహములను తన కర్చుతో తన యింటనే మా తండ్రి జరుపుకొనవలెను. అంతియేగాక మా యిరువురకును వేయిరూపాయలకు తక్కువగాని నగలను మా నాన్న పెట్టవలెను. మా తండ్రి యన్నిటికిని యొప్పుకొనెను. వివాహము జరిగెను. మా తండ్రి యప్పటికి కొంచెము స్థితి<noinclude></noinclude>
6220d2xb3f9upudvqtsofhv6ch4mql8
పుట:Sarada Lekhalu Vol 1.pdf/56
104
59211
553205
186288
2026-04-16T01:15:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553205
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>32
శారద లేఖలు
జేనెడుచుట్ట
మంతుడేగాని యా వివాహములతో నతఃపాతాళమునకు క్రుంగి
పోయెను. నిండు వార్థక్యమున వివాహఫలముగా మానాయనకు
మిగిలినవి యూరినిండ నప్పులు, భార్యతోడి తిప్పలు—యివి
రెండే! ఇకతరువాత నప్పులు మెండై భార్యతోడి పోరాట
మధికమై విద్యాబుద్ధులు చెప్పింపలేమి మా యన్న లిరువురు
దేశద్రిమ్మరులైరి. రమ్ము పొమ్మనువారు లేమి మా యక్క
లిద్ద ఱింటికి దూరమైరి. ఇక దిక్కు మాలి చిక్కిన మా
చెల్లియు నేనును మా సవతితల్లి చేతిక్రింది బానిసీలమై పడ
రాని బాధలుపడితిమి. ఇంక నా దొక్క ముక్క చెప్పి ముగించె
దను. నా పెండ్లినాటికి నా పెనిమిటికి పదునా జేండ్లున్న వి.
ఆయన యప్పటికే జేనెడు చుట్ట నోటితో, మూరెడు కుచ్చు
తలపాగతో, నూరియందలి కొంటె కోణంగులకు మొదలై
విద్యాబుద్ధి సంపన్ను లగు యోగ్య బాలకులకు వెలియై తిరుగు
చుండెను.' ఆయన కీక పెండ్లి గాదని యెంచియే తలిదండ్రు
లావిధముగా తమ గాదిలి కుమార్తె సుఖమును పణముగానిడి
నన్ను బదులుగాగొని పెండ్లి గావించిరి. కూతుండ్ర కాపురము
కూలద్రోచియైన కొమరుని నొక యింటివానినిజేయు దురాచా
రము మనదేశమున ననాదినుండి యున్న దేగదా! - కొమరుడే
వారిబిడ్డ, వాని క్షేమము విచారింప వలయుటే వారి ముఖ్య
కర్తవ్యము. అందుకు కుమార్తెను బలిగావించుట వారి కొక
తప్పుగాదోచదు; కడుపున బుట్టిన బిడ్డయైనను నాడుదియైనంత
మాత్రమున నెంతనిర్ణయయో కనుడు! చెప్పెడి దేమనగా నేను
యుక్తవయస్కురాలనగు నప్పటికే నా పెనిమిటి సప్తవ్యసన<noinclude></noinclude>
onxzaqrxknxpb7hie83e2htri29yjfb
553251
553205
2026-04-16T06:02:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553251
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|32|శారదలేఖలు|}}</noinclude>మంతుడేగాని యా వివాహములతో నతఃపాతాళమునకు క్రుంగిపోయెను. నిండు వార్థక్యమున వివాహఫలముగా మానాయనకు మిగిలినవి యూరినిండ నప్పులు, భార్యతోడి తిప్పలు—యివి రెండే! ఇకతరువాత నప్పులు మెండై భార్యతోడి పోరాటమధికమై విద్యాబుద్ధులు చెప్పింపలేమి మా యన్నలిరువురు
దేశద్రిమ్మరులైరి. రమ్ము పొమ్మనువారు లేమి మా యక్క లిద్ద ఱింటికి దూరమైరి. ఇక దిక్కుమాలి చిక్కిన మా చెల్లియు నేనును మా సవతితల్లి చేతిక్రింది బానిసీలమై పడరాని బాధలుపడితిమి. ఇఁక నా దొక్కముక్కచెప్పి ముగించెదను. నా పెండ్లినాటికి నా పెనిమిటికి పదునాఱేండ్లున్నవి. ఆయన యప్పటికే జేనెడుచుట్ట నోటితో, మూరెడు కుచ్చు తలపాగతో, నూరియందలి కొంటె కోణంగులకు మొదలై విద్యాబుద్ధి సంపన్నులగు యోగ్యబాలకులకు వెలియై తిరుగుచుండెను. ఆయన కిక పెండ్లి గాదని యెంచియే తలిదండ్రు లావిధముగా తమ గాదిలి కుమార్తె సుఖమును పణముగానిడి నన్ను బదులుగాగొని పెండ్లిగావించిరి. కూతుండ్ర కాపురము కూలద్రోచియైన కొమరుని నొక యింటివానినిజేయు దురాచారము మనదేశమున ననాదినుండి యున్నదేగదా! కొమరుడే వారిబిడ్డ, వానిక్షేమము విచారింప వలయుటే వారి ముఖ్య కర్తవ్యము. అందుకు కుమార్తెను బలిగావించుట వారి కొక తప్పుగాదోచదు; కడుపున బుట్టిన బిడ్డయైనను నాడుదియైనంత మాత్రమున నెంతనిర్దయయో కనుడు! చెప్పెడిదేమనగా నేను
యుక్తవయస్కురాలనగు నప్పటికే నా పెనిమిటి సప్తవ్యసన<noinclude></noinclude>
qyjk7o09ews1ufzlzltttqn60fczbbm
పుట:Sarada Lekhalu Vol 1.pdf/57
104
59212
553206
186289
2026-04-16T01:15:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553206
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారదలే ఖ లు
33
ములఁ జిక్కుకొని యున్న సొమ్మును పాడు జేసికొని చేత
యేగానిలేక మోసములు, దొంగతనములు, దౌర్జన్యములు
చేసి, శిక్షలపాలై పడరానిపాట్లు పడెను. నేను పెద్దదాననై
తరువాతగూడ నన్నో కమారైన తనవద్దకు తీసికొనిపోలేదు.
పైగ రెండు మూడు మాఱులు మా యింటి కేవచ్చి నన్ను
తిట్టియు కొట్టియు, బెదరించియు, నా వంటిమీదనున్న నగలు
నాల్గుగూడ నూర్చుకొనిపోయెను. కష్టమో సుఖమో మీ
రున్న చోటనే నేను గూడ నుందును. తీసికొనిపొండని కాళ్ళు
కడుపులు పట్టుకొని బ్రతిమలాడితిని. ఇదిగో నదిగోయని దీని
ములు గడుపుటయేగాని తీసికొని పోవనేలేదు. ఇఁక నేమిచేయు
దును? పుట్టినింటి బానిసత్వము స్థిరమైనది. దుఃఖము శాశ్వత
మైనది. అట్లెపడియున్నాను. ఇప్పుడా బానిసత్వమునకు గూడ
ప్రాప్తిదీరినది. ఏలనందురా మా తండ్రిగారు గతించి పదిమాస
ములై నది. ఋణదాతలు యిండ్లు భూములు కట్టుకొని పోయి
నారు. పోగా మిగిలిన దీకొంచెమో చేతబట్టుకొని “నా బిడ్డ
లిద్దఱకు నాకు రోజులు గడిస్తే అంతేచాలు. నీ కెక్కడ తెచ్చి
పెట్టగలను? నీదారి నీవు చూచుకొమ్మని నాసవతితల్లి నన్ను
సాగనంపినది. ఆమె వృత్తిగూడ నుత్తమముగా నుండక పోవు
టచే నాకుగూడ నక్కడ నుండుట దుస్సహముగానే యుండెను.
ఆమె వెళ్ళిపొమ్మనుటయే యొకవిధముగా మేలనుకొంటిని.
కాని యెక్కడకు వెళ్లను ? ఇప్పటికి ముప్పదేళ్ళు నిండినవి.
తండ్రి యిల్లుదప్ప వేఱుయిల్లె ఎఱుగను. నా సమ స్తము
3<noinclude></noinclude>
6wonudv3zhob0zthpr50a8vywtyo4dc
553252
553206
2026-04-16T06:09:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553252
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|33}}</noinclude>ములఁ జిక్కుకొని యున్నసొమ్మును పాడుజేసికొని చేత నెఱ్ఱని యేగానిలేక మోసములు, దొంగతనములు, దౌర్జన్యములు చేసి, శిక్షలపాలై పడరానిపాట్లు పడెను. నేను పెద్దదాననైన తరువాతగూడ నన్నొకమారైన తనవద్దకు తీసికొనిపోలేదు. పైగ రెండు మూడు మాఱులు మా యింటికేవచ్చి నన్ను తిట్టియు కొట్టియు, బెదరించియు, నా వంటిమీదనున్న నగలు నాల్గుగూడ నూడ్చుకొనిపోయెను. కష్టమో సుఖమో మీరున్న చోటనే నేనుగూడనుందును. తీసికొనిపొండని కాళ్ళు కడుపులు పట్టుకొని బ్రతిమలాడితిని. ఇదిగో నదిగోయని దినములు గడుపుటయేగాని తీసికొని పోవనేలేదు. ఇఁకనేమిచేయుదును? పుట్టినింటి బానిసత్వము స్థిరమైనది. దుఃఖము శాశ్వతమైనది. అట్లెపడియున్నాను. ఇప్పుడా బానిసత్వమునకు గూడ
ప్రాప్తిదీరినది. ఏలనందురా మా తండ్రిగారు గతించి పదిమాసములైనది. ఋణదాతలు యిండ్లు భూములు కట్టుకొని పోయినారు. పోగా మిగిలిన దేకొంచెమో చేతబట్టుకొని “నా బిడ్డ లిద్దఱకు నాకు రోజులు గడిస్తే అంతేచాలు. నీ కెక్కడతెచ్చి పెట్టగలను? నీదారి నీవు చూచుకొమ్మ"ని నాసవతితల్లి నన్ను
సాగనంపినది. ఆమె వృత్తిగూడ నుత్తమముగా నుండక పోవుటచే నాకుగూడ నక్కడ నుండుట దుస్సహముగానే యుండెను. ఆమె వెళ్ళిపొమ్మనుటయే యొకవిధముగా మేలనుకొంటిని. కాని యెక్కడకు వెళ్లను ? ఇప్పటికి ముప్పదేళ్ళు నిండినవి. తండ్రి యిల్లుదప్ప వేఱుయిల్లె ఎఱుగను. నా సమస్తము<noinclude></noinclude>
a5c323cakqin7u96kel9ov26j9j8g1p
పుట:Sarada Lekhalu Vol 1.pdf/58
104
59213
553207
186290
2026-04-16T01:15:57Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553207
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>34
శారద లేఖలు
పోయినను పోక నిలచినదొక్క యభిమానము. ఆయభిమాన
ముచేత నీచమునకు పాలు వడలేక నెవరియింటికిని బోలేక
_
మరల ఆయన జాడ
యీ విధముగా దుఃఖపడుచున్నాను. నా పెనిమిటి బొ తిగా
కనపడకుండపోయి . రెండేండ్లయినది.
తెలియలేదు. బై రాగులలో కలిసెనని కొండఱును, స్వాముల
వారితో తిరుగుచుండెనని ందఱును, సర్కసుకంపెనిలో చేరె
నని కొందఱును, చెప్పుచున్నారు. ఎంతవఱకు నిజమో తెలి
యదు. పదిరోజులనాడు తిరుపతిలో చూచితిమని మావూరిలో
తిరుపతియాత్రకు వెళ్ళివచ్చిన వారొకరు చెప్ప నీవంటి తల్లివద్ద
నాల్గురూపాయలు తీసికొని యిట్లుపరుగెత్తి వచ్చినాను. తిరు
పతిలో కన్పడలేదు. కాళహ స్తిలో గన్పడలేదు. మరల వెళ్ళి
పోవుచున్నాను. కావలివద్ద పల్లెలో మా చెల్లెలున్నది. దాని
పెనిమిటి కక్కడ పదై దురూపాయల మేష్టరీపని. వారి కే పొట్ట
గడపకున్నది. నా కేమి పెట్టగలరు? పెట్టెదరే యనుకొనుడు.
యేమని వారింట నుందును? ఉండక నెక్కడకు వెళ్లను? ఆశ్ర
యములేని తీఁగవలె” అనునప్పటికీ ఆమెకు కన్నులనిండ నీళ్ళు
వచ్చినవి. దుఃఖభారముచే మాటాడజాలక తలవంచుకొనినది.
ఆమెస్థితి జూచుటచే ఆ బండిలోనున్న మా. కందఱకుగూడ
కన్ను లనీళ్ళు క్రమ్మినవి. కొంతసేపందఱము పరస్పరాలాప
ములులేక నివ్వెఱ చెందినట్లుండిపోతిమి. అప్పుడామె దుఃఖము
నుపశమింపఁజేసికొని కన్నీటిని పైఁట చెఱగుచే తుడుచుకొని
"అమ్మా నాపాడుచరిత్ర మీకు చెప్పదగినది కాదు. మీ సం
తోష ప్రపూర్ణ చిత్తములు నాకష్టగాథ నాలించుటచే శోక<noinclude></noinclude>
pz92zt8vcjc008irbu7w07d688q8v2d
553254
553207
2026-04-16T06:18:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553254
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|34|శారదలేఖలు|}}</noinclude>పోయినను పోక నిలచినదొక్క యభిమానము. ఆయభిమానముచేత నీచమునకు పాలు వడలేక నెవరియింటికిని బోలేక యీ విధముగా దుఃఖపడుచున్నాను. నా పెనిమిటి బొత్తిగా కనపడకుండపోయి రెండేండ్లయినది. మరల ఆయన జాడ తెలియలేదు. బైరాగులలో కలిసెనని కొందఱును, స్వాములవారితో తిరుగుచుండెనని కొందఱును, సర్కసుకంపెనిలో చేరెనని కొందఱును, చెప్పుచున్నారు. ఎంతవఱకు నిజమో తెలియదు. పదిరోజులనాడు తిరుపతిలో చూచితిమని మావూరిలో తిరుపతియాత్రకు వెళ్ళివచ్చిన వారొకరుచెప్ప నీవంటి తల్లివద్ద నాల్గురూపాయలు తీసికొని యిట్లుపరుగెత్తి వచ్చినాను. తిరుపతిలో కన్పడలేదు. కాళహస్తిలో గన్పడలేదు. మరల వెళ్ళిపోవుచున్నాను. కావలివద్ద పల్లెలో మా చెల్లెలున్నది. దాని పెనిమిటి కక్కడ పదైదురూపాయల మేష్టరీపని. వారికే పొట్ట గడవకున్నది. నా కేమి పెట్టగలరు? పెట్టెదరే యనుకొనుడు. యేమని వారింట నుందును? ఉండక నెక్కడకు వెళ్లను? ఆశ్రయములేని తీఁగవలె” అనునప్పటికి ఆమెకు కన్నులనిండ నీళ్ళు వచ్చినవి. దుఃఖభారముచే మాటాడజాలక తలవంచుకొనినది.
ఆమెస్థితి జూచుటచే ఆ బండిలోనున్న మా కందఱకుగూడ కన్నులనీళ్ళు క్రమ్మినవి. కొంతసేపందఱము పరస్పరాలాపములులేక నివ్వెఱ జెందినట్లుండిపోతిమి. అప్పుడామె దుఃఖము నుపశమింపఁజేసికొని కన్నీటిని పైఁటచెఱగుచే తుడుచుకొని "అమ్మా నాపాడుచరిత్ర మీకు చెప్పదగినదికాదు. మీ సంతోష ప్రపూర్ణ చిత్తములు నాకష్టగాథ నాలించుటచే శోక<noinclude></noinclude>
i4rl5w08md23nu226rv6cglqf7lx9d3
పుట:Sarada Lekhalu Vol 1.pdf/59
104
59214
553208
469196
2026-04-16T01:16:16Z
శ్రీరామమూర్తి
1517
553208
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="రహ్మానుద్దీన్" />శారద లేఖలు 35</noinclude>శారద లేఖలు
35
భరితములగును. నా యేడుపు నాకు సర్వదానున్న దే. మిమ్ము
గూఢ నేల చింతింపఁ జేయవలయును? కాని యీ వివాహ
శాసనవృత్తాంతము కొంచెముగా వినియుండుటచే ప్రతికూలుర
వాదనను ఖండించుట కే నా చరిత్రను జెప్పితిని. పిల్లకు యుక్త
వయస్సు వచ్చువరకు పెండ్లి చేయకున్నచో పిల్లయనుమతిని
పెండ్లిచేయవలసి వచ్చుననియు, అవ్యక్తురాలగు బాలిక చక్కని
వాఁడు కావలెననియు చదువుకొనినవాడు కావలెననియు, తం
టాలు పెట్టుననియు, పిల్లకు తెలిసియు దెవియని ప్రాయమగుటచే
బాధ్యత నెఱుగక, స్థితి నెఱుగక, కోరరాని కోరికల గోరు.
ననియు, ఆవిధముగా కన్యను మెప్పింపగల వరుని దెచ్చు టసా
ధ్యమనియు, కాబట్టి ఆడుపిల్లల వివాహ బాధ్యత తలిదండ్రుల
చేతిలోనే యుండుట యుక్తముకాని పిల్లల కొప్పగించుట
ప్రమాదకరమనియు, పెక్కురు వాదించుచున్నారు. నా తండ్రి
కాని నా పెనిమిటి తలిదండ్రులుగాని తా మేమాత్రము బాధ్యత
నెఱిగి మా వివాహములు చేసిరో యోచింపుడు? నా యత్త
మామలు అప్రయోజకుఁడగు కొమారునకు పెండ్లిసేయుటకు
కడుపారగన్న కొమా ర్తెను ముసలివానికిచ్చిరి. కూతురు కాపు
రమటులయ్యె,కొమరుని కాపురమిటులయ్యె. ఇక మాతండ్రియో
వార్థక్యమున 'పెండ్లి కాపపడి తన కాఁపురమును పాడుజేసికొను
టయేకాక నన్ను గూడ బలిబెట్టెను మాకే యధికారమున్న
చో
నట్టి ముసలివానిని యామెగాని యిట్టియయోగ్యుని నేనుగాని
వరించి యుందుమా? ఇది తలిదండ్రులు బాధ్యత నెఱు గకుండఁ
జేసిన యక్రమకృత్యముగాదా? తల్లులారా! ఈదేశమున యిది<noinclude></noinclude>
mvmpzh4741bgc39okhexisb5p8bhy3j
553256
553208
2026-04-16T06:26:15Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553256
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|35}}</noinclude>భరితములగును. నా యేడుపు నాకు సర్వదానున్నదే. మిమ్ముగూఢ నేల చింతింపఁజేయవలయును? కాని యీ వివాహ శాసనవృత్తాంతము కొంచెముగా వినియుండుటచే ప్రతికూలుర వాదనను ఖండించుటకే నా చరిత్రను జెప్పితిని. పిల్లకు యుక్తవయస్సు వచ్చువరకు పెండ్లిచేయకున్నచో పిల్లయనుమతిని పెండ్లిచేయవలసి వచ్చుననియు, అవ్యక్తురాలగుబాలిక చక్కనివాఁడు కావలెననియు చదువుకొనినవాడు కావలెననియు, తంటాలుపెట్టుననియు, పిల్లకు తెలిసియు దెలియని ప్రాయమగుటచే బాధ్యత నెఱుగక, స్థితినెఱుగక, కోరరాని కోరికల గోరుననియు, ఆవిధముగా కన్యను మెప్పింపగల వరుని దెచ్చు టసాధ్యమనియు, కాబట్టి ఆడుపిల్లల వివాహ బాధ్యత తలిదండ్రుల చేతిలోనే యుండుట యుక్తముకాని పిల్లల కొప్పగించుట
ప్రమాదకరమనియు, పెక్కురు వాదించుచున్నారు. నా తండ్రికాని నా పెనిమిటి తలిదండ్రులుగాని తా మేమాత్రము బాధ్యత నెఱిగి మా వివాహములు చేసిరో యోచింపుడు? నా యత్త మామలు అప్రయోజకుఁడగు కొమారునకు పెండ్లిసేయుటకు కడుపారగన్న కొమార్తెను ముసలివానికిచ్చిరి. కూతురుకాపురమటులయ్యె, కొమరుని కాపురమిటులయ్యె. ఇక మాతండ్రియో వార్థక్యమున పెండ్లి కాసపడి తనకాఁపురమును పాడుజేసికొనుటయేకాక నన్నుగూడ బలిబెట్టెను. మాకే యధికారమున్నచో నట్టి ముసలివానిని యామెగాని యిట్టియయోగ్యుని నేనుగాని వరించి యుందుమా? ఇది తలిదండ్రులు బాధ్యత నెఱుగకుండఁ జేసిన యక్రమకృత్యముగాదా? తల్లులారా! ఈదేశమున యిది<noinclude></noinclude>
2hcghuq2forr2vtvki8x7omb3xxzte9
పుట:Sarada Lekhalu Vol 1.pdf/60
104
59215
553210
186292
2026-04-16T01:16:30Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553210
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>36
శారద లేఖ లు
నాయొక్కరిత చరిత్రమేగాదు. ఇట్టి వివాహము లసంఖ్యాక
ములుగా మనదేశమున నిత్యమును జరుగుచున్నవి.
ఇట్టి యక్రమ వివాహ ప్రవాహమును నాపుటకే నేను హర
విలాసశారదాగారి బాల్యవివాహ నిషేధ చట్టము నాహ్వానించు
చున్నాను.నేనేగాదు, దయార్ద్ర హృదయులగు స్త్రీ పురుషులెల్ల
రీబిల్లు నాహ్వానిం చెదరుగాక యని కోరుచున్నాను. అంతియే
పురుషుడు వివాహమాడ
గాక నలుబదేండ్లు మించిన
రాడనియు, అధవా చేసికొనినచో బాలికల జేసికొనరాదనియు
గూడ నేమహనీయుఁడై న శాసనము దీసికొనివచ్చినచో
స్త్రీలోక మామహనీయుని కలకాలము కృతజ్ఞయై స్మరింప
గలదు. దీని సంగతి యిట్లుండనిండు. ఇది భవిష్యద్విషయము.
ఇప్పుడీ బాల్యవివాహ శాసనము విషయమై మన స్త్రీ లు పే
భావముతోఁ జూడరాదు. స్వార్థచింతచే పురుషులు దీనికి
ప్రతికూలురుగానుండ రజస్వలాభయముచే స్త్రీలు దీనికి వ్యతి
రేకలగుట మనగోతిని మనము త్రవ్వుకొనుట సుమా. పిల్లలు
పద్నాలు గేండ్ల వఱకుంచినచో ఈడేరరా? అని అవ్వగారు భయ
ముతో అడిగినారు. తగిన వరులు లభింపక కన్నెలను పదునాలు
గేండ్లవఱకుంచినచో నాపిల్ల లీడేరకుండిరా? చాటునకు సంఘపు
తోడ్పాటును, బహిరంగమునకు బహిష్కారమునా? ఇంతకు
మనకు మన శాస్త్రములు ప్రతికూలముగా లేవు. ప్రతికూల
ముగా నున్నది యాచార ఛాందస శ్రోత్రియ సం.....<noinclude></noinclude>
e5vnao8xonyc6zvchd7vshi77lfe33l
553265
553210
2026-04-16T08:34:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553265
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|36|శారదలేఖలు|}}</noinclude>నాయొక్కరిత చరిత్రమేగాదు. ఇట్టి వివాహము లసంఖ్యాకములుగా మనదేశమున నిత్యమును జరుగుచున్నవి. ఇట్టి యక్రమ వివాహ ప్రవాహమును నాపుటకే నేను హరవిలాసశారదాగారి బాల్యవివాహ నిషేధచట్టము నాహ్వానించుచున్నాను. నేనేగాదు. దయార్ద్రహృదయులగు స్త్రీ పురుషులెల్ల రీబిల్లు నాహ్వానించెదరుగాక యని కోరుచున్నాను. అంతియే గాక నలుబదేండ్లు మించిన పురుషుడు వివాహమాడ
రాదనియు, అధవా చేసికొనినచో బాలికల జేసికొనరాదనియు గూడ నేమహనీయుఁడైన శాసనము దీసికొనివచ్చినచో స్త్రీలోక మామహనీయుని కలకాలము కృతజ్ఞయై స్మరింపగలదు. దీనిసంగతి యిట్లుండనిండు. ఇది భవిష్యద్విషయము. ఇప్పుడీ బాల్యవివాహ శాసనము విషయమై మనస్త్రీ లుపేక్షా
భావముతోఁ జూడరాదు. స్వార్థచింతచే పురుషులు దీనికి ప్రతికూలురుగానుండ రజస్వలాభయముచే స్త్రీలు దీనికి వ్యతిరేకలగుట మనగోతిని మనము త్రవ్వుకొనుట సుమా. పిల్లలు పద్నాలుగేండ్ల వఱకుంచినచో ఈడేరరా? అని అవ్వగారు భయముతో అడిగినారు. తగిన వరులు లభింపక కన్నెలను పదునాలుగేండ్లవఱకుంచినచో నాపిల్ల లీడేరకుండిరా? చాటునకు సంఘపు తోడ్పాటును, బహిరంగమునకు బహిష్కారమునా? ఇంతకు మనకు మన శాస్త్రములు ప్రతికూలముగాలేవు. ప్రతికూలముగా నున్నది యాచార ఛాందస శ్రోత్రియ సం.....<noinclude></noinclude>
9zyzli5mb67adxyiridgjbptm3mzg0x
పుట:Sarada Lekhalu Vol 1.pdf/61
104
59216
553211
186293
2026-04-16T01:16:47Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553211
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
37
రైలు కూయని కూసినది. కావలి స్టేషను వచ్చినది.
'అమ్మా సెలవు' అని నమస్కరించి యామె దిగిపోయినది.
చెప్పదలచిన విషయము పూర్తికాకపోయెనే యని నేను విచా
రించితిని. 'పాపము చాలా కష్టాలుపడిన మనిషి', అని
యొకామె యనెను. 'ఎల్లకాలము దుఃఖపు బ్రతుకే కావడం
వల్ల ఆమెబుద్ధి వై శద్యము వెల్లడి కాకున్నదిగాని చాల తెలివి
గలది కూడాను' యని మఱియొక స్త్రీ య
“చదివిన
దానివలెగూడ నున్నద దని' వేఱకామె బలికెను. 'ఏమిచదువు
కుంటేనేమి ఎంత తెలివుంటేనేమి అటువంటి మొగుడు! అటు
వంటి పుట్టిల్లు! ఆమె తెలివితేట లేమి జేయను? అడవిని గాచిన
`'వెన్నెల' అని వేరొక నారీమణి పలికెను. 'ఏదో భగవంతుండు
ఒక్కొక్కళ్ల మొఖాన అటువంటి అగచాట్లవ్రాత వ్రాస్తూవుం
టాడు.' అనిమఱియొక విచారముదోఁ బలికెను. 'ఇంత
కును మొగుడు చదువుకొన్న వాడు కాకపోవడ మొక గొప్ప
కొఱత. ఏదో కొంచము అక్షరజ్ఞాన మున్న వాడైతే యిట్లా
చేయడని' యింకొకామె రూఢిగాయనెను. 'ఎబ్బె, యిది వట్టి
భ్రమ, చదువుకున్న వాడై తే అట్లాచేయడనీ, చదువుకోని
వాడైతే చేస్తాడనీ యనుకోడం పొరబాటు. మా పింతల్లి
అల్లుడు బి.ఏ. ప్యాసయినాడు. మేనల్లుడేగాని పరాయివాడు
కూడాగాదు. యేమిచేశా డనుకొన్నారు?' అని నెల్లూరు
స్టేషనులో. మాబండిలో కెక్కిన మరియొక యువతి పలికినది.
'ఏమిచేశాడు? ఏమిచేశాడు?'. అని మాబండిలోని స్త్రీ లెల్ల
రొక్క పెట్టున నడిగిరి. ఆమె మఱక కథ చెప్పుట కారంభించి<noinclude></noinclude>
jjpjyxscwsusv6p9pici9tdxwix38ja
553266
553211
2026-04-16T08:41:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553266
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|37}}</noinclude>రైలు కూయని కూసినది. కావలి స్టేషను వచ్చినది. 'అమ్మా సెలవు' అని నమస్కరించి యామె దిగిపోయినది. చెప్పదలచిన విషయము పూర్తికాకపోయెనే యని నేను విచారించితిని. 'పాపము చాలా కష్టాలుపడిన మనిషి' అని యొకామె యనెను. 'ఎల్లకాలము దుఃఖపు బ్రతుకే కావడంవల్ల ఆమెబుద్ధి వైశద్యము వెల్లడి కాకున్నదిగాని చాలతెలివిగలది కూడాను' యని మఱియొక స్త్రీ యనెను. 'చదివిన
దానివలెగూడ నున్నదని' వేఱొకామె బలికెను. 'ఏమిచదువుకుంటేనేమి ఎంత తెలివుంటేనేమి అటువంటి మొగుడు! అటువంటి పుట్టిల్లు! ఆమె తెలివితేటలేమి జేయను? అడవిని గాచిన వెన్నెల' అని వేరొక నారీమణి పలికెను. 'ఏదో భగవంతుండు ఒక్కొక్కళ్లమొఖాన అటువంటి అగచాట్లవ్రాత వ్రాస్తూవుంటాడు.' అనిమఱియొకస్త్రీ విచారముదోఁ బలికెను. 'ఇంతకును మొగుడు చదువుకొన్నవాడు కాకపోవడ మొక గొప్ప
కొఱత. ఏదో కొంచము అక్షరజ్ఞాన మున్నవాడైతే యిట్లా చేయడని' యింకొకామె రూఢిగాయనెను. 'ఎబ్బె, యిదివట్టి భ్రమ, చదువుకున్న వాడైతే అట్లాచేయడనీ, చదువుకోని వాడైతే చేస్తాడనీ యనుకోడం పొరబాటు. మా పింతల్లి అల్లుడు బి.ఏ. ప్యాసయినాడు. మేనల్లుడేగాని పరాయివాడు కూడాగాదు. యేమిచేశా డనుకొన్నారు?' అని నెల్లూరు స్టేషనులో మాబండిలో కెక్కిన మరియొక యువతి పలికినది.
'ఏమిచేశాడు? ఏమిచేశాడు?' అని మాబండిలోని స్త్రీలెల్ల రొక్క పెట్టున నడిగిరి. ఆమె మఱొక కథ చెప్పుట కారంభించి<noinclude></noinclude>
2jm04xlq9t3leyqvw0zjkq7r7t1f399
పుట:Sarada Lekhalu Vol 1.pdf/62
104
59217
553212
186294
2026-04-16T01:17:00Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553212
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>38
శారదలే లు
నది. ఒక్క విషయమై ప్రస్తావన వచ్చినదానిపై నూరు
వృత్తాంతములు వాకొనుట మన స్త్రీలకున్న నై జమేగదా;
ఆమె చెప్పినదిగూడ నొక దీర్ఘకథ. ఇప్పటికే లేఖ కడు దీర్ఘ
మైనది. వ్రాయుటకునాకు విసువు లేకపోయినను చదువలేక నీ
వెక్కడ విసుగు కొందువోయని నాభయము.
ولو
చున్నాను. పై కథకు ముందు లేఖను కనుము.
భావపురి
1928 సెప్టెంబరు
మిత్రురాలు,
శారద.<noinclude></noinclude>
ewi11lg0jtaq7sd7cb3siv3iyi1ciwq
553268
553212
2026-04-16T08:47:56Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553268
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|38|శారదలేఖలు|}}</noinclude>నది. ఒక్క విషయమై ప్రస్తావన వచ్చినదానిపై నూరు వృత్తాంతములు వాకొనుట మనస్త్రీలకున్న నైజమేగదా;
ఆమె చెప్పినదిగూడ నొక దీర్ఘకథ. ఇప్పటికే లేఖ కడు దీర్ఘమైనది. వ్రాయుటకునాకు విసువు లేకపోయినను చదువలేక నీవెక్కడ విసుగు కొందువోయని నాభయము. విరమించుచున్నాను. పైకథకు ముందులేఖను కనుము.
{{rh|భావపురి||మిత్రురాలు.}}
{{rh|1928 సెప్టెంబరు||శారద}}
{{rule|2cm}}<noinclude></noinclude>
7srwuoy0fic030a6cbz9dmq2dz3nzqg
పుట:Sarada Lekhalu Vol 1.pdf/63
104
59218
553213
186295
2026-04-16T01:17:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553213
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ!
సౌభాగ్యవతియగు కల్పలతకు —
గత లేఖ నొకమాఱు స్మరించుకొంటివేని నెల్లూరులో
మా పెట్టెలో కెక్కినయొక స్త్రీ తన పినతల్లి కొమా రెవృత్తాం
తమును చెప్పుటయు నాసమాచారమును లేఖావి స్తరభీతిచే నే
నప్పటి కాపుటయు నీకు జ్ఞాపక
వృత్తాంతమిది: -
జ్ఞాపకమువచ్చును. ఆమె
చెప్పిన
“మా పినతల్లి కసలు యిష్టము లేనే లేదు. మా పినతం
డ్రియే చెల్లెలితో యోచించి పిల్లనిచ్చి పెండ్లి చేసినాడు. పిల్ల
వాడప్పుడు స్కూలు ఫైనలు తరగతిలో చదువుచున్నాడు.
పదునాలేండ్లున్నవి. “తండ్రి రివి న్యూయిలాకా గొప్పహోదా
గల నౌకరీలో నున్నాడు. భూస్థితిగూడా నున్నది. పిల్లవాడు
చదువుచున్నాడు; చిన్నవాడు; చెల్లెలికుమారుడు, న్యాయ
మైన యుక్తమైన మేనరికము. కాబట్టి తండ్రివలె నేదియో
గొప్పయుద్యోగము చేయునని గంపెడాశతో, మాబాబాయి
వారియింటిచుట్టు తిరిగి తిరిగి పిల్లనిచ్చి పెండ్లి జేసినాడు 'బాహ్య
మునకా సంబంధము ఉత్తమోత్తమ మైనదిగానే కన్పడు
చున్నది. కానియిటు పిల్లతల్లియైన మాపిన్ని కాసంబంధమెంత
సమ్మతముగా నున్నదో, అటు పిల్లవాని తండ్రియైన యాయున్న
తోద్యోగికి గూడ అంత సమ్మతముగానే యున్నది. అయితే మా<noinclude></noinclude>
94n8s7rvyarztwzbx8vv8ezevstoxg2
553271
553213
2026-04-16T08:55:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553271
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|39}}</noinclude>సౌభాగ్యవతియగు కల్పలతకు —
నెచ్చెలీ!
గతలేఖ నొకమాఱు స్మరించుకొంటివేని నెల్లూరులో మా పెట్టెలో కెక్కినయొకస్త్రీ తన పినతల్లి కొమార్తెవృత్తాంతమును చెప్పుటయు నాసమాచారమును లేఖావిస్తరభీతిచే నే నప్పటి కాపుటయు నీకు
జ్ఞాపకమువచ్చును. ఆమె చెప్పిన వృత్తాంతమిది: -
“మా పినతల్లి కసలు యిష్టములేనేలేదు. మా పినతండ్రియే చెల్లెలితో యోచించి పిల్లనిచ్చి పెండ్లిచేసినాడు. పిల్లవాడప్పుడు స్కూలుఫైనలు తరగతిలో చదువుచున్నాడు. పదునాఱేండ్లున్నవి. “తండ్రి రివిన్యూయిలాకా గొప్పహోదా గల నౌకరీలో నున్నాడు. భూస్థితిగూడా నున్నది. పిల్లవాడు చదువుచున్నాడు; చిన్నవాడు; చెల్లెలికుమారుడు, న్యాయమైన యుక్తమైన మేనరికము. కాబట్టి తండ్రివలె నేదియో గొప్పయుద్యోగము చేయునని గంపెడాశతో, మాబాబాయి వారియింటిచుట్టు తిరిగి తిరిగి పిల్లనిచ్చి పెండ్లిజేసినాడు బాహ్య
మునకా సంబంధము ఉత్తమోత్తమ మైనదిగానే కన్పడుచున్నది. కానియిటు పిల్లతల్లియైన మాపిన్ని కాసంబంధమెంత సమ్మతముగా నున్నదో, అటుపిల్లవాని తండ్రియైన యాయున్నతోద్యోగికిగూడ అంతసమ్మతముగానే యున్నది. అయితే మా<noinclude></noinclude>
g1y624cy4pl84cimhqhayxgl3mjg7c1
పుట:Sarada Lekhalu Vol 1.pdf/64
104
59219
553214
186296
2026-04-16T01:17:27Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553214
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>40
శారద లేఖలు
పిన్ని కిష్టములేకపోవుటకు కారణ మా సంబంధము మంచిది
కాదనికాదు, "తండ్రీకొడుకుల యిష్టమంతంత మాత్రముగా
నుండ పిల్లనంత బలవంతముగా కట్టిపెట్టుటెందులకు? మనకు
తగిన సుబుధమేదైన చూడరాదా? మనపిల్ల నిష్టపడి చేసి
కొనెడి వారికే యీయరాదా” యని యామె యభిప్రాయము.
కాని మాబాబాయి ఆమెమాటను లక్ష్య పెట్టలేదు. 'ఆయన
ఒప్పుదల ఎప్పుడట్లాగే ఉంటుంది. పెకెవాడు. సరసముగా
సమాధాన మీయడు. ఆయన స్వభావమది. అంతమాత్రము
చేత మనపిల్ల కాపురమున కేమి ప్రమాదమని ' వియ్యంకుని
విషయములోను "పసివాడు, వాడికేమి తెలుస్తుంది; ఇప్పుడు
వద్దువద్దంటే మాత్రము మూడుముళ్లు పడ్డతరువాత పిల్లను
ు
యేలుకోక వెళ్లగొడ్తాడా యేమిటని” పిల్లవాడి విషయము
లోను సమాధానము చెప్పి వివాహము కావించినాడు. పెండ్లి
నాడే ఆపిల్ల వె వైఖరి యెడమొగము
నున్నది. అది చిన్న తనపు చేషయని నునస్సమాధానము
చిన్నతనపు
చేసికొనినాము. ఏదోవిధముగా పెండ్లియైనది. తరువాత పిల్లను
తీసికొని వెళ్ళుట, గృహప్రవేశము చేసికొనుట, మొదలైన
తంతులు జరుగనేలేదు :
పెడమొగముగా
వివాహమైన. ఒక సంవత్సరమునకు మా చెల్లెలు సమ
ర్తాడినది. శాంతినక్షత్రము. శాంత్రి చేసికొనవలసినదని యెన్ని
విధముల తెలియబఱచినను ప్రత్యుత్తరమే లేదు. తుదకు మా
పినతండ్రియే " స్వయముగావెళ్లి "శాంతిమాటేమని<noinclude></noinclude>
ck7v2snyczmbzm3rdvvkybwzzyz5ebo
553274
553214
2026-04-16T09:04:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553274
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|40|శారదలేఖలు|}}</noinclude>పిన్ని కిష్టములేకపోవుటకు కారణ మా సంబంధము మంచిది కాదనికాదు, "తండ్రికొడుకుల యిష్టమంతంత మాత్రముగా నుండ పిల్లనంత బలవంతముగా కట్టిపెట్టుటెందులకు? మనకు తగిన సంబంధమేదైన చూడరాదా? మనపిల్ల నిష్టపడిచేసికొనెడి వారికే యీయరాదా” యని యామె యభిప్రాయము. కాని మాబాబాయి ఆమెమాటను లక్ష్యపెట్టలేదు. 'ఆయన ఒప్పుదల ఎప్పుడట్లాగే ఉంటుంది. పెంకెవాడు. సరసముగా సమాధాన మీయడు. ఆయన స్వభావమది. అంతమాత్రముచేత మనపిల్ల కాపురమున కేమిప్రమాదమని' వియ్యంకుని విషయములోను "పసివాడు, వాడికేమి తెలుస్తుంది; ఇప్పుడు వద్దువద్దంటే మాత్రము మూడుముళ్లు పడ్డతరువాత పిల్లను యేలుకోక వెళ్లగొడ్తాడా యేమిటని” పిల్లవాడి విషయములోను సమాధానముచెప్పి వివాహము కావించినాడు. పెండ్లినాడే ఆపిల్లవాని వైఖరి యెడమొగము పెడమొగముగా నున్నది. అది చిన్నతనపు చేష్టయని మనస్సమాధానము చేసికొనినాము. ఏదోవిధముగా పెండ్లియైనది. తరువాత పిల్లను తీసికొని వెళ్ళుట, గృహప్రవేశము చేసికొనుట, మొదలైన తంతులు జరుగనేలేదు :
వివాహమైన ఒకసంవత్సరమునకు మా చెల్లెలు సమర్తాడినది. శాంతినక్షత్రము. శాంతి చేసికొనవలసినదని యెన్ని విధముల తెలియబఱచినను ప్రత్యుత్తరమే లేదు. తుదకు మా పినతండ్రియే స్వయముగావెళ్లి "శాంతిమాటేమని చెల్లెలి<noinclude></noinclude>
8h6p5nzbguvy3gj109da2o5pkfn9vwr
పుట:Sarada Lekhalu Vol 1.pdf/65
104
59220
553215
186297
2026-04-16T01:17:41Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553215
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
41
నడుగ, “అన్నయ్యా! నేనేమిచేసేది? వాడు నాఅదుపుశిక్షలలో
లేడు. వాడికా తండ్రిగారు సహాయము. శాంతేమిటి సింగినా
దము చేసుకోకపోతే యేమని యిద్దరు ఒక్క మాటగా పల్కు
తున్నారు. ఏమిచేస్తాము? అయిననాటికే అవుతుంది. ఊగుకో”
మన్నదట అంతటితో పులిమి పుచ్చుకొని మాబాబాయి
యింటికి వచ్చినాడు.
మఱి రెండేండ్లు గడచినవి. పిల్లను తీసికొని వెళ్లెడియత్న
మేలేదు. పిల్లవాడప్పుడు ఎఫ్.ఏ. ప్యాసయి బి. ఏ. చదువు
చున్నాడు. పిల్లకు పదునై దేండ్లు నిండి పదునాఱవ
యేడు అగ
పడినది. ఈడేరిన బిడ్డ నెంతకాలమని యింట నుంచుకొందురు?
ఒక వేళ తలిదండ్రులకు భారము లేకపోయినను లోకమునకు
భారముగదా. "మీ - అమ్మాయిని అత్తవారింటి కంపకుండా
వూరుకున్నా `రేమండీ" అని నిత్యమడుగు నమ్మలక్కలకు
సమాధాన విూయలేక సగము వేసారిపోయినాము. ఏదో
ముదుక సామ్యమున్నది వింటిరో, లేదో, కూతురింటికి మఱుగు
దొడ్డికి అసహ్యపడుచునై నను పోకతప్పదట. ఆ విధముగానే
పిల్లను పోషింపలేని పేదవారివలె మా బాబాయి పిన్ని యిద్దరు
కలిసి పిల్లను తీసికొనిపొండి యని చెప్పుటకు, వియ్యాలవారి
యింటి కేగినారు, "మీ కోడలిని మీరు తెచ్చుకొను”డని
బతిమలాడి చెప్పినారు. “నా పెత్తనములేదు, ఆతండ్రియిష్టము,
ఆకొడుకు యిష్టము.” అని వియ్యపురా లని వేసినది. “పిల్లవాని
నడుగుడు, వానికిష్టమైనచో నాకు యిష్టమేనని వియ్యంకు<noinclude></noinclude>
b8bdygyl7qhs1j4ijgf2tn7tmrpu9s7
553326
553215
2026-04-16T11:41:34Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553326
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|41}}</noinclude>నడుగ, “అన్నయ్యా! నేనేమిచేసేది? వాడు నాఅదుపుశిక్షలలో లేడు. వాడికా తండ్రిగారు సహాయము. శాంతేమిటి సింగినాదము చేసుకోకపోతే యేమని యిద్దరు ఒక్కమాటగా పల్కుతున్నారు. ఏమిచేస్తాము? అయిననాటికే అవుతుంది. ఊరుకో” మన్నదట అంతటితో పులిమి పుచ్చుకొని మాబాబాయి యింటికి వచ్చినాడు.
మఱిరెండేండ్లు గడచినవి. పిల్లను తీసికొని వెళ్లెడియత్నమేలేదు. పిల్లవాడప్పుడు ఎఫ్.ఏ. ప్యాసయి బి. ఏ. చదువుచున్నాడు. పిల్లకు పదునై దేండ్లునిండి పదునాఱవయేడు అగపడినది. ఈడేరినబిడ్డ నెంతకాలమని యింట నుంచుకొందురు? ఒక వేళ తలిదండ్రులకు భారము లేకపోయినను లోకమునకు
భారముగదా. "మీ అమ్మాయిని అత్తవారింటి కంపకుండా వూరుకున్నా రేమండీ" అని నిత్యమడుగు నమ్మలక్కలకు సమాధాన విూయలేక సగము వేసారిపోయినాము. ఏదో ముదుక సామ్యమున్నది వింటిరో, లేదో, కూతురింటికి మఱుగుదొడ్డికి అసహ్యపడుచునైనను పోకతప్పదట. ఆ విధముగానే పిల్లను పోషింపలేని పేదవారివలె మాబాబాయి పిన్ని యిద్దరు కలిసి పిల్లను తీసికొనిపొండి యనిచెప్పుటకు, వియ్యాలవారి యింటి కేగినారు, "మీ కోడలిని మీరు తెచ్చుకొను”డని బతిమలాడి చెప్పినారు. “నాపెత్తనములేదు, ఆతండ్రియిష్టము, ఆకొడుకు యిష్టము.” అని వియ్యపురా లనివేసినది. “పిల్లవాని
నడుగుడు, వానికిష్టమైనచో నాకు యిష్టమే"నని వియ్యంకు<noinclude></noinclude>
rgmu784itc5rib5r71517ncb88p2orf
పుట:Sarada Lekhalu Vol 1.pdf/66
104
59221
553216
469357
2026-04-16T01:17:57Z
శ్రీరామమూర్తి
1517
553216
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="2401:4900:4E1B:F098:7555:330C:DA76:8F99" /></noinclude>42
లేఖలు
డనినాడు. శీతకాలపు సెలవుదినములగుటచే అప్పుడు అల్లుడు
గూడ నక్కడనే యున్నాడట. అతనిని చూచి “ఏమిరానాయనా
ఎప్పుడు భార్యను తెచ్చుకుంటావు?" అని మేనమామ
ముద్దు గానడుగ "నావద్ద ఆప్రస్తావన చేయవద్దని” గొడ్డలి
పెట్టుగా ఒక్క మాట అని వేసినాడట. "అయితే అబిడ్డగ తేమిరా
అన "దై వాన్ని అడగండి నన్నడిగేదెందుకు? నన్నడిగే పేం
డ్లిచేశారా?” అన్నాడట. అంతటితో వారు నెత్తినోరు మొత్తు
కొనుచు, వియ్యంకుని వద్దకుబోయి. “అయ్యో! ఈ అన్యాయ
మేమిటి? మీరైనా చెప్పండి వింటాడేమో?” అనియడుగ
“వాడు చిన్న వాడు కాడు, వాడిమంచి చెడ్డలు వాడెఱుగును;
కాబట్టి వాడికాఁపురపు విషయములో నాకు జోక్యము లేదు.
వాడియిష్టము. మీ యిష్టము” అన్నాడట. అంతటితో
హతాశులై "అలో” యని యేర్చుచు వారు యింటికి వచ్చి
నారు. నాటినుండి యాత్రనికి పరిచయులగు వారిచే నయము
నను, భయమునను, చనవునను, స్నేహభావమునను దయా
పురస్సరముగను, 'ఆపిల్లను దెచ్చుకొమ్మని చెప్పింప ‘నాకు వద్దు'
అనీ యొక్క టేమాట.
"కారణమేమి, ఆపిల్లయందేదైన తప్పు కని పెట్టితివా?''
56
“లేదు”
'చక్కనిది కాదా?”
“నేను చెప్ప లేను”<noinclude></noinclude>
jxwydqhczjm62ogd621pomtsb7hcg0u
553330
553216
2026-04-16T11:47:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553330
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|42|శారదలేఖలు|}}</noinclude>డనినాడు. శీతకాలపు సెలవుదినములగుటచే అప్పుడు అల్లుడు గూడ నక్కడనే యున్నాడట. అతనినిచూచి “ఏమిరానాయనా ఎప్పుడు భార్యను తెచ్చుకుంటావు?" అని మేనమామ ముద్దుగానడుగ "నావద్ద ఆప్రస్తావన చేయవద్దని” గొడ్డలిపెట్టుగా ఒక్కమాట అనివేసినాడట. "అయితే ఆబిడ్డగతేమిరా అన "దైవాన్ని అడగండి నన్నడిగేదెందుకు? నన్నడిగే పెండ్లిచేశారా?” అన్నాడట. అంతటితో వారు నెత్తినోరు మొత్తుకొనుచు, వియ్యంకుని వద్దకుబోయి. “అయ్యో! ఈ అన్యాయ మేమిటి? మీరైనా చెప్పండి వింటాడేమో?” అనియడుగ “వాడు చిన్నవాడుకాడు, వాడిమంచిచెడ్డలు వాడెఱుగును; కాబట్టి వాడికాఁపురపు విషయములో నాకుజోక్యములేదు. వాడియిష్టము. మీ యిష్టము” అన్నాడట. అంతటితో
హతాశులై "అలో” యని యేడ్చుచు వారు యింటికివచ్చినారు. నాటినుండి యాతనికి పరిచయులగు వారిచే నయమునను, భయమునను, చనవునను, స్నేహభావమునను దయా పురస్సరముగను, 'ఆపిల్లను దెచ్చుకొమ్మని చెప్పింప ‘నాకు వద్దు' అని యొక్కటేమాట.
"కారణమేమి, ఆపిల్లయందేదైన తప్పు కనిపెట్టితివా?''
“లేదు”
"చక్కనిది కాదా?”
“నేను చెప్పలేను”<noinclude></noinclude>
o8deqgjb3061mf3kasmwv4re98vfsv6
పుట:Sarada Lekhalu Vol 1.pdf/67
104
59222
553217
186299
2026-04-16T01:18:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553217
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
43
'లేకపోయిన పునస్సంధాన కట్నమేమైన కావలెనా?''
"వద్దు”
“అయినచో నిరపరాధయగు నా బాలిక నకారణముగా
నీవు విడనాకుటకు కారణమేమి?'
"ఏమో నేను చెప్పజాలను. ఆపిల్లయందు నాకు భార్యా
విషయ కానురాగము కలుగలేదు. కాన వద్దు”.
“ఏ పాప మెఱుగని యా బిడ్డయందు నీవిట్లు నిర్దయుడ
వగుట తప్పుగాదా? నీవైనచో బుద్ధిపుట్టినప్పుడు మతొక
భార్యను పెండ్లాడుదువు. కాని నిరపరాధియగు నా బాలిక కాక
తరణోపాయమే లేదుగదా?''
“ లేకపోవచ్చును .అది ఆమె తలిదండ్రుల లోపముకాని
నాది కాదు.
నా అయిష్టతను నేను నా వివాహకాలమందే
సూచించితిని. ఆసంగతిని గమనింపకయే నాకు వారామెను
గట్టి పెట్టిరి. కాన యామె సుఖము చెరచిన వారామె తలిదం
డ్రులేకాని నేనుగాడు. అట్టిజననీజనకుల కడుపున బుట్టినందుల
కామె యాదుఃఖ మనుభవింప వలసిన దేశాని నేనేమి చేయు
“తల్లిదండ్రులు స్వతంత్రించి వివాహముచేయుట మన
దేశములో ననాదిగ జరుగుచున్న యాచారము. ఆయాచా
రము మంచిదికానిచో నీబిడ్డలకు నీవట్లు చేయుట మానుము.
కాని యొక తల్లి బిడ్డను నీ వీ విధముగా ఆ దురాచారమునకు
బలి పెట్టవచ్చునా?”<noinclude></noinclude>
p958p19cdov49wuwxokta11bxacbrig
553343
553217
2026-04-16T11:54:17Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553343
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|43}}</noinclude>"లేకపోయిన పునస్సంధాన కట్నమేమైన కావలెనా?"
"వద్దు”
“అయినచో నిరపరాధయగు నాబాలిక నకారణముగా నీవు విడనాడుటకు కారణమేమి?"
"ఏమో నేను చెప్పజాలను. ఆపిల్లయందునాకు భార్యావిషయ కానురాగము కలుగలేదు. కాన వద్దు”.
“ఏపాపమెఱుగని యాబిడ్డయందు నీవిట్లు నిర్దయుడవగుట తప్పుగాదా? నీవైనచో బుద్ధిపుట్టినప్పుడు మఱొక
భార్యను పెండ్లాడుదువు. కాని నిరపరాధియగు నాబాలికకిక తరణోపాయమే లేదుగదా?"
“లేకపోవచ్చును. అది ఆమె తలిదండ్రుల లోపముకాని నాదికాదు. నా అయిష్టతను నేను నా వివాహకాలమందే సూచించితిని. ఆసంగతిని గమనింపకయే నాకు వారామెను గట్టిపెట్టిరి. కాన యామె సుఖము చెరచిన వారామె తలిదండ్రులేకాని నేనుగాదు. అట్టిజననీజనకుల కడుపున బుట్టినందులకామె యాదుఃఖ మనుభవింప వలసినదేకాని నేనేమి చేయుదును?"
“తల్లిదండ్రులు స్వతంత్రించి వివాహముచేయుట మనదేశములో ననాదిగ జరుగుచున్న యాచారము. ఆయాచారము మంచిదికానిచో నీబిడ్డలకు నీవట్లుచేయుట మానుము. కాని యొకతల్లిబిడ్డను నీ వీ విధముగా ఆ దురాచారమునకు బలిపెట్టవచ్చునా?”<noinclude></noinclude>
0851tg4vtcvohubgw5vu9v1yly3bam6
పుట:Sarada Lekhalu Vol 1.pdf/69
104
59224
553218
186301
2026-04-16T01:18:31Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553218
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
45
త్ర్యము లేదు. బంధువర్గపు తోడ్పాటు లేదు. సంఘసహకారము
లేదు. ఇక నేమి చేయును? పురుషుని స్వార్థమునకు బలియై
పోవును. మా చెల్లెలని నే నభిమానముతోఁ జెప్పుటలేదు. ఆ
బాలిక యెంత యు త్తము రాలనుకొంటిరి? ఆ అమాయకమునకు
ఆ సౌద్యు భాషణములకు, ఆ వినయసంప త్తికి, ఆవిద్యా సంపత్తి
కామె శ్రీరామచంద్రుని యిల్లాలైన యా సీతమ్మ కేసాటి.
ఇల్లువదలి యీవలికిరాదు; ఎవరితోడను మాట్లాడదు; ఏ.
లోకాభిరామాయణములకు బోదు; ప్రపంచపు గొడవే యామె
కక్కర లేదు. ఉన్నప్పుడు పని లేనియప్పుడు గ్రంథము. ఈ రెండే
యామె కాలక్షేప సాధనములు. ఆమె యెప్పుడును పెద్దగా
యేడ్చినట్లు చూడలేదు. కాని యావిశాల లోలలోచనముల
యందు లజ్జాదుఃఖములు స్థిరనివాస మేర్పరచుకొనినట్లమె
మానవదనమును తిలకించినవారికి స్ఫుటముగా గన్పట్టుచుం
డును. ఆమె సాధారణముగా నవ్వనే నవ్వదు. ఒక వేళ నవ్వి
నను చిఱునవ్వే! ఆ నవ్వులో గూడ జీవములేదు, చూడు ఒక
జీవితమొక పురుషునిపై నెట్లు నిర్భరపడియున్నదో! ఒక
ప్రాణముదీసిన నేరముకంటె నొక స్త్రీ సుఖమును, సంతో
షమును, ఉత్సాహోల్లాసములను నాశము జేసి జీవన్మృతురాల
నుగాఁ జేసిన నేరము బలవత్తరమైనది. కాని ప్రథమ నేరమున
కురిశిక్ష వేయుదురు. కాని ద్వితీయనేరమునకు పరిశీలన యేలేదు.
ఈ జీవన్మృత్యావస్థకన్న బలవన్మరణమే మేలనిగదా పెక్కు
మందిస్త్రీ లే నూతిలోనో గోతిలోనోపడి చచ్చుచుందురు.
ఇట్టి మరణములకు పంచాయతీసంఘము లే కడుపునొప్పియో<noinclude></noinclude>
osahvo99e1i53bg6ccaj4b4xsyn9tsm
పుట:Sarada Lekhalu Vol 1.pdf/70
104
59225
553219
186302
2026-04-16T01:18:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553219
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>46
శార ధ లేఖ లు
మూర్ఛయో పిచ్చియో హేతువని నిరూపించినను ప్రతి నిరాదర
ణమే యదార్థ హేతు వనునది బహిరంగ రహస్యమేగదా!
కాబట్టి నేను చెప్పున దేమనగా పెనిమిటి చదువరి కాకపోవుటొక:
లోపముకాదు. కుంటిగాడు; గ్రుడ్డికాదు; నిరక్షరకుక్షి గాదు;
పట్టభద్రుడే. అతడిట్లు చేయుటకు కారణమేమి? బాల్యవివాహ
మనుటకంటె వేరేమి యనగలము! అంతియేగాదు, అబలయు
ప్రతిక్రియా సామర్థ్యరహితయునగు స్త్రీయందు పురుషునకుగల
యు చాసీనతగూడ యిందులకొక ముఖ్యకారణము.
ఈ మధ్య నీ బాల్య వివాహ నిషేధ చట్టమునుగూర్చి
మాగ్రామముననొక సభ జరుగ యీ బిల్లునకు ప్రతికూలముగ
మాట్లాడిరట. అంతలో వృద్ధుఁడగు మాసినతండ్రి సభలో
నిలిచి తనకొమా ర్తె దుఃఖగాధను సంతత కన్నీటిధారలతో
నేకరువు పెట్టి “నాయనా, నేను గూడ పూర్వాచార పరాయణు
డనే, ఈ యశుభవమే కాకపోయినచో నేను గూడ మీకంటే
నెక్కు వగ నెగిరిపడువాడనే; కాని స్వానుభవము నానోరు
నొక్కినది. కాన యేబిల్లుకై స వ్యతి రేకింపుడు గాని వధూవరు
లకు వైవాహిక బాధ్యతనొసంగెడి యీ బాల్యవివాహ నిషేధ
చట్టమునకు మాత్రము ప్రతికూలముగా తీర్మానములు గావించి
యాడపిల్లలనోట మట్టిగొట్టకుడు. నూరేండ్ల పంట. అం
తయు మనదేనని నావలెనే బాధ్యతయంతయు నెత్తిపై వేసుకొని
యనుకూలములేని వివాహములు గావించి యల్లాడుటకంటె
చిఱకాలము కష్టసుఖద్వందమగు సంసారయాత్ర సాగింపవలసిన<noinclude></noinclude>
jmtw9j6tupsebl9bzurtjwqft4ati31
పుట:Sarada Lekhalu Vol 1.pdf/72
104
59227
553220
186304
2026-04-16T01:19:08Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553220
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>48
శారద లేఖలు
తిష్ఠ. మీరు చెప్పినట్లు వంకలేని బిడ్డనిచ్చి పెండ్లిచేసినప్పుడే
విడనాడుటింత సులువై నప్పుడు కుంటాడనీ గ్రుడ్డిదనీ రోగిష్టియనీ
అనాకారియనీ వంధ్యయనీ భార్యను వదలినవారెందరో విచా
రించండి. ఆడదిమాత్రము పుట్టుగ్రుడ్డికిచ్చినా కిమ్మనరాదు.
వింటిరోలేదో నా పెనిమిటి పుట్టంధుడు" అనెను. “అట్లాగా
పాపము! అటువంటి పుట్టుగ్రుడ్డి కెట్లాయిచ్చారండీ!” అని అంద
ఱమొక్కమారుగా వంటిమి. ఆమె చెప్పసాగినది. ఆ చరిత్ర
ముందు వ్రా సెదనులెమ్ము.
భావపురి
1928 నవంబరు
ఇట్లు
శారద .<noinclude></noinclude>
dlygqztho7ps2ha3quaej95109gv65l
పుట:Sarada Lekhalu Vol 1.pdf/73
104
59228
553221
186305
2026-04-16T01:19:22Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553221
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ!
అయి
సౌభాగ్యవతియగు కల్పలతకు
దేండ్లకు పూర్వ మొకనాడు శారదానికేతన
సమాచారమును పత్రికలలో జూచి ఆహా! నేటికి గదా ఆంధ్ర
కన్యల తపము ఫలించెనని యానందించి యెప్పుడు గుంటూరు
వెళ్ళుదును యెప్పుడు శారదాలయము గాంతునని యుబలాట
పడి పడి కొన్నాళ్ళకు గుంటూరు వెళ్లితిని. శారదాని కేతన
మెక్కడనని మా సోదరుల నడిగితిని.
సనాతన ధర్మమండలి
వారి పాఠశాలయే శారదానికేతముగా మారెనని వారనిరి.
అచ్చటికిపోయి చూచితిని, పాఠశాల సాధారణ ఫక్కినే
యుండెను. నికేతనము వారు పత్రికలలో దీర్ఘ ముగా
ప్రచు
రించిన విద్యావిధాన మేదియు నక్కడ ఆచరణమందు గన్పడ
లేదు. నాకు మిక్కిలి కోపమువచ్చెను. “పత్రికలలో గంభీర
ప్రకటనలు, చూడబోయిన నేమియు లేక పోవుటలు,
భక్తుల కిది పరిపాటిగా నున్నట్లున్నది. పత్రికలనుగాంచి ధన
పొరబాటు" అని యేవగించుకొని
సహాయము
దేశ
యింటికివచ్చితిని, గాని ది పుట్టి యెన్నాల్లో గాలేదు.
అప్పుడే యింత పెద్దది కమ్మన్న నెట్లగునను వెనుక చూపే నాకు
తగు లేదు.<noinclude></noinclude>
hkfumv26ejsygoaeca4kplxt1nykz4y
పుట:Sarada Lekhalu Vol 1.pdf/74
104
59229
553222
186306
2026-04-16T01:19:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553222
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>50
లగు
నా
శారద లేఖలు
సంతస
ఒక సంవత్సరము గడచిన తరువాత మరల నొకమాఱు
గుంటూరు వెళ్లితిని. శారదానికేతన మెట్లున్నదని మరల
మాసోదరుల బ్రశ్నించితిని. “చక్కగానున్నది. ఒక విశాల
సౌధములోనికి మార్చబడినది. చాలముది బాలికలు గురుకుల
వాసీనులుగా జేరినారు. ఇపుడు చూచిన సంతృప్తిఁ జెందుదువు”
అనిరి. వెంటనే వెళ్ళి చూచితిని. నిజముగా పాఠశాల మాఱి
పోయెను. ఆ గురుకుల వాసినులగు బాలికలను, జాతీయము
విద్యాపద్ధతులను చూడగనే నా కెనలేని
మొదవెను. తక్షణమే ఆ విద్యాలయము” విూదను .ఆ విద్యా
లయ ప్రతిష్ఠాపకులమీదను నా కెనలేని భక్తిప్రేమలు కుదురు
కొనెను. నాడాది నేనెన్ని మాఱులు గుంటూరు వెళ్ళినను
ఆ విద్యాలయమున కొకమాఱు వెళ్లి
స్త్రీల
పాలిటి కది కల్పతరువువంటి ప్రతిష్ఠాపనమనియు, ఎవరు
విద్యాభివృద్ధిని కాంక్షింతురో, ఎవరికి దేశభ క్తియు జాతీయ
తాభిమానమును గలదో అట్టి వారెల్లరా విద్యా ప్రతిష్ఠాపన
మును నాదరించి పోషింపవలయుననియు నాతలంపు కాన పలు
మాఱులాపాఠశాలను దర్శించి వచ్చుచుందును.
చూడకరాను.
మా సోదరులుండుటచే నాకు గుంటూరు ప్రయాణ
మేడాదికొకటి రెండుమాఱులు తగులుచుండును. X
మాసాంతమున మరల గుంటూరు వెళ్లితిని. బ్రాడీపేటలో
నాకు నీవంటి యాప్తురాలగు స్నేహితురాలుండెను. ఆమెను
చూచుటకై వెళ్లితిని, కాని ఆమె యింట లేదు.
-
అప్పటికి<noinclude></noinclude>
g9vyj79yfz6tb2ha47ijpesc0v6lz4s
పుట:Sarada Lekhalu Vol 1.pdf/75
104
59230
553223
186307
2026-04-16T01:19:56Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553223
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
51
దాదా పై దుగంటలు దాటినది. కాని నా ప్రేమపాత్రమగు
శారదాని కేతన మచ్చటి కనతిదూరముననే యుండుటచే
నాయడుగటుపడెనేగాని యింటినై పునకు తిరుగు లేదు. చరమ
సంధ్యాకాంతులతో పశ్చిమాళ రాగరంజితమై మనోజ్ఞ ముగ
నుండెను. ఆరుబయలు నుండి వీచెడు హోరుగాలి చలిచలిగా
నుండెను. నేనారై లుకట్ట ప్రక్కనున్న రప్తాదారినిబట్టి వడి
వడిగా శారదాని కేతమున కేగసాగితిని. నాకు వంటపని
యున్న దమ్మా యనియు, నేను పాఠములు చదువుకొనవలసి
యున్నది, ని కేతనమున కేగి వచ్చునప్పటికి బాగుగా చీకటిపడు
నేమో ఎట్లాగత్తా? అనియు, నాతో వచ్చిన మావది నెయు,
మా మేనగోడలును తొందరించిరి. వారిమాటలు నా చెవి
దూర లేదు. నన్ను వీడిపోలేక వారును నా వెంట నేవచ్చిరి. సింహ
ద్వారమను నామము సార్థకంబున ట్లిరువైపుల సింహపు
మూర్తులుగల సింహద్వారమున నికేతనములోనికి బ్రవేశించి
తిమి. ద్వారముదాటి నాలుగడుగులు లోని కేగగనే నికేతన
పాదపములకు నీళ్లువోయుచున్న గురుకుల వాసినులు మా కెదు
రైరి. వారిని చూడగనే కణ్వాశ్రమమున చెట్లకు నీళ్లుపోసిన
శకుంతలాప్రియంవదలు జ్ఞాపమునకు వచ్చిరి. కాళిదాస మహా
కవి యక్షరరూపమున జూపినదానిని నికేతన ప్రతిష్ఠాపకులు
ప్రత్యక్షరూపమున జూపుచున్నారుగదాయని లోలోన హర్షిం
చుచు లోని కేగ వార్షికోత్సవమునకు సిద్ధపడెడి యత్నములతో
నిండి గై సేయనున్న కాంతవలె శారదానికేతనము గన్పట్టెను.
చీఁకటిపడుచున్నను వార్షికోత్సవమునాటికి తయారు కావలె<noinclude></noinclude>
ruruy4m9qm2cenbqu3n5m68jyz64mry
పుట:Sarada Lekhalu Vol 1.pdf/76
104
59231
553275
186308
2026-04-16T09:07:09Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553275
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>52
శారద లేఖలు
సనెడి తలంపుతో తదేకదృష్టితో చిత్తరువులను వ్రాయుచున్న
ఉపాధ్యాయులతో విద్యార్థినులతో నున్న చిత్రకళా
మందిరము నొకమాఱు కన్నారుగాంచి పట్టువస్త్రముల పై
కద్దరువస్త్రములపై సరిగతోడను పట్టుతోడను విచిత్రలతా
వితానములఁ జిత్రింపుచున్న కుట్టుతరగతి బాలల నొకమాఱు
మోదమున తిలకించి, వార్షికోత్సవపు ఆటపాటలలో పాల్గొన
నాయ త్తపడుచున్న కన్యకామణుల గాన కౌశలము నొకమాఱు
శ్రవణపేయముగా నాలకించి, తరువాత పాఠశాలను తదితర
ప్రదేశములను చూచి యింటికి మరలితిమి.
ఆ తరువాత నాలుగై దుదినములకు వచ్చెవచ్చె నను
కొనుచున్న వార్షికోత్సవపు దినములువచ్చెను. తొలినాటి
(1.12.28) యుదయము నికేతనములో నూతనముగా గట్ట
బడిన గృహప్రవేశోత్సవము శాస్త్రోక్తముగా జరుపఁబడెనట.
దానిని నేను చూడలేదు. ఆ సాయంత్రము వెళ్లి విద్యాలయ
బాలికలచే తయారుచేయబడిన కుట్టు, పేము, చిత్రముల
ప్రదర్శమునమునుచూచి యొక తాతగారు చెప్పిన హరికథ
నొక కొంతవిని యింటికివచ్చితిమి. మఱునాడు వార్షికోత్సవము.
ఆ యుత్సవసందర్శన కుతూహలురై యితర గ్రామములనుండి
స్త్రీపురుషు లెందరో వచ్చిరి. ఇంక నూరివారి యుత్సాహ
యత్నములు చెప్పనే యక్కఱలేదు. గుంటూరునందలి ప్రతి
స్త్రీయును ఆనాడు నిద్రలేచినది మొదలు శారదానికేతమున
కేగెడి యత్నములోనే యుండెనని చెప్పవచ్చును. సభారంభము<noinclude></noinclude>
2ya8cd4o5x75zuh6x5tfbekz5hpu14l
పుట:Sarada Lekhalu Vol 1.pdf/77
104
59232
553277
186309
2026-04-16T09:07:29Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553277
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
53
మూడుగంటలకై నను నొంటిగంటనుండియే స్త్రీ పురుషు లెల్లరు
జట్కాలమీదను, ఒంటెద్దు బండ్ల మీదను, మోటార్కారుల
విూదను, కాలినడకను, తండోపతండములుగ పోజొచ్చిరి.
ప్రతివారిని చోటుదొరకదను భయమే పీడించుటచే యెవరికి
సాధ్యమైనంత వేగముగా వారు శారదానికేతనమునకు చేరు
కొనిరి. మేము వెళ్ళునప్పటికి దాదాపు మూడుగంటలు
కావచ్చెను. అప్పటికే జనసమూహము విశాలమగు పందిరిని
క్రిక్కిరిసియుండెను. మాకంటే ముందువచ్చియుండిన మాచిన్న
వదినగారి సాయమువలన మాకు కొంచెమనుకూలమగు
ప్రదేశమే కూర్చుండుటకు దొరికెను. మా తరువాత వచ్చిన
వారికి నిలువుజీతమే. కార్యక్రమము సరిగా మూడుగంటల
కారంభమయ్యెను. హైదరాబాదు వాస్తవ్యులగు ధర్మవీర్
వామన 'రామచంద్రనాయక్ గారు నాటి సభాధ్యక్షులు. అధ్య
క్షుల యుపన్యాసము స్త్రీల యభివృద్ధికిఁ దోడ్పడెడి పెక్కు
హితములతో నుండెను. స్త్రీపురుషులు కార్యక్షేత్రములు
భిన్న ములుగాన స్త్రీపురుషుల విద్యావిధానము
గూడ భిన్న మై
యుండవ లెనని తగు హేతువులతో వారు నిరూపించిరి. మఱియు
ప్రేమ, దయ, శ్రద్ధ, ఉత్సాహము, సేవాపరాయణత, స్వార్థ
త్యాగము మున్నగునవి స్త్రీ గుణములనియు, ధైర్యము,
శక్తి, పూనిక, వీరత్వము, కష్టపడి పనిచేయు నలవాటు
మున్నగునవి పురుషుల గుణములనియు వారు తెల్పిరి. కార్య
క్షేత్రములు భిన్నములు కావచ్చును కాని స్త్రీ పురుషు లెల్లరు
జాతిసామ్యమున ఏకమానవజాతికే చెందియున్నారు.<noinclude></noinclude>
9eh6rvtgs1kpah8l1sg4pmgcbgzewhl
పుట:Sarada Lekhalu Vol 1.pdf/78
104
59233
553278
186310
2026-04-16T09:08:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553278
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>54
లేఖలు
పై యుత్తమగుణములన్నియు మానవజాతి కంతటికిని కావల
సినవే. గుణశీలములకు లింగ భేదము లేదు. స్త్రీగుణమని పురు
షుడు దయను విడనాడినచో స్త్రీ మాడిపోవలెను. పురుష
గుణమని స్త్రీ పాటుబడుట మానినచో పురుషు డన్న మున కై
నాయక్ గారి నిర్ణయముప్రకారము
యలమటింపవలెను.
ధైర్యము, కష్టసహిష్ణుత, పుంలింగమునకు చెందినవి. స్వార్థ
త్యాగము, సేవాపరాయణత స్త్రీలింగమునకు చెందినవి. కాని
ధైర్యములేనిది స్వార్థత్యాగముగాని, కష్ట సహిష్ణుత లేనిది.
సేవాపరాయణతగాని' చేయచొప్పడదు. కానీ నొకకార్య
సాధనకు స్త్రీపురుషుల తోడ్పాటెట్లవసరమో అట్లే యుభయ
గుణ సమ్మేళనముగూడ నవసరము. ఇట్టి శంకలకు తావిచ్చెడి
యంశము లొకటి రెండున్నను మొత్తముమీద అధ్యక్షుల
యుపన్యాసము స్త్రీజనాభ్యుదయ కరములగు పెక్కు దివ్యోప
దేశములతోగూడి గంభీర భావభరితమై గమనార్హముగ
నుండెను. "అనంతరము లక్ష్మీనారాయణ పంతులుగారు గతసం
వత్సర కార్యని వేదిక మును జదివిరి. తరువాత గురుకుల బాలికల
యాటపాటలారంభ మయ్యెను. తొలుతనొక బాలిక దైవప్రార్థ
నముచేసెను. తరువాత నిరువురు బాలికలు . గానము చేసిరి.
జాతీయగీతమును బాడిరి. తరువాత కొందరు బాలికలు రామ
భజన చేసిరి.
తెలుఁగు, సంస్కృతము, హిందీ, మూడు
భాషలలో నాటక భాగములను ప్రదర్శించిరి. మూడు భాషల
యందును వారివాచకము మనోజ్ఞ ముగ నేయుండెను.
సంస్కృ
తమున వారు భాషించునప్పుడు ప్రాచీనఋషి, కన్యల దలపించిరి.<noinclude></noinclude>
pdderazy7hjzx85oyoyhovxpt7n9g7g
పుట:Sarada Lekhalu Vol 1.pdf/79
104
59234
553279
186311
2026-04-16T09:08:32Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553279
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
53:
మూడుగంటలకై సను నొంటిగంటనుండియే స్త్రీ పురుషులెల్లరు
జట్కాలమీదను, ఒంటెద్దు బండ్ల మీదను, మోటా ర్కారుల
మీదను, కాలినడకను, తండోపతండములుగ పోజొచ్చిరి.
ప్రతివారిని చోటుదొరకదను భయమే పీడించుటచే యెవరికి
సాధ్యమైనంత వేగముగా వారు శారదాని కేతనమునకు చేరు
కొనిరి. . మేము వెళ్ళునప్పటికి దాదాపు మూడుగంటలు
కావచ్చెను. అప్పటికే జనసమూహము విశాలమగు పందిరిని
క్రిక్కిరిసియుండెను. మాకంటే ముందు వచ్చియుండిన మాచిన్న
వదినగారి సాయమువలన మాకు కొంచెమనుకూలమగు.
ప్రదేశమే కూర్చుండుటకు దొరికెను. మా తరువాత వచ్చిన
వారికి నిలువుజీత మే. కార్యక్రమము సరిగా మూడుగంటల
కారంభమయ్యెను. హైదరాబాదు వాస్తవ్యులగు ధర్మవీర్
వామన రామచంద్రనాయక్ గారు నాటి సభాధ్యక్షులు. అధ్య
క్షుల యుపన్యాసము స్త్రీల యభివృద్ధికిఁ దోడ్పడెడి పెక్కు
హితములతో నుండెను. స్త్రీపురుషులు కార్యక్షేత్రములు
భిన్న ములుగాన స్త్రీపురుషుల విద్యావిధానముగూడ భిన్న మై
యుండవలెనని తగు హేతువులతో వారు నిరూపించిరి. మఱియు
ప్రేమ, దయ, శ్రద్ధ, ఉత్సాహము, సేవాపరాయణత, స్వార్థ
త్యాగము మున్నగునవి స్త్రీగుణములనియు, ధైర్యము,
శక్తి, పూనిక, వీరత్వము, కష్టపడి పనిచేయు నలవాటు
మున్నగునవి పురుషుల గుణములనియు వారు తెల్పిరి. కార్య
క్షేత్రములు భిన్నములు కావచ్చును కాని స్త్రీ పురుషులెల్లరు
జాతిసామ్యమున ఏక మానవజాతికే చెందియున్నారు.
A<noinclude></noinclude>
hdao7pho51ky29bzbjzsar2x2wma8ns
పుట:Sarada Lekhalu Vol 1.pdf/80
104
59235
553280
186312
2026-04-16T09:08:54Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553280
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>54
శారదలే ఖ లు
పై యు త్తమగుణములన్నియు మానవజాతి కంతటికిని కావల
సినవే. గుణశీలములకు లింగభేదము లేదు. స్త్రీ గుణమని పురు
షుడు దయను విడనాడినచో స్త్రీ మాడిపోవలెను. పురుష
గమని పాటుబడుట మానినచో పురుషు డన్న మునకై
యలమటింపవలెను. నాయక్ గారి నిర్ణయము ప్రకారము
ధైర్యము, కష్టసహిష్ణుత, పుంలింగమునకు చెందినవి. స్వార్థ
త్యాగము, సేవాపరాయణత స్త్రీలింగమునకు జెందినవి. కాని
ధైర్యము లేనిది స్వార్థత్యాగముగాని, కష్ట సహిష్ణుత లేనిది
సేవాపరాయణతగాని ' చేయచొప్పడదు. కాన నొకకార్య
సాధనకు స్త్రీపురుషుల తోడ్పాటెట్లవసరమో అట్లే యుభయ
గుణ సమ్మేళనముగూడ నవసరము. ఇట్టి శంకలకు తావిచ్చెడి
యంశము లొకటి రెండున్నను మొత్తముమీద అధ్యక్షులు
యుపన్యాసము స్త్రీజనాభ్యుదయ కరములగు పెక్కు దివ్యోప
దేశములతో గూడి గంభీర భావభరితమై గమనార్హముగ
నుండెను. "అనంతరము లక్ష్మీనారాయణ పంతులుగారు గతసం
వత్సర కార్యని వేదిక మును జదివిరి. తరువాత గురుకుల బాలికల
యాటపాటలారంభమయ్యెను. తొలుతనొక బాలిక దైవ ప్రార్థ
నముచేసెను. తరువాత నిరువురు బాలికలు గానము చేసిరి.
జాతీయగీతమును బాడిరి. తరువాత కొందరు బాలికలు రామ
భజన చేసిరి.
తెలుఁగు, సంస్కృతము, హిందీ, మూడు
భాషలలో నాటకభాగములను ప్రదర్శించిరి. మూడు భాషల
యందును వారివాచకము మనోజ్ఞముగ నేయుండెను. సంస్కృ
తమున వారుభాషించునప్పుడు ప్రాచీన ఋషి కన్యల దలపించిరి.
"<noinclude></noinclude>
td46t34kwvf08q2an9y0189jhx95qll
పుట:Sarada Lekhalu Vol 1.pdf/81
104
59236
553281
186313
2026-04-16T09:09:15Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553281
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>లేఖలు
55
హిందీనాటక సంభాషణలో వారు ఉత్తరహిందూ దేశపు
బాలికలాయనిపించిరి. ఇక తెలుగువాచకమున వారు క ల్తీలేని
తెలుఁగువారే. మధురమైనగాత్రము, మృదులమైనపలుకులు,
స్పుటమైన యుచ్చారణ,
ఉచిత మైన అభినయము,
యాటపాటలకు వన్నె దెచ్చినవి. అందులో మిన్న యనుపించి
నది భీమరెడ్డి అన్నపూర్ణయను కన్యాకామణి. పరశురామ
గర్వభంగములో రాముఁడామె; భీష్మప్రతిజ్ఞలో శాంతనవు
డామె; రాధపిలుపులో కృష్ణుఁడామె; సంగీతములో నామె;
ఆంధ్రప్రశస్తి పద్యముల చదువుటకామె; వేయేల? ఆ బాలిక
పెక్కింటిలో బాల్గొని తన విధిని చక్కగా నిర్వర్తించి యెల్లర
మెప్పును గాంచెను. అన్నింటికంటే రాధపిలుపులో కృష్ణుని
వేషముధరించి యా బాల చూపిన హావభావ ప్రకటన మేమని
వర్ణింతును? అప్పటి యామె రూపు నాకిప్పటికిని కన్నుల
గట్టినట్లున్నది. ఆ చిఱునవ్వు గూడ కృష్ణునివద్దనుండి మెట్లు
పుణికి తెచ్చుకొనెనో! ఆమె అభినయ కౌశలమునకు మెచ్చి.
సభికులలో నొకరాఱు కూప్యము లామెకు ప్రత్యేక బహు
మానమిచ్చిరి. తరువాత ప్రేక్షకులు శ్రద్ధతో వినివది పిసినారి
భాషణము. సంస్కృతనాటకమున పరశురామపాత్రము
ధరించిన బాలయే పిసినారి వేష ముధరించినది. ఈ బాలగూడ
మంచి నిపుణమతి. పరశురామపాత్రమునందు కఱకుచూపులు
బఱపిన యాబాల పిసినారి వేషమున లుబ్ధత్వమును లోటు
లేకుండ ప్రదర్శించి ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వించినది. బాలికల
యాటపాట లెంత మనోజ్ఞముగ నున్నను దానిని వినగల్గు,<noinclude></noinclude>
so8t7ovitdaouyjur79rk43ie5ram0x
పుట:Sarada Lekhalu Vol 1.pdf/82
104
59237
553282
186314
2026-04-16T09:09:31Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553282
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>56
99
ర ద లే ఖ లు
చూడగల్గు భాగ్యము కడు సమీపస్థుల కేగాని యన్యులకు
కలుగుట బహుదు స్తరమయ్యెను. విశాలమైన యాసభాశాల
లోని స్తంభములకు “నిశ్శబ్దము” అని వ్రాసి కట్టబడిన
యట్టలు మాత్రమే నిశ్శబ్దముగ నుండెనుగాని ప్రజలుమాత్రము
నిశ్శబ్దముగలేరు. ఆఘోష సముద్రవుఘోషకన్న పది రెట్లధిక
ముగ నుండెను.
స్త్రీలుచేసిన
మన ఆడవారి సంగతియడు గఁ బని లేదు
గదా! కుశలప్రశ్నలక్కడ, నగల పరిశీలన ప్రసంగములక్కడ,
వంట ప్రస్తావనలక్కడ, పెండ్లి ముచ్చటలక్కడ సరి, ఇంక
పిల్లలయేడుపు ఉండనేయున్నది. తల్లులు తమకుతూహలము
కొఱకు శిశువులను జనసమ్మర్దములో వేసి నలిపివేయు చుండ
వారు రోదింప కెట్లుందురు? కాని స్త్రీలు చేసిన సందశీకం పె
చదువులకుఁ జేరిన యే యడ్డులేని మగబిడ్డల యల్లరియే
యత్యధికముగానుండి యనేకమాఱులు కార్యక్రమమునకు
భంగము కలిగించెను. శారదాలయమువారు మొదట
నిర్ణయించిన టిక్కెట్ల పద్దతి యూరిలో నలజడికి గారణ
మయ్యెనేగాని సభలోని యలజడి మాన్పుటకేమాత్రము
తోడ్పడలేదు. ఈ ఘోష చూచిన తరువాత ననేకులు టిక్కట్లు
పెట్టిన'నే బాగుగానుండునేమో యనుకొనిరి.
బాలిక ని
దినములనుండియో శ్రమపడి నేర్చినదంతయు జనుల కలకల
ముచే వ్యర్థ మైపోయినప్పుడు నా కెంతయో విచారము గొల్పెను.
శ్రమపడి నేర్చినవారికిని నేర్పినవారికిని నెంత మనస్సునొచ్చెనో!<noinclude></noinclude>
fcz8v9vigrul48esqgfh7xgiof2vabl
పుట:Sarada Lekhalu Vol 1.pdf/83
104
59238
553283
186315
2026-04-16T09:09:50Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553283
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారడ ఖలు
1832
57
అనంతరము సాహితీ పరీక్షయందు తీర్ల లైన బాలికలకు
పట్టములొసంగబడెను. తరువాత బహుమతులుగూడ నొసం
గిరి. ఆబహుమతులన్నియు నెవరోవ దాన్యు లొసంగినవే.
ఆదాతల
పేరు గూడ నక్కడ చెప్పుచు బహుమానములిచ్చిరి.
ఆటపాటలలో మిన్నయైన అన్నపూర్ణమ్మ బహుమతు లందు
కొనుటలోగూడ మిన్న యయ్యెను. అధ్యక్షుల అంత్యోప
న్యాసముకోడను బాలికల మంగళగీతములతోడను
సమా ప్తమయ్యెను. నామనం బానందపరిపూర్ణమయ్యెను.
సభ
కల్పలతా! అప్పుడు “తొలినాటి నాతలంపు లెంత
దుష్టమైనవి? ఏసంస్థయైన పుట్టిననాడే పెద్దదిగానుండుమన్న
నెట్లుండును? " ఇట్టి మహోత్కృష్ట ప్రతిష్ఠాపమున కై వేండ్ల
జీవితమొక దీర్ఘ కాలమా?'' అని నాలో నేనే సిగ్గిలితిని.
మిత్రమా, ఈ విధముగ శారదా గురుకులము నిష్క
శంక దేశ సేవాపరాయణులుగ నున్న వారి నిరంతర కృషిచే
క్రమాభివృద్ధినందుచు ఆంధ్రకన్యల నాహ్వానించుచున్నది.
పుత్రికలు విద్యాపతులు కావలెనని యభిలషించెడు తలిదం
డ్రులకిది మంచి సమయము. తమ పుత్రికల శారదాలయ
మున కంపవచ్చును. స్త్రీ విద్యాభిమానులగు వదాన్యలోక
మున కీదిమంచి యదను. తమ విత్తము నీయుత్కృష్ట ప్రతిష్ఠా
పనమునకు దానము చేసి యశోవిశాలురు కావచ్చును. ఆంధ్ర
మహాజను లాలో చింతురు గాక. నీ కొమా
గురుకులమున కంపరాదా?
1929 జనవరి
రెను శారదా
మిత్రురాలు
శారద.<noinclude></noinclude>
nscthqiqzg3d45peyss9qi7bdqeh3gk
పుట:Sarada Lekhalu Vol 1.pdf/84
104
59239
553284
186316
2026-04-16T09:10:18Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553284
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>నెచ్చెలీ,
సౌభాగ్యవతియగు కల్పలతకు: —
కాని
నీవు వ్రాసిన యుత్తరములు నిన్ననే వచ్చి చూచితిని.
నీకు జాబులవాయుటకే నాకు సిగ్గుచున్నది. ఏమందువా?
ఇకనుండి తప్పక వ్రాయుదునని నీకు వాగ్దత్తము సేయుటయు .
ఆమఱుజా బే నీకు సకాలమున వ్రాయజాలక
పోవుటయు పలు
మాఱులు తటస్థించుచున్నది. శారదకు, మాటలకు చేతలకు
దూరమని నీవు తలంతువేమోయని నాబిడియము .
యిది స్వయంకృతాపరాధము కాదు. దక్షిణ దేశయాత్ర జేసెను
భాగ్యము నాకింతలో లభించునని నేను స్వప్నమందెన తలంప
లేదు. దైవికముగ క్షణములో తటస్థించినది. ఆనాడు నీకు
లిఖింపుచున్న లేఖనర్థాంతరముననే విడిచి తక్షణమే యాత్రకు
సన్నద్ధనై తిని. వైక
తిని, వైకుంఠేకాదశి నాటికి శ్రీరంగమున కేగవ లెనని
పయనించెడునాటి మాతలంపు కాని చేరలేకపోతిమి.
యూరక చెన్న పట్టణమున నాదిన మేలగడుపవలైనని కాంచీ
పురమున కేగితిమి. ఉన్నతోన్నత ప్రాకార గోపురావతుల
తోడను. విశాలమైన రాచబాటతోడను ఒప్పారు కాంచీపురము
పూర్వ వైభవమును చాటుచుండెను. కాంచీపురము విష్ణు
రెండుబాగములుగా నున్నది. విష్ణు
కంచిలో స్వామి వరదరాజులు, ఆయన భార్య లక్ష్మీ దేవి.
కంచి, శివకంచియని
కాన<noinclude></noinclude>
na0tixahhv8j0b92xoef50bjo8wwgjq
పుట:Sarada Lekhalu Vol 1.pdf/85
104
59240
553285
186318
2026-04-16T09:10:37Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553285
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>గలిగెను.
శారద లేఖలు
ఆమె
59
కంజీవర
శివకంచిలో స్వామి ఏకామ్రనాధుడు ఆయన దేవేరి కామాక్షీ
దేవి. దశమినాటి రాత్రి ఎనిమిది గంటలకు మేము
మేగునప్పటికి ఏకామేశ్వరుని యాలయములో గొప్ప
యుత్సవము జరుగుచుండెను. వెంటనే యాస్వామి దర్శనము
సేయ నేగితిమి. వెలలేని యాభరణములతో
నలంకృతు లెన
కామాక్షి ఏకామ్రనాధులు మాకక్కడ ప్రత్యక్ష మైరి.
ఆదివ్యమూర్తుల కన్నా రగాంచి చేతులార నమస్కరించి మన
సార సేవించి హృష చిత్తుల మైతిమి. ఆదేవాలయమందే
నాకొక మిత్రురాలు గన్పడెను. పుట్టిల్లాయూరని
యెఱుగుదును గాని యామె నప్పుడు చూడగ
గల్గుదునని
మాత్రము - తలంపలేదు. దెవికముగనే యట్టి భాగ్యము
ఆమె మమ్ము ప్రేమతో తన యింటికి దోడ్కొని
వెళ్లి సకల సౌకర్యముల గూర్చి సత్కరించెను. 'ఎఱుక పిడి కెడు
ధనమ'ని సామ్యమందు రిదియే కాబోలుసని యనుకొంటిని.
నాడు లేచి ప్రాతఃకృత్యములను దీర్చుకొని సర్వతీర్థమను
పుష్కరణిలో న్నానముగావించి కచ్ఛపేశ్వర యేకామ్రేశ్వర
కామాక్షీ యాలయముల కేగి ఆయా దేవతల
దర్శించి ఆనా
డూ రేగవచ్చిన స్వాములందఱను దర్శించి రెండు గంటలకు
విష్ణుకంచికి వెళ్ళితిమి. మేము వెళ్లునప్పటికి వరదరాజస్వామి
వారికి తిరుమంజనము (స్నానము) జరుగుచుండెను. బిందెలతో
కుమ్మరిం చెడు పాలధారలు శిరస్సునుండి ధణధణ పడుచుండ
పాలలో మునిగియున్న స్వామిని దర్శించితిమి. అటనుండి
అమ్మవారి యాలములోని కేగుచుండ నొకమూల కొందఱు<noinclude></noinclude>
eri6f607cs821tzt6atkzk72w69ehac
పుట:Sarada Lekhalu Vol 1.pdf/86
104
59241
553286
186319
2026-04-16T09:10:56Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553286
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>60
60
శారద లేఖలు
మాకగుపించెను. అది
జనులు గుంపులుగా కూడియుండుట
యేదియో యరయ మేమును నటకేగి చూడ నచ్చట మిద్దెకు
వెండి పై డి బల్లులు అంటించబడి యుండెను. ఆబల్లుల క్రిందుగా
నొక నిచ్చెన పై నెక్కి చేతితో ముట్టిన వారు తలకొక
-యణాయును, “క్రిందనుండియే యర్చకుడా బల్లుల పై కి గుడ్డ
నెగుర
వేయలగుడ్డ ముట్టిన వారొక యర్దణాయును నీయవలెనట.
తాకి వచ్చినవారికి బల్లిపాటు
బల్లులను..
ఆ
ఆ వినోదమును
దోషముండదట.
రెండు నిమిషముల పాటు
నిలువబడి
కాన
చూచితినేగాని ' నేను అర్ధణాగాని అణాగాని వ్యయపరచుకొన
లేదు. అటనుండి అమ్మవారి ఆలయములోని కేగ ఆమెకును
స్నానమే జరుగుచుండెను. అయ్య వారి స్నానము చూడ
వచ్చునుగాని అమ్మవారి స్నానము చూడరాదట!
అమ్మవారి దర్శనము మాకు కాలేదు. ఆనాడు యేకాదశి
యగుటవలన నూ రేగింపునిమి త్తము మణిమయాభరణములతో
నలంకరింపబడిన యుత్సవ విగ్రహములకడనే స్వామిని దేవేరని
గూడ చక్కగా చూచుట కలిగినది.
వరదరాజస్వామివారి యాలయములో దర్శనీయమైన
మండప మొకటి యున్నది. ఆ మండపములోని ప్రతి స్తంభము
పైనను భారత భాగవత రామాయణాది పౌరాణిక గాధలెల్ల
బొమ్మలుగా చెక్కియున్నవి. నల్లరాతితో చెక్క బడిన
యాప్రతిమలు సజీవము లట్లంతయో కౌశలముగ నిర్మింపబడి
యున్నవి. పౌరాణిక గాధలేగాక అశ్వారూఢులగు యోధు<noinclude></noinclude>
kyf5wzco2mrby3n8j0lq86h8jv8sxt8
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/234
104
171156
553209
483002
2026-04-16T01:16:26Z
Ramesam54
3001
553209
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |215 }}</noinclude><poem></poem>
{{float right| }}
నాదంబున్ = ప్రణవనాదమునందు (ప్రణవమునకు పరబ్రహ్మయర్థము కావునను సాక్షి
యగుజీవునకు నాదమునందు నిలయము సంభవింపము కావురకు ఇచ్చటి నాదశబ్దము చే
పర బ్రహ్మమే చెప్పఁబడెననియూహించునది.) విలీనంబు లయము నొందును, ఆడిం
అయైక్యము, కురీయంబు= కు యావస్థ, అన్నాదఁబు - ప్రణవార్ధమగునా పరబ్రహ్మము,
“ఆధారాది బ్రహ్మరంధ పర్యంతంబు ఆధారము మొదలు బ్రహ్మరంధ్రమువలకు, శుద్ధ...
శంబై - శుద్ధ-నిర్మలమైన, స్పటిక స్ఫటిక రత్నముతో, సంకాశంబై సమాన మైన సై,
నిండియుండుజ్"=వ్యాపించియుండును. అదియే ఆ బ్రహ్మమే, వర,,, బని-:
బని-పరమార్థ =
సత్య మైన,తక్త్వ= స్వరూపముయొక్క (జీవస్వరూపముయొక్క ), రహస్యంబని గోప్య
విషయమని (అసఁగాః న దఱకును తెలియకక్యమగు జీనియ థార్థ స్వరూపనుని), యోగీశ్వ
రులచేతజ్ == శ్రేష్ఠు లగుయోగులచే, చెప్పంబడు = పలుక (బడుచున్నది. (బ్రహ్మ సర్వ
వ్యాపకుఁడే యైనను యొక దేశమునుంచే యున్నాఁ డని చెప్పుట శిష్ఠులకు సుఖముగా
చెలియుకొఱ కనియెఱుంగునది). అట్లగుటంజేసి, కావున,
తా. పర బ్రహ్మము నిర్వి కారుఁ డగుటచేతను మాయయు చేతన మగుటచేతను
శర్తృత్వ భోక్తృత్వాదిరూప మగురి సంసార మి దెవ్వరికిని సంభవింపదు. సంసార
మన్ననో యనుభÇనసిద్ధముగనున్నది. కావున సీమాయా బ్రహ్మల కేడియో సంబంధ మొక
టియుండితీరవలయును. ఆసంబంధముకూడ సత్యమైనచో నెప్పటికిని నశించదు. కా
పున ముక్తి యనునదియే లేకపోవలసివచ్చును. కావున నాసంబంధము తాదాత్త,
బంధముగా నుండవలయును. సంయోగ సంబంధ మనిన యెడల పరమాత సవికారు
డు కావలసివచ్చుటచేత నది యుక్తము కానేరదు. (సవాయసంబంధము వేదాంత మత
ములో లేదు.} కావున నధ్యాసరూపమగు తాదాత్మ్య సంబంధమే యిచ్చటఁ జెప్పనొప్పి
యున్నది. మాయా బ్రహ్మలనాడు అగుటచే వారలకుఁ గల సంబంధము కూడ ననాదీయే
కావలసివచ్చుచున్నది. ఇట్టి తాదాత్మ్య సంబంధముచే నా పర బ్రహ్మము మాయాసహితుఁ
డై కరీరమునఁ బ్రవేశించి సకలసంపారము ననుభవించుచు హంస (జీవుఁడు) యని
నబడు చున్నాడు. ఆహంస పంజరమునందుఁ జిక్కి-సహంసపతీవలె వెలికిఁ
హో నేరక శరీరమునందేవిహరించుచున్నది. ఆహునకు చంద్రాస్నలు రెక్కలు. ఓంకా
కముశిరస్సు, జ్ఞాననేత్రము ముఖము, ఈశ్వరుఁడును పార్వతీయుఁ బోదములు, ఇట్టి
పాపముతో నాహంస తెలలయందు తైలంబును క్షీరమునందు ఘృతంబును వ్యాపించి
ఉన్నట్లు చతుర్ముఖ బ్రహ్మ మొదలు గతికపోఁచపఱకుఁ గలసర్వప దార్థములయందును
పించి యున్నది. హృదయకమలము నాశ్రయించి కోటిసూర్యుల వలె వెలుఁగుచు
ది. అహృదయకమలమున నెనిమిదిదళములు గలవు. అందుఁ దూర్పున నున్న దళము
) నీహంస విహరించు చుండు నేని మనసువందు పుణ్య కార్య విషయములగు సంకల్ప
లు జనించును. ఆగ్నేయదిశయందలి దళమున నిద్రయు నాలస్యము మొదలగునవి<noinclude><references/></noinclude>
e93z3nwygn3mzav1inhnayshy1z7sye
553227
553209
2026-04-16T01:46:29Z
Ramesam54
3001
/* అచ్చుదిద్దారు */
553227
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ప్ర థ మా శ్వా స ము. |215 }}</noinclude><poem></poem>
{{float right| }}
నాదంబున్ = ప్రణవనాదమునందు (ప్రణవమునకు పరబ్రహ్మయర్థము కావునను సాక్షి
యగుజీవునకు నాదమునందు నిలయము సంభవింపదు కావునను ఇచ్చటి నాదశబ్దముచే
పరబ్రహ్మమే చెప్పఁబడెనని యూహించునది.) విలీనంబు అగున్ = లయము నొందును, అది =
ఆ యైక్యము, తురీయంబు = తురీయావస్థ, అన్నాదంబు = ప్రణవార్ధమగునా పరబ్రహ్మము,
ఆధారాది బ్రహ్మరంధ పర్యంతంబు = ఆధారము మొదలు బ్రహ్మరంధ్రమువలకు, శుద్ధ…శంబై
శుద్ధ = నిర్మలమైన, స్పటిక = స్ఫటికరత్నముతో, సంకాశంబై = సమానమైనదై ,
నిండియుండున్ = వ్యాపించియుండును. అదియే = ఆ బ్రహ్మమే, పర…. బు -:
పరమార్థ = సత్యమైన,తత్త్వ = స్వరూపముయొక్క (జీవస్వరూపముయొక్క ), రహస్యంబు = గోప్య
విషయమని (అసఁగా- నందఱకును తెలియశక్యమగు జీవయథార్థ స్వరూపమని), యోగీశ్వ
రులచేతన్ = శ్రేష్ఠులగుయోగులచే, చెప్పఁబడున్ = పలుకబడుచున్నది. (బ్రహ్మ సర్వ
వ్యాపకుఁడే యైనను యొక దేశమునందే యున్నాఁ డని చెప్పుట శిష్ఠులకు సుఖముగా
దెలియుట కొఱకని యెఱుంగునది). అట్లగుటంజేసి = కావున
తా. పరబ్రహ్మము నిర్వికారుఁ డగుటచేతను మాయయు చేతన మగుటచేతను
కర్తృత్వ భోక్తృత్వాదిరూపమగునీ సంసార మిం దెవ్వరికిని సంభవింపదు. సంసార
మన్ననో యనుభÇనసిద్ధముగనున్నది. కావున నీ మాయా బ్రహ్మల కేదియో సంబంధ మొక
టియుండితీరవలయును. ఆసంబంధముకూడ సత్యమైనచో నెప్పటికిని నశించదు. కా
పున ముక్తి యనునదియే లేకపోవలసివచ్చును. కావున నాసంబంధము తాదాత్మ్యసం
బంధముగా నుండవలయును. సంయోగ సంబంధ మనిన యెడల పరమాత్మ సవికారు
డు కావలసివచ్చుటచేత నది యుక్తము కానేరదు. (సమవాయసంబంధము వేదాంత మత
ములో లేదు.} కావున నధ్యాసరూపమగు తాదాత్మ్య సంబంధమే యిచ్చటఁ జెప్పనొప్పి
యున్నది. మాయా బ్రహ్మలనాదు లగుటచే వారలకుఁ గల సంబంధము కూడ ననాదీయే
కావలసివచ్చుచున్నది. ఇట్టి తాదాత్మ్య సంబంధముచే నా పర బ్రహ్మము మాయాసహితుఁ
డై శరీరమునఁ బ్రవేశించి సకలసంసారము ననుభవించుచు హంస (జీవుఁడు) యని
పేర్కొనబడు చున్నాడు. ఆహంస పంజరమునందుఁ జిక్కిన హంసపక్షివలె వెలికిఁ
బోనేరక శరీరమునందే విహరించుచున్నది. ఆ హంస కు చంద్రాగ్నులు రెక్కలు. ఓంకా
కము శిరస్సు, జ్ఞాననేత్రము ముఖము, ఈశ్వరుఁడును పార్వతీయుఁ బాదములు, ఇట్టి
రూపముతో నాహంస తిలలయందు తైలంబును క్షీరమునందు ఘృతంబును వ్యాపించి
ఉన్నట్లు చతుర్ముఖ బ్రహ్మ మొదలు గఱికపోఁచపఱకుఁ గల సర్వపదార్థములయందును
వ్యాపించి యున్నది. హృదయకమలము నాశ్రయించి కోటిసూర్యుల వలె వెలుఁగుచున్న
ది. ఆ హృదయకమలమున నెనిమిదిదళములు గలవు. అందుఁ దూర్పున నున్న దళము
) నీహంస విహరించుచుండెనేని మనసువందు పుణ్య కార్య విషయములగు సంకల్ప
లు జనించును. ఆగ్నేయదిశయందలి దళమున నిద్రయు నాలస్యము మొదలగునవి<noinclude><references/></noinclude>
chqotw8f06kykylnhn47go5vnpatrnk
సూచిక:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf
106
178727
553289
552003
2026-04-16T09:42:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553289
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[జైమినిభారతము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు|పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్
|చిరునామా=రాజమండ్రి
|సంవత్సరం=1940
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=MS
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
hqju2ssgy6op9j01nnre70kqp3a0tvj
553290
553289
2026-04-16T09:42:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553290
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[జైమినీభారతము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:పిల్లలమర్రి పినవీరభద్రుడు|పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్
|చిరునామా=రాజమండ్రి
|సంవత్సరం=1940
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=MS
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
bmmsnxkwgblc1bpf9npabt2pjfizvqn
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/156
104
178889
553165
496229
2026-04-15T12:26:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553165
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>వాహినుల నిష్ఠురాస్త్రస, మూహములఁ దెరల్చె నపుడు ముష్టాముష్టిన్
బాహాబాహిఁ గచాకచి, నాహవ మొనరింపఁ జొచ్చె నయ్యిరువాఁగున్.</poem>|ref=6}}
{{Telugu poem|type=శా.|lines=<poem>శక్రప్రోద్భవసూతిపై దశసహస్రస్యందనాన్వీతులై
విక్రాంతిన్ నిపనందనుల్ గవిసి రవ్వేళన్ సమీకంబు రు
ద్రక్రీడన్ దలపింపఁ గార్ష్ణి విశిఖవ్రాతంబుచే వీతిహో
త్రక్రోడంబునఁ బడ్డచర్మముగతిన్ మ్రగ్గెన్ బలం బత్తఱిన్.</poem>|ref=7}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంతకుఁడు గదిసి సేనల, నంతముఁ బొందింపఁ గ్రీడి యచ్చెరువడి కం
సాంతక చూడుము వీడు దు, రంతపరాక్రముఁడు మర్త్యుఁ డనరా దనినన్.</poem>|ref=8}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>జముఁడు వీరవర్మజామాత నృపతికూఁ, తురు సుమాలినీవధూటిమగఁడు
రాజుచేత నితఁడు ప్రార్థితుండై పాసి, చనఁడు తద్విధంబు వినుము తెలియ.</poem>|ref=9}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>వీరవర్మవరకుమారి సుమాలిని, పెండ్లి కెదుగఁ దండ్రి బిడ్డఁ జూచి
తల్లి యేనృపాలతనయుఁడు నీకోర్కి, యనిన నరులమీఁద మనసు లేక.</poem>|ref=10}}
{{p|ac|fwb}}కృష్ణుఁడు విజయునకు యమునివృత్తాంతంబు చెప్పుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>జనులకు నెల్లఁ జావు సహజంబు నరున్ వరియించి వానితో
ననుగమనం బొనర్చి తుది నంతకుచేఁ బడి పాపకర్మసం
జనితఫలంబు లంది బహుజన్మములం బడుకంటె కాలునిం
బెనిమిటిఁగా వరింతు నది మిక్కిలిధర్మము నాకు నావుడున్.</poem>|ref=11}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అలరి సుమాలినీతనయ కంతకుపైఁ దలఁ పంత కంతకున్
బలియు టెఱింగి నిచ్చలు నుపాసనకై యమసూక్తముల్ విని
శ్చలతఁ బఠింపఁ దత్సుతయు సంతతమున్ జముఁ గూర్చి నేమముల్
సలుపఁగ నారదుం డెఱిఁగి సంయమనీపతిఁ గాంచి యిట్లనున్.</poem>|ref=12}}
{{Telugu poem|type=క.|lines=<poem>చిత్రపురి వీరవర్ముని, పుత్త్రి సుమాలిని విలాసభూమి కమలినీ
మిత్రతనూభవ నీకుఁ గ, ళత్రము గావలదె యాలలన యని మఱియున్.</poem>|ref=13}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆసతి పుణ్యశీల హరిణాయతలోచన నిన్నుఁ బొంద నా
సాసలఁ జేయుదానము లనంతము లింతిఁ బరిగ్రహించినన్
నీసవ తెవ్వ రన్నను మునీ భవదాజ్ఞ యలంఘనీయమం
చాసమవర్తి నవ్వి చతురాస్యతనూభవుతోడ ని ట్లనున్.</poem>|ref=14}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నీవు ముందఱ నెఱిఁగింపు నృపతి కేను, గదలి వైశాఖశుక్లపక్షమున వత్తు
ననినఁ జని నారదుఁడు చెప్పు నచట వీర, వర్మ సంభ్రమపడియె వైవస్వతుఁడును.</poem>|ref=15}}
{{Telugu poem|type=క.|lines=<poem>దళవాయి రాజయక్ష్ముం, బిలిచి మనము చిత్రపురికిఁ బెండ్లికిఁ బోవన్
వలె నీబలఁగము నీవుఁ గ, దలి రమ్మని పలుక నులికి తత్సభలోనన్.</poem>|ref=16}}<noinclude><references/></noinclude>
brpz4c93thcgu3076k9wszot4hsvp0i
553166
553165
2026-04-15T12:27:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553166
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>వాహినుల నిష్ఠురాస్త్రస, మూహములఁ దెరల్చె నపుడు ముష్టాముష్టిన్
బాహాబాహిఁ గచాకచి, నాహవ మొనరింపఁ జొచ్చె నయ్యిరువాఁగున్.</poem>|ref=6}}
{{Telugu poem|type=శా.|lines=<poem>శక్రప్రోద్భవసూతిపై దశసహస్రస్యందనాన్వీతులై
విక్రాంతిన్ నిపనందనుల్ గవిసి రవ్వేళన్ సమీకంబు రు
ద్రక్రీడన్ దలపింపఁ గార్ష్ణి విశిఖవ్రాతంబుచే వీతిహో
త్రక్రోడంబునఁ బడ్డచర్మముగతిన్ మ్రగ్గెన్ బలం బత్తఱిన్.</poem>|ref=7}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంతకుఁడు గదిసి సేనల, నంతముఁ బొందింపఁ గ్రీడి యచ్చెరువడి కం
సాంతక చూడుము వీఁడు దు, రంతపరాక్రముఁడు మర్త్యుఁ డనరా దనినన్.</poem>|ref=8}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>జముఁడు వీరవర్మజామాత నృపతికూఁ, తురు సుమాలినీవధూటిమగఁడు
రాజుచేత నితఁడు ప్రార్థితుండై పాసి, చనఁడు తద్విధంబు వినుము తెలియ.</poem>|ref=9}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>వీరవర్మవరకుమారి సుమాలిని, పెండ్లి కెదుగఁ దండ్రి బిడ్డఁ జూచి
తల్లి యేనృపాలతనయుఁడు నీకోర్కి, యనిన నరులమీఁద మనసు లేక.</poem>|ref=10}}
{{p|ac|fwb}}కృష్ణుఁడు విజయునకు యమునివృత్తాంతంబు చెప్పుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>జనులకు నెల్లఁ జావు సహజంబు నరున్ వరియించి వానితో
ననుగమనం బొనర్చి తుది నంతకుచేఁ బడి పాపకర్మసం
జనితఫలంబు లంది బహుజన్మములం బడుకంటె కాలునిం
బెనిమిటిఁగా వరింతు నది మిక్కిలిధర్మము నాకు నావుడున్.</poem>|ref=11}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అలరి సుమాలినీతనయ కంతకుపైఁ దలఁ పంత కంతకున్
బలియు టెఱింగి నిచ్చలు నుపాసనకై యమసూక్తముల్ విని
శ్చలతఁ బఠింపఁ దత్సుతయు సంతతమున్ జముఁ గూర్చి నేమముల్
సలుపఁగ నారదుం డెఱిఁగి సంయమనీపతిఁ గాంచి యిట్లనున్.</poem>|ref=12}}
{{Telugu poem|type=క.|lines=<poem>చిత్రపురి వీరవర్ముని, పుత్త్రి సుమాలిని విలాసభూమి కమలినీ
మిత్రతనూభవ నీకుఁ గ, ళత్రము గావలదె యాలలన యని మఱియున్.</poem>|ref=13}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆసతి పుణ్యశీల హరిణాయతలోచన నిన్నుఁ బొంద నా
సాసలఁ జేయుదానము లనంతము లింతిఁ బరిగ్రహించినన్
నీసవ తెవ్వ రన్నను మునీ భవదాజ్ఞ యలంఘనీయమం
చాసమవర్తి నవ్వి చతురాస్యతనూభవుతోడ ని ట్లనున్.</poem>|ref=14}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నీవు ముందఱ నెఱిఁగింపు నృపతి కేను, గదలి వైశాఖశుక్లపక్షమున వత్తు
ననినఁ జని నారదుఁడు చెప్పు నచట వీర, వర్మ సంభ్రమపడియె వైవస్వతుఁడును.</poem>|ref=15}}
{{Telugu poem|type=క.|lines=<poem>దళవాయి రాజయక్ష్ముం, బిలిచి మనము చిత్రపురికిఁ బెండ్లికిఁ బోవన్
వలె నీబలఁగము నీవుఁ గ, దలి రమ్మని పలుక నులికి తత్సభలోనన్.</poem>|ref=16}}<noinclude><references/></noinclude>
ph7bnwec8yxhensamkex1epwzt11jr2
553167
553166
2026-04-15T12:27:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553167
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>వాహినుల నిష్ఠురాస్త్రస, మూహములఁ దెరల్చె నపుడు ముష్టాముష్టిన్
బాహాబాహిఁ గచాకచి, నాహవ మొనరింపఁ జొచ్చె నయ్యిరువాఁగున్.</poem>|ref=6}}
{{Telugu poem|type=శా.|lines=<poem>శక్రప్రోద్భవసూతిపై దశసహస్రస్యందనాన్వీతులై
విక్రాంతిన్ నృపనందనుల్ గవిసి రవ్వేళన్ సమీకంబు రు
ద్రక్రీడన్ దలపింపఁ గార్ష్ణి విశిఖవ్రాతంబుచే వీతిహో
త్రక్రోడంబునఁ బడ్డచర్మముగతిన్ మ్రగ్గెన్ బలం బత్తఱిన్.</poem>|ref=7}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంతకుఁడు గదిసి సేనల, నంతముఁ బొందింపఁ గ్రీడి యచ్చెరువడి కం
సాంతక చూడుము వీఁడు దు, రంతపరాక్రముఁడు మర్త్యుఁ డనరా దనినన్.</poem>|ref=8}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>జముఁడు వీరవర్మజామాత నృపతికూఁ, తురు సుమాలినీవధూటిమగఁడు
రాజుచేత నితఁడు ప్రార్థితుండై పాసి, చనఁడు తద్విధంబు వినుము తెలియ.</poem>|ref=9}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>వీరవర్మవరకుమారి సుమాలిని, పెండ్లి కెదుగఁ దండ్రి బిడ్డఁ జూచి
తల్లి యేనృపాలతనయుఁడు నీకోర్కి, యనిన నరులమీఁద మనసు లేక.</poem>|ref=10}}
{{p|ac|fwb}}కృష్ణుఁడు విజయునకు యమునివృత్తాంతంబు చెప్పుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>జనులకు నెల్లఁ జావు సహజంబు నరున్ వరియించి వానితో
ననుగమనం బొనర్చి తుది నంతకుచేఁ బడి పాపకర్మసం
జనితఫలంబు లంది బహుజన్మములం బడుకంటె కాలునిం
బెనిమిటిఁగా వరింతు నది మిక్కిలిధర్మము నాకు నావుడున్.</poem>|ref=11}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అలరి సుమాలినీతనయ కంతకుపైఁ దలఁ పంత కంతకున్
బలియు టెఱింగి నిచ్చలు నుపాసనకై యమసూక్తముల్ విని
శ్చలతఁ బఠింపఁ దత్సుతయు సంతతమున్ జముఁ గూర్చి నేమముల్
సలుపఁగ నారదుం డెఱిఁగి సంయమనీపతిఁ గాంచి యిట్లనున్.</poem>|ref=12}}
{{Telugu poem|type=క.|lines=<poem>చిత్రపురి వీరవర్ముని, పుత్త్రి సుమాలిని విలాసభూమి కమలినీ
మిత్రతనూభవ నీకుఁ గ, ళత్రము గావలదె యాలలన యని మఱియున్.</poem>|ref=13}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆసతి పుణ్యశీల హరిణాయతలోచన నిన్నుఁ బొంద నా
సాసలఁ జేయుదానము లనంతము లింతిఁ బరిగ్రహించినన్
నీసవ తెవ్వ రన్నను మునీ భవదాజ్ఞ యలంఘనీయమం
చాసమవర్తి నవ్వి చతురాస్యతనూభవుతోడ ని ట్లనున్.</poem>|ref=14}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నీవు ముందఱ నెఱిఁగింపు నృపతి కేను, గదలి వైశాఖశుక్లపక్షమున వత్తు
ననినఁ జని నారదుఁడు చెప్పు నచట వీర, వర్మ సంభ్రమపడియె వైవస్వతుఁడును.</poem>|ref=15}}
{{Telugu poem|type=క.|lines=<poem>దళవాయి రాజయక్ష్ముం, బిలిచి మనము చిత్రపురికిఁ బెండ్లికిఁ బోవన్
వలె నీబలఁగము నీవుఁ గ, దలి రమ్మని పలుక నులికి తత్సభలోనన్.</poem>|ref=16}}<noinclude><references/></noinclude>
9im0nhdrf5rs7nvmzoo9os8b9da8qui
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/157
104
178890
553172
496230
2026-04-15T14:11:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553172
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆమయాగ్రణిరాజయక్ష్మధాతువులు వీ డ్వడి తాఱఁ బెదవులు దడుపుకొనియె
నష్టోత్తరశతవ్రణాద్యక్షుఁ డగురాజపిటకునకును వీఁపు నెటుకు రనియెఁ
దల్లడంబునఁ ద్రయోదశవిధజ్వరునకు విన్నమాత్రన వెఱవేఁకి దాఁకె
నుల్ల మెల్లను బెల్లగిల్లి వింశతిరూపధారిమేహునకు వివాహ మొదవె</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నచట విప్రార్చకులె కాని హంత లేమి, గుణనిధులె కాని గురుదూషకుండు లేమి
సదయులే కాని బాలహింసకుఁడు లేమి, బూజకులె కాని తేవస్యభోక్త లేమి.</poem>|ref=17}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు విశ్వాసవిషదానకన్యకాగమనస్వరక్ష్యభక్షణలక్షితత్రిశతభేదవిశాలుం
డగుశూలుండు చోరకానిరుద్ధపంజరస్థపక్షిమోచకులు గలుగుటం బొలయ రా దాని
యు వాపీకూపతటాకభేదనంబులవణిగల గ్రహణిజీర్ణజలాశయోద్ధారకులు మీఱు
టను రా సమకూడ దనియు సాధుజనబాధాసముద్భూతం బగువాతంబు మాష
మేరుతైలవాపీదానతత్పరులు దఱచు గలుగుటం దఱియఁ గూడ దనియు భ్రూణ
హత్యాకృతాదరుఁ డగుమహోదరుం డుదకదానావధానులు చెంగలించుటం
దొంగిచూడరా దనియు దాతృనిందాకందళితశరీరుం డగునపస్మారుండు కృష్ణధేను
దానపరులు హెచ్చుటం జొచ్చి మెలఁగరా దనియు నివ్విధంబున సకలరోగవిస
రంబులు గుసగుసలం బోవ సమవర్తి వారలం గనుంగొని.</poem>|ref=18}}
{{Telugu poem|type=క.|lines=<poem>పాపులకు నుగ్రవిగ్రహు, లై పుణ్యుల కమలమూర్తులై మీరు మహిన్
జూపట్టెద రేటికిఁ బరి, తాప మిపుడు కామరూపధరు లగుఁ డనుచున్.</poem>|ref=19}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>మోహనమూర్తి గైకొని యముండు నరాకృతి సంగతామయ
వ్యూహము గొల్వ చిత్రపురి కుత్సుకతం జని మాలినీవరా
రోహవివాహమై నరవరుం గని నీకు నభీష్ట మెద్ది సం
దేహము లేక వేఁడు కరుణింతు ననన్ ధరణీశుఁ డిట్లనున్.</poem>|ref=20}}
{{Telugu poem|type=చ.|lines=<poem>ఇతరవరంబు లెవ్వియును నేటికి నత్యయవేళ దేవకీ
సుతుని పదారవిందములు చూపు మనన్ దయచేసి మామచిం
తితము ఫలించు నంతకును నిల్చిన యంతకుఁ డీతఁ డాజిదీ
క్షితుఁ డయి వీరవర్మయును సేనలతో నిట వచ్చెఁ గావునన్.</poem>|ref=21}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇత్తఱి సముత్తుంగమత్తమాతంగనిపాతభయదయుద్ధంబు సిద్ధంబు గాఁగలదు నీవు
వేడుక చూడవలయు బలియు రైనబభ్రువాహనానుసాల్వకర్ణజప్రద్యుమ్నుమయూ
రధ్వజానిరుద్ధాదియోధవీరుల సన్నద్ధులం జేసి పోరికిం బనుపవలయు నని పలికి
కృష్ణుండు జిష్ణురథం బారోహంబు సేయ నవ్వీరవర్మయుం గదిసి వారిజోదరుం
చేరుకొని పురందరనందనుండును నీవును మదీయశౌర్యంబును ధైర్యంబునుం గనుం
గొనుం డని పుండరీకలోచను నాఱునారాచంబులం గ్రీడి నేడువాలమ్ములను</poem>|ref=}}<noinclude><references/></noinclude>
lnjw4yss08om4kxjufjnej3xh92cjm4
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/158
104
178891
553186
496231
2026-04-15T20:04:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553186
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మయూరధ్వజాదుల నైదైదుబాణంబులఁ గంఠగతప్రాణులం జేసిన ఱేసి వాసవ
సుతుండు నవ్వీరవర్మమర్మంబులు దూఱిపాఱఁ గఱకుటమ్ములు వఱపినఁ బిఱుతివియ
కతండు తెఱపికొని మాధవధనంజయుల విశిఖపుంజంబులం జిక్కుపఱచి సజలజల
ధరంబువిధంబు గర్జింప నర్జునుండు దోర్జవంబునఁ దచ్ఛరవ్రాతంబు జర్జరీభూతం
బు గావించి సారస్వతపురాధీశ్వరవక్షంబు నిశితక్షురప్రపంచకంబునం జించిన
నతం డిందుకేనియుం జంచలింపక వివ్వచ్చు నఱువదింట నచ్యుతాంజనేయుల
సాయకశతంబుల నొంచి తేరివారురంబులం దక్కిన వీరవరులం దెరలిచి మొనతలఁ
దరలం జొరల నేసినఁ బాండవసమూహంబు సమోహం బయ్యె నప్పు డప్పురు
షోత్తముండు గాండీవిం గనుంగొని.</poem>|ref=22}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>వంచన చేసి సైంధవువివాహములో శిశుపాలునట్లు న
మ్మించి రణంబునం గమలమిత్రజుతేరు ధరిత్రిఁ గ్రుంగఁ ద్రొ
క్కించి జయించిన ట్లిచటఁ గృత్రిమముల్ గొనునంచు మారుతిం
బంచినఁ దేరితో నతని బద్ధునిఁ జేసి విశాలవాలధిన్.</poem>|ref=23}}
{{Telugu poem|type=క.|lines=<poem>ద్రోణాద్రిఁ బెల్లగించిన, త్రాణ నతనియరద మంబరంబునకు జగ
త్ప్రాణజుఁ డెత్తుక చన నా, క్షోణీశ్వరుఁ డతని మొఱఁగి చూపఱు బెదరన్.</poem>|ref=24}}
{{Telugu poem|type=చ.|lines=<poem>రయమునఁ దేరితో నరు మురద్విషునిం దుదియంగఁ బట్టి ని
ర్భయగతి నభ్రముం దఱిసి పావనితో నను శౌరి పార్థుపై
దయ నెడఁబాసి రా విరహతాపమునం జొరలాడులక్ష్మికిం
బ్రియముగఁ బట్టివైచెద హరిం గలశాంబుధి శేషశయ్యపై.</poem>|ref=25}}
{{Telugu poem|type=క.|lines=<poem>విడు నారథ మని హరిఁ గ, వ్వడినిన్ వడిఁ జంక నిఱికి వాయుతనూజుం
బిడికిటఁ బొడిచిన గ్రుడ్డులు, మిడుకఁ గెడసి కాలు చెయ్యి మెదలుప కున్నన్.</poem>|ref=26}}
{{p|ac|fwb}}వీరవర్మ కృష్ణుని తనపురంబునకు దోడ్కొని పోవుట</p>
{{Telugu poem|type=క.|lines=<poem>అప్పుడు మధుమథనుఁడు వా, తప్పక నవ్వీరవర్మతల పాదమునన్
గుప్పునఁ దన్నిన ధరఁ బడి, తెప్పిఱి కృష్ణార్జునులఁ గదిసి యిట్లనియెన్.</poem>|ref=27}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>బవరాన దేవదానవులు కైనను నవి జేయుండ మును విశేషించి యిపుడు
కృష్ణునిపాదపంకేరుహంబు శిరంబుఁ జెందెఁ గావునఁ జిరంజీవి నైతి
ననుటయుఁ బ్రీతుఁడై యచ్యుతుండు కిరీటితోడ నిట్లను వీఁడు దుర్జయుండు
సత్త్వసంపన్నుఁ డక్షయదివ్యమార్గణ, కృతహస్తుఁడు మయూరకేతుముఖ్య</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యోధుల జయించె మద్భక్తియుక్తుఁ డనిన, నరుఁడు గొనియాడె నమ్మహీవరుఁడు వారి
కిట్టు లను ముజ్జగములు మీ కెదురుగావు, మిమ్ము గెలువంగ నే నెంతమేటి ననుచు.</poem>|ref=28}}<noinclude><references/></noinclude>
gmeku329ah259z2quwsxhw116f8zyqn
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/159
104
178892
553187
496232
2026-04-15T20:23:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553187
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>విల్లెక్కు డించి యదుకుల, వల్లభునకు మ్రొక్కి వాసవసుతు ముదము సం
ధిల్లఁ గవుఁగిలింప బలము, లెల్ల నిలిచె నతనివీట నేనుదినంబుల్.</poem>|ref=29}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆమఱునాఁడు సప్తతిసహస్రసితేభములున్ దురంగముల్
శ్యామలకర్ణముల్ నవసహస్రము లష్టవిధంబు లైనము
క్తామణిరాసులున్ మొదలుగాఁ గలసంపద లెల్ల నిచ్చి య
త్తామరసాక్షుఁ గొల్చి వసుధావరుఁ డశ్వములం దరల్చినన్.</poem>|ref=30}}
{{Telugu poem|type=క.|lines=<poem>కతిపయదినములకు హయ, ద్వితయము గజకబళనప్రవీణఝషగ్రా
హతిమితిమింగిలలహరిహ, సితజిలనిధి యగునదంబు జివ్వున దాఁటెన్.</poem>|ref=31}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>క్రీడి వీరవర్మతోడ హయంబులు, సరసి దాఁటె నెద్దివెర వటన్న
నతఁడు నావలను రయంబున దాఁటింప, సేన కౌంతలంబుఁ జేరి విడిసె.</poem>|ref=32}}
{{Telugu poem|type=క.|lines=<poem>అచ్చట హరులం గానక, ఱిచ్చవడి దొరలు నిలుచుతతిఱిన్ వెలుఁగుచు వై
యచ్చరపథమున సురముని, వచ్చి నమస్కృతులు గాంచి వారలతోడన్.</poem>|ref=33}}
{{Telugu poem|type=చ.|lines=<poem>హయములు చంద్రహాసవసుధాధిపుకౌంతలకంబుఁ జేరె దు
ర్ణయుఁ డగునానృపాలునిపరాక్రమలీలకు రాజు లెల్ల నా
రయ సరి షోడశాంశమును రారు తదీయచరిత్ర మన్న వి
స్మయ మిది వేళ గాదు విన సైంధవముల్ గడుదూర మేగెడున్.</poem>|ref=34}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అనుటయుఁ బార్డుఁ డిట్లనుఁ బ్రియంబున నారద శౌరి చెప్పమున్
వినమె కథాసుధారసము వీనుల కింపుగఁ బోరిలోన స
జ్జనులచరిత్రముల్ వినుట జన్మఫలంబులు గావె చంద్రహా
సనృపవరేణ్యపుణ్యకథ సత్కృప నా కెఱిగింపు నావుడున్.</poem>|ref=35}}
{{p|ac|fwb}}నారదుఁడు చంద్రహాసుని వృత్తాంతంబు దెల్పుట</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>విను కేరళాధీశ్వరున కాత్మజుఁడు సభాగ్యుఁడు మూలతారయం దుదయమయ్యె
నొక కొన్నిదివసంబులకు వైరుల నెదిర్చి జనకుండు గండదోషమునఁ దప్ప
జనయిత్రి చి చ్చుఱికిన దాదు లాబాలకునిఁ గౌంతలమునకుఁ గొంచువచ్చి
వర్షత్రయము పెంచి వా రంతరించినఁ బౌరభామిను లాకుమారుఁ జూచి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కరుణ నొకపుణ్యసతి జలకంబుఁ బట్టుఁ
గూర్మి నొకలేమ కడుపారఁ గుడువఁ బెట్టు
దయ నొకవధూటి మొలవన్నెతడుపుఁ జుట్టు
గోర్కి నొకయింతి కూఁకట్లు గూడఁ గట్టు.</poem>|ref=36}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈరీతిఁ బౌరకాంతలు, గారవమునఁ బెనుచుచుండఁగా నొక్కదినం
బారాకొమరుండు యదృ, చ్ఛారతిఁ జనె దుష్టబుద్ధిసదనంబునకున్.</poem>|ref=37}}<noinclude><references/></noinclude>
52i0lr7l6u6v6qqi93xvmt3cdstv99w
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/160
104
178893
553188
496233
2026-04-15T20:51:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553188
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ఆమంత్రికొలువులోనిమ, హామును లీక్షించి ముదితులై యెవ్వరివాఁ
డీముద్దులాఁడు నిఖిల, క్ష్మామండల మేలురేఖ గలవాఁ డనినన్.</poem>|ref=38}}
{{Telugu poem|type=క.|lines=<poem>విని విననివానిచందం, బున గీటునఁ బుచ్చి దుష్టబుద్ధి యతులస
ద్వినయమున ననిపి యపు డా, తనయునకును ఋషులపలుకు తథ్యం బనుచున్.</poem>|ref=39}}
{{Telugu poem|type=క.|lines=<poem>దండింపఁ దలఁచి యప్పుడు, చండాలభటాలిఁ బిలిచి సచివుఁడు మీ
కొండికపాపని బలి వా, రుం డని నెల కొసఁగఁ గింకరులు రభసమునన్.</poem>|ref=40}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పట్టి మదేభసింహశరభప్రముఖోగ్రతరాటవీతటిన్
బెట్టి కృపాణి జళిపింప గుమారుఁడు శౌరి నెమ్మదిన్
గట్టిగ నిల్ప నప్డు గొడికాండ్రు కృపన్ వలకాలిపిల్లవ్రేల్
ముట్టఁగఁ గోసి మంత్రివరు ముందటఁ బెట్టి కృతప్రణాములై.</poem>|ref=41}}
{{Telugu poem|type=క.|lines=<poem>దేవర చెప్పినయుడిగము, గావించితి మనిన మంత్రి కౌతుకహృదయుం
డై వలమునిభాషితము మృ, షావాదం బయ్యె పని విశంకత నుండన్.</poem>|ref=42}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అచటఁ గుమారుఁ డంమ్రివికలాంగుళిఖేదముఖాశ్రుజాలసం
కుచితముఖాబ్దుఁడై పదశకుంతమృగీవనదేవతల్ దయా
రచితహితోపచారముల రక్షణ సేయఁ గుళిందకుండు త
త్సచివునకున్ విధేయుఁ డగుశాబరదేశవిభుండు వేఁటమైన్.</poem>|ref=43}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అక్కడి కేగుదెంచి చరణాంగుళివేదనఁ జాలఁ గుందియున్
స్రుక్కన శ్రీహరిం దలఁచుసూనునిఁ జూచి కృపాసమగ్రుఁడై
యెక్కడివాఁడొ వీఁడు జగదీశ్వరలక్షణలక్షితాకృతిన్
జక్కనిపిన్నవాఁ డనుచు సైంధవమున్ డిగి బుజ్జగించుచున్.</poem>|ref=44}}
{{Telugu poem|type=క.|lines=<poem>హరిభక్తుఁ డితఁడు నేనును, హరిపదసేవకుఁడ నయ్యు ననపత్యుఁడనై
హరిఁ బలుమఱు సొరయఁగ శ్రీ, హరి నా కిట్లు కరుణ చేసె నర్భకు ననుచున్.</poem>|ref=45}}
{{Telugu poem|type=క.|lines=<poem>కుండుఁడు కానీనుఁడు కృత, కుండు సహోఢజుఁడు గోళకుఁడు క్రీతుఁడు ద
త్తుండు స్వయంప్రాప్తుఁడు సూ, నుం డౌరసహీను లగుజనుల కట్లగుటన్.</poem>|ref=46}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇతఁడు స్వయంప్రాప్తుఁడును, సుతుఁడని యంగీకరించి శోకము వారిం
చి తురంగముపై నిడి నం, దితుఁడై తనచందనావతీపురి కరిగెన్.</poem>|ref=47}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అరిగి సైనికుల నర్హప్రకారంబుల ననిపి యంతఃపురంబునకు నరిగి
జ్యోస్యుల యనుమతి శుభముహూర్తంబున రాణి మేధావినీరమణి కిచ్చి
చంద్రుని నవ్వుహాసంబు గల్గుటఁ జంద్రహాసుం డనెడునామ మర్థిఁ బెట్టి
దాదులచే నిరంతరము సంరక్షణ చేయింపఁ గట్టడ చేసి వేడ్కఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
qvakpywol11tsxgbaetqgul7umqkzvf
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/161
104
178894
553189
496234
2026-04-15T21:11:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553189
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>బెనుపఁగా దల్లిదండ్రులు ప్రేమమునను, విదియచంద్రునిగతి నభివృద్ధిఁ బొంద
నవని దున్నక పండెఁ జ న్నవిసి పిడికె, సురభులు జనంబు లానందభరితు లైరి.</poem>|ref=48}}
{{Telugu poem|type=మ.|lines=<poem>కర మర్ధిన్ సుతునిం గృతోపనయనుం గావించి వేదాగమా
ర్థరహస్యంబులు దెల్పి కార్ముకముఖాస్త్రప్రౌఢిమల్ నేర్పి సిం
ధురగంధర్వరథాధిరోహణసమర్థుం జేసి ధాత్రీధురం
ధరుఁ గావించెఁ గుళిందకుండు జను లానందంబునం బొందఁగన్.</poem>|ref=49}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆచంద్రహాసవిభుఁ డు, ర్వీచక్రము ప్రజల నెల్ల శ్రీవైష్ణవమా
ర్గాచరణతత్పరులు గాఁ, బ్రోచెన్ రుక్మాంగదప్రభువుచందమునన్.</poem>|ref=50}}
{{Telugu poem|type=మ.|lines=<poem>పదియాఱేఁడుల నూఁగుమీసముల లేఁబ్రాయంబునం దండ్రిపం
ప దిగంతంబుల రాజులం గెలిచి కప్పంబుల్ వధూకాంచనో
న్మదమాతంగతురంగరత్ననికురుంజం బాదిగా సర్వసం
పదలున్ బ్రాక్తనరేఖ మీఱఁ గొని దృప్యత్సైన్యముల్ గొల్వఁగన్.</poem>|ref=51}}
{{p|ac|fwb}}చంద్రహాసుఁడు రాజ్యంబు చేయుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>శతమఖవైభవుం డని ప్రజల్ జయ పెట్టుచు మ్రొక్కఁ జందనా
వతి కరుదెంచి తండ్రిపదవారిరుహంబులు గాంచి విక్రమా
ర్జితబహుసంపదల్ నగరు గ్రిక్కిఱియించి కృతప్రణాముఁడై
యతివినయంబునన్ జననియంఘ్రులకున్ బ్రణమిల్లి భక్తితోన్.</poem>|ref=52}}
{{Telugu poem|type=క.|lines=<poem>జననీజనకులపాదము, లనవరతముఁ గొల్వఁ జంద్రహాసకుమారుం
గనుఁగొని కుళిందభూపతి, తను వెల్లను నివురుచును ముదంబునఁ బలికెన్.</poem>|ref=53}}
{{Telugu poem|type=క.|lines=<poem>జాలెలఁ బట్టి౦పుము పది, వేలు నయిదువేలు రెండువేలు నరయ సొ
న్నా లరి కుంతలునకు మన, యేలిక లన్మంత్రి యతనియింటికిఁ బనుపన్.</poem>|ref=54}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనిన విని చంద్రహాసుఁడు, జనకుని వీడుకొని ధన మసంఖ్యము బహువా
హ్యనరోష్ట్రఖరబలీవ, ర్దనివహములచేతఁ గన్ను దనియఁగఁ బంపెన్.</poem>|ref=55}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>మూఁడువగలపగిదిముడుపులు దెప్పించి, కలయ నొక్కబదరికమున నుంచి
కౌంతలేశ్వరునినగరిపురోహితుఁ డైన, గాలవునకుఁ గౌతుకమునఁ బనిచె.</poem>|ref=56}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పంచినఁ దీర్పరుల్ సచివుపాలికి నేఁగి కృతప్రణాము లై
కాంచనరత్నభూషణసుగంధపటావలి వేఱువేఱ య
ర్పించి కుళిందనందనుఁడు పెట్టినపత్రిక చూపి రాజుకుం
గొంచక దీని కేడుమణుఁగుల్ గొనివచ్చితి మంచు నిచ్చినన్.</poem>|ref=57}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కొని చని కుంతలేశ్వరునకున్ వివరంబుగఁ జూపి చారుల
న్మన మలరించి పంచి జననాయకుఁ ఢగ్గతి చంద్రహాసుఁ డి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
eurajvvwdx8lhjpq2iny5306qbwni0q
553190
553189
2026-04-15T21:12:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553190
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>బెనుపఁగా దల్లిదండ్రులు ప్రేమమునను, విదియచంద్రునిగతి నభివృద్ధిఁ బొంద
నవని దున్నక పండెఁ జ న్నవిసి పిడికె, సురభులు జనంబు లానందభరితు లైరి.</poem>|ref=48}}
{{Telugu poem|type=మ.|lines=<poem>కర మర్ధిన్ సుతునిం గృతోపనయనుం గావించి వేదాగమా
ర్థరహస్యంబులు దెల్పి కార్ముకముఖాస్త్రప్రౌఢిమల్ నేర్పి సిం
ధురగంధర్వరథాధిరోహణసమర్థుం జేసి ధాత్రీధురం
ధరుఁ గావించెఁ గుళిందకుండు జను లానందంబునం బొందఁగన్.</poem>|ref=49}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆచంద్రహాసవిభుఁ డు, ర్వీచక్రము ప్రజల నెల్ల శ్రీవైష్ణవమా
ర్గాచరణతత్పరులు గాఁ, బ్రోచెన్ రుక్మాంగదప్రభువుచందమునన్.</poem>|ref=50}}
{{Telugu poem|type=మ.|lines=<poem>పదియాఱేఁడుల నూఁగుమీసముల లేఁబ్రాయంబునం దండ్రిపం
ప దిగంతంబుల రాజులం గెలిచి కప్పంబుల్ వధూకాంచనో
న్మదమాతంగతురంగరత్ననికురుంజం బాదిగా సర్వసం
పదలున్ బ్రాక్తనరేఖ మీఱఁ గొని దృప్యత్సైన్యముల్ గొల్వఁగన్.</poem>|ref=51}}
{{p|ac|fwb}}చంద్రహాసుఁడు రాజ్యంబు చేయుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>శతమఖవైభవుం డని ప్రజల్ జయ పెట్టుచు మ్రొక్కఁ జందనా
వతి కరుదెంచి తండ్రిపదవారిరుహంబులు గాంచి విక్రమా
ర్జితబహుసంపదల్ నగరు గ్రిక్కిఱియించి కృతప్రణాముఁడై
యతివినయంబునన్ జననియంఘ్రులకున్ బ్రణమిల్లి భక్తితోన్.</poem>|ref=52}}
{{Telugu poem|type=క.|lines=<poem>జననీజనకులపాదము, లనవరతముఁ గొల్వఁ జంద్రహాసకుమారుం
గనుఁగొని కుళిందభూపతి, తను వెల్లను నివురుచును ముదంబునఁ బలికెన్.</poem>|ref=53}}
{{Telugu poem|type=క.|lines=<poem>జాలెలఁ బట్టి౦పుము పది, వేలు నయిదువేలు రెండువేలు నరయ సొ
న్నా లరి కుంతలునకు మన, యేలిక లన్మంత్రి యతనియింటికిఁ బనుపన్.</poem>|ref=54}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనిన విని చంద్రహాసుఁడు, జనకుని వీడుకొని ధన మసంఖ్యము బహువా
హ్యనరోష్ట్రఖరబలీవ, ర్దనివహములచేతఁ గన్ను దనియఁగఁ బంపెన్.</poem>|ref=55}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>మూఁడువగలపగిదిముడుపులు దెప్పించి, కలయ నొక్కబదరికమున నుంచి
కౌంతలేశ్వరునినగరిపురోహితుఁ డైన, గాలవునకుఁ గౌతుకమునఁ బనిచె.</poem>|ref=56}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పంచినఁ దీర్పరుల్ సచివుపాలికి నేఁగి కృతప్రణాము లై
కాంచనరత్నభూషణసుగంధపటావలి వేఱువేఱ య
ర్పించి కుళిందనందనుఁడు పెట్టినపత్రిక చూపి రాజుకుం
గొంచక దీని కేడుమణుఁగుల్ గొనివచ్చితి మంచు నిచ్చినన్.</poem>|ref=57}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కొని చని కుంతలేశ్వరునకున్ వివరంబుగఁ జూపి చారుల
న్మన మలరించి పంచి జననాయకుఁ డగ్గఱి చంద్రహాసుఁ డి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
6fmewhbhvnamryy7i5wb8u9d6akqayw
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/162
104
178895
553195
496235
2026-04-15T23:45:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553195
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>చ్చినవివరంబు విన్నపము చేసి కుళిందకుఁ బట్ట రాజుచే
ననుమతుఁడై యమాత్యుఁడు రహస్యము చిత్తము నొత్తరింపఁగన్.</poem>|ref=58}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>తమక మినుమడింప దళముతోడుత నాఱు, యోజనముల పయన మొక్కనాఁడె
తెరలి చందనావతీపురిముందటఁ, గాంచి యోధవరులఁ గలయఁ జూచి.</poem>|ref=59}}
{{Telugu poem|type=క.|lines=<poem>ముందు మహాటవి యిది యీ, సందున నమరావతీవిశంకటమహిమన్
గ్రందుకొనిన దౌరౌర కు, ళిందునిసౌభాగ్య మని యళీకప్రీతి.</poem>|ref=60}}
{{Telugu poem|type=క.|lines=<poem>అరుదేర దుష్టబుద్ధి కె, దురుగఁ గుళిందకుఁడు ప్రియసుతునితోఁ జని త
చ్చరణముల వ్రాలి నిజమం, దిరమున విడియించి భక్తి నివ్వటిలంగన్.</poem>|ref=61}}
{{Telugu poem|type=క.|lines=<poem>బహువిధమనోజవస్తుని, వహములఁ బూజింప గృతకవాత్సల్యభర
ప్రహరితముఖాబ్జుఁడై చం, ద్రహాసుఁ గనగొని కుళిందునకు నిట్లనియె.</poem>|ref=62}}
{{Telugu poem|type=క.|lines=<poem>చందురునివంటివాఁ డీ, నందనుఁ డతిభాగ్యలక్షణయుతుఁడు నీ కే
చందమునఁ గల్గె ననినఁ గు, ళిందకుఁ డాద్యంతమును దెలియ వినిపించెన్.</poem>|ref=63}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఏ మృగయావినోదరతి నేగుచుఁ గౌంతలకంబుదండ రెం
డామడఁ గల్గు నొక్కభయదాటవిలోనఁ బదాంగుళీవ్యధన్
వేమఱు శ్రీహరిం దలఁచువీనిఁ గనుంగొని విష్ణుభక్తునిం
గా మదిఁ గాంచి యౌరసునకన్న విశేషము గాఁగఁ బెంచితిన్.</poem>|ref=64}}
{{Telugu poem|type=క.|lines=<poem>నాఁటి కయిదేండ్లవాఁ డను, మాట విని కృతంబు దలఁచి మానసమున న
త్తోటులమీఁదను బండులు, గీఁటుకొనుచు దుష్టబుద్ధి కృత్రిమబుద్ధిన్.</poem>|ref=65}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇచ్చోట నేమి దలఁచిన, వచ్చు నపాయము దన కవశ్యము వీనిన్
బుచ్ఛెదఁ గౌంతలకంబున, కచ్చట మత్సుతుఁడు విషనిహతుఁ గావించున్.</poem>|ref=66}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని తలఁచి యొక్కపత్రిక, తనతనయునిపేర నేకతమ్మ స్వహస్త
మ్మున వ్రాసి ముద్ర పెట్టి స, వినయుఁ డగుచుఁ జంద్రహాసవిభునకు ననియెన్.</poem>|ref=67}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈపత్రిక నీ వొకఁడవ, నాపుత్త్రుని కిమ్ము శోభనం బగు ననుటన్
వీపను లన్న వినతుఁడై, వే పోయె నతండు పవనవేగాశ్వముపైన్.</poem>|ref=68}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>నిమిషమాత్రఁ గౌంతలముఁ జేరి తత్పురీ, సవిధవివిధపుష్పసౌరభప్ర
మత్తచంచరికమండలీముఖరితా, రామమధ్యగతసరంబు గదిసి.</poem>|ref=69}}
{{Telugu poem|type=క.|lines=<poem>యువహంసచక్రసారస, నివహగరుద్భూపవికచనీరేజపుట
స్రవదమలమధుసురభీగం, ధవహాంకురసపదివారితపథశ్రముఁ డై.</poem>|ref=70}}
{{Telugu poem|type=క.|lines=<poem>తురగమును నీరు జలజా, కరమునఁ ద్రావించి తా విచకపుష్పఫలో
త్కరభరవినమ్రచూతాం, తరమరకతవేది నలవునం బవళింపన్.</poem>|ref=71}}<noinclude><references/></noinclude>
3s4bbinv2gnjdg4iw9vpw3f4xn9agyr
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/163
104
178896
553196
496236
2026-04-16T00:12:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553196
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}కుంతలేశునికూఁతురు వనవిహారమునకు వచ్చుట</p>
{{Telugu poem|type=ఆ.|lines=<poem>కుంతలాధినాథుకూఁతురు చంపక, మాలినియును నయ్యమాత్యవరుని
తనయ విషయమును మదను నోమఁ డద్వన, స్థలికి వచ్చి రాత్మసఖులతోడ.</poem>|ref=72}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అలసతఁ జూపునొయ్యారంపునడపులు వనమయూరములగర్వముఁ గుదింప
సఖుల వేమఱుఁ బిల్చు సరసంపుటెలుగులు మత్తకోకిలముల మనసుఁ గలఁప
నిటలంబుల నటించుకుటిలాలకంబులు షట్పదంబులవిలాసముల గెలువఁ
దరలలోచనములధాళధళ్యంబులు హరిణులసౌభాగ్య మవఘళింప</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దందడించుమనోరథోద్ధతవిహార, సరణిఁ జంపకమాలినీతరుణిఁ గూడి
మానినులు గోసి రవ్వనమంజరులను, సరసిసరసిజములఁ బైక్కుచందములను.</poem>|ref=73}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>సచివపుత్త్రివిషయశారీరవాసన, వనము గంధసారవనముఁ జేసె
గళితహారమణులఁ గమలాకరంబు ర, త్నాకరంబుఁ జేసె నలసగతుల.</poem>|ref=74}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంగన లపుడు చతుర్విధ, శృంగారము లలవరించి చెఱకువిలుతు నో
మంగ విషయ తత్సరసీ, ప్రాంగణనిద్రితునిఁ జంద్రహానునిఁ గాంచెన్.</poem>|ref=75}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కని రశనాంఘ్రిరత్నకటకంబులు మోయకయుండ నల్లన
ల్లనఁ జని యక్కుమారునివిలాసము లేఁకటవాయఁ జూచి మ్రో
ల నడవ సంచిత్రాటఁ బదిలం బగుపత్రిక వీడ్చి తండ్రివ్రా
సినకపటంపుఁబద్ధతికిఁ జిత్తమునం బరితాప మందుచున్.</poem>|ref=76}}
{{Telugu poem|type=క.|lines=<poem>విషమాస్త్రసమానునకు, న్విష మొసఁగన్ వ్రాసె దండ్రి నిర్దయుఁ డని య
వ్విషమాక్షరపంక్తి దుడిచి, విషయ నొసఁగు మనుచు వ్రాసి వేడుకతోడన్.</poem>|ref=77}}
{{Telugu poem|type=క.|lines=<poem>పెన్నిధిఁ గని పోవఁగ లే, కున్నకృపణుమాడ్కిఁ జిత్త మూటాడగ నా
కన్నె పరాధీనత నతి, ఖిన్న యగుచు నింటి కెట్టకేలకుఁ జనియెన్.</poem>|ref=78}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆలోనఁ జంద్రహాసుఁడు, మేలు కనుచు నపుడు తత్సమీపసరఃప్ర
క్షాళితముఖుఁడై నడగని, బోలెమునఁ గదల్చి నగరముఁ బ్రవేశించెన్.</poem>|ref=79}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఎడనెడ శుభశకునంబులు, పొడ గనుచును జొచ్చి దుష్టబుద్ధి నగరిచా
వడికడవాకిటఁ దురగ, మ్ము డిగం బణిహారి గని ప్రమోదముతోడన్.</poem>|ref=80}}
{{Telugu poem|type=క.|lines=<poem>కొలు వున్నమదనుఁ గని చే, తులు మొగిచి కుళించకునిసుతుఁ డమాత్యునిలే
ఖలు గొనుచు మననగరిమో, సల నున్నాఁ డనిన విని ససంభ్రముఁ డగుచున్.</poem>|ref=81}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>కూర్మి నతని నెదురుకొని కౌఁగిలించి యే, కాంతమండపము నధివసించి
యటఁ గుళిందుసేమ మరయుచుఁ దండ్రివ్రాయసముఁ జూచి భక్తి నంది యందు.</poem>|ref=82}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>స్వస్తి సమస్తప్రశస్తగుణాన్వితుం డవు దుష్టబుద్ధినిజాత్మజుఁ డగు
మదను దీవించి ప్రేమముగఁ బుత్తెంచిన శుభలేఖ చంద్రహాసుఁడు గుళిందు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
rmwtpmnfwao9k9fvuuzh6z0vlay8pjf
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/164
104
178897
553230
496237
2026-04-16T02:04:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553230
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>పట్టి కులస్థానపౌరుషాధికుఁడు సిద్ధంబుగా మనకు నీతండ హితుఁడు
కాన సందేహంబు మాని యీపత్రిక వీక్షించినప్పుడె విషయ నొసఁగు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మనెడుపద్ధతిఁ జదివి భాగ్యంబు చేసె, నస్మదీయసహోదరి యనుచు దైవ
ఘటన నారాత్రిఁ గలుగులగ్నంబునన వి, వాహ మొనరించె దేవేంద్రవైభవమున.</poem>|ref=83}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అంతట దుష్టబుద్ధి హృదయంబున నింతకుఁ జంద్రహాసుఁడుం
గౌంతలకంబుఁ జేరుఁ దనకైతవమున్ ఫలియించు నంచు ని
శ్చింతమతిం గుళిందకుని శృంఖలబద్ధునిఁ జేసి దుర్గమా
ద్యంతము చూఱ గైకొని రయంబున మూఁడవనాఁటివేకువన్.</poem>|ref=84}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంచల బెస్తల వడి జం, కించుచు బంగారుపల్లకీ యొక్కి ప్రయా
ణించునెడం గౌంతలక, ప్రాంచలమున నొకమహోగ్రఫణి యెనుదు రగుచున్.</poem>|ref=85}}
{{Telugu poem|type=క.|lines=<poem>మానుషభాషల ని ట్లను, నే నీసదనంబులోనినిక్షేపములం
బ్రాణమువలెఁ గాచితి నిఁకఁ, బో నగు నని చెప్పి కుతలముఁ బ్రవేశించెన్.</poem>|ref=86}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>పాముమాటఁ బాటిఁ బట్టక కౌంతల, కంబు చొచ్చి నగరిక్రందుఁ జూచి
చంద్రహాసునకు విషయఁ బెండ్లిసేయున, వ్విధముగా నెఱింగి వీఁపు విఱిగి.</poem>|ref=87}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఏ నేమి చెప్పి పంపిన, దా నేపని చేసె నని మదనుఁ బిలిచి దురా
త్మా నేఁటిదాఁక ద్రోయవు, గా నాయానతి నిదేమి గావించి తనన్.</poem>|ref=88}}
{{Telugu poem|type=క.|lines=<poem>దేవరయానతిఁ దప్పిన, యావివరం బేది యని స్వహస్తలిఖితలే
ఖావాచకంబుఁ జూపిన, నావక్కాణంబు జూచి యద్భుతపడఁగన్.</poem>|ref=89}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>మఱియుఁ దండ్రితోడ మదనుండు దేవర, యాజ్ఞఁ బ్రాణ మైనయనుజ నొసఁగి
హితజనంబు లెదుర నీతని కెడ రైనఁ, బ్రాణ మిత్తు ననుచుఁ బ్రతిన గొంటి.</poem>|ref=90}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనుటయుఁ దనతనయునిమీఁద నవిశ్వాసంబు పొడమి తనకపటము లో
నని పదిలపఱచె నంతటఁ, దనుజయు నల్లుఁడును వచ్చి దండముఁ బెట్టన్.</poem>|ref=91}}
{{Telugu poem|type=క.|lines=<poem>బాలహరిణములఁ జూచిన, క్రోలుపులిగతిన్ మనంబు గుబ్బతిలఁగ మి
థ్యాలాలనములు సేయుచు, నాలవదివసంబు శోభనము సాగించెన్.</poem>|ref=92}}
{{Telugu poem|type=చ.|lines=<poem>మఱుసటినాఁటివేకువ నమాత్యుఁడు మేల్కని వంశ మంతయున్
జెఱచిరి కూఁతురుం గొడుకుఁ జెల్లరె మీఁదటఁ జంద్రహాసుఁ డె
చ్చిరినఁ బ్రమాద మౌ ననుచుఁ జిత్తమునం దలపోసి వీని నే
తెఱఁగున నైనఁ జంపెద యతిప్రవరోక్తులు బొంకు చేసెదన్.</poem>|ref=93}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అని నిశ్చయించి బ్రహ్మఘ్న శిశుఘ్న గోఘ్నాదులఁ బలువు రంత్యజులఁ బిలిచి
కృతపడ్డతప్పు గాచితి నేఁడు నగరంబు వెలుపలికోటలోపలికరాళ
కాళికాభవనంబులో లీనులై యుండుఁ డచ్చోటి కపరసంధ్యాముఖమున
నొంటి వచ్చినవాని గెంటి పోవఁగనీక నఱకుండు కండతుండములు గాఁగ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
7wmdlo2cfiareok2nwhtq7d73odmpzk
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/165
104
178898
553231
496238
2026-04-16T02:31:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553231
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>నట్లు చేసిన నర్ధరాజ్యంబు మీకు, నిత్తు మదనునితో డన నియ్యకొనుచు
నరిగి మూఁడవజామున నడఁగియుండెఁ, జండిగృహమునఁ జండాలమండలంబు.</poem>|ref=94}}
{{p|ac|fwb}}దుష్టబుద్ధి చంద్రహాసుని కాళికాగృహమునకుఁ బంపుట</p>
{{Telugu poem|type=క.|lines=<poem>ఆవేళఁ జంద్రహాసుని, రావించి కరగ్రహాంతరంబున దుర్గా
దేవి భజించు టవశ్యము, గావున నీ వేఁగు చండికాగృహమునకున్.</poem>|ref=95}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అనుటయుఁ జంద్రహాసవిభుఁ డట్టులకా కనె నంతఁ గుంతలుం
డు నిజపురోధ గాలవుఁ గనుంగొని రాజ్యముమీఁదికోర్కి గెం
టీనది నిజంబు గాఁ దనువునీడకు మూర్ధము గానరాదు క
న్గొనఁగ నరిష్టలక్షణము కోరిక నా కెఱిఁగింపు నావుడున్.</poem>|ref=96}}
{{Telugu poem|type=క.|lines=<poem>దత్తాత్రేయుఁ డలన్కున, కిత్తెఱఁ గెఱిఁగించె వసుమతీశ్వర విను నీ
వుత్తల మందకు మది, నీ చిత్త సమాధాన మిపుడ చేయఁగఁజాలున్.</poem>|ref=97}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ధ్రువవసిష్ఠారుంధతులఁ దనుచ్ఛాయయుఁ గాననివాఁ డేఁటిలోనఁ గడచుఁ
గిరణాన్వితాగ్ని నిష్కిరణార్కుఁ గనువాఁడు మడియు నేకాదశమాసములను
బనిలేనిపని బక్క బలిసిన బొసుక చిక్కినవాఁడు దెగు నెల లెనిమిదింట
నడుగుచొప్పునఁ బార్ష్ణి యైన వ్రేళ్ళయిన ఖండిత మైనవాఁ డేడునెలల దప్పుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గాకి యైన గ్రద్దైన నులూక మైన, నెత్తి సోఁకినవాఁ డాఱునెలలఁ గెడయు
స్నానమర్దనవేళల మేనిచర్మ, మదరువాఁ డైదునెలలకు నంతరించు.</poem>|ref=98}}
{{Telugu poem|type=క.|lines=<poem>తననీడ వేఱె యుశలా, గున నుండినవాఁడు నాల్గునెలలకు నీల్గున్
ఘనరహిత మైనమెఱుపు జ, మునిదెసఁ గనువాఁడు ద్రెళ్ళు ముమ్మాసములన్.</poem>|ref=99}}
{{Telugu poem|type=క.|lines=<poem>తనబింబ మద్దమునఁ జూచినఁ లేకున్నవాఁడు చెల్లును రెన్నె
ల్లను దనతనువు గమరు వల, చిన పక్షములోన వాఁడు జీవము దొఱఁగున్.</poem>|ref=100}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జలక మాడిన నవయవములకు మించి, హృదయమధ్యంబు జివ్వని యెండె నేని
నీకు గ్రోలిన దాహంబు నిలువ దేని, వాఁడు వేంచేయు నీరైదువాసరముల.</poem>|ref=101}}
{{Telugu poem|type=క.|lines=<poem>మనుజులలోచినములలోఁ, దనరూపముఁ గానకున్నఁ దనవీనులలో
నను వ్రెళ్లు వెట్టి చూచిన, ధ్వని వినఁబడకున్న వాఁడు తడయక పొలియున్.</poem>|ref=102}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఋక్షవానరముల నెక్కి పాడుచుఁ దాన కాలునిదెస కేఁగఁ గంటి ననియుఁ
దనమూర్ధమున బొగ్గులును శిరోజంబులు నుముకయు భక్షించుచుంటి ననియు
నగ్నుఁడై జైనసన్యాసి నవ్వుచు మ్రోల గంతులు వేయంగఁ గంటి ననియుఁ
దైల మాపాదమస్తమునందు వడియంగ నుర్విపై నిద్రించుచుంటి ననియు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నతిభయంకరమూర్తులై యస్త్రధరులు, ఱాలఁ గొని ఱువ్వి రనియును నీలిచీర
కాంత బడి దక్షిణము వోవఁ గంటి ననియు, స్వప్నమునఁ గన్నవారికిఁ జావు ధ్రువము.</poem>|ref=103}}<noinclude><references/></noinclude>
ekw14z2jfmg59004ldriq8l8ulli81p
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/166
104
178899
553232
496239
2026-04-16T02:59:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553232
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>జనవర యి ట్లరిష్టములు సంభవ మైన గురుద్విజామరా
ర్చకజపహోమదానముల శాంతి యొనర్తు రొనర్చి సర్వసం
గనిరసనంబు నింద్రియనికారముఁ జేయుచు నీరు నీరుగూ
ర్చినగతి జీవునిం బరముఁ జేర్తురు తత్త్వరహస్యకోవిదుల్.</poem>|ref=104}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని గాలవముని చెప్పిన, జనపతి మదిఁ బాము కుప్పసం బూడ్చువిధం
బున రాజ్యము విడువఁదలఁచి, తనమంత్రికుమారుఁ డగుమదనుఁ బిలిపింపన్.</poem>|ref=105}}
{{Telugu poem|type=క.|lines=<poem>చనుదెంచి మ్రొక్కి పని యే, మన మీయల్లుఁ డగుచంద్రహాసునివెసఁ దో
కొని ర మ్మిటఁ జంపకమా, లిని నిచ్చెద ననినఁ గుట్మలికహస్తుండై.</poem>|ref=106}}
{{Telugu poem|type=చ.|lines=<poem>పనివిని ప్రొద్దు గ్రుంకు పరిపాటిఁ బురాంతరవీథిఁ గాళికా
ర్చనమున కొంటి నేగెడిమఱందిఁ గనుంగొని మంత్రియాజ్ఞ చే
కొని గమనించు లా గుఱిఁగి కుంతలనాథుఁడు నిన్నుఁ బిల్చి తె
మ్మనెఁ జను మేము నీప్రతిగ నర్చన చేసెదఁ గాని శాంభవిన్.</poem>|ref=107}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అని యతని చేతిగంధపుష్పాక్షతములు, వరుసఁ గైకొని తా నెక్కువారువంబుఁ
తామరచ్ఛత్రములు నిచ్చి సచివతనయుఁ, డనిపి పంపిన నా చంద్రహాసుఁ డరిగి.</poem>|ref=108}}
{{p|ac|fwb}}కుంతలుండు చంపకమాలినిఁ బెండ్లి సేయుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem><వినతి యొనర్చి నిల్వఁ బృథివీపతి గాలవసంయమీంద్రుశా
సనమునఁ జంద్రహాసునకుఁ జంపకమాలినిఁ బెండ్లిచేసి య
ల్లునకు సమస్తరాజ్యమును లోలత నిచ్చి విరక్తుఁడై తపో
ధనమున కేఁగెఁ బ్రాగనుభవక్షతసౌఖ్యము లేవగించుచున్./poem>|ref=109}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంతట మదనుఁడు నగర, ప్రాంతవనీచండికాగృహమునకు నిబిడ
ధ్వాంతమున నొంటిఁ జనఁ బశు, హంతలు పైఁబడి వధించి రాయుధహతులన్.</poem>|ref=110}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునఁ జంద్రహాసుండు చంకకమాలినీవివాహంబునఁ గుంతలరాజ్యసింహా
నారోహంబునను సముత్సాహంబు నొంది వందిబృందంబు పొగడ ముందటం
గ్రందుకొనుసందడి జడియ వారించు వేత్రహస్తుల యస్తోకసాహోనినాదంబు రోద
సీభేదనంబు సంపాదింప శంపాపరంపరానురూపదీపకలాపంబు లుద్దీపింప శచీ
సమేతుం డగునాఖండలుండునుంబోలె వధూసమేతుండై పాండురమత్తవేదం
డంబు నెక్కి యక్కజం బగువైభవంబునం జనుదెంచి దుష్టబుద్ధి నగరిముందట,
పంజరంబు డిగ్గి యంతకుమున్ను వచోహరులవలనం దనరాక యెఱింగి కలంగి
మున్న మామకుం బ్రణమిల్లి యతనికిం దనవృత్తాంతంబుకు మదనుండు కాళికా
సదనంబున కరిగినవిధంబునుఁ జెప్పు నిప్పు ద్రొక్కినపోలికం బొక్కిపడియుఁ గళ
వళంబు దక్కి తక్కరిప్రియంబున నల్లునియుల్లంబు పల్లవింపం జేసి యనిపి యయ్య
మాత్యవరుం డత్యాహితంబున.</poem>|ref=111}}<noinclude><references/></noinclude>
okt4x0efb0hzj415q76gz9pe5q37oiy
553233
553232
2026-04-16T03:00:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553233
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>జనవర యి ట్లరిష్టములు సంభవ మైన గురుద్విజామరా
ర్చకజపహోమదానముల శాంతి యొనర్తు రొనర్చి సర్వసం
గనిరసనంబు నింద్రియనికారముఁ జేయుచు నీరు నీరుగూ
ర్చినగతి జీవునిం బరముఁ జేర్తురు తత్త్వరహస్యకోవిదుల్.</poem>|ref=104}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని గాలవముని చెప్పిన, జనపతి మదిఁ బాము కుప్పసం బూడ్చువిధం
బున రాజ్యము విడువఁదలఁచి, తనమంత్రికుమారుఁ డగుమదనుఁ బిలిపింపన్.</poem>|ref=105}}
{{Telugu poem|type=క.|lines=<poem>చనుదెంచి మ్రొక్కి పని యే, మన మీయల్లుఁ డగుచంద్రహాసునివెసఁ దో
కొని ర మ్మిటఁ జంపకమా, లిని నిచ్చెద ననినఁ గుట్మలికహస్తుండై.</poem>|ref=106}}
{{Telugu poem|type=చ.|lines=<poem>పనివిని ప్రొద్దు గ్రుంకు పరిపాటిఁ బురాంతరవీథిఁ గాళికా
ర్చనమున కొంటి నేగెడిమఱందిఁ గనుంగొని మంత్రియాజ్ఞ చే
కొని గమనించు లా గుఱిఁగి కుంతలనాథుఁడు నిన్నుఁ బిల్చి తె
మ్మనెఁ జను మేము నీప్రతిగ నర్చన చేసెదఁ గాని శాంభవిన్.</poem>|ref=107}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అని యతని చేతిగంధపుష్పాక్షతములు, వరుసఁ గైకొని తా నెక్కువారువంబుఁ
తామరచ్ఛత్రములు నిచ్చి సచివతనయుఁ, డనిపి పంపిన నా చంద్రహాసుఁ డరిగి.</poem>|ref=108}}
{{p|ac|fwb}}కుంతలుండు చంపకమాలినిఁ బెండ్లి సేయుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>వినతి యొనర్చి నిల్వఁ బృథివీపతి గాలవసంయమీంద్రుశా
సనమునఁ జంద్రహాసునకుఁ జంపకమాలినిఁ బెండ్లిచేసి య
ల్లునకు సమస్తరాజ్యమును లోలత నిచ్చి విరక్తుఁడై తపో
ధనమున కేఁగెఁ బ్రాగనుభవక్షతసౌఖ్యము లేవగించుచున్.</poem>|ref=109}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంతట మదనుఁడు నగర, ప్రాంతవనీచండికాగృహమునకు నిబిడ
ధ్వాంతమున నొంటిఁ జనఁ బశు, హంతలు పైఁబడి వధించి రాయుధహతులన్.</poem>|ref=110}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునఁ జంద్రహాసుండు చంకకమాలినీవివాహంబునఁ గుంతలరాజ్యసింహా
నారోహంబునను సముత్సాహంబు నొంది వందిబృందంబు పొగడ ముందటం
గ్రందుకొనుసందడి జడియ వారించు వేత్రహస్తుల యస్తోకసాహోనినాదంబు రోద
సీభేదనంబు సంపాదింప శంపాపరంపరానురూపదీపకలాపంబు లుద్దీపింప శచీ
సమేతుం డగునాఖండలుండునుంబోలె వధూసమేతుండై పాండురమత్తవేదం
డంబు నెక్కి యక్కజం బగువైభవంబునం జనుదెంచి దుష్టబుద్ధి నగరిముందట,
పంజరంబు డిగ్గి యంతకుమున్ను వచోహరులవలనం దనరాక యెఱింగి కలంగి
మున్న మామకుం బ్రణమిల్లి యతనికిం దనవృత్తాంతంబుకు మదనుండు కాళికా
సదనంబున కరిగినవిధంబునుఁ జెప్పు నిప్పు ద్రొక్కినపోలికం బొక్కిపడియుఁ గళ
వళంబు దక్కి తక్కరిప్రియంబున నల్లునియుల్లంబు పల్లవింపం జేసి యనిపి యయ్య
మాత్యవరుం డత్యాహితంబున.</poem>|ref=111}}<noinclude><references/></noinclude>
6v3vqiiklxu9a1ec2ewhzd8nzgdgp4y
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/167
104
178900
553234
496240
2026-04-16T03:30:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553234
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>తలయుం గోకయు వీడఁగాఁ బఱచి సంతాపంబునం గాళికా
నిలయం బొక్కఁడ చొచ్చి చచ్చినసుతు న్వీక్షించి శ్రీవిష్ణుభ
క్తులకున్ రెండు దలంచుద్రోహులకు యుక్తుల్ గొల్పునే యంచుఁ ద
ద్బలిపీఠోపలపాతభగ్నశిరుఁడై ప్రాణంబులం బాసినన్.</poem>|ref=112}}
{{Telugu poem|type=|lines=<poem>బలబలవేగఁ జండిక నుపాసన చేయుతపోధనుండు దే
హళిఁ బడియున్న మంత్రివరు నాతనిసూనునిఁ జూచి యెట్లొకో
పొలిసిరి నిర్నిమిత్త మని పొక్కుచు వే చని చంద్రహాసభూ
తలపతితోడఁ జెప్పిన నతండు రయంబునఁ బాదచారియై.</poem>|ref=113}}
{{p|ac|fwb}}చంద్రహాసుండు దుష్టబుద్ధిని బ్రతికించుట</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>కాళీగృహము సొచ్చి కూలినసచివుఁ దత్తనయునిఁ గని శోకతప్తుఁ డగుచుఁ
గదిసి వీరల నేఁడు బ్రదికింపకుండినఁ బ్రజలచే నాడిక పడుదు ననుచుఁ
జతురస్రకలితవిస్తృతహోమకుండంబుఁ ద్రవ్వించి పావకుఁ దవులు కొలిపి
శర్కరాతిలపాయసఘృతంబులను గూర్చి తనమేనికండలు దఱిగి వ్రేల్చి</poem>|ref=}}
{{Telugu poem|type=|lines=<poem>దేవిఁ గనుఁగొని చిచ్ఛక్తి వీవు హరికి, నగుట మచ్ఛిర మిత్తుఁ బూర్ణాహు తనుచు
ఖడ్గ మంకింప వైష్ణవి కరముఁ బట్టి, వాంఛితం బెద్ది వేఁడుము వరము ననిన.</poem>|ref=114}}
{{Telugu poem|type=క.|lines=<poem>వారల మును బ్రతికింపుము, నారాయణుమీఁద భక్తి నా కిమ్మన న
వ్వారాహి యొసగిఁ నీకుఁ గు, మారులు గలిగెదరు బలసమన్వితు లనుచున్.</poem>|ref=115}}
{{Telugu poem|type=|lines=<poem>అకలంకస్థితిఁ జంద్రహాసవిభు డాయం బిల్చి తా హస్త మ
స్తకసంయోగము సేయుచుం బరమతత్త్వజ్ఞానముం దెల్పి చం
డిక యంతర్హితయైన మామయు మఱంది న్నిద్ర మేల్కాంచుపో
వక లేవన్ దివిఁ బుష్పవృష్టి కురిసెన్ లేఖుల్ ప్రశంసింపఁగన్.</poem>|ref=116}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనవిభుఁడు చంద్రహాసుం, డు నమాత్యుని మదనుఁ దోకొనుచుఁ బురమునకున్
జనుదెంచి తల్లి మేధా, వినికిఁ గుళిందునకు మ్రొక్కి వినయముతోడన్.</poem>|ref=117}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వేడ్కఁ జంపకమాలినీవిషయలందు, సొరిది బద్మాక్షమకరధ్వజులను గాంచి
హరిపరాయణుఁ డగుచంద్రహాసనృపతి, త్రిశతవర్షంబు లేలె ధాత్రీకులంబు.</poem>|ref=118}}
{{Telugu poem|type=|lines=<poem>ఈమహిమలఁ జెందుట సు, త్రామజయాదుష్టమతి నఱకఁ బంపునెడం
దా మునుభజించుసాల, గ్రామ మొకటి మ్రింగె నందుకతమున ననుచున్.</poem>|ref=119}}
{{Telugu poem|type=|lines=<poem>సాలగ్రామజలంబులు, మౌళిపయిం జల్లుకొనిన మానవులకు నీ
వేలా శైలావృతనిఖి, లేలా తీర్థములఫలము లేలా సేయన్.</poem>|ref=120}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మొగిఁ జతుర్దశలోకముల భరించుఫలంబు చేరు సాలగ్రామధారణమున
ధారణీచక్ర మంతయు నిచ్చినఫలంబు దక్కు సాలగ్రామదానమునను</poem>|ref=}}<noinclude><references/></noinclude>
jxmqwnflhe60l8x1jp5hyia24utapy9
553235
553234
2026-04-16T03:30:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553235
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>తలయుం గోకయు వీడఁగాఁ బఱచి సంతాపంబునం గాళికా
నిలయం బొక్కఁడ చొచ్చి చచ్చినసుతు న్వీక్షించి శ్రీవిష్ణుభ
క్తులకున్ రెండు దలంచుద్రోహులకు యుక్తుల్ గొల్పునే యంచుఁ ద
ద్బలిపీఠోపలపాతభగ్నశిరుఁడై ప్రాణంబులం బాసినన్.</poem>|ref=112}}
{{Telugu poem|type=చ.|lines=<poem>బలబలవేగఁ జండిక నుపాసన చేయుతపోధనుండు దే
హళిఁ బడియున్న మంత్రివరు నాతనిసూనునిఁ జూచి యెట్లొకో
పొలిసిరి నిర్నిమిత్త మని పొక్కుచు వే చని చంద్రహాసభూ
తలపతితోడఁ జెప్పిన నతండు రయంబునఁ బాదచారియై.</poem>|ref=113}}
{{p|ac|fwb}}చంద్రహాసుండు దుష్టబుద్ధిని బ్రతికించుట</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>కాళీగృహము సొచ్చి కూలినసచివుఁ దత్తనయునిఁ గని శోకతప్తుఁ డగుచుఁ
గదిసి వీరల నేఁడు బ్రదికింపకుండినఁ బ్రజలచే నాడిక పడుదు ననుచుఁ
జతురస్రకలితవిస్తృతహోమకుండంబుఁ ద్రవ్వించి పావకుఁ దవులు కొలిపి
శర్కరాతిలపాయసఘృతంబులను గూర్చి తనమేనికండలు దఱిగి వ్రేల్చి</poem>|ref=}}
{{Telugu poem|type=|lines=<poem>దేవిఁ గనుఁగొని చిచ్ఛక్తి వీవు హరికి, నగుట మచ్ఛిర మిత్తుఁ బూర్ణాహు తనుచు
ఖడ్గ మంకింప వైష్ణవి కరముఁ బట్టి, వాంఛితం బెద్ది వేఁడుము వరము ననిన.</poem>|ref=114}}
{{Telugu poem|type=క.|lines=<poem>వారల మును బ్రతికింపుము, నారాయణుమీఁద భక్తి నా కిమ్మన న
వ్వారాహి యొసగిఁ నీకుఁ గు, మారులు గలిగెదరు బలసమన్వితు లనుచున్.</poem>|ref=115}}
{{Telugu poem|type=|lines=<poem>అకలంకస్థితిఁ జంద్రహాసవిభు డాయం బిల్చి తా హస్త మ
స్తకసంయోగము సేయుచుం బరమతత్త్వజ్ఞానముం దెల్పి చం
డిక యంతర్హితయైన మామయు మఱంది న్నిద్ర మేల్కాంచుపో
వక లేవన్ దివిఁ బుష్పవృష్టి కురిసెన్ లేఖుల్ ప్రశంసింపఁగన్.</poem>|ref=116}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనవిభుఁడు చంద్రహాసుం, డు నమాత్యుని మదనుఁ దోకొనుచుఁ బురమునకున్
జనుదెంచి తల్లి మేధా, వినికిఁ గుళిందునకు మ్రొక్కి వినయముతోడన్.</poem>|ref=117}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వేడ్కఁ జంపకమాలినీవిషయలందు, సొరిది బద్మాక్షమకరధ్వజులను గాంచి
హరిపరాయణుఁ డగుచంద్రహాసనృపతి, త్రిశతవర్షంబు లేలె ధాత్రీకులంబు.</poem>|ref=118}}
{{Telugu poem|type=|lines=<poem>ఈమహిమలఁ జెందుట సు, త్రామజయాదుష్టమతి నఱకఁ బంపునెడం
దా మునుభజించుసాల, గ్రామ మొకటి మ్రింగె నందుకతమున ననుచున్.</poem>|ref=119}}
{{Telugu poem|type=|lines=<poem>సాలగ్రామజలంబులు, మౌళిపయిం జల్లుకొనిన మానవులకు నీ
వేలా శైలావృతనిఖి, లేలా తీర్థములఫలము లేలా సేయన్.</poem>|ref=120}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మొగిఁ జతుర్దశలోకముల భరించుఫలంబు చేరు సాలగ్రామధారణమున
ధారణీచక్ర మంతయు నిచ్చినఫలంబు దక్కు సాలగ్రామదానమునను</poem>|ref=}}<noinclude><references/></noinclude>
635kokkeweqvrc3lbirxoepp1l5ahni
553236
553235
2026-04-16T03:33:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553236
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>తలయుం గోకయు వీడఁగాఁ బఱచి సంతాపంబునం గాళికా
నిలయం బొక్కఁడ చొచ్చి చచ్చినసుతు న్వీక్షించి శ్రీవిష్ణుభ
క్తులకున్ రెండు దలంచుద్రోహులకు యుక్తుల్ గొల్పునే యంచుఁ ద
ద్బలిపీఠోపలపాతభగ్నశిరుఁడై ప్రాణంబులం బాసినన్.</poem>|ref=112}}
{{Telugu poem|type=చ.|lines=<poem>బలబలవేగఁ జండిక నుపాసన చేయుతపోధనుండు దే
హళిఁ బడియున్న మంత్రివరు నాతనిసూనునిఁ జూచి యెట్లొకో
పొలిసిరి నిర్నిమిత్త మని పొక్కుచు వే చని చంద్రహాసభూ
తలపతితోడఁ జెప్పిన నతండు రయంబునఁ బాదచారియై.</poem>|ref=113}}
{{p|ac|fwb}}చంద్రహాసుండు దుష్టబుద్ధిని బ్రతికించుట</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>కాళీగృహము సొచ్చి కూలినసచివుఁ దత్తనయునిఁ గని శోకతప్తుఁ డగుచుఁ
గదిసి వీరల నేఁడు బ్రదికింపకుండినఁ బ్రజలచే నాడిక పడుదు ననుచుఁ
జతురస్రకలితవిస్తృతహోమకుండంబుఁ ద్రవ్వించి పావకుఁ దవులు కొలిపి
శర్కరాతిలపాయసఘృతంబులను గూర్చి తనమేనికండలు దఱిగి వ్రేల్చి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దేవిఁ గనుఁగొని చిచ్ఛక్తి వీవు హరికి, నగుట మచ్ఛిర మిత్తుఁ బూర్ణాహు తనుచు
ఖడ్గ మంకింప వైష్ణవి కరముఁ బట్టి, వాంఛితం బెద్ది వేఁడుము వరము ననిన.</poem>|ref=114}}
{{Telugu poem|type=క.|lines=<poem>వారల మును బ్రతికింపుము, నారాయణుమీఁద భక్తి నా కిమ్మన న
వ్వారాహి యొసగిఁ నీకుఁ గు, మారులు గలిగెదరు బలసమన్వితు లనుచున్.</poem>|ref=115}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అకలంకస్థితిఁ జంద్రహాసవిభు డాయం బిల్చి తా హస్త మ
స్తకసంయోగము సేయుచుం బరమతత్త్వజ్ఞానముం దెల్పి చం
డిక యంతర్హితయైన మామయు మఱంది న్నిద్ర మేల్కాంచుపో
వక లేవన్ దివిఁ బుష్పవృష్టి కురిసెన్ లేఖుల్ ప్రశంసింపఁగన్.</poem>|ref=116}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనవిభుఁడు చంద్రహాసుం, డు నమాత్యుని మదనుఁ దోకొనుచుఁ బురమునకున్
జనుదెంచి తల్లి మేధా, వినికిఁ గుళిందునకు మ్రొక్కి వినయముతోడన్.</poem>|ref=117}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వేడ్కఁ జంపకమాలినీవిషయలందు, సొరిది బద్మాక్షమకరధ్వజులను గాంచి
హరిపరాయణుఁ డగుచంద్రహాసనృపతి, త్రిశతవర్షంబు లేలె ధాత్రీకులంబు.</poem>|ref=118}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈమహిమలఁ జెందుట సు, త్రామజయాదుష్టమతి నఱకఁ బంపునెడం
దా మునుభజించుసాల, గ్రామ మొకటి మ్రింగె నందుకతమున ననుచున్.</poem>|ref=119}}
{{Telugu poem|type=క.|lines=<poem>సాలగ్రామజలంబులు, మౌళిపయిం జల్లుకొనిన మానవులకు నీ
వేలా శైలావృతనిఖి, లేలా తీర్థములఫలము లేలా సేయన్.</poem>|ref=120}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మొగిఁ జతుర్దశలోకముల భరించుఫలంబు చేరు సాలగ్రామధారణమున
ధారణీచక్ర మంతయు నిచ్చినఫలంబు దక్కు సాలగ్రామదానమునను</poem>|ref=}}<noinclude><references/></noinclude>
66b9uqny39e3bynwxvhwg4p052rgnp6
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/168
104
178901
553237
496241
2026-04-16T04:02:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553237
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సకలదేవతల నర్చన చేసినఫలంబు పొందు సాలగ్రామపూజనమునఁ
బరమపావనవేదపారాయణఫలంబు వచ్చు సాలగ్రామవర్ణనమున</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యతి యనంగ సాలగ్రామ మనఁగ భోగి, తల్పునకును జరాచరతనువు లనుచు
సంతతము బ్రహ్మ గొనియాడునంతకంటెఁ, దుర్యమని చెప్పుచుండు శ్రీతులసిమహిమ.</poem>|ref=121}}
{{Telugu poem|type=క.|lines=<poem>శిరమునఁ బింఛముఁ జెవుల మ, కరకుండలములు నురమునఁ గౌస్తుభ మర్థిన్
ధరియించు నంతకంటెను, హరి శ్రీతులసీదళంబు నవలంబించున్.</poem>|ref=122}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఈకథ విన్నమర్త్యుల కభీష్టప్రద మంచుఁ జెప్పి నా
ళీకభవాత్మసూనుఁడు నిలింపపురంబున కేఁగె విస్మయో
త్సేకితఁ జంద్రహాసనృపశేఖరుభవ్యచరిత్రముల్ నృపా
నీకముతోడఁ బార్థుఁడ గణించుచుఁ గౌంతలకంబు చేరినన్.</poem>|ref=123}}
{{Telugu poem|type=క.|lines=<poem>అన్నృపతిసుతులు బలసం, పన్నులు మకరధ్వజుండుఁ బద్మాక్షుండున్
మున్నాడి పాఱుతెంచిన, జన్నపుహరులన్ వయాళిఁ జని కని రెదురన్.</poem>|ref=124}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కని కొనిపోయి తండ్రి ముఖంబుఁ బెట్టినఁ జంద్రహాసుఁ డి
ట్లను నిది ధర్మనందనుమఖాశ్వము దీనికి నై ప్రయాస మొం
దనిమిషరాట్సుతుండు దిరుగాడెడు సేనలతోడ నంచు మున్
వినఁబడుఁ బట్టినం గ్రతువు విఘ్న మగున్ మనధర్మసూతికిన్.</poem>|ref=125}}
{{Telugu poem|type=క.|lines=<poem>మీరలు పదైదుదివసము, లీరెంటి సురక్ష సేయుఁ డింతటిలో నే
వారలు రాకున్న మఖ, ప్రారంభమువేళ కనిపిపంపుద మనుచున్.</poem>|ref=126}}
{{Telugu poem|type=క.|lines=<poem>బలుకునెడఁ బార్థుసేనా, కలకలములు నిజపురోపకంఠసరణి ది
క్కుల వ్రక్కలింపఁగా నల, బలములతో మోహరించి బలములు నెదురన్.</poem>|ref=127}}
{{Telugu poem|type=క.|lines=<poem>శ్రీహరి సంతోషింపఁగ, నాహవ మొనరింపఁ గలిగె నర్జునుతో నం
చూహించి నృపతి రణ స, న్నాహంబునఁ దత్పురాంగణంబున నిలువన్.</poem>|ref=128}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అతనిఁ గని కృష్ణుఁ డనునింద్రసుతునితోడఁ, జంద్రహాసునిఁ బరమవైష్ణవునిఁ జూడు
వీఁడు జ్ఞానతపోవయోవృద్ధు గాని, క్రూరసమరాంగణమునఁ దారుణ్యతనుఁడు.</poem>|ref=129}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అని కృష్ణుండు కిరీటికిం దెలుపుచో నాచంద్రహాసుండు సై
న్యనికాయంబులముంగల న్వరశతాంగారూఢుఁ డై వచ్చుదే
వునిఁ జక్రాసి గదాబ్జహస్తు మునిసేవ్యు న్భక్తితోఁ గాంచి గ్ర
క్కున మాణిక్యరథంబు డిగ్గి చని సాష్టాంగంబుగా మ్రొక్కినన్.</poem>|ref=130}}
{{Telugu poem|type=చ.|lines=<poem>హరియును జంద్రహాసునిఁ బ్రియంబునఁ గౌఁగిటఁ జేర్చుచుం బురం
దరసుతుఁ జూచి నా కితఁడు నమ్మినభక్తుఁ డవధ్యుఁ డీవు సం
గరకుతుకంబు ద క్కితనిఁ గౌఁగిటఁ జేర్పుమటన్న నేఁడు నా
కురుకులు మెల్లఁ బావనతఁ గూడె నిజం బని కౌఁగిలించినన్.</poem>|ref=131}}<noinclude><references/></noinclude>
azukh7b6pr6iepn74yi4tttuzqybeiu
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/169
104
178902
553238
496242
2026-04-16T04:23:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553238
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>చంద్రహాసుండు నరుతోడ శమనసూను, నధ్వరాశ్వంబు మామకరధ్వజునివ
శంబు చేసితి నవఁ దురగంబుఁ గొనుచు, నతఁడు నేతెంచి మ్రొక్కె గృష్ణార్జునులకు.</poem>|ref=132}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తదవసరంబున రాజసమాజపూజితుండై చంద్రహాసుండు వాసుదేవు సుధామధురవా
గ్విలాసంబులం బ్రస్తుతించి మహోత్సవంబున నిజపురంబునకుం గొనివచ్చి దుష్టబుద్ధి
మదనపద్మాక్షసహితంబుగా సమస్తబంధునివహంబుం గనిపించి కృష్ణపూజానిమిత్తం
బునం జిదానందచిత్తుం డగు గాలవమునిసత్తముం బిలిపింప నయ్యోగివరుండు సచ్చి
దానందమూర్తి యగు నద్దేవునిం గీర్తించి ముహూర్తమాత్రంబు తన్మయుండై
యుండె కుంతలేశ్వరుం డొనర్చు నర్చనల సంతసిల్లుచుఁ గంతుజనకుం డచ్చట
దివసత్రయం బధివసించి నాలవనాఁడు కుళిందనందనుండు దనకు నర్పించిన రాజ్యం
బునం దదీయకుమారకుల మకరధ్వజపద్మాక్షులం బట్టంబు గట్టె నట్టియెడ.</poem>|ref=133}}
{{Telugu poem|type=క.|lines=<poem>నందనులఁ జూచి పరమా, నందుఁ డగుచుఁ జంద్రహాసనరపతి యీగో
విందుని భజించి మోక్షముఁ, జెందెద నాయట్ల కీర్తి జెందుఁడు మీరల్.</poem>|ref=134}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అని దీవించుచు బుద్ధి చెప్పి చతురంగానీకినుల్ గొల్వఁ బా
ర్థునకుం దోడయి రా మఖాశ్వములు దోడ్తోఁ జొచ్చె భూము ల
జ్జననాథుల్ గని కప్పముల్ గొనుచు శశ్వద్భక్తి సేవింప వా
రనివేగంబునఁ దేజు లుత్తరసముద్రం బుద్ధతిం జొచ్చినన్.</poem>|ref=135}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>అపుడు సకలనృపులు నంబుధి సాధించు, వెరవు దెలియలేక విహ్వలింప
హరిమయూరకేతనార్జునప్రద్యుమ్న, హంసకేతుకార్ష్ణు లర్హు లగుట.</poem>|ref=136}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆయేవురయరదములకు, నేయెడ నడ్డంబు లేమి యెఱిఁగి దరి మహీ
నాయకుల నిలిపి తా న, త్తోయధి వెస నమ్మహారథులతోఁ జొచ్చెన్.</poem>|ref=137}}
{{Telugu poem|type=క.|lines=<poem>మకరాలయ మటు సొచ్చి వె, దకి యుండొకదీవి జీర్ణతరఘనవటప
ర్ణకృతావకుంఠనుం డగు, బకదాల్భ్యుం గనియె వరతపఃప్రాగల్భ్యున్.</poem>|ref=138}}
{{Telugu poem|type=క.|lines=<poem>అందఱు నచ్చోట నిజ, స్యందనములు డిగ్గి మ్రొక్క సంయమి మదిలో
నిందులకును హరి యెక్కడి, సందడి గొనివచ్చె నని యసహ్యపడంగన్.</poem>|ref=139}}
{{Telugu poem|type=మ.|lines=<poem>నరుఁ డత్తాపసుఁ జేరి కేల్మొగిచి వింతల్ నీశరీరంబునం
దిరుగం బుట్టలు వెట్టె సర్పములు వర్తింపన్ దరుల్ జామకూ
ర్పరదేశంబులఁ బుట్టె గూండ్ల శకునవ్రాతంబు వర్తింప నీ
కరయన్ వాసము లేక నీచివికిమఱ్ఱా కేమిప్రా పయ్యెడున్.</poem>|ref=140}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అనినఁ బార్థునిఁ గని పల్కు మునివరుండు, సంగ మతిదుఃఖ మని బ్రహ్మచర్య నున్న
నాకుఁ జాలదె యింతమఱ్ఱాకునీడ, యాయు వల్పంబు గృహ మేమి సేయ ననిన.</poem>|ref=141}}
{{Telugu poem|type=మ.|lines=<poem>బలభిత్సూనుఁడు విస్మయాత్ముఁ డగుచున్ బ్రాయంబు నీ కెంత ని
ర్మలచారిత్ర యనం దపోధనుఁడు సుత్రామాత్మజుం జూచి లె</poem>|ref=}}<noinclude><references/></noinclude>
jbo4hi7s9gskgs9uj633e4tzy6t89is
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/170
104
178903
553244
496243
2026-04-16T04:36:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553244
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>క్క లెఱుంగన్ మృతు లైనరోమశుల మార్కండేయులం బేర్కొనన్
నలువల్ వింశతిసంఖ్య లే నెఱుఁగ సంతం బొంది రీసందునన్.</poem>|ref=142}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కంనిధు లేకోదకం బైన నిచటికి వెల్లివెంబడి వచ్చు వేల్పునగర
మాసమయమున శాఖసహస్రాజాండపూర్ణమై యొకమఱ్ఱి పొదలుచుండు
నందు నేకదళంబునందుఁ జక్కనిపిన్నబాలకుం డొక్కఁడు పవ్వళించుఁ
గోమలతరపదాంగుష్టంబు చిబుకుచు నెడనెడ నవ్వుచు నేడ్చుచుండు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నతనిదర్శనమున విలయార్ణవమున, సుడివడక సంచరింతు నా సుద్దులేల
నాఁటిపిన్నాతఁ డీయదునందనుండు, సరవి మిముఁ గూడి విరిగి యీచంద మయ్యె.</poem>|ref=143}}
{{Telugu poem|type=క.|lines=<poem>బాలకుఁడు తొల్లి యిప్పుడు, దా లక్ష్మిం బెండ్లి యాడి తనయులఁ గని యీ
త్రైలోక్యగృహస్థుం డై, క్రాలెడు నని కృష్ణుఁ బిలిచి కౌఁగిటఁ జేర్చెన్.</poem>|ref=144}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మదనజనకుండు మునికి నమస్కరించి, వింశతిబ్రహ్మకల్పసంవీక్షణుఁడవు
గాన విష్ణుండ వీవు నీకతన ధర్మ, పుత్త్రుమఖ మింక సఫలతఁ బొందు ననిన.</poem>|ref=145}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈగతి ననుమతి యిచ్చి మహాగర్వభరంబు పెట్ట నగునే నీకున్
వాగీశ్వరుగర్వంబును, నాగర్వ ముడిగినకథ వినవె నీ వనుచున్.</poem>|ref=146}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పద్మకల్పంబునం దొక్కపద్మభవుఁడు, రాజహంసంబు నెక్కి యగ్రమున నిలిచి
చింపిమఱ్ఱాకుచాటున జివికి తపము, చేసి బడలక వేఁడు వాంఛితము లనిన.</poem>|ref=147}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆతనిఁ గని యే నెఱుఁగ వి, ధాతలు చని రిరువదిటఁ గృతముకడపట నీ
చేతివరముఁ గొనుకొఱకునె, యీతప మని నవ్వు నప్పు డిరువురనడుమన్.</poem>|ref=148}}
{{Telugu poem|type=మ.|lines=<poem>ధరణీచక్రము వ్రక్కలించు కొకయుత్పాతోగ్రవాతంబు ని
ర్భరవృత్తం జనియించి వేఱొకమహాబ్రహ్మాండభాండంబులోఁ
జొరు గాకుల్ వలెఁ బాఱవైచుటయు నచ్చో నొక్కపద్మాసనుం
డిరునాల్మోములవాఁడు మమ్ము గని మీ రెవ్వారు పూర్వం బనన్.</poem>|ref=149}}
{{Telugu poem|type=మ.|lines=<poem>చతురాస్యుం డను సత్యలోకనిజవాస్తవ్యుండ నాశిష్యుఁ డీ
యతివర్యుం డన నవ్వి నాయెదుర నీవా బ్రహ్మ నే నంచుఁ బ్రే
లితి నీశిష్యుఁడు నీవు నాయుడిగముల్ సేయుండు నాఁ దన్మరు
ద్ధతి నాతండును నేను వేఱెయొకబ్రహ్మాండంబునన్ ద్రెళ్లినన్.</poem>|ref=150}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అచ్చోట సుకృతులు నతివధాన్యులు నైన పురుషులు మమ్ము మువ్వురను జూచి
యెక్కడివారు మీ రేలోకమున నుందు రనిన ని ట్లనియె నయ్యష్టముఖుఁడు
బ్రహ్మలోకంబు మద్భవనంబు వీరు నాశిష్యులు నే సరసిజభవుఁడ
నన వారు షోడశాస్యవిరించిఁ గనిపింప నతఁడు గర్వమున మమ్మట్ల పలుక</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నెత్తుకొని యమ్మహావాయు వేమి చెప్ప, నతని మమ్మును ద్వాత్రింశదాస్యధాత
లోకమున వైచె నిట్లు దూలుచుఁ గ్రమక్ర, మమునఁ బలువురు పద్మసంభవులతోడ.</poem>|ref=151}}<noinclude><references/></noinclude>
hj3zi2o2fbgzeva6htu0yvn8ysinrlt
553246
553244
2026-04-16T04:52:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553246
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>క్క లెఱుంగన్ మృతు లైనరోమశుల మార్కండేయులం బేర్కొనన్
నలువల్ వింశతిసంఖ్యు లే నెఱుఁగ నంతం బొంది రీసందునన్.</poem>|ref=142}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కంనిధు లేకోదకం బైన నిచటికి వెల్లివెంబడి వచ్చు వేల్పునగర
మాసమయమున శాఖసహస్రాజాండపూర్ణమై యొకమఱ్ఱి పొదలుచుండు
నందు నేకదళంబునందుఁ జక్కనిపిన్నబాలకుం డొక్కఁడు పవ్వళించుఁ
గోమలతరపదాంగుష్టంబు చిబుకుచు నెడనెడ నవ్వుచు నేడ్చుచుండు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నతనిదర్శనమున విలయార్ణవమున, సుడివడక సంచరింతు నా సుద్దులేల
నాఁటిపిన్నాతఁ డీయదునందనుండు, సరవి మిముఁ గూడి విరిగి యీచంద మయ్యె.</poem>|ref=143}}
{{Telugu poem|type=క.|lines=<poem>బాలకుఁడు తొల్లి యిప్పుడు, దా లక్ష్మిం బెండ్లి యాడి తనయులఁ గని యీ
త్రైలోక్యగృహస్థుం డై, క్రాలెడు నని కృష్ణుఁ బిలిచి కౌఁగిటఁ జేర్చెన్.</poem>|ref=144}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మదనజనకుండు మునికి నమస్కరించి, వింశతిబ్రహ్మకల్పసంవీక్షణుఁడవు
గాన విష్ణుండ వీవు నీకతన ధర్మ, పుత్త్రుమఖ మింక సఫలతఁ బొందు ననిన.</poem>|ref=145}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈగతి ననుమతి యిచ్చి మహాగర్వభరంబు పెట్ట నగునే నీకున్
వాగీశ్వరుగర్వంబును, నాగర్వ ముడిగినకథ వినవె నీ వనుచున్.</poem>|ref=146}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పద్మకల్పంబునం దొక్కపద్మభవుఁడు, రాజహంసంబు నెక్కి యగ్రమున నిలిచి
చింపిమఱ్ఱాకుచాటున జివికి తపము, చేసి బడలక వేఁడు వాంఛితము లనిన.</poem>|ref=147}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆతనిఁ గని యే నెఱుఁగ వి, ధాతలు చని రిరువదిటఁ గృతముకడపట నీ
చేతివరముఁ గొనుకొఱకునె, యీతప మని నవ్వు నప్పు డిరువురనడుమన్.</poem>|ref=148}}
{{Telugu poem|type=మ.|lines=<poem>ధరణీచక్రము వ్రక్కలించు కొకయుత్పాతోగ్రవాతంబు ని
ర్భరవృత్తం జనియించి వేఱొకమహాబ్రహ్మాండభాండంబులోఁ
జొరు గాకుల్ వలెఁ బాఱవైచుటయు నచ్చో నొక్కపద్మాసనుం
డిరునాల్మోములవాఁడు మమ్ము గని మీ రెవ్వారు పూర్వం బనన్.</poem>|ref=149}}
{{Telugu poem|type=మ.|lines=<poem>చతురాస్యుం డను సత్యలోకనిజవాస్తవ్యుండ నాశిష్యుఁ డీ
యతివర్యుం డన నవ్వి నాయెదుర నీవా బ్రహ్మ నే నంచుఁ బ్రే
లితి నీశిష్యుఁడు నీవు నాయుడిగముల్ సేయుండు నాఁ దన్మరు
ద్ధతి నాతండును నేను వేఱెయొకబ్రహ్మాండంబునన్ ద్రెళ్లినన్.</poem>|ref=150}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అచ్చోట సుకృతులు నతివధాన్యులు నైన పురుషులు మమ్ము మువ్వురను జూచి
యెక్కడివారు మీ రేలోకమున నుందు రనిన ని ట్లనియె నయ్యష్టముఖుఁడు
బ్రహ్మలోకంబు మద్భవనంబు వీరు నాశిష్యులు నే సరసిజభవుఁడ
నన వారు షోడశాస్యవిరించిఁ గనిపింప నతఁడు గర్వమున మమ్మట్ల పలుక</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నెత్తుకొని యమ్మహావాయు వేమి చెప్ప, నతని మమ్మును ద్వాత్రింశదాస్యధాత
లోకమున వైచె నిట్లు దూలుచుఁ గ్రమక్ర, మమునఁ బలువురు పద్మసంభవులతోడ.</poem>|ref=151}}<noinclude><references/></noinclude>
75bw872f5e56yo8c0scby13wy2lznyn
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/171
104
178904
553249
496244
2026-04-16T05:56:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553249
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>చని కడపట సనకసనం, దనమునిసేవితుని వేయితలలవిధాతం
గన నయ్యథోక్షణుం డే, పని కిట వచ్చితిరి మీకు భద్రమె యనుచున్.</poem>|ref=152}}
{{Telugu poem|type=క.|lines=<poem>కృప కారణముగ నీ, లోకమ్మున నిలుతు నని పలుక నందఱు నా
ళీకభవులు మద ముడిగి వి, వేకమతిన్ మ్రొక్కి పెక్కువినుతులు సేయన్.</poem>|ref153=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ఆసహస్రాననుఁడు వారి నాదరించి, కమలజుల నెల్లఁ దత్తత్పదముల నిలిపె
నాఁటనుండియు నిచట నున్నాఁడ నేను, వారిరుహనేత్రగర్వ మెవ్వరికి మేలు.</poem>|ref=154}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అనఁ గృష్ణార్జును లాత్మఁ జొక్కుచు మునిం బ్రార్థించి యయ్యాశ్రమా
వని వర్తించుహయంబులన్ గొనుచు నవ్వాచంయముం గొల్చి వా
రినిధిన్ వెల్వడి రాజలోకము ప్రహర్షింప న్నిరాఘాటతం
జని పైత్రోవ జయద్రథాత్మజునిరాజ్యం బేపునం జొచ్చినన్.</poem>|ref=155}}
{{Telugu poem|type=క.|lines=<poem>చారులచే గాండీవి మ, హారథికులతోడ వచ్చె నని విని గుండెల్
నీరై సైంధవతనయుఁడు, పేరోలగ ముండి బిట్టుపిఱువడి చచ్చెన్.</poem>|ref=156}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తనయునిఁ జూచి దుస్సల పదంబులు తొట్రుపడంగ నేడ్చుచున్
దననగరంబు వెల్వడి పృథాతనయుం డనిలోన మున్ను నా
పెనిమిటిఁ ద్రుంచి యిప్పు డిదె బిడ్డనిఁ జంపె ననాథఁ గావవే
ననుఁ గృప నంచు గృష్ణుచరణంబులపైఁ బడఁ బార్థుఁ డత్తఱిన్.</poem>|ref=157}}
{{Telugu poem|type=క.|lines=<poem>అరదము గుప్పున డిగి సో, దరికిం బ్రణమిల్లి వలదు తనయవియోగా
తురత మనపాలిటికి నీ, హరి గలఁడు కృపాసముద్రుఁ డడలకు మనుచున్.</poem>|ref=158}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంబుజనాభునిఁ గొల్చి ర, యంబునఁ బురి కరుగుదెంచి యాస్థానములో
నం బొలిసినసుతు శౌరి క, రంబున నిమురంగ లేచి ప్రణమిల్లుటయున్.</poem>|ref=159}}
{{Telugu poem|type=క.|lines=<poem>సభవా రందఱు నాశ్చ, ర్యభరితులై మున్ను ద్రుపదరాజుసుతకు నీ
వభిమానము గాచిన భ, క్తభయత్రాతవుగదా గదాధర యనుచున్.</poem>|ref=160}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కృష్ణార్జునులకు మ్రొక్కి నుతించి బహుగీత, వాద్యనృత్యములతో వైభవములు
సేయించి రపుడు కౌంతేయుండు సుతసమన్విత యైనసోదరి కతిముదమున
దంతావళాశ్వయూధములు మున్నుగఁగల్గు, ధన మసంఖ్యం బిచ్చి ధర్మతనయు
యజ్ఞంబుఁ జూడ రమ్మని వేఁడుకొని వారిఁ, గదలింప నేఁడు డగ్గఱుట దెలిసి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వారువంబుల స్వేచ్ఛావిహార ముడిపి, కంసమథనుఁడు రాజలోకంబుఁ జూచి
ధర్మజుం డసిపత్రవ్రతంబు బడలి, సలుపుచున్నాఁడు కూర్చికాసనమునందు.</poem>|ref=161}}
{{Telugu poem|type=క.|lines=<poem>తురగములఁ గూర్చికొని నృపు, లరుదెండు నిశాముఖంబు నప్పటికిని మీ
పరిణామస్థితులు యుధి, ష్ఠిరునకు నే నరిగి తెలియఁజెప్పెద ననుచున్.</poem>|ref=162}}<noinclude><references/></noinclude>
p7c7sh7vfyw3gm5rwh6g4p0djo3q8il
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/172
104
178905
553255
496245
2026-04-16T06:22:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553255
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}కృష్ణుండు దా నొక్కరుండు కరిపురంబు ప్రవేశించుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>కరిపురి చేర నేఁగి కుతుకంబునఁ దన్నికటస్థజాహ్నవీ
సరిదుపకంఠనిర్మితవిశంకటకాంచనరత్నమండపాం
తరమున సంయమీశ్వర సనాథుని ధర్మతనూజుఁ గాంచి య
మ్మురమథనుండు నెయ్యమున మ్రొక్కి ప్రమోదముతోడ నిట్లనున్.</poem>|ref=163}}
{{Telugu poem|type=క.|lines=<poem>జననాథ నీప్రతాపం, బునకును సవ తెద్ది సకలభూపాలుర న
ల్లన గెల్చి హయముఁ గొని నీ, యనుజన్ముఁడు వచ్చె నిదె మహావిభవముతోన్.</poem>|ref=164}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>అని మరాళకేతుఁ డాదిగా సకలరా, జన్యవరులఘోరసమరవిధము
జలధిలోనఁ దపము సలిపెడు బకదాల్బ్యుఁ, దెచ్చుటయును వరుసఁ దెలియఁజెప్పి.</poem>|ref=165}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అచ్చటం బరివేష్టించినవిశిష్టజనంబులకుం గుశలప్రశ్నపూర్వకంబుగా నమస్కరించి
కుంతికిం దల్లులకుం బ్రణమిల్లి తనకు మ్రొక్కినభీమమాద్రేయసుభద్రాద్రౌపదుల
నాదరించి వృకోదరసహితంబుగా నిజగృహంబునఁ బ్రవేశించి రుక్మిణీ సత్యభా
మాదిభామాజనంబులయుల్లంబులు పల్లవింప నక్కపటవల్లవుం డించుకవడి వినో
దించి మణిమకరతోరణపట్టపటధ్వజవితానధూపధూమంబులం బురంబు శృంగా
రింప నియమించి ధర్మజానుమతంబునఁ బౌరజనబంధుపురోహితవారవధూజనంబు
లర్హప్రకారంబులం గదల భీమాదియోధవరులతోడం జతురంగబలసమన్వితుండై
బకదాల్భ్యు నెదురుకొను వేడుకం గదలి నిరర్గళసౌరభోద్గారివిహారవనీసమీపం
బున నర్ధచంద్రవ్యూహంబు వన్నించి నిలిచె నంతట భానుమంతుం డపరసరస్వం
తంబుచెంత నిలిచె.</poem>|ref=166}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>సురభిచంపకతైలపరిషేచనోజ్జ్వల, త్కరదీపికాపరంపరలతోడ
నభినవాంబరపుష్పహారాంగరాగశృం, గారితరాజలోకంబుతోడ
మందరమంథానమథితాంబునిధిఘుమం, ఘుమితనాసీరసంకులముతోడ
నిబిడాంబుధరగర్భనిర్భేదనారంభ, చటులమాణిక్యధ్వజములతోడ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>హాటకానర్ఘమణిశిబికాధిరూఢుఁ, డైనబకదాల్బ్యుతోడ మాద్యత్కరాళ
సవనహయములతోడ గాండివధరుండు, కౌతుకముతోడ హరిసేనఁ గదిసె నపుడు.</poem>|ref=167}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ఎదురుకొని పౌరభామిను లింద్రసుతుని, మౌళిపైఁ జల్లుక్రొవ్విరుల్ మానికములు
గ్రమ్ముకొని యమ్మహాస్థలి గంధవతియు, రత్నగర్భయు ననుట సార్ధకముచేసె.</poem>|ref=168}}
{{Telugu poem|type=క.|lines=<poem>బకవైరిముఖ్యు లత్తఱి, బకదాల్భ్యమునీంద్రుపాదపద్మములకు వే
డుక మ్రొక్కి యపుడ సైన్య, ప్రకరంబులఁ గలసి కరిపురము సొచ్చుటయున్.</poem>|ref=169}}
{{Telugu poem|type=క.|lines=<poem>భూపాలకు లందఱు వివి, ధోపాయహస్తులై యనూనక్రతుదీ
క్షాపరుఁ డగుధర్మతనయు, శ్రీపాదంబులకు నెరఁగిరి ప్రమోదమునన్.</poem>|ref=170}}<noinclude><references/></noinclude>
34s295y2i6xz96slzsjuhldk2rnskwb
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/173
104
178906
553259
496246
2026-04-16T07:11:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553259
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఆ.|lines=<poem>అపుడు విదురముఖ్యు లైనబాంధవసము, త్కరముతోడ నోలగమున నున్న
యాంబికేయునకుఁ బ్రియంబున నెఱిఁగించెఁ, శౌరి వరుసతోడ సకలనృపుల.</poem>|ref=171}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఇతఁడు నీలధ్వజుం డీశౌర్యనిధి పుత్త్రి స్వాహకు మగఁడు వైశ్వానరుండు
బభ్రువాహుఁ డితండు పార్థుని బ్రదికించె రణములో జీవదరత్నమునను
జంద్రహాసుండు విస్మయచరిత్రుం డితం డలిగినఁ బంకింతు రమరు లైన
బర్హికేతనుఁ డీనృపాలుఁ డే నడిగిన సగ మిచ్చెఁ దనువు నిశ్శంకఁ గోసి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యితఁడు హంసధ్వజుఁడు వీనిసుతులశిరము, లాజి రుద్రుండు ధరియించె హారములుగ
వీరవర్మ జమునిమామ వీరియట్ల, యొకరికిని నొకరథికు లీయున్ననృపులు.</poem>|ref=172}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అని వినిపింప నప్పు డమరాధిపసూనుఁడు వచ్చి ధర్మనం
దనునకు నమ్రుఁడై కెళవునన్ భజియింప ముదశ్రుపూరలో
చన యయి కుంతి క్రీడి బహుశస్త్రగణవ్రణితాంగముం గరం
బున నిమిరెం దనుం గదిసి మ్రొక్కినకర్ణజుఁ గౌఁగిలించుచున్.</poem>|ref=173}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ద్రౌపది యోషధుల్ గొనుచు రా ననుయాయిమురారిముఖ్య నా
నాపృథివీశ్వరుండు యమనందనుఁ డధ్వరభూమి శుద్ధిఁగా
బాపఁదొడంగె నాఱువృషభంబులఁ బూనిన మేటినాఁగటం
దాపసకోటిమంత్రపఠనంబులతోఁ జనుదేర నత్తఱిన్.</poem>|ref=174}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆదీక్షితు మణికుంభ, స్వాదువిమలగంధసారసలిలంబులఁ గుం
తీదేవకీయశోదలు, సాదరులై చేసి రప్పు డభిషేకంబుల్.</poem>|ref=175}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>తొలుక నెనుమనూటతొమ్మిదిపైఁ డిట్టి, కల నుపర్ణురూపుగా నమర్చి
యిట్టు లొకటి కొకటి కినుమడిసంఖ్యగా, గరుడవేదిపంచకంబు దీర్చి.</poem>|ref=176}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>శాస్త్రోక్తి నిష్టకాచయనంబు చేసి య, ష్టద్వారసవనమండపము నట్ల
కనకంపుటిటికలఁ గట్టించి వివిధరత్నవితానతోరణధ్వజము లెత్తి
బదరిబిల్వపలాశబహువారయూపంబు లాఱునైదును నైదునైదు నిలిపి
స్రుక్స్రువోలూఖలజుహువులు మొదలైన యజ్ఞసంభారంబు లలవరించి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వింశతిబ్రహ్మకల్పజీవితు వివేక, పారగుం డగుబకదాల్భ్యు బ్రహ్మఁ జేసి
యాగమరహస్యనిస్సంశయక్రియాతి, చతురు సాత్యవతేయు నాచార్యుఁ జేసి.</poem>|ref=177}}
{{p|ac|fwb}}ధర్మజుం డశ్వమేధంబు గావించుట</p>
{{Telugu poem|type=వ.|lines=<poem>వసిష్ఠ వామదేవ రోమశ సుమంత గాలవ కపిల సౌబరి భరద్వాజ భాగురి రైభ్య
జమదగ్ని జతుకర్ణ కౌండిన్య గౌతముల ఋత్విజులంగా వరియించి, అరుణి పుల
హోపమన్యు విశ్వామిత్ర మధుచ్ఛంద విభాండక ధౌమ్యవాయుభక్షుల రక్షోఘ్న
మంత్రంబులు పఠియించుచు బహిర్ద్వారంబుల నుండ నియమించి ధర్మనందనుండు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
tnvb31s4mfaih55n3epk8jgegvymbqb
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/174
104
178907
553261
496247
2026-04-16T07:31:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553261
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మృగశృంగధరుండును రురుచర్మవసనుండును గుశాసనుండును నై యున్నసమ
యంబునఁ బరాశరాత్మజుండు రాజలోకంబు నవలోకించి మీరు కళత్రసమేతులై
జాహ్నవీపవిత్రోదకంబుల నజాతశత్రు నభిషేకింపవలయు నన ననసూయాత్రులును
నరుంధతీవసిష్ఠులును రుక్మిణీకృష్ణులును హిడింబాభీమసేనులును సుభద్రార్జునులును
మాయావతీప్రద్యుమ్నులు నుషానిరుద్దులును బ్రభద్రావృషకేతులును నీలావతీ
మయూరధ్వజులును బ్రభావతీయౌవనాశ్వులును సునందానీలకేతులును ధమ్మిల్లాను
సాల్వులును మొదలుగాఁ జతుష్షష్టిదంపతులు బద్ధపల్లవకలశంబులు గొనుచు మంద
మందగమనంబునఁ గదలి ముందటఁ గ్రందుకొని గీతవాద్యనృత్యంబులు బెరయ
గజాధిరూఢలై విప్రకశ్యలు చల్లుమౌక్తికంబులు నెరయ మునిపఠితవేదమంత్రం
బులు మొరయఁ గుంతీదేవకీయశోదలం బురస్కరించుకొని యరుగునవసరంబున.</poem>|ref=178}}
{{Telugu poem|type=క.|lines=<poem>నారదుఁడు సత్యభామా, గారంబున కరిగి పూజఁ గైకొని హరి నీ
కూరిమిప్రియుఁ డందు విపుడు, దా రుక్మిణి కిచ్చెఁ బెద్దతన మె ట్లలినన్.</poem>|ref=179}}
{{Telugu poem|type=శా.|lines=<poem>రాజన్యుల్ సకళత్రులై యరుగుదేరం జామరచ్ఛత్రవి
భ్రాజిష్ణుం డగుకృష్ణుఁ గూడుకొని దాంపత్యంబునన్ రుక్మిణీ
రాజీవానన యేఁగ నీచనవు వ్యర్థం బయ్యెఁ బొమ్మన్న స
త్రాజిత్పుత్త్రి యనున్ దను న్మఱుచునే ప్రాణేశ్వరుం డయ్యెడన్.</poem>|ref=180}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని తనకేళీసౌధం, బున నున్న మురారిఁ జూప ముని విస్మితుఁడై
వనజోదరుఁ డెయ్యద లేఁ, డని కొనియాడుచు నిజేచ్చ నరిగెన్ బిదపన్.</poem>|ref=181}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మేలములతోఁ జతుష్షష్టిమిథునములును, బద్ద చేలాంచలంబులై ప్రసవగంధ
పూజితస్వర్ణకుంభసంపూర్ణ జాహ్న, వీపవిత్రోదకంబులు వేడ్కఁ దెచ్చి.</poem>|ref=182}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>శుభతూర్యరవము భూనభములఁ బూరింప విహితమంత్రములు ఋత్విజులు చెప్ప
మఖవాహమునకు హేమకటాహమునఁ బోసి యమసూతి కభిషేక మాచరింపఁ
బూతాత్ముఁ డగుధర్మపుత్త్రుండు పరమసంయమివరేణ్యులపదాబ్జములు గడిగి
కనకాసనము లిడి కౌశేయగంధమాల్యవిభూషణముల నలంకరించి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యుక్తదక్షిణ లర్పించి యూపబద్ధ, హయముఁ బాంచాలియును దాను నర్థిఁబూజ
చేసి వలగొని వహ్నిరోచిర్ముఖమునఁ, జెంది గంధర్వలోకంబుఁ జేరు మనిన.</poem>|ref=183}}
{{Telugu poem|type=క.|lines=<poem>సాభిప్రాయత నది ప్రో, ధాభినయముఁ జూప నకులుఁ డశ్వహృదయత
త్త్వాభిజ్ఞుఁ డగుట ధర్మత, నూభవునకు విన్నవించెను విచిత్రముగన్.</poem>|ref=184}}
{{Telugu poem|type=తే.|lines=<poem>క్రతువులకు నెల్ల హరి కర్మకరుఁడు గామి
సర్గఫలమాత్ర మిపుడు సాక్షాత్కరించి
శౌరి యున్నాఁడు మామకాస్యమున ననుచు
సభికులకుఁ జెప్పె ననఁగ గృష్ణసహితఋషులు.</poem>|ref=185}}<noinclude><references/></noinclude>
bwjm2fgm04wrckeiy8iy61zgykn9wjr
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/175
104
178908
553263
496248
2026-04-16T07:48:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553263
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>క్రతుగంధర్వము మంత్రపన్నముల సంస్కారంబు గావించి ది
వ్యతపోగణ్యుఁడు ధౌమ్యుఁ డాహయము సవ్యశ్రోత్రకోణంబు పీ
డితముం జేయఁ బయఃకణప్రకార ముడ్డీనంబుగాఁ జూచి ని
స్మితులై పాండవముఖ్యు నధ్వరసభాసీనుల్ ప్రశంసింపఁగన్.</poem>|ref=186}}
{{Telugu poem|type=క.|lines=<poem>మారుతి పురోధయనుమతి, దోరసిచే హయముశిరముఁ దునిమిన నది య
ద్ధారణిఁ బడక దివికిఁ దే, జోరూపముతోడ నెగసి సూర్యునిఁ గలసెన్.</poem>|ref=187}}
{{Telugu poem|type=క.|lines=<poem>మురహరుఁ డత్తురగకళే, బరము విశసనంబు సేయఁ బటుతర మగు నా
హరితేజము హరిఁ గలసెను, గర మరుదుగఁ బలలరాశి కప్పుర మయ్యెన్.</poem>|ref=188}}
{{Telugu poem|type=క.|lines=<poem>మును లయ్యపఘనసారము, ఘనసారం బైనఁ జిత్రకర మిది కుంతీ
తనయాగ్రణి నీభాగ్యం, బున కెయ్యది మేర యనుచుఁ బొగడుచు నుండన్.</poem>|ref=189}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆహయకర్పూరము ప్రథ, మాహుతిగాఁ జేసి స్రువము నాచార్యుడు కౌ
తూహలమున నింద్రాయ, స్వాహా యనఁ జేయి సాచి శతమఖుఁ డందెన్.</poem>|ref=190}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అట్లు వేదవ్యాసుఁ డాహుతు లొసఁగఁ బర్యాయంబున నిలింపు లందుకొనిరి
యాహోమమున సచరాచరత్రైలోక్యమునఁ జాల సంతృప్తి పొదలె నపుడు
సురభి పురోడాశసోమపానములు నానందించె ఋత్విగ్గణంబు వరుస
యమతనూభవుఁడు పూర్ణాహుతి వేల్చి బాంధవులతో నవభృథస్నాన మాడ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సోమయాజులఁ జూచి కృష్ణుండు నగునుఁ, గదిసి యందంద బిగియారఁ గౌఁగిలించె
నాయరుంధతి యనసూయ లాదియగువ, ధూజనం బిచ్చె వివిధనీరాజనములు.</poem>|ref=191}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మౌని బకధాల్బ్యువకు రత్నమయవృషంబు, దాన మిచ్చి పరాశరాత్మజున కఖిల
వసుధ యాచార్యదక్షిణ యొసఁగ నతఁడు, తిరుగ నమ్మినధన మిచ్చె దీనులకును.</poem>|ref=192}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అరదము సింధురంబు ననుయాయిచతుష్కము భార మర్థము
న్మరిదశకంబు గోశతము నాలుగుమానలు ముత్తియంబులున్
గురుకులమౌళి ఋత్విజులకున్ బ్రతిహారుల కర్థి నిచ్చి యం
దఱకుఁ దదర్ధమున్ ధనము లన్యసదస్యుల కిచ్చె దక్షిణల్.</poem>|ref=193}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కోటిసొన్నాలు దశశతఘాటకములు, వారణశతంబు నొక్కొక్కవరుస తొడవు
లిచ్చె వేర్వేఱనృపతుల కిందు రెట్టి, యాదవుల కెల్ల నర్పించె నాదరమున.</poem>|ref=194}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనిలసుతపార్థమాద్రీ, తనయులు మన్నించి బహువిధము లగుమణిమం
డనముల రుక్మిణి మొదలగు, వనితలఁ బూజించి రధికవాత్సల్యమునన్.</poem>|ref=195}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అతులితభక్తిఁ గృష్ణుఁ గనకాసనసంగతుఁ జేసి రత్నసం
తతుల నలంకరించి యమనందనుఁ డర్మిలి ధారవోసెఁ ద
త్క్రతుఫల మమ్మహాత్మునికరంబున నప్పు డనల్పకల్పక
క్షితిరుహపుష్పవృష్టి గురిసెన్ మొరసెన్ దగ దివ్యదుందుభుల్.</poem>|ref=196}}<noinclude><references/></noinclude>
jgnucttqngw3dyk2d6q1s29lwcl3d52
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/176
104
178909
553267
496249
2026-04-16T08:43:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553267
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>మఖపరిపూర్తిఁ గన్గొని సమస్తజనంబులు నుబ్బి వేనవేల్
ముఖముల ధర్మనందనుఁ బ్రమోదమునం గొనియాడి రప్పు డ
య్యఖిలనృపాలకోటికి మహర్షులకుం దనపాకచాతురీ
సుఖ మెఱిఁగింప గంధవహనూనుఁడు విందని చెప్పె నేర్పునన్.</poem>|ref=197}}
{{Telugu poem|type=క.|lines=<poem>బిరు సింతగాక నడిమికి, మురియక ననుబ్రాయి వడిచి ముడఁబాఱక యే
బెరికియును లేక మిక్కిలి, గరగర నగు నేఱుప్రాలకలమాన్నంబుల్.</poem>|ref=198}}
{{Telugu poem|type=చ.|lines=<poem>సరములరీతిఁ గ్రొన్నెలలజాతి బిసంబులభాతిఁ బద్మకే
సరములభంగిఁ దారకలసంగతిఁ దార్పులమాడ్కిఁ బుష్పమం
జరులవిధంబునన్ మణులచాడ్పునఁ బెక్కులుగంధతైలపా
కరచితముల్ విచిత్రములు కమ్మనిపైఁ దపుఁబిండివంటలున్.</poem>|ref=199}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>పత్త్రపుష్పమూలఫలశలాటువులచే, బహువిధములశాకపాకములును
భిన్నరుచులు గానిపింప నిమేషమా, త్రంబులోన నాయితంబు సేసె.</poem>|ref=200}}
{{Telugu poem|type=క.|lines=<poem>పరిపరిధూపంబుల నర, విరులతెరల రత్నదీపవితతుల నూర్ణా
స్తరణములఁ బొలుచుఠావులఁ, బరమఋషులు నృపులు వరుస బంతులు సాగన్.</poem>|ref=201}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పసిఁడియెడ్డెనలను మించుపద్మరాగ, భాజనంబుల వడ్డించుబహుపదార్థ
వితతు లమరెను మేరుసంగతసహస్ర, కరునిఁ బొదివినచిత్రమేఘములకరణి.</poem>|ref=202}}
{{Telugu poem|type=క.|lines=<poem>అత్తఱి షడ్రసయుతము, ల్ఛిత్త మలర భక్ష్యభోజ్యలేహ్యాదికముల్
మత్త చకోరాక్షు లిడం, గుత్తుకబంటిగ భుజింపఁ గొందఱతపసుల్.</poem>|ref=203}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>చింపివల్కము లేమిచేసెడి దనఁ గాపు నెఱవైనకండమండెఁగలుగాని
తెగినజందెము లేల తెచ్చెద రనఁ గావు వినుఁ డివి సన్నసేవియలు గాని
యౌదుంబరము లనర్హము లొల్ల మనఁ గావు నమలిచూడుఁడు మోదకములు గాని
ఫేనపుంజము లేల పెట్టెద రనఁ గావు నీపాదమానఫేనికలు గాని</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యంచు వాచంయములు వల్క నబ్జముఖులు, నగుచు నొడఁబడఁ జెప్ప నందఱు యథేష్ట
రుచుల భుజియించి వార్చి కర్పూరవీటి, కాసుగంధప్రసూనసౌఖ్యములఁ దనిసి.</poem>|ref=204}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనిలజునిఁ బెక్కుభంగులఁ, గొనియాడుచు సవనవాటిఁ గొలు వున్నతఱిన్
జనుదెంచిరి దమలోపల, నెనయక కలహించుకొనుచు నిరువురువిప్రుల్.</poem>|ref=205}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆవిప్రు లపుడు ధర్మజు, దీవించి వివాద మొకటి తీర్పనగు ననన్
మీవాదము దీర్చెదరు స, భావరు లీయరుణిపులహబకదాల్బ్యు లనన్.</poem>|ref=206}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వినుఁడు నే యజ్ఞశర్మ నీవిష్ణుశర్మ, చేత నొకవృత్తిఁ గొంటి నాక్షేత్ర మిపుడు
దున్న నం దొకనిక్షేప మున్నఁ దన్నుఁ, బిలిచి కైకొను మన్న నొప్పించుకొనఁడు.</poem>|ref=207}}
{{Telugu poem|type=క.|lines=<poem>నావిష్ణుశర్మ యిట్లను, నే వృత్తి క్రయంబునకును నిచ్చినపిదపన్
నావిత్తమె ధర్మ మెఱుఁగఁ, డీవెఱ్ఱి యటన్న వెన్నుఁ డిట్లనె నగుచున్.</poem>|ref=208}}<noinclude><references/></noinclude>
bf458z960low2caxxslqdu6izqup9q2
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/177
104
178910
553272
496250
2026-04-16T08:57:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553272
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>తెగ దిప్పుడు మూన్నెల్లకుఁ, దగ వడుగఁగ రండు దీర్చెదను బొండు వృథా
జగడింపకుఁ డన వారలు, నగరికె నిక్షేప మొప్పనము చేసి చనన్.</poem>|ref=209}}
{{Telugu poem|type=మ.|lines=<poem>యమనూనుం డనుఁ గృష్ణుఁ జూచి బకదాల్భ్యవ్యాసకణ్వాదిసం
యము లుండన్ దెగుఁదెంపు సేయ కిటు లేలా వారిఁ బొమ్మంటి న
న్న ముకుందుం డను నీసమక్షమున నానాసౌఖ్యగోష్ఠిన్ వినో
దములన్ బ్రొద్దులు పుచ్చ నెక్కిడివివాదం బంచు న ట్లంపితిన్.</poem>|ref=210}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంతఁ గలియుగము చొర నీ, శాంత ముడిగి వారు మగుడ జగడింప ధనం
బంతయును బంచియిచ్చెద, నంతియ కాదు విను కలియుగాచరణంబుల్.</poem>|ref=211}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆమ్నాయపథవిహీనాచారములచేతఁ బ్రబలు నన్యోన్యవైరములచేత
నన్యాయవర్తను లైనరాజులచేత సమకొన్నదుర్వ్యసనములచేత
ధర్మపత్నీని రదరకృత్యములచేతఁ బ్రభవించు వేశ్యాభిరతులచేతఁ
బరధనపరదారహరణబుద్ధులచేత నలమినఘోరమోహములచేత</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జాలికాదులచేత దూషకులచేతఁ, బ్రల్లదులచేత వంశనాపకులచేత
డాంబికులచేతఁ జచ్చిబండగులచేతఁ, గల్లరులచేత దర్పించుఁ గలియుగంబు.</poem>|ref=212}}
{{Telugu poem|type=క.|lines=<poem>సొరిది ననాచారంబులఁ మురు వగుచుం బ్రథమపాదమునఁ గలిమహిమం
బెరుగును వడ్లును గలిపిన, కరణిన్ వర్ణాశ్రమములు కత్తరి గలయున్.</poem>|ref=213}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆసమయంబున ధర్మజ, నే సోమకులంబునను జనించి కుటిలులన్
శాసించి ధరణి పాలన, చేసెదఁ దగ సాళ్వనారసింహుఁడ నగుచున్.</poem>|ref=214}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అని వినిపించి శౌరి శ్రమనాత్మజుఁ డర్మిలి నిచ్చుపూజ గై
కొని సకుటు౦బుఁడై నృపతికోటి భజింపఁగ ద్వారకాపురం
బున కనురక్తితో నరిగి పూర్వపదంబుల నిల్పె రాజులన్
జననుతుఁ డాయుధిష్ఠిరుఁడు సర్వధరిత్రియు నేలె నున్నతిన్.</poem>|ref=215}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అనువారంబు నజాతశత్రుహయమేధారంభమున్ యౌవనా
శ్వనృపాలాదిమహీశవర్తనములున్ సద్భక్తిఁ బాటించి వి
న్నను రామాయణభారతశ్రవణకన్యాగోసహస్రక్షమా
ధనదానాధికపుణ్యముల్ దొరకు మర్త్యశ్రేణి కశ్రాంతమున్.</poem>|ref=216}}
{{Telugu poem|type=క.|lines=<poem>ప్రేమమున శ్రోత వక్తకుఁ, జామీకరహయము ధవళచామరములు నా
నామణివిభూషణంబులు, గ్రామముఁ గృపసేయవలయు గ్రంథసమాప్తిన్.</poem>|ref=217}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని జైమిని వినిపించిన, జనమేజయజనవిభుండు సంతసమున న
మ్మునివరుని గౌరవించుచు, వినియెం దరువాతికధలు వేడుక ననుచున్.</poem>|ref=218}}<noinclude><references/></noinclude>
mwe3o1muqjj748f3j698npj7h5kgndn
553273
553272
2026-04-16T08:57:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553273
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>తెగ దిప్పుడు మూన్నెల్లకుఁ, దగ వడుగఁగ రండు దీర్చెదను బొండు వృథా
జగడింపకుఁ డన వారలు, నగరికె నిక్షేప మొప్పనము చేసి చనన్.</poem>|ref=209}}
{{Telugu poem|type=మ.|lines=<poem>యమనూనుం డనుఁ గృష్ణుఁ జూచి బకదాల్భ్యవ్యాసకణ్వాదిసం
యము లుండన్ దెగుఁదెంపు సేయ కిటు లేలా వారిఁ బొమ్మంటి న
న్న ముకుందుం డను నీసమక్షమున నానాసౌఖ్యగోష్ఠిన్ వినో
దములన్ బ్రొద్దులు పుచ్చ నెక్కిడివివాదం బంచు న ట్లంపితిన్.</poem>|ref=210}}
{{Telugu poem|type=క.|lines=<poem>అంతఁ గలియుగము చొర నీ, శాంత ముడిగి వారు మగుడ జగడింప ధనం
బంతయును బంచియిచ్చెద, నంతియ కాదు విను కలియుగాచరణంబుల్.</poem>|ref=211}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆమ్నాయపథవిహీనాచారములచేతఁ బ్రబలు నన్యోన్యవైరములచేత
నన్యాయవర్తను లైనరాజులచేత సమకొన్నదుర్వ్యసనములచేత
ధర్మపత్నీని రదరకృత్యములచేతఁ బ్రభవించు వేశ్యాభిరతులచేతఁ
బరధనపరదారహరణబుద్ధులచేత నలమినఘోరమోహములచేత</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జాలికాదులచేత దూషకులచేతఁ, బ్రల్లదులచేత వంశనాపకులచేత
డాంబికులచేతఁ జచ్చిబండగులచేతఁ, గల్లరులచేత దర్పించుఁ గలియుగంబు.</poem>|ref=212}}
{{Telugu poem|type=క.|lines=<poem>సొరిది ననాచారంబులఁ మురు వగుచుం బ్రథమపాదమునఁ గలిమహిమం
బెరుగును వడ్లును గలిపిన, కరణిన్ వర్ణాశ్రమములు కత్తరి గలయున్.</poem>|ref=213}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆసమయంబున ధర్మజ, నే సోమకులంబునను జనించి కుటిలులన్
శాసించి ధరణి పాలన, చేసెదఁ దగ సాళ్వనారసింహుఁడ నగుచున్.</poem>|ref=214}}
{{Telugu poem|type=చ.|lines=<poem>అని వినిపించి శౌరి శ్రమనాత్మజుఁ డర్మిలి నిచ్చుపూజ గై
కొని సకుటు౦బుఁడై నృపతికోటి భజింపఁగ ద్వారకాపురం
బున కనురక్తితో నరిగి పూర్వపదంబుల నిల్పె రాజులన్
జననుతుఁ డాయుధిష్ఠిరుఁడు సర్వధరిత్రియు నేలె నున్నతిన్.</poem>|ref=215}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అనువారంబు నజాతశత్రుహయమేధారంభమున్ యౌవనా
శ్వనృపాలాదిమహీశవర్తనములున్ సద్భక్తిఁ బాటించి వి
న్నను రామాయణభారతశ్రవణకన్యాగోసహస్రక్షమా
ధనదానాధికపుణ్యముల్ దొరకు మర్త్యశ్రేణి కశ్రాంతమున్.</poem>|ref=216}}
{{Telugu poem|type=క.|lines=<poem>ప్రేమమున శ్రోత వక్తకుఁ, జామీకరహయము ధవళచామరములు నా
నామణివిభూషణంబులు, గ్రామముఁ గృపసేయవలయు గ్రంథసమాప్తిన్.</poem>|ref=217}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని జైమిని వినిపించిన, జనమేజయజనవిభుండు సంతసమున న
మ్మునివరుని గౌరవించుచు, వినియెం దరువాతికథలు వేడుక ననుచున్.</poem>|ref=218}}<noinclude><references/></noinclude>
9x7zqao9903mst3zbi6grfzd48uvsk2
పుట:జైమినీభారతము (పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు).pdf/178
104
178911
553276
496251
2026-04-16T09:07:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553276
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>నీకును మల్లమాంబాకుమారునకు సోమకులాంబునిధిపూర్ణిమావిధునకు
భరతకీర్తికిఁ దులాపురుషాదిదానాంబుజంబాలితాస్థానసౌధునకును
బరరాజభీకరధరణీవరాహున కాత్రేయగోత్రపవిత్రునకును
గుండయనరసింహమండలేశ్వరునకు నభ్యుదయపరంపరాభివృద్ధి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కరముగా భారతీతీర్ధగురుకృపాస, మృద్ధసారస్వతుఁడు సత్కవీంద్రసఖుఁడు
కుకవిమల్లకషోల్లసత్కులిశహస్త, పల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్రసుకవి.</poem>|ref=219}}
{{Telugu poem|type=శా.|lines=<poem>గౌళీమానసరాజహంసకుకురీకందర్పచోళీకపో
లాలంకారశకీకరార్పితవిలాసాకల్ప లాటికళా
కేళీకౌతుకమాళవీమధురసంగీతాదరస్వాంత నే
పాళీకుంకుమపంకలిప్తకుచకుంభన్యస్తహస్తాంబుజా.</poem>|ref=220}}
{{p|al|fwb}}పాదభ్రమకము.</p>
{{Telugu poem|type=క.|lines=<poem>వీరవరకైరవరవీ, సారసభరసౌధయూధసౌరభసరసా
వారణరథ్యరణరవా, తారభవనతానమావతానవభరతా.</poem>|ref=221}}
{{Telugu poem|type=మత్తకోకిల.|lines=<poem>శర్వరీశకులావతంసయశఃప్రతాపవిభూషణా
గర్వతాహితరాయమీసరగండభీకరవిక్రమా
పూర్వవిశ్వవసుంధరాభృవపూర్వదిక్తటహారకా
నిర్విశేషవిషానుబంధురనిత్యసత్యగుణోదయా.</poem>|ref=222}}
{{Center|<poem>గద్యము.
ఇది భారతీతీర్థశ్రీచరణకరుణాపాత్ర గాదయామాత్యపుత్త్ర వినయవిద్యాసముద్ర
పినవీరభద్రప్రణీతం బైనజైమినిభారతంబునం దశ్వమేధపర్వంబున
సర్వంబును అష్టమాశ్వాసము.</poem>}}
{{Center|—————}}<noinclude><references/></noinclude>
3gkp5rjgcfusza41hvssxql0b28bklk
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/2
104
186265
553292
504482
2026-04-16T09:56:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553292
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}ఉపోద్ఘాతము</p>
ఆంధ్రవాఙ్మయమున ఆదికావ్యము వెలువడిననాటినుండి, ఆంధ్రకావ్యకర్తలు పౌరాణికగ్రంథములపైననే అభిమానము వహించుచు వచ్చిరి. దీనికకారణములేవైనను, క్రీ. శ. 16వ శతాబ్దమున ప్రబంధప్రక్రియ తెలుగుసాహిత్యమున వెలువడు వరకు, రచయితలలో ఒకరిద్దరు తప్ప, మిగిలినవారు పురాణములనే ఆలంబనముగా జేసికొని కావ్యరచన చేసిరి. ఆంధ్రమహాభారతమువంటి చంపూకావ్యములును, నిర్వచనోత్తరరామాయణము వంటి పద్యైకగ్రంథములును, పౌరాణికకథేతిహాసములపై నాధారపడియున్నవే కదా!
ఆంధ్రులకు గల పౌరాణికాభిమానము పద్యకావ్యములతో, చంపూగ్రంథములతో మాత్రమే తీరిపోలేదు. స్వతంత్రములుగాను, చాలభాగము కల్పితములుగానున్ను ప్రబంధములరచన కొంతవరకు తగ్గిపోగా, అనంతరప్రబంధయుగమున వచనరచనము వ్యాప్తిలోనికి వచ్చినది. అప్పుడు మనరచయితలకు తిరిగి పౌరాణికదృష్టి యేర్పడినది. అందుచేతనే దాక్షిణాత్యయుగమున పురాణకథాన్వితవచనరచనలు విరివిగా బయలుదేరినవి. పౌరాణికరచనపై యభిమానముచేతనే కాబోలు, సింహగిరివచనములవంటి వచనైకరచనల నధికముగా నభిమానించినవారుగాని, అనుసరించినవారుగాని, కానరారు. అందుచేతనే స్తుతి వచనముల సంఖ్య పురాణముల కంటే స్వల్పముగా కన్పించును.
క్రీ. శ. 15వ శతాబ్దమున సన్నగిల్లిన పురాణరచనము అనంతరప్రబంధయుగమున వచనరచనముతోబాటు తిరిగి విజృంభించుట కేమి కారణమో యోచింపవలసిన యవసరమున్నది.
తెలుగువచనములో రచింపబడిన పురాణములలో అధికము దక్షిణదేశముననే రచితములైనవి. దానికి చారిత్రకకారణములు కాన్పించును. విజయనగరరాజ్యపతనము తరువాత, తంజావూరు, మధుర, పుదుక్కోట మొదలగు దాక్షిణాత్యప్రాంతములందు తెలుగురాజ్యము లేర్పడినవి. ఆ ప్రాంతములందలి<noinclude><references/></noinclude>
oo8nn3vlyiacr8c4w9c0vwm0j307zoc
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/3
104
186266
553327
504483
2026-04-16T11:46:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553327
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>స్థానికభాష తెలుగు కాదు. అయినను, చాలమంది ఆంధ్రులు, రచయితలు, సాహిత్యాభిమానులు ఆ ప్రాంతములకు వెడలియుండిరి. వారు రాజకీయకారణములచేత చాలకాల మచటనే నివసించిరికూడ. అట్లు వారు తమప్రాంతమును వదలి వేరొకప్రాంతమున నుండుటచేత, నాతి కఠినమైన సాహిత్య మవసరమైనది. వారికి కఠినములును, దీర్ఘములును నగు గ్రంథములు కాక, సరళములును సంక్షిప్తములును నగు రచనల యావశ్యక మేర్పడినది. తత్పరిణామముగా, ఆంధ్రభాషలో పెక్కుపురాణములు వ్రాసికొనిరి. ఇందే భారతముగాని నన్నయాదులు వ్రాసిన మహాభారతమువలె దైర్ఘ్యమును గాని, ప్రౌఢత్వమును కాని కలిగియుండవు. ఏ రామాయణము గాని, భాస్కరాదుల రామాయణమునకు సమానముగా నుండవు. సరళమైన వచనమున సంక్షిప్తముగా నుండుటయే వీని ప్రధాన లక్షణము.
దక్షిణదేశీయాంధ్రులు పురాణముల నభిమానించుటకు వేరొకకారణము కూడ నుండును. వీరికి మనదేశమున అనాదిగా వచ్చుచున్న వైదికసిద్ధాంతముల మీద అచంచల విశ్వాసమే ఆ కారణము. పురాణములన్నియు యజ్ఞయాగాది వైదికకర్మలను, వాని మహత్త్వమును బోధించును. త్రిమూర్త్యాత్మకశక్తులను ప్రదర్శించును. వాని ఐక్యతను నిరూపించును. అట్టి పురాణములను రచించి శైవవైష్ణవములనెడు వేరుపాటు ధోరణులను నిర్మూలించి, వానిని
సమన్వయపరచుట యీ రచయితల ధ్యేయమై యుండును.
ప్రబంధనిర్మాణము ఆంధ్రసాహిత్యమున నెలకొన్నతరువాత, ప్రారంభదశలోనిమాట యెటులున్నను, క్రమముగా వీనిలో వైవిధ్యరాహిత్యము, అసభ్యశృంగారప్రదర్శనము, కఠినశైలి ఆలంబనము వంటి దోషములు చోటు చేసికొనుచు వచ్చినవి. ఇటువంటి సాహిత్యము సమాజమునకు మేలు చేయకపోగా, కీడును కలిగించకపోవు, అని ఆనాటివారు గుర్తించిరి. పరోక్షముగా నీతిబోధచేయు పురాణములు, రసవంతములై, సంస్కారసామర్థ్యములై యుండునని వీరు భావించి పురాణరచనమును గావించి యుందురు. ఇది మరియొక కారణమగు చున్నది.
ప్రబంధరచనాప్రారంభకులగు పెద్దనాదులు, వైవిధ్యమునకో, రసపుష్టి కొరకో, కొంత పటుతరమైన శైలి నవలంబించగా, తరువాతి ప్రబంధ<noinclude><references/></noinclude>
aoigx4ethxli80p9nfp726nb818alwt
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/4
104
186267
553339
504484
2026-04-16T11:52:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553339
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రచయితలు ఆ శైలిని క్లిష్టతరముగా మార్చి, శబ్దాలంకారాదులచేతను, ఓజోగుణముచేతను కఠినతమములుగా జేసిరి. పాండిత్యస్ఫోరకములైన యిట్టి రచనలు దేశాంతరమున నున్న యాంధ్రుల కెట్లు రుచించును? అందుచేతనే
వారు శైలీసారళ్యమును కాంక్షించి, తెలుగువచనమున పురాణరచనమునకు పూనుకొనిరి.
ఈ విధముగా పురాణసన్నిభమైన జైమిని భారతము తెలుగులో వచనకావ్యముగా అవతరించు వాతావరణ మావిష్కృతమైనది.
{{p|ac|fwb}}జైమిని భారతము - సముఖము వేంకటకృష్ణప్ప నాయకుడు</p>
దక్షిణభారతదేశములో వెలువడిన గ్రంథములలో జైమిని భారతము ప్రశస్తమైనది. దీనిని సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు వచనకావ్యముగా రచించినాడు. ఈతని తండ్రి మీనాక్షి నాయకుడు. తల్లి అలిమేలక్క. ఈ కవి జైమిని భారతమునేకాక, సారంగధరచరిత్రమను మూడాశ్వాసముల వచనగ్రంథమును, అహల్యాసంక్రందనమను మూడాశ్వాసముల శృంగారప్రబంధమును, రాధికాస్వాంతన మనెడి యేకాశ్వాసశృంగారప్రబంధమును కూడ రచించినట్లు తెలియవచ్చుచున్నది.<ref>జైమిని భారతము - కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రచురణ-పీఠిక</ref> మధురానగరము రాజధానిగా, విజయరంగ చొక్కనాథుడు పాండ్యమండలమును క్రీ. శ. 1704 నుండి 1731 సం॥వరకు పరిపాలించెను. జైమిని భారత కర్త అతనికి సమకాలికుడు. ఇతడు విజయరంగ చొక్కనాథునికంటె వయస్సులో కొంత పెద్దవాడుగా నున్నట్లున్నది. మొత్తము మీద క్రీ. శ. పదునెనిమిదవ శతాబ్ది ప్రథమపాదమున వెలువడిన దీగ్రంథము.
దక్షిణదేశమున వెలువడిన ఆంధ్రవచనకావ్యములలో ప్రముఖమైనది జైమిని భారతము. విజయరంగ చొక్కనాథుడు దీని కృతిపతి. విజయరంగ చొక్కనాథుడు స్వయముగా రచయిత. ఈతడు శ్రీరంగమాహాత్మ్యమను వచన
.
.<noinclude><references/></noinclude>
1t49s5pod0h8qzugornqft4e21pqql6
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/306
104
203650
553300
529751
2026-04-16T10:48:37Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553300
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కాని వారి ప్రతిభ సర్వతోముఖం కాదు.
గద్యరచనను ముళ్ళడొంకల్లోకి మళ్ళించిన దోషమున్నూ వారిని కిందికి లాగేసింది.
కాక, - సహజంగా పండితుడే గాని కవి కాడాయన.
అంచేతనే వారికి చెందవలసిన గద్యతిక్కనబిరుదు వీరేశలింగం పంతులుగారికి తక్కింది.
పోగా, - నా శక్తి సంగతి తరవాత చూసుకుందాం, వీరేశలింగంగారి గద్యప్రీతికేదో నా గద్యప్రీతికీ అదే కారణం.
అయితే, పద్యబంధనిపుణులు కొందరు నన్ను పద్యశత్రువుగా భావించడం నాకు తెలుసు.
ఇందుకు నేను సిగ్గుపడ్డంలేదు.
ఎంచేతనంటే?
నాకు కవిత్వం కావాలి.
అది పద్యంలో అనుగ్రహించినా ఆనందిస్తాను, గద్యంలో ప్రసాదించినా ఆనందిస్తాను.
నేనే కాదు, ఏ రచనా చెయ్యలేని సాహిత్యవేత్తలూ, రసానందం మరిగిన సాహిత్యప్రియులూ కూడా ఇంతే చేస్తారు.
నన్నయ్యా, తిక్కన్నా, ఎర్రన్నా, శ్రీనాథుడూ, పోతన్నా, సోమన్నా, తిమ్మన్నా, వెంకన్నా మొదలైన మహాకవుల అసాధారణ రచన లాదరిస్తున్నది వారు, పద్యాలు కట్టే ఈ నవీనులు కారు.
నా పద్య ప్రీతిన్నీ అలాంటిదే.
అయితే, అప్పుడూ యిప్పుడూ వచన రచనలో అనుభూతం అవుతున్న ఆనందం పద్యరచనలో నా కెప్పుడూ కలగలేదు.
వచన రచన, ఆదిలో గ్రాంథికంలో చేసినప్పుడూ, వ్యావహారికంలో చేస్తున్న యిప్పుడూ కూడా నాకు సమానంగానే వుం దీఅనుభూతి.
{{c|<big><big>30</big></big>}}
కాలక్రమాన, నేను, వ్యావహారికంలో రచనలు చేస్తానని రామకృష్ణశాస్త్రిగారనుకుని వుండరు.
వేంకటరామశాస్త్రిగారున్నూ అప్పు డనుకుని వుండరు.
తరవాత మాత్రం నా వ్యావహారిక రచనలు చాలా చూశారు వారు.
చూడ్డమే కాదు, చదివారు.
చదవడమున్నూ కాదు, నా వీరపూజ చదివి యెంత అనందించారో నా వడ్లగింజలు చదివిన్నీ అంతా ఆనందించారు.
తెచ్చుపెట్టుకున్న సాహిత్యప్రీతి కాక స్వయంభువు అయినవా రెవరైనా యింతే చేస్తారు.
సాహిత్య ప్రియులకు కావలసింది రసం.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||282}}</noinclude>
axwwmoa80su63sikd7lltf7rpp153l9
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/307
104
203651
553301
529753
2026-04-16T10:52:43Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553301
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>రసం అన్నది వాక్యనిర్మాణంలో పొటమరిస్తుంది గాని శబ్దరూపాల్లోనూ, క్రియారూపాల్లోనూ కాదు మరి.
వ్యావహారికంలో అయితే రచన నీరసం అవుతుందనుకోడమూ, గ్రాంథికం అయితే చాలు రసమహితం అయిపోతుందనుకోడమూ అవివేకానికి రెండు నిదర్శనాలు.
గ్రాంథికమే వ్యాకరణయుక్తం అయివుంటుందనీ, వ్యావహారికం వ్యాకరణదూరం అనీ అనుకోడం అవివేకానికి మూడో
నిదర్శనం.
అసలు, వ్యాకరణం అన్నది వొక్క శబ్దరూపాల్లో మాత్రమేనా వుంటుంది?
సంధి వ్యాకరణసంబంధం కాదూ?
కర్తకర్మక్రియలు వ్యాకరణసంబంధాలు కావూ?
ఆకాంక్షా, అన్వయమూ వ్యాకరణసంబంధాలు కావూ?
కారకాలు వ్యాకరణసంబంధాలు కావూ?
సమాసాలూ, అవ్యయాలూ, ధాతువులూ, ప్రయోగాలూ వ్యాకరణబంధాలు కావూ?
వ్యావహారికరచనల నీసడించేవారికి నిజంగా అవి అర్థంకాకుండానే వున్నాయా?
ప్రయోగమూలం కదా వ్యాకరణం?
కర్రచేత కొట్టాడనీ, నిన్న వస్తాననీ, రెండు మనుషులనీ, రాము డరణ్యవాసం చేసిందనీ, తాటక మహాబలవంతుడనీ యే వ్యవహారిక రచయిత అయినా రాస్తున్నాడా?
వ్యాకరణం అంటే యేమిటో యెరగని - వ్యాకరణం అంటూ వొకటుందనికూడా యెరగని పామరుడయినా అంటున్నాడా పోనీ?
ఒక్క శబ్దరూపాల్లో తప్ప - ధాతురూపాల్లోనూ తప్ప, గ్రాంథికవాదులు తమవని చెప్పుకుంటున్న శబ్దచింతామణీ, ప్రౌఢవ్యాకరణమూ, బాలవ్యాకరణమూ యే గ్రాంథికవాది వ్యావహారిక వాదికంటే బాగా అనుసరిస్తున్నాడూ?
ఇడియమ్సు అంటారే యింగ్లీషులో, అవీ పలుకుబళ్లూ మా రచనల్లోకంటే యే గ్రాంథికవాది రచనల్లో సరిగా వుంటున్నాయీ?
ఒక్క టడుగుతున్నాను గ్రాంథికవాదులను.
ఏ కారణంవల్ల మీకిష్టం లేకపోయినా వ్యావహారికం మీరు స్వీకరించవద్దు.
ఆత్మద్రోహమూ చేసుకోవద్దు.
ఉన్నదున్నట్టు చెప్పండి.
వ్యావహారికరచనలు చదివినప్పుడు మీకు రసానుభూతి కలగడంలేదూ?
పోనీ, గ్రాంథికం అయిన ప్రతీరచనలోనూ మీకది సిద్ధిస్తోందా?
"ఆ సిగ్గుకు సిగ్గు లేద”న్నాడే, చేమకూర వెంకన్న, అక్కడ మగాగమా చూసుకోవలసింది రసస్ఫూర్తా?
రసం ప్రధానంగా చూసుకుంటే కూచిమంచి తిమ్మన్న వంటి కవిసార్వభౌముల రచనలకు లెక్కా జమా?
ఏతావతా :-
వ్యావహారికరచనలో రసం వుందో లేదో అది స్పందనశీలమైన హృదయం చెబుతుంది, మనోవికారా లధిగమించలేని బుద్ధి కాదు.<noinclude><references/>
{{rh|283||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
kn0xl0frytwuoqx1x4qv2kz5nnnecy1
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/308
104
203652
553303
529754
2026-04-16T10:56:13Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553303
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>రచన వ్యావహారిక మయినా గ్రాంథికమయినా మహా కావ్యం అవునో కాదో అది ప్రగమనశీలమైన కాలం చెబుతుంది, ఆ కాలం అధిగమించలేని పండితుడు కాదు.
భావాలకు రూపకల్పన చెయ్యడంలో శబ్దాలకు అర్థనిర్ణయం చేస్తాడు కవి.
ఆ అర్థం స్వీకరించే పండితుడు నిఘంటువులు రాసుకోవాలి.
లోకసిద్ధమైన శబ్దానికి సభ్యత కలగడానికి సంస్కారమున్నూ చేస్తాడు, అవసరమైతే కవి.
ఆ సంస్కారం ఆధారంగా వ్యాకరణసూత్రా లల్లుకోవాలి వైయాకరణి.
జీవద్భాషకు నియామకుడు కవే గాని పండితుడూ వైయకరణీ కాదు.
కవి అంతస్థు పండితుని అంతస్థుకంటేనూ, వైయాకరణి అంతస్థుకంటేనూ చాలాపైది.
కవి అడుగుజాడలే శరణ్యం పండితుడికీ వైయాకరణికీని.
రసికుల కానందానుభూతి కలిగించడానికి రచన చేస్తాడు కవి.
జనులకు శీలసంపద అలవర్చడానికి ధర్మనిర్ణయం చేస్తాడు కవి.
జాతిని సన్మార్గాన నడిపించడానికి శాసనం చేస్తాడు కవి.
కవి స్రష్ట.
కవి స్వతంత్రుడు.
కవి నియంత.
కవి భాషాసాహిత్యాలకు సమ్రాట్టు.
ఈ సత్యం అవగాహన కాని మనిషికీ, ఆ మనిషిని అదుపాజ్ఞల్లో పెట్టలేని జాతికీ అభ్యుదయం లేదు.
వ్యావహారికం విషయమై మా వేంకటరామశాస్త్రిగారూ నేనూ చాలా మాట్టాడుకున్నాం చాలామాట్లు.
వారి గ్రాంథికాభిమానమూ, గ్రాంధికవాదమూ మహోదారాలు, సంకుచితాలు కావు.
పిఠాపురం యువరాజులుంగారి వ్యావహారికరచనలకు వారి ఆమోదముద్ర వుందని తెలుసుకోగలవారికి భాష విషయమై వారి సిద్ధాంతం యెలాంటిదో వేరే చెప్పనక్కరలేదు.
జయపురాధీశులు శ్రీ విక్రమ దేవవర్మగారు గ్రాంథికవాదులన్న సంగతి సర్వజనవిదితం.
ఉత్తరాలలో కూడా బండిఱాలూ, అరసున్నలూ వాడేవారు, వారు.
నా వడ్లగింజలు మొదటిమాటు అచ్చువేయించుకోడానికి పడ్డంతా డబ్బిచ్చారు, వా రాజరాజుకృతిన్నీ స్వీకరించి నన్ను సత్కరించారు, మరి యిదేమిటీ?
ఓ-క్కటే మాట.
రసానందపారవశ్యం అనుభవించగల యోగ్యత వుండాలి, మనిషికి.
సాహిత్య ప్రస్తావనలో ఆ మనిషికే పరిగణన.
కాక :-<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||284}}</noinclude>
drj34su1feu22e8d3xmmyj7bdeof599
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/309
104
203653
553306
529755
2026-04-16T11:01:54Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553306
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అభిప్రాయాలు భేదించవచ్చు, తమ అభిప్రాయాలే తా మనుసరించనూ వచ్చు; కాని భిన్నాభిప్రాయా లుండగూడదనడమూ, భిన్నాభిప్రాయాలు గమనించకపోడమూ మౌర్ఖ్యం.
నా నమ్మకం యేమిటంటే?
ఇప్పటిదాకా బతికేవుంటే, మా రామకృష్ణశాస్త్రిగారు, అగత్యం అయితే పిఠాపురం మహారాజులుంగారి ఆస్థానం అయినా నిర్లక్ష్యంగా విడిచిపెట్టి వ్యావహారికంలో రచనలు సాగించివుందురు లక్షణంగా.
అలాంటి ప్రగమనశీలం వారిది.
అది యేమయినా, నాకు వచనరచనాదీక్ష యిచ్చి వా రూరుకోలేదు, తామున్నూ ప్రారంభించా రది.
వచనరచనమీదలాగే యింగ్లీషుమీదా పడింది వారిదృష్టి.
నే నక్కడ వుండిన చివరి రోజుల్లో, వారు గడించిన యింగ్లీషు భాషాపరిజ్ఞానం చూసి, పట్టభద్రులున్నూ అనేకులు
చకితు లయిపోయారు.
చిన్నప్పణ్ణుంచీ యింగ్లీషుమీద నాకూ వుందలాంటిదృష్టి; కాని ఆత్మనేపది కాక పరస్మైపది అయిపోయింది, నా కది.
నే నక్కడ వుండినప్పుడే కాకరపర్తి పక్కవూరు పెరవలి గ్రామంనుంచి విద్యాభిక్షకోరి రామకృష్ణకవుల దగ్గిర కొక
యువకుడు వచ్చాడు.
పేరు వేమూరి వేంకటనారాయణ, మాఘం చదువుతూ వచ్చా డక్కడికి.
నాకంటే చిన్న అతను.
రామకృష్ణశాస్త్రిగారు చెప్పగా నా గదిలో చోటిచ్చా నతనికి.
తెలివైనవాడు, చురుకైనవాడు, సౌమ్యుడు, స్నేహపాత్రుడున్నూ అతను.
అయితే, మాఘం చదవడం అంటే గురువుగారి దగ్గిర కూచుని కొత్తశ్లోకం చదివి, సంస్కృతంలో అన్వయించి, వ్యాఖ్యానపంక్తులు చర్చించడం.
చురుకైనవాళ్ళకు కుమారసంభవంలోనూ, సామాన్యులకు మేఘసందేశంలోనూ ప్రారంభం కావలసిన స్థితి అది.
భారవీ మాఘమూ చదివే విద్యార్థికి గురువు చెప్పవలసినవి విశేషార్థాలూ, ధ్వనులూ, శాస్త్రమర్యాదలూ - ఇత్యాదిగా సమగ్రబోధ కాని, తెనుగులో ప్రతిపదార్థం చెప్పడమూ, ఆకాంక్ష అందిస్తూ అన్వయం నడిపించడమూ, శబ్దాలూ సమాసాలూ - ఇలాంటివి చెప్పడమున్నూ కాదు.
కొత్తపాఠం స్వయంగా సమన్వయించుకునే గురువుదగ్గిర కూచోవాలి విద్యార్థి.
మాఘం చదివే విద్యార్థి అంటే తన గురువు దగ్గిర ప్రారంభకావ్యాలు చదివే విద్యార్థికి "చిన్న మేష్టారు.”
కాని చూస్తిని గదా, అన్వయం దాకా యెందుకూ, పదక్రమం - ఏమాట తరవాత యేమాట అందుకోవాలో కూడా తెలియదు వేంకటనారాయణకు.
రఘువంశంలో ప్రారంభం కావలసిన స్థితి యెవరి కయినా అది.<noinclude><references/>
{{rh|285||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
qw93whsr3tgi9salbl5qjzf1upoo92v
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/310
104
203654
553311
529827
2026-04-16T11:07:18Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553311
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అదిన్నీ లేకపోడం చూసి తెల్లపోయా న్నేను.
దీనికి సాయం, కొత్తశ్లోకం చూసుకోడంలో తనకి కొంచెం సాయం చెయ్యమని కోరాడు నన్నతను.
అంటే, మొదట నేను స్థూలంగా పాఠం చెబితే, తరవాత, గురువుగారి దగ్గిర సూక్ష్మంగా పాఠం చెప్పుకుంటా డన్నమాట అతను.
కష్టమూ లేదు, నష్టమూ లేదు, చెప్పనేవచ్చు.
అయితే, మాఘం చదివే వాటి కలాంటి సాయం అగత్యం అయితే ఆ మనిషి యిక తేలడం అంటూ వుంటుందా?
చూసిచూసి “నీ కర్థజ్ఞానం కలగడం యెప్పుడు, సత్యనారాయణవ్రతకథ అయినా చెప్పగలడానికి శక్తి రావడం యెప్పుడు, సంస్కృతజ్ఞానంతో ఏదోవిధంగా పొట్టపోసుకో గలగడమున్నూ యెప్పు" డని అతణ్ణే అడిగాను సాహసించి నే నొకనాడు.
అమాయికు డతను "నా తపనా అదే” అన్నాడు. దాపరికం లేకుండా.
గుండెల్లో కలుక్కుమంది నాకు.
పోనీ అతను సోమరి యేమో అంటే యెంతమాత్రమూ కాడు.
ఇక వున్నదల్లా యేమిటంటే?
అతనికీ సంస్కృతసాహిత్యానికీ చుక్కెదురు.
అంటే దానిమీద రుచిలే దతనికి.
రుచి లేదు కనక అతని కంటడంలే దది.
అంటడం లేదు కనక గుంటపువ్వులు పూస్తున్నా డతను.
నే నది గుర్తించాను.
నాక్కావలసిన విద్య నన్ను మావాళ్ళు సాధించుకోనివ్వలేదు, అతనివాళ్ళు అతనేమి చదువుకున్నా అడ్డుపెట్టరు; కాని తనకి కావలసిన విద్య యేదో అత నెరగడు - ఇదీ నాకు అతనికీ భేదం.
దీంతో అతని స్థితి గుర్తించి "సాయపడగలమా?" అని బాగా ఆలోచించాను.
ఒకదారి కనపడింది.
రామవరం అని దక్షిణంగా మావూరి కొక సమీప గ్రామం.
ఆ గ్రామానికి చెందిన బుద్ధవరపు రామరాజు వెంకటరాజుగార్ల కుటుంబం కొంత, పిల్లల చదువుకోసం ఆ వూళ్ళో
ప్రవేశించి వుం దప్పుడు.
మాకూ ఆ కుటుంబీకులకూ చిరపరిచయం.
ఆ పిల్లల్లో కొందరు మా పొలమూరికే చెందిన తటపర్తి నరసింహంగారి దౌహిత్రులు.
వారిలో పెద్ద - అంటే రామరాజుగారి కుమారుడు థర్డుఫారం చదువుతున్నాడప్పుడు.
పొలమూరి సిద్ధాంతిగారి అబ్బాయిని కనక ఆ కుటుంబానికీ, అప్పటికే నేను కవిని కనక ఆ పిల్లలకూ నేనంటే యెంతో ఆదరభావం.
ఈ చనువు పురస్కరించుకుని, ఆ పిల్లల దగ్గిర వున్న వెనకటి తరగతి పుస్తకా లడిగి పుచ్చుకుని, ఆ థర్డుఫారం విద్యార్థిచేతనే వేంకటనారాయణకు చెప్పించా నింగ్లీషు.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||286}}</noinclude>
98iw659cbxhedrb5isi9ebklqoiyu1u
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/311
104
203655
553316
529828
2026-04-16T11:11:55Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553316
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఒక్క గంటలో ఏ.బి.సి.డీలు గుర్తుపట్టేశా డతను.
ఒక్క నెల తిరిగేటప్పటికి గురువుతో అతని అంతస్థున మాట్టాడసాగా డింగ్లీషు.
దీంతో అతనికోసం మరో గురువుని చూడవలసివచ్చింది నేను.
శ్రీపాద సూర్యప్రకాశంగా రని ఆ వీధిలోనే నే నెరిగిన వొక పట్టభద్రులు.
జగత్ప్రసిద్ధతార్కికులు శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రిగారి పెద్ద కుమారు లాయన.
బహూ సౌమ్యులు.
తరుచు లక్ష్మీ నరసింహశాస్త్రిగారి దర్శనం చేసుకుంటూ వుండడంతో వారితోనూ పరిచయం యేర్పడివుంది నాకు.
వేంకట నారాయణను చూపించి పరిస్థితులన్నీ చెప్పి అనుగ్రహించవలసిందని కోరా న్నేను వారిని.
వా రంగీకరించా రందుకు.
దీనికి సాయం, ఆ యింగ్లీషుపరిచయంతో ఇంగ్లీషు చదివే ఆ వీధి కుర్రవాళ్ళందరితోనూ సాహచర్యం అబ్బిం దతనికి.
ఒక విధంగా వారిని కూడా అందరినీ గురువులుగానే భావించుకున్నా డతను.
వారు లెక్కలు చేసుకుంటూ వుంటే అతనూ చేశాడక్కడ కూచుని.
ఇంగ్లీషు నేర్చుకుంటూవుంటే, అతనూ వల్లించాడు వారితోపాటు.
వా రాటల్లో దిగితే తాను మాత్రం అందుకు సిద్ధపడక ఆడుతూపాడుతూ సర్వ విషయాలూ ఆకలించుకున్నాడు, పువ్వుపువ్వునా తుమ్మెద మకరందం సేకరించుకునే టట్టు.
తరవాత వొకటిరెండు మాసాల్లోనే హైస్కూల్లో క్లాసు పరీక్షలు జరిగాయి.
సూర్యప్రకాశంగారి ప్రోత్సాహంతో అందుకు సిద్ధపడ్డాడు వేంకటనారాయణ.
అప్పు డక్కడి హైస్కూలు హెడ్మాష్టరు కూచి నరసింహం పంతులుగారు.
మూడు మాసాల పరిశ్రమతో, అంతవరకూ ఇంగ్లీషు ముక్కూ మొగమూ యెరగని వేంకటనారాయణ ఆ పరీక్షల్లో కూచుని థర్డుఫారం పాసైనాడు.
"ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా.”
ఇలాంటి సందర్భాలు చూసే కాళిదా సీసూక్తి వెలయించి వుంటాడు.
అయితే, గత సంవత్సరం తాలూకు జీతం అంతా చెల్లిస్తే అతణ్ణి పై తరగతిలో చేర్చుకుంటా మన్నారు నరసింహం
పంతులుగారు.
పాఠశాల నిబంధనల ననుసరించి అది అంతే అయివుండవచ్చు; కాని ఆసక్తే గాని ఆ శక్తి యేదీ వేంకట నారాయణకు?
పుస్తకాలే పాతవి సంపాదించుకోవలసినవా డతను, ఏ నెల కానెలదే కట్టలేడే, సంవత్సరం జీతమూ వొక్కమాటు గుమ్మరించాలంటే అతని తరమా, పోనీ అంటే, నా వశమా?
దిగ్భ్రాంతులం అయిపోయాం మేమిది విని.
రుచి లేక ఆ చదువు దూరం కాగా, డబ్బు లేక యీ చదువు దూరం అయిపోయే స్థితి వచ్చింది.<noinclude><references/>
{{rh|287||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
g4roxi41g0khpsf6wx4xm8c7w6y5cem
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/312
104
203656
553321
529829
2026-04-16T11:16:34Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553321
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఒక్క వేంకటనారాయణే కాదు, ఎంతెంతలేసి పరీక్షల్లోనూ మిక్కిలీ సుళువుగా నెగ్గెయ్యగల యువకు లింకా వేలూ లక్షలూ వున్నారు దేశంలో; వారి ప్రతిభ అంతా దేశానికీ జాతికీ సంచితం చేసిపెట్టగల ధర్మసంస్థలే లేవు, మనకిప్పుడు.
నిజమే కాని మనజాతి కిది కొత్తసంగతి.
విద్యాదానం వుందే గాని పాఠశాలదానం లేదు మనలో యెప్పుడూ కూడా.
విద్యాదానం పండితకర్తృకం; సంపన్నులు చెయ్యవలసిందీ, చెయ్యగలిగిందీ కానేకాదు.
పండితులు విద్యార్థులకు విద్యాదానం చెయ్యడమూ, సంపన్నులు అన్నదానం చెయ్యడమూ - ఇదీ మన సంప్రదాయం.
మన దేశంలో, విద్య, యేయుగంలోనూ కూడా ప్రభుత్వపరంగా లేదు.
గురుకులవాసమే మన విద్యాసంస్థ.
కానీఖర్చులేకుండా సకలశాస్త్రాలూ సాధించుకునేవారు మనవాళ్ళు.
గురుకులవాసం చదువుతోనే మనవాళ్ళు మహాపండితు లయినారు, శాస్త్రకారు లయినారు, చక్రవర్తు లయినారు, మహామంత్రు లయినారు, ద్వీపద్వీపాంతరాల్లోనున్నూ మన సంస్కారం వ్యాపింపజేశారు.
మనదేశంలో, ప్రతీపట్నంలోనూ - పెద్ద పెద్ద పల్లెల్లో కూడా అన్నసత్రాలు వెలిశాయి గాని, పాఠశాలా భవనాలు వెలియలేదు, పరకాయించి చూస్తే.
పండితులు తమకి తామే విద్య చెప్పేవారు విద్యార్థులకు.
అగ్రహారాలూ, వృత్తులూ, మాన్యాలూ, వార్షికాలూ యిచ్చి ప్రభువులూ, సంపన్నులూ ఆ పండితులను పోషించేవారు, సేవ్యసేవక సంబంధం మాత్రం పెట్టుకోకుండా.
విశ్వవిద్యాలయాలూ వుండేవి; కాని అవీ పండితుల స్వత్వాలే ప్రభుత్వానివి కావు.
ఆ విశ్వవిద్యాలయాలున్నూ ప్రభువులూ, సంపన్నులూ పోషించేవారు.
విద్యార్థులకు అన్నం పెట్టి, బట్ట లిచ్చి విద్య చెప్పేవవి.
వాటి నిర్వహణవిధీ, బాధ్యతా ప్రధానాచార్యునివి.
ఆయనకే కులపతి అని బిరుదు.
పదివేలమందికి అన్నవస్త్రాలిచ్చి విద్య చెప్పేవాడే కులపతి అని మనవారి నిర్వచనం.
ఆ కులపతుల యెదట రాజులూ, మహారాజులూ, చక్రవర్తులూ చేతులు కట్టుకుని మసిలేవారు, ఏలోటూ లేకుండా మాత్రం చూస్తూ.
ఓనమాల దగ్గర్నుంచీ విద్యార్థులు నెలనెలా ముడుపు చెల్లించి నేర్చుకోడమూ, ఉపాధ్యాయుల జీవితాలు దొరతనంవారు తమ గుప్పిట్లో యిరికించుకుని వుండడమూ, పరీక్షల యేర్పాటూ, చివరకి విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ, పైవారిలోనూ రకరకాల లుకలుకలూ - ఇదంతా మన కాంగ్లేయులు ప్రసాదించిన నవనాగరికత.
పోనీ, ఆ ఆంగ్లేయులు వెళ్ళిపోయారు గదా - ప్రభుత్వయంత్రం మన చేతుల్లోకే వచ్చింది కదా, విద్యావిధానంలో. మళ్ళీ మన సంప్రదాయం ప్రవేశపెడతారా మనవాళ్ళు?<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||288}}</noinclude>
bjc71k3o8vxrnwx2qgr8htedzxbpsvx
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/313
104
203657
553322
529831
2026-04-16T11:22:01Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553322
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>{{c|<big><big>31</big></big>}}
చూసిచూసి నే నొకనాడు దివాన్ మొక్కపాటి సుబ్బారాయుడుగారి దగ్గిరికి తీసుకువెళ్ళా నతణ్ణి.
అర్ద్ర హృదయులు వారు.
విద్యార్థుల చదువుల నిమిత్తం ఆ విద్యార్థులకంటే యెక్కువగా ఆత్రపడిపోయేవారు వారు.
కనక, జీతం దమ్మిడీ అయినా యివ్వనక్కరలేకుండా అక్కడి హైస్కూలు చదువంతా పూర్తిచేసుకోడాని కవకాశం
కలిగించారు. వెంటనే వా రతనికి.
అది ముత్యపుచిప్పలో పడ్డ స్వాతిచిను కయింది.
పరీక్ష తప్పడం అన్నది లేకుండా చరచరా పైకివెళ్ళి స్కూల్ ఫైనల్ పరీక్షలో నెగ్గేశాడత నేకబిగిని.
తుప్పుపట్టిపోయిన కత్తిని సానపెట్టిన ట్టయింది దాంతో అతని పని.
అయితే, సామాన్య మర్యాదలకు భంగం లేకుండా యేదో విధంగా పొట్టపోసుకోడాని కాచదువు చాలు; కాని విద్యాతృష్ట తీరలే దతనికి.
తీరకపోడమే కాదు, హెచ్చిన్నీ పోయింది.
ఏమంటే?
"హరిః ఓ"మ్మనడానికే ఆలస్యం అయిందే గాని "ఇతి శ్రీ" అనడాని కింకా సమయం రా లేదతనికి.
“ఎందుకు వచ్చిన కావ్యాలురా బాబూ?" అంటూ కుసిల్లిపోయేవాడల్లా “బి.ఏ. కాలేకపోతే అదేం బతుకూ?” అంటూ తహతహ లాడిపోసాగా డతను.
ఏమి చెయ్యడానికీ తోచక చివరికి మావూరున్నూ వచ్చాడు వెతుక్కుంటూ.
నే నేమయినా ఉపాయం చెబుతా నని అతని ఆశ.
అయితే, అంతకాలం పిఠాపురంలో వుండి చదివినవాడికి, తాను చదివిన హైస్కూలులాగే కాకినాడ కాలేజీకూడా పిఠాపురం మహారాజులుంగారిదే అని తెలియకుండా వుంటుందా?
అది తెలిసినవాడికి అదిన్నీ సుబ్బారాయుడుగారి చేతిలోనే అని వేరే చెప్పాలా?
నిజమే, కాని వేంకటనారాయణ తెలివితేటలు శంకించడం కా దిక్కడ మన ధర్మం.
లోకంలో, చాలామందికి, చాలా సందర్భాల్లో తటస్థిస్తూనే వుంటుం దిలాంటి స్థితి.
అజ్ఞానం కా దిది, ఏకాగ్రత.
ఒక్క యేకాగ్రతా కాదు, వ్యగ్రతాను.
ఈ అవస్థలో మనస్సొకచోటా నిలవదు.
ఆలోచన చెయ్యబోతుంది; కాని రూపుకట్ట దది.
చివరి క్కావలసిన పని జరగదు.
“చంకల్లో పిల్లవాణ్ణి పెట్టుకుని వూరంతా వెతికిందటో యిల్లా"లన్న సామెత కిదే మూలం.<noinclude><references/>
{{rh|289||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
sw1aoby0g1td5ecafniukkkt2wgu3uo
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/314
104
203658
553323
529832
2026-04-16T11:29:05Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553323
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కాక; - దుర్యోధనుడి తొడలు విరగ్గొడతా నని తన శపథమా?
ద్వైపాయనహ్రదం దగ్గిర జరుగుతున్నది అటో యిటో తేల్చివేసే చివరి యుద్ధమా?
మరి, కృష్ణుడు సన్నచేస్తేగాని భీముడు గదతో దుర్యోధనుడి తొడలమీద బాధలేకపోయాడేం?
అలాంటిదే యిదీని.
ఆ అవస్థలో పడే మా వూరు వచ్చాడు వేంకటనారాయణ.
వచ్చిన ఉత్తరక్షణంలోనే ఉపాయం చెప్పి నే నతణ్ణి పంపేశాను.
కాకినాడ కాలేజీ సంగతి జ్ఞాపకంచేసి మళ్ళీ సుబ్బారాయుడుగారి నాశ్రయించమనే ఆ వుపాయం.
పిఠాపురం అంటే, సుబ్బారాయడుగారి పేరే తట్టే దెవరికైనా.
సుబ్బారాయడుగారిని నమ్ముకునే వచ్చేవారా రోజుల్లో పిఠాపురం యెవరు వచ్చినా.
సూటిగా మహారాజులుంగారి దర్శనమే కావాలంటే సాధ్యంకాదు, మరి.
“అగ్నిముఖా వై దేవా..”
ఇదే సూత్రం యిక్కడాను - "మంత్రిముఖా వై రాజానః"
చక్రవర్తి - లేక మహారాజు - లేక - రాజు - లేక జమీందారు అయిన ప్రతీమనిషి దగ్గిరా వుంటాడు ఏదో వొక యెత్తున, దివా ననిపించుకునే మనిషి.
అయితే, తెనుగుదేశంలో, "దివాను" అని చెప్పదగినవా రిద్దరే - వొకరు కొమర్రాజు లక్ష్మణరావుగారూ, మరొకరు మొక్కపాటి సుబ్బారాయడుగారున్నూ.
జీతం లేకుండా కాకినాడ కాలేజీ చదువుకూడా పూర్తి చేసుకోడానికి వేంకటనారాయణ కవకాశం కల్పించారు సుబ్బారాయడుగారు, ప్రార్థించడం తడవుగా.
అప్పటి కది సెకండుగ్రేడు కాలేజీ.
అయినా హైస్కూలుకి పైమెట్టు కావడంవల్ల అందుకే మిక్కిలి సంతోషించాడు వేంకటనారాయణ.
అపజయమన్నది లేకుండా అక్కడి చదువున్నూ రెండేళ్లల్లో పూర్తిచేసేశా డతను.
తృష్ణమాత్రం తీరలే దతనికి.
అయితే, సుబ్బారాయడుగారి చేతిలోనా ఫస్టుగ్రేడు కాలేజీ లేకపోయె, అలాంటి కాలేజీ చేతిలో వున్న దివా నాసుబ్బారాయుడుగారివంటివా రవునో కాదో తెలియదాయె.
కాని యేనుగుకుంభస్థం బద్దలుకొట్టేదాకా వూరుకోదు సింహం.
బి.ఏ. కాకుండా వుండలేకపోయాడు వేంకటనారాయణ.
ఏటి కడ్డపడ్డా డప్పుడు.
విజయనగరం ప్రవేశించా డాకసితోనే.
జీతమే కడుతూ వచ్చాడో, అక్కడా దివాన్గా రనుగ్రహించారో మరి, రెండేళ్ళలోనే బి.ఏ. అయిపోయా డతను.
మరో రెండేళ్ళకి ఎల్.టి. కూడా అయిపోయాడు రాజమహేంద్రవరంలో.
అనన్యసాధారణమైన ఆ అభ్యుదయపరంపర చూసి శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రిగారు తమ కొమార్తె నిచ్చి అంతకి
ముందే వివాహం జరిగించా రతనికి.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||290}}</noinclude>
smzjhnem1gsv9g077ty2wliejeieqro
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/315
104
203659
553325
529836
2026-04-16T11:37:53Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553325
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>చివరి కిప్పుడు, పశ్చిమ గోదావరిజిల్లా బోర్డు హైస్కూళ్ళలో ప్రముఖోపాధ్యాయులై వోహో అనిపించుకుంటున్నారు, మిత్రులు, మ.రా. శ్రీ వేమూరి వెంకటనారాయణపంతులు బి.ఏ.ఎల్.టి.గారు, సిరిసంపదలతో తులతూగుతూ.
మరి అప్పుడు మాఘమే చదువుతూ కూచుని వుంటే?
"మాఘే మేఘే గతః వయః."
మల్లినాథ మహామహోపాధ్యాయుడన్న మాట యిది.
మాఘానికీ మేఘసందేశానికీ వ్యాఖ్యానం చేశాటప్పటికి చాలా బడలిపోయా డతను.
సాహిత్య యాత్రీకుల కవి రెండూ చాలా గడ్డుమజిలీలు.
మేఘసందేశం చదివాటప్పుడు తెలిసీ తెలియని అవస్థలో వుంటాడు విద్యార్థి.
పెద్దపెద్ద సాహిత్యపరులకే నికషాయమానం, మరి అది.
కొంత తెలియడంతో వెలుగూ, మరికొంత తెలియకపోడంతో అంధకారమూ ముసురుకుని వుంటుంది ముందుదారి.
ఓర్చుకోలేక చాలామంది వెనక్కి మళ్ళేస్తా రక్కడ.
ముందుకి వెళ్ళగలిగాడా, భారవి తరవాత మాఘం.
అప్పటికి యుక్తవయస్కు డయివుంటాడు విద్యార్థి.
లోకంపోకడ అవగాహన అవుతూ వుంటుంది.
సంస్కృతభాషలో స్వేచ్ఛాసంచారమూ ప్రారంభం అయివుంటుంది.
కనక, మాఘం సుళువుగా నడిస్తే జీవితమూ నడుస్తుంది, లక్షణంగా.
అలాంటి చోట కాలు స్తంభించిపోయింది వేంకట నారాయణకు.
అయినా, అదృష్టవంతు డతను.
కనకనే పిఠాపురం ప్రవేశం తటస్థించిం దతనికి.
ఇటు రామకృష్ణకవుల ఆశీర్వచనమూ, అటు దివాన్ సుబ్బారాయడుగారి అనుగ్రహమూ లభించా యతని కక్కడ.
అతని జీవయాత్ర సిమెంటురోడ్డు చేరుకుంది దాంతో.
అయితే, మాఘం నడవలే దంటే వేంకటనారాయణ కప్రతిష్ఠ యేమీ లేదు.
ఏమంటే?
ప్రతిభ వేరూ, రుచి వేరూను.
రుచి వేరూ, అవకాశం వేరూను.
అవకాశం వేరూ, స్వాతంత్ర్యం వేరూను.
స్వాతంత్ర్యం వేరూ, దీక్ష వేరూను.
దీక్ష వేరూ, ఏకాగ్రత వేరూను.
ఏకాగ్రత వేరూ, సాహసం వేరూను.
ఇన్నీ కలిస్తే అప్పుడూ "సాహసే లక్ష్మీ.”
తేలిం దేమి టంటే?
విద్యలు రానివాడు లేడు.
రాని విద్యలు మాత్రం వున్నాయి.<noinclude><references/>
{{rh|291||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
ix1p03va7vk7yjejvrfzi7b2736cu7v
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/316
104
203660
553344
529837
2026-04-16T11:54:59Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553344
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇంతకీ :-
ఒకరికంత ధారాళంగా వుపాయం చెప్పానే, ఎంతో కొంత ప్రయత్నమూ చేశానే, మరి, నేను కూడా అలా తంటాలుపడి యింగ్లీషు సాధించుకుని వుండగూడదూ?
యోగం లేకపోయిందనను, కాపురుషుల మాట అది.
డాబులు చెప్పుకోడం కాదు, పూనుకుంటే యిప్పుడున్నూ ఎం.ఏ. కూడా అయిపోగల న్నేను అవలీలగా.
మరి, నా తెనుగుమాట?
ఈ దీక్ష విడిచిపెట్టుకోలేకపోయాను.
కవిని కావాలనీ, గుట్టలుగుట్టలుగా గ్రంథాలు రచించాలనీ వొక ప్రాప్యమూ, వొక ప్రణాళికా సిద్దం చేసుకుని వుండినాను కనక, ఆ సాధకావస్థలో పక్కపక్కలకు తప్పుకోలేకపోతూ వచ్చా న్నేను.
అంచేతనే యిప్పటికీ నే నిలాగ నేలబారుగానే వుండిపోయాను, లేకపోతేనా?
{{c|<big><big>32</big></big>}}
నిన్నటిదీ మొన్నటిదీ కాదు రామకృష్ణకవుల దగ్గిర నేను చదువుకోడం, నలభైఅయిదేళ్ళ కిందటిమాట అది; కాని ఆ సన్నివేశాలు జ్ఞాపకంవస్తే శరీరం పులకరిస్తూనే వుంటుంది నా కిప్పటికీ.
నిజాని కది మిక్కిలీ స్వల్పకాలమే.
అయినా, మాసానికి పున్నమి యెలాంటిదో, పంవత్సరానికి వసంతం యెలాంటిదో నా జీవితాని కలాంటి దయిం దది.
గురువు శిష్యుణ్ణి సర్వవిధాలా తనంతవాణ్ణి చెయ్యడానికి పడే తాపత్రయం యెలా వుంటుందో అక్షరాలా అది నా విషయమయ్యే రామకృష్ణకవుల దగ్గిర చూశా న్నేను; కాని తమ అనుగ్రహానికి ఫలితంగా నే నేస్థితికి వచ్చానో వేంకటరామశాస్త్రిగారే కాని రామకృష్ణశాస్త్రిగారు చూడలేదు.
మరిన్నీ రామకృష్ణశాస్త్రిగారు నా వడ్లగింజలు చూడలేదు, నా రాజరాజు చూడలేదు, నా కలంపోటూ, నా మార్గదర్శీ చూడలేదు, నా ప్రబుద్ధాంధ్ర వ్యాఖ్యానాలూ, భారతిలో పడిన నా మీగడతరకలూ చూడలేదు.
నా వీరపూజ వొక్కటి మాత్రమే చూశారు వారు.
చూడ్డంలోనూ బహూ పరిశీలనగా చూశారు.
"ఇలాంటి గ్రంథం తెనుగుభాషలోనే కాదు, మరేభాషలోనూ వుండివుండ"దన్నారు, వారు చివరికి.
"బావా, పద్యాలు మానేసి వచనరచనే సాగించవలసిందని మనం చేసిన వుపదేశం సఫలం అయిం" దనిన్నీ ఆనందించారు వారు, వేంకటరామశాస్త్రిగారితో చెప్పి.
వారి దగ్గిర విద్యాభ్యాసం ముగించుకున్న రెండు సంవత్సరాలకు జరిగిం దిది.
మిథునానురాగరచనే వారిని తృప్తిపరిచిం దసలు, వీరపూజ వారి మన్ననలే పొందింది.
అప్పటికీ యిప్పటికీ నాకూ వుంది వీరపూజ విషయమై అలాంటి తృప్తి.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||292}}</noinclude>
i6iz9lruy0fc8de9r8tqn4348499n3e
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/163
104
211341
553257
551164
2026-04-16T06:28:09Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553257
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
జరుగుతుంది. ఈ కథలో రూప పాత్రను రచయిత తెలిసీ తెలియని వారితో స్నేహం చేస్తే దాని పర్యవసానం ఎలా
ఉంటుందో చిత్రించారు.
'''కూలీ వెంకన్న '''
రెండవ కథ కూలీ వెంకన్న, ఈ కథలో మేస్త్రీలు కూలీలను ఎంత హింసకు గురిచేసి స్త్రీలను ఎలా పాడుచేశారో ఇందులో రచయిత వివరించారు. కూలీ వెంకన్న పాత్ర ద్వారా కూలీల జీవనస్థితిని చిత్రించారు. ఇందులోని లక్ష్మి పాత్ర ద్వారా ఆడకూలీల దయనీయమైన జీవనాన్ని మనకళ్ళకు కట్టించారు. ఈ కథలో వెంకన్న పాత్ర ద్వారా
కూలీల జీవన స్థితిని ఈ కింది సంభాషణలో చూపించారు. ఈ పాడులోకంలో కూలీ చేసుకొని బతికే వారికి గౌరవమే లేదు. ధనంతోనే బీదల మానమర్యాదలను కొల్లగొట్ట జూస్తారు పెద్దలు. అందుకే మాకీ ప్రపంచంలో తావు లేదు, సుఖములేదు. ఎప్పటికీ కష్టజీవులమై కాలం గడుపుతుంటామనే వాస్తవాన్ని చెప్పారు.
'''ప్రతిఫలం '''
మూడవ కథ ప్రతిఫలం. ఈ కథలో డబ్బుతో దేవున్ని పూజించడం కన్న సమాజహిత కార్యక్రమాలకు ఆ డబ్బును
ఉపయోగించడం మంచిదన్న విషయాన్ని తెలిపారు.
'''పొట్టకోసం '''
నాల్గవ కథ పొట్టకోసం. ఈ కథలో ప్రపంచంలో పొట్టకోసం వేశ్యలు ఏ ఏ పాట్లు పడతారో యమున పాత్ర ద్వారా చక్కగా చిత్రించారు. వేశ్యల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. వేశ్యాగృహాలలో ఉండే వాతావరణాన్ని
సహజసిద్ధంగా చిత్రించిన కథ ఇది.
'''సహవాసం '''
ఐదవ కథ సహవాసం. మంచి, చెడు సహవాసాల వల్ల ఎలాంటి పరిణామాలుంటాయో ఈ కథ ద్వారా రచయిత తెలిపారు. ఇందులో మంచి సహవాసం వల్ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో లలిత, శ్యామల పాత్రల ద్వారా చూపించారు. చెడు సహవాసం వల్ల కలిగే అనర్ధాలను లీల పాత్ర ద్వారా చిత్రించారు. గొప్ప స్నేహితురాళ్ళ కథ ఇది. స్నేహం విలువను చాటిన కథనమిది.
'''కార్మికులదే ఈ గెలుపు '''
ఆరవ కథ కార్మికులదే ఈ గెలుపు. ఈ కథలో కార్మికుల జీవనవ్యథలను చిత్రించారు. ఐకమత్యంతో కార్మికులందరూ ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చనే భావాన్ని తెలిపింది ఈ కథ.
'''గుణపాఠం '''
ఏడవ కథ గుణపాఠం. ఈ కథలో మేరి పాత్ర ద్వారా స్త్రీలు సౌందర్యం కోసం వెచ్చించే డబ్బునంతా పొదుపు
చేస్తే సుఖవంతమైన జీవితం ఎలా గడపవచ్చనే అంశాన్ని చాలా సున్నితంగా తెలిపారు.
'''మొదటి తేది '''
ఎనిమిదవ కథ మొదటి తేది. ఇందులో ప్రతీ ఉద్యోగికి మొదటి తేది వస్తుందనగానే ఒక దిక్కునుండి ఆశ, రెండవ దిక్కునుంచి నిరాశ ఆవహిస్తుంది. ఆశ ఎందుకంటే నెలరోజులు చమటోడ్చి శ్రమ చేసిన దానికి ప్రతిఫలంగా డబ్బు లభిస్తుంది. అది తన కుటుంబపోషణానికి సరిపోని, సరిపోకపోనీ తనకు ఆనాడు అందితే చాలు. ఉద్యోగి ఆనందానికి అంతే ఉండదు. మరుసటి రోజు కలిగే ఆర్థిక చిక్కులకు తట్టుకోలేక ఎందుకీ మొదటి తేదీ వచ్చిందిరా దేవుడా?! అని నిరాశతో వాపోతాడు ప్రతి ఉద్యోగి అనే గొప్ప భావాన్ని ప్రదీప్ పాత్ర ద్వారా అద్భుతంగా చిత్రించారు. ఈ కథను ఎదిరె చెన్నకేశవులు అతి సహజాతి సహజంగా రచించడం విశేషం.
'''నవలా రచయితగా '''
ఎదిరె చెన్నకేశవులు కథకుడిగానే కాకుండా నవలా రచయితగా కూడా పేరెన్నికగన్నవాడు. తొలి తెలంగాణ డిటెక్టివ్ నవలారచయితగా ఎదిరె చెన్నకేశవులు లబ్ద ప్రతిష్టులు. వీరి అదృశ్యహస్తం నవల తొలి తెలంగాణ అపరాధ పరిశోధక నవల. ఇది నేత వారపత్రికలో ధారావాహికంగా వెలువడి ప్రజాదరణ పొందింది. దొంగ, హంతకుడు అయిన భయంకర్ బారి నుంచి అతని<noinclude><references/>
{{rh|తెలంగాణ |142| తేజోమూర్తులు}}</noinclude>
bjirjjcjo67iyufytb0rra10l755cq3
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/164
104
211377
553258
551305
2026-04-16T06:31:12Z
A.Murali
3019
553258
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
మేనమామ కూతురును డిటెక్టివ్ మోహన్ కాపాడడం ఇందులోని ఇతివృత్తం. వీరి మరో నవలలు పొట్టకోసం,
పతిత ఈ రెండూ సాంఘిక నవలలు.
అదృశ్యహస్తం అవరాధ పరిశోధక నవల, నేత వారపత్రికల్లో 1967లో ధారావాహికంగా ప్రచురితమైంది. 1969లో పుస్తక రూపంలో వెలువడింది. ఇది సీరియల్ గా
వస్తున్నప్పుడే పాఠకుల మన్ననలను పొందింది. అపరాధ
పరిశోధక నవలకు ఉండవలసిన లక్షణాలన్నీ ఈ నవలలో
ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందనే ఉత్కంఠ
ఈ నవలలో అడుగడుగున తొంగి చూసింది.
ఈ నవలలో అపరాధ పరిశోధకుడు మోహన్,
కథానాయకుడు భయంకర్. ఇతడు అనేక దొంగతనాలు,
దోపిడీలు హత్యలు చేయించిన పచ్చి దొంగ. తనకు జరిగిన
అన్యాయానికి ప్రతీకారంగా భయంకర్ అటువంటి హత్యలు,
దోపిడీలు చేస్తుంటాడు. భయంకర్ తన మేనమామ కూతురు
పద్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలను
కుంటాడు. అది జరగకపోవడంతో పద్మను ఎత్తుకపోయి
చెరపట్టి వివాహ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇదే ఈ
నవలలోని ప్రధానమైన ఇతివృత్తం. పద్మను కాపాడడానికి
డిటెక్టివ్ మోహన్ వేసిన ఎత్తుడగ ఎలాంటిదో ఈ నవల
చదివితే తెలుస్తుంది. అయితే భయంకర్ పద్మ తనను
ప్రేమిస్తుందనే తపనతోనే ఆమెను ఎత్తుకుపోతాడు. కానీ,
డిటెక్టివ్ మోహన్ ఆమెను రక్షిస్తాడు.
రచయిత ఈ నవలలోని భయంకర్ పాత్రను జాలి
కలిగేటట్లు చిత్రించారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా
అతనిని పాఠకులు ఎవ్వరూ అసహించుకోలేరు. అలా ఆ
పాత్రను రచయిత తీర్చిదిద్దారు. ఒక విలన్ ను జాలిగాలిపేటట్లు
పాత్రను సృష్టించడం రచయిత నేర్పును తెలియజేస్తుంది.
ఈ నవలలో అరణ్యంలోని రహస్యగుహలు, పాతాళ
గుహలు, ముసుగు మనుషులు మొదలైనవాటిని రచయిత
కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. ఇందులోని ముగింపు
కూడా విభిన్నంగా ఉంటుంది. సహజంగా అపరాధ
పరిశోధక నవలల్లో డిటెక్టివ్ అసిస్టెంట్ పెళ్ళితో కథ
ముగుస్తుంది. కానీ ఇక్కడ మోహన్ కుమార్తె వివాహంతో
ఈ నవల ముగించడం విశేషం. డిటెక్టివ్ నవలకు
ఉండవలసిన అన్ని హంగులతో ఈ నవలను ఎదిరె
చెన్నకేశవులు ఎంతో నేర్పుతో రచించారు.
ఎదిరె చెన్నకేశవులు రచించిన రెండవ నవల
పొట్టకోసం. ఈ నవల 1968లో ప్రచురించబడింది. ఈ
నవలలోని ప్రధాన ఇతివృత్తం గ్రామీణ ప్రజలు పట్టణాలకు
వలసపోయి ఎలా జీవిస్తున్నారే అంశంగా దీనిని రచించారు.
మొదటిసారిగా నగరంలోకి వలస వచ్చిన వారి జీవితాలను
రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు. ఇందులో
మురికివాడల్లో నివసించే దృశ్యాలు మనకు కన్నీళ్ళను
పెట్టిస్తారు. ఈ నవల అతి సహజాతిసహజంగా వాస్తవ
పరిస్థితులను ప్రతిబింబించే విధంగా రచించడం విశేషం.
పొట్టకోసం ఎంత దూరమైనా, ఎలాంటి పనికైనా వెళ్ళడానికి
గ్రామీణులు సాహసిస్తారనే వాస్తవాన్ని ఈ నవలలో రచయిత
చిత్రించారు.
రచయిత మూడవ నవల పతిత. ఇది 1970లో
సహకార సమాచారం అనే వారపత్రికలో సీరియల్గా
వెలువడింది. ఒక సినిమా నటి జీవితాన్ని ప్రతిబింబించే
విధంగా ఈ నవల రాయబడ్డది. ఆ నటి పేరు రమ్య. ఆమెకు
సినిమాలలో నటించాలనే ఆసక్తి ఉంటుంది. సినిమాలలో
చిన్నచిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అందరితో సరదాగా
ఉంటుంది. తను పతిత కాకపోయినా పతిత అని ముద్ర
పడుతుంది. దీంతో ఆమెను ఎవరూ పెళ్ళిచేసుకోవడానికి
ముందుకు రారు. తోటి నటీనటులు హేళనగా మాట్లాడడం
చూసి ఆ రంగం నుంచి బయటపడి సుఖవంతమైన జీవితాన్ని
గడుపుతుంది. ఇందులోని ప్రధాన ఇతి వృత్తమిదే..
గోలకొండ పత్రికలో చెన్నకేశవులు పనిచేస్తున్నప్పుడే
ఆనాటి నిజాంకాలం నాటి ప్రజల పరిస్థితుల గురించి,
గ్రంథాలయోద్యమం గురించి మొదలైన అంశాలపై
గోలకొండ, నేత వంటి పత్రికలలో పలువ్యాసాలను
ప్రచురించారు. జర్నలిస్టుగా, రచయితగా ఎంతో పేరు
సంపాదించుకున్న ఎదిరె చెన్నకేశవులు ఆంధ్ర సరస్వత
పరిషత్ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా, ఆంధ్రమహాసభ
జిల్లా సంయుక్త కార్యదర్శిగా, రాష్ట్ర గ్రంథాలయ సంఘ
వ్యవస్థాపక కార్యదర్శిగా, హైదరాబాద్ కేంద్ర చేనేత సహకార
చూడు తెలంగాణ (143) తేజోమూర్తులు ఉండటంతో<noinclude><references/>
{{rh|తెలంగాణ |143| తేజోమూర్తులు}}</noinclude>
runrp45uncebjizftmn2q6b3zb6cca5
553260
553258
2026-04-16T07:30:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553260
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
మేనమామ కూతురును డిటెక్టివ్ మోహన్ కాపాడడం ఇందులోని ఇతివృత్తం. వీరి మరో నవలలు పొట్టకోసం,
పతిత ఈ రెండూ సాంఘిక నవలలు.
అదృశ్యహస్తం అవరాధ పరిశోధక నవల, నేత వారపత్రికల్లో 1967లో ధారావాహికంగా ప్రచురితమైంది. 1969లో పుస్తక రూపంలో వెలువడింది. ఇది సీరియల్ గా వస్తున్నప్పుడే పాఠకుల మన్ననలను పొందింది. అపరాధ పరిశోధక నవలకు ఉండవలసిన లక్షణాలన్నీ ఈ నవలలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందనే ఉత్కంఠ ఈ నవలలో అడుగడుగున తొంగి చూసింది.
ఈ నవలలో అపరాధ పరిశోధకుడు మోహన్, కథానాయకుడు భయంకర్. ఇతడు అనేక దొంగతనాలు, దోపిడీలు హత్యలు చేయించిన పచ్చి దొంగ. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా భయంకర్ అటువంటి హత్యలు,
దోపిడీలు చేస్తుంటాడు. భయంకర్ తన మేనమామ కూతురు పద్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలను
కుంటాడు. అది జరగకపోవడంతో పద్మను ఎత్తుకపోయి చెరపట్టి వివాహ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇదే ఈ
నవలలోని ప్రధానమైన ఇతివృత్తం. పద్మను కాపాడడానికి డిటెక్టివ్ మోహన్ వేసిన ఎత్తుడగ ఎలాంటిదో ఈ నవల
చదివితే తెలుస్తుంది. అయితే భయంకర్ పద్మ తనను ప్రేమిస్తుందనే తపనతోనే ఆమెను ఎత్తుకుపోతాడు. కానీ,
డిటెక్టివ్ మోహన్ ఆమెను రక్షిస్తాడు.
రచయిత ఈ నవలలోని భయంకర్ పాత్రను జాలి కలిగేటట్లు చిత్రించారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా
అతనిని పాఠకులు ఎవ్వరూ అసహించుకోలేరు. అలా ఆ పాత్రను రచయిత తీర్చిదిద్దారు. ఒక విలన్ ను జాలిగాలిపేటట్లు పాత్రను సృష్టించడం రచయిత నేర్పును తెలియజేస్తుంది.
ఈ నవలలో అరణ్యంలోని రహస్యగుహలు, పాతాళ గుహలు, ముసుగు మనుషులు మొదలైనవాటిని రచయిత
కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. ఇందులోని ముగింపు కూడా విభిన్నంగా ఉంటుంది. సహజంగా అపరాధ
పరిశోధక నవలల్లో డిటెక్టివ్ అసిస్టెంట్ పెళ్ళితో కథ ముగుస్తుంది. కానీ ఇక్కడ మోహన్ కుమార్తె వివాహంతో
ఈ నవల ముగించడం విశేషం. డిటెక్టివ్ నవలకు ఉండవలసిన అన్ని హంగులతో ఈ నవలను ఎదిరె చెన్నకేశవులు ఎంతో నేర్పుతో రచించారు.
ఎదిరె చెన్నకేశవులు రచించిన రెండవ నవల పొట్టకోసం. ఈ నవల 1968లో ప్రచురించబడింది. ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలసపోయి ఎలా జీవిస్తున్నారే అంశంగా దీనిని రచించారు.
మొదటిసారిగా నగరంలోకి వలస వచ్చిన వారి జీవితాలను రచయిత అద్భుతంగా ఆవిష్కరించారు. ఇందులో
మురికివాడల్లో నివసించే దృశ్యాలు మనకు కన్నీళ్ళను పెట్టిస్తారు. ఈ నవల అతి సహజాతిసహజంగా వాస్తవ
పరిస్థితులను ప్రతిబింబించే విధంగా రచించడం విశేషం. పొట్టకోసం ఎంత దూరమైనా, ఎలాంటి పనికైనా వెళ్ళడానికి
గ్రామీణులు సాహసిస్తారనే వాస్తవాన్ని ఈ నవలలో రచయిత చిత్రించారు.
రచయిత మూడవ నవల పతిత. ఇది 1970లో సహకార సమాచారం అనే వారపత్రికలో సీరియల్గా వెలువడింది. ఒక సినిమా నటి జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఈ నవల రాయబడ్డది. ఆ నటి పేరు రమ్య. ఆమెకు సినిమాలలో నటించాలనే ఆసక్తి ఉంటుంది. సినిమాలలో చిన్నచిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అందరితో సరదాగా ఉంటుంది. తను పతిత కాకపోయినా పతిత అని ముద్ర పడుతుంది. దీంతో ఆమెను ఎవరూ పెళ్ళిచేసుకోవడానికి ముందుకు రారు. తోటి నటీనటులు హేళనగా మాట్లాడడం చూసి ఆ రంగం నుంచి బయటపడి సుఖవంతమైన జీవితాన్ని
గడుపుతుంది. ఇందులోని ప్రధాన ఇతి వృత్తమిదే.
'''జర్నలిస్ట్ గా'''
గోలకొండ పత్రికలో చెన్నకేశవులు పనిచేస్తున్నప్పుడే ఆనాటి నిజాంకాలం నాటి ప్రజల పరిస్థితుల గురించి, గ్రంథాల యోద్యమం గురించి మొదలైన అంశాలపై గోలకొండ, నేత వంటి పత్రికలలో పలువ్యాసాలను ప్రచురించారు. జర్నలిస్టుగా, రచయితగా ఎంతో పేరు సంపాదించుకున్న ఎదిరె చెన్నకేశవులు ఆంధ్ర సరస్వత పరిషత్ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా, ఆంధ్రమహాసభ జిల్లా సంయుక్త కార్యదర్శిగా, రాష్ట్ర గ్రంథాలయ సంఘ వ్యవస్థాపక కార్యదర్శిగా, హైదరాబాద్ కేంద్ర చేనేత సహకార<noinclude><references/>
{{rh|తెలంగాణ |143| తేజోమూర్తులు}}</noinclude>
gxvk4i4pwirqvu1xfbiip7p2f329vjp
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/165
104
211378
553262
551306
2026-04-16T07:44:51Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553262
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సంఘానికి ప్రధాన వ్యవస్థాపకుడిగా పలు సేవలను అందించారు. హైదరాబాద్ రాష్ట్ర చేనేత ఉద్యమ ముఖ్యనాయకు లలో ఒకరుగా, సర్వోదయ కార్యకర్తగా ప్రజోద్యమ నాయకుడిగా, వివిధ సంస్థల బాధ్యుడిగా పనిచేసిన నిరంతర శ్రమజీవి.
సహకార సమాచారం మాసపత్రిక నిర్వహించిన సహకారోద్యమ వ్యాసాల పోటీలలో పాల్గొని వరుసగా మూడు సంవత్సరాలు బహుమతులను అందుకున్న ప్రజ్ఞావంతులు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారు తయారు చేసిన చేనేత పదకోశంకు ఊరూరా తిరిగి చేనేత పదాలను సేకరించారు. నవల, కథ రచనలో వీరికి అడివి బాపిరాజు స్ఫూర్తిగాగ, జర్నలిజంలో సురవరం ప్రతాపరెడ్డి మార్గదర్శకులు.
'''గేయకవిగా '''
ఎదిరె చెన్నకేశవులు గేయకవిగా కూడా ప్రసిద్ధులు. వీరు రాసిన పలు గేయాలను 'అర్పణ, అందరి గొడవ’ పేర్లతో తీసుకొచ్చారు. అయితే అర్పణ అనువాద గేయ సంపుటి. 'నన్నిలా ఉండనీ' అనే వచన కవితా సంపుటిని
కూడా చెన్నకేశవులు రచించారు.
అయితే ప్రసిద్ధ ఉర్దూ కవయిత్రి శ్రీమతి బాను తాహరా సయీద్ బేగం ఉర్దూ భాషలో రాసిన గేయ సంపుటి అనువాదమే ఈ అర్పణ. బాను తాహరా సయీద్ బేగం హైదరాబాద్ లో ప్రసిద్ధి గాంచిన ఉర్దూ కవయిత్రి. పలు కవిసమ్మేళనాలలో పాల్గొని తన రనకవితాధారలను విరజిమ్మింది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా పరమభక్తురాలు. బాబా భక్తబృందంలో ఈమె ఒకరు. సత్యసాయిబాబా భక్తి భావంతో ఆమె ఎన్నో మధురగేయాలను రచించారు. ఈ రణ గేయ సంపుటిలో ఎక్కువగా సత్యసాయిబాబా మీద రాసిన గేయాలున్నాయి. గజల్, నజమ్ పక్కీలలో ఈ గేయాలను రచించారు. వివిధ భక్తులలో ఆత్మ నివేదక ఒకటి. భాను తహరా ఆత్మ నివేదనకు అక్షరరూపమే ఎదిరె చెన్నకేశవులు అనువదించిడం విశేషం. ఈ అర్పణలో మొత్తం 26 గేయాలున్నాయి. ఎదిరె చెన్నకేశవులు మూలంలోని భావాలను యధాతథంగా అనువదించడం విశేషం. ఈ గేయాల్లో సత్యసాయిబాబాను స్మరిస్తూ, స్తుతిస్తూ, ప్రశంసిస్తూ రాసిన గేయాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఇందులోని హృదయవాణి, మధుర దృష్టి, చింత ఏలా?, వెన్నెల రాత్రి, మనమిద్దరం, నా ఆకాంక్ష, స్మరణ, గురుపూర్ణిమ, నిరీక్షణ, కానుక మొదలైన గేయాలు వేటికవి భిన్నంగా ఉండి మనలను రసఝరిలో ప్రవహింపజేస్తాయి. ఆనందడోలికలో విహరింపజేస్తాయి. ఆ భక్తిధార కవితా మాధురిలో మనమూ కొట్టుకుపోతాము.
ఈ గేయాల్లో సర్వసంగ పరిత్యాగి అయిన సత్యసాయిబాబా మధుర భాష శ్రవణం, దివ్యరూప స్మరణంల గురించి
రాసిన గేయాలు రచయిత భక్తి తత్పరతను తెలియజేస్తాయి.
:నా ప్రాణదాతవు నీవే
:నా హృదయ మూర్తివి నీవే
:అంటూ తన సర్వస్వం బాబానే అంటూ కీర్తిస్తారు.
భగవంతుడితో భక్తుడు తన నివేదనను ఆర్తితో పలికిన గేయాలెన్నో ఇందులో ఉన్నాయి. భగవంతుడిని ఒక మిత్రుడిగా, ప్రేమికుడిగా, సన్నిహితుడిగా భావించి రాసిన గేయాలు మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని
తలపిస్తుంది. మొదటి గేయం హృదయవాణిలో
:తారల్లో నిను చూచి తారసిల్లాను
:వసంతంలో వెదకి వసుధ గాంచాను
:నీ చూపు నా చూపు కలిసినప్పటి నుండి
:నేనెచట నుంటినో నే నెరుగనైతి
అనుభూతి ప్రధానంగా రచించబడ్డ ఆత్మాశ్రయ గేయమిది. ప్రేమకు ప్రతీకగా ఈ గేయరచన సాగింది. భగవంతుడిని సేస్నేహితుడిగా భావిస్తూ రాసిన గేయం అత్యంత స్నేహ మధురిమను వెల్లడిస్తుంది.
:నా హృదయమెంతో కలవరపడుచున్నది నేస్తం
:నా హృదయ స్పందన శబ్దం నీ చెవిలో
:గింగురువమనలేదా నేస్తం
:నా ఏకాంతం నా దుఃఖం
:నా ఆందోళన నీకు తెలియనివికావు
అంటూ హృదయం పడే ఆవేదనను ఈ గేయంలో ఎదిరె చెన్నకేశవులు భావుకతతో వెల్లడించి మన మనసులను
దోస్తారు. వెన్నెల రాత్రిని వర్ణిస్తూ చెప్పిన గేయం విరహగీతికను తలపిస్తుంది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |144| తేజోమూర్తులు}}</noinclude>
ctllgrf3olt27s5p6fo6guo0iy1bl7j
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/166
104
211379
553264
551307
2026-04-16T07:50:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553264
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><poem>
ఎంతో మనోహరమైనదీ వెన్నల రాత్రి
ఎంతో భారమైనది, నీవు లేని ఈ రాత్రి
ఉదయాన్నే నీ దర్శనభాగ్యం లభిస్తుందని
రాత్రంతా గడిపాను ఆశతో నీ కోసమని</poem>
సహజంగా వెన్నెల రాత్రి మనోహరంగానే ఉంటుంది. కానీ, నీవు లేని రాత్రి భారంగానే ఉంటుందని చెప్పిన తీరు
ప్రేయసీ ప్రియుల ప్రేమకు పరాకాష్టగా నిలిచిపోతుంది.
ప్రశాంతి నిలయంలో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాసిన గేయం.
<poem>
స్వయం ప్రకాశ స్వరూపడొస్తున్నాడు.
పలుదిశ సంతసము వెదజల్లుతున్నాడు.
ముసిముసి నవ్వులతో పుష్పమాల రాలుస్తు
గంభీరముతో ప్రేమమూర్తి వస్తున్నాడు.</poem>
అంటూ సత్యసాయిబాబాను స్వయంప్రకాశ స్వరూపుడిగా భావిస్తూ చెప్పిన ఈ గేయం బాబా మూర్తి మత్వాన్ని వెల్లడిస్తుంది. ఇంకా
<poem>
నీ ఉపదేశాలే ప్రేమను నేర్పాయి. నాకు ఈ ఇబ
నీ సందేశాలే నాలో జీర్ణించాయి ఈ ఇల</poem>
అంటూ సత్యసాయిబాబా ఉపదేశాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పారు. ఇందులో సత్యసాయిబాబా పలుకుల కోసం యావత్ ప్రపంచం అంతా ఎదురు చూస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆయన దర్శనభాగ్యం కలగడమే జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు భక్తులు. అలాంటి సత్యసాయి మీద రాసిన ఈ గేయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎదిరి చెన్నకేశవులు చద్యుని అనువాదానికి నిదర్శనం ఈ అర్పణ గేయ సంపుటి కావ్యం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |145| తేజోమూర్తులు}}</noinclude>
ap2qyoco9pa7wqup1larml8mcsqgc3s
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/167
104
211380
553288
551308
2026-04-16T09:40:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553288
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''43. ఈశ్వరీబాయి '''</p>}}
{{right|- డా॥ ముక్తేవి భారతి}}
ఈశ్వరీబాయి గారి జీవిత విశేషాలు వింటుంటే, ఒకనాడు భర్తృహరి చెప్పిన సుభాషితం గుర్తొస్తుంది.
ఒకటి నేలను నొకటి నొప్పారు పూసెఱపై ఒకటో శాకమువారణించు, ఒకటి ఉత్కృష్ణ శాల్యోదనం, ఒకటి బొంత ధరించు - ఇలా చెప్పి, కార్యసాధకుడు దుఃఖాన్ని సుఖాన్ని లెక్కపెట్టడు. అతని లక్ష్యం కార్యసాధన మాత్రమే.
ఇది ఈశ్వరీబాయి గారిపట్ల సార్థకమైందని చెప్పాలి.
ఈశ్వరీబాయిగారి జీవిత చరిత్ర రాసిన ఎం.ఎల్. నరసింహారావు గారు “సాహసమూర్తి జె. ఈశ్వరీబాయి” అన్నారు.
"ఎక్కడ ఏ మూల ఏ అన్యాయం జరిగినా పలు వేదికలపై నుండి సుమారు అర్ధశతాబ్ది క్రితం వాటిని ప్రభుత్వ
దృష్టికి తెచ్చి పరిష్కారాలు డిమాండు చేసిన ఏకైక "యాంగ్రీయంగ్ ఉమెన్ లీడర్" జె. ఈశ్వరీబాయి అన్న సుప్రసిద్ధ సీనియర్ జర్నలిస్టు టి. ఉడయవర్లు గారు ఈశ్వరీబాయి ఒక వాక్చిత్రం' అన్నారు. ఇవన్నీ ఈశ్వరీబాయి
వ్యక్తిత్వంలోని విశిష్టలను చాటి చెబుతాయి.
1918లో డిసెంబరు ఒకటవ తారీఖున ఈశ్వరీబాయి సికింద్రాబాద్ లొ ఒక సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. తండ్రి బలరామస్వామి సికింద్రాబాద్ చిలకలగూడలో వుంటూ, రైల్వే ఉద్యోగిగా జీవితం సాగించారు. తల్లి రాములమ్మ.
ఈశ్వరీబాయి విద్యాభ్యాసం ఎస్.పి.జి. మిషన్ పాఠశాలలో తర్వాత కీస్ హైస్కూలులో సాగింది. ఈశ్వరీబాయిది బాల్యవివాహం. పదమూడేళ్ళకే వివాహమయింది. భర్త దంత వైద్యుడు జె. లక్ష్మీనారాయణ. వారికి ఒక కూతురు గీతారెడ్డి, వైద్యురాలు, రాజకీయవేత్త.
ఈశ్వరీబాయి వైవాహిక జీవితం విచ్ఛిన్నమయినా, కృంగిపోలేదు ఈశ్వరీబాయి. ఆత్మస్థైర్యంతో జీవితాన్ని ఎదుర్కోవాలని నిశ్చయించింది.
సికింద్రాబాద్లో ఒక పాఠశాల దాన్ని సీతమ్మ పాఠశాల అనేవారు. ఆర్య సమాజ నాయకుడు శ్యామలరావు గారు వారి తల్లి పేరున పెట్టిన పాఠశాల అది. ఈశ్వరీబాయి అందులో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. సంపన్నుల కుటుంబాలలోని పిల్లలకు ట్యూషన్లు చెప్పారు. ఈశ్వరీబాయి బహు భాషా కోవిదురాలు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ భాషలు వచ్చు.
ఈశ్వరీబాయి జీవితంలో గొప్ప మలుపు, సాంఘిక దురాచారాలతో అణగారిపోతున్న వారిని ఆదుకోవాలనే సంకల్పమే. అదే సమయంలో, ఆమెపై గాంధీ, అంబేద్కర్ ల ప్రభావం చూపబడింది. ఆ ప్రభావం ఈశ్వరీబాయి జీవితాన్ని
అభ్యుదయ మార్గంవైపు నడిపించింది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |145| తేజోమూర్తులు}}</noinclude>
dkd7s28rh38xg9bvwe8ijo8pmwfuh5u
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/168
104
211381
553291
551309
2026-04-16T09:53:22Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553291
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అంబేద్కర్ ఉపన్యాసాలు ఈశ్వరీబాయి మనసుపై ముద్ర వేశాయి. దళిత జాతుల సముద్ధరణకి కృషి చేయాలని
బద్ధకంకములయ్యారు. అంబేద్కర్ చేసిన పోరాటాలు దళిత హక్కుల విషయంలోనూ, భారత రాజ్యాంగ రచనలోని
ఆయన అభిప్రాయాలు ఈశ్వరీబాయిలో గొప్ప ప్రేరణ కలిగించాయి.
అంబేద్కర్ ఉపన్యాసం ఒకటి ఈశ్వరీబాయిలో గొప్ప చైతన్యాన్ని కలిగించింది. “నేను జాతిలో జన్మించి పెద్దవాడినై,
జీవనయాత్ర సాగిస్తున్నానో, ఆ దళిత ప్రజల సంక్షేమానికి, అభ్యున్నతికి నా జీవితం ధారపోస్తాను. నా ఈ న్యాయ
సమ్మతమైన మార్గం నుంచి నన్ను యే దుష్టశక్తులు, ఏ విమర్శలూ మళ్ళించలేవు. నన్ను ఒక్క అంగుళం కూడా
కదల్చలేరు” అని అంబేద్కర్ అన్న మాటలు ఈశ్వరీబాయి జీవితానికి ఆదర్శప్రాయమయ్యాయి.
ఈశ్వరీబాయి రాజకీయ జీవితంవైపు అడుగులు వేసి, ముందు తరాలకి ఒక బాట వేశారు. భారతదేశంలోని బలహీన వర్గాలు, అట్టడుగున పడివున్న పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు. సమాజంలోని హెచ్చు తగ్గులు, దారిద్య్రం, మూఢ నమ్మకాలు, ఛాందస అచారాలు చూస్తున్న ఆమెకు చాలా ఆవేదన కలిగేది. ఒకనాటి మహనీయులైన సంఘ సంస్కర్తల ఆశయాలు ఆదర్శాలు సఫలమవ్వాలని ఆమె ఆశించేవారు.
ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు (సీతాఫల్ మండి) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు ఆమెకు రాజకీయాల
ప్రవేశం అదే మొదలు ఆమెకు ఏ బలమూలేదు గెలవడానికి ఒక్క ఆత్మబలం తప్ప. పురపాలక సంఘ సభ్యురాలిగా
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ, ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమని కోరారు. మురికివాడల్లో, దళిత వర్గాలు కార్మికులు
నివసించే వీధుల్లో ఆమె తిరిగి అందరినీ కలిశారు.
ఈశ్వరీబాయి గెలుపు ఆమె జీవితంలోనే పెద్ద గెలుపైంది. రాజకీయాల్లో అది తొలి అడుగే అయినా, నిజాయితీతో, సేవా భావంతో దళిత ప్రజల విముక్తి పోరాటానికి ఆమె బద్ధకంకణురాలయ్యారు. ఆ దీక్షతోనే ఆమె ప్రజాసేవా రంగంలో అడుగుపెట్టారు.
ఈశ్వరీబాయి పురపాలక సంఘ సభ్యురాలై నగర పురోభివృద్ధికి కృషి చేయడమేకాక ఎన్నో సంస్థలలో సభ్యురాలై, సేవా కార్యక్రమాలు చాలా చేశారు. మురికివాడల్లో మంచినీటి నల్లాలు వేయించటం, వీధిదీపాలు పెట్టించటం, పొట్ట కూటికై నగరానికొచ్చిన బీదలకు ఇళ్ళ స్థలాలు ఇప్పించటం మొదలైన సేవా కార్యక్రమాలు బాధ్యతగా జరిపించారు.
ఆనాటి పెద్దలు అనుభవజ్ఞులు అయిన మాడపాటి హనుమంతరావుగారు, వేంకటరామరెడ్డి గారు, సీతయ్య గుప్తా గారు మొదలైన మహనీయులను ఘటిస్తూ, వారి నుంచి ఎన్నో ఆదర్శప్రాయమైన అంశాలు తెలుసుకునేవారు.
ప్రముఖ నగరాలైన బొంబాయి, నాగపూర్లో జరిగే షెడ్యూలు కులాల ఫెడరేషన్ సభలలో పాల్గొని, అంబేద్కర్
ఆశయసిద్ధికై కృషి చేయాలనే పట్టుదల వుండాలని ఆమె ప్రచారం చేసేవారు.
1967లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆమె బడుగు బలహీన పక్షాన నిలిచి, వారి న్యాయమైన కోర్కెలకై పోరాడుతానని వారికి ధైర్యమివ్వటమే ఆమె గెలుపునకి కారణం.
ఈశ్వరీబాయి వ్యక్తిత్వం మహోన్నతమైంది. అందరి సమస్యలు, బాధలు తనవిగా భావించే సహృదయురాలు.
పరిపాలనా సంస్కరణల సందర్భంగా ఈశ్వరీబాయిలోనే అభిప్రాయాలు నిర్భయంగా చెప్పేవారు. ప్రజలనుంచి
వచ్చే విజ్ఞప్తులు, దరఖాస్తులు, ఫిర్యాదులు కనీసం అవి అందినట్టు జవాబైనా పంపించే నాథుడు లేడు అంటే
ఉద్యోగబృందం యొక్క నిర్లక్ష్యవైఖరి తేటతెల్లమవుతోంది. సాధారణ పౌరుడికి అందుబాటులో వుండే వ్యవస్థ కావాలి.
నియమ నిబంధనలు సులభతరం చేయాలి. ప్రభుత్వం రూపొందించే నియమాలు నిబంధనలు ప్రజోపయోగము
నకుకాని, ప్రజలను బంధించడానికి తప్పులు పట్టడానికి కాదనే సత్యాన్ని బ్యూరోక్రసీ గుర్తించాలని నేను కోరుతున్నాను.
(సాహనమూర్తి, జె. ఈశ్వరీబాయి ఎం. ఎల్.నరసింహారావు).
విద్యారంగంపై దృష్టి సారించారు. విద్యా ఒక వ్యాపారంగా మారిపోయిందని, పేదవారికి డొనేషన్లు కట్టే<noinclude><references/>
{{rh|తెలంగాణ |147| తేజోమూర్తులు}}</noinclude>
5npjn2ccubpaisfxhf6xmua8uqdt5qp
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/169
104
211382
553293
551310
2026-04-16T10:00:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553293
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
స్థితిలేక, ప్రభుత్వ పాఠశాలల్లో, బోధనాపద్ధతి బాగాలేకున్న, అక్కడే చేరుస్తున్నారు. పిల్లలతరపు ఆవేదన వ్యక్తం చేశారు.
భూసంస్కరణ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు ఈశ్వరీబాయి. 'అభ్యుదయ వాదులు, ప్రగతిశీలురమని చెప్పుకునే నాయకులు తమ ప్రగతి శీలభావాలను మాటల్లోకాక చేతల్లో చూపాలి' అన్నారు.
మహిళా సంక్షేమం గురించి చాలాసార్లు శాసనసభల్లో మాట్లాడారు. మహిళా సంక్షేమ శాఖలో జరిగే అక్రమాలను
నిరభ్యంతరంగా విమర్శించేవారు. గ్రామ సేవకుల ఉద్యోగాలను పర్మినెంటు చెయ్యాలని, సీనియారిటీ తెలిపే రికార్డులు, ఉద్యోగ సర్వీసు పుస్తకాలు సరిగాలేవని, "డైరెక్టర్గారి దయాదాక్షిణ్యాల మీద యావత్ సిబ్బంది ఆధారపడి వుండడం అత్యంత సోచనీయమన్నారు. షెడ్యూలు కులాల విద్యార్థుల వసతి గృహాలు సరిగా నడవటంలేదని
గుర్తించారు. 'అధికార పార్టీకి చెందిన వారికే ఈ వసతి గృహాల నిర్వాహకులుగా నియమించటం జరుగుతోందని,
నిజాయితీ సేవా భావంతో పనిచేసేవారిని మేనేజర్లుగా నియమించాలని, అప్పుడే ప్రభుత్వ పథకాలు విజయవంతం
అవుతాయన్నారు.
ఈశ్వరీబాయి తెలంగాణా ఉద్యమాన్ని బలపరిచి తెలంగాణా ప్రజాసమితి కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.
ఈశ్వరీబాయి గొప్ప వక్త. గొప్ప కార్యదక్షురాలు. సేవాతత్పరత, పేదల పాలిట కల్పవల్లి అని పలువురిచే
అభినందనలు పొందారు.
ఈశ్వరీబాయి ఒక ఉద్యమం ఒక శక్తి. ఒక చైతన్య జ్యోతి. నిరుపేదలు షెడ్యూల్డు కులాల ప్రజల ఏకైక ప్రతినిధి.
మహానాయకురాలు అని ప్రజలచే కీర్తించబడ్డారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జె. ఈశ్వరీబాయి ప్రసంగాలు అనే పుస్తకంలో 29 ప్రసంగాలున్నాయి. ప్రసంగానికి ఆ ప్రసంగమే ప్రత్యేకమైంది. ఈ ప్రసంగాలు ఈ తరానికి కానుకగా అందిస్తున్నామని, ఇది శాసనసభ్యులకు స్ఫూర్తివంతంగా ఉంటుందని ఆశించారు. సీనియర్ జర్నలిస్టు ఉడయవర్లుగారు. ఈశ్వరీబాయిగారి కుమార్తె.
డా. గీతారెడ్డిగారు వైద్యురాలిగా, రాజకీయవేత్తగా సుప్రసిద్ధురాలు.
"తనయ మాటల్లో తల్లిగారు” అనే వ్యాసంలో తల్లి గురించి మనసులో మాట చెప్పి, తల్లికి స్మృత్యంజలి ఘటించారు గీతారెడ్డిగారు.
గొప్ప సంఘ సేవకురాలిగా తల్లి తనకి ఆదర్శమన్నారు డా. గీతారెడ్డిగారు. “మా తల్లిగారి శిక్షణ మార్గదర్శకత్వం
వల్లనే నేను నా జీవితంలో ఎన్నో విజయాలు సాధించాను. కార్యసాధనలో పట్టుదల, శ్రద్ధాసక్తులు, తోటి మానవులతో,
సహచరులతో నమ్రత, వాత్సల్యం, ప్రేమభావంతో ఉన్నత గుణాలు ఆమె నుంచి నాకు అలవడ్డాయి' అని ఎంతో
ఆనందంతో చెప్పారు. 'మా అమ్మగారు నా జీవితానికి ఆదర్శవంతురాలు. నాకేకాదు, ఈ సమాజానికే ఆమె ఒక
ఆదర్శమహిళ. స్త్రీ జాతికే గర్వకారణమైన ఉన్నత వ్యక్తిత్వం ఆమెది. అత్యంత ధైర్యసాహసాలుగల గౌరీమణి అన్నారు
తల్లి గురించి గీతారెడ్డి గారు.
మనకు ఉన్నదానిలోనే సంతృప్తిచెందాలని, లేనివారికి సహాయపడాలని తల్లి చెప్తూండేవారని గీతారెడ్డిగారు తెల్పారు.
ఈశ్వరీబాయిగారి ట్రస్టు, ఈశ్వరీబాయిగారి నర్సింగ్ స్కూలు చాలా ప్రసిద్ధమైనవి.
విశ్వమానవ శ్రేయస్సును కాంక్షించిన మానవతావాది ఈశ్వరీబాయి అనగల్గడం అక్షరసత్యం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |148| తేజోమూర్తులు}}</noinclude>
jqgy5lpmf6c4zfpyonfd8r3slvmvtn0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/170
104
211383
553295
551311
2026-04-16T10:13:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553295
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''44. ఈటూరి లక్ష్మణరావు '''</p>}}
{{right|- ఆచార్య వెలుదండ నిత్యానందరావు}}
జీవితం వడ్డించిన విస్తరి కాదు. అవకాశాలు పొంది అందలాలెక్కిన ప్రతివారు గొప్పవారు కాదు. అందలాలెక్కని వాళ్లంతా పనికిమాలినవారూ కాదు. కొంతమందికి సకాలంలో అవకాశాలు అందివస్తాయి. చుట్టూ ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. జనం గుర్తిస్తారు. ప్రయోజకులుగా ముద్రపడుతుంది. మరికొందరు చాలా సాదాసీదాగా జీవితం గడుపుతారు. పెళ్ళిల్లు, చేసుకొంటారు. ఉద్యోగాలు చేస్తారు.
కాలగర్భంలో కలిసిపోతారు. అలాంటి ఒక సాదాసీదా మనిషే ఈటూరి లక్ష్మణరావు గారు. ఈటూరి లక్ష్మణరావు గారు పుట్టినపుడు దేవదుందుభులు మోగలేదు. సరికదా చనిపోయినపుడు కూడా పత్రికల్లో వార్తాంశం కాలేదు. ఏదీ
కానపుడు ఆయననెందుకు తలుచుకోవడం అంటే తెలంగాణ తన ఆస్తిత్వాన్ని వెతుక్కుంటున్న క్రమంలో తన కడుపున
పుట్టిన పిల్లలు ఎలా నిరాదరణకు గురయ్యారో కథలు కథలుగా నమోదు చేయాల్సిన చారిత్రక దశలో వస్తువులవు
తున్నారు కనుక,
జనగామకు దాదాపు ఇరవై మైళ్ల దూరంలో దేవరుప్పల అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కరణాలున్నారు.
లక్ష్మీనారాయణరావు, వెంకట రామనర్సమ్మ దంపతులకు పుట్టిన వ్యక్తే మన లక్ష్మణరావు. వీరి గోత్రం కాశ్యపస
ఇంటిపేరు ఈటూరి. ఈటూరి లక్ష్మణరావు తన 48వ యేట 14 జూలై, 1965న కన్నుమూశారు. ఇది నిర్ధారణగా
దొరుకుతున్న ఆధారం. కనుక 1917లో పుట్టి ఉంటారు. లక్ష్మణరావు ప్రాథమిక విద్యాభ్యాసం దేవరుప్పలలోనే
ముగిసింది. స్థానిక ఖాన్గిబళ్లలో సాతాని పంతులు, మరో తురక పంతులు అలీఫ్ బేతో పాటు ఒంట్లు, ఓనమాలు,
లేక పద్యాలు సిద్ధం నమ అని నేర్పించి ఉంటారు. ఏకసంథాగ్రాహి కావడం వల్ల అచిరకాలంలో దేవరుప్పల
గ్రామంలోని చదవంతా లక్ష్మణరావు చదివేశారు.
పై తరగతుల కోసం హనుమకొండలో ఉన్న అక్కాబావల చెంతకు చేరారు. ఆ బావగారి పేరు వనం కేశవరావు. వారు ఆ కాలంలో పేరుమోసిన లాయర్. హనుమకొండలో ఆరవ తరగతి నుంచి చదివారు. హనుమకొండలో రాజనరేంద్ర భాషా నిలయం ఉంది. అది తెలంగాణలో రెండవ గ్రంథాలయం. 1904లో స్థాపించబడింది. మొదటి గ్రంథాలయం హైదరాబాద్ లొని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం. లక్ష్మణరావు హైస్కూలు చదువులు చదువుతూనే ఆ గ్రంథాలయంలోని ఒక పుస్తకం కూడా మిగల్చకుండా చదివారంటే ఆశ్చర్యం కలగకమానదు. లక్ష్మణరావులో చిన్ననాడు మొదలైన పుస్తక పఠన వ్యసనం చివరిదాకా కొనసాగింది. పెద్దయ్యాక ఉద్యోగం వచ్చాక కూడా చదువు మానలేదు. ఏదో ఒకరంగం పుస్తకాలకే పరిమితం కాలేదు. తత్త్వశాస్త్రం, కాల్పనిక సాహిత్యం, సామాజికం అన్ని అభిమాన అంశాలే అయ్యాయి. అద్వైతం,<noinclude><references/>
{{rh|తెలంగాణ |149| తేజోమూర్తులు}}</noinclude>
ora4hki5wi97oe3vckf7a05rd74s7m1
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/171
104
211384
553297
551312
2026-04-16T10:27:14Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553297
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
విశిష్టాద్వైతం వీటితో పాటు, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, వీరశైవం గ్రంథాలు కూడా చదివేవారు. భిన్నభిన్న మతాల
అంతర్యాలను తులనాత్మకంగా పరిశీలించి విశ్లేషించడం వీరి ప్రవృత్తి. చదివిన తర్వాత ఆ పుస్తకాలను సొంతానికి
కొనుక్కునే వారు. అలా జీవిత చరమాంకంలో ఓ పెద్ద లైబ్రరీ సమకూరింది.
హనుమకొండలో ఆనాడు ఇంటర్మీడియెట్ సెంటర్ కూడా లేదు. హైదరాబాదుకు వచ్చి పరీక్షలు రాయాల్సి వచ్చేది. ఆనాడు ఇంటర్మీడియెట్ను ఎఫ్.ఎ. (ఫెలో ఆఫ్ ఆర్ట్స్) అనేవారు. అలా ఇంటర్ అయ్యాక లక్ష్మణరావు హైదరాబాద్ కు మకాం మార్చారు. 1943లో బి.ఎ.లో చేరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గుండెకాయ అనదగిన ఆర్ట్స్ కాలేజీలోనే బి.ఎ. క్లాసులు కూడా జరిగేవి. ఆ రోజుల్లో బి.ఎ. ఈనాటి లాగా మూడేళ్లు కాదు. రెండేళ్లే. కాస్త ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబమే కానీ లక్ష్మణరావు మెతక ఆయన తండ్రి అప్పటికే స్వర్గస్తులయ్యారు. పాలెవాళ్లు నెత్తిన
టోపీ పెట్టారు. ఫలితంగా లక్ష్మణరావు నిరాచారులై పోయారు.
పూనుకూరి రాఘవరావు అనే వదాన్యుడైన ఒక వెలమదొర ఆ రోజుల్లో హైదరాబాద్లో ఉండేవారు. ఆయనది లక్ష్మక్కపేట. కరీంనగర్లో లక్ష్మక్కపేట ప్రాంతంలో తొలిసారిగా వడ్లగిర్నీ పెట్టిన వ్యక్తి ఆయన. నాంపల్లిలో వారిది విశాలమైన, సౌకర్యవంతమైన భవనం. వాళ్ల పిల్లలకు ట్యూషన్స్ చెప్పేవారు. అందువల్ల వారింట్లోనే నెలకు ఐదు రూపాయల కిరాయితో లక్ష్మణరావు ఉండటం మొదలు పెట్టారు. అలా స్వయంకృషితో అవసరాలు తీర్చుకోవలసి వచ్చేది.
తండ్రి లేని సుతుడు ధూళికన్నా చులకన గదా! లక్ష్మణరావుకు వంట రాకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఉడికీ ఉడకని అన్నం, అర్ధాకలి. ఊరి నుంచి తల్లి కట్టించిన తినుబండారాలతో కాలం గడుపుకొనేవారు. ఒకరోజు
తిండిలేక ఆకలితో ఆర్ట్స్ కాలేజీలో 'చక్కర్ వచ్చి పడిపోయారు.
సహాధ్యాయుల్లో ఒకరు మనోహరరావు వెంటనే లక్ష్మణరావుకు ఉపచారాలు చేసి హాస్టలుకు తీసుకుపోయి అన్నం పెట్టించారు. అలా అనాడు ప్రాణం కాపాడిన మనోహరరావుతో ఆత్మీయానుబంధం జీవితాంతం కొనసాగింది. ఈ మనోహరరావు ఇంటిపేరు తెలియదు. కరీంనగర్ ప్రాంతానికి చెందిన వెలమదొరు. మెల్లకన్నా, ఒంటికన్నా ఉండేది. సృవతుంగ హైస్కూలులో అధ్యాపకులుగా పనిచేశారని విన్నాను. లక్ష్మణరావు పరిస్థితి చూసి దేవరుప్పుల నుంచి తల్లి హైదరాబాద్ కు రాకతప్పలేదు.
ఆప్యాయతతో వంటచేసి పెడుతుంటే సుఖంగా తిని కాలేజీకి పోవడం మొదలుపెట్టాడు. లక్ష్మణరావు డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఆయన మేనల్లుడు సి. లక్ష్మీనరసింహారావు అన్వర్ ఉలుం స్కూల్లో నాల్గవ తరగతిలో చేరారు. వారిప్పుడు ప్రముఖ వైద్యులు. తన ఈనాటి అభ్యున్నతికి ఆనాడు తన మేనమామ చూపిన ఆదరాభిమానాలే కారణమని ఎంతో భక్తిభావంతో ఈ వివరాలందించారు. ఆ విధంగా వెంకటరామ నర్సమ్మ (తల్లి), లక్ష్మణరావు (కొడుకు), సి.లక్ష్మీనారాయణరావు (మేనల్లుడు) ముగ్గురు ఆ చిన్న ఇంట్లోనే కాలం వెళ్లబుచ్చేవారు.
లక్ష్మణరావు 1945లో బి.ఎ. ఉత్తీర్ణులయ్యారు. ఉర్దూ రాజ్యమేలుతున్న కాలంలో నిజాం ప్రభుత్వం తెలుగులో కూడా ఎం.ఎ. చేయవచ్చునని 1940లో ఆర్డర్ పాస్ చేసింది. అప్పటికి వందేమాతరం ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఉర్రూతలూగించింది. నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించింది. మహాఘనత వహించిన నిజాం ప్రభువు అధిక సంఖ్యాకులైన హిందువులను ప్రసన్నులను చేసుకోవడానికి ఖర్చులేని రద్దు అయిన ఎం.ఎ. తెలుగుకు అనుమతించారు.
రాయప్రోలు సుబ్బారావు ప్రఖ్యాత తెలుగు కవి. 1919 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖకు
అధ్యక్షులు. మొదట్లో తెలుగు శాఖలో పాఠప్రవచనాలు లేవు. లైబ్రరీలో పుస్తకాలకు సూచీలు తయారు చేసేవారు. 1926 ప్రాంతాల్లో డిగ్రీ మొదలైంది. ఉర్దు మీడియమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1988లో వందేమాతర
ఉద్యమం కారణంగా డిగ్రీ చదువుతున్న పల్లా దుర్గయ్య లాంటి వారెందరో కాలేజీ వదిలిపెట్టి మహారాష్ట్ర వెళ్లారు.
పల్లా దుర్గయ్యకు అక్కడ ఆరోగ్యం సరిపడలేదు. తిరిగి వచ్చారు. ఒక సంవత్సరం వృథా చేసుకుని డిగ్రీ పూర్తిచేశారు.
అదే సంవత్సరం తెలుగులో ఎం.ఎ. చేయవచ్చునని విశ్వవిద్యాలయం అనుమతించింది. పల్లాదుర్గయ్య<noinclude><references/>
{{rh|తెలంగాణ |150| తేజోమూర్తులు}}</noinclude>
g3qc2f1joijpm9z6pclj1lgq3xwoht0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/172
104
211385
553298
551313
2026-04-16T10:41:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553298
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
రాయప్రోలు ఆశీస్సులతో 1940లో ఎం.ఎ.లో చేరారు. రాయప్రోలు వారు తెలంగాణ పొలిమేరలు దాటినప్పుడు
తెలుగు భాష ఔన్నత్యం, స్వాతంత్య్రొద్యమం, దేశభక్తి లాంటి మాటలు మాట్లాడేవారు. కవిత్వం రాసేవారు. కానీ
తెలంగాణ ప్రాంతంలో నిజాం స్తోత్రం చేయక తప్పేది కాదు. అప్పటికే తెలుగునేల అంతటా కవిగా పేరు రావడంతోనూ, ఉర్దూ ఆధిపత్యానికి నూకలు చెల్లుతాయన్న విశ్వాసం బహుశా కుదరకపోవడంతో రాయప్రోలు వారు ఒక
నిస్పృహలో తెలుగు శాఖను పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణలో మమేకం కాలేదు. విద్యార్థులను ప్రోత్సహించలేదు. మడుపు శేషారావు (కవి, ఆచార్య ఎం. కులశేఖరగారి అన్నగారు), జువ్వాడి గౌతమరావు (సోషలిస్టు నాయకులు) లాంటి వారు ఎం.ఎ. తెలుగు చేయాలన్న కోరిక తీరక వేరే చదువుకోవలసి వచ్చింది.
పల్లాదుర్గయ్య 1942లో పాసైన తొట్టతొలి ఎం.ఎ. తెలుగు విద్యార్థిగా స్థిరకీర్తి సంపాదించుకున్నారు. డాక్టరేటు చేయడం వల్ల, లెక్చరర్ కావడం వల్ల పల్లాదుర్గయ్య పేరు అందరికీ తెలిసింది. ఈ రెండవ విద్యార్థి అయిన లక్ష్మణరావును గురించి మాత్రం ఎక్కడా రికార్డు కాలేదు. 1945 ఏప్రిల్లో లక్ష్మణరావు బి.ఎ. విజయవంతంగా పూర్తిచేసుకొని ఎం.ఎ. (తెలుగు) లో చేరారు. తత్ఫలితంగా 1947లో తృతీయ శ్రేణిలో ఎం.ఎ. తెలుగు పట్టా పొంది బయటపడ్డారు. రాయప్రోలు వారి కుమారుడు రాయప్రోలు మార్తాండం కూడా అదే సంవత్సరాల్లో చదువుతుండడం వల్ల అతనికి పోటీ వస్తానని తృతీయ శ్రేణి ఇచ్చారని లక్ష్మణరావు జీవితాంతం ప్రస్తావన వచ్చినపుడల్లా చెప్పేవారట. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1951 కి ముందున్న రికార్డులన్నీ ఉర్దూలోనే ఉన్నాయి. 1942లో ఉత్తీర్ణుడైన పల్లాదుర్గయ్య, 1947లో ఉత్తీర్ణుడైన లక్ష్మణరావు, 1949లో ఉత్తీర్ణుడైన కోవూరు గోపాలకిషన్ రావు పేర్లు, మార్కులు, రూల్ నెంబర్ లాంటి వివరాలన్నీ మనకు ఉర్దూలోనే తప్ప ఆంగ్లంలో దొరకవు. తెలుగులో ఇప్పటికీ దొరికే ముచ్చటే లేదు. ఆ రోజుల్లో ఎం.ఎ. తెలుగును ఎం.ఎ. తెలింగ్ అని ఉర్దూలో వ్యవహరించేవారు. ఈరోజుల్లో లాగా సెమిస్టర్ పద్ధతి గానీ, ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు విడివిడిగా పరీక్షలు రాసే విధానం గానీ లేదు. రెండు సంవత్సరాలకు కలిపి ఒకేసారి పరీక్షలు రాయాలి. మొత్తం ఎనిమిది పేపర్ల పద్యం - గద్యం, నాటకం, ప్రాచీనాధునిక కవితలు, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రభాషా చరిత్ర, వ్యాకరణం, అలంకార శాస్త్రం, ప్రాచీనాధునికాంధ్ర సాహిత్య చరిత్ర, ప్రతీ పేపరుకు నూరు మార్కులు చొప్పున మొత్తం 800 మార్కులు. 1947 ఏప్రిల్లో ఎం.ఎ. తెలుగు పరీక్ష రాసిన, ఉత్తీర్ణుడైన ఏకైక విద్యార్థి లక్ష్మణరావు. వీరి రోల్ నెంబర్ 130. వరుసగా 8 పేపర్లలో 27, 37, 52, 44, 61, 40, 55,42, 358. తృతీయ శ్రేణి. ఉస్మానియా తెలుగు శాఖలోనే అధ్యాపకునిగా చేరిఉంటే లక్ష్మణరావు గారి వైదుష్యానికి మంచి గుర్తింపు లభించి ఉండేది. కానీ తృతీయ శ్రేణి మనిషి కావడంతో అధ్యాపక వృత్తికి అనర్హుడై నిజాం ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో క్లర్కుగా చేరారు.
తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ క్షుణ్ణంగా వచ్చినవారు కావడం వల్ల అచిరకాలంలోనే నిజాం రాష్ట్ర అనువాద
శాఖలో ఉద్యోగంలో చేరారు. దాదాపు పదిహేడేళ్లకు పైగా ఉద్యోగం చేసి ఉంటారు. డిప్యూటీ డైరెక్టర్ గా ఎదిగారు. ఇంతలో చరిత్ర మలుపు తిరిగింది. ఆంధ్ర తెలంగాణ కలిసిపోయాయి. మదరాసు నుంచి వయా కర్నూలు మీదుగా
ఆంధ్ర అనువాదశాఖ హైదరాబాద్ లోకి అడుగుపెట్టింది. నిజాం ఆంధ్ర అనువాద శాఖలు విలీనమయ్యాయి. వయస్సులో పెద్దవారు, కవిగా సుప్రలక్ష్మణరావుసిద్ధులు, ఆంధ్ర అనువాద శాఖ సంచాలకులు అయిన బోయి భీమన్న
ఉమ్మడి అనువాద శాఖకు సంచాలకులయ్యారు. లక్ష్మణరావు యథావిధిగా ఉపసంచాలకులుగా కొనసాగారు. లక్ష్మణరావు సహోద్యోగుల్లో బోయి భీమన్న, జె. వి. నరసింగరావు తోడల్లుడు కె.వి. లింగారావు, మంత్రి శ్రీనివాసరావు,
బషీరుద్దీన్ లాంటివారు నేడు లేరు. ఎస్.రమణారావు, గోవిందరాజు రామకృష్ణారావు, దేశరాజు వెంకట కృష్ణారావు.
హైమవతీ బోయి భీమన్న గారులు నేటికీ చల్లగా, ఆరోగ్యంగా ఉన్నారు. లక్ష్మణరావు గతించిన యాభై ఏళ్ల తరువాత కూడా వారంతా లక్ష్మణరావు సొమ్యుడు, నెమ్మది మనిషి, అపార పుస్తక పఠన పిపాసి అని ఆప్యాయంగా స్మరించు
కుంటున్నారు.
లక్ష్మణరావు ఎం.ఎ. చదువుతున్న కాలం భారత స్వాతంత్య్రొద్యమం, నిజాం వ్యతిరేకోద్యమం, ప్రగతిశీల<noinclude><references/>
{{rh|తెలంగాణ |151| తేజోమూర్తులు}}</noinclude>
bmx0nke7bjckvyj0m8lwdw91wkkytfg
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/173
104
211386
553299
551314
2026-04-16T10:44:50Z
A.Murali
3019
553299
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భావాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాలం. అందునా
అపారమైన పుస్తక పఠన వ్యసనం కలిగిన లక్ష్మణరావులో
ఆధునిక భావాలు ఉండడంలో ఆశ్చర్యపోవలసిన పనేమీ
లేదు. ఎం.ఎ. రెండో సంవత్సరం చదువుతున్న 1944లో
మామిడాల గ్రామవాస్తవ్యులు బోయినపల్లి లక్ష్మీనరసింహారావు
కూతురు లలితను పెళ్లాడారు. ఈ రెండు కుటుంబాలకు
అనుసంధానకర్తగా వ్యవహరించి పెళ్లి జరగడానికి
కారణమైన వ్యక్తి లక్ష్మణరావు డిగ్రీ సహాధ్యాయి మనోహరరావు
గారే. వీరిని గురించి ఇంతకుముందే ప్రస్తావించాను. శ్రీమతి
లలిత బాలవితంతువు కావడం వల్ల లక్ష్మణరావు తల్లికి,
బంధు వర్గానికి ఈ పెళ్లి నచ్చలేదు. లక్ష్మణరావు సహనంతో,
సౌజన్యంతో అందరినీ ఒప్పించారు. శ్రీమతి లలిత తన
మంచితనంతో మెప్పించారు. స్వయంకృషితో ఓ స్థాయికి
ఎదిగిన లక్ష్మణరావు తోబుట్టువులకు, వారి సంతానానికి
అన్నివిధాలా చేయూతనిచ్చారు. భార్య చెల్లెళ్లకూ ఎంతో
సాయం చేశారు. లక్ష్మణరావుకు సంతానం కలుగలేదు. ఒక
మరదలి కొడుకును దత్తత తీసుకున్నారు. వారి పేరు
రాజేంద్రప్రసాదు. వారిప్పుడొక ఉన్నతోద్యోగంలో
రాణిస్తున్నారు. లక్ష్మణరావుకు పెళ్లయిన తరువాత పుట్టిన
చిట్టి మరదలు సుజాత అంటే ఎక్కువ అభిమానం. ఆమెను
చదివించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్పారు. పెళ్లి జరగడంలో
సహకరించారు. ఆ సుజాత గారు నేడు 70 ఏళ్ల వ్యక్తి.
అధ్యాపకురాలిగా పనిచేసి రిటైరయ్యారు. తనను చిన్నప్పుడు
చదివించి, విద్యాబుద్ధులు నేర్చి తండ్రి లాంటి బావగారి
పట్ల అపారమైన కృతఙ్ఞతాభావాన్ని, భక్తిభావాన్ని ఇప్పటికీ
వ్యక్తీకరిస్తారు. అకస్మాత్తుగా గుండెపోటుతో లక్ష్మణరావు
1965, జులై 14న తన 48వ యేట అస్తమించారు.
కుటుంబం తుఫానులో చిక్కుకున్న నావలాగా విలవిల
లాడింది. ఆ విపత్కర కాలంలో శ్రీమతి లలితా లక్ష్మణరావును
ఆదరించి అక్కున చేర్చుకొని 2002లో ఆమె స్వర్గస్థులయ్యే
దాక బాసటగా నిలిచిన వారు శ్రీమతి సుజాతగారు. వీరికి
తోడునీడగా నిలిచి సహకరించిన వారు శ్రీవారు నర్సింగరావు
గారు. శ్రీమతి సుజాత గారు లక్ష్మణరావు ఫొటోలివ్వడమే
గాక ఎన్నో విశేషాలు చెప్పి ప్రోత్సహించారు. మలక్ పేటలోని
కాలడేరా కాలనీలోని ప్రభుత్వ క్వార్టర్స్ చిన్నగా, ఇరుకుగా
ఉండడంతో లక్ష్మణరావు ఆఫీసులోనే ఐదారు అల్మారాల
నిండా పుస్తకాలు పెట్టుకొన్నారు. వారు అస్తమించాక
అల్మారాలతో సహా ఆ పుస్తకాలన్నింటినీ శ్రీకృష్ణరాయాంధ్ర
భాషా నిలయానికి ఇచ్చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎం.ఎ.
పట్టా పొందిన రెండవ విద్యార్థి అయిన లక్ష్మణరావు అప్పుడే
తెలుగు శాఖలో అధ్యాపకునిగా అవకాశం వచ్చి ఉంటే
వెలిగిపోయేవారు. ఈ మాత్రం వివరాలయినా తెలుస్తున్నా
యంటే లక్ష్మణరావు గారి మేనల్లుడు 83 ఏళ్ల ప్రముఖ
వైద్యులు సి. లక్ష్మీనరసింహరావు, మరదలు శ్రీమతి సుజాత
కట్టుకున్న పుణ్యం. మా గురువర్యులు ఆచార్య ఎం. కుల శేఖర
గారు అందించిన ఆధారం. ఆచార్య బి. రామరాజు 1951లో
ఎం.ఎ. పూర్తిచేశారు. వారు చాలాసార్లు తాను రెగ్యులర్
విద్యార్థుల్లో ఏడవ విద్యార్థినని, ప్రైవేటు విద్యార్థులను కూడా
కలిపితే వదవ వ్యక్తినని చెప్పేవారు. మరి వారెవరో
ఇప్పటికైనా తెలుసుకోవలసిన అవసరం లేదా ? తెలంగాణ
సాకారమయ్యాకనైనా చీకటికోణంలో దాగిన ఇలాంటి వారిని
స్మరిద్దాం.
అంటుంటే తెలంగాణ 152 తేజోమూర్తులు kond<noinclude><references/>
{{rh|తెలంగాణ |152| తేజోమూర్తులు}}</noinclude>
q8bsqfzwa84whcvk31rq2zbjta44fon
పుట:పటం కతలు.pdf/148
104
212044
553173
552566
2026-04-15T15:46:48Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
553173
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = పటం_కతలు.pdf
|Page = 148
|bSize = 450
|cWidth = 360
|cHeight = 92
|oTop = 38
|oLeft = 39
|Location = center
|Description =
}}
{{center|{{p|fs150}}'''15. పూజరి పటం కత '''</p>}}
దక్కన్ పీఠభూమిలో గోండ్వాన ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. అదిలాబాద్ జిల్లా నుండి అటువైపు సాత్పురా పర్వతాల వరకు అనేక గిరిజన సమూహాలు గొండ్వాన అడవులలో మనుగడలో ఉన్నాయి. వీరిలో గోండు గిరిజనులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఆదిమ గిరిజన తెగ గోండులకు సంబంధించిన వారే కోయ. కోలాం, నాయకపోడు, ప్రధాన్, తోటి తదితర తెగలుగా పరిశోధకులు గుర్తించారు. వీరిలో గోండు, కోయగిరిజనులు కోయిత్తూర్ భాషా కుటుంబానికి చెందిన వారు కాగా కోలాంలు, నాయకపోడు గిరిజనులు మాట్లాడే భాషకు దగ్గరి సంబంధం ఉంది. కాని ఏ కారణంగానో నాయకపోడు గిరిజనులకు వారి భాష వినియోగంలో లేదు. నాయకపోడు గిరిజనులు తెలుగుభాషనే మాట్లాడుతూ ఉంటారు.నాయకపోడు గిరిజనులనే పద్మనాయక గిరిజనులని అంటారు. వీరు ఒకప్పడు అదిలాబాద్ లొ ఉన్న వారే అయినప్పటికీ తరువాత కాలంలో<noinclude><references/></noinclude>
t6xns4nuanp7nbaii5tq9vew076nnin
పుట:పటం కతలు.pdf/149
104
212045
553174
552567
2026-04-15T15:48:27Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
553174
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = పటం_కతలు.pdf
|Page = 149
|bSize = 450
|cWidth = 440
|cHeight = 389
|oTop = 9
|oLeft = 6
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
fos4mst3zf8g76wqadrsc9sip9jk6wq
పుట:పటం కతలు.pdf/150
104
212046
553175
552568
2026-04-15T15:55:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553175
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||133}}</noinclude>
వరంగల్, ఖమ్మం, భద్రాచలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలోని అడవులలో ఉంటున్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అదిలాబాద్ అడవులు ఏలాంటి ప్రాముఖ్యత గలవో అదే విధంగా గోండు, కోలాం నాయకపోడు గిరిజనులు కూడా అలాంటి వైవిధ్యభరితమైన సామాజిక సాంస్కృతిక జీవితం గలవారే. గోండు గిరిజనులు ఇప్పటికీ అదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా నివసిస్తున్నారు. అదిలాబాద్ లొ గోండులతో పాటుగా ఉంటున్న ఆదిమ గిరిజన తెగలలో గోండులకు కథలు చెప్పే ప్రధాన్, తోటి గాయకుల తెగలు ఉన్నాయి. గోండులను ఆశ్రయించి ఉంటూ వారికి పూజారులుగా ప్రధానులు లేదా పర్దాన్లు ఉంటున్నారు. ప్రధానులను పటాడి అని కూడా అంటారు. పటాలు గోండులు రాజులుగా ఉన్న సమయంలో మంత్రులుగా పనిచేశారని అంటారు. ప్రస్తుతం గోందుల వంశచరిత్రలు పాడుతుంటారు. తోటి వాళ్ళు కూడ గోండుల కులపురాణ కథలు పాడుతారు.
అదే విధంగా గోండుల మాదిరిగానే నాయకపోడు గిరిజనులు కూడా ఒకప్పడు రాజ్యాలు పాలించారని వారి కథలను బట్టి తెలుస్తుంది. నాయకపోడు గిరిజనులకు కూడా కొర్రాజులు, పూజరులు, గురువులు (కోలుకానివాడు) అనబడే
కథాగాయకులు ఉన్నారు. కొర్రాజులు పూర్వం ఒక ప్రత్యేక కథగాన సాంప్రదాయానికి చెందిన వారు. కాని ప్రస్తుతం నాయకపోడు గిరిజనుల లాగే అదిలాబాద్ జిల్లా నుండి వలసవచ్చిన తోటివారు ములుగు కటాక్షపూర్లో ఉంటూ కొర్రాజులుగా
నాయకపోడులకు కతలు చెప్తారు. వీరు నాయకపోదులు ఏవిధంగా పుట్టిందీ, లక్ష్మీదేవి వారిని ఏ విధంగా జీవించమని చెప్పిందీ, కొర్రాజులు పూజరివారు ఏ విధంగా ఆవిర్భవించిందీ చెప్తారు. వీరు చెప్పే పద్మనాయక వృత్తాంతం కథను
బట్టి, ద్వాపరయుగంలో భూమిపై రాక్షసులు పెట్టే బాధలు భరించలేక భూదేవి శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకొనగా శ్రీమహావిష్ణువు తాను శ్రీకృష్ణుడిగా అవతరించి లోకకళ్యాణం చేస్తానని అంటాడు.
ఈలోపున లక్ష్మీదేవిని సాంబవుని పట్నంలో అవతరించి తన కోసం ఎదురు చూడమని చెప్తాడు. ఆ విధంగా సాంబవుని పట్నం (శ్రీశైలం)లోని వెండిగుడిలో శ్రీమహాలక్ష్మీదేవి అవతరించినప్పడు లక్ష్మీదేవి చెమట చుక్కలు పద్మములపై పదగా
పద్మనాయకులు జన్మించారట. ఆ తరువాత లక్ష్మీదేవి ఆజ్ఞమేరకే ఈ ఐదుగురు సోదరులు అడవులలో పోడు వ్యవసాయం చేసి జీవిస్తారు. పద్మనాయక గిరిజనులపై<noinclude><references/></noinclude>
2q4e0y7oz049op7k3ld9y8q5h0hh9j5
పుట:పటం కతలు.pdf/151
104
212047
553176
552569
2026-04-15T16:00:04Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553176
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|134||పటం కతలు}}</noinclude>
పన్ను విధించడానికి పొందురాజు సైన్యాన్ని పంపుతాడు. ఆ విధంగా పాండవులతో వీరికి సంబంధం ఏర్పడుతుంది. అలాంటి పురాతన పౌరాణిక చరిత్రగల పద్మనాయకులు ఇప్పుడు నాయకపోడులుగా పిలువబడుతున్నారు. ఒకప్పడు
అదిలాబాద్ జిల్లాలో ఉన్న నాయకపోడు గిరిజనులు ఆ తరువాత మాత్రం గోదావరి నది వెంట విస్తరిస్తూ వరంగల్, ఖమ్మం జిల్లాలోని అడవులలో ఉంటున్నారు. నాయకపోడులు (పద్మనాయకలు) అనే ఈ గిరిజన తెగకు ఆశ్రితులుగా కొర్రాజులు, పూజారి వాళ్ళు మిరాశి కులంగా ఉంటూ వీరికి సంబంధించిన కతలు చెబుతున్నారు. పద్మనాయకులకు ఆశ్రితులైన వీరిని వరంగల్ జిల్లాలో పూజారి వారని పిలుస్తున్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో వీరిని గురువులని, కరీంనగర్ జిల్లాలో అయితే కోలకాని వారని అంటారు. భూపాలపల్లి జిల్లాలోని నేరేడుపల్లిలో రాంపురం, అడవికమలాపురం గ్రామాలలో ఉంటున్నారు.
'''ప్రదర్శనా కతలు '''
వీరు నాయకపోడు గిరిజనుల పుట్టుకకు సంబంధించిన కులపురాణమైన పద్మనాయక వృత్తాంతం చెప్తారు. దీంతో పాటుగా మహాభారతంలోని జూదపర్వం, విరాటపర్వం, పాండవ వనవాసం, గయోపాఖ్యానం, శశిరేఖ పరిణయం, కీచకవధ,
సుభద్రా కళ్యాణం, ఉత్తరగోగ్రహణం, కర్ణుని పెళ్ళి, సహదేవకళ్యాణం మొదలైన కథలు చెబుతారు. వ్యాసభారతంలోని మహాభారతం, నన్నయ తిక్కన ఎర్రన్న అనువదించిన తెలుగు మహాభారతం కథకు వీరుచెప్పే మహాభారతం కథలకు
ఎంతో వైవిధ్యం కన్పిస్తుంది. కర్ణుని పెళ్ళి చేయడానికి ధర్మరాజు ఎంతో కృషి చేస్తాడు. అదే విధంగా భీష్ముడు, కర్ణుడు, అర్జునుడితో కలిసి నందిగామరాజుతో యుద్ధం చేస్తారు. కాబట్టి ఎంతో అపురూపమైన సాహిత్య విస్తీర్ణత వీరి కథలలో
కనపడుతుంది. వీటితో పాటు ఉల్ఫా కథలను కూడా చెపుతారు.
'''పూజరికుల పుట్టుక '''
పాండురాజు మాద్రిని కల్యాణమాడి వచ్చేటప్పడు దారిలో శబ్దభేది బాణం ఉపయోగించడం వల్ల తనకు తెలియకుండానే లేడి దంపతులలో ఒకటి చనిపోతుంది. మరొక లేడి పాండురాజును శపిస్తుంది. లేడిని కొట్టిన శాపం నుండి తప్పించుకోవడానికి సురుసుంగ పర్వతాన తపస్సు పడతాడు. ఆ శాపవిమోచనం కావాలని పాండురాజు<noinclude><references/></noinclude>
j4bqfvbv1ptytld0ksllp2mrbdrngxp
పుట:పటం కతలు.pdf/152
104
212048
553177
552570
2026-04-15T16:07:16Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553177
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||135}}</noinclude>
తపస్సు చేస్తుండగా అతని భార్యలు కుంతీదేవి, మాద్రిలు ఆ ఎండలో భర్తతో పాటు తపస్సు పట్టలేక పోతారు. "నాధా ప్రాణేశ్వరా మేము ఎక్కడన్న పోయి ఏ దేవునికన్నా పూజలు చేసి సంతానం పొందుతాం" అని భార్యలిద్దరూ పాండు రాజును అడుగుతారు. “సరే భామలారా అలాగే వెళ్ళండి", అంటాడు పాండురాజు. కుంతీదేవి, మాద్రిలు ఒక శివాలయానికి వెళ్ళి దేవాలయంలో పేరుకున్న ఏనుగ పల్లేరుకాయలు ఎత్తిపోసి శుభ్రం చేస్తారు. నీటితో శివలింగాన్ని శుద్ధిచేసి వాళ్ళు పూజలు చేస్తారు. కుంతి, మాద్రిలు ఆ విధంగా శివున్ని పూజించి నిద్రపోతారు. అప్పడు శంకరుడు
కుంతిదేవి కలలోకి వచ్చి "అమ్మా చెల్లెలా కుంతీదేవి నీవు ఇక్కడ ఎన్ని పూజలు చేసినా వ్యర్ధమే కాని ఒక్కమాట విను నీకు సంతాన భాగ్యం లేదు కాని కొంత కృషి చేస్తే నీకు సంతానం దక్కుతుంది" అని సెలవిస్తాడు.
అయితే ఇందుకోసం చాలా కష్టపడాలి. ఏడేడు సముద్రాల అవతల యమగండ దుస్స ఉంటుంది. ఆ దుస్సలోపలికి నీవు మాద్రితో పాటు పోయి ఒక్కొక్కరూ ఏడుపిడికిళ్ళు చొప్పన దుస్స ధాన్యం అంటే పద్నాలుగు పిడికిళ్ళ దుస్స ధాన్యం తీసుకుని సేకరించి తెచ్చుకుంటే నీకు సంతానం కలుగుతుంది. దుస్సవడ్లను గోటితో వోలవాలి, మోచేతితో పోటు పెట్టాలి, అరచేతితో చెరగాలి, ఏటి అడుగున మట్టి తీసుకు వచ్చి ఆ మట్టితో చల్లగురిగిని చేసి అందులో పాశం వండి సప్తకోటి మునులకు భోజనం పెట్టాలి. అట్లయితేనే నీకు సంతానం ఇస్తానంటాడు శంకరుడు. అప్పుడు కుంతీదేవి, మాద్రి ఇద్దరు ఏడేడు సముద్రాలు దాటి వెళ్తారు.
అక్కడ వారికి దారి కన్పించక ఈ గంగను దాటి ఎలా వెళ్లాలని బాధపడుతూ శ్రీకృష్ణున్ని ప్రార్ధిస్తారు. శ్రీకృష్ణుడు గరుడవాహనం (గరుత్మంతుడు) పంపిస్తాడు. గరుత్మంతుడు వచ్చి కుంతీదేవిని, మాద్రిదేవిని తీసుకుని వెళ్ళి యమదుస్స గడ్డి ఉన్న చోట దించుతాడు. కుంతీదేవి, మాద్రి ఇద్దరు యమదుస్సను తెంపుతుంటే రంపాలతో కోసినట్లు కోసుకుంటాయి. వారు రక్తం కారిన తమ చేతులను చూసి ఏడుస్తుంటారు. ఆ సమయంలోనే మాతంగ మహాముని అటువైపు వచ్చి కుంతీదేవి, మాద్రి ఇద్దరిని చూస్తాడు, “అమ్మ నాకు ఒకకోరిక ఉంది, ఇక్కడ నేను ఒక్కడినే మగవాడిని ఉన్నాను. ఈ దుస్సవడ్లకు నేనే కావలిగా ఉన్నాను. మీరు ఎలాగూ ఈ దుస్సవడ్లను దుయ్యలేరు. కానీ నాకు ఒక భార్య కావాలి" అంటాడు. అప్పుడు కుంతీదేవి, మాద్రిలు “సరే అయ్యా మా అన్న శంకరుడు ఉన్నాడు. అతనికి చెప్పి<noinclude><references/></noinclude>
m55h47jvfwo0hig6yi6pxfpam8fmwz7
పుట:పటం కతలు.pdf/153
104
212049
553178
552571
2026-04-15T16:12:46Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553178
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|136|పటం కతలు}}</noinclude>
నీ కోరిక నేరవేర్చే ప్రయత్నం చేస్తాం” అంటారు. అదే విధంగా శంకరుడిని ప్రార్ధించగా శంకరుడు ప్రత్యక్షమవుతాడు. కుంతీదేవి, మాద్రిలు శంకరునికి మాతంగ ముని కోరికను విన్నవిస్తారు. అప్పడు శంకరుడు మాతంగమునీశ్వరా నీకు భార్యకావాలా అందుకే దుస్సధాన్యం కోసం వచ్చిన మా చెల్లెండ్ల చేతులకు రక్తం వచ్చేలా యమగండ దుస్సకు రంపాలు సృష్టించావా అంటూ తన నొసటన ఉన్న విభూతి తీసి యమగండదుస్స మీద వేస్తాడు. అప్పడు యమగండ దుస్సను పగలగొట్టుకుని పద్మగంధి పుడుతుంది. శంకరునికి నమస్కరిస్తుంది. శంకరుడు అమ్మా పద్మగంధి ఇదిగో నీ భర్త మాతంగమునీశ్వరుడు అంటూ అప్పజెప్పి ఆశీర్వదించి అదృశ్యమవుతాడు. పద్మగంధి మాతంగమునీశ్వరులు సుఖంగా దంపతులుగా జీవిస్తుంటారు.
కొన్నాళ్ళ తరువాత వారికి నలుగురు కుమారులు జన్మిస్తారు. వారు ఉత్తంగుడు, మాతంగుడు, అర్జన్న, భీమన్న, వీరే పాండవ పద్మనాయకులు లేదా పాండవ ప్రభున్నాయకులు. ఈ పాండవ ప్రభున్నాయకులు ఒకరోజు చాలామందితో
కలిసి కోలాటం ఆడుతుంటారు. తల్లియైన పద్మగంధి కొడుకులను పిలుస్తుంది. అయితే ఉత్తుంగుడు, మాతంగుడు, అర్జున్న వెంటనే వస్తారు. కానీ భీమన్న మాత్రం రాకుండా కోలాటం ఆడుతూనే ఉంటాడు. అప్పుడు పద్మగంధి ఒరే భీమన్న రేపు నాకు ఏదైనా ఆపద వచ్చి పిలిచినా అంతేనా నా పిలుపును పట్టించుకోకుండా నేను పిలిచినా రాకుండా అట్లాగే కోలాటమే శాశ్వతమన్నట్లు ఆడుతున్నావు కాబట్టి నీవు కులం మీద కోలకానివాడై అయిపోదువు గాక అంటూ శపిస్తుంది. భీమన్న భయపడి అమ్మా నన్ను శపించావు కదా మరి నా ఆదెరువు ఏమిటి నేనెలా జీవించాలి. అని అడుగుతాడు. లేదు నాయనా నీవు మాతోనే ఉంటావు కానీ నిన్ను కోలకాడు అని పిలుస్తారు అని పద్మగంధి అంటుంది. భీమన్న మాత్రం లేదమ్మా ఎప్పటికైనా నన్ను కోలుకాదని ఎగతాళి చేస్తుంటారు నా అన్నదమ్ములు నన్ను ఎత్తిపొడుస్తుంటారు.కాబట్టి నేను వేరే ఎక్కడికైనా పోయి ఉంటాను కానీ నేను ఎలా జీవించాలో చెప్పు అని అంటాడు. నాయనా నీవు కూర్చుంటే కులస్తునివి లేస్తే అస్తివానివి కాబట్టి నేను నిన్ను అడివానిగా స్వీకరిస్తున్నాను ఇదిగో నీవు నాయకపువారి ఇండ్ల మద్యనే ఉంటూ బతుకు అని పద్మగంధి చెప్తుంది.
పద్మగంధి పారిటాకుల మీద పటం రాసి రాగి శాసనం మీద భీమన్నపేరు<noinclude><references/></noinclude>
bu6kooq4aijwkc4u76y08u2clfqzxem
పుట:పటం కతలు.pdf/154
104
212050
553179
552572
2026-04-15T16:16:35Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553179
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||137}}</noinclude>
కొట్టించి భీమన్నకు ఇచ్చి నాయకపువారికి రాగి శాసనం చూపించి ఈ పటంతో మన పెద్దలైన పాండవుల కథ చెప్పుకుంటూ బ్రతుకు అని ఆజ్ఞ ఇస్తుంది. ఆ విధంగా కోలకానివాడుగా వీరు కథలు చెప్పడం ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలో వీరిని పూజరి వాళ్లు అంటున్నారు. నాయకపు వాళ్లు లేదా పద్మనాయకుల దేవతలైన లక్ష్మీదేవి, భీమన్న, శ్రీకృష్ణుడు తదితర దేవతలను తీసుకుపోయి పూజించి పటం కథను చెప్తారు కాబట్టి పూజరి వారుగా కూడా పిలువబడ్డారు. నాయకపోడు వారికి సంబంధించిన దేవతల పురాణాలను చెప్తారు కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో గురువులుగా పిలువబడ్డారు.
'''ప్రదర్శనలు '''
నాయకపోడు గిరిజనుల వద్దకు వీరు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వెళ్లి కథలు చెప్పడం రివాజు. దీపావళి పండుగ వెళ్లిన తర్వాత తమ ఇండ్ల నుండి కథలు చెప్పడానికి బయలుదేరుతారు. పద్మనాయక గిరిజనులు ఉండే గ్రామాలకు
పోయి నగారా కొట్టి అందరినీకూడగడతారు. కులం పెద్దని పిలిచి త్యాగం గురించి అడిగిన తర్వాత కథలు చెప్పడం ప్రారంభిస్తారు. ముందుగా పద్మనాయకుల కులపురాణ కథను ప్రదర్శిస్తారు. తర్వాతనే పాండవులకు సంబంధించిన
విరాటపర్వం, పాండ వనవాసం, భీమార్జున యుద్ధం కథలను చెప్తారు. కథాప్రదర్శనలో ఐదుగురితో కూడిన కళాకారుల మేళం ఉంటుంది. వీరిలో ఇద్దరు ప్రధాన కథకులు కాగా మిగతా ముగ్గురు మద్దెల, హార్మోనియం, తాళ వాద్యాలతో
సహకారం అందిస్తూ గాత్ర సహకారం కూడా ఇస్తుంటారు. కొర్రాజులు చెప్పే కథలకు వీరు చెప్పే కథలకు విభేదం తక్కువ. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందు, తిరిగి అయిటిపూనినంక రోహిణి మృగశిర కార్తెలో తమ ఇండ్లను
చేరుకుంటారు. వర్షాకాలంలో కథలు చెప్పకుండా ఇంటిపట్టునే ఉంటారు. నాయకపోడు గిరిజనుల ఆర్ధిక పరిస్థితి కూడా వీరిపై ప్రభావం చూపుతుంది. కథలు చెప్పినందుకు త్యాగంగా వీరికి వచ్చే డబ్బుకూడా చాలా తక్కువ.
'''రక్షించుకోవాల్సిన పరిస్థితి '''
కానీ వీరి సంఖ్య ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వెళ్తున్నారు. ప్రస్తుతం రెడ్డబోయిన కృష్ణ, రెడ్డబోయిన సమ్మయ్యలు<noinclude><references/></noinclude>
53dm5duejnegexuwlc0nz4ptagariaa
పుట:పటం కతలు.pdf/155
104
212051
553180
552573
2026-04-15T16:25:14Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553180
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|138||పటం కతలు}}</noinclude>
తమ కథాప్రదర్శనలో తమతోకూడా ఇతర కళాకారులైన కొర్రాజులు, కాకిపడిగెల వారికి సంబంధించిన సభ్యులను తమమేళంలో తాత్కాలికంగా కలుపుకుంటూ కథలు చెప్తున్నారు. ప్రస్తుతం పూజరి కళాకారులు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. కళారూపం కూడా పటంకథ స్థాయి నుండి బుర్రకథ సంప్రదాయానికి మారింది. ఆవిధంగా చూస్తే పూజరి కళారూపం పూర్తిగా అవసాన దశలో ఉందని చెప్పవచ్చు. ఈ కళారూపాన్ని, మరికొన్ని అంతరించిపోయే స్థితిలో ఉన్న కొర్రాజులు చెక్కబొమ్మలాట మొదలైనవాటిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ రక్షించుకోవలసిన జాబితాలో చేర్చుకోవాలి.
'''సూచిథాలు '''
1. భక్తవత్సలరెడ్డి.ఎన్ (సంపాదకులు).. రాష్ట్రస్థాయి జానపదకకోత్సవాలు నల్గొండ (ప్రత్యేక సంచిక)(2001) జానపదగిరిజన విజ్ఞానపీఠం ప్రాంతీయ జానపద జీవనవనరుల అధ్యయన కేంద్రం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్
2. రమేష్ భట్టు, వెంకన్నగడ్డం (సంపాదకులు).. జానపదగిరిజన విజ్ఞాన జాతీయ సదస్సు పత్రాలు (2012) జానపదగిరిజన విజ్ఞానపీఠం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఓరుగల్లు ప్రాంగణం వరంగల్ ప్రచురణ
3. వెంకన్న గడ్డం.. పటంకథలు కథకులు (2011) భగత్ ప్రచురణలు హన్మకొండ
4. వెంకటేశ్వర్లు అట్లూరి.. వరంగల్ జిల్లా కాకి పడిగెల పటం కథలు (2011)మైత్రి ప్రచురణలు హన్మకొండ.
-
{{right|- అడ్లూరి శివప్రసాద్}}<noinclude><references/></noinclude>
40yfokgnnve23rd2brj0dgc99wvts76
553181
553180
2026-04-15T16:26:04Z
A.Murali
3019
553181
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|138||పటం కతలు}}</noinclude>
తమ కథాప్రదర్శనలో తమతోకూడా ఇతర కళాకారులైన కొర్రాజులు, కాకిపడిగెల వారికి సంబంధించిన సభ్యులను తమమేళంలో తాత్కాలికంగా కలుపుకుంటూ కథలు చెప్తున్నారు. ప్రస్తుతం పూజరి కళాకారులు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. కళారూపం కూడా పటంకథ స్థాయి నుండి బుర్రకథ సంప్రదాయానికి మారింది. ఆవిధంగా చూస్తే పూజరి కళారూపం పూర్తిగా అవసాన దశలో ఉందని చెప్పవచ్చు. ఈ కళారూపాన్ని, మరికొన్ని అంతరించిపోయే స్థితిలో ఉన్న కొర్రాజులు చెక్కబొమ్మలాట మొదలైనవాటిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ రక్షించుకోవలసిన జాబితాలో చేర్చుకోవాలి.
'''సూచిగ్రంథాలు '''
1. భక్తవత్సలరెడ్డి.ఎన్ (సంపాదకులు).. రాష్ట్రస్థాయి జానపదకకోత్సవాలు నల్గొండ (ప్రత్యేక సంచిక)(2001) జానపదగిరిజన విజ్ఞానపీఠం ప్రాంతీయ జానపద జీవనవనరుల అధ్యయన కేంద్రం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్
2. రమేష్ భట్టు, వెంకన్నగడ్డం (సంపాదకులు).. జానపదగిరిజన విజ్ఞాన జాతీయ సదస్సు పత్రాలు (2012) జానపదగిరిజన విజ్ఞానపీఠం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఓరుగల్లు ప్రాంగణం వరంగల్ ప్రచురణ
3. వెంకన్న గడ్డం.. పటంకథలు కథకులు (2011) భగత్ ప్రచురణలు హన్మకొండ
4. వెంకటేశ్వర్లు అట్లూరి.. వరంగల్ జిల్లా కాకి పడిగెల పటం కథలు (2011)మైత్రి ప్రచురణలు హన్మకొండ.
-
{{right|- అడ్లూరి శివప్రసాద్}}<noinclude><references/></noinclude>
b17ak26pwdddvvla5ialjw3jcmy1orw
పుట:పటం కతలు.pdf/156
104
212052
553182
552574
2026-04-15T16:29:47Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
553182
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = పటం_కతలు.pdf
|Page = 156
|bSize = 450
|cWidth = 357
|cHeight = 86
|oTop = 42
|oLeft = 39
|Location = center
|Description =
}}
{{center|{{p|fs150}}'''16. తెరచీరల పటం కత '''</p>}}
వృత్తి పురాణాల్లో మనకు కనిపించే 15 పటం కథల్లో తెరచీరల కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. యాదవ వంశంలో పుట్టిన చారిత్రక వీరుడు కాటమరాజు కథ ఇది. ఈ కథాగానం అరుదైందే కాదు.. అద్భుతమైంది. కూడా. ఇందులో యదు వంశాన్ని కీర్తిస్తూ కృష్ణలీలలు ఇతివృత్తంతో యాదవ కళాకారులు గానం చేస్తారు. యాదవ పురాణాన్ని చెప్పేందుకు ఏర్పడిన ఎనిమిది మంది కళాకారులలో ఈ తెరచీరల వారు ఒకరు. 19వ శతాబ్ది నాటికే తెరబొమ్మల ప్రదర్శన కోసం ఈ కళారూపం ఏర్పడటం విశేషం. అంతేకాదు.. తెలంగాణలో ఈ కళాకారులని తెరచీర భక్తులని, యాదవపటం కథాకారులని పిలుస్తుంటారు.
'''తెరచీరల చరిత్ర '''
అన్ని ఆశ్రిత కళాకారులకు ఉన్నట్టే ఈ తెరచీరల వారికి కూడా చరిత్ర ఉంది. వీరు స్థిరమందుల వంశానికి<noinclude><references/></noinclude>
76hold7jb5j7eecj3l6tj4svtadl1r7
పుట:పటం కతలు.pdf/157
104
212053
553183
552575
2026-04-15T16:30:46Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
553183
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = పటం_కతలు.pdf
|Page = 157
|bSize = 450
|cWidth = 441
|cHeight = 392
|oTop = 9
|oLeft = 6
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
os9ircdu0n39gcdzvfn88ladrgvbtqd
పుట:పటం కతలు.pdf/158
104
212054
553184
552576
2026-04-15T16:34:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553184
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||141}}</noinclude>
చెందిన వారని జానపద పరిశోధకులు చెబుతున్నారు. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే స్థిరమందుల వారు పూర్వం యయాతి, దేవయానికి కలిగిన సంతానం అని తెలుస్తోంది. వీరు పల్లవ రాజులకు ప్రధానులుగా పనిచేసిన చరిత్ర కనబడుతోంది. కాటమరాజు కాలం వచ్చేసరికి పల్లవుల వారసులుగానే ప్రసిద్ధిపొందారు. పూజా గొల్లల్నే తెరచీరల కథాగానం చేసే స్థిరమందుల వంశం వారుగా పేర్కొంటారు.
'''తెరచీరల కళా ప్రదర్శన '''
పటం కథల కళారూపాలకు చెందిందే ఈ తెరచీరల పటం. కాటమరాజు కథా వృత్తాంతాల్ని పెద్ద గుడ్డ మీద బొమ్మల రూపంలో అతికించి చిత్రపటం తయారు చేస్తారు. 15 చిత్రపటాలలో అతి చిన్నది ఈ తెరచీరల పటం. యాదవుల కథ
కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ తెరచీరల పటం ఒక గోడను లేదా గుడారాలు వేసి దాని గోడకు గానీ కట్టి కథాగానం చేస్తారు. ఈ కథాగానానికి సహకార వాయిద్యాలుగా వేప చెక్కతో, ఇత్తడితో చేసిన వీరణములు, ఇత్తడితో వంకరగా
పొడుగు గొట్టాల కొమ్ములు, తాళాలు, దోలక్ లు ఉపయోగిస్తారు. తెరచీరల కళాకారులు ఆరుగురు ఒక బృందంగా ఏర్పడి ఊరూరా తిరుగుతూ పురాణాన్ని చెప్పే సంప్రదాయం కనబడుతుంది. తెలంగాణలోని అన్నీ జిల్లాల్లోనూ తెరచీరల
కళాకారులు ఉన్నప్పటికీ నల్గొండ జిల్లా తిరుమలగిరి, మామిడాల వాస్తవ్యులు తండా భిక్షం, శ్రీనివాస్, కొంపెల్లి వెంకట నారాయణ బృందమే పేరుగాంచింది. యాదవుల కులదైవమైన గంగాదేవి కథ, కృష్ణలీలలతో సహా కాటమరాజు కథ చక్రాన్ని గానం చేస్తుంటారు.
'''కృష్ణలీలలు - కథాంశం'''
జానపద కళారూపాల్లో కృష్ణలీలలు ఏ కళారూపంలో ప్రదర్శించినా తరగని ఆదరణ పొందుతుంది. కృష్ణలీలలు నేపథ్యంగా కనిపించే కథలంతా యదువంశ గొప్పతనం వివరించేవే. కొండపల్లె నివాసి కనకబండి గట్టయ్య రచించిన కృష్ణ భాగవతం కథే కృష్ణ లీలలు. అందులో కంసుని చేతిలో చావకుండా సజీవంగా ఆకాశానికి ఎగిరి మాయా బాలికగా మారి గంగగా భువిన అవతరించింది. ఈ గంగ మూలవృత్తాంతం కృష్ణుని జననంతోనే ముడిపడి ఉంది. అలాగే గంగాదేవి యాదవుల కులదైవం కావడం యాదృచ్ఛికమే. ఇక కృష్ణుడే కాటమరాజు అని<noinclude><references/></noinclude>
r7tfae9cgexuqdl7q3yydr5f2kqhsv4
పుట:పటం కతలు.pdf/159
104
212055
553185
552577
2026-04-15T16:38:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553185
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|142||పటం కతలు}}</noinclude>
యాదవుల ప్రగాఢ విశ్వాసం. ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ముగించి.. 16వ అవతారంగా కాటమరాజై భువిలో జన్మిస్తాడు. అవతార తత్వాన్ని వివరిస్తూ కృష్ణలీలలను, చిలిపి చేష్టలను కళ్ళకు కట్టిస్తుంది ఈ తెరచీరల కథ. గొల్లవారిండ్లలో పాలు, పెరుగు ఆరగిస్తున్నాడు. చల్ల చిలికే గొల్ల భామలతో సరసాలాడి గొల్ల దంపతులకు ముద్దు మురిపాలు అందిస్తూ యాదవుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. మన్ను తిన్నందుకు యశోదా దేవి రోటికి కడితే.. మద్దుమానులని పడగొట్టి శాపగ్రస్తులైన వారికి పునర్జన్మనిస్తాడు. పూతన, శకటా, థేనుకాసురున్ని వధిస్తాడు. కాళీయ మర్దనం, కంసుని వధతో కథ ఉత్కంఠంగా మారి బృందావన పయనంతో ముగుస్తుంది. ఈ పురాణ కథలకు మాధ్యమం 'తెర చీరపటం' అయితే జీవం పోసింది సాహిత్యమే.
'''సాహిత్యాంశాలు '''
తెరచీరల వాళ్లు చెప్పే కథలన్నీ కృష్ణభాగవతం కథ ఆధారంగానే ప్రదర్శిస్తారు. కనకబండి గట్టయ్య రచించిన కథా సాహిత్యాన్ని గానం చేస్తున్నారు. ఈ తెరచీరల వారు యాదవుల ఆశ్రిత కళాకారులు అయినందువల్ల కృష్ణుని అవతార కథలతో పాటు కాటమరాజు వంశ చరిత్రను కూడా కథాగానం చేయడం కనపడుతుంది. కథకుడు వంశక్రమాన్ని, అవతార తత్వాన్ని బట్టి వివరిస్తూంటాడు. 'మంధర పర్వత మథనంలో గోవు పుట్టే, గోపాలుడు పుట్టే, గోరక్షకుడు పుట్టే, వసుదేవునికి కృష్ణుడు పుట్టే, ఆయనకు మన్మథుడు, ఆయనకు అంభోజ, ఆయనకు చెంభోజ, ఆయనకు రత్నాంభోజ, గంగురాజు పుట్టే, ఆయనకు వలురాజు, వలురాజుకు పెద్దిరాజు, ఆయనకు కాటమరాజు పుట్టారు'. పదగుంఫన శైలిలో వచనం చెప్పి అద్భుతమైన కథాగానాన్ని ప్రారంభిస్తాడు కథకుడు. ప్రారంభంలోని గానమంతా బాలకృష్ణుని అల్లరిని తెలిపే విధానం. ఆయనను వెన్నదొంగగా చిత్రించేందుకు గాను రూపొందించుకున్నది. 'ఒకరి మీద ఒకరిని తాను వంగబెట్టి, ఉట్టి వార ఒట్టుక వెన్నమెక్కి వలకబోసి' అంటూ కథకుడు పాడుతుంటేనే నవ్వు పుట్టుకొస్తుంది. ఆ తరువాత గోపికలను తన చిలిపి చేష్టలతో ఉడికిస్తూ వస్తాడు. ఆ గోపికలంతా వచ్చి యశోదకు మొరపెట్టుకుంటే ఆమె అప్పుడు...<noinclude><references/></noinclude>
rxo6s6zq47qi9lrah5zxwdnto1cp2g3
పుట:పటం కతలు.pdf/160
104
212056
553239
552578
2026-04-16T04:23:53Z
A.Murali
3019
553239
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" />పటం కతలు</noinclude>
<poem>
{{left margin|5em}}
'ఏమిరా కృష్ణయ్య నీవు ఏమి చేసితివి?
యాదవుల ఇండ్లళ్లకు పోయి ఏడ బోయితివి?
పోరాని జాగలకు పోనేల కృష్ణా!
గొల్లవాడలకు పోకురా కృష్ణా!
ఆ గొల్లవాదలకు పోకురా కృష్ణా
143
గొల్లలు నిను కొట్టేరూ, గొల్లభామలు నిను తిట్టేరూ'</poem>
అంటూ మందలిస్తే బాలకృష్ణుడే గానీ అవతార పురుషుడు
కదా. తన చిలిపి చేష్టలు బయటపడకుండా
ఎట్లంటున్నాదో చూడండి.
<poem>
{{left margin|5em}}
'గొల్లవాదలు ఎక్కడున్నాయో
గొల్ల ఇండ్లు ఎక్కడున్నాయో
గొల్లభామలు ఎక్కడున్నారే' అంటూ బులిపిస్తూనే
'గొల్లవారిని మాయమ్మ కొట్టమనకు మోయమ్మా
తిట్టమనకు మోయమ్మా'</poem>
అంటూ గారాలుపోతాడు. గొల్ల ఇల్లాళ్ళంతా యశోద వద్దకు వచ్చి కాపురాలు
కూల్చే బాలుడు అని చెప్పినపుడు ఆమె...
'ఆలుమగలు ఆదమరచి పవళిస్తే
నువు సరసన చేరావంటా? అని అడిగితే
'మేలుకున్నరో మేలుక లేరని, ఆ మేలుకున్నరో
మేలుకలేరని లేపి చూసినానమ్మా
నే ఊపి చూసినానమ్మా' అంటూ మాటలతో కవ్విస్తాడు.
కనకబండి గట్టయ్య రచించిన గోపికా వస్త్రాపహరణం
సన్నివేశం అంతా పారమార్థికంగా సాగిపోతుంది.
'వేణు గానములు విని విరహములు బుట్ట
నాతులు ఉబ్బుచూ నదికి ఏతెంచి
ఓయక్క కృష్ణుని వలవనెననుచు
కిలకిల నవ్వుచు జలక్రీడసల్పుచున్నా'రంటాడు' కవి.<noinclude><references/></noinclude>
lag3hfgtygtwsjqszvtihn73b1ir5qv
553241
553239
2026-04-16T04:26:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553241
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||143}}</noinclude>
<poem>
{{left margin|5em}}
'ఏమిరా కృష్ణయ్య నీవు ఏమి చేసితివి?
యాదవుల ఇండ్లళ్లకు పోయి ఏడ బోయితివి?
పోరాని జాగలకు పోనేల కృష్ణా!
గొల్లవాడలకు పోకురా కృష్ణా!
ఆ గొల్లవాదలకు పోకురా కృష్ణా
143
గొల్లలు నిను కొట్టేరూ, గొల్లభామలు నిను తిట్టేరూ'</poem>
అంటూ మందలిస్తే బాలకృష్ణుడే గానీ అవతార పురుషుడు కదా. తన చిలిపి చేష్టలు బయటపడకుండా ఎట్లంటున్నాదో చూడండి.
<poem>
{{left margin|5em}}
'గొల్లవాదలు ఎక్కడున్నాయో
గొల్ల ఇండ్లు ఎక్కడున్నాయో
గొల్లభామలు ఎక్కడున్నారే' అంటూ బులిపిస్తూనే
'గొల్లవారిని మాయమ్మ కొట్టమనకు మోయమ్మా
తిట్టమనకు మోయమ్మా'</poem>
అంటూ గారాలుపోతాడు. గొల్ల ఇల్లాళ్ళంతా యశోద వద్దకు వచ్చి కాపురాలు కూల్చే బాలుడు అని చెప్పినపుడు ఆమె...
<poem>
{{left margin|5em}}
'ఆలుమగలు ఆదమరచి పవళిస్తే
నువు సరసన చేరావంటా? అని అడిగితే
'మేలుకున్నరో మేలుక లేరని, ఆ మేలుకున్నరో
మేలుకలేరని లేపి చూసినానమ్మా
నే ఊపి చూసినానమ్మా' అంటూ మాటలతో కవ్విస్తాడు.
కనకబండి గట్టయ్య రచించిన గోపికా వస్త్రాపహరణం
సన్నివేశం అంతా పారమార్థికంగా సాగిపోతుంది.
'వేణు గానములు విని విరహములు బుట్ట
నాతులు ఉబ్బుచూ నదికి ఏతెంచి
ఓయక్క కృష్ణుని వలవనెననుచు
కిలకిల నవ్వుచు జలక్రీడసల్పుచున్నా'రంటాడు' కవి.</poem><noinclude><references/></noinclude>
spz61kf6rmmef3tzxggtqjji758kp9p
553242
553241
2026-04-16T04:29:36Z
A.Murali
3019
553242
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|పటం కతలు||143}}</noinclude>
<poem>
{{left margin|5em}}
'ఏమిరా కృష్ణయ్య నీవు ఏమి చేసితివి?
యాదవుల ఇండ్లళ్లకు పోయి ఏడ బోయితివి?
పోరాని జాగలకు పోనేల కృష్ణా!
గొల్లవాడలకు పోకురా కృష్ణా!
ఆ గొల్లవాదలకు పోకురా కృష్ణా
గొల్లలు నిను కొట్టేరూ, గొల్లభామలు నిను తిట్టేరూ'
అంటూ మందలిస్తే బాలకృష్ణుడే గానీ అవతార పురుషుడు
కదా. తన చిలిపి చేష్టలు బయటపడకుండా
ఎట్లంటున్నాదో చూడండి.
'గొల్లవాదలు ఎక్కడున్నాయో
గొల్ల ఇండ్లు ఎక్కడున్నాయో
గొల్లభామలు ఎక్కడున్నారే' అంటూ బులిపిస్తూనే
'గొల్లవారిని మాయమ్మ కొట్టమనకు మోయమ్మా
తిట్టమనకు మోయమ్మా'</poem>
అంటూ గారాలుపోతాడు. గొల్ల ఇల్లాళ్ళంతా యశోద వద్దకు వచ్చి కాపురాలు కూల్చే బాలుడు అని చెప్పినపుడు ఆమె...
<poem>
{{left margin|5em}}
'ఆలుమగలు ఆదమరచి పవళిస్తే
నువు సరసన చేరావంటా? అని అడిగితే
'మేలుకున్నరో మేలుక లేరని, ఆ మేలుకున్నరో
మేలుకలేరని లేపి చూసినానమ్మా
నే ఊపి చూసినానమ్మా' అంటూ మాటలతో కవ్విస్తాడు.
కనకబండి గట్టయ్య రచించిన గోపికా వస్త్రాపహరణం
సన్నివేశం అంతా పారమార్థికంగా సాగిపోతుంది.
'వేణు గానములు విని విరహములు బుట్ట
నాతులు ఉబ్బుచూ నదికి ఏతెంచి
ఓయక్క కృష్ణుని వలవనెననుచు
కిలకిల నవ్వుచు జలక్రీడసల్పుచున్నా'రంటాడు' కవి.</poem><noinclude><references/></noinclude>
l26tab2lyz6wb9i4hhtfv8y2a6cfyeh
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/శైలబాల
0
212077
553342
552624
2026-04-16T11:53:16Z
Rajasekhar1961
50
553342
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = శైలబాల
| previous = [[..//]]
| next = [[../నాగలి/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="248" to="257" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
nkmpa34z6lcl2q7zyck4h2fclg3s0xt
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/నాగలి
0
212079
553341
552629
2026-04-16T11:52:44Z
Rajasekhar1961
50
553341
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = నాగలి
| previous = [[../శైలబాల/]]
| next = [[../పాడు దేవాలయం/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="258" to="279" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
pkrx2jwy2uxu4l401qzp2bknd6oh2gy
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/పాడు దేవాలయం
0
212080
553340
552631
2026-04-16T11:52:13Z
Rajasekhar1961
50
553340
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = పాడు దేవాలయం
| previous = [[../నాగలి/]]
| next = [[../సూర్యసుత/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="280" to="282" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
aw9oalmtkjwoyjcrvm3auk4ftu40u9s
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/సూర్యసుత
0
212085
553338
552861
2026-04-16T11:51:42Z
Rajasekhar1961
50
553338
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = సూర్యసుత
| previous = [[../పాడు దేవాలయం/]]
| next = [[../మెట్లు/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="283" to="291" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
4oy1pu9ab13zeo98rx8hntde16s8j6t
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/మెట్లు
0
212086
553337
552863
2026-04-16T11:51:13Z
Rajasekhar1961
50
553337
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = మెట్లు
| previous = [[../సూర్యసుత/]]
| next = [[../నేల/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="292" to="299" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
s1h7nbfc32si56ld2n3vins232boorv
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/నేల
0
212088
553336
552868
2026-04-16T11:50:45Z
Rajasekhar1961
50
553336
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = నేల
| previous = [[../మెట్లు/]]
| next = [[../పిల్లంగ్రోవి/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="300" to="305" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
hejif3mpkw6t81ipd0e4tgtt4dxs3td
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/486
104
212191
553247
553101
2026-04-16T05:49:39Z
A.Murali
3019
553247
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''టి. మాధవరావు '''</p>}}
{{right|-వారాల ఆనంద్}}
తెలంగాణ తొలితరం సినీ దర్శకుల్లో తాళిబొట్టు
మాధవరావుది ప్రముఖస్థానం. 1970లో తీసిన
మొట్టమొదటి చిత్రం 'తాళిబొట్టు'తో టి. మాధవరావు
ఇంటిపేరు తాళి బొట్టు అయిపోయింది. ఆ సినిమాలో కృష్ణ,
విజయనిర్మల, కృష్ణంరాజు, రాజబాబు, రమాప్రభలు ముఖ్య
తారాగణంగా పనిచేశారు. కె.వి. మహదేవన్ సంగీతాన్ని
అందించిన ఈ సినిమాకు తానే స్వయంగా రచన
చేసుకున్నారు మాధవరావు. 1984లో హనుమకొండలో
జన్మించిన మాధవరావు ఇంటిపేరు తిరునగరి. వరంగల్
మెట్రిక్ పూర్తయింతర్వాత కొంతకాలం టీచర్ గా
పనిచేశారాయన. చిన్నప్పటినుంచే నటనపట్ల ఆసక్తికలిగిన
మాధవరావు మాద్రాస్ సినీరంగంలో ప్రవేశించాడు. హాస్య
పాత్రలు, మోనోయార్టింగ్ బాగా చేసే మాధవరావు గాత్రం
కూడా బాగా వుండేది. బాగా పాడేవారు. కొంతకాలం
హిందూస్థానీ సంగీతం కూడా నేర్చుకున్న మాధవరావు
మిత్రులందరి ప్రోత్సాహంతో సినిమాలో చేరేందుకు
1968లో మద్రాస్ రైల్ ఎక్కేశాడు.
మొదట గాయకుడిగా సినిమాల్లో చేరేందుకు
ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ అప్పటికే అనేకమంది
గాయకులు రంగంలో వుండడం మాధవరావు తెలంగాణ
నుంచి రావడం వల్ల సంగీత రంగంలో ఆయనకు ప్రవేశం
లభించలేదు. అయినా నిరాశ చెందకుండా ఎట్లో ఒకతీరు
సినిమాల్లో ప్రవేశించడమే లక్ష్యంగా మద్రాసులో వుండి
పోయాడు. సినిమాలకు సంబంధించి ఏ అవకాశం వచ్చినా
వదలకుండా పనిచేయడం ఆరంభించాడు. మద్రాస్ వెల్ళినా
రెండేళ్లకు దర్శకుడు జగన్నాథ్ వద్ద 'శ్రీకృష్ణ రాయబారం'
సినిమాకు సహాయ దర్శకుడిగా చేరిపోయాడు. దాని తరువాత
వెంటనే సేలంలో తయారయిన బి. ఎస్. నారాయణ
దర్శకత్వం వహించిన 'మాంగల్యం' సినిమాకు సహాయ
దర్శకుడిగా పనిచేశాడు. అక్కడే ఆయనకు ప్రముఖ కవి,
సినీ రచయిత ఆత్రేయతో పరిచయం ఏర్పడింది.
ఆత్రేయకు మాధవరావులోని అంకితభావం నచ్చి
అభిమానంతో సహకరించడం మొదలు పెట్టాడు. ఆ
పరిచయం ముందుకు వెళ్లడానికి మాధవరావుకు ఎంతో
వుపయోగపడింది. అప్పటికీ ఆత్రేయ సినీరంగంలో విజయ
వంతమయిన కవిగా నిలబడ్డాడు. ఆదుర్తి సుబ్బారావు లాంటి
వాళ్లతో కలిసి అనేక సినిమాలకు పనిచేశాడు. ఆత్రేయ
సూచనల మేరకు మాధవరావుకు ఆదుర్తి దగ్గర సహాయ
దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. 1961 నుంచి
దాదాపు దశాబ్ద కాలంపాటు వారి సహచర్యం నిలిచింది.
ఆదుర్తి వద్ద దర్శకత్వం, ఫిల్మ్ టెక్నికకు సంబంధించి అనేక
అంశాలు నేర్చుకున్నానని మాధవరావు చెప్పుకున్నారు.
1962లో 'మంచి మనసులు', 1964లో 'మూగమనసులు',
1965లో 'తేనెమనసులు', 1966లో 'కన్నె మనసులు',
1968లో 'సుడిగుండాలు' తదితర సినిమాలకు సహాయ
దర్శకుడిగా పనిచేశారు. తర్వాత హిందీ సినిమాలు మిలన్,
చేతులు తెలంగాణ 465 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
f0yw9kby1i7skndgc2j2h6xzqd7zxty
553250
553247
2026-04-16T05:59:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553250
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''టి. మాధవరావు '''</p>}}
{{right|-వారాల ఆనంద్}}
తెలంగాణ తొలితరం సినీ దర్శకుల్లో తాళిబొట్టు మాధవరావుది ప్రముఖస్థానం. 1970లో తీసిన మొట్టమొదటి చిత్రం 'తాళిబొట్టు'తో టి. మాధవరావు ఇంటిపేరు తాళి బొట్టు అయిపోయింది. ఆ సినిమాలో కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, రాజబాబు, రమాప్రభలు ముఖ్య తారాగణంగా పనిచేశారు. కె.వి. మహదేవన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు తానే స్వయంగా రచన చేసుకున్నారు మాధవరావు. 1984లో హనుమకొండలో జన్మించిన మాధవరావు ఇంటిపేరు తిరునగరి. వరంగల్ మెట్రిక్ పూర్తయిం తర్వాత కొంతకాలం టీచర్ గా పనిచేశారాయన. చిన్నప్పటినుంచే నటనపట్ల ఆసక్తికలిగిన మాధవరావు మాద్రాస్ సినీరంగంలో ప్రవేశించాడు. హాస్య పాత్రలు, మోనోయార్టింగ్ బాగా చేసే మాధవరావు గాత్రం కూడా బాగా వుండేది. బాగా పాడేవారు. కొంతకాలం హిందూస్థానీ సంగీతం కూడా నేర్చుకున్న మాధవరావు మిత్రులందరి ప్రోత్సాహంతో సినిమాలో చేరేందుకు 1968లో మద్రాస్ రైల్ ఎక్కేశాడు.
మొదట గాయకుడిగా సినిమాల్లో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ అప్పటికే అనేకమంది గాయకులు రంగంలో వుండడం మాధవరావు తెలంగాణ నుంచి రావడం వల్ల సంగీత రంగంలో ఆయనకు ప్రవేశం లభించలేదు. అయినా నిరాశ చెందకుండా ఎట్లో ఒకతీరు సినిమాల్లో ప్రవేశించడమే లక్ష్యంగా మద్రాసులో వుండిపోయాడు. సినిమా లకు సంబంధించి ఏ అవకాశం వచ్చినా వదలకుండా పనిచేయడం ఆరంభించాడు. మద్రాస్ వెల్ళినా రెండేళ్లకు దర్శకుడు జగన్నాథ్ వద్ద 'శ్రీకృష్ణ రాయబారం' సినిమాకు సహాయ దర్శకుడిగా చేరిపోయాడు. దాని తరువాత
వెంటనే సేలంలో తయారయిన బి. ఎస్. నారాయణ దర్శకత్వం వహించిన 'మాంగల్యం' సినిమాకు సహాయ
దర్శకుడిగా పనిచేశాడు. అక్కడే ఆయనకు ప్రముఖ కవి, సినీ రచయిత ఆత్రేయతో పరిచయం ఏర్పడింది.
ఆత్రేయకు మాధవరావులోని అంకితభావం నచ్చి అభిమానంతో సహకరించడం మొదలు పెట్టాడు. ఆ పరిచయం ముందుకు వెళ్లడానికి మాధవరావుకు ఎంతో వుపయోగపడింది. అప్పటికీ ఆత్రేయ సినీరంగంలో విజయవంతమయిన కవిగా నిలబడ్డాడు. ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్లతో కలిసి అనేక సినిమాలకు పనిచేశాడు. ఆత్రేయ సూచనల మేరకు మాధవరావుకు ఆదుర్తి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. 1961 నుంచి దాదాపు దశాబ్ద కాలంపాటు వారి సహచర్యం నిలిచింది. ఆదుర్తి వద్ద దర్శకత్వం, ఫిల్మ్ టెక్నికకు సంబంధించి అనేక అంశాలు నేర్చుకున్నానని మాధవరావు చెప్పుకున్నారు. 1962లో 'మంచి మనసులు', 1964లో 'మూగమనసులు', 1965లో 'తేనెమనసులు', 1966లో 'కన్నె మనసులు', 1968లో 'సుడిగుండాలు' తదితర సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత హిందీ సినిమాలు మిలన్,<noinclude><references/></noinclude>
dh8p0nt7dbf5p32ckx0ssdf9x1zocdj
పుట:Sangitarasataran022902mbp.pdf/13
104
212195
553162
2026-04-15T12:08:26Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553162
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యువనియు నసితుండనుయోగిపుంగవుండు నాఁడువచియించియుండె. సిద్ధార్థుఁడనియతనికిఁ బెద్దలుసార్థకనామధేయ మొసంగి యుండిరి. ఈతని లక్షణంబులెల్లఁ జూడఁజూడ వైరాగ్యసూచకంబులుగానున్న యవి. నాయట్టి చక్రవర్తికింబుత్రుఁడై మహారాజ్యవైభవంబులనుభవింపుచు జననీజనకులను మిత్రామాతృవర్గంబునుఁడఁద్రోసి పూపుగాకమున్నె పురువుబుట్టెనను చందంబున సన్న్యసించెనేని నాకయ్యది యెంతటి వంతకలిగించునో వానోటనుచ్చరింపఁజాలను గదా! కావున మీరెల్లరునవహితమనస్కులై పూర్ణపర్యాలోచనము చేసి నాప్రియపుత్రుని రాజ్యవ్యవ హారపరితంత్రుఁజేయు నుపొయంబు సెప్ప వేడెదను.
మిత్రా — (ఆలోచించి) రాజా! భయంబు నెందకుము.
{{left margin|5em}}<poem>ఊ సన్న్యసనంబుగొప్పయని సంసరణంబుననున్న యట్టి సా
మాన్యులు సైజధర్మములు మానినిరర్థలౌదురేమొ స
న్మాన్యుఁడుశాక్యవంశజుఁడు మానధనుండుభవత్సుతుండు రా
జన్యకులోక్తధర్మముల సారమెఱుఁగనివాఁడే చింతిల౯</poem> </div>
రాజేంద్రా ! దైవజ్ఞులవాక్యంలు లొక్కయెడనమోఘంబులుగాఁ జూపట్టినను వేఱక్కయెడ నిక్కురంబులు కాగోలేవు. కావున నవ్యవస్థీత ఫలసంధాయకంబగు దైవజ్ఞవాక్యంబునకుగాను నీకంతవలవంతి నెండంబనిలేదు. దైవవిధానండేట్లున్నను బౌరుషప్రయత్నం బెల్లెడ నావ్యశకంబును గర్తవ్యఁబును నగుటం జేసి ఏకొమరుని బ్రాపంచిక సౌఖ్యంబుల మార్గంబునఁబెట్టుట మా కెల్లుకును విధి. కావున నట్టియుపాయము నాలోచింప మనమంత్రివర్యుఁడే యార్హుడని యోచించెదను.
దేవ — మహాప్రభూ! మహాయోగులను సైతము భోగులనుజేసి వేదాంతుల యుదంతం బులురు గంతలుకట్టి కన్నులుమూసి మహాధీరుల
మనస్టైరంబులఁ వెన్నవలెఁ గరగించి పరమహంసలయంతఃకరణంబుల నుయ్యెలలూగించి పరివ్రాజకులఁ బరిపరివిధములఁ బరిభ్రమంపజేసి యాచార్యపురుషులనెల్ల జారులంగావించి కాసాయవసవదండక మండలువుల వేగంబులనిపించి, సోకినమాత్రానవలపించి, యలయించి, సోలించి, సౌక్కించి, తాలిమిఁదూలించి, కాలుఁగదలనీకబంధించి వైవంజాలునట్టి లీలాదృష్టి పాతములగల జిగిబిగిప్రాయంబు వాలుగఁటుల
క్రీఁగఁటిచూపులకుఁ జిక్కనియతీతులగు మానవులనెవ్వరినేని కనుఁగొనియుం<noinclude><references/></noinclude>
qs9s68n65yw42uoqjw9406t6ft545fq
553163
553162
2026-04-15T12:10:40Z
Brjswiki
6801
553163
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యువనియు నసితుండనుయోగిపుంగవుండు నాఁడువచియించియుండె. సిద్ధార్థుఁడనియతనికిఁ బెద్దలుసార్థకనామధేయ మొసంగి యుండిరి. ఈతని లక్షణంబులెల్లఁ జూడఁజూడ వైరాగ్యసూచకంబులుగానున్న యవి. నాయట్టి చక్రవర్తికింబుత్రుఁడై మహారాజ్యవైభవంబులనుభవింపుచు జననీజనకులను మిత్రామాతృవర్గంబునుఁడఁద్రోసి పూపుగాకమున్నె పురువుబుట్టెనను చందంబున సన్న్యసించెనేని నాకయ్యది యెంతటి వంతకలిగించునో వానోటనుచ్చరింపఁజాలను గదా! కావున మీరెల్లరునవహితమనస్కులై పూర్ణపర్యాలోచనము చేసి నాప్రియపుత్రుని రాజ్యవ్యవ హారపరితంత్రుఁజేయు నుపొయంబు సెప్ప వేడెదను.
మిత్రా — (ఆలోచించి) రాజా! భయంబునెందకుము.
{{left margin|5em}}<poem>ఊ॥ సన్న్యసనంబుగొప్పయని సంసరణంబుననున్న యట్టి సా
మాన్యులు సైజధర్మములు మానినిరర్థలౌదురేమొ స
న్మాన్యుఁడుశాక్యవంశజుఁడు మానధనుండుభవత్సుతుండు రా
జన్యకులోక్తధర్మముల సారమెఱుఁగనివాఁడే చింతిల౯</poem> </div>
రాజేంద్రా ! దైవజ్ఞులవాక్యంలు లొక్కయెడనమోఘంబులుగాఁ జూపట్టినను వేఱక్కయెడ నిక్కురంబులు కాగోలేవు. కావున నవ్యవస్థీత ఫలసంధాయకంబగు దైవజ్ఞవాక్యంబునకుగాను నీకంతవలవంతి నెండంబనిలేదు. దైవవిధానండేట్లున్నను బౌరుషప్రయత్నం బెల్లెడ నావ్యశకంబును గర్తవ్యఁబును నగుటం జేసి ఏకొమరుని బ్రాపంచిక సౌఖ్యంబుల మార్గంబునఁబెట్టుట మా కెల్లుకును విధి. కావున నట్టియుపాయము నాలోచింప మనమంత్రివర్యుఁడే యార్హుడని యోచించెదను.
దేవ — మహాప్రభూ! మహాయోగులను సైతము భోగులనుజేసి వేదాంతుల యుదంతం బులురు గంతలుకట్టి కన్నులుమూసి మహాధీరుల
మనస్టైరంబులఁ వెన్నవలెఁ గరగించి పరమహంసలయంతఃకరణంబుల నుయ్యెలలూగించి పరివ్రాజకులఁ బరిపరివిధములఁ బరిభ్రమంపజేసి యాచార్యపురుషులనెల్ల జారులంగావించి కాసాయవసవదండక మండలువుల వేగంబులనిపించి, సోకినమాత్రానవలపించి, యలయించి, సోలించి, సౌక్కించి, తాలిమిఁదూలించి, కాలుఁగదలనీకబంధించి వైవంజాలునట్టి లీలాదృష్టి పాతములగల జిగిబిగిప్రాయంబు వాలుగఁటుల
క్రీఁగఁటిచూపులకుఁ జిక్కనియతీతులగు మానవులనెవ్వరినేని కనుఁగొనియుం<noinclude><references/></noinclude>
5d73592tu7wcll5x07gg04zbop8ujhj
పుట:Sangitarasataran022902mbp.pdf/14
104
212196
553170
2026-04-15T12:38:45Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553170
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>టివే ? నీకుమారుండింక యౌవనక్రీడావిలాసముల చవియెఱుంగక బాల్యనిద్యాపరాయణుండైయున్న వాఁడు. అతని కొకగుణవతియుఁ గోమలాకృతియునగు యువతినారసి వివాహము కావింపుము. వెనువెంటనేయిప్పుడాతని కింగల వికారంబులెల్ల సంతంబునొందఁగలవు.
శుద్దో — మంత్రివర్యా! నీహితోపదేశంబున నా మనంపరితాపంబు నిర్వర్తించెను. అయిన నాకొమమునకుందగిన యువతీమణి సెట్లు సమకూర్పఁగలము?
మంత్రి — రాజా! నీకుమారుని డెందము నానందపఱుపఁగల కన్యాలలామయెవ్వరో నీవును నేనునుజింతింపఁజాలము.
{{left margin|5em}}<poem>ఉ॥ ఒక్కొకకంటికొక్కరితయుద్దిగఁ దోఁచు నెవండుదేనికే
చక్కదనంబుఁజూచి మన సావరియించిరమించు మోమది౯
దక్కుఁగలారికయ్యది వితర్కము సేయఁగరానిదౌభళీ!
తక్కిరితుంటఁల్తునకు దారులుకుంటరిదారులేమి॥</poem> </div>
కావున నీకుమారుండు తనయిచ్చ మెచ్చిన మచ్చెకంటిని గూర్చికొనుట కొక యుపాయముఁ జెస్పెద నాలకింపుము. శాక్యులలో స్త్రీ
పురుషులెల్లరునుగలసి లీలోద్యాన విహారంబులు సేయుటయు విలాసగోష్టీ ప్రసంగంబులును స్వాదు ఫలాహారంబులును సేయుటయు నాచారమై యున్నదిగదా! కావున రాఁగల పర్వదినంబున సాయంకాలమున భవదీయభవనోద్యాన వాటికిం బురంబునంగల రాజన్య బాంధవులయందలి స్త్రీ పురుషుల నెల్లరావించి విందారగింపించి యచ్చటికేతెంచు ననుద్వాహితలకెల్ల నీకొమరునిచేఁ దత్తదుచితంబులగు బహుమానంబులోసంగునట్లొక యేర్పాటు కావింపుము. తత్సమయంబున నీసుతునకు వారిలోనేకన్నియవైపు మనసునిల్చునో నీవును బరీక్షించి యాకన్నియనే పరిణయమగునట్లు చేసెదవు గాక.
మిత్ర - మంత్రి! నీబుద్ధిబృహస్పతికిని లేదుగదా!
{{Center|{{p|fs125}}కవిరాజని రాజితము</p>}}
{{left margin|5em}}<poem>మనుజహృదంతరమానితవృత్తుల మారవిలాసవిహారముల౯
గనుఁగొనదక్షుఁడోకండిలనెవ్వఁడు కామవతుండగుమాత్ర నెబం
ధనములఁజిక్కినదర్పితుఁడందురు తద్దయుఁగన్నులుమూసికొన౯
మునియనిజ్ఞానముపూరెనటందురు బొందనుగూలుచుభూమినరా॥</poem> </div>
{{right|(అందఱు నిష్క్రమించుచున్నారు)}}<noinclude><references/></noinclude>
mlvdz2i8f9fpw5plt9imzxtplssbgm3
పుట:Sangitarasataran022902mbp.pdf/16
104
212197
553171
2026-04-15T13:00:27Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
553171
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>మద్ర - అతికించున్నాయి. తీయడంయెట్లా. యేడుపు పోనిస్తూ.
భద్ర - పుమ్మిరాచి తియ్వరాదు. చదుబుకొన్న భ్యామ్మర్లు కూడా వుమ్మి రాచి వుమ్మించి వుత్తరాలతికిస్తూవుండారు.
మద్ర — ఆజిగురేమిటనుకున్నావు. కోడిగుడ్డుసొన. అయితే సర్కారువుత్తరాలెవ్వళ్లూ యిప్పకుండా యీసంగల్పుతారంట నిజమేనా?
భద్ర - యిసంగల్చితే నాకి మోడీసస్తాడుగాని అందులో యాముండదో నూతూ యిందులో యిసంలేదులే.
మద్ర - (ఐప్పిగూచి) "మీ పుత్రమిత్రకళత్ర సహితముగా విచ్చేసి" అందరినీ రమ్మన్నమాటేరా.
భద్రా — అయితే సాధారణంగా శుభలేకల్లో "సకుటుంబసపరివారసహితంగా ” అని వాస్తారు. వీరిట్లారాశాకారేమిరా?
మద్ర — ఇదిగో యీమధ్య రాజు గారి పురోహిత్యుడు మిత్తరయ్య గారికిన్నీ వోరో సదువుకున్నా యనంట ఆయనకిన్ని దెబ్బలాటొచ్చింది. ఆసుబలేకల్లోదాసేది సుద్దబూతంట. తెలిసిందా.
భద్ర — సరిలే. పేర్లు మాత్తిరంబాగా గ్యాపకంబెట్టుకో మరిల్సిమోకు పోదాం రా.
{{right|(అని నిష్క్రమించుచున్నారు)}}
{{Center|{{p|fs125}}చతుర్ధరంగము - ఉద్యానవనము</p>}}
{{Center|'''(సర్వార్థసిద్ధుఁడును, ఛన్ను ఁడును బ్రవేశించుచున్నారు)'''}}
సర్వా - ఛన్నా! నేఁడు నామానసమునకింతటి యుత్సాహము కలుగుటకేమి కారణము ?
సీ॥ సేద పెద్దయటంచు భేదంబులరయక బంధువులర్కాడు సంభవ మొయే మొ?
ఆ స్యూ-్యసంప్రీతి కాకరంబగునట్టి కూటంబు:సమకూఱుకూర్మియే Is ?
దుఃఖంబులను బారఁదోలి సౌఖ్యము గ్రోలు సఖులఁగాం చెడినంత సంబోయే ?
పూపుఁదోఁటలఁగమ్మతావులీనెడు మేలు తీవ చెట్టులఁ గాంచుతృప్తియే మెం?
సీ! పూర్వధవశృతి సంస్కార బుద్ధియే మొ
యూహ సేయంగ రాని యుత్సాహ మొద వె<noinclude><references/></noinclude>
e4o9passa78qfqwq57l07szaj379nsm
553269
553171
2026-04-16T08:49:54Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553269
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మద్ర - అతికించున్నాయి. తీయడంయెట్లా. యేడుపు పోనిస్తూ.
భద్ర - పుమ్మిరాచి తియ్వరాదు. చదుబుకొన్న భ్యామ్మర్లు కూడా వుమ్మి రాచి వుమ్మించి వుత్తరాలతికిస్తూవుండారు.
మద్ర — ఆజిగురేమిటనుకున్నావు. కోడిగుడ్డుసొన. అయితే సర్కారువుత్తరాలెవ్వళ్లూ యిప్పకుండా యీసంగల్పుతారంట నిజమేనా?
భద్ర - యిసంగల్చితే నాకి మోడీసస్తాడుగాని అందులో యాముండదో నూతూ యిందులో యిసంలేదులే.
మద్ర - (ఐప్పిగూచి) "మీ పుత్రమిత్రకళత్ర సహితముగా విచ్చేసి" అందరినీ రమ్మన్నమాటేరా.
భద్రా — అయితే సాధారణంగా శుభలేకల్లో "సకుటుంబసపరివారసహితంగా ” అని వాస్తారు. వీరిట్లారాశాకారేమిరా?
మద్ర — ఇదిగో యీమధ్య రాజు గారి పురోహిత్యుడు మిత్తరయ్య గారికిన్నీ వోరో సదువుకున్నా యనంట ఆయనకిన్ని దెబ్బలాటొచ్చింది. ఆసుబలేకల్లోదాసేది సుద్దబూతంట. తెలిసిందా.
భద్ర — సరిలే. పేర్లు మాత్తిరంబాగా గ్యాపకంబెట్టుకో మరిల్సిమోకు పోదాం రా.
{{right|(అని నిష్క్రమించుచున్నారు)}}
{{Center|{{p|fs125}}చతుర్ధరంగము - ఉద్యానవనము</p>}}
{{Center|'''(సర్వార్థసిద్ధుఁడును, ఛన్నుఁడును బ్రవేశించుచున్నారు)'''}}
సర్వా - ఛన్నా! నేఁడు నామానసమునకింతటి యుత్సాహము కలుగుటకేమి కారణము ?
{{left margin|5em}}<poem>సీ॥ సేద పెద్దయటంచు భేదంబులరయక బంధువులర్కాడు సంభ్రవమొయేమొ?
ఆస్యూన్యసంప్రీతి౯ కాకరంబగునట్టి కూటంబు:సమకూఱుకూర్మియేమొ?
దుఃఖంబులనుబారఁదోలి సౌఖ్యముగ్రోలు సఖులఁగాంచెడినంత సంబోయేమొ?
పూపుఁదోఁటలఁగమ్మతావులీనెడు మేలుతీవచెట్టులఁ గాంచుతృప్తియేమొ?</poem> </div>
{{left margin|5em}}<poem>సీ॥ పూర్వభవకృతసంస్కార బుద్ధియేమొ
యూహ సేయంగరాని యుత్సాహ మొదవె</poem> </div><noinclude><references/></noinclude>
pjgktta3se8rt4y19f4ip2s9yyr78o9
553270
553269
2026-04-16T08:52:07Z
Brjswiki
6801
553270
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మద్ర - అతికించున్నాయి. తీయడంయెట్లా. యేడుపు పోనిస్తూ.
భద్ర - పుమ్మిరాచి తియ్వరాదు. చదుబుకొన్న భ్యామ్మర్లు కూడా వుమ్మి రాచి వుమ్మించి వుత్తరాలతికిస్తూవుండారు.
మద్ర — ఆజిగురేమిటనుకున్నావు. కోడిగుడ్డుసొన. అయితే సర్కారువుత్తరాలెవ్వళ్లూ యిప్పకుండా యీసంగల్పుతారంట నిజమేనా?
భద్ర - యిసంగల్చితే నాకి మోడీసస్తాడుగాని అందులో యాముండదో నూతూ యిందులో యిసంలేదులే.
మద్ర - (ఐప్పిగూచి) "మీ పుత్రమిత్రకళత్ర సహితముగా విచ్చేసి" అందరినీ రమ్మన్నమాటేరా.
భద్రా — అయితే సాధారణంగా శుభలేకల్లో "సకుటుంబసపరివారసహితంగా ” అని వాస్తారు. వీరిట్లారాశాకారేమిరా?
మద్ర — ఇదిగో యీమధ్య రాజు గారి పురోహిత్యుడు మిత్తరయ్య గారికిన్నీ వోరో సదువుకున్నా యనంట ఆయనకిన్ని దెబ్బలాటొచ్చింది. ఆసుబలేకల్లోదాసేది సుద్దబూతంట. తెలిసిందా.
భద్ర — సరిలే. పేర్లు మాత్తిరంబాగా గ్యాపకంబెట్టుకో మరిల్సిమోకు పోదాం రా.
{{right|(అని నిష్క్రమించుచున్నారు)}}
{{rule |6em }}
{{Center|{{p|fs125}}చతుర్ధరంగము - ఉద్యానవనము</p>}}
{{Center|'''(సర్వార్థసిద్ధుఁడును, ఛన్నుఁడును బ్రవేశించుచున్నారు)'''}}
{{rule |6em }}
సర్వా - ఛన్నా! నేఁడు నామానసమునకింతటి యుత్సాహము కలుగుటకేమి కారణము ?
{{left margin|5em}}<poem>సీ॥ సేద పెద్దయటంచు భేదంబులరయక బంధువులర్కాడు సంభ్రవమొయేమొ?
ఆస్యూన్యసంప్రీతి౯ కాకరంబగునట్టి కూటంబు:సమకూఱుకూర్మియేమొ?
దుఃఖంబులనుబారఁదోలి సౌఖ్యముగ్రోలు సఖులఁగాంచెడినంత సంబోయేమొ?
పూపుఁదోఁటలఁగమ్మతావులీనెడు మేలుతీవచెట్టులఁ గాంచుతృప్తియేమొ?</poem> </div>
{{left margin|5em}}<poem>సీ॥ పూర్వభవకృతసంస్కార బుద్ధియేమొ
యూహ సేయంగరాని యుత్సాహ మొదవె</poem> </div><noinclude><references/></noinclude>
anhltqpqjxque63oy5evwm8za4479sr
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/487
104
212198
553253
2026-04-16T06:10:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553253
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
మంకామీత్, దొలి, దర్పణ్ తదితర సినిమాలకు కూడా పనిచేశారు.
ఆదుర్తి వద్ద దర్శకత్వం, ఆత్రేయ వద్ద స్క్రిప్ట్ రైటింగ్ లొ పాల్గొని స్క్రీన్ ప్లేకు సంబంధించి మెళకువలు నేర్చుకున్నాడు.
ఇక మొదటి నుండి నటన పట్ల ఎంతో ఆసక్తి వున్న కారణంగా మాధవరావు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు
కూడా వేశారు. మంచి మనసులు సినిమాలో అక్కినేనికి మిత్రుడిగా, మూగమనసులులో సూర్యకాంతం ఇంట్లో వంట
వాడుగా, తేనె మనసులు, కన్నె మనసులు లో చిన్న పాత్రల్లో కనిపించారాయు, ఆదుర్తి దగ్గర పనిచేస్తున్నప్పుడే వెంకట్రామ రాజు అనే నిర్మాత సినిమా నిర్మించే ప్రయత్నాల్లో వుండగా మాధవరావుకి పరిచయం అయ్యారు. అలా వారి పరిచయం 'తాళిబొట్టు' సినిమా నిర్మాణానికి దారి తీసింది. అదే ఆయన తొలి సినిమా అయింది. ఆ సినిమాలో హీరోపాత్రకు కృష్ణ, హీరోయిన్ గా విజయ నిర్మల, ఇతర పాత్రల్లో కృష్ణంరాజు, రమాప్రభ, రాజబాబులు నటించారు. ఈ సినిమా కోసం కేవలం కథ కోసమే అనేక ఏళ్ళు కృషి చేశారు మాధవరావు. తాళిబొట్టు విజయవంతమైన సినిమాగా నిలవడంతో మాధవరావుకు మంచిపేరు వచ్చింది. అంతే కాకుండా ఆదుర్తిలాంటివాళ్ళు కూడా సినిమాని ప్రశంసించారు. అంతేకాదు హిందీలో సూరజ్ ఫిల్మ్స్ అనే సంస్థ సినిమా కోసం కొత్త దర్శకుడి కోసం వెతుకుతున్న తరుణంలో ఆదుర్తి సుబ్బారావు మాధవరావు పేరు సూచించడంతో ఆయనకు హింది సినిమా చేసే అవకాశం వచ్చింది. తెలంగాణ నుంచి వచ్చిన వాడు కావడంతోపాటు, హిందీ భాష పైన మంచి పట్టు వుండడం కూడా మాధవరావుకు కలిసొచ్చింది. సంజీవ్ కుమార్ హీరోగా నటించిన ఆ సినిమా 'సూరజ్ ఔర్ చందా' దానితోపాటు హిందిలో మాధవరావు 'బహారోంకి మంజిల్' సినిమానూ రూపొందించాడు. దానికి కొంచెం ముందే 1972లో శోభన్ బాబు, సావిత్రి, ప్రభాకర్ రెడ్డి, చంద్రకళలు ప్రధాన తారాగణంగా 'కన్నతల్లి' సినిమాకు దర్శకత్వం వహించారాయన.
దాని తర్వాత తన స్వస్థలం వరంగల్ చేరుకొని తెలంగాణకు చెందిన కథతో సినిమా తీయాలనే సంకల్పంతో కృషి చేయడం ఆరంబించారు. వరంగల్ లో కాకతీయ పిక్చర్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. వరంగల్ కు చెందిన కొంతమంది మిత్రుల్ని కలుపుకొని 1977లో దాశరథి రాసిన నవల 'చిల్లర దేవుళ్లు'ను సినిమాగా
తీసేందుకు పూనుకున్నారు.
నిజాం పరిపాలన కాలం నాటి అరాచకాలూ, అణచివేతలూ సాయుధ పోరాట నేపథ్యం పరిస్థితులు చిల్లర దేవుళ్లు నవలలో దాశరథి అత్యంత వాత్సవికంగా చిత్రించారు. ఆకాలం నాటి సామాజిక రాజకీయ నేపథ్యాన్ని నవలలో చిత్రించినంత సాధికారంగానే మాధవరావు తన పరిమితుల మేరకు తన సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. కొంత రియలిస్టిక్ ధోరణిలో చిత్రిస్తూనే ముందుకు సాగారు. చిల్లర దేవుళ్లు కథాకాలం 1936-42 ప్రాంతంలోనిది. కథాస్థలం తెలంగాణాలోని ఓ చిన్న పల్లెటూరు.
నవల ప్రారంభంలో సారంగపాణి అనే సంగీత ఉపాధ్యాయుడు బతుకుతెరువు కోసం విజయవాడ నుంచి ఆ ఊరికి వస్తాడు. ఊరి నడుమ దేశముఖ్ రామారెడ్డి గడీ ఉంటుంది. అది ఊరి మొత్తానికీ ఏకైక భవంతి కాగా కరణం
వెంకట్రావుతో పాటుగా మరికొందరికి మామూలు ఇళ్లు ఉంటాయి. మిగతా ఊరందరివీ పూరీ గుడిసెలు. నిజాం
పాలనలో సంప్రాప్తించిన అధికారం, స్వేచ్ఛలతో స్వార్థంతో దొర, కరణం ఊరిని పూర్తి ఆదిపత్యంతో పరిపాలిస్తూ
ఉంటారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న దొర పాణికి తన గడీలో ఆశ్రయమిస్తాడు. రోజు సారంగపాణి పాటలు వింటూ, అతనికి ఊళ్ళో కరణం కూతురు తాయారుతో పాటుగా రెండు మూడు సంగీత పాఠాలు ఏర్పాటు చేస్తాడు.
సారంగపాణికి ఊళ్ళో దొర సాగిస్తున్న ఎదురులేని పాలనతో పాటు ఆయన మాటే శాసనమని తెలుస్తుంది. తన అధికారాన్ని ఏమాత్రం తక్కువ చేసినా దొర ఎలాంటి కఠిన శిక్షలు విధిస్తాడో తెలుస్తుంటుంది. దొరకే, కరణానికి
నడుము స్వార్ధపూరితమైన వైరం వున్నా ప్రజల్ని అణచివేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇద్దరూ ఏకమైపోవడం
కూడా చూస్తాడు. గడీలో ఆడబానిసగా పనిచేస్తున్న వనజది వేశ్యకన్నా దారుణమైన జీవితం. ఐతే ఆమె సారంగపాణిని
ప్రేమిస్తుంది. దొర కూతురు మంజరి, మరోవైపు కరణం కూతురు తాయారు కూడా అతనిపై మనసు పడతారు.<noinclude><references/></noinclude>
rduer0oqla8vw9lz0b52u6y2i80yr46
పుట:Sangitarasataran022902mbp.pdf/17
104
212199
553287
2026-04-16T09:11:20Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
553287
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>మానసంబునకొకరీతి మార్పుకలిగెఁ
జొన్నెలివియెట్టిఫలను సూచించునెక్కొ</poem> </div>
ఛన్ను — రాజకుమారా! ఈయుత్సాహము శుభమునే సూచించునుగదా! అదిగో! రాజబంధువులందఱును విచ్చేయుచున్నారు. శుద్ధోదనమహారాజును గౌతమీ దేవియును వచ్చియున్నారు.
(మంత్రి బంధువులు మొదలగువారితో శుద్ధోదన గౌతములు ప్రవేశించుచున్నారు)
గౌత — నాథా! మనముద్దులకొమరుఁడగు సర్వార్థసిద్ధునిగూర్చి జనులాడికొను పల్కులు విశ్వసనీయములుకావుసుమీ! ఆతనిమొగమెట్లు
వికసించుచున్నదో వీక్షింపుము.
{{Center|{{p|fs125}}పంచచామరము</p>}}
{{left margin|5em}}<poem>మొగంబునంగణింపరాని మొల్కనవ్వులూరగా
సగంబువాంచియున్న కన్ను జాణయంచుఁదెల్పఁగా
వగల్ నిగుడ గాఁబదారు వన్నె మేల్మిమేనితో
మృగాంకబింబమోయనంగ మించియేగుదెంచెడి౯</poem> </div>
శుద్ధో — ప్రాణేశ్వరీ! నేఁడీతనిముఖవికాసము నాకునువింతగనేయున్నది. ఇట్లుండుట మనయదృష్టమే. వేగమేయాతనింబిలిచి యిచ్చటికివిచ్చేసియున్న రాజశేఖరుల సన్మానించెదముగాక. (ముందునడచి సర్వార్థసిద్ధునిజూచి) కుమారా! సిద్ధార్థా! నాకోరికకు మారు విప్పకవిచ్చేసియున్న రాజన్యవరులనుచిత రీతినిమన్ననజేయుము.
ఉ మన్న నఁజేసియన్యులను మాన్యులు గా రితలంపసజ్జనుల్
మన్ను సుమిన్ను గానక ప్ర్రమత్తులు గా రెగణింపదుర్జనుల్
త్రొన్నె లఁ గాంచిసంతె నీలి కోలుఁజకోరముసన్న వెన్నె లక్షా
గన్నులు నెత్తిఁ బెట్టుకొని కాంచదుఘూశములోక బాంధవుస్
1
సర్వా—తండ్రీ ! నీయాజ్ఞశిరసావహించెద..
పాట. శంకరాభరణము
ఏళ.
ఎంతయు సంత సమందుచుకో" దయసేయతో వేడెద -భూవరులను వినుముఁ
ఇంతులు బాలురు నెల్లరుగూడ<noinclude><references/></noinclude>
emvpafjlwvd3tc8v46jt6pab43cx3ip
553294
553287
2026-04-16T10:10:19Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553294
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>మానసంబునకొకరీతి మార్పుకలిగెఁ
జొన్నెలివియెట్టిఫలను సూచించునెక్కొ</poem> </div>
ఛన్ను — రాజకుమారా! ఈయుత్సాహము శుభమునే సూచించునుగదా! అదిగో! రాజబంధువులందఱును విచ్చేయుచున్నారు. శుద్ధోదనమహారాజును గౌతమీ దేవియును వచ్చియున్నారు.
(మంత్రి బంధువులు మొదలగువారితో శుద్ధోదన గౌతములు ప్రవేశించుచున్నారు)
గౌత — నాథా! మనముద్దులకొమరుఁడగు సర్వార్థసిద్ధునిగూర్చి జనులాడికొను పల్కులు విశ్వసనీయములుకావుసుమీ! ఆతనిమొగమెట్లు
వికసించుచున్నదో వీక్షింపుము.
{{Center|{{p|fs125}}పంచచామరము</p>}}
{{left margin|5em}}<poem>మొగంబునంగణింపరాని మొల్కనవ్వులూరగా
సగంబువాంచియున్న కన్ను జాణయంచుఁదెల్పఁగా
వగల్ నిగుడ గాఁబదారు వన్నె మేల్మిమేనితో
మృగాంకబింబమోయనంగ మించియేగుదెంచెడి౯</poem> </div>
శుద్ధో — ప్రాణేశ్వరీ! నేఁడీతనిముఖవికాసము నాకునువింతగనేయున్నది. ఇట్లుండుట మనయదృష్టమే. వేగమేయాతనింబిలిచి యిచ్చటికివిచ్చేసియున్న రాజశేఖరుల సన్మానించెదముగాక. (ముందునడచి సర్వార్థసిద్ధునిజూచి) కుమారా! సిద్ధార్థా! నాకోరికకు మారు విప్పకవిచ్చేసియున్న రాజన్యవరులనుచిత రీతినిమన్ననజేయుము.
{{left margin|5em}}<poem>ఉ మన్న నఁజేసియన్యులను మాన్యులు గా రితలంపసజ్జనుల్
మన్ను సుమిన్ను గానక ప్ర్రమత్తులు గా రెగణింపదుర్జనుల్
త్రొన్నె లఁ గాంచిసంతె నీలి కోలుఁజకోరముసన్న వెన్నె లక్షా
గన్నులు నెత్తిఁ బెట్టుకొని కాంచదుఘూశములోక బాంధవు౯</poem> </div>
సర్వా — తండ్రీ! నీయాజ్ఞశిరసావహించెద.
{{Center|{{p|fs125}}పాట. శంకరాభరణము-ఏక</p>}}
ఎంతయుసంత సమందుచు౯ దయసేయ౯ వేడెద - భూవరులనువినుము: ఎ:
ఇంతులుబాలురునెల్లరుగూడ౯<noinclude><references/></noinclude>
fzev40lsmfs37fhtmag95xq3nrcrm0g
553296
553294
2026-04-16T10:13:44Z
Brjswiki
6801
553296
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>మానసంబునకొకరీతి మార్పుకలిగెఁ
జొన్నెలివియెట్టిఫలను సూచించునెక్కొ</poem> </div>
ఛన్ను — రాజకుమారా! ఈయుత్సాహము శుభమునే సూచించునుగదా! అదిగో! రాజబంధువులందఱును విచ్చేయుచున్నారు. శుద్ధోదనమహారాజును గౌతమీ దేవియును వచ్చియున్నారు.
(మంత్రి బంధువులు మొదలగువారితో శుద్ధోదన గౌతములు ప్రవేశించుచున్నారు)
గౌత — నాథా! మనముద్దులకొమరుఁడగు సర్వార్థసిద్ధునిగూర్చి జనులాడికొను పల్కులు విశ్వసనీయములుకావుసుమీ! ఆతనిమొగమెట్లు
వికసించుచున్నదో వీక్షింపుము.
{{Center|{{p|fs125}}పంచచామరము</p>}}
{{left margin|5em}}<poem>మొగంబునంగణింపరాని మొల్కనవ్వులూరగా
సగంబువాంచియున్న కన్ను జాణయంచుఁదెల్పఁగా
వగల్ నిగుడ గాఁబదారు వన్నె మేల్మిమేనితో
మృగాంకబింబమోయనంగ మించియేగుదెంచెడి౯</poem> </div>
శుద్ధో — ప్రాణేశ్వరీ! నేఁడీతనిముఖవికాసము నాకునువింతగనేయున్నది. ఇట్లుండుట మనయదృష్టమే. వేగమేయాతనింబిలిచి యిచ్చటికివిచ్చేసియున్న రాజశేఖరుల సన్మానించెదముగాక. (ముందునడచి సర్వార్థసిద్ధునిజూచి) కుమారా! సిద్ధార్థా! నాకోరికకు మారు విప్పకవిచ్చేసియున్న రాజన్యవరులనుచిత రీతినిమన్ననజేయుము.
{{left margin|5em}}<poem>ఉ॥ మన్న నఁజేసియన్యులను మాన్యులు గా రితలంపసజ్జనుల్
మన్ను సుమిన్ను గానక ప్ర్రమత్తులు గా రెగణింపదుర్జనుల్
త్రొన్నె లఁ గాంచిసంతె నీలి కోలుఁజకోరముసన్న వెన్నె లక్షా
గన్నులు నెత్తిఁ బెట్టుకొని కాంచదుఘూశములోక బాంధవు౯</poem> </div>
సర్వా — తండ్రీ! నీయాజ్ఞశిరసావహించెద.
{{Center|{{p|fs125}}పాట. శంకరాభరణము-ఏక</p>}}
ఎంతయుసంత సమందుచు౯ దయసేయ౯ వేడెద - భూవరులనువినుము: ఎ:
ఇంతులుబాలురునెల్లరుగూడ౯<noinclude><references/></noinclude>
rx6qimrjeb5yaqjyhff81nbwez1rdl3
పుట:Sangitarasataran022902mbp.pdf/18
104
212200
553302
2026-04-16T10:54:33Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553302
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ఇంతయుసందియమందకయెందు౯
వింతలెల్లఁగడువేడ్క జనింప౯
విలసిలుమనసుల వేమరుఁనుగొన॥</poem> </div>
రాజులు — నయవిశారదులును నీతిపొరగులును రాజకులాగ్రగణ్యులునైన మియట్టి నారలకీమర్యాదలు సహజములేకదా! రాజా! మాకెల్లరకును నేకొఱంతయునులేదు, అండఱము నాసీనులమైతిమి. (అనికూర్చుందురు.)
మంత్రి — —మహాప్రభూ! విచ్చేసియున్న పెద్దలకెల్లరకు శ్రవణానందకరంబుగాఁ గన్యకామణుల, గాసరసామృతముల నిచ్చపుట్టుచున్నది
కదా!
శుద్ధో —— అట్లయిన సిద్ధార్థా! నీస్థానమును నీవుగ్రహింపుము. కన్యలారా! కిన్నరలంబోలు మీమృదుకంఠశనాళంలులతో గానంబుచేసి
యెల్లరనానందింపంజేయుడు.
కన్యకలు — (వరుసగానిల్చి)
{{Center|{{p|fs125}}పాట. యమున - ఏక తాళము.</p>}}
{{left margin|5em}}<poem>మంగళ మోహనశౌరీ - మంజులకంజవిహారీ
రంజితగోకులనారీ – భంజితనిర్జరివైరీ
నందసుతమురాహారీ - బంధుర మురళీధారీ
బృందావనసంచారీ - మందరభూధరధారీ॥</poem> </div>
మంత్రి — బాలికలారా! గంధర్వకాంతలకును నందరానిస్థాయిప్రచారముచేసి మీరుపొడినపాటలకీ సభికులహృదయంబు లానంద పారవశ్యంబుమెందియున్నవి. రాజకుమారా! వీరలకింక యథావిధిఁబారితోషికములీయవేఁడెదను.
సర్వా - మంత్రి! అట్లేకావించెదఁగాక. (కన్నెలతో) కన్యకలారా! మీరెల్లరు నుక్కరొక్కరుగాసేతెంచి మీరుచదివినపొత్తంబులంగల
కొత్తపద్యము లెవ్వియైన మీయిచ్చవచ్చినవానింబఠంచి బహుమానంబులంగైకొనఁడు.
కన్య — {{left margin|5em}}<poem>గీ॥ సింగమునకునోట శిరముఁబెట్టఁగవచ్చుఁ
దాచుబాముకోఱఁదాకవచ్చుఁ
గఱళుకుటమ్ముపైనఁ గన్ను మోపఁగవచ్చుఁ
జెడిపతోడి చెల్మిసేయరాదు॥</poem> </div>
సర్వా — బాలికామణీ! ఈయంగుళీయకముఁగొమ్ము.<noinclude><references/></noinclude>
sbv164tqxzrj7f3r3ee1yhlh64iig7w
553304
553302
2026-04-16T10:56:38Z
Brjswiki
6801
553304
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ఇంతయుసందియమందకయెందు౯
వింతలెల్లఁగడువేడ్క జనింప౯
విలసిలుమనసుల వేమరుఁనుగొన॥</poem> </div>
రాజులు — నయవిశారదులును నీతిపొరగులును రాజకులాగ్రగణ్యులునైన మియట్టి నారలకీమర్యాదలు సహజములేకదా! రాజా! మాకెల్లరకును నేకొఱంతయునులేదు, అండఱము నాసీనులమైతిమి. (అనికూర్చుందురు.)
మంత్రి — —మహాప్రభూ! విచ్చేసియున్న పెద్దలకెల్లరకు శ్రవణానందకరంబుగాఁ గన్యకామణుల, గాసరసామృతముల నిచ్చపుట్టుచున్నది
కదా!
శుద్ధో —— అట్లయిన సిద్ధార్థా! నీస్థానమును నీవుగ్రహింపుము. కన్యలారా! కిన్నరలంబోలు మీమృదుకంఠశనాళంలులతో గానంబుచేసి
యెల్లరనానందింపంజేయుడు.
కన్యకలు — (వరుసగానిల్చి)
{{Center|{{p|fs125}}పాట. యమున - ఏక తాళము.</p>}}
{{left margin|5em}}<poem>మంగళ మోహనశౌరీ - మంజులకంజవిహారీ
రంజితగోకులనారీ – భంజితనిర్జరివైరీ
నందసుతమురాహారీ - బంధుర మురళీధారీ
బృందావనసంచారీ - మందరభూధరధారీ॥</poem> </div>
మంత్రి — బాలికలారా! గంధర్వకాంతలకును నందరానిస్థాయిప్రచారముచేసి మీరుపొడినపాటలకీ సభికులహృదయంబు లానంద పారవశ్యంబుమెందియున్నవి. రాజకుమారా! వీరలకింక యథావిధిఁబారితోషికములీయవేఁడెదను.
సర్వా - మంత్రి! అట్లేకావించెదఁగాక. (కన్నెలతో) కన్యకలారా! మీరెల్లరు నుక్కరొక్కరుగాసేతెంచి మీరుచదివినపొత్తంబులంగల
కొత్తపద్యము లెవ్వియైన మీయిచ్చవచ్చినవానింబఠంచి బహుమానంబులంగైకొనఁడు.
కన్య — {{left margin|5em}}<poem>గీ॥ సింగమునకునోట శిరముఁబెట్టఁగవచ్చుఁ
దాచుబాముకోఱఁదాకవచ్చుఁ
గఱళుకుటమ్ముపైనఁ గన్ను మోపఁగవచ్చుఁ
జెడిపతోడి చెల్మిసేయరాదు॥</poem> </div>
సర్వా — బాలికామణీ! ఈయంగుళీయకముఁగొమ్ము.<noinclude><references/></noinclude>
5sdvmydbtje9mqzhbiwktze6hhjagd6
553305
553304
2026-04-16T10:57:29Z
Brjswiki
6801
553305
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ఇంతయుసందియమందకయెందు౯
వింతలెల్లఁగడువేడ్క జనింప౯
విలసిలుమనసుల వేమరుఁనుగొన॥</poem> </div>
రాజులు — నయవిశారదులును నీతిపొరగులును రాజకులాగ్రగణ్యులునైన మియట్టి నారలకీమర్యాదలు సహజములేకదా! రాజా! మాకెల్లరకును నేకొఱంతయునులేదు, అండఱము నాసీనులమైతిమి. (అనికూర్చుందురు.)
మంత్రి — —మహాప్రభూ! విచ్చేసియున్న పెద్దలకెల్లరకు శ్రవణానందకరంబుగాఁ గన్యకామణుల, గాసరసామృతముల నిచ్చపుట్టుచున్నది
కదా!
శుద్ధో —— అట్లయిన సిద్ధార్థా! నీస్థానమును నీవుగ్రహింపుము. కన్యలారా! కిన్నరలంబోలు మీమృదుకంఠశనాళంలులతో గానంబుచేసి
యెల్లరనానందింపంజేయుడు.
కన్యకలు — (వరుసగానిల్చి)
{{Center|{{p|fs125}}పాట. యమున - ఏక తాళము.</p>}}
{{left margin|5em}}<poem>మంగళ మోహనశౌరీ - మంజులకంజవిహారీ
రంజితగోకులనారీ – భంజితనిర్జరివైరీ
నందసుతమురాహారీ - బంధుర మురళీధారీ
బృందావనసంచారీ - మందరభూధరధారీ॥</poem> </div>
మంత్రి — బాలికలారా! గంధర్వకాంతలకును నందరానిస్థాయిప్రచారముచేసి మీరుపొడినపాటలకీ సభికులహృదయంబు లానంద పారవశ్యంబుమెందియున్నవి. రాజకుమారా! వీరలకింక యథావిధిఁబారితోషికములీయవేఁడెదను.
సర్వా - మంత్రి! అట్లేకావించెదఁగాక. (కన్నెలతో) కన్యకలారా! మీరెల్లరు నుక్కరొక్కరుగాసేతెంచి మీరుచదివినపొత్తంబులంగల
కొత్తపద్యము లెవ్వియైన మీయిచ్చవచ్చినవానింబఠంచి బహుమానంబులంగైకొనఁడు.
కన్య — {{left margin|5em}}<poem>గీ॥ సింగమునకునోట శిరముఁబెట్టఁగవచ్చుఁ
దాచుబాముకోఱఁదాకవచ్చుఁ
గఱళుకుటమ్ముపైనఁ గన్ను మోపఁగవచ్చుఁ
జెడిపతోడి చెల్మిసేయరాదు॥</poem> </div>
సర్వా — బాలికామణీ! ఈయంగుళీయకముఁగొమ్ము.<noinclude><references/></noinclude>
q9b7xbi7cygwv1bbxlfpiuol0drbvwf
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/పిల్లంగ్రోవి
0
212201
553307
2026-04-16T11:04:33Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = | previous = [[../నేల/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="306" to="309" /> {{PD-India}} [[వర్గం:కథలు]]'
553307
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section =
| previous = [[../నేల/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="306" to="309" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
p9utu02dvcr2gykmojkgyyfe9pcf9p2
553308
553307
2026-04-16T11:04:51Z
Rajasekhar1961
50
553308
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = పిల్లంగ్రోవి
| previous = [[../నేల/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="306" to="309" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
e477japcoqy82healn0xj19hsx3f0f3
553309
553308
2026-04-16T11:05:23Z
Rajasekhar1961
50
553309
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = పిల్లంగ్రోవి
| previous = [[../నేల/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="306" to="308" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
6aw4k4z7kd8yfdq8u5rakq0vzvhlpaj
553335
553309
2026-04-16T11:50:17Z
Rajasekhar1961
50
553335
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = పిల్లంగ్రోవి
| previous = [[../నేల/]]
| next = [[../వింధ్యాచలం/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="306" to="308" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
7ao9hrr0y8xrdscygx7l7gvac12uahd
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/వింధ్యాచలం
0
212202
553310
2026-04-16T11:06:28Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = వింధ్యాచలం | previous = [[../పిల్లంగ్రోవి/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="309" to="348" /> {{PD-India}} [[వర్గం:కథలు]]'
553310
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = వింధ్యాచలం
| previous = [[../పిల్లంగ్రోవి/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="309" to="348" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
5xsc0b406w5vw76dpyg7nmiogrheqcy
553312
553310
2026-04-16T11:07:47Z
Rajasekhar1961
50
553312
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = వింధ్యాచలం
| previous = [[../పిల్లంగ్రోవి/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="309" to="341" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
d87rh0xgbxcreueeuedfql7t3ekpij7
553334
553312
2026-04-16T11:49:43Z
Rajasekhar1961
50
553334
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = వింధ్యాచలం
| previous = [[../పిల్లంగ్రోవి/]]
| next = [[../వడగళ్ళు/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="309" to="341" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
febu8chjsopbqqgvleou5mlllq3pytt
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/వడగళ్ళు
0
212203
553313
2026-04-16T11:09:07Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = వడగళ్ళు | previous = [[../వింధ్యాచలం/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="342" to="352" /> {{PD-India}} [[వర్గం:కథలు]]'
553313
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = వడగళ్ళు
| previous = [[../వింధ్యాచలం/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="342" to="352" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
7k4afggwxykk6lo5lx9swh0eg9w4fd3
553333
553313
2026-04-16T11:49:11Z
Rajasekhar1961
50
553333
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = వడగళ్ళు
| previous = [[../వింధ్యాచలం/]]
| next = [[../బండరాళ్ళు/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="342" to="352" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
ikwn4csq3yr9000ubr0vdy0goyp8myh
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/బండరాళ్ళు
0
212204
553314
2026-04-16T11:10:46Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = బండరాళ్ళు | previous = [[../వడగళ్ళు/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="353" to="357" /> {{PD-India}} [[వర్గం:కథలు]]'
553314
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = బండరాళ్ళు
| previous = [[../వడగళ్ళు/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="353" to="357" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
77jcmnpooyne4nd6ysxxrzfiyuuh1jx
553315
553314
2026-04-16T11:11:27Z
Rajasekhar1961
50
553315
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = బండరాళ్ళు
| previous = [[../వడగళ్ళు/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="353" to="356" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
o7dkbifowv6c51jlj245oyzz73703ze
553332
553315
2026-04-16T11:48:42Z
Rajasekhar1961
50
553332
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = బండరాళ్ళు
| previous = [[../వడగళ్ళు/]]
| next = [[../సంగమేశ్వరం/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="353" to="356" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
8akxb4jax3q559pr90hdpsr44bxe5b1
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/సంగమేశ్వరం
0
212205
553317
2026-04-16T11:12:46Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = సంగమేశ్వరం | previous = [[../బండరాళ్ళు/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="357" to="366" /> {{PD-India}} [[వర్గం:కథలు]]'
553317
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = సంగమేశ్వరం
| previous = [[../బండరాళ్ళు/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="357" to="366" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
ib2jv8d4vajnphao72ls17wzs7g6j5u
553318
553317
2026-04-16T11:13:31Z
Rajasekhar1961
50
553318
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = సంగమేశ్వరం
| previous = [[../బండరాళ్ళు/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="357" to="364" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
e1omr6ur8t4dhbx7p5n3sr83fa26vms
553328
553318
2026-04-16T11:47:04Z
Rajasekhar1961
50
Rajasekhar1961, [[అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/36. సంగమేశ్వరం]] పేజీని [[అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/సంగమేశ్వరం]] కు తరలించారు
553318
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = సంగమేశ్వరం
| previous = [[../బండరాళ్ళు/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="357" to="364" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
e1omr6ur8t4dhbx7p5n3sr83fa26vms
553331
553328
2026-04-16T11:48:16Z
Rajasekhar1961
50
553331
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = సంగమేశ్వరం
| previous = [[../బండరాళ్ళు/]]
| next = [[../రాధారి బండ్లు/]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="357" to="364" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
99tj29zyg7xp6kxac8nohfzo8jyvnjc
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/రాధారి బండ్లు
0
212206
553319
2026-04-16T11:14:26Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{header | title = [[../]] | author = అడివి బాపిరాజు | translator = | section = రాధారి బండ్లు | previous = [[../సంగమేశ్వరం/]] | next = [[..//]] | notes = }} <pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="365" to="369" /> {{PD-India}} [[వర్గం:కథలు]]'
553319
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = రాధారి బండ్లు
| previous = [[../సంగమేశ్వరం/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="365" to="369" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
kokmjjujaqzbz4kzxt7g5qih6wuoe8p
553320
553319
2026-04-16T11:15:19Z
Rajasekhar1961
50
553320
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = అడివి బాపిరాజు
| translator =
| section = రాధారి బండ్లు
| previous = [[../సంగమేశ్వరం/]]
| next = [[..//]]
| notes =
}}
<pages index="Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf" from="365" to="370" />
{{PD-India}}
[[వర్గం:కథలు]]
gif36fy6i6gq8ne557k4zdtit39xcba
పుట:Sangitarasataran022902mbp.pdf/19
104
212207
553324
2026-04-16T11:30:09Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
553324
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>కన్య ౧ - మహాప్రపాదము (అని పుచ్చుకొని స్థానమును కేగును).
కన్య ౨ - గీ॥ నీల దొండపండుఁగోరుఁ ధోరంపుకీరంబు
నంబుజంబుఁగోరు హంసయెందు
కుసుమరసముఁగ్రోలఁ గోరుఁదుమ్మెదఱోఁడు
వారివారిరుచులు వేఱుగావె॥
సర్వా — యువతీమణీ! ఈరత్న కంకణమునుగొనుము (ఆనియిచ్చును).
కన్య ౨ — (స్వీకరించి) మహాప్రసాదము (అని స్థానమును జేరును).
కన్య 3 - గీ॥ పూపజాబిలివలె మోముగల్గినగాని
వారిజాక్షికీరవాణియైన
కొలముగొప్పదైన కోరినసిరులున్న
గొనములేక యున్న వనితకాదు।
సర్వా — పొలతీ, యీముత్యాలసరముగైకొనుము (అనియిచ్చును).
కన్య 3 — చిత్తముదేవా! (అనిపుచ్చుకొని స్థానమునుజేరును).
కన్య ౪ — గీ॥ కార్యమెంచువాఁడు శౌర్యవంతుఁడుగాఁడు
దీవిశాలుఁ డెపుడుఁ దెలిసెననఁడు
జ్ఞానియైనవాని జనులెఱుంగఁగ లేకు
నివురుగప్పియున్న నిప్పునుమ్ముః
17
17
సర్వావధూమణీ ! నీవాక్యములు కడుహృద్యములు. ఈరత్న హారముకొమ్ము
(అనియిచ్చుచున్నా (డు).
కన్య ర—మహాప్రసాదము (అనిపుచ్చుకొని స్థానమును జేరును).
సర్వా—ఇతర బాలికలారా! మీమీ బహుమానములు స్వీకరింపుఁడు.
ఇతరక స్యలు ---మహాస్త్ర పాదము, ధన్యః మైతిమిదేవా! (అనిపుచ్చుకొని స్థానముఁడే
రుదురు).
యశోధర (చేతులుహృదయముననుంచి కనులెత్తి చూచి)
సీ| పొంగుచున్న ప్రేమపొరలి పైఁబడు గాని
దాచియుంచ నేరితరముగాదు
వెల్లి ఒరిసియేఱు విచ్చలవిడి పారు
కడలిఁ జేరినిలు చుఁగలక విడుచు||<noinclude><references/></noinclude>
e3x0spxjbtkgfw92sjlqau7v99nvd1x
అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/36. సంగమేశ్వరం
0
212208
553329
2026-04-16T11:47:05Z
Rajasekhar1961
50
Rajasekhar1961, [[అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/36. సంగమేశ్వరం]] పేజీని [[అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/సంగమేశ్వరం]] కు తరలించారు
553329
wikitext
text/x-wiki
#దారిమార్పు [[అడివి బాపిరాజు రచనలు–8/శైలబాల/సంగమేశ్వరం]]
6zcriuc5wipg62h25s3rsfd5qbxbs97