వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.46.0-wmf.24
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
పుట:Sarada Lekhalu Vol 1.pdf/19
104
59173
553546
552733
2026-04-17T11:58:03Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
553546
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/ప్రథమ లేఖ|ప్రథమ లేఖ 1—5.]]}}
|}}
{{smaller|లేఖావసర ప్రస్తావన, సం॥ 1928 రపు రాష్ట్రీయ సంఘసంస్కరణ మహాసభా విషయవిచారణ; సుఖదేశాటనోపాయసూచన మొదలగునవి.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/2-వ లేఖ|2-వ లేఖ 6—18.]]}}
|}}
{{smaller|భాషావిషయకము; శ్రీ కాళహస్తి క్షేత్రప్రశంస; ఏతత్పూర్వగాధా నిరూపణము; స్థలప్రాశస్త్యవిచారణ; దేశీయవస్తుప్రశంస;}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/3-వ లేఖ|3-వ లేఖ 19—24.]]}}
|}}
{{smaller|శ్రీమతి సరోజినీదేవీ దర్శన ప్రశంస, మదనపల్లియందు హిందూ స్త్రీ సమాజమువారి సభాప్రమేయము; ఏతదధ్యక్ష ప్రసంగసంగ్రహము; ఖద్దరు ప్రశంస.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/4-వ లేఖ|4-వ లేఖ 25—38.]]}}
|}}
{{smaller|తిరుపతినుండి యింటికి; శర్మిష్ఠాకళ్యాణము; శారదాచట్ట తర్కము; దుఃఖభాగినియగు నొక యువతీమణి కథ; శారదా శాసనావశ్యకతా నిరూపణము;}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/5-వ లేఖ|5-వ లేఖ 39—48.]]}}
|}}
{{smaller|పూర్వలేఖ యందలి జెప్పఁబడిన మరియొక కష్టజీవినియొక్క వృత్తాంత సమాప్తి; శారదాశాసనవాదములు.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/6-వ లేఖ|6-వ లేఖ 49—57.]]}}
|}}
{{smaller|గుంటూరునందలి శారదానికేతన ప్రశంస; ఏతద్వార్షికోత్సవాది వివరణము.}}<noinclude></noinclude>
bmv4nx1mim4m3jkwwrqsnis37rqmkxi
పుట:Sarada Lekhalu Vol 1.pdf/68
104
59223
553346
469490
2026-04-16T12:01:45Z
శ్రీరామమూర్తి
1517
/* మూల్యాంకన చేసారు */
553346
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{rh|44|శారదలేఖలు|}}</noinclude>"వేయిమాటలతో నన్ను విసిగింపవలదు. నాకామె యక్కరలేదు. ముమ్మాటి కక్కరలేదు.” ఎందరెన్ని విధముల నడిగినను ఆతడిచ్చు సమాధానమిది, తండ్రి యాతనికి సహాయము.
ఈ విధముగా నెనిమిది వత్సరములు గడచినవి. అతడు బి. ఏ. బి. యల్. పరీక్షనిచ్చి చెన్నపురిలో నొకవత్సరము అప్రెంటిసు చేసి హైకోర్టువకీలు పట్టమునుబడసి స్వపురమునకు వచ్చి వకీలుపని చేయుచున్నాడు. వెనుకటి భార్యవిషయమై జాలి వారికెందుకు? ఎవరో కక్కుర్తి మనుష్యులువచ్చి నాలుగు సంచులు కుమ్మరించి పిల్లనిచ్చి పెండ్లిచేసినారు. ఆపిల్ల యేడాదిలోనే కాపురమునకు వచ్చినది. పసి నిమ్మపండువంటి కొమారుడుగూడ కలిగినాడు. అతని సుఖమేమో అతడు చూచికొనినాడు. కాని యీ భార్యవిషయమై మాత్ర మాతనికి యోచనయేలేదు. అతను సుఖముగా నున్నందుకు నేను విచారించుట లేదు. కాని యీ పతిపరిత్యక్త గతియేమి? కానీపెట్టి కొనిన కాయగూరనైన ఉపయోగ యోగ్యముగా నున్నంతవరకు విసిరి పాఱవేయముగదా! అట్టిచో అగ్నిసాక్షిగా పెండ్లాడిన భార్య నావిద్యాధికు డెంతసులువుగా పరిత్యజించెనో చూడుడు. ఆ కాయగూరలపాటి గౌరవమున కర్షగాదా? అగ్నిసాక్షిగా వివాహమాడిన కళత్రము! ఇట్టివాడు పెద్దమనిషి చదువరీ, పైన న్యాయవాది, స్త్రీలకు ధర్మశాసనముల సాయములేదు, లోక సానుభూతిలేదు, వైవాహిక స్వాతం<noinclude></noinclude>
nmoneuo6vxdqmywrastzvciumm3cie1
పుట:Sarada Lekhalu Vol 1.pdf/69
104
59224
553357
553218
2026-04-16T13:59:00Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553357
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|45}}</noinclude>త్ర్యము లేదు. బంధువర్గపు తోడ్పాటులేదు. సంఘసహకారము లేదు. ఇక నేమి చేయును? పురుషుని స్వార్థమునకు బలియై పోవును. మా చెల్లెలని నే నభిమానముతోఁ జెప్పుటలేదు. ఆ బాలిక యెంత యుత్తము రాలనుకొంటిరి? ఆ అమాయకమునకు ఆ సౌమ్య భాషణములకు, ఆ వినయసంపత్తికి, ఆవిద్యాసంపత్తి కామె శ్రీరామచంద్రుని యిల్లాలైన యా సీతమ్మకేసాటి. ఇల్లువదలి యీవలికిరాదు; ఎవరితోడను మాట్లాడదు; ఏ లోకాభిరామాయణములకు బోదు; ప్రపంచపుగొడవే యామె కక్కరలేదు. ఉన్నప్పుడు పని లేనియప్పుడు గ్రంథము. ఈ రెండే యామె కాలక్షేప సాధనములు. ఆమె యెప్పుడును పెద్దగా యేడ్చినట్లు చూడలేదు. కాని యావిశాల లోలలోచనముల యందు లజ్జాదుఃఖములు స్థిరనివాస మేర్పరచుకొనినట్లామె మ్లానవదనమును తిలకించినవారికి స్ఫుటముగా గన్పట్టుచుండును. ఆమె సాధారణముగా నవ్వనే నవ్వదు. ఒక వేళ నవ్వినను చిఱునవ్వే! ఆ నవ్వులోగూడ జీవములేదు, చూడు ఒక స్త్రీ జీవితమొక పురుషునిపై నెట్లు నిర్భరపడియున్నదో! ఒక స్త్రీ ప్రాణముదీసిన నేరముకంటె నొకస్త్రీ సుఖమును, సంతోషమును, ఉత్సాహోల్లాసములను నాశముజేసి జీవన్మృతురాలనుగాఁ జేసిననేరము బలవత్తరమైనది. కాని ప్రథమనేరమున కురిశిక్షవేయుదురు. కాని ద్వితీయనేరమునకు పరిశీలనయేలేదు.
ఈ జీవన్మృత్యావస్థకన్న బలవన్మరణమే మేలనిగదా పెక్కుమందిస్త్రీ లే నూతిలోనో గోతిలోనోపడి చచ్చుచుందురు. ఇట్టి మరణములకు పంచాయతీసంఘము లే కడుపునొప్పియో<noinclude></noinclude>
2rtdm5yni04zrpt62uoyitds8ervwxf
పుట:Sarada Lekhalu Vol 1.pdf/70
104
59225
553358
553219
2026-04-16T14:05:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553358
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|46|శారదలేఖలు|}}</noinclude>మూర్ఛయో పిచ్చియో హేతువని నిరూపించినను పతి నిరాదరణమే యదార్థహేతు వనునది బహిరంగ రహస్యమేగదా! కాబట్టి నేనుచెప్పునదేమనగా పెనిమిటి చదువరి కాకపోవుటొక లోపముకాదు. కుంటిగాదు; గ్రుడ్డికాదు; నిరక్షరకుక్షిగాదు; పట్టభద్రుడే. అతడిట్లుచేయుటకు కారణమేమి? బాల్యవివాహ మనుటకంటె వేరేమి యనగలము! అంతియేగాదు, అబలయు ప్రతిక్రియా సామర్థ్యరహితయునగు స్త్రీయందు పురుషునకుగల యుదాసీనతగూడ యిందులకొక ముఖ్యకారణము.
ఈ మధ్య నీబాల్యవివాహ నిషేధచట్టమునుగూర్చి మాగ్రామముననొక సభజరుగ యీ బిల్లునకు ప్రతికూలముగ
మాట్లాడిరట. అంతలో వృద్ధుఁడగు మాపినతండ్రి సభలో నిలిచి తనకొమార్తె దుఃఖగాధను సంతత కన్నీటిధారలతో నేకరువుపెట్టి “నాయనా, నేనుగూడ పూర్వాచార పరాయణుడనే, ఈ యనుభవమే కాకపోయినచో నేనుగూడ మీకంటె నెక్కువగ నెగిరిపడువాడనే; కాని స్వానుభవము నానోరు నొక్కినది. కాన యేబిల్లుకైన వ్యతిరేకింపుడు గాని వధూవరులకు వైవాహిక బాధ్యతనొసంగెడి యీ బాల్యవివాహ నిషేధ
చట్టమునకు మాత్రము ప్రతికూలముగా తీర్మానములు గావించి యాడపిల్లలనోట మట్టిగొట్టకుడు. నూరేండ్లపంట. అంతయు మనదేనని నావలెనే బాధ్యతయంతయు నెత్తిపై వేసుకొని యనుకూలములేని వివాహములు గావించి యల్లాడుటకంటె చిఱకాలము కష్టసుఖద్వందమగు సంసారయాత్ర సాగింపవలసిన<noinclude></noinclude>
8lyflj8eb0duaap3eyvxdycfpv1agua
పుట:Sarada Lekhalu Vol 1.pdf/71
104
59226
553359
469485
2026-04-16T14:11:43Z
శ్రీరామమూర్తి
1517
/* మూల్యాంకన చేసారు */
553359
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|47}}</noinclude>వధూవరులకు కొంచము యుక్తవయస్సు వచ్చినమీదట వారి సమ్మతినిగూడ కనుగొని వివాహములు గావించుట క్షేమకరము. శాస్త్రము లనుకూలముగా నున్నవి. ప్రభుత్వమనుకూలముగానున్నది. యువతీయువకు లనుకూలముగానున్నారు. కాన ఆచారముకొరకు చావబోవుచున్న ముసలితొక్కులము
మనము ప్రతికూలముగానుండి చేజేత నాడుపిల్లలనేల నన్యాయము చేయవలెను?" అని నమస్కరించెనట. అంతటితో నా తీర్మానమునకు ప్రతికూలముగానున్న పెద్దలనేకు అనుకూలముగా తలయూచిరట. కాన మనస్త్రీ సంఘక్షేమమును కోరువారమైనచో శారదాబిల్లు నామోదింపక తప్పదు” అనియామె చెప్పెను.
ఆ వృత్తాంతమును వినగనే యంతవఱకు శారదాబిల్లుకు ప్రతికూలముగా వాదింపుచున్న తూర్పుగోదావరి ముసలమ్మ "అవును మగవాడు స్వతంత్రుడు. ఆడది అథవస్థపడి కుంటికిచ్చినా గ్రుడ్డికిచ్చినా ముసలికిచ్చినా రోగికిచ్చినా సహించి కాపురంచేయాలి, కాస్తంత నెపంపెట్టి పెళ్ళాన్ని వదిలపెట్టి మళ్లీ పెండ్లాడితే యేడుస్తూ వూరుకోవాలి మఱి? దీనికి తరణోపాయములేదు. ఉభయులు యిష్టపడి చేసుకుంటే యిలా జరగదనుకుంటాను” అనినది. ఇంతలో మాబండి ఒంగోలు దాటినది. మా బండిలోకి మరికొందరు క్రొత్తస్త్రీ లెక్కిరి. వారిలో నొకామె "అవునండి, ఎటువంటి అవిటివాడికిచ్చినా హర్షముతో ఆమోదింపవలసిందే, కాదంటే లోకంలో తలయెత్తరాని అప్ర<noinclude></noinclude>
g5asxgtwzgki4lawgbabmdr0n577d2v
పుట:Sarada Lekhalu Vol 1.pdf/72
104
59227
553360
553220
2026-04-16T14:16:26Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553360
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|48|శారదలేఖలు|}}</noinclude>తిష్ఠ. మీరుచెప్పినట్లు వంకలేని బిడ్డనిచ్చి పెండ్లిచేసినప్పుడే విడనాడుటింత సులువైనప్పుడు కుంటిదనీ గ్రుడ్డిదనీ రోగిష్టియనీ అనాకారియనీ వంధ్యయనీ భార్యను వదలినవారెందరో విచారించండి. ఆడదిమాత్రము పుట్టుగ్రుడ్డికిచ్చినా కిమ్మనరాదు. వింటిరోలేదో నాపెనిమిటి పుట్టంధుడు" అనెను. “అట్లాగా పాపము! అటువంటి పుట్టుగ్రుడ్డి కెట్లాయిచ్చారండీ!” అని అందఱమొక్కమారుగా నంటిమి. ఆమె చెప్పసాగినది. ఆ చరిత్ర ముందు వ్రాసెదనులెమ్ము.
{{rh|భావపురి||ఇట్లు}}
{{rh|1928 నవంబరు||శారద.}}
{{rule|2cm}}<noinclude></noinclude>
a0wlua5841cqsfy5gp3cmwgrp1j9vna
పుట:Sarada Lekhalu Vol 1.pdf/73
104
59228
553380
553221
2026-04-16T23:18:57Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|49}}</noinclude>సౌభాగ్యవతియగు కల్పలతకు :-
నెచ్చెలీ!
అయిదేండ్లకు పూర్వ మొకనాడు శారదానికేతన సమాచారమును పత్రికలలో జూచి ఆహా! నేటికిగదా ఆంధ్ర
కన్యల తపము ఫలించెనని యానందించి యెప్పుడు గుంటూరు వెళ్ళుదును యెప్పుడు శారదాలయము గాంతునని యుబలాట పడి పడి కొన్నాళ్ళకు గుంటూరు వెళ్లితిని. శారదానికేతన మెక్కడనని మా సోదరుల నడిగితిని. సనాతన ధర్మమండలి వారి పాఠశాలయే శారదానికేతముగా మారెనని వారనిరి. అచ్చటికిపోయి చూచితిని. పాఠశాల సాధారణ ఫక్కినే యుండెను. నికేతనము వారు పత్రికలలో దీర్ఘముగా ప్రచురించిన విద్యావిధాన మేదియు నక్కడ ఆచరణమందు గన్పడ లేదు. నాకు మిక్కిలి కోపమువచ్చెను. “పత్రికలలో గంభీర ప్రకటనలు, చూడబోయిన నేమియు లేక పోవుటలు, దేశ భక్తుల కిది పరిపాటిగా నున్నట్లున్నది. పత్రికలనుగాంచి ధనసహాయము సేయుట పొరబాటు" అని యేవగించుకొని యింటికివచ్చితిని, గాని యిది పుట్టి యెన్నాళ్లో గాలేదు. అప్పుడే యింతపెద్దది కమ్మన్న నెట్లగునను వెనుక చూపే నాకు తగులలేదు.<noinclude></noinclude>
negbyiwkoj72ies74nlrvn5rbk43812
పుట:Sarada Lekhalu Vol 1.pdf/74
104
59229
553381
553222
2026-04-16T23:26:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553381
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|50|శారదలేఖలు|}}</noinclude>ఒక సంవత్సరము గడచిన తరువాత మరల నొకమాఱు గుంటూరు వెళ్లితిని. శారదానికేతన మెట్లున్నదని మరల మాసోదరుల బ్రశ్నించితిని. “చక్కగానున్నది. ఒక విశాల సౌధములోనికి మార్చబడినది. చాలమంది బాలికలు గురుకుల వాసినులుగా జేరినారు. ఇపుడు చూచిన సంతృప్తిఁజెందుదువు” అనిరి. వెంటనే వెళ్ళి చూచితిని. నిజముగా పాఠశాల మాఱిపోయెను. ఆ గురుకుల వాసినులగు బాలికలను, జాతీయములగు నా విద్యాపద్ధతులను చూడగనే నా కెనలేని సంతస మొదవెను. తక్షణమే ఆ విద్యాలయము విూదను ఆ విద్యాలయ ప్రతిష్ఠాపకులమీదను నా కెనలేని భక్తిప్రేమలు కుదురుకొనెను. నాడాదిగ నేనెన్నిమాఱులు గుంటూరు వెళ్ళినను ఆ విద్యాలయమున కొకమాఱు వెళ్లి చూడకరాను. స్త్రీల పాలిటి కది కల్పతరువువంటి ప్రతిష్ఠాపనమనియు, ఎవరు స్త్రీ విద్యాభివృద్ధిని కాంక్షింతురో, ఎవరికి దేశభక్తియు జాతీయతాభిమానమును గలదో అట్టి వారెల్లరావిద్యా ప్రతిష్ఠాపనమును నాదరించి పోషింపవలయుననియు నాతలంపు కాన పలుమాఱులాపాఠశాలను దర్శించి వచ్చుచుందును.
మా సోదరులుండుటచే నాకు గుంటూరు ప్రయాణ మేడాదికొకటి రెండుమాఱులు తగులుచుండును. గత
మాసాంతమున మరల గుంటూరు వెళ్లితిని. బ్రాడీపేటలో నాకు నీవంటి యాప్తురాలగు స్నేహితురాలుండెను. ఆమెను చూచుటకై వెళ్లితిని, కాని ఆమె యింటలేదు. అప్పటికి<noinclude></noinclude>
nyqfo92hdgprvs2hdtaz0hf26pwojda
పుట:Sarada Lekhalu Vol 1.pdf/75
104
59230
553382
553223
2026-04-16T23:35:22Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553382
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|51}}</noinclude>దాదాపైదుగంటలు దాటినది. కాని నా ప్రేమపాత్రమగు శారదానికేతన మచ్చటి కనతిదూరముననే యుండుటచే నాయడుగటుపడెనేగాని యింటివైపునకు తిరుగులేదు. చరమ సంధ్యాకాంతులతో పశ్చిమాశ రాగరంజితమై మనోజ్ఞముగ నుండెను. ఆరుబయలునుండి వీచెడు హోరుగాలి చలిచలిగా నుండెను. నేనారైలుకట్ట ప్రక్కనున్న రప్తాదారినిబట్టి వడివడిగా శారదానికేతమున కేగసాగితిని. నాకు వంటపని
యున్నదమ్మా యనియు, నేను పాఠములు చదువుకొనవలసి యున్నది, నికేతనమునకేగి వచ్చునప్పటికి బాగుగా చీకటిపడునేమో ఎట్లాగత్తా? అనియు, నాతో వచ్చిన మావదినెయు, మా మేనగోడలును తొందరించిరి. వారిమాటలు నా చెవి దూరలేదు. నన్ను వీడిపోలేక వారును నావెంటనేవచ్చిరి. సింహ
ద్వారమను నామము సార్థకంబగున ట్లిరువైపుల సింహపు మూర్తులుగల సింహద్వారమున నికేతనములోనికి బ్రవేశించితిమి. ద్వారముదాటి నాలుగడుగులు లోనికేగగనే నికేతన పాదపములకు నీళ్లువోయుచున్న గురుకుల వాసినులు మాకెదురైరి. వారిని చూడగనే కణ్వాశ్రమమున చెట్లకు నీళ్లుపోసిన
శకుంతలాప్రియంవదలు జ్ఞాపమునకు వచ్చిరి. కాళిదాస మహాకవి యక్షరరూపమున జూపినదానిని నికేతన ప్రతిష్ఠాపకులు ప్రత్యక్షరూపమున జూపుచున్నారుగదాయని లోలోన హర్షించుచు లోనికేగ వార్షికోత్సవమునకు సిద్ధపడెడి యత్నములతో నిండి గై సేయనున్న కాంతవలె శారదానికేతనము గన్పట్టెను. చీఁకటిపడుచున్నను వార్షికోత్సవమునాటికి తయారుకావలె<noinclude></noinclude>
qclwligkvwlkmrcqd4kvolir4xlbo49
పుట:Sarada Lekhalu Vol 1.pdf/76
104
59231
553383
553275
2026-04-17T01:13:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553383
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|52|శారదలేఖలు|}}</noinclude>ననెడి తలంపుతో తదేకదృష్టితో చిత్తరువులను వ్రాయుచున్న ఉపాధ్యాయులతో విద్యార్థినులతోనున్న చిత్రకళా
మందిరము నొకమాఱు కన్నారగాంచి పట్టువస్త్రములపై కద్దరువస్త్రములపై సరిగతోడను పట్టుతోడను విచిత్రలతా వితానములఁ జిత్రింపుచున్న కుట్టుతరగతి బాలల నొకమాఱు మోదమున తిలకించి, వార్షికోత్సవపు ఆటపాటలలో పాల్గొన నాయత్తపడుచున్న కన్యకామణుల గాన కౌశలము నొకమాఱు
శ్రవణపేయముగా నాలకించి, తరువాత పాఠశాలను తదితర ప్రదేశములను చూచి యింటికి మరలితిమి.
ఆ తరువాత నాలుగైదుదినములకు వచ్చెవచ్చె ననుకొనుచున్న వార్షికోత్సవపు దినములువచ్చెను. తొలినాటి
(1 - 12 - 28) యుదయము నికేతనములో నూతనముగా గట్టబడిన గృహప్రవేశోత్సవము శాస్త్రోక్తముగా జరుపఁబడెనట. దానిని నేను చూడలేదు. ఆ సాయంత్రమువెళ్లి విద్యాలయబాలికలచే తయారుచేయబడిన కుట్టు, పేము, చిత్రముల ప్రదర్శమునమునుచూచి యొకతాతగారు చెప్పిన హరికథ నొకకొంతవిని యింటికివచ్చితిమి. మఱునాడు వార్షికోత్సవము. ఆ యుత్సవసందర్శన కుతూహలురై యితర గ్రామములనుండి స్త్రీపురుషు లెందరోవచ్చిరి. ఇఁక నూరివారి యుత్సాహ యత్నములు చెప్పనే యక్కఱలేదు. గుంటూరునందలి ప్రతి స్త్రీయును ఆనాడు నిద్రలేచినదిమొదలు శారదానికేతమున కేగెడి యత్నములోనే యుండెనని చెప్పవచ్చును. సభారంభము<noinclude></noinclude>
76924hj4nmg4ti6bcg1unw8n1qseim6
పుట:Sarada Lekhalu Vol 1.pdf/77
104
59232
553384
553277
2026-04-17T01:19:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553384
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|53}}</noinclude>మూడుగంటలకైనను నొంటిగంటనుండియే స్త్రీపురుషులెల్లరు జట్కాలమీదను, ఒంటెద్దుబండ్లమీదను, మోటార్కారుల విూదను, కాలినడకను, తండోపతండములుగ పోజొచ్చిరి. ప్రతివారిని చోటుదొరకదను భయమే పీడించుటచే యెవరికి సాధ్యమైనంత వేగముగా వారు శారదానికేతనమునకు చేరుకొనిరి. మేము వెళ్ళునప్పటికి దాదాపు మూడుగంటలు కావచ్చెను. అప్పటికే జనసమూహము విశాలమగు పందిరిని
క్రిక్కిరిసియుండెను. మాకంటె ముందువచ్చియుండిన మాచిన్నవదినగారి సాయమువలన మాకు కొంచెమనుకూలమగు ప్రదేశమే కూర్చుండుటకు దొరికెను. మా తరువాత వచ్చిన వారికి నిలువుజీతమే. కార్యక్రమము సరిగా మూడుగంటల కారంభమయ్యెను. హైదరాబాదు వాస్తవ్యులగు ధర్మవీర్ వామన రామచంద్రనాయక్గారు నాటి సభాధ్యక్షులు. అధ్యక్షుల యుపన్యాసము స్త్రీల యభివృద్ధికిఁ దోడ్పడెడి పెక్కు
హితములతో నుండెను. స్త్రీపురుషుల కార్యక్షేత్రములు భిన్నములుగాన స్త్రీపురుషుల విద్యావిధానముగూడ భిన్నమై యుండవలెనని తగు హేతువులతో వారు నిరూపించిరి. మఱియు ప్రేమ, దయ, శ్రద్ధ, ఉత్సాహము, సేవాపరాయణత, స్వార్థ త్యాగము మున్నగునవి స్త్రీగుణములనియు, ధైర్యము, శక్తి, పూనిక, వీరత్వము, కష్టపడిపనిచేయు నలవాటు మున్నగునవి పురుషుల గుణములనియు వారుతెల్పిరి. కార్య
క్షేత్రములు భిన్నములు కావచ్చును కాని స్త్రీపురుషులెల్లరు జాతిసామ్యమున ఏకమానవజాతికే చెందియున్నారు. కాన<noinclude></noinclude>
it5ibjzjr3k5cq5nxkhnyxboukd0t8n
పుట:Sarada Lekhalu Vol 1.pdf/78
104
59233
553386
553278
2026-04-17T01:27:14Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553386
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|54|శారదలేఖలు|}}</noinclude>పైయుత్తమగుణములన్నియు మానవజాతి కంతటికిని కావలసినవే. గుణశీలములకు లింగభేదములేదు. స్త్రీగుణమని పురుషుడు దయను విడనాడినచో స్త్రీ మాడిపోవలెను. పురుషగుణమని స్త్రీ పాటుబడుట మానినచో పురుషు డన్నమునకై యలమటింపవలెను. నాయక్ గారి నిర్ణయముప్రకారము ధైర్యము, కష్టసహిష్ణుత, పుంలింగమునకు చెందినవి. స్వార్థత్యాగము, సేవాపరాయణత స్త్రీలింగమునకు జెందినవి. కాని ధైర్యములేనిది స్వార్థత్యాగముగాని, కష్టసహిష్ణుత లేనిది సేవాపరాయణతగాని చేయచొప్పడదు. కాన నొకకార్య సాధనకు స్త్రీపురుషుల తోడ్పాటెట్లవసరమో అట్లే యుభయగుణ సమ్మేళనముగూడ నవసరము. ఇట్టి శంకలకు తావిచ్చెడి యంశము లొకటిరెండున్నను మొత్తముమీద అధ్యక్షుల యుపన్యాసము స్త్రీజనాభ్యుదయ కరములగు పెక్కు దివ్యోపదేశములతోగూడి గంభీరభావభరితమై గమనార్హముగ నుండెను. అనంతరము లక్ష్మీనారాయణ పంతులుగారు గతసంవత్సరకార్యనివేదికమును జదివిరి. తరువాత గురుకుల బాలికల యాటపాటలారంభమయ్యెను. తొలుతనొకబాలిక దైవప్రార్థనముచేసెను. తరువాత నిరువురుబాలికలు గానముచేసిరి. జాతీయగీతమునుబాడిరి. తరువాత కొందరుబాలికలు రామభజనచేసిరి.
తెలుఁగు, సంస్కృతము, హిందీ, మూడుభాషలలో నాటకభాగములను ప్రదర్శించిరి. మూడుభాషల
యందును వారివాచకము మనోజ్ఞముగనేయుండెను. సంస్కృతమున వారుభాషించునప్పుడు ప్రాచీనఋషికన్యల దలపించిరి.<noinclude></noinclude>
6fe3jpy0gaccbss4d9r0rc9g6rvv2zm
పుట:Sarada Lekhalu Vol 1.pdf/79
104
59234
553388
553279
2026-04-17T01:36:55Z
శ్రీరామమూర్తి
1517
[[WP:AES|←]]Blanked the page
553388
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude></noinclude>
5kjvjk0pzgdfb2xfn6tcz39rckbdph5
పుట:Sarada Lekhalu Vol 1.pdf/80
104
59235
553389
553280
2026-04-17T01:37:13Z
శ్రీరామమూర్తి
1517
[[WP:AES|←]]Blanked the page
553389
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude></noinclude>
5kjvjk0pzgdfb2xfn6tcz39rckbdph5
పుట:Sarada Lekhalu Vol 1.pdf/81
104
59236
553387
553281
2026-04-17T01:36:21Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553387
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|55}}</noinclude>హిందీనాటక సంభాషణలో వారు ఉత్తరహిందూదేశపు బాలికలాయనిపించిరి. ఇక తెలుగువాచకమున వారు కల్తీలేని తెలుఁగువారే. మధురమైనగాత్రము, మృదులమైనపలుకులు, స్పుటమైన యుచ్చారణ, ఉచితమైన అభినయము, వారి యాటపాటలకు వన్నె దెచ్చినవి. అందులో మిన్నయనుపించినది భీమరెడ్డి అన్నపూర్ణయను కన్యాకామణి. పరశురామ గర్వభంగములో రాముఁడామె; భీష్మప్రతిజ్ఞలో శాంతనవుడామె; రాధపిలుపులో కృష్ణుఁడామె; సంగీతములో నామె; ఆంధ్రప్రశస్తి పద్యముల చదువుటకామె; వేయేల? ఆ బాలిక పెక్కింటిలో బాల్గొని తన విధిని చక్కగా నిర్వర్తించి యెల్లర మెప్పును గాంచెను. అన్నింటికంటె రాధపిలుపులో కృష్ణుని వేషముధరించి యా బాలచూపిన హావభావ ప్రకటన మేమని వర్ణింతును? అప్పటి యామె రూపు నాకిప్పటికిని కన్నుల గట్టినట్లున్నది. ఆ చిఱునవ్వుగూడ కృష్ణునివద్దనుండి యెట్లు పుణికి తెచ్చుకొనెనో! ఆమె అభినయ కౌశలమునకు మెచ్చి సభికులలో నొకరాఱు రూప్యము లామెకు ప్రత్యేకబహుమానమిచ్చిరి. తరువాత ప్రేక్షకులు శ్రద్ధతో వినినది పిసినారి భాషణము. సంస్కృతనాటకమున పరశురామపాత్రము ధరించినబాలయే పిసినారివేషముధరించినది. ఈ బాలగూడ మంచి నిపుణమతి. పరశురామపాత్రమునందు కఱకుచూపులు బఱపిన యాబాల పిసినారి వేషమున లుబ్ధత్వమును లోటు
లేకుండ ప్రదర్శించి ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వించినది. బాలికల యాటపాట లెంత మనోజ్ఞముగ నున్నను దానిని వినగల్గు,<noinclude></noinclude>
hny857s97c9l2qlsfbm3x5jinwkoz1l
పుట:Sarada Lekhalu Vol 1.pdf/82
104
59237
553391
553282
2026-04-17T01:47:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553391
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|56|శారదలేఖలు|}}</noinclude>చూడగల్గు భాగ్యము కడు సమీపస్థులకేగాని యన్యులకు కలుగుట బహుదుస్తరమయ్యెను. విశాలమైన యాసభాశాలలోని స్తంభములకు “నిశ్శబ్దము” అని వ్రాసి కట్టబడిన యట్టలు మాత్రమే నిశ్శబ్దముగ నుండెనుగాని ప్రజలుమాత్రము నిశ్శబ్దముగలేరు. ఆఘోష సముద్రపుఘోషకన్న పదిరెట్లధికముగ నుండెను.
మన ఆడవారి సంగతియడుగఁ బని లేదు గదా! కుశలప్రశ్నలక్కడ, నగలపరిశీలన ప్రసంగములక్కడ,
వంటప్రస్తావనలక్కడ, పెండ్లిముచ్చటలక్కడ సరి, ఇఁక పిల్లలయేడుపు ఉండనేయున్నది. తల్లులు తమకుతూహలము కొఱకు శిశువులను జనసమ్మర్దములోవేసి నలిపివేయుచుండ వారు రోదింపకెట్లుందురు? కాని స్త్రీలుచేసిన సందడికంటె చదువులకుఁ జేరిన యే యడ్డులేని మగబిడ్డల యల్లరియే
యత్యధికముగానుండి యనేకమాఱులు కార్యక్రమమునకు భంగము కలిగించెను. శారదాలయమువారు మొదట నిర్ణయించిన టిక్కెట్లపద్దతి యూరిలో నలజడికి గారణ మయ్యెనేగాని సభలోని యలజడి మాన్పుటకేమాత్రము తోడ్పడలేదు. ఈ ఘోషచూచిన తరువాత ననేకులు టిక్కట్లు పెట్టిననే బాగుగానుండునేమో యనుకొనిరి. బాలిక లెన్నిదినములనుండియో శ్రమపడి నేర్చినదంతయు జనుల కలకలముచే వ్యర్థమైపోయినప్పుడు నాకెంతయో విచారముగొల్పెను. శ్రమపడి నేర్చినవారికిని నేర్పినవారికిని నెంత మనస్సునొచ్చెనో!<noinclude></noinclude>
dhxkfod4skvmcoy10oc8gbfn9ve4tro
పుట:Sarada Lekhalu Vol 1.pdf/83
104
59238
553392
553283
2026-04-17T01:56:02Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553392
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|57}}</noinclude>అనంతరము సాహితీ పరీక్షయందుత్తీర్ణలైన బాలికలకు పట్టములొసంగబడెను. తరువాత బహుమతులుగూడ నొసంగిరి. ఆబహుమతులన్నియు నెవరోవదాన్యు లొసంగినవే. ఆదాతలపేరు గూడ నక్కడచెప్పుచు బహుమానములిచ్చిరి. ఆటపాటలలో మిన్నయైన అన్నపూర్ణమ్మ బహుమతు లందుకొనుటలోగూడ మిన్నయయ్యెను. అధ్యక్షుల అంత్యోపన్యాసముతోడను బాలికల మంగళగీతములతోడను
సభసమాప్తమయ్యెను. నామనం బానందపరిపూర్ణమయ్యెను.
కల్పలతా! అప్పుడు “తొలినాటి నాతలంపులెంత దుష్టమైనవి? ఏసంస్థయైన పుట్టిననాడే పెద్దదిగానుండుమన్న నెట్లుండును? ఇట్టి మహోత్కృష్ట ప్రతిష్ఠాపమున కై దేండ్ల జీవితమొక దీర్ఘకాలమా?" అని నాలో నేనే సిగ్గిలితిని.
మిత్రమా, ఈ విధముగ శారదా గురుకులము నిష్కళంక దేశసేవాపరాయణులుగ నున్నవారి నిరంతర కృషిచే
క్రమాభివృద్ధినందుచు ఆంధ్రకన్యల నాహ్వానించుచున్నది. పుత్రికలు విద్యాపతులు కావలెనని యభిలషించెడు తలిదండ్రులకిది మంచి సమయము. తమ పుత్రికల శారదాలయమున కంపవచ్చును. స్త్రీ విద్యాభిమానులగు వదాన్యలోకమున కిదిమంచి యదను. తమ విత్తము నీయుత్కృష్ఠ ప్రతిష్ఠాపనమునకు దానముచేసి యశోవిశాలురు కావచ్చును. ఆంధ్రమహాజను లాలోచింతురు గాక. నీ కొమార్తెను శారదా
గురుకులమున కంపరాదా?
{{rh|1929 జనవరి||మిత్రురాలు}}
{{rh|||శారద.}}<noinclude></noinclude>
5f0w5a3ou4dzpllkysrgdu4gu2altvr
పుట:Sarada Lekhalu Vol 1.pdf/84
104
59239
553397
553284
2026-04-17T03:18:30Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553397
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|58|శారదలేఖలు|}}</noinclude>{{c|'''సౌభాగ్యవతియగు కల్పలతకు: —'''}}
'''నెచ్చెలీ''',
నీవు వ్రాసిన యుత్తరముల నిన్ననే వచ్చి చూచితిని. నీకు జాబులవ్రాయుటకే నాకు సిగ్గగుచున్నది. ఏమందువా? ఇకనుండి తప్పక వ్రాయుదునని నీకు వాగ్దత్తము సేయుటయు ఆమఱుజాబే నీకు సకాలమున వ్రాయజాలకపోవుటయు పలుమాఱులు తటస్థించుచున్నది. శారదకు, మాటలకు చేతలకు దూరమని నీవు తలంతువేమోయని నాబిడియము. కాని యిది స్వయంకృతాపరాధముకాదు. దక్షిణదేశయాత్ర జేసెడు
భాగ్యము నాకింతలో లభించునని నేను స్వప్నమందైన తలంపలేదు. దైవికముగ క్షణములో తటస్థించినది. ఆనాడు నీకు లిఖింపుచున్న లేఖనర్థాంతరముననే విడిచి తక్షణమే యాత్రకు సన్నద్ధనైతిని. వైకుంఠేకాదశి నాటికి శ్రీరంగమున కేగవలెనని పయనించెడునాటి మాతలంపు కాని చేరలేకపోతిమి. కాన యూరక చెన్న పట్టణమున నాదిన మేలగడుపవలెనని కాంచీపురమున కేగితిమి. ఉన్నతోన్నత ప్రాకార గోపురావళుల
తోడను. విశాలమైన రాచబాటతోడను ఒప్పారు కాంచీపురము పూర్వ వైభవమును చాటుచుండెను. కాంచీపురము విష్ణుకంచి, శివకంచియని రెండుబాగములుగా నున్నది. విష్ణుకంచిలో స్వామి వరదరాజులు, ఆయన భార్య లక్ష్మీదేవి.<noinclude></noinclude>
11vbrv0acze3trqy303cia1pd2ltan3
పుట:Sarada Lekhalu Vol 1.pdf/85
104
59240
553411
553285
2026-04-17T04:23:51Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553411
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|59}}</noinclude>శివకంచిలో స్వామి ఏకామ్రనాధుడు ఆయన దేవేరి కామాక్షీదేవి. దశమినాటి రాత్రి ఎనిమిది గంటలకు మేము కంజీవర మేగునప్పటికి ఏకామ్రేశ్వరుని యాలయములో గొప్ప యుత్సవము జరుగుచుండెను. వెంటనే యాస్వామి దర్శనము సేయ నేగితిమి. వెలలేని యాభరణములతో నలంకృతులైన కామాక్షీ ఏకామ్రనాధులు మాకక్కడ ప్రత్యక్షమైరి. ఆదివ్యమూర్తుల కన్నారగాంచి చేతులార నమస్కరించి మనసార సేవించి హృష్టచిత్తులమైతిమి. ఆదేవాలయమందే నాకొక మిత్రురాలు గన్పడెను. ఆమె పుట్టిల్లాయూరని
యెఱుగుదును గాని యామె నప్పుడు చూడగల్గుదునని మాత్రము తలంపలేదు. దైవికముగనే యట్టి భాగ్యము గలిగెను. ఆమె మమ్ము ప్రేమతో తన యింటికి దోడ్కొని వెళ్లి సకల సౌకర్యముల గూర్చి సత్కరించెను. 'ఎఱుక పిడికెడు ధనమ'ని సామ్యమందు రిదియే కాబోలునని యనుకొంటిని.
నాడులేచి ప్రాతఃకృత్యములను దీర్చుకొని సర్వతీర్థమను పుష్కరణిలో న్నానముగావించి కచ్ఛపేశ్వర యేకామ్రేశ్వర
కామాక్షీ యాలయములకేగి ఆయాదేవతల దర్శించి ఆనాడూరేగవచ్చిన స్వాములందఱను దర్శించి రెండు గంటలకు విష్ణుకంచికి వెళ్ళితిమి. మేము వెళ్లునప్పటికి వరదరాజస్వామి వారికి తిరుమంజనము (స్నానము) జరుగుచుండెను. బిందెలతో కుమ్మరించెడు పాలధారలు శిరస్సునుండి ధణధణ పడుచుండ పాలలో మునిగియున్న స్వామిని దర్శించితిమి. అటనుండి అమ్మవారి యాలయములోనికేగుచుండ నొకమూల కొందఱు<noinclude></noinclude>
97xgvrdq8kyaldrspwcu7jc1ymmx810
పుట:Sarada Lekhalu Vol 1.pdf/86
104
59241
553412
553286
2026-04-17T04:33:06Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553412
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|60|శారదలేఖలు|}}</noinclude>జనులు గుంపులుగా కూడియుండుట మాకగుపించెను. అది యేదియో యరయ మేమును నటకేగి చూడ నచ్చట మిద్దెకు వెండి పైడి బల్లులు అంటించబడి యుండెను. ఆబల్లుల క్రిందుగా నొక నిచ్చెనపై నెక్కి చేతితో ముట్టిన వారు తలకొక యణాయును, క్రిందనుండియే యర్చకుడా బల్లులపైకి గుడ్డ నెగురవేయ ఆగుడ్డ ముట్టినవారొక యర్ధణాయును నీయవలెనట. ఆ బల్లులను తాకి వచ్చినవారికి బల్లిపాటు
దోషముండదట. ఆ వినోదమును రెండు నిమిషముల పాటు నిలువబడి చూచితినేగాని నేను అర్ధణాగాని అణాగాని వ్యయపరచుకొనలేదు. అటనుండి అమ్మవారి ఆలయములోని కేగ ఆమెకును స్నానమే జరుగుచుండెను. అయ్యవారి స్నానము చూడవచ్చునుగాని అమ్మవారి స్నానము చూడరాదట! కాన
అమ్మవారి దర్శనము మాకు కాలేదు. ఆనాడు యేకాదశి యగుటవలన నూరేగింపునిమిత్తము మణిమయాభరణములతో నలంకరింపబడిన యుత్సవ విగ్రహములకడనే స్వామిని దేవేరిని గూడ చక్కగా చూచుట కలిగినది.
వరదరాజస్వామివారి యాలయములో దర్శనీయమైన మండప మొకటి యున్నది. ఆ మండపములోని ప్రతి స్తంభముపైనను భారత భాగవత రామాయణాది పౌరాణిక గాధలెల్ల బొమ్మలుగా చెక్కియున్నవి. నల్లరాతితో చెక్కబడిన యాప్రతిమలు సజీవము లట్లెంతయో కౌశలముగ నిర్మింపబడి యున్నవి. పౌరాణిక గాధలేగాక అశ్వారూఢులగు యోధు<noinclude></noinclude>
bdmcdiokqufa5ijrgcdo58vp8ksde5m
పుట:Sarada Lekhalu Vol 1.pdf/87
104
59242
553398
186320
2026-04-17T03:19:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553398
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
61
లును, శత్రుమర్దనము సేయుచున్న రాజుల ప్రతిమలును అల
నాటి యోధులయు, ప్రభులయు నాకృతులను స్పష్టీకరింపుచూ
నెంతయో నిపుణముగ నిర్మింపఁబడి యున్నవి. ముష్కరులైన
తురుష్కులు శిథిల పఱచిన విగ్రహములు గూడ కొన్ని యున్నవి.
కాని అవి అత్యల్పమని చెప్పవలెను. కాకతీయ ప్రతాపరుద్ర
కృష్ణదేవరాయాది ఆంధ్ర రాజన్యులు,
యవనసేనా వాహిని
దక్షిణ హిందూ దేశమును చొరకుండ చేసిరి. ఆనాడాంధ్రు
లోడ్చిన ర క్తమువలననే నేడు దక్షిణ హిందూ దేశమం దెన
పురాతనకట్టడములను జూచు భాగ్యము యావద్భారతీయులకు
గల్గినది. దేవాలయములను మసీదులుగను హిందువులను
మహమ్మదీయులుగను మార్చి ఉత్తర హిందూ దేశ మంతయు
భీభత్సముగ జేసిన ముష్కరతురుష్కుల యుద్ధతినణచి దక్షిణ
హిందూదేశము యవన హస్తగతము కాకుండ కాపాడిన మన
యాంధ్ర వీరుల పరాక్రమాతిశయము సంస్తవనీయమైనది.
ఆంధ్రులిందులకు గర్వించవలసినదే. కాంచీపురము చాల
కాలము పల్లవరాజధానియై యుండుటచే పల్లవరాజులు
కట్టించిన దేవాలయములు పెక్కులున్నవి. పల్లవరాజులు శివ
భక్తులు. కాన శివకంచియందలి దేవాలయములన్ని యు
దాదాపుగా వారు కట్టించినవే. వరదరాజస్వామివారి ఆలయము
కృష్ణ దేవరాయలు కట్టించెనని యక్కడివారు చెప్పిరి కాని
అంతకు నిజమో! మేము తరువాత చూచిన
క్షేత్రము చిదంబరము. అచ్చటి స్వామి నటరాజు,
దేవేరి శివకామసుందరి, నటరాజస్వామికి ఆరుద్రనక్షత్రమునకు<noinclude></noinclude>
2yqka03a9y4llv4f08e09e2xp040d41
553418
553398
2026-04-17T06:05:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553418
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|61}}</noinclude>లును, శత్రుమర్దనము సేయుచున్న రాజుల ప్రతిమలును అలనాటి యోధులయు, ప్రభులయు నాకృతులను స్పష్టీకరింపుచు నెంతయో నిపుణముగ నిర్మింపఁబడి యున్నవి. ముష్కరులైన తురుష్కులుశిథిలపఱచిన విగ్రహములుగూడ కొన్నియున్నవి. కాని అవి అత్యల్పమని చెప్పవలెను. కాకతీయ ప్రతాపరుద్ర
కృష్ణదేవరాయాది ఆంధ్ర రాజన్యులు, యవనసేనా వాహిని దక్షిణ హిందూదేశమును చొరకుండచేసిరి. ఆనాడాంధ్రు లోడ్చిన రక్తమువలననే నేడు దక్షిణ హిందూదేశమందైన పురాతనకట్టడములను జూచు భాగ్యము యావద్భారతీయులకు గల్గినది. దేవాలయములను మసీదులుగను హిందువులను
మహమ్మదీయులుగను మార్చి ఉత్తర హిందూదేశ మంతయు భీభత్సముగ జేసిన ముష్కరతురుష్కుల యుద్ధతినణచి దక్షిణ హిందూదేశము యవన హస్తగతము కాకుండ కాపాడిన మన యాంథ్ర వీరుల పరాక్రమాతిశయము సంస్తవనీయమైనది. ఆంధ్రులిందులకు గర్వించవలసినదే. కాంచీపురము చాలకాలము పల్లవరాజధానియై యుండుటచే పల్లవరాజులు కట్టించిన దేవాలయములు పెక్కులున్నవి. పల్లవరాజులు శివ
భక్తులు. కాన శివకంచియందలి దేవాలయములన్నియు దాదాపుగా వారు కట్టించినవే. వరదరాజస్వామివారి ఆలయము కృష్ణదేవరాయలు కట్టించెనని యక్కడివారు చెప్పిరి కాని అది యెంతవఱకు నిజమో! మేము తరువాత చూచిన క్షేత్రము చిదంబరము. అచ్చటి స్వామి నటరాజు. ఆయన దేవేరి శివకామసుందరి. నటరాజస్వామికి ఆరుద్రనక్షత్రమునకు<noinclude></noinclude>
jkvp2g8bw6xmqyk0p6x1qsfmoyteisc
పుట:Sarada Lekhalu Vol 1.pdf/88
104
59243
553399
186321
2026-04-17T03:20:05Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553399
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>62
శారద లేఖలు
గొప్ప యుత్సవము జరుగును. మేము వెళ్తునప్పటికి ఆరుద్ర
దర్శనము "రెండు దినములు మాత్రమే యుండెను.
పరిషజ్ఞనముచే పురము క్రిక్కిరిసి యుండెను. నటరాజస్వామి
శ్రీమంతులగు నాటుకోటి సెట్లకు యిష్ట దైవమగుటచేగాబోలు
శ్రీమంతుడుగనే యున్నాడు. స్వామికి గల
మయము.
కాని
యాభరణము
లన్నియు రత్నాభరణములే. వాహనములన్నియు బంగారు
వాహనములే, ఒక్క వాహనములేగాదు. దేవాలయపు పై
కప్పేమి, ధ్వజ స్తంభ మేమి, అంతయు బంగారు
నాడు వాన బాధ యధికముగా నున్నను జనసమ్మర్దముగా
నున్నను నటరాజస్వామిని బాగుగనే దర్శించితిమి.
చిదంబర రహస్యమును మాత్రము చూడలేదు. ఒక సాల
గ్రామమునందు కర్పూర హారతిచేసి చూడ నటరాజస్వామి
యగపడునట. దానిని ఉత్సవము మూడుదినములు చూపరట.
కానీ మేము చూడలేదు. అటనుండి కుంభకోణమున కేగితిమి.
అచటి స్వామి కుంభేశ్వరుడు. ఆయన భార్య మంగళాంబ.
చిదంబరములోనే కావేరి పాయయగు కొల్లడమున్నది. కాన
అచ్చటినుండియే పచ్చని పెరులు ఫలవృక్షములు చక్కగా
కన్పడ జొచ్చినవి. దానికంటే చక్కగా నున్నది కుంభకోణము.
కుంభకోణము కావేరీతీరమగుటచే పచ్చని తోటలతోడను
చక్కని జలప్రవాహములతోడను శుభ్రజల ప్రపూర్ణములగు
పుష్కరిణులతోడను
చూడ . సొంపుగానున్నది. కుంభేశ్వ
రాలయమేగాక సారంగపాణి, దండపాణి, రామస్వామి మున్నగు
యితర దేవాలయములు గూడ చాల యున్నవి. అక్కడనుండి<noinclude></noinclude>
ccnrpw0gg2x70urkf0zyhz99e4ktsrg
553421
553399
2026-04-17T06:12:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553421
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|62|శారదలేఖలు|}}</noinclude>గొప్ప యుత్సవము జరుగును. మేము వెళ్తునప్పటికి ఆరుద్ర దర్శనము రెండు దినములు మాత్రమే యుండెను. కాన పరిషజ్జనముచే పురము క్రిక్కిరిసి యుండెను. నటరాజస్వామి శ్రీమంతులగు నాటుకోటి సెట్లకు యిష్టదైవమగుటచేగాబోలు శ్రీమంతుడుగనే యున్నాడు. స్వామికి గల యాభరణము లన్నియు రత్నాభరణములే. వాహనములన్నియు బంగారు వాహనములే. ఒక్క వాహనములేగాదు. దేవాలయపు పై
కప్పేమి, ధ్వజస్తంభమేమి, అంతయు బంగారు మయము. నాడు వానబాధ యధికముగా నున్నను జనసమ్మర్దముగా నున్నను నటరాజస్వామిని బాగుగనే దర్శించితిమి. కాని చిదంబర రహస్యమును మాత్రము చూడలేదు. ఒక సాలగ్రామమునందు కర్పూర హారతిచేసి చూడ నటరాజస్వామి యగపడునట. దానిని ఉత్సవము మూడుదినములు చూపరట. కాన మేము చూడలేదు. అటనుండి కుంభకోణమున కేగితిమి. అచటి స్వామి కుంభేశ్వరుడు. ఆయనభార్య మంగళాంబ. చిదంబరములోనే కావేరి పాయయగు కొల్లడమున్నది. కాన అచ్చటినుండియే పచ్చని పైరులు ఫలవృక్షములు చక్కగా కన్పడ జొచ్చినవి. దానికంటె చక్కగా నున్నది కుంభకోణము. కుంభకోణము కావేరీతీరమగుటచే పచ్చని తోటలతోడను చక్కని జలప్రవాహములతోడను శుభ్రజల ప్రపూర్ణములగు పుష్కరిణులతోడను చూడ సొంపుగానున్నది. కుంభేశ్వరాలయమేగాక సారంగపాణి, దండపాణి, రామస్వామి మున్నగు యితర దేవాలయములు గూడ చాల యున్నవి. అక్కడనుండి<noinclude></noinclude>
8wbko55f7yashvgpah0yw179l2tsvrv
పుట:Sarada Lekhalu Vol 1.pdf/89
104
59244
553400
186322
2026-04-17T03:20:21Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553400
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
63
తంజావూరు వెళ్లితిమి. తంజావూరు చారిత్రక ప్రసిద్ధమైన
నగరము. చోళరాజులకు రాజధాని. అచ్చటి ప్రసిద్ధమైన
బృహదీశ్వరాలయము చోళరాజులు కట్టించినదే. బృహదీశ్వ
రాలయపు గోపురమువంటి గోపురము మఱి యెచ్చటను లేదు.
దాని నీడ భూమి పై పడదట. అది శిల్ప శాస్త్రజ్ఞుల నై పుణి
యని యచ్చటి వారందురు. ఆ గోపురపు ప్రశస్తినివిని విదే
శీయులు గూడ దానిని చూడ వత్తురట, ఆ యాలయములోని
నందిగూడ చాల యద్భుతముగా నున్నది. ఆ దేవాలయపు
గోపురముమీదను మండప స్తంభములమీదను ఉన్న ప్రతిమలు
చిత్తరువులు ప్రాచీనుల శిల్పకళానిపుణతను చాటుచున్నవి.
ఆ దేవాలయమేగాక తంజావూరిలో చూడదగిన వి శేషములు
మఱికొన్ని యున్నవి. అందు ముఖ్యమైనవి పూర్వరాజుల
కోటలు, రాజమందిరములు, వారి ఆయుధములు, వాహన
ములు, వారి చి త్తరువులు మున్నగునవి. వానినెల్ల మేము
చూచితిమి.తిరుమలరాయునిదర్బారుమందిర మెంతయో రమణీ
యముగ నుండి నిన్న నేడు నిర్మించినట్లు కొంగొత్త తగ నున్నది.
తిరుమలనాయుని శిలాప్రతిమగూడనందు గలదు. తిరుమల
నాయుని చి తరువులే గాక మహారాష్ట్ర ప్రభువుల చిత్తరువు
అనేక మందు గాంచితిమి. తంజావూరు మహారాష్ట్ర పాలన
కెప్పుడు వశమైనదో జ్ఞాపకములేదు. ఆ విషయము తెలిసికొను
నిమి త్తము చరిత్రను జదున నుద్యమించుచున్నాను. ఇంతియే
గాక తంజావూరు కోటలో మఱియొక చూడదగిన మందిర
మున్నది.
అది సరస్వతీమహల్ అను పేరుగల ప్రాచ్యలిఖిత<noinclude></noinclude>
tqd1om0wk5yvudjfz2f4vtqxp2fiqp8
553422
553400
2026-04-17T06:18:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553422
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|63}}</noinclude>తంజావూరు వెళ్లితిమి. తంజావూరు చారిత్రక ప్రసిద్ధమైన నగరము. చోళరాజులకు రాజధాని. అచ్చటి ప్రసిద్ధమైన బృహదీశ్వరాలయము చోళరాజులు కట్టించినదే. బృహదీశ్వరాలయపు గోపురమువంటి గోపురము మఱి యెచ్చటనులేదు. దాని నీడ భూమిపై పడదట. అది శిల్ప శాస్త్రజ్ఞుల నైపుణి యని యచ్చటి వారందురు. ఆ గోపురపు ప్రశస్తినివిని విదేశీయులు గూడ దానిని చూడ వత్తురట, ఆ యాలయములోని
నందిగూడ చాల యద్భుతముగా నున్నది. ఆ దేవాలయపు గోపురముమీదను మండప స్తంభములమీదను ఉన్న ప్రతిమలు చిత్తరువులు ప్రాచీనుల శిల్పకళానిపుణతను చాటుచున్నవి. ఆ దేవాలయమేగాక తంజావూరిలో చూడదగిన విశేషములు మఱికొన్ని యున్నవి. అందు ముఖ్యమైనవి పూర్వరాజుల కోటలు, రాజమందిరములు, వారి ఆయుధములు, వాహనములు, వారి చిత్తరువులు మున్నగునవి. వానినెల్ల మేము చూచితిమి.తిరుమలరాయునిదర్బారుమందిర మెంతయో రమణీయముగ నుండి నిన్న నేడు నిర్మించినట్లు కొంగ్రొత్తగ నున్నది. తిరుమలనాయుని శిలాప్రతిమగూడనందు గలదు. తిరుమలనాయుని చిత్తరువులేగాక మహారాష్ట్ర ప్రభువుల చిత్తరువు లనేక మందు గాంచితిమి. తంజావూరు మహారాష్ట్ర పాలనకెప్పుడు వశమైనదో జ్ఞాపకములేదు. ఆ విషయము తెలిసికొను నిమిత్తము చరిత్రను జదువ నుద్యమించుచున్నాను. ఇంతియే గాక తంజావూరు కోటలో మఱియొక చూడదగిన మందిరమున్నది.
అది సరస్వతీమహల్ అను పేరుగల ప్రాచ్యలిఖిత<noinclude></noinclude>
re4era3iqqxgjq626db39f8urnucl6v
పుట:Sarada Lekhalu Vol 1.pdf/90
104
59245
553401
186323
2026-04-17T03:20:36Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553401
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>64
శారద లేఖలు
పుస్తక భాండాగారము. ఈ గ్రంథాలయమున అసంఖ్యాక
తాళపత్ర గ్రంథము లుండుటచే కవులకు, పండితులకు
చారిత్రక పరిశోధకులకు నిది పెన్నిధిగా నున్నది. అచ్చట
కొంద ఱుద్యోగులుండి శిథిల గ్రంథములకు ప్రతులు వ్రాయు
చున్నారు. మఱికొంద తేకాంతమున గూర్చుండి ప్రాచీన గ్రంథ
శోధనము గావింపుచున్నారు. వారు బహుశః గ్రంథ పరిశీలన కై
గ్రామాంతరములనుండి వచ్చినవారై యుండనోపు. ఈ విధ
ముగ సరస్వతీమహలు అలములై జీర్ణములై పోయిన పూర్వ
రాజ చరిత్రములను కవి పండిత జీవితములను నెఱుక పరచు
భారతీయులకు ముఖ్యముగా దక్షిణహిందూ దేశీయులకు
నమూల్య ప్రయోజనము గలిగించుచున్నది. తంజావూరు
పాలకులలో మన తెలుగువారు కూడ నుండుటచే ఆనాడు
వారువ్రాయించిన గ్రంథములు శాసనములు మున్నగునవి మన
ఆంధ్రుల చరిత్రము నెఱుగుట కెక్కువగాఁ దోడ్పడుచున్నవి.
మిత్రమా! తంజావూరియందు మన ఆంధ్రులుచూచి సంతో
షింప వలసిన విశేషములు పెక్కులున్నను దురదృష్టవశమున
ఆనాడు వానయధికముగా నుండుటచే తనివిదీర చూడజాలక
పోతిమని తెల్పుటకు చింతిల్లుచున్నాను. అటనుండి మధురకు వెళ్లి
తిమి. మధుర ప్రాచీన నగరము. పాండ్య రాజులకు రాజధాని.మధు
రలోని మీనాక్షీ దేవ్యాలయము సుప్రసిద్ధమైనది. అచ్చట
దేవి కే ప్రసిద్ధి యెక్కు_నకాన మీనాక్షి సుందరేశ్వరుని భార్య
యనరు. మీనాక్షీ దేవ్యాలయ మొక మహానగరమువలె
నున్నది. ఆ యాలయ పుణ్యస్థలమున లేని వస్తువు లేదు.<noinclude></noinclude>
dc5e5t3t3ld7nnzvrwuvkfcc1zo4r3d
553423
553401
2026-04-17T06:24:09Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553423
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|64|శారదలేఖలు|}}</noinclude>పుస్తక భాండాగారము. ఈ గ్రంథాలయమున అసంఖ్యాక తాళపత్ర గ్రంథము లుండుటచే కవులకు, పండితులకు చారిత్రక పరిశోధకులకు నిది పెన్నిధిగా నున్నది. అచ్చట కొంద ఱుద్యోగులుండి శిథిల గ్రంథములకు ప్రతులు వ్రాయుచున్నారు. మఱికొంద ఱేకాంతమున గూర్చుండి ప్రాచీనగ్రంథ శోధనము గావింపుచున్నారు. వారు బహుశః గ్రంథపరిశీలనకై గ్రామాంతరములనుండి వచ్చినవారై యుండనోపు. ఈ విధముగ సరస్వతీమహలు ఖిలములై జీర్ణములై పోయిన పూర్వరాజ చరిత్రములను కవి పండిత జీవితములను నెఱుకపరచు భారతీయులకు ముఖ్యముగా దక్షిణహిందూ దేశీయులకు నమూల్య ప్రయోజనము గలిగించుచున్నది. తంజావూరు పాలకులలో మన తెలుగువారు కూడ నుండుటచే ఆనాడు
వారువ్రాయించిన గ్రంథములు శాసనములు మున్నగునవి మన ఆంధ్రులచరిత్రము నెఱుగుట కెక్కువగాఁ దోడ్పడుచున్నవి. మిత్రమా! తంజావూరియందు మన ఆంధ్రులుచూచి సంతోషింప వలసిన విశేషములు పెక్కులున్నను దురదృష్టవశమున ఆనాడు వానయధికముగా నుండుటచే తనివిదీర చూడజాలక పోతిమని తెల్పుటకు చింతిల్లుచున్నాను. అటనుండి మధురకు వెళ్లితిమి. మధుర ప్రాచీన నగరము. పాండ్యరాజులకు రాజధాని. మధురలోని మీనాక్షీ దేవ్యాలయము సుప్రసిద్ధమైనది. అచ్చట దేవికే ప్రసిద్ధి యెక్కువకాన మీనాక్షి సుందరేశ్వరుని భార్య యనరు. మీనాక్షీ దేవ్యాలయ మొక మహానగరమువలె నున్నది. ఆ యాలయ పుణ్యస్థలమున లేని వస్తువులేదు.<noinclude></noinclude>
4oon3y44pl2evg79it3dh87531lw86c
పుట:Sarada Lekhalu Vol 1.pdf/91
104
59246
553402
186324
2026-04-17T03:20:51Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553402
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
65
పువ్వులు, పండ్లు, బొమ్మలు, పటములు, నగలు, వస్త్రములు,
పాత్రములు, పరికరములు మున్నగు సమస్త వస్తు దుకాణము
లందే యున్నవి. గుడ్డ తీసుకొనిన వారావలకుబోయి కుట్టించు
కొనవలసిన బాధ లేకుండ నచ్చటనున్న కుట్టుయంత్రములకు
లెక్కలేవు. కాని అవి అన్నియు చేతియంత్రములు. కాలితో
త్రొక్కెడి కుట్టుయంత్రము లాయూర నరుదుగానున్నవి,
యేలనో? చెన్న రాజధానిలో చెన్నపురి తరువాత మధురయే
గొప్పపట్టణము కాన నీటికొళాయీలు, విద్యుద్దీపములు,
మోటారుకారులు మున్నగు నాగరికపు పరికరములచే పట్ట
ణము కలకల లాడుచుండును. మీనాక్షీ ఆలయముగూడ
విద్యుద్దీపములతో ధగధగమని ప్రకాశింపుచుండును. మీనాక్షీ,
దేవికిగూడ సంపదకు కొదువలేదు. విలువైన రత్నాభరణము
లును పసిడివాహనములును బహుళముగనున్నవి. అయినను
మూలవిగ్రహము దర్పములేక సౌమ్యముగనుండును. శుక్ర
వారమునాటిరాత్రి యామె దర్శనమే దుర్లభము. కాని దేవి
కృపవల్ల మాకానాడుకూడ
యామె చక్కగనే దర్శన
మొసంగెను.
మధురలో గూడ నొక రాజమందిరమున్నది. అదిధర్మా
నాయుఁడు కట్టించినదట. తంజావూరి రాజైన తిరుమలనాయు
డును మధురరాజై న ధర్మానాయుడును మామయల్లుండ్రట.
తంజావూరి రాజమందిరములకంటె వేయి రెట్లధిక శిల్పకళా
5<noinclude></noinclude>
ncmw7ata87p05idodt0joym4yn9zrr6
553424
553402
2026-04-17T06:30:16Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553424
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|65}}</noinclude>పువ్వులు, పండ్లు, బొమ్మలు, పటములు, నగలు, వస్త్రములు, పాత్రములు, పరికరములు మున్నగు సమస్తవస్తు దుకాణము లందే యున్నవి. గుడ్డ తీసుకొనిన వారావలకుబోయి కుట్టించుకొనవలసిన బాధలేకుండ నచ్చటనున్న కుట్టుయంత్రములకు లెక్కలేవు. కాని అవి అన్నియు చేతియంత్రములు. కాలితో
త్రొక్కెడి కుట్టుయంత్రము లాయూర నరుదుగానున్నవి, యేలనో? చెన్న రాజధానిలో చెన్నపురి తరువాత మధురయే గొప్పపట్టణము కాన నీటికొళాయీలు, విద్యుద్దీపములు, మోటారుకారులు మున్నగు నాగరికపు పరికరములచే పట్టణము కలకల లాడుచుండును. మీనాక్షీ ఆలయముగూడ విద్యుద్దీపములతో ధగధగమని ప్రకాశింపుచుండును. మీనాక్షీ దేవికిగూడ సంపదకు కొదువలేదు. విలువైన రత్నాభరణములును పసిడివాహనములును బహుళముగనున్నవి. అయినను మూలవిగ్రహము దర్పములేక సౌమ్యముగనుండును. శుక్రవారమునాటిరాత్రి యామె దర్శనమే దుర్లభము. కాని దేవి కృపవల్ల మాకానాడుకూడ యామె చక్కగనే దర్శన మొసంగెను.
మధురలోగూడ నొక రాజమందిరమున్నది. అదిధర్మానాయుఁడు కట్టించినదట. తంజావూరి రాజైన తిరుమలనాయుడును మధురరాజైన ధర్మానాయుడును మామయల్లుండ్రట. తంజావూరి రాజమందిరములకంటె వేయిరెట్లధిక శిల్పకళా<noinclude></noinclude>
t0938n4gd7c4bw54qdjrz9l0shsc2ja
పుట:Sarada Lekhalu Vol 1.pdf/92
104
59247
553403
186325
2026-04-17T03:21:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553403
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>.66
శారద లేఖలు
నిపుణతను ప్రకటింపుచున్నది మధురరాజమందిరము. పదు
నాఱుగుల చుట్టుకొలతగల పెద్ద పెద్ద స్తంభములుగల యా
రాజమందిరమందుగల శిల్పచాతుర్య మేమి చెప్పుదును? లతా
వితానము లేమి? పుష్పమంజరులేమి, పక్షిజాతము లేమి? మనుష్య
ప్రతిమలేమి!! ప్రతిశీల్పము యథాతథముగ నచ్చొత్తి
నట్లుండెను. కల్యాణమండపమని యొక భాగము చూపిరి.
అచ్చట పనితన మరయుటకు రెండుకన్నులు చాలవనిపించినది.
దానికంటె రమణీయముగానున్నది శయ్యమంది రాంతర్భా
గము. ఆయద్భుత శిల్పకళాభవన మరియుటచే విస్మయమును
సంతసమును గలుగుటయేగాక నధికమగు విషాదముగూడ
గలిగినది. అట్టియద్భుత శిల్పకళాసౌందర్యమున కునికిపట్టు
లైన యున్నతోన్నతి గోపుర ప్రాకార హర్మ్యావకుల నిర్మించిన
యాశిల్పులిప్పుడేరీ! ఆప్రభువులిప్పుడేరీ! ఎట్టికళలు నశించి
నవి? ఎట్టికళాకుశలు రస్తమించినారు! ఎట్టిరాజ్యములు రూపరి
నవి! ఎట్టిరాజులు దివంగతులై నారు! భూతవృంతాంతమును
వర్తమానముతో బోల్చిచూచిన, మానసము దుఃఖసంత ప్తమై
నేత్రము లశ్రుసంసి క్తము లగునుగదా! అలనాడు రాజదర్బా
రులచే పూజితంబైన యాశిల్పకళామందిర మిప్పుడు దొర
తనమువారి కచ్చేరీల కాశ్రయమైయున్నది. ఆదివ్యమందిరము
కట్టుటకు ముప్పదైదు వత్సరములు పట్టెనట! సొమ్మెంత
వ్యయమయ్యెనో!
a
_<noinclude></noinclude>
ej2wqdfpqzajyonv8mu28p9oplx3s16
553426
553403
2026-04-17T06:37:00Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553426
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|66|శారదలేఖలు|}}</noinclude>నిపుణతను ప్రకటింపుచున్నది మధురరాజమందిరము. పదునాఱడుగుల చుట్టుకొలతగల పెద్దపెద్ద స్తంభములుగల యా రాజమందిరమందుగల శిల్పచాతుర్య మేమిచెప్పుదును? లతా వితానము లేమి? పుష్పమంజరులేమి, పక్షిజాతము లేమి? మనుష్య ప్రతిమలేమి!! ప్రతిశిల్పము యథాతథముగ నచ్చొత్తి
నట్లుండెను. కల్యాణమండపమని యొకభాగము చూపిరి. అచ్చట పనితన మరయుటకు రెండుకన్నులు చాలవనిపించినది. దానికంటె రమణీయముగానున్నది శయ్యమందిరాంతర్భాగము. ఆయద్భుత శిల్పకళాభవన మరయుటచే విస్మయమును సంతసమును గలుగుటయేగాక నధికమగు విషాదముగూడ
గలిగినది. అట్టియద్భుత శిల్పకళాసౌందర్యమున కునికిపట్టులైన యున్నతోన్నత గోపురప్రాకార హర్మ్యావళుల నిర్మించిన యాశిల్పులిప్పుడేరీ! ఆప్రభువులిప్పుడేరీ! ఎట్టికళలు నశించినవి? ఎట్టికళాకుశలు రస్తమించినారు! ఎట్టిరాజ్యములు రూపరినవి! ఎట్టిరాజులు దివంగతులైనారు! భూతవృంత్తాంతమును వర్తమానముతో బోల్చిచూచిన, మానసము దుఃఖసంతప్తమై నేత్రము లశ్రుసంసిక్తము లగునుగదా! అలనాడు రాజదర్బారులచే పూజితంబైన యాశిల్పకళామందిర మిప్పుడు దొరతనమువారి కచ్చేరీల కాశ్రయమైయున్నది. ఆదివ్యమందిరము కట్టుటకు ముప్పదైదు వత్సరములు పట్టెనట! సొమ్మెంత వ్యయమయ్యెనో!<noinclude></noinclude>
e2z6c4vl7nkodo4lwsvlo1u8e96vfwi
పుట:Sarada Lekhalu Vol 1.pdf/93
104
59248
553405
186326
2026-04-17T03:21:22Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553405
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
67
మధురలో మనస్త్రీలు మోజుపడి కొనుక్కొనెడి వంట
సామానులు పిండివంటల పనిముట్లు అత్యధికముగా గలవు.
రంగులద్దకమునకిక మధురఖ్యాతి సుప్రసిద్ధమేగదా.
అచటినుండి రామేశ్వరమున కేగితిమి. రామేశ్వర మొక
చిన్న గ్రామము. పాడిపంటల సౌభాగ్య మేమూలను గానరాదు.
ఇసుకతిప్పలు, తాటిచెట్లు, మొగలిపొదలు, నాగజెముళ్లు గలిగి
నాజన్మస్థానమగు బాపట్ల యెట్లుండునో అదియు న
నట్లేయు
న్నది. దక్షిణ దేశపు దేవాలయము లన్నిటివలెనే రామేశ్వరపు
ఆలయముగూడ గొప్పదేకాని పనితనమేమియు నంతగా గాన
రాదు. రామనాధపురపు రాజుల విగ్రహములును భక్తుల విగ్ర
హములును నచ్చటచ్చటనున్న వి.
ఒక్కదేవాలయపు ఆవరణయందే చతుర్వింశతి (24)
తీర్ధములున్నవి. అవిగాక ఊరి వెలుపలగా లక్ష్మణతీర్థమను
మఱియొక తీర్తమున్నది. రామేశ్వరము వెళ్ళినవారు మొట్ట
మొదట లక్ష్మణతీర్థమందు స్నానము చేసి ప్రాయశ్చిత్తాదులు
గావించుకొనిన వెనుకనే యాత్రార్హత గలుగును. మేమును
అట్లే చేసితిమి. తరువాత ధనుష్కోటికి వెళ్లితిమి. ధనుష్కో
టికి రామేశ్వరమునుండి రైలుమీద వెళ్ళవలెను. ధనుష్కోటి.
వద్ద సముద్రుడు నిస్తరంగుడై యుండును, రత్నాకర మహో
దధియను నుభయసాగర సంగమమని చెప్పుదురు. కాని ఆయుభ
యసాగర సంగమ మెచ్చటనో నాకు కానరాలేదు. అక్కడ
యాత్రికులెల్లరు నూతనవస్త్రధారులై స్నానము గావింతురు.<noinclude></noinclude>
kycziujfzsdj1bavrjuv4rd8tghpd69
553522
553405
2026-04-17T08:26:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553522
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|67}}</noinclude>మధురలో మనస్త్రీలు మోజుపడి కొనుక్కొనెడి వంటసామానులు పిండివంటల పనిముట్లు అత్యధికముగా గలవు. రంగులద్దకమునకిక మధురఖ్యాతి సుప్రసిద్ధమేగదా.
అచటినుండి రామేశ్వరమున కేగితిమి. రామేశ్వరమొక చిన్నగ్రామము. పాడిపంటల సౌభాగ్య మేమూలను గానరాదు. ఇసుకతిప్పలు, తాటిచెట్లు, మొగలిపొదలు, నాగజెముళ్లుగలిగి నాజన్మస్థానమగు బాపట్లయెట్లుండునో అదియు నట్లేయున్నది. దక్షిణదేశపు దేవాలయము లన్నిటివలెనే రామేశ్వరపు
ఆలయముగూడ గొప్పదేకాని పనితనమేమియు నంతగా గానరాదు. రామనాధపురపు రాజుల విగ్రహములును భక్తులవిగ్రహములును నచ్చటచ్చటనున్నవి.
ఒక్కదేవాలయపు ఆవరణయందే చతుర్వింశతి (24) తీర్థములున్నవి. అవిగాక ఊరివెలుపలగా లక్ష్మణతీర్థమను మఱియొక తీర్థమున్నది. రామేశ్వరము వెళ్ళినవారు మొట్టమొదట లక్ష్మణతీర్థమందు స్నానముచేసి ప్రాయశ్చిత్తాదులు గావించుకొనిన వెనుకనే యాత్రార్హత గలుగును. మేమును అట్లేచేసితిమి. తరువాత ధనుష్కోటికి వెళ్లితిమి. ధనుష్కోటికి రామేశ్వరమునుండి రైలుమీద వెళ్ళవలెను. ధనుష్కోటి వద్ద సముద్రుడు నిస్తరంగుడై యుండును, రత్నాకర మహోదధియను నుభయసాగర సంగమమని చెప్పుదురు. కాని ఆయుభయసాగర సంగమ మెచ్చటనో నాకు కానరాలేదు. అక్కడ యాత్రికులెల్లరు నూతనవస్త్రధారులై స్నానము గావింతురు.<noinclude></noinclude>
c7aug98mb9u88ehn3vopa8fwwb3vno6
పుట:Sarada Lekhalu Vol 1.pdf/94
104
59249
553406
186327
2026-04-17T03:21:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553406
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>68
శారద లేఖలు
అచ్చట స్నానము చేసివచ్చి రైలులో నెక్కి పియర్' అను స్థాన
మునకు వెళ్లితిమి. అచ్చట విదేశమునుండి వచ్చుయాత్రికులను
స్టీమరులోనుండి రై లులో కెక్కించుకొనుటకు రైలు, వంతెన
మీదుగా స్టీమరువద్ద కేగును. సముద్రమచ్చట అగాధముగా
నున్నది. కాన తరంగము లుత్తుంగముగా వచ్చుచుండెను.
మేమాప్రదేశమున కేగునప్పటికి దాదాపు పదునొకండు గంట
లగుటచే నాపట్టపగటి యెండలో నీలమేఘశ్యామల కాంతు
లతో సాగరజలము రమణీయమై కన్పట్టుచుండెను. స్వచ్ఛ
మగు ధవళకాంతులీనెడు ఫేనములతో
గూడ్ యువ్వెత్తుగ
దూకెడీ యాతరంగముల పోటు చూచుటకు విస్మయ జనకముగ
నుండుటయేగాక భయంకరముగ గూడ నుండెను. రై నిలిచిన
గంటసేపు మాకా సాగరభంగములను యోధులునడచినట్లు
బారు బారులై చనుదెంచు ఫేనమాలికలను చూచుటకే సరి
పోయెను. ఈలోపుగ తోలు పెట్టెలు, పరుపుచుట్టలు, కాఫీ
థెర్మాసులు,టిఫిన్ క్యారియరులు మొదలగు నాగరికపు ప్రయాణ
వస్తువులతోను హ్యాటు, బూటు, సూటు, కంటియద్దములు,
చేతికట్టలు మున్నగు అలంకారములతోడను స్వదేశీయులు
విదేశీయులునగు నాగరికులెందఱో మా బండిలోని కెక్కిరి. అంతు
మా బండికదిలెను.
ధనుష్కోటినుండి వచ్చిన వెనుకనే యెవరైనను దేవాల
యములో నభి షేకములు అర్చనలు మున్నగునవి చేయవలెను.
మేమును అట్లే చేసితిమి. దక్షిణ దేశపు దేవాలయములన్ని టను<noinclude></noinclude>
2fl5mz7q0r6ctxucxzc14gt1p8xfmyc
553523
553406
2026-04-17T08:34:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553523
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|68|శారదలేఖలు|}}</noinclude>అచ్చట స్నానముచేసివచ్చి రైలులోనెక్కి పియర్ అను స్థానమునకు వెళ్లితిమి. అచ్చట విదేశమునుండి వచ్చుయాత్రికులను స్టీమరులోనుండి రైలులో కెక్కించుకొనుటకు రైలు, వంతెనమీదుగా స్టీమరువద్దకేగును. సముద్రమచ్చట అగాధముగా నున్నది. కాన తరంగము లుత్తుంగముగా వచ్చుచుండెను. మేమాప్రదేశమున కేగునప్పటికి దాదాపు పదునొకండు గంటలగుటచే నాపట్టపగటి యెండలో నీలమేఘశ్యామల కాంతులతో సాగరజలము రమణీయమై కన్పట్టుచుండెను. స్వచ్ఛమగు ధవళకాంతులీనెడు ఫేనములతోగూడి యువ్వెత్తుగ
దూకెడి యాతరంగముల పోటుచూచుటకు విస్మయ జనకముగ నుండుటయేగాక భయంకరముగ గూడ నుండెను. రైలునిలిచిన గంటసేపు మాకా సాగరభంగములను యోధులునడచినట్లు బారుబారులై చనుదెంచు ఫేనమాలికలను చూచుటకే సరిపోయెను. ఈలోపుగ తోలుపెట్టెలు, పరుపుచుట్టలు, కాఫీ
థెర్మాసులు,టిఫిన్ క్యారియరులు మొదలగు నాగరికపు ప్రయాణ వస్తువులతోను హ్యాటు, బూటు, సూటు, కంటియద్దములు, చేతికఱ్ఱలు మున్నగు అలంకారములతోడను స్వదేశీయులు విదేశీయులునగు నాగరికులెందఱో మాబండిలోనికెక్కిరి. అంత మా బండికదిలెను.
ధనుష్కోటినుండి వచ్చినవెనుకనే యెవరైనను దేవాలయములో నభిషేకములు అర్చనలు మున్నగునవి చేయవలెను. మేమును అట్లేచేసితిమి. దక్షిణదేశపు దేవాలయములన్నిటను<noinclude></noinclude>
omgdf5cm5973o9ulbaj4nb04b6rhzar
పుట:Sarada Lekhalu Vol 1.pdf/95
104
59250
553407
186328
2026-04-17T03:21:48Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553407
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>శారద లేఖలు
69
పూజాపురస్కారము లన్నిటికిని టిక్కెట్లు, టిక్కెట్టులేక రైలు
లోని కెట్లెక్క నీయరో, నాటకమునకెట్లు రానీయరో, ప్రదర్శన
ములనెట్లు చూడనీయరో, అట్లే టికెట్ లేక దేవాలయము
లోనికిగూడ రానీయరు. సమస్త హైందవులును సాధారణముగా
దర్శించి పూజించి పరితృ ప్తినందవలసిన దేవాలయములు ఆధు
నిక నాగరిక మర్యాదలను బట్టి ప్రదర్శనములవంటి శాలలుగామారి
పోయినవి. అనగా సంపత్తిగలవారికే స్వామిదర్శనమన్న మాట.
రుసుములేక స్వామి నిర్మాల్యపు పూరేకైన లభింపదు. స్వామి
దర్శనము కేవల టికెట్ తోడనే కాదు.
లంచ పంచము
లిచ్చుటకుగూడ పాల్పడవలెను. ఇన్ని పాట్లుపడినమీదట స్వామి
దర్శనము. దక్షిణ దేశమున నేగాని యిట్టియనుచిత పద్ధతులు ఉత్తర
హిందూస్థానమున 'లేవని చెప్పుదురు. సుప్రసిద్ధమైన కాశీ క్షేత్ర
మున విశ్వేశ్వరుని ప్రతివారుసు స్వయముగా తాకి పూజింప
వచ్చునట. దక్షిణదేశ దేవాలయములయందు పై విధముగా
నిర్బంధములును ప్రజాపీడయు పేదలనిరసనమును మిక్కుట
ముగా నుండుటచే స్వామిసాన్నిధ్యమున జనులకు నిజముగా
కలుగవలసిన ఆ స్తిక్యభావము శూన్యమగుచున్నది: పై పెచ్చు
అచ్చటి అక్రమములు పీడలు దౌర్జన్యములు చూచుటచే
మనస్సునందొక విధమగు కల్లోలమును, అసహ్యతాభావమును
గూడ గలుగుచున్నది. సగుణోపాసన పామరజనులు తరించు
టకై యవసరమని కొందఱు వాదింతురు. అది నిజమేనని యొక
విధముగా నంగీకరించినను దేవతా మందిరములలో నుండవలసి
నంత పవిత్రతయు, శాంతిశ్రద్ధలును లేమింజేసి నేటి హిందూ<noinclude></noinclude>
dw5sv58oqt4n82lczvrm3vcixo5bcsa
553524
553407
2026-04-17T08:41:21Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553524
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|69}}</noinclude>పూజాపురస్కారము లన్నిటికిని టిక్కెట్లు, టిక్కెట్టులేక రైలులోనికెట్లెక్కనీయరో, నాటకమునకెట్లు రానీయరో, ప్రదర్శనములనెట్లు చూడనీయరో, అట్లే టికెట్ లేక దేవాలయములోనికిగూడ రానీయరు. సమస్త హైందవులును సాధారణముగా దర్శించి పూజించి పరితృప్తినందవలసిన దేవాలయములు ఆధునికనాగరిక మర్యాదలనుబట్టి ప్రదర్శనములవంటి శాలలుగామారిపోయినవి. అనగా సంపత్తిగలవారికే స్వామిదర్శనమన్న మాట. రుసుములేక స్వామి నిర్మాల్యపు పూరేకైన లభింపదు. స్వామి దర్శనము కేవలమీ టికెట్తోడనే కాదు. లంచపంచము లిచ్చుటకుగూడ పాల్పడవలెను. ఇన్ని పాట్లుపడినమీదట స్వామి దర్శనము. దక్షిణదేశముననేగాని యిట్టియనుచితపద్ధతులు ఉత్తర హిందూస్థానమున లేవని చెప్పుదురు. సుప్రసిద్ధమైన కాశీక్షేత్రమున విశ్వేశ్వరుని ప్రతివారును స్వయముగాతాకి పూజింప వచ్చునట. దక్షిణదేశ దేవాలయములయందు పైవిధముగా నిర్బంధములును ప్రజాపీడయు పేదలనిరసనమును మిక్కుటముగా నుండుటచే స్వామిసాన్నిధ్యమున జనులకు నిజముగా కలుగవలసిన ఆస్తిక్యభావము శూన్యమగుచున్నది: పై పెచ్చు అచ్చటి అక్రమములు పీడలు దౌర్జన్యములు చూచుటచే మనస్సునందొకవిధమగు కల్లోలమును, అసహ్యతాభావమును గూడ గలుగుచున్నది. సగుణోపాసన పామరజనులు తరించుటకై యవసరమని కొందఱు వాదింతురు. అది నిజమేనని యొక విధముగా నంగీకరించినను దేవతామందిరములలో నుండవలసినంత పవిత్రతయు, శాంతిశ్రద్ధలును లేమింజేసి నేటి హిందూ<noinclude></noinclude>
gtn1dgia7rijtz98t9k28a97dzuoyk3
పుట:Sarada Lekhalu Vol 1.pdf/96
104
59251
553408
186329
2026-04-17T03:22:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553408
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>70
శారద లేఖ లు
దేవాలయములు ఏ కొలదిమంది జనుల జీవనోపాధికో సాధనము
లగుచున్న వేకాని జనసముదాయమునకు జ్ఞానభ క్తివై రాగ్యము
లను ప్రసాదించు పవిత్రస్థానములుగా నుండుట లేదు. దక్షిణ
దేశపు దేవాలయములకు పూర్వ రాజదత్త సంపత్తి యధిక ముగా
గలదు. మఱియు పూర్వమువలె నడువవలసిన బాధ లేకుండా
యేర్పడిన నేటిప్రయాణ సౌకర్యములవలనగూడ పూర్వముకంటె
యాత్రికు లనేక రెట్లధికముగా వచ్చుచున్నారు. ఇందువలన గూడ
న దేస్థానములరాబడి యధికమైనది. కాన ఘోరమైనటిక్కెట్ల
విధానము దేవస్థానములందు తొలగించిన బాగుగానుండును.
స్వామికర్పించెడు దక్షిణలు జనులు భ క్తిశ్రద్దలనుబట్టియు 'పేద
భాగ్యములనుబట్టియు యథాశక్తి గ నుండవలెనుగాని నిర్బంధ
ముగా నుండుటయనుచితము. ఇందువలన పేడ లెక్కువగ శ్రమ
పడుచున్నారు. దాదాపొక సంవత్సరము క్రిందట నేనొక ప్రసిద్ధ
దేవాలయమున కేగితిని. అచ్చటికి వ్యాధిచే బాధపడుచున్న
యొక పేదరాలే తెంచెను. అణామూడుపై సలిచ్చినగాని యచ్చట
కర్పూరహారతి సేయరని యామె తెలిసికొని యాడబ్బులను
కొబ్బరికాయయు కర్పూరమును దీసికొని దేవాయమున
కేతెంచెను. కాని అణాటిక్కెట్టు
-ట్టు కొనుక్కొనినగాని లోనికి
బోవుటకు వలనుపడదని ద్వారరక్షకు లామెను లోనికిబోనీయక
నడ్డగించిరి. ఆమె పేదరాలనని వారినెన్ని యోవిధముల ప్రార్థిం
చెను. కాని వారువిడువ లేదు. కానీ ఆమె తనవద్ద డబ్బులలోని
యణా పెట్టి టిక్కెట్టు కొనుక్కొని లోని కేతెంచెను. అణా
వ్యయమైపోవుటచే నామెవద్ద కానీమాత్ర మేయుండెను. కాన<noinclude></noinclude>
5189c14fqd9clh5utszkzklnbb6tzra
553525
553408
2026-04-17T08:48:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553525
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|70|శారదలేఖలు|}}</noinclude>దేవాలయములు ఏ కొలదిమంది జనులజీవనోపాధికో సాధనములగుచున్నవేకాని జనసముదాయమునకు జ్ఞానభక్తివైరాగ్యములను ప్రసాదించు పవిత్రస్థానములుగా నుండుటలేదు. దక్షిణదేశపు దేవాలయములకు పూర్వరాజదత్త సంపత్తి యధికముగా గలదు. మఱియు పూర్వమువలె నడువవలసిన బాధలేకుండా
యేర్పడిన నేటిప్రయాణ సౌకర్యములవలనగూడ పూర్వముకంటె యాత్రికు లనేక రెట్లధికముగా వచ్చుచున్నారు. ఇందువలనగూడ దేవస్థానములరాబడి యధికమైనది. కాన ఘోరమైనటిక్కెట్ల విధానము దేవస్థానములందు తొలగించిన బాగుగానుండును. స్వామికర్పించెడు దక్షిణలు జనులు భక్తిశ్రద్దలనుబట్టియు పేద భాగ్యములనుబట్టియు యథాశక్తిగ నుండవలెనుగాని నిర్బంధముగా నుండుటయనుచితము. ఇందువలన పేదలెక్కువగ శ్రమపడుచున్నారు. దాదాపొక సంవత్సరముక్రిందట నేనొక ప్రసిద్ధ
దేవాలయమున కేగితిని. అచ్చటికి వ్యాధిచే బాధపడుచున్న యొకపేదరాలేతెంచెను. అణామూడుపై సలిచ్చినగాని యచ్చట కర్పూరహారతి సేయరని యామెతెలిసికొని యాడబ్బులను కొబ్బరికాయయు కర్పూరమును దీసికొని దేవాయమున కేతెంచెను. కాని అణాటిక్కెట్టు కొనుక్కొనినగాని లోనికి బోవుటకు వలనుపడదని ద్వారరక్షకు లామెను లోనికిబోనీయక నడ్డగించిరి. ఆమె పేదరాలనని వారినెన్నియోవిధముల ప్రార్థించెను. కాని వారువిడువలేదు. కాన ఆమె తనవద్దడబ్బులలోని యణాపెట్టి టిక్కెట్టు కొనుక్కొని లోని కేతెంచెను. అణా వ్యయమైపోవుటచే నామెవద్ద కానీమాత్రమేయుండెను. కాన<noinclude></noinclude>
51osfowjf9mzyrx02ey9c0ahkv42e1t
పుట:Sarada Lekhalu Vol 1.pdf/97
104
59252
553413
186330
2026-04-17T04:34:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553413
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>A
శారద లేఖలు
71
ఆ కాలణాతో కర్పూరహారతిచేయుటకు అర్చకుడు నిరాక
రిం చెను. “పేదరాలనునాయనా! అణా ద్వారంవద్ద తీసుకున్నారు
నాయనా! నాలు గేండ్ల నుంచీ రోగంతో తీసుకుంటూ ఈస్వామి
దర్శనముచేస్తే రోగం పోతుందని గంపెడాశతో ఎంతో
దూరాన్నించి వచ్చానునాయనా! ఈ కానిడబ్బుతీసుకొని కొంచెం
కర్పూర హారతి చెయ్యి స్వామి, పేదరాలికి చేస్తే నీకు పుణ్యం
ఉంటుందిస్వామి” అనియా స్త్రీ యర్చకుని నెంత యోదీ నముగ
వేడుకొనెను. "డబ్బు లేకుండా యీగుల్లోకి యెందుకువచ్చావు.
ఊరికే కర్పూరహారతి చేయడానికి నీవు పెట్టిన నౌకరులెవ్వరూ
లేరు. ఫో!ఫో!'' అని యర్చకుడు రూక్ష వీక్షణుడై కఠినముగా
పలికెను. వారు అర్చకులుగా నుండకున్న చో నింతకంటె
దయాశీలురుగా నుండెడివారేమో! ఆసందర్భమును పరికింపుచు
కొంత సేపు నేనచటనే నిలువబడితిని. ఆయర్చకుని మనస్సుకరఁగ.
లేదు. కర్పూరహారతిచేయక ఆస్త్రీకి సంతుష్టి కలుగునట్లుగ లేదు.
అప్పుడాయర్చకునితో " ఆడబ్బులు నేనిస్తాను. ఆమెకు కర్పూర
హారతిచేయండి” అని నేనంటిని. ఆయర్చకునకు నామీదగూడ
కోపమునచ్చెను. "మీకెందుకు మీరు వెళ్లండి నేను చేసేది
లేదు.” అని తీవ్రముగా బలికెను. "ఎందుకు చేయరు, మీకు
కావలసినది డబ్బులేగదా ఆడబ్బులెవరి సెమీ కేమి? చేయండి”
అని నేనంటిని. అర్చకునితీవ్రత చప్పున చల్లారెను. ఐదు కానుల
కొఱకు పేదరాలి పై తాను చేసిన దౌర్జన్యమునకు అతనిలో
అతనికే సిగ్గుగలిగినది. అప్పుడతడు నెమ్మదై నపలుకులతో
“నేనేదోచేస్తా. మీరు అమ్మణ్ణి గుల్లోకి వెళ్లండి అమ్మా' అనెను.<noinclude></noinclude>
tnocwpw368mtt3nj8bfdbirqp0lnqo5
553526
553413
2026-04-17T08:57:29Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553526
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|71}}</noinclude>ఆ కాలణాతో కర్పూరహారతిచేయుటకు అర్చకుడు నిరాకరించెను. “పేదరాలనునాయనా! అణా ద్వారంవద్ద తీసుకున్నారు నాయనా! నాలుగేండ్లనుంచీ రోగంతో తీసుకుంటూ ఈస్వామి దర్శనముచేస్తే రోగంపోతుందని గంపెడాశతో ఎంతో దూరాన్నించి వచ్చానునాయనా! ఈకానిడబ్బుతీసుకొనికొంచెం కర్పూరహారతిచెయ్యిస్వామీ, పేదరాలికిచేస్తే నీకు పుణ్యం ఉంటుందిస్వామీ” అనియాస్త్రీ యర్చకుని నెంతయోదీనముగ వేడుకొనెను. "డబ్బులేకుండా యీగుళ్లోకి యెందుకువచ్చావు. ఊరికే కర్పూరహారతి చేయడానికి నీవుపెట్టిన నౌకరులెవ్వరూ
లేరు. ఫో!ఫో!" అని యర్చకుడు రూక్షవీక్షణుడై కఠినముగా పలికెను. వారు అర్చకులుగా నుండకున్నచో నింతకంటె దయాశీలురుగా నుండెడివారేమో! ఆసందర్భమును పరికింపుచు కొంతసేపు నేనచటనే నిలువబడితిని. ఆయర్చకుని మనస్సుకరఁగ లేదు. కర్పూరహారతిచేయక ఆస్త్రీకిసంతుష్టికలుగునట్లుగలేదు.
అప్పుడాయర్చకునితో "ఆడబ్బులు నేనిస్తాను. ఆమెకు కర్పూరహారతిచేయండి” అని నేనంటిని. ఆయర్చకునకు నామీదగూడ కోపమునచ్చెను. "మీకెందుకు మీరువెళ్లండి నేను చేసేది లేదు.” అని తీవ్రముగా బలికెను. "ఎందుకుచేయరు, మీకు కావలసినది డబ్బులేగదా ఆడబ్బులెవరిస్తెమీకేమి? చేయండి” అని నేనంటిని. అర్చకునితీవ్రత చప్పునచల్లారెను. ఐదుకాసుల కొఱకు పేదరాలిపై తానుచేసిన దౌర్జన్యమునకు అతనిలో అతనికే సిగ్గుగలిగినది. అప్పుడాతడు నెమ్మదైనపలుకులతో 'నేనేదోచేస్తా. మీరు అమ్మణ్ణి గుల్లోకివెళ్లండి అమ్మా' అనెను.<noinclude></noinclude>
0ag2ms6pasaksjh31xyvtbp1ysjeb8r
పుట:Sarada Lekhalu Vol 1.pdf/98
104
59253
553414
186331
2026-04-17T04:35:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */
553414
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>72
శారద లేఖలు
ఇఁక నెందులకని నే నీవలకువచ్చి వేసితిని. ఆవల నేను
అమ్మణ్ణి
గుడియందుండగా కర్పూర హారతి చేసినాడని ఆస్త్రీ వచ్చి నాతో
చెప్పెను. ఈవిధమున దేవతలు నేడు దౌర్జన్యపరులగు మానవుల
చేతిలో జక్కి భ క్తజన సులభులు గాకున్నారు. నేను స్వామి
దర్శనము కానలెనన్న చో నెఱటోపీలో, యూనిఫారండ్రస్సులో
కావలెను. లేదా ఐశ్వర్య సమృద్ధియైన
నుండవలెను.
ఈ రెండును లేనివారిగతి పై పేదరాలిగతియే. రామేశ్వరము
నుండి ప్రతివారును తప్పక తెచ్చుకొనునవి గవ్వలు. రామేశ్వ
రమునందుతప్ప మతెచ్చటను గవ్వలు శంఖములు దొరకవు.
అచ్చటగూడ గవ్వలంగ ళ్ళైదాఱుకంటే నెక్కు వగలేవు. ఆయం
గళ్ళచుట్టును వివిధ దేశపు స్త్రీ లెట్లు మూగియుందురో ఆ చోద్య
మును చూచి తీరవలెను. ఆడవారి బేరమగుటచేతను, ఏవిధ
ముగానై నను తీసికొనక మానరను విశ్వాసముచేతను గవ్వ
లతిప్రియముగ నమ్ముదురు. ఎనిమిది యాట గవ్వల తుదిధర
నాలుగణాలు. అధిక వెలగానున్నను అయిదులు, పదులు,
రూకలు పెట్టి ప్రతిస్త్రీయును గవ్వలుతీసికొని వెళ్ళుచునే యుం
డును. రామేశ్వరము వెళ్ళెదమనిన గవ్వలు తెచ్చి పెట్టుడను
టయు, వెళ్ళివచ్చితిమనిన గవ్వలు తెచ్చినారాయని యడుగు
టయు మనదేశమందు పరిపాటియైనమాట, కాని యీగవ్వల
వలనగల ప్రయోజనమేమి? జూదమువంటి ఆటను ఆడి విలువ
లేనికాలమును వ్యర్థముచేసికొనుటయేగదా. నేడు స్త్రీలు దేశ
హితార్థము చేయవలసిన కార్యములు నేర్చుకొనవలసిన విద్యలు
లలితకళలు ఎన్ని యోయుండ నీగవ్వలాటలాడ నెవ్వ
కా<noinclude></noinclude>
9v85gbew6ec0zju52c4kr9my0fbwljd
553527
553414
2026-04-17T09:06:37Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553527
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|72|శారదలేఖలు|}}</noinclude>ఇఁక నెందులకని నే నీవలకువచ్చివేసితిని. ఆవల నేను అమ్మణ్ణి గుడియందుండగా కర్పూరహారతి చేసినాడని ఆస్త్రీవచ్చి నాతోచెప్పెను. ఈవిధమున దేవతలు నేడు దౌర్జన్యపరులగు మానవులచేతిలో జిక్కి భక్తజన సులభులు గాకున్నారు. నేడు స్వామిదర్శనము కావలెనన్నచో నెఱ్ఱటోపీలో, యూనిఫారండ్రస్సులో
కావలెను. లేదా ఐశ్వర్యసమృద్ధియైన నుండవలెను. ఈరెండును లేనివారిగతి పై పేదరాలిగతియే. రామేశ్వరము నుండి ప్రతివారును తప్పక తెచ్చుకొనునవి గవ్వలు. రామేశ్వరమునందుతప్ప మఱెచ్చటను గవ్వలు శంఖములు దొరకవు. అచ్చటగూడ గవ్వలంగళ్ళైదాఱుకంటె నెక్కువగలేవు. ఆయంగళ్ళచుట్టును వివిధదేశపు స్త్రీలెట్లు మూగియుందురో ఆచోద్యమును చూచి తీరవలెను. ఆడవారి బేరమగుటచేతను, ఏవిధముగానైనను తీసికొనక మానరను విశ్వాసముచేతను గవ్వ లతిప్రియముగ నమ్ముదురు. ఎనిమిది యాటగవ్వల తుదిధర నాలుగణాలు. అధికవెలగానున్నను అయిదులు, పదులు, రూకలుపెట్టి ప్రతిస్త్రీయును గవ్వలుతీసికొని వెళ్ళుచునే యుండును. రామేశ్వరము వెళ్ళెదమనిన గవ్వలు తెచ్చిపెట్టుడనుటయు, వెళ్ళివచ్చితిమనిన గవ్వలు తెచ్చినారాయని యడుగుటయు మనదేశమందు పరిపాటియైనమాట, కాని యీగవ్వలవలనగల ప్రయోజనమేమి? జూదమువంటి ఆటను ఆడి విలువలేనికాలమును వ్యర్థముచేసికొనుటయేగదా. నేడు స్త్రీలు దేశహితార్థము చేయవలసిన కార్యములు నేర్చుకొనవలసిన విద్యలు
లలితకళలు ఎన్నియోయుండ నీగవ్వలాటలాడ నెవ్వ<noinclude></noinclude>
68fu3i3f00we25hplk15vsmhyhvaohe
పుట:Sarada Lekhalu Vol 1.pdf/99
104
59254
553528
469363
2026-04-17T09:13:19Z
శ్రీరామమూర్తి
1517
/* మూల్యాంకన చేసారు */
553528
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|73}}</noinclude>రిచ్చగింతురు? నాకు దానిపై బొత్తిగా మోజులేదు. అయినను యాత్రాచిహ్నముగా కొన్నిగవ్వలు కొనక నాకును తప్పినదికాదు. తాటియాకులతో సొగసుగా నల్లబడిన బుట్టలు పెట్టెలు గూడ నచ్చట విరివిగాదొరకును. గవ్వలు పటములుకొనిన వా రా బుట్టలనుగూడకొని వాని నాబుట్టలలో పెట్టుకొని యిండ్లకు తెచ్చుకొందురు.
రామేశ్వరమునందు గంధమాదనపర్వతమను పేరుతో నొకయిసుక తిప్పయున్నది. దానిపై రాతితో మలిచిన రామపాదచిహ్నములుగల చిన్నఆలయ మొకటిగలదు. దానిపై కెక్కినచో నడుమ బిళ్ళవలె రామేశ్వరపు లంకయు దాని చుట్టును భూపురంధ్రీమణితాల్చిన యింద్రనీలముల మొలనూలు పగిది సాగరమును, మనోహరముగా గన్పట్టును. అదిచూడదగిన దృశ్యమే. అటనుండి మేము క్రిందికి వచ్చుచుండ ఎనుబదేండ్లుదాటిన వృద్ధురాలును నామెతో మఱియిద్దఱును మా కెదురైరి. ఆవృద్ధురాలు మిక్కిలి దుర్బలముగానుండి కన్నులు తేలిపోవుచుండ మిక్కిలి ఆయాసపడుచు నడుచుచుండెను. ఆకృతులనుబట్టి వారు ఉత్తరహిందూస్థానమువారని తెలియుచున్నను ఏప్రాంతమువారో తెలిసికొనవలయుననెడి కుతూహలముతో "మీదే దేశ” మంటిని. "నేపాళదేశ" మని యా వృద్ధురాలనెను. నాకు మహాశ్చర్యమయ్యెను. ఎక్కడి శీతనగము! ఎక్కడిసేతువు! నిండు వార్ధక్యమున నావృద్ధురాలి నావిధముగా నీడ్చుకొని వచ్చిన మతవిశ్వాసము పుణ్యకాంక్ష<noinclude></noinclude>
9vujardsgktu2rq4xfg93nb7rm9akm0
పుట:Sarada Lekhalu Vol 1.pdf/100
104
59255
553545
186333
2026-04-17T11:53:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553545
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|74|శారదలేఖలు|}}</noinclude>అత్యద్భుతములుగదా! ఆకృతులలో భేదమున్నను, ఆచారములలో మార్పులున్నను, భాషలలో భిన్నత్వములున్నను, వేషములో వ్యత్యాసమున్నను, ఆసేతుశీతనగ పర్యంతముగల యావద్భారతీయుల నైక్యపఱచుచున్న దేది? మత సూత్రమే గదా!! మతము మానవునకు ప్రాణముకంటె నుత్కృష్టమైనది.
కల్పలతా! వ్రాయవలసిన విషయములు పెక్కులున్నను లేఖా విస్తరభీతి లేఖినిని వెనుకకీడ్చుచున్నది. ఇప్పటికే లేఖ పరిమితిని మించినది. కాన నింకొక్కమాటతో ముగించెదను. మిత్రమా! మేమీ విధముగా హిందూదేశపు సుప్రసిద్ధక్షేత్రములలో నొక్కటైన రామేశ్వర క్షేత్రమందు ద్వాదశదినములు గడపి పర్వతవర్ధనీ రామలింగేశ్వరుల పలుమాఱు సేవించి అనంతపద్మనాభస్వామిని దర్శింప కుతూహలము గలుగుటచే
నచ్చటికేగుటకై రామేశ్వరమునుండి మధురకువచ్చి అక్కడ నుండి ట్రివేండ్రము వెళ్లుబండి నెక్కితిమి. ట్రివేండ్రము వెళ్లుచు మార్గ మధ్యమున మేముచూచిన మొదటిక్షేత్రము తెంకాశీకి సమీపముననున్న కుర్తాళం. ప్రకృతి శోభావిభాసితంబై నేత్రపర్వంబైన యారమణీయ ప్రదేశమును గూర్చి ముందు వ్రాసెదను.
{{rh|భావపురి||మిత్రురాలు,}}
{{rh|1929 ఏప్రియల్||శారద.}}
{{rule|2cm}}<noinclude></noinclude>
5nah9r7upqmw4uq4r53eaxbvj2ld3r7
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/5
104
186268
553350
504485
2026-04-16T12:17:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553350
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కావ్యమును రచించియుండెను. మాఘమాహాత్మ్యమను వచనగ్రంథమును కూడ నితడే రచించెను.<ref>ఆంధ్ర వచన వాఙ్మయము - పుట 532</ref> అంతేకాదు, శ్రీకృష్ణ దేవరాయలవలె, రఘునాథరాయలవలె ఈతడు కవి పండితపోషకుడు. అందుచేతనే యీతడు వేంకట కృష్ణప్ప నాయకుని ప్రోత్సహించి జైమిని భారతమును రచింపచేసెను. జైమిని భారతము చొక్కనాథునకే యంకితమైనది. మనుమసిద్ధి యాస్థానమున తిక్కనవలె, విజయరంగని యాస్థానమున కృష్ణప్పనాయకుడు ముఖ్యసామాజికుడుగా నుండెనట. ఇతడు ఆస్థాన కవి కూడ.<ref>దక్షణదేశీయాంధ్రవాఙ్మయము - నిడదవోలు వెంకటరావు. పుట 333.</ref>
ముఖ్యసామాజికుడనగా ముఖ్యమంత్రియని శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు వ్రాసియున్నారు.<ref>జైమిని భారతము - ఆంధ్ర సాహిత్య పరిషత్ప్రచురణ-పీఠిక.</ref> ఇది కొంతవరకు సమర్థనీయముగానే యున్నది. జైమిని భారతము నందలి యీ ఆశ్వాసాంతగద్య మీ అభిప్రాయమునకు బలమును కలిగించుచున్నది:
"ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగ చొక్కనాథ మహీనాథ కరుణాకటాక్ష సంపాదిత గజతురంగ మాందోళికా ప్రముఖ నిఖిల సంపత్పారంపరీ సమేధమాన సముఖ మీనాక్షీ నాయక తనూభవ మీనాక్షీదేవి కటాక్షలబ్ధ కవితాసాంప్రదాయ వేంకట కృష్ణప్పనాయక ప్రణీతంబైన జైమిని భారతంబున నశ్వమేధపర్వంబను వచనకావ్యంబునందు బ్రథమాశ్వాసము.”
ఈ గద్యమునుబట్టి యీతడు కేవలాస్థానకవిమాత్రుడే కాదనియు, రాజ్యమున ప్రముఖుడే యనియు నిరూపితమగుచున్నది.
సంస్కృతమున జైమిని భారతమని ప్రఖ్యాతినందిన యశ్వమేధపర్వము ననుసరించియు, నాంధ్రమున పిల్లలమర్రి పినవీరభద్రుడు రచించిన జైమిని<noinclude><references/></noinclude>
729sawqb3sq37z888ywffh6rnoh2wwv
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/6
104
186269
553368
504486
2026-04-16T19:02:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553368
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>భారతమను చంపూకావ్యమును దృష్టియందుంచుకొనియు, వేంకట కృష్ణప్ప నాయకుడు దీనిని రచించి యున్నాడు.
సంస్కృతమున జైమిని భారతము అనుపేరుతో నొకగ్రంథ ముండినట్లు, అందు అశ్వమేధపర్వమొకటి మాత్రమే మిగిలినట్లు. తక్కిన పర్వములన్నియు నశించినట్లును, అందుకే దానికి జైమిని భారతమని పేరు వచ్చినట్లుగను కొందరు భావింతురు. కాని యిది సరిగా కాన్పించదు. సంస్కృతగ్రంథమును అనుసరించి తెనుగున వ్రాసిన పినవీరభద్రుడు కాని, వేంకట కృష్ణప్ప నాయకుడు కాని, అశ్వమేధపర్వము భారతమున శేషగ్రంథమని యెచ్చటను చెప్పి యుండలేదు. మహాభారతములో లేని కొన్ని విశేషాంశములను చెప్పదలచిన వ్యాసుని శిష్యుడు జైమిని, వ్యాసుని యశ్వమేధపర్వమునకు భిన్నముగానుండునట్లు ఈ యశ్వమేధ పర్వమును రచించియుండునని కొందరి యభిప్రాయము. ఆదియే జైమిని భారతమని ప్రఖ్యాతిని పొందెను. ఈ గ్రంథము భాగవత సంప్రదాయములు, వైష్ణవమతము వ్యాపించిన తరువాత రచితమైయుండు ననువారును కలరు. ఇందలి సత్యాసత్యములెట్లున్నను, జైమిని భారతమున విష్ణుమూర్తి అవతారమగు శ్రీకృష్ణుని మహత్త్వమధికముగా వర్ణితమగుట యథార్థము.
సముఖము వేంకట కృష్ణప్ప నాయకు డీ భారతమును వచనముగా వ్రాయునప్పుడు సంస్కృతములోనున్న గ్రంథమును, తనకు ముందుగా ఆంధ్రమున రచితమైన పిల్లలమర్రి పినవీరన గ్రంథమును చూచియున్నాడు. వానిని అనుసరించియే దీనిని వచన కావ్యముగా రూపొందించెను.
జైమినీ భారతము ఐదాశ్వాసముల వచనకావ్యము. ఈ కావ్యములో వేంకట కృష్ణప్ప నాయకుడు వస్తువునకు, రచనకు సంబంధించిన యనేకాంశములను సందర్భోచితముగా పొందు పరచి యున్నాడు. వానిని క్రమముగా నింక పరిశీలింతము.
అశ్వమేధ పర్వము పంచమవేదమని ప్రఖ్యాతి వహించిన మహాభారతమున నొకభాగము. అందుచేత, దానిలోని యితర పర్వము లందున్నట్లుగానే, వైదికములైన ధర్మవిశేషము, యజ్ఞయాగాది కర్మల ప్రశంస, వర్ణాశ్రమ ధర్మప్రతిపాదనము మున్నగు విశేషములుల్లేఖింపబడియున్నవి. మహాభారతమున<noinclude><references/></noinclude>
ae6dsob96ly011gch4lc9urv25eqa3l
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/7
104
186270
553369
504487
2026-04-16T19:08:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553369
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రెండు యాగముల ప్రాముఖ్యము విశేషముగా నుండును. భారతయుద్ధమునకు పూర్వము యుధిష్ఠిరుడు నిర్వహించిన రాజసూయ మొకటి. యుద్ధానంత మతడే చేసిన అశ్వమేధ మొకటి. ఈ రెండింటిలో జైమిని భారతము రెండవ దాని ప్రాముఖ్యమును వివరించుచున్నది. సముఖము వేంకట కృష్ణప్ప నాయకునకును వైదికధర్మములపై నభిమాన ముండుటచే, వచన జైమిని భారతమున చాలచోట్ల వైదికసంప్రదాయసంబంధములైన విశేషములను ప్రవేశపెట్టి యున్నాడు. కొన్నింటిని ఉదాహరింతును:
"కులంబు ద్రుంచుటయు, గురువుల యెడఁ గల్ల లాడుటయుంగాక బ్రాహ్మణద్రవ్యం బవహరించితియేని పాతకంబునకుం గొఱంతయేమి?”
"విప్రులకు మోవందరంబు గాకఁ బరిత్యజించిన ధనంబు రాజులకుం గాని తక్కిన వారలకుఁ బనిలేదు."
పురాణములన్నియు లోకమునకు నీతిని, హితమును అందజేయవలసిన ధ్యేయమును కలిగి యుండును. జైమిని భారతము కూడ పౌరాణికగ్రంథమే యగుటచేత, అనేక సందర్భములందు దీనిలో నీతి, హితము కనిపించునే యున్నవి. ఈ వాక్యములు చూడదగినవి:
"నీవు ధర్మజు నశ్వమేధాధ్వరంబు నవలోకింపఁబూను నప్పుడు హరికథావిముఖుండును, నన్యాయవర్తనుండును, ధర్మార్థరహితుండును, దపోవర్జితుండును, మిత్రవంచకుండు, స్వామిద్రోహి, పతితుండుఁ, బందయుఁ బరదారనిరతుండు, నల్లుని సొమ్ము భక్షించు నధముండు, ధర్మబాహ్యుండు, విదూషకుండు, దుర్వ్యసనాసక్తుండు, బహుభాషియు, విశ్వాసపాతకియు, ఋతుకాలపరత్యాగియుఁ, గష్టలోభియు, ఖలుండు, నాత్మస్తోత్రపరుండు, గృహశీలుండును, గృతఘ్నుండును, భృత్యవంచకుండును, క్షేత్రవిత్తాపహారకుండును నగువారలఁ దోడుకొని పోవలదు.”
ఈ హితమును వసుదేవుడు వాసుదేవునకు బోధించినట్లు కథాసందర్భమునందున్నది. కాని, ఇట్టి హితము సర్వకాలములందు, అందరు పెద్దలు అందరు పిన్నలకు బోధించునట్టిదే. ఒక్కొక్కచో నా కాలమునందలి జనులకు గల<noinclude><references/></noinclude>
c63okzg69k7hlr0ksyz5a9g3yum7oxv
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/8
104
186271
553370
504488
2026-04-16T19:28:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553370
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యభిప్రాయము హితరూపమున కావ్యములందు వ్యక్తమగుచుండును. ఇట్టి నీతిబోధకవాక్యములు చిన్నవియు, పెద్దవియునై గ్రంథము నండంతటను నున్నవి. ఒకటి మాత్రమే ఉదాహరించితిని.
పురాణములందు, ఇతిహాసములందు, విభిన్నరసములకు సందర్భమును బట్టి యవకాశమేర్పడుచుండును. జైమిని భారతమునందును, ప్రధానములైన వీర శృంగార భయానక రసములు కాన్పించుచున్నవి. వేంకట కృష్ణప్పనాయకు
డీరసములను సమర్థతతో పోషించియున్నాడు. ఈ రచయిత హాస్యరసమును కూడ సందర్భానుసారముగా చక్కగా నిర్వహించెను. ఈ వాక్యములు చూడుడు. శ్రీకృష్ణుడు భీమునితో నిట్లనెను:
"వృకోదరా, నీకు బుద్ధి మందంబు. ఆహారం బపారంబు. పొట్ట రెట్టించుచున్నది. రక్కసి రతులం జొక్కినవాఁడవు. మాటల పోఁబడి యెఱుఁగవు. నీవంటి వాఁడు మంత్రియైయున్నఁ గార్యంబు లగుటకు సందియంబేమి?”
నిజమున కిది నిందకాదు. అపహాస్యము చేసి అవమానించుట కాదు. మఱదియగు భీమునితో బావయగు శ్రీకృష్ణుడు చేయు హాస్యప్రసంగమే. బావమఱదుల హాస్యము మనదేశమున ప్రసిద్ధసంప్రదాయము కదా!
ఇట్లే మరియొకచో శ్రీకృష్ణుడు భీమునితో పలికినట్లున్నది. 'బావా! నీభావంబున నున్న కార్యంబులన్నియుఁ, గుశలప్రశ్నంబును వెనుక నొడువుదువు. ఇంతియేకాని, మున్నుగా బుద్ధిమత్కృత్యంబగు భోజనంబు నాకంఠపూర్తి గావింపుము. అట్లుగాక నీ కెద్దియుం దోచదు. నా పలుకులకు శంక వలదు. నీ కరణి బహుభక్షకులగు నగస్త్యకుంభకర్ణాదులు కొందరు గలరు. నీ వేమిటికి సిగ్గు పడియెదవు?'
ఇదియు పైనుదాహరించినదే, ఈ మాటలు విని భీముడును బావగారికి సముచితముగానే సమాధానము చెప్పినాడు.
జైమిని భారతకర్త, హాస్యరసభరితములైన వాక్యములు వ్రాసినట్లుగానే అధిక్షేపముతో గూడిన వ్యంగ్యగర్భితములగు భాగములు వ్రాయుటయందును<noinclude><references/></noinclude>
npmhey3l9dact9ojet47wnx7awghhb9
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/9
104
186272
553371
504489
2026-04-16T19:35:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553371
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నేర్పరియే. ముఖ్యముగా శ్రీకృష్ణుని యౌన్నత్యమును నిరూపించుట కాతడు ప్రయత్నము చేయుచుండును. భీముడు శ్రీకృష్ణునితో పలికి యీ వాక్యములను తిలకించుడు.
"నీ కామాతురత్వంబునకు గొల్ల యిల్లాండ్ర గుబ్బపాలిండ్లు సాక్షి. నీచస్త్రీసంగంబునకు నీదు మత్స్య కూర్మ
వరాహావతారంబులు సాక్షి. బహుభక్షకుండ వగుటకు బ్రహ్మాండకోటిపరిపూరితంబైన నీ కుక్షి సాక్షి. నీ స్త్రీలోలత్వంబునకు సత్యభామానిమిత్తంబుగా భూమికిం దెచ్చిన పారిజాతంబు సాక్షి. నీదు మాయాచరితంబులు ప్రకటింప నెవ్వరి తరము?'
స్వాహాదేవిం జూచి యామె చెలికత్తెలు పలుకు సందర్భమునను నిట్టిభావమే సూచితమైనది. శ్రీకృష్ణునికి సంబంధించిన పై నుదాహృతవాక్యములందు పైకి నిందలు కాన్పించినను, వ్యంగ్యముగా నాతని యాధిక్యమే వ్యక్తమైనది.
జైమిని భారతము ఇతిహాసమువంటి గ్రంథ మగుటచేత, మహాభారతమునందువలెనే యిందును, ప్రధానమైన పాండవుల యశ్వమేధవృత్తాంతమేకాక, ఆచ్చటచ్చట ఉపాఖ్యానములనబడు కథలు వచ్చుచుండును. ప్రధానకథను చెప్పుటయం దీరచయిత కెంతనేర్పు కలదో, ఉపాఖ్యానరచనమునందు కూడ నంతటి నైపుణి యున్నది. మహాభారతమునందున్న ఉపాఖ్యానములు కొన్ని స్వతంత్రములుగా నుండును. మరికొన్ని ప్రధానకథకు పూర్వరంగముగా నుండును. ఇంకకొన్ని ముఖ్యకథతో ప్రత్యక్షసంబంధమును కలిగియుండగా, వేరొక కొన్ని పరోక్షసంబంధమును వహించును. కాని, జైమిని భారతములోని ఉపకథలు వేనికవే స్వతంత్రములుగా నున్నవి. ప్రధానకథతో వాని సంబంధము నామ మాత్రమే. అగ్నిహోత్రుని కథ, ఉద్దాలకమహర్షి కథ, శ్రీమండలవృత్తాంతమను ప్రమీల కథ, కుశలవోపాఖ్యానము మున్నగునవి యిందులకు నిదర్శనములు కాగలవు.
జైమిని భారతము విష్ణుపారమ్యమును బోధించు గ్రంథమని యిదివరకు చెప్పితిని. విష్ణుమహత్వమును బోధించు ఆంధ్రమహాభాగవతాది గ్రంథములందు ఆ రచయితలు విష్ణుపరములైన స్తుతి వచనములను రచించియున్నారు.
శ్రీరామానుజుల గద్యత్రయసంప్రదాయము ననుసరించిన సింహగిరి వచనములు,<noinclude><references/></noinclude>
sk8cg3trtedrzv0oav47o2fwggdlrfs
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/10
104
186273
553372
504490
2026-04-16T19:40:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553372
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వేంకటేశ్వర వచనములు కూడ తెలుగులో స్వతంత్రముగా వెలువడినవి. ఈ సంప్రదాయము తెలిసిన వేంకట కృష్ణప్ప నాయకుడు తన వచనకావ్యమున విష్ణుపరములైన యిట్టి వచనములనే వ్రాసియున్నాడు. ఇవి పరిశీలించుడు:
"ఆపదుద్ధారకా, ఆదిదేవా, ఆనంతా, అనంతశయనా, అంబుజనాభా, అచ్యుతా, హరీ, శ్రీకృష్ణా, నిన్ను నమ్మినవాడ! లక్కయింటం జిక్కువడకుండఁ, గౌరవసభాస్థలంబున ద్రౌపదికి మానభంగంబు గాకుండ, నడవుల నిడుమలం బడునప్పు డాపదలం బొరయకుండ, సైంధవవధంబున ప్రతిజ్ఞాభంగంబు గాకుండ రక్షించి, సకలసంకటంబుల నెడఁబాపితివి. త్రిలోకాధ్యక్షా, పంకజాక్షా, ఇప్పుడీ సంకటంబు తొలగించి రక్షింపవే!"
కథాసందర్భము ననుసరించి అర్జునుడు శ్రీకృష్ణుని వేడుకొనుచు పలికినట్లున్న యీ వచనము, ఏ భక్తుడును, తన యిష్టదైవమైన విష్ణుమూర్తిని స్తుతి చేసినట్లుగానే యుండుట యిందలి విశేషము.
"గజేంద్రవరదా, గరుడవాహనా, నీరజాక్షా, నిఖిలలోకాధ్యక్షా, దేవకీనందనా, దీనజనాభినందనా, నారాయణా, భక్తత్రాణపరాయణా, నమో, నమో!”
సింహగిరి వచనముల కెంత సన్నిహితముగా నున్నదో యీ స్తుతివచనము నేను చెప్ప పనిలేదు. వచనకావ్యమునందు స్వతంత్రప్రతిపత్తి గల యిట్టి స్తుతివచనములు వ్రాయుటయందు ప్రథముడు వేంకట కృష్ణప్ప నాయకుడే. వీనిలో తనకుగల విష్ణుభక్తిని చక్కగా వ్యక్తము చేసినాడు.
ఇంతవరకు జైమిని భారతమునందలి వస్తువునకు సంబంధించిన విశేషములను కనుగొంటిమి. ఇంక రచనాసంబంధములైన యంశములను పరిశీలింతము.
జైమిని భారతమున ప్రారంభమున నుండు ఆవతారిక భాగము లేదు. దానియందు పద్యములే యుండి యుండును. ద్వితీయాశ్వాసమునుండి, పంచమాశ్వాసము వరకు, ఆశ్వాసారంభములందు పద్యములే యున్నవి. ఇవి చొక్కనాథుని,
- కృతిపతిని - సంబోధించు పద్యములు. ఈ పద్యములను చదివినప్పుడు ఈ<noinclude><references/></noinclude>
mlma67axvummaewzffl9b4ua0dgsjw0
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/11
104
186274
553373
504491
2026-04-16T19:48:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553373
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రచయితకు పద్యరచనయందును నేర్పుండెననియే చెప్పవలసి యుండును. ప్రారంభపద్యము తరువాత "అభ్యుదయపరంపరాభివృద్ధిగా నారచింపంబూనిన జైమిని భారతంబునం దశ్వమేధపర్వ వచనకావ్యంబునకు కథాక్రమం
బెట్టిదనిన" అను ఉపక్రమణ వచన ముండును. ఇట్టి వచనము నన్నయ్యగారి ఆంధ్రమహాభారతము మొదలుకొని, తరువాతి అన్ని తెలుగుకావ్యములందును కాననగును. వచనమునం దిట్టి ఉపక్రమణము ఆంధ్రకావ్యరచనమున కొకసంప్రదాయముగా నిలిచినది. అట్టి సంప్రదాయమునే వేంకట కృష్ణప్ప నాయకుడును పాటించినాడు.
క్రీ. శ. పదునారవ శతాబ్దమునుండి తెలుగులో వెలువడిన ప్రబంధములందు వర్ణనములకు ప్రధానస్థానము లభించినది. వానికి సంఖ్యానియమము కూడ నేర్పడినట్లు చెప్పుదురు. జైమిని భారతము ఐతిహాసిక పురాణమే యైనను
తనకు పూర్వము వెలువడిన ప్రబంధముల ప్రభావమునకు లోనుగాక పోలేదు. ఈ కావ్యములో ప్రబంధములం దున్నంతటి దీర్ఘవర్ణనములు లేవు కాని, సమయోచితముగా నచ్చటచ్చట వర్ణనములున్నవి. ఈ వర్ణనములు నిశ్చలములని చలనాత్మకములని రెండు విధములు గదా! వేంకట కృష్ణప్ప నాయకుడు ఈ రెండువిధముల వర్ణనములు కూడ వ్రాసి, వర్ణించుటయందు తనకు గల ప్రాభవమును ప్రదర్శించుకొనెను. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఉదాహరణమును చూపింతును.
“లెక్కింపరాని సేనలు కిక్కిరిసి నలుదిక్కులం గొలువ, వందిమాగధబృందంబులు బిరుదావళులు వంశావళులు సదువ, భేకులు, డమాములు, డక్కలు, హుడుక్కలు, డమ్మెటలు, గుమ్మెటలు, మురజమ్ములు, నరగజమ్ములు, కాహళంబులు, జయదోహలంబులైన శంఖంబులు నసంఖ్యంబులుగా మొరయ, కదళికాస్తంభంబులు, పోఁకమ్రాఁకులు, చూతపల్లవ సముల్లసిత తోరణంబులు, కాలాగురు సాంబ్రాణి ధూపంబులు మొదలైన యలంకారంబులం బొలుపారు గోపురద్వారంబులు సొచ్చి యచ్చటచ్చట బచ్చవిలుకాని తేజీకూనలంబోని చానల వలకారిచూపు లనియెడి వలలం దగిలి యట్టిట్టు గదలనేరక పిట్టలచందంబున జిట్టకంబునఁ బొదలు చిట్టవిటుల చేత హరువులైన నెఱితెరువులును, మొత్తంబులైన ముత్తియంబులు, సొంపులైన కెంపులు, పచ్చికలం దచ్చనలాడు పచ్చలు, నిగరాల<noinclude><references/></noinclude>
eqzlfb434znwzy618o8eu9gzjpmovan
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/12
104
186275
553374
504492
2026-04-16T19:56:34Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553374
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మగఱాలును, జగడంబులైన పగడంబులను, ముంగిళ్ళ నత్తమిల్లిన యంగళ్ళ నునిచిన మంగళద్రవ్యంబులును, నంతరిక్షంబునఁ గాంతులు వింతలు పొంతలు సంచరించు వైజయంతికలును, భూసురాశీర్వాదపురస్సరంబుగ సువాసినీజనంబులు చల్లు తెల్లని పూవుల నక్షతలం దేజరిల్లు రాజమార్గంబునం జని......."
"అప్పుడు కుశుండు సింహనాదంబు సేసి లక్ష్మణు నెదుర్కొనిన నతం డైదుతూపులచేఁ బేరురంబు వ్రక్కలించిన, సుక్కక యక్కుమారుండు వాయువ్యాస్త్రంబు సంధించి నిలునిలుమని యదల్చి యేయుటయు, లక్ష్మణుని యరదంబు
సుడిగాలిలోనం దవిలి కుమ్మరసారెగతి ముహూర్తమాత్రంబు తిరుగుచుండఁ దద్వేగంబున నాలుగురథ్యంబులు నాలుగుదిక్కులంబడి పంచత్వంబు నొందిన లక్ష్మణుడు వేరొకతే రెక్కి కక్కసంబులైన యుక్కుటమ్ములైదు ప్రయోగించి, కుశుని కవచంబును, గిరీటంబును దునుముటయుఁ గుబుసంబు వీడిన నాగేంద్రుని తెఱంగున మెఱయుచు, లక్ష్మణు నుద్దేశించి, 'రిత్తమోపుగానున్న కిరీటకవచంబులు తీయించి, భారంబు మాన్సిన నీవు పరమోపకారివి. నీ సైన్యభారంబంతయు బోవంజేసి ప్రత్యుపకారంబు సేసెద'నని పలుకుచు నాధర్వణశిరోమంత్రంబుల నాగ్నేయాస్త్రంబు నభిమంత్రించి ప్రయోగించుటయు, దగ్ధంబులైన రథంబులును, మండెడు నేనుంగులును, గాలెడు తురంగంబులును, నివుఱులైన పదాతివర్గంబులును, బొగలతోడఁ గలసి యెగసిన ఛత్రచామరాభరణంబులునుం గలిగి చమూసమూహంబులు దావానలంబు దవిలిన మెకంబుల రకంబున నలుదిక్కులం జరించుటయు, దాశరథి వారుణాస్త్రంబున నివారణం బొనరించినం, గుశుండు వాయవ్యాస్త్రంబు వింటనొంటించి చాపవిద్యాకౌశలంబు మెరయ వేయుటయుఁ జండమారుతవేగంబునఁ బండుటాకు లెగయు వడువున నాయోధనంబునం గల యోధవరు లాకసంబున కెగసి వీరలక్ష్మి విహరించు మణిమండపంబునకు ముంజిష్ఠపట్టు మేలుకట్టు తెఱంగునం గనుపట్టుటయు, సేనల దురవస్థ గనుంగొని సేనాధీశ్వరుండగు కాలజిత్తు కుఱుచ కనుపులు కొరికొలచేఁ గుశునురంబు నాటించి, నవ్వుచు “నా బలపరాక్రమంబు లెఱుంగవు. బాలుండవు. నీకేల యాలంబు తొలంగు" మని పలుకునంతలోఁ గుశుం డలుక దొలుక నొక్కవాలికతూపుచే వాని నాలుక ద్రుంచి తోడన మహోగ్రనారాచంబున శరీరంబు ఖండించె.”
పురవనసౌధము లిత్యాదుల వర్ణనములు నిశ్చలములును, యుద్ధవర్ణనములు చలనాత్మకములుగను నుండును. విజయరంగ చొక్కనాథుని మంత్రి<noinclude><references/></noinclude>
bva43jmr4gwcd57j2epbc7gwpy8q7d9
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/13
104
186276
553375
504493
2026-04-16T20:03:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553375
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యగు వేంకట కృష్ణప్పనాయకు డెన్నియో యుద్ధములు చేసియు, చూసియు నుండవచ్చును. అందుచేతనే దీనిలోని యుద్ధవర్ణనములు చైతన్యవంతములై వీరకర్ణోద్దీపకములుగా నున్నవి.
అలంకారప్రయోగము చేయునప్పుడు, మహాభారత కవులైన తిక్కనాదులు కాని, తరువాత వచ్చిన ప్రబంధకవులైన పెద్దనాదులుగాని, వచనపద్యభేద మంతగా పాటించి యుండలేదు. వారికి ఔచిత్యమని తోచినప్పుడు పద్యములందును, వచనములందును అలంకారముల నుపయోగించిరి. అయిన, ప్రబంధ కవులు అలంకారములను విరివిగా ప్రయోగించియున్నారు. అనంతరప్రబంధయుగమున నివసించిన వేంకట కృష్ణప్ప నాయకుడు పురాణకవులను, ప్రబంధకవులను అనుసరించి సముచితరీతిని అలంకారప్రయోగము గావించి యున్నాడు. ఈత డుపయోగించిన అలంకారములందు ఉపమారూపకములు హెచ్చుగాను, అతిశయోక్తి ఉత్ప్రేక్ష మున్నగునవి తక్కువగాను నుండును. అనగా తాను రచించినది భారత మగుటచే, తిక్కనాదుల మార్గమునే అనుగమించె ననవలసి యున్నది. ఇది సమంజసమే. ఈతని అలంకారప్రయోగమునకు కొన్ని వాక్యము లుదాహరింతును.
"గంగాతీరంబునఁ జేరిన జనుల పాతకంబులుం బలె, లలాటలోచనుం డాసిన కాలకూటంబు కరణి; శ్రీవాసుదేవ పాదారచింతనంబు వలన మానవుని జన్మంబువలె, గయావర్జనంబు సేసినవాని పితృవర్గంబుల దుర్గతింబలె, నిమిషమాత్రంబులో నీ గదాఘాతంబున యౌవనాశ్వుని సైన్యంబు లయంబు నొందు”
"గజగమనంబు లనియెడి గమనవిలాసంబును, బాశంబు లనియెడి భుజంబులును, జక్రంబు లనియెడి స్తనంబులు, శంఖంబు లనియెడి కంఠంబులును గలిగిన శత్రుసేనారమణిని నేను వరించినాఁడ"
"కెంధూళి యనియెడి కుంకుమరసంబు నలంది, సింగిణివిండ్లను కనుబొమ్మ లల్లార్చుడు, మెఱుంగుఁచూపులను దూపులఁ దళుకొత్తుచుఁ గరికుంభంబులనొఱపు మిగిలిన వైరిసేన యనుచాన.'
{{left|}}<noinclude><references/></noinclude>
4wlm8ferdlhm2ec346m35457ft1xgfj
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/14
104
186277
553376
504494
2026-04-16T20:09:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553376
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శబ్దాలంకారములలో యమకము, అనుప్రాసము చాలచోటులందు కనిపించుచున్నవి. అందును, ప్రబంధకవులవలె నీతడు అత్యాదరమును ప్రకటించి యుండలేదు.
వేంకట కృష్ణప్పనాయకుడు ఆంధ్రేతరప్రాంతమున నివసించిన ఆంధ్రుడే యైనను, నీతనికి తెలుగుభాషలోని సహజత్వము, నుడికారము, మాధుర్యము చాల చక్కగా తెలియును. తెలుగుభాషకు జీవప్రాయము లనదగిన జాతీయములు సామెతలు, ఈతని కావ్యమున నవకాశమున్న చోటులందు చక్కగా నుపయోగింపబడి యున్నవి. దిఙ్మాత్రముగా కొన్నింటిని ఉదాహరింతును.
"గొప్పఱాయి దెప్పగా వైచికొని సముద్రము నీఁదఁ దలంచిన చందంబున”
"పోతుటీగ కేనియు బొలయఁ గూడదు”
"పాఱెడు బండ్లకుఁ బాదంబులు సాఁచుమనియెదు."
వచనమును హృద్యమైనశైలిలో రచించుటయం దీతడు నిపుణుడు. రసానుగుణముగ ఉత్తమభావమును వెలువరించునటుల సమానాంతరవాక్యములు వ్రాసి, పాఠకుని మనస్సు నాకట్టుకొనుచుండును. ఇది చూడదగినది.
"ముకుందా, నందనందనా, అరవిందనయనా, ఇంద్రాదివందితా, భవదీయపాదారవిందంబులు దర్శింపఁ గంటిఁ గావున నా జీవనంబు సఫలంబు. భవదీయభక్తులైన భీమ వృషకేతు మేఘవర్ణులు మెట్టిరి గావున మా పురంబు సిరులకుం గాపురంబు. ధర్మజుని జన్నంబున కొదవెం గావున నీ తురంగంబును జనహృదయంగమమంబు. ఇన్నిటికి శేఖరంబుగ నీకు జోడు కోడె యైన యర్జునిం జూడ గలిగె.”
ఇట్టి మనోహరవాక్యవిన్యాసము ఈ గ్రంథమునఁదు చాలచోట్లఁ గలదు. పురాణ, ఇతిహాస లక్షణములు కలిగిన జైమిని భారతమున నాడంబరమైన శైలికాక సరళముగా నుండు శైలినే యభిమానించినాడు కర్త. తేలికపదములతో నుండి చూర్ణ మనదగిన దీతని వచనరచనము. అయినను, కొన్నిచోట్ల<noinclude><references/></noinclude>
ny6q7agwqkwbq84rhkbocix7399ez6e
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/15
104
186278
553377
504495
2026-04-16T20:18:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553377
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మాత్రము రసౌచిత్యము కొరకు కాబోలు, ప్రౌఢసమాసాన్వితమైన వచనమును గూడ వ్రాసి యున్నాడు. కాని దీని పరిమాణము స్వల్పమే. ఉత్కలికాప్రాయ మనదగిన యిట్టి వచనరచనము తిక్కనాదుల కావ్యములం దచ్చటచ్చట కాన్పించునట్టిదే. ఒకటిమాత్ర ముదాహరింతును.
“అనిలసుతునకు మ్రొక్కి, శస్త్రాస్త్రభీకరంబైన వైరిసైన్యనికరంబు సొచ్చి యరుణారవిందజైత్రంబులైన నేత్రంబుల జుఱజుఱం జూచుచు, లయకాలశంకాకరంబైన శింజినీటంకారంబు దిశావిటంకంబులకు సంక్రమింపఁ గోపాటోపంబునఁ దత్సైనంబుం జొచ్చి మేఘవర్ణునకుం గౌతూహలంబు సంపాదింపుచు"
ఈ శాబ్దికాటోపము మహాభారతాది గ్రంథములలోని వంటిదేకాని ప్రబంధమార్గము ననుగమనించినదికాదు.
సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు సంస్కృతమునున్న అశ్వమేధపర్వమునే అనుసరించి యీ తెలుగు వచనకావ్యమును రచించినను, తనకు పూర్వము చంపూకావ్యముగా నాంధ్రమున వెలువడిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని జైమిని భారతమును చూచినట్లుగను, దానిని అనుసరించినట్లుగను నిదర్శనములు కాన్పించుచున్నవి. ఈ ఉదాహరణము లీయభిప్రాయమును స్పష్టీకరించును.
{{Telugu poem|type=|lines=<poem>"పంకనిర్మగ్నమగు గోవుఁ బరికరించి
సుకరముగ నుద్ధరించు గోపకుని మాడ్కి
ముదముదైవార నుద్ధరింపుదువుగాక
పంకనిర్మగ్నమగు నన్ను గోపాలతిలక"</poem>|ref=}}
{{right|— వీరభద్రుడు}}
“పంక నిర్మగ్నమైన గోపాలకుచందనంబున శోకమగ్నులమైన మమ్ము నీ వుద్ధరింపుము" - వేం. కృ. నాయకుడు.
{{Telugu poem|type=|lines=<poem>"పుడిసెడునీటిచే నడఁగి పోయెడు ధూళికిఁ గాలమేఘముల్
దొడరునె, ఱెప్పవేయఁ జెడు దోమల మీద సుపర్ణు డెత్తిపోఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ct0qhyz27on4f8giisl98cjs13k8djc
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/16
104
186279
553378
504496
2026-04-16T20:52:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553378
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గడఁగునె, యీ సుధన్వరథికప్రభుఁ డెన్నఁగ మీకు నీడుగాఁ
డుఁడుగుడు, సంభ్రమం బితని నోర్చెదఁ దెచ్చెద నధ్వరాశ్వమున్.”</poem>|ref=}}
{{right|— వీరభద్రుడు}}
"పుడిసెడునీళ్ళు చల్లిన నడంగిపోయెడు ధూళికిఁ గాలమేఘంబులు వర్షింపవలెనే? ఱెప్పవేసినం బడిపోవు దోమలమీఁద గరుత్మంతుం డెత్తి రావలయునే? ఈ రాజు మీకు సమాన్యుడు గాఁడు. మీ రీతనిమీఁదఁ జేయి చేసికొనం బనిలేదు. నేనే యాతని గెలిచి యధ్వరాశ్వంబుఁ దెచ్చెద.......— వేం. కృ. నాయకుడు.
"కలనన్ మనవారెల్లను బొలసిరి, నీ దుర్నయమునఁ బోయిన యని పెద్దలె నాకును 'స్త్రీబుద్ధిః ప్రలయాంతక' మనెడుప ల్కబద్ధంబగునే" — వీరభద్రుడు.
“నీ దుర్ణయప్రబోధనలచే యుద్ధంబునకుం బోయిన నాకుఁ గలవారెల్లను సమసి పోయిరి. 'స్త్రీబుద్దిః ప్రలయాంతక' మనెడు పలుకే యధార్థం బయ్యె” — వే. కృ. నా. ఇట్టి వింకను చాలచోటులందు కలవు.
జైమిని భారతము నందలి రచనలోని ప్రయోగవిశేషములను గురించి దానిని పరిష్కరించి, కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి యధ్వర్యమున ప్రచురించిన శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు కొన్ని విశేషములను చెప్పియున్నారు. వానిని ఇచట నుటంకింతును.
"కథాసందర్భమును బట్టి కథాపాత్రనామములకు సర్వనామవాచకపదము లుపయోగించుటయే సరిపోవుచుండగా, మరల మరల నాయాపాత్రలనామములనే తఱచుగా నుపయోగించుటయు, యమకవృత్త్యనుప్రాసాది శబ్దాలంకారములకై కథాప్రసక్తి కభ్యంతరముగా విశేషణబాహుళ్యము గల్పించుటయు, గ్రంథ మామూలాగ్రముగా నెఱసున్నలే కాని యరసున్న లుపయోగింపకుండుటయు, నేను అనదగినచోట్లఁ దా ననుటయు, చెప్పెను అనుచోట్లఁ 'బలుకరించె' ననుటయు నీకావ్యంబున సర్వత్ర కనుపట్టును. కాని యిందు నేను అనుటకు బదులుగా దానని యుపయోగించిన స్థలములు నేనని సవరింపబడినవి"
{{left|}}<noinclude><references/></noinclude>
47zh50pxf4sb32cr73sw960kjog5u34
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/17
104
186280
553379
504497
2026-04-16T21:01:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553379
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈ సవరణ లదివరకే జరిగియుండుటచేత ఈ ప్రయోగవిశేషములు ఇప్పుడు కాన్పించుట లేదు. పలుకరించు అను ప్రయోగము మాత్రము కొన్నితావులందు కాన్పించుచున్నది.
"ఇవ్విధంబున భీమసేనపౌత్రుండు మాయాబలంబున యాతురంగంబు నపహరించుకొని పోయిన తెఱంగు హతశేషులయిన భటులు పలుకరించుటయు,....."
"సువేగుఁడు యౌవనాశ్వ భీమసేనులకు నాయమ్మ పల్కులు పల్కరించి కొంత తడవు నవ్వించి....."
పలుకరించు అను క్రియాపదమునకు మాటాడించు అనునది సామాన్యార్థము. చెప్పుట అను నర్థమున నిట యుపయోగింపబడినది. ఈ క్రియకు నిట్టి యర్థము మాండలికమై యుండవచ్చును. అందుచే దీనిని దోషముగా గ్రహించక, ప్రయోగవిశేషముగానే గ్రహించుట లెస్స.
ఇన్ని గుణవిశేషములు కలిగిన జైమిని భారతమును ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ముద్రణకై గ్రహించుట ముదావహము. వారిని నేను అభినందించుచున్నాను.
సామాన్యముగా పాఠకులకు అందుబాటులో లేని యీ వచనకావ్యమును తిరిగి వెలువరించుటకు నన్ను ప్రోత్సహించిన, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారికి, అందును, డా. ఇరివెంటి కృష్ణమూర్తి గారికి నా కృతజ్ఞతలు.
{{rh|విజ్ఞానపురి<br>
హైదరాబాదు,<br>
18-10-79.||'''<big>ఎం. కులశేఖరరావు</big>'''}}
{{Center|—————}}<noinclude><references/></noinclude>
0yzc4sr7d9xqqklvk916c6nodyol8ky
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/18
104
186281
553385
504498
2026-04-17T01:25:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553385
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}}
{{p|ac|fs150}}జైమిని భారతము</p>
{{p|ac|fs125}}ప్రథమాశ్వాసము</p>
{{p|ac|fwb}}కథాప్రారంభము</p>
అభ్యుదయపరంపరాభివృద్ధిగా నారచియింపంబూనిన జైమిని భారతంబునం దశ్వమేధపర్వ వచనకావ్యమునకుఁ గథావిధానం బెట్టిదనిన : శ్రీమంతుండును, సామ్రాజ్యలక్ష్మీమఘవంతుండు నైన జనమేజయమహీకాంతుండు, వేదవ్యాస మహామునీంద్ర శిష్యుండును, మేధాసాంద్రుండునైన జైమిని మహామునీంద్రునిం గనుంగొని, 'మహాత్మా, సకలపాపహరంబును, బవిత్రంబునైన కురుక్షేత్రంబునందు శత్రుసంహారకుండు, శరధిగంభీరుండును, గురువంశకర్తయు, ధర్మమయుండునైన పాండవాగ్రజుండు కపటవర్తనులగు ధృతరాష్ట్రకుమారులఁ జతురంగబలసమేతంబుగఁ బదునెనిమిదిదినంబులలోన రణాంగణంబునఁ గీటఁడగించి, చతుస్సముద్రముద్రితంబయిన భూమండలంబు నేకచ్చత్రంబుగ నేలుచు, నశ్వమేధయాగం బొనరించెనని యెఱింగించితివి. ఆకథ సవిస్తరంబుగా నెఱింగింప వలయు ననిన, జైమిని మునీంద్రుండు జనమేజయ నరేంద్రు నవలోకించి, 'రాజేంద్రా! భవదీయపితామహుండైన ధర్మనందనుండు విశ్వవిఖ్యాతంబుగా నశ్వమేధంబు గావించిన క్రమంబు వివరించెద వినుము. సకలశాస్త్రపారీణుండు, సంగరధురీణుండు, సర్వజ్ఞుండునైన
భీష్ముండు, స్వర్గలోకంబున కరిగిన యనంతరంబ యుధిష్ఠిరుండు శోకవ్యాకులితమానసుండై చింత నొందుచున్న సమయంబున —
{{p|ac|fwb}}ధర్మరాజునొద్దకు వేదవ్యాసుఁడు వచ్చుట</p>
వేదశాస్త్రపురాణేతిహాసవిద్యావిశారదుండును, దనుజప్రభావిజితనీరదుండును, ద్రైలోక్యపూజితుండు నైన వేదవ్యాసమునీంద్రుండు విజయంబు సేయు<noinclude><references/></noinclude>
os8pj74zjl6n7vf8qxdsnrp5jn958xn
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/19
104
186282
553393
504499
2026-04-17T02:04:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553393
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>టయు, ధర్మనందనుఁ డెదుర్కొని సాష్టాంగంబుగా సమస్కరించి, యర్ఘ్యపాద్యాది పూజావిధానంబు లొనరించి, కనకపీఠంబున నునిచి యిట్లనియె: 'మహాత్మా, మేము రాజ్యంబు కొఱకుఁ గ్రూరత్వంబున కొడిగట్టి పితామహుండైన
భీష్ముని, ధనురాచార్యుండగు ద్రోణుని, నగ్రజుండైన కర్ణుని వధించితిమి. ఈపాపం బేమిటం దీఱు? అక్కటా, భూవలయంబునం గల భూసురులు మా యన్నయైన కర్ణునిచే వలసిన వస్తువ్రాతంబులు గైకొని హర్షబాష్పంబులు గురియ బహువిధంబులుగా స్తోత్రంబులు సేయుచున్నవార లంద ఱిప్పుడు శోకజనితంబైన కన్నీరు గురియ రోదనంబులు సేసెదరు.
భీష్మద్రోణకర్ణాదులైన గురుజనులు చూడని రాజ్యభోగంబు కన్నులు లేని కాయంబుకరణి సౌఖ్యావహంబు గానేరదు. పిన్ననాటినుండి మమ్ముఁ బెంచి పెద్దలఁ జేసిన భీష్మాదులం జంపి చేకొన్నరాజ్యంబు నే నొల్ల. భీమునిం బట్టంబు గట్టి, కానలకుం జని తపం బొనరించి పాపంబునం బెడఁబాసెద. మునీంద్రా, ఏతపంబుల నేజపంబుల నేతీర్థయాత్రల నేయాగంబుల జ్ఞాతివధం బొనర్చిన పాతకంబు దీఱు? శుభంబు చేకూరు?' అనిన విని —
{{p|ac|fwb}}వ్యాసుఁడు ధర్మరాజు నశ్వమేధం బొనర్పుమనుట</p>
సాత్యవతేయుండు కౌంతేయుఁ గనుంగొని, 'ధర్మనందనా, నీవు బంధువధం బొనర్చిన పాపంబు దీఱ నశ్వమేధయాగంబుఁ జేయుము. సుగుణసాంద్రుండైన రామచంద్రుఁడు పులస్యవంశంబునం బుట్టిన రావణునిం ద్రుంచినపాతకంబు దీఱ హయమేధంబు గావించె. సంగరంబుల వలనఁ గలుగు జయంబు క్షత్రియునకు విడువం దగదు. నీ తమ్ము లొక్కక్కరుండుం బెక్కు సమరంబులం గెల్పులు గన్నవారలు. యాదవులందఱు నీకుం గైవసంబుగావునం దక్కిన తలంపులు మాని, నియమముద్రం బూని, యశ్వమేధంబున కారంభంబు సేయుము.' అనిన విని, ధర్మనందనుండు డెందంబున దైన్యంబు దోఁపఁ గృష్ణద్వైపాయనుఁ గనుంగొని, 'మునీంద్రా, నిన్నటి సమరంబున రాజవీరు లెల్లను సమయుటం జేసి వారల కుమారులు తల్లిదండ్రులం బెడఁబాసిన వారలు. కావున దయసేయం దగిన వారలు, తక్కిన ప్రజలందఱు సుయోధనున కప్పనంబు లొసంగి నొచ్చి యున్నవారలు, నేను నూతనంబుగఁ బట్టంబు గట్టుకొన్నాఁడ.<noinclude><references/></noinclude>
lbr9jsynqwr9tx6oy47unwai2dp0agu
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/20
104
186283
553394
504500
2026-04-17T02:36:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553394
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కావున నిమ్మహాయాగం బొనరింప రొక్కం బెక్కడ నున్నయది? రాజవంశంబుల సమూలంబుగాఁ బెల్లగించి కులంబు నీఱు సేసిన యట్టి దోసంబునంగాక ప్రజలనెల్ల బాధించి ధనంబులు దండుగలు గొనందలఁచితి మేని గోరుచుట్టుపై రోకటిపోటుచందంబున జనులు నొవ్వడరి నన్నుఁ జూచి నవ్వుదురు. కావున బహుద్రవ్యసాధ్యంబైన యశ్వమేధంబుఁ గావింప శక్తి లేద'నిన విని, పారాశర్యుండు భరతకులధురీణుఁ జూచి, 'తొల్లి మరుత్తుండను మహీపాలుండు బహుసువర్ణకం బనుయాగంబు గావించి యపారంబుగా దక్షిణ లొసంగిన, బ్రాహ్మణులు తమ యోపినకొలంది యెత్తుకొని తక్కినద్రవ్యంబులు హిమశైలంబుచేరువం బాఱవైచి పోయిరి. కావున నా ధనంబు నీకు దొరికెనేని, యధ్వరంబుఁ చేయవచ్చు'ననిన విని, ధర్మనందనుండు, 'మునివరేణ్యా, తొల్లి మరుత్తుండు బహుసువర్ణయాగంబుం జేసి భూసురుల కొసంగిన ద్రవ్యంబు వారల సొమ్ము. కావునఁ దద్ద్రవ్యంబు దానంబు సేసి తరింపఁగోరుట గొప్పఱాయి. దెప్పగా వైచికొని సముద్రంబు నీఁదఁదలంచిన చందంబగు. కులంబు ద్రుంచుటయు, గురువులయెడఁ గల్లలాడుటయుంగాక బ్రాహ్మణద్రవ్యం బపహరించితిమేని పాతకంబునకుం గొఱంత యేమి?' అనిన విని మునికులతిలకుండు కురుకులతిలకుం గాంచి, మున్ను పరశురాముండు కశ్యపునకు దానంబు సేసిన భూమండలంబు రాజులెల్లం బరిత్యజించిరే విప్రులకు మోవం దరంబుగాక పరిత్యజించిన ధనంబు రాజులకుంగాని తక్కినవారలకుఁ బనిలేదు. అదియునుంగాక మరుత్తుండు యజ్ఞసమయంబున నుచితంబైన ధనంబు దక్షిణ లిచ్చి మిగిలినద్రవ్యంబు కొల్లవిడిచిన బ్రాహ్మణులెల్లఁ దనిసి విడిచిన యర్థంబుఁ గైకొనుటకై వెఱవం బనిలేదు. ఇందునిమిత్తంబుగా నీ మనంబున నావంతయు వంత వలదు. అమ్మహాధ్వరంబు గావించువిధానంబు సావధానంబుగా నాకర్ణించుము.
{{p|ac|fwb}}వ్యాసుఁ డశ్వమేధవిధానంబుఁ జెప్పుట</p>
వేదశాస్త్రపురాణాది విశారదులును, సత్కులప్రసూతులును, గోవిందపాదారవిందకందళితాంతరంగులును, దేజోవిరాజితులును నైన బ్రాహ్మణు లఱువదివేలు (ఇరువదివేలు) ఋత్విజులు గావలయు. అందు నొక్కొక్కరికి హాటకసమేతంబుగా నొక్కఘోటకంబును, నొక్కమదపుటేనుంగును, నొక్కయరదంబును, బయఁడేసి రత్నంబులును, వెయ్యేసి యావులును, నావునకు నూఱేసి గొఱ్ఱెలుంగా దక్షిణ యొసంగి, నియమంబునం దురంగంబును<noinclude><references/></noinclude>
qfjhkgq38nwm9z2p3xkscqdlwlyv5th
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/21
104
186284
553395
504501
2026-04-17T02:46:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553395
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బూజించి విడువవలయు. ఇది మొదటిదినంబున నీయందగిన దక్షిణప్రకారంబు దెలిపితి, ఇంక నశ్వలక్షణంబు ఏనుము. చంద్రచందనకుందకుసుమసవర్ణంబైన వర్ణంబును, నింద్రనీలంబు సరియగు చెవియును, గనకగుచ్ఛంబునుబోలు పుచ్చంబును గలిగి, నిరాఘాటధాటీపాటవంబైన యశ్వరత్నం బశ్వమేధయోగ్యంబగు. చిత్రాపౌర్ణమీదినంబునఁ జతురంగంబుల జతనంబు సేసి, తమ్ముని నేనియుం, గొడుకుల నేనియుఁ దద్రక్షణంబునకు నియోగించి, కనకపట్టిక యందుఁ దన బిరుదాంకంబులతో, "వీరుండు శూరుండు ధారణిం గలిగిరేని యీ హయంబుఁ బట్టుం" డని వ్రాసి, యా సువర్ణపట్టంబుం దేజినుదుటం గట్టి, యథేచ్ఛగా విడిచి, యా హయంబు మూత్రపురీషంబులు విసర్జించుతావుల గోసహస్రంబు దక్షిణగా హోమంబు సేయబనిచి, సంవత్సరంబు సంకల్పంబు సేసికొని, యయ్యశ్వంబు మగుడ వచ్చు పర్యంతంబు నియమంబుతోడం గూడం దీక్షించి, భార్యయుఁ దానును బ్రహ్మచర్యంబు, నధశ్శయనంబునుం జేయుచు, నసిధారావ్రతంబుగా నుండవలయు. మున్ను దేవేంద్రుండు నూఱశ్వమేధంబులు సేసెంగాని నియమంబు సలుప నేరండయ్యె. పాండునందనా, నీవు నన్ని నియమంబులతోడ నొక్కయాగంబు గావించితివేని సకలపాపహరంబగు. వలరాజు వలలకుం దగులని భీష్ముండొక్కరుండు దక్కం దక్కినవారలకుఁ గూడదు. కావున నిమ్మహాధ్వరంబు రాజులెవ్వరుం జేయ నోపరు. నీకు శక్యంబేని చేయుము.'
అనిన విని ధర్మనందనుండు కృష్ణద్వైపాయనుం గనుంగొని, 'మహాత్మా, నా తమ్ములు భీమార్జుననకులసహదేవులు యుద్ధంబున మిగుల డస్సియున్నవారలు. మహాబలుండును, గర్జసూనుండు నగు వృషకేతుండు బాలుండు. ఘటోత్కచుండు మా కార్యంబున హతుండయ్యె. అతని తనయుండగు మేఘవర్ణుం డత్యంతబాలుండు, గావున వారల నిరువురఁ గయ్యంబునకుఁ బంపుట యయుక్తంబు, ఎవ్వానిప్రాపునఁ గవ్వడి వైరిరాజులం బరాజయంబు నొందించె, నా గోపాలదేవుండు దూరంబున నున్నవాఁడు. కావున నియ్యాగం బేవిధంబునఁ జేయగలవారము?' అనిన విని భీమసేనుం డగ్రజు నవలోకించి, 'శ్రీకృష్ణదేవుండు సర్వత్ర పరిపూర్ణుండు. ఇచ్చట లేఁడననేటికి? అద్దేవుం దలంచినమాత్రంబునఁ బాపంబులు రూపడంగు. సుకృతంబులు లభించు. అదియునుంగాక, యొక్కరహస్యంబు వినుము. శ్రీవాసుదేవుని యానతి ప్రకారంబున<noinclude><references/></noinclude>
0pbog36wa0gscr0jcrsnvrb6sa9bx9d
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/22
104
186285
553396
504502
2026-04-17T03:07:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553396
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మనము కయ్యం బొనర్చి జాతివధం బొనర్చితి మింతియకాని, స్వతంత్రంబుగఁ జేసినవారము కాము. కావున మనకు లేశమాత్రంబును దోషంబు లేదు. అశ్వమేధంబు సేసిన నేమి? సేయకున్న నేమి? శ్రీకృష్ణదేవుని పాదాంబుజంబులు నమ్మియున్న మోక్షంబునకుం గొఱఁత లేదు. ఎట్లయినను రాజలోకంబులోఁ గీర్తి కలుగుటకునై యీ యాగంబు సేయ నుద్యోగింపుము. హయమేధయోగ్యంబైన గుఱ్ఱం బీలోకంబున నున్నంజాలు ఎంతవా రెదిరించినను జయించి తెచ్చెద.'
{{p|ac|fwb}}వ్యాసుఁ డశ్వమేధహయం బున్నతావుం జెప్పుట</p>
అనిన వ్యాసమునీంద్రుండు ధర్మరాజుతో నిట్లనియె: 'మహీపాలకా, భీముని వాక్యంబు నిజంబు. భద్రావతీపురంబున యౌవనాశ్వుఁడను రాజు రాజ్యంబు సేయుచున్నవాఁడు. అతని లాయంబున నేఁజెప్పిన లక్షణంబులు గల గుఱ్ఱం బొక్కటి యున్నయది. పది యక్షౌహిణుల సైన్యంబు ఱేయునుం బవలు రెప్పవేయక దానినిఁ గాపాడుచు నుండుఁ గావునఁ, బోతుటీఁగ కేనియుఁ బొలయఁగూడదు. అత్తురంగంబు నీకుందక్కెనే జన్మంబు నెఱవేఱు.'
{{p|ac|fwb}}భీముఁ డశ్వంబు దెత్తునని ప్రతిన పట్టుట</p>
అనిన విని భీమసేను డిట్లనియె: 'అన్నా, దేవాసురు లడ్డమై రేనియు జయించి యౌవనాశ్వు నింటనున్న యశ్వమేధాశ్వంబు దెచ్చెద. మీపాదంబు లాన. అట్లు సేయనైతినేని వేదఘోషంబు లేని గ్రామంబునందును, శివాలయంబు, విష్ణుదేవుని దేవళంబును లేని స్థలంబునందును, వాసంబు చేయువాఁడును, దల్లిదండ్రులకు రెండు<ref>రెండు = భేదము</ref> దలంచిన దుర్జనుండును, జనంబు వాడని బావిలో జలంబు గ్రోలినవాఁడును, బ్రాహ్మణులతోడ నసత్యంబు పలికినవాఁడును, నప్పు దీసికొని యటమటించిన యధముండును, విశ్వాసపాతకియుం బోవుగతులకుఁ బోవం గలవాఁడ', అని పలికి యూరకున్న తమ్మునింజూచి; 'యయ్యా, యౌవనాశ్వుండు పరాక్రమధురీణుండు. అతని సైన్యంబు బహుసమరంబుల నాఱితేఱిన శూరులు గలది. వారలం గెలిచి యశ్వంబు దెచ్చుట<noinclude><references/></noinclude>
7zsdm1uhm0x0vw580fvu3jnw9xo43jt
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/23
104
186286
553404
504503
2026-04-17T03:21:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553404
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యత్యంతదుష్కరంబు. నీ వట్లు ప్రతినఁ జేయ జెల్లునే' అనిన విని, వృషకేతనుం డజాతశత్రువుతో 'మహీ రాజేంద్రా, భీమసేనుతోడం గూడ నన్నుంబంపు' మనిన, వాయునందనుండు కర్జనందనుం జూచి, 'కుమారకా, మీ తండ్రియైన కర్ణుని మా యన్న యని తెలియక సంగరంబునఁ గూల్చితిమి. నాఁటనుండియు మా మనస్తాపంబులకు ముట్టు మితియు లేదు. నిన్నుం జూచినయెడ సంకోచం బగుచున్నది'. అనిన వృషకేతుండు భీమునితో, 'నయ్యా, మా తండ్రి బుద్ధిమాలి వనమాలి భక్తులరైన మీయెడ ద్వేషంబు సేసి దివ్యమణిం బాఱవైచి గవ్వఁ జేకొన్నచందంబున దుర్యోధనుని నవలంబించి, ద్రౌపదీస్వయంవరంబున దొమ్మియుద్ధంబు సేసె. విరాటునగరంబునఁ బసులం బట్టించె. మాయాజూదంబున మాతల్లియగు ద్రౌపదీదేవిం జీర లొలిపించె. దుర్యోధనుని వారింప శక్తి గలిగియు ధర్మాత్ములైన మీయందు మహాద్రోహంబు సేసె. అప్పాపంబులు వాయ శ్రీకృష్ణదేవుని సన్నిధానంబున ధనంజయుని మహోగ్రబాణంబులచే సంగరాంగణంబున సంహారంబు నొంది తండ్రియగు నాసూర్యదేవుం గలిసె. కావున మా తండ్రి యగు కర్ణున కర్జునుఋణంబుఁ దీర్చుకొనం గూడదు. అది యట్లుండె; నరేంద్రా! నేను భీమసేనుని తోడు గూడంజని దుర్గమంబైన యౌవనాశ్వుపురంబు ప్రవేశించి నాభుజబలంబులచే శత్రుసైన్యంబుల గెలిచి యశ్వమేధాశ్వంబుఁ దెచ్చి మీకు సమర్పణంబు గావించి, మా తండ్రి పాపంబులం బోజేసి, సద్గతికిం బనిచెద, నుత్తరువు దయసేయవలయు.'
ఆనిన ధర్మనందనుఁడు కర్ణపుత్రునిఁ గౌఁగిలించుకొని, 'అన్నా, మీ పినతండ్రితోడఁ గూడఁ జని, శత్రుసంహారంబు గావించి, జయంబుఁ జేకొని, హయంబు దెమ్మని పంచిన, నమ్మాటలు విని ఘటోత్కచకుమారుడైన మేఘవర్ణుండు కయ్యంపువేడుక మొగంబునఁ జెంగలింప, ధర్మనందనుఁ గనుఁగొనిన, యభిప్రాయం బెఱింగి భీమసేనుండు, 'వత్సా, మీ తండ్రియగు ఘటోత్కచుండు మేము వనవాసంబు సేయునప్పుడు గంధమాదనపర్వతంబున మమ్ము రక్షించె. మా నిమిత్తంబుగా రణంబునఁ బ్రాణంబు విడిచె. అతండు సేసిన యుపకారంబులఁ దలఁచికొనిన మనంబు గరఁగుచు నున్నయది. కావున నిన్ను జగడంబునకుం దోడ్కొని పోవనోప. మేము వచ్చుపర్యంతంబు ధర్మనందనుం గొలిచి యుండుము'. అనిన విని, మేఘవర్ణుఁడు తాతయగు భీమునిం జూచి 'తొల్లి శ్రీరామభద్రుని పాదారవిందరేణువులచేఁ బాషాణంబు పావనంబైన తెఱంగున, గంగానదితోఁ<noinclude><references/></noinclude>
4wikbptuiuo5rxuhr3nz6lwo988c3y9
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/24
104
186287
553409
504504
2026-04-17T03:38:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553409
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గూడి యడవివాక యోగ్యంబైన కైవడి, మా తండ్రి మీకు జనియించుటవలన ధన్యుండయ్యెఁ గావున, నేను మిమ్ముఁ గొలిచి భద్రావతీపురంబునకు వచ్చెద. అగస్త్యుండు సముద్రంబుఁ గ్రోలిన చందంబున, వైరిసేనాసముదయంబుల నీవు బింకంబు లణంప, నీవృషకేతనుండు పగతురసైన్యంబుల నడ్డగించి యావహంబు సేయు సమయంబున మేకపిల్లను బోలె నాయశ్వరత్నంబు నెత్తికొని యతివేగంబునం జనుదెంచెదనని పలికినఁ, బరమానందంబు డెందంబునఁ గ్రందుకొన సమీరనందనుండు ఘటోత్కచతనయుం గౌఁగిలించుకొని, 'పౌత్రకా, నీ భాషణంబులు మాకుఁ గర్ణభూషణంబులయ్యె. నీవు, నేను, వృషకేతనుండును గూడితిమేని, మన మువ్వురితోఁ ప్రమథగణసమేతుండైన త్రినేత్రుండు నెదిరింపఁజాలడు' అని పలికి, యుద్ధసన్నద్ధులైయున్న సహోదరపుత్రపౌత్రులం గనుంగొని, ధర్మపుత్రుం డానందబాష్పాకులితనేత్రుండును, పులకాంకితగాత్రుండునునై, త్రేతాగ్నులచందంబునఁ దేజరిల్లు నమ్మువ్వురం జూచి, లోకత్రయంబున వీరల కసాధ్యంబు లేదని యుత్సహించె. అంత పడమటిది క్కనియెడుపడంతికొప్పునం జెక్కిన చెంగలువచందంబున రతిబింబంబు కట్టెఱ్ఱనగు కాంతితోడఁ గూడ నస్తగిరిప్రాంతంబునకుఁ జనియె. అప్పుడు వివిధవిద్యావిలాసుండును, జ్ఞానకలావాసుండును, బ్రహ్మజ్ఞానమహోల్లాసుండును నైన వేదవ్యాసుండు ధర్మనందను నాశీర్వదించి, యతం డొనర్చుపూజ లంగీకరించి, తన యాశ్రమంబునకు విజయంబు సేసిన, ధర్మతనయుండు సంధ్యావందనాదికృత్యంబు లాచరించి, తమ్ములు సమీపమ్మునం గొలువ రత్నసింహాసమ్మునం గూర్చుండె. తదనంతరంబు, కౌంతేయాగ్రజుండు క్రమ్మఱ జింతాక్రాంతుండై 'భద్రావతీపురంబున కెవ్విధంబునం జనువారము! గుఱ్ఱంబు నెట్లు దెచ్చువారము? దక్షిణలకు ధనం బెక్కడ నున్నయది? యాగంబునకు నిర్వాహకుం డెవ్వఁడు? కృష్ణద్వైపాయనుం డాడినమాటల కేల యియ్యకొంటి? త్రిలోకాధిపతియైన శ్రీకృష్ణుండు నిర్వ్యాజకరుణాకటాక్షంబునఁ దనకుఁ దానవచ్చి యీ యాగంబు నెఱవేర్చినం గాని, యెవరికి శక్యంబు? శ్రీకృష్ణా! వృష్ణికులభూషణా, కమలాక్షా, త్రిలోకాధ్యక్షా, భక్తసంకటవిమోచనా, శోకార్ణవంబున మునింగియున్నవాఁడ నీ కృప
యను నోడచే నన్నుద్ధరింపఁ జేయుము. మున్ను కౌరవసభలో మానభంగంబు గాకుండఁ బాంచాలిని రక్షించిన క్రమంబున నన్ను రక్షింపుము' అని బహువిధంబులఁ బ్రస్తుతింపుచు, ఫాలతలంబున మోడ్పుంగేలు గిలించి 'శ్రీకృష్ణదేవా, నీవే దిక్కని' వేడుకొను నవసరంబున —<noinclude><references/></noinclude>
b1xr09drithsjzvugtlqj5gfxy0f191
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/25
104
186288
553410
504505
2026-04-17T03:58:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553410
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}శ్రీకృష్ణుండు హస్తినాపురంబునకు వచ్చుట</p>
సర్వభూతాంతర్యామియు, విశ్వరూపియు నగు గోపికావల్లభుండు నయ్యర్ధరాత్రంబున హస్తినాపురంబునకు వచ్చి, ధర్మనందను నగరు సొచ్చి, ప్రతిహారిం గనుంగాని, 'మా రాక ధర్మనందనున కెఱింగింపుము. ఎంతవానికేనియు మహీకాంతుని సమయంబు దెలియక చనువు గలదని యంతిపురంబునకుం పోవుట యుచితంబు గాదని' నఁ బ్రతీహారి గోవిందునకు వందనంబు గావించి, 'దేవర యేసమయంబున విజయంబు సేయుదు రదియ సమయంబ'ని మొదల నాతోడ మా రాజుగా రుత్తరు విచ్చియున్నవారు. కావున నవసరంబుఁ జూడంబనిలేదు. పరస్త్రీ పరధనంబులు గోరు దురాత్మకులును, బరుల దూషించు దుర్మతులును నీ కరుణ పడయలేరు. ధర్మనందనున కీ దుర్గుణంబు లెవ్వియు లేవు. తానుందమ్ములు నహోరాత్రంబు దేవరపాదారవిందంబులు ధ్యానంబు సేయుచు నున్నవా'రని పలికి, యతిశీఘ్రంబుగఁ బఱతెంచి, 'రాజేంద్రా, శ్రీకృష్ణదేవుండు నగరి వాకిటికి విజయంబు సేసె' ననుటయుఁ, బాండవాగ్రజుం డాశ్చర్యభరితమానసుండై మొగులు చెంగలింపఁ దమ్ములుం దానును నెదుర్కొనుటయు, వసుదేవనందనుండు ధర్మజుపదంబులకు వందనం బాచరించిన, నతండు గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చుకొని, యానందబాష్పంబులు కపోలతలంబులం గురియు, రోమాంచంబు ముంచికొన, నద్దేపు దివ్యరూపంబు సందర్శింపుచు, నానంద సముద్రంబునఁ దేలియాడుచుండె. అంత భీముండును, నర్జునుండును, శ్రీకృష్ణదేవుని చరణారవిందంబులకుఁ బ్రణామంబులు సేసిరి. నకుల సహదేవులు నట్ల కావించిరి. అంత సత్యభామాకాంతు నంతఃపురంబునకుఁ దోడుకొని పోయి యర్ఘ్యపాద్యాదివిధానంబులం బూజించి హర్షించి కనకాసనంబున నునిచి, తాము నుచితాసనంబులం గూర్చున్న డఁ, బాంచాలరాజనందన ముకుందునకు వందనం బాచరించి, మందస్మితంబు వదనారవిందంబున జెలువొంద, ధర్మజు మొగంబు గనుంగొని 'యర్ధరాత్రంబున నచ్యుతుం డిచ్చటికి వచ్చెనని' యచ్చెరువందనేల? తనభక్తు లెచ్చట నెచ్చట నుపద్రవంబు నొందుదు రచ్చటికి వచ్చి రక్షించుట యద్దేవునకు సహజగుణంబు. ఆ కౌరవసభలోన దుశ్శాసనుండు మీర లేవురుఁ జూచుచుండ వలువలొలుచునప్పుడు, హా, గోవిందా, పుండరీకాక్షా, శ్రీకృష్ణా, యని డెందంబునం దలంచిన యంత నక్షయవస్త్రంబు లిచ్చి మానసంరక్షణంబు<noinclude><references/></noinclude>
3m8yhvros3lt8mn333lkmhapmevw69y
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/26
104
186289
553415
504506
2026-04-17T04:53:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553415
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సేసె. మన మర్జునుని ద్వారకానగరంబునకుం బంపి పిలిపింప వలయునని తలంచుచు నుండఁ దనకుందానె వేంచేసె. ఇద్దేవుని భక్తవాత్సల్యం బెంతని కొనియాడం గలదాన?' ననినఁ బాంచాలి నవలోకించి, కించిదంకురితహాసభాసముఖారవిందుండై గోవిందుండు చాల నాదరించె. అంతఁ గౌంతేయాగ్రజుండు రుక్మిణీకాంతుం జూచి మేఘగంభీరస్వసంబున నిట్లనియె:
'కమలనాభా, నాదు మనస్తాపంబు నుపశమనంబు నొందింపఁగోరి దేవరఁ దలంచితి. నా తలంపునకంటె మున్నుగా నీవు ప్రసన్నుండ వైతివి. నా మనోరథంబులు ఫలియించె. వ్యాసమునీంద్రు ననుమతి నశ్వమేధంబుం జేయఁ దలంచితి. సకలకర్మంబులకుఁ గర్తవు భోక్తవు నీవ. కావున నీ యధ్వరంబు నిర్వహించుభారంబు నీయది,' అనిన విని, దేవకీనందనుండు కుంతినందనుం గనుంగొని —
{{p|ac|fwb}}శ్రీకృష్ణుండు భీమునితేజంబు వృద్ధినొందింప యత్నించుట</p>
'శౌర్యవంతులకుఁ జేయంగూడని కార్యంబు లేదు. నీ తలంపు సమకూరు' నని పలికి, పవననందను జూచి, నెమ్మొగంబునం జిఱునగవు తళుకొత్త 'వృకోదరా, నీకు బుద్ధి మందంబు, ఆహారం బపారంబు, పొట్ట రెట్టించుచున్నది. రక్కసి రతులకుం జొక్కినవాఁడవు, మాటల పోఁబడి యెఱుఁగవు. నీవంటి వాఁడు మంత్రి యై యున్నఁ గార్యంబు లగుటకు
సందియం బేమి? అంగహీనుని, నిల్లటంపుటల్లుని, బ్రల్లదంబు పలుకువానిని, గామినీలోలుని, మరుగుజ్జువానిఁ, జెవుడు గలిగినవానిం, బంద యగువాని, మామగారిని వెఱ్ఱి పట్టించువానిని, స్త్రీవశంవదుని, నిర్దయునిఁ, బ్రచండకోపనుఁ, బ్రమత్తుని మంత్రిఁ జేసిన కార్యభాగంబులు సిద్ధినొంద నేఱవు. నీవు బాహుబలగర్వంబునఁ గార్యపద్ధతు లెఱుగవు. గర్వాంధులుఁ బాపస్వరూపులు నగు బకహిడింబకిమ్మీరజరాసంధాదులం జంపినయట్లు సులభంబుగఁ దలంపకుము. సత్యసంధులును, భుజబలధురంధరులును, జితేంద్రియులు, దానశూరులు నగు రాజశ్రేష్ఠులు పెక్కుండ్రు గలరు. ఒక్కొక్కని జయించుట కక్కసంబు. సూర్యు డస్తంగతుండు గాకమున్న సైంధవుని వధింతునని నాఁడు గాండీవి గావించినప్రతిన నెఱవేఱుట దైవయత్నంబు. మారుతనందనా, నీ వంతకంటె సాహసంబుగాఁ బ్రతిన సేసితివి. ఇది నెఱవేఱుట యెట్లు? యజ్ఞఘోటంబు నిరాఘా<noinclude><references/></noinclude>
by8pddk3m7k32xqubtzob8rupengeo6
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/27
104
186290
553416
504507
2026-04-17T05:27:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553416
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>టంబుగా దిక్కులం జరించునెడ శౌర్యవంతులైన మహీనాథులు, దేవగంధర్వయక్షరక్షోగణనాథులును బహువిఘ్నంబులు గావింతురు. మున్ను దశరథనందనుఁ డశ్వమేధంబు సేయుచు వానరబలంబులను, భల్లూకసేనలను, నశ్వరక్షణార్థముగా నంపిన శుక్తిమతీపురంబున సురథుండను మహారథుండు తురంగంబులతోఁ గూడ వానరవీరుల నెల్లం గట్టివేసినయెడ శ్రీరామభద్రుండు తానే చని యశ్వంబును మరల్చికొనివచ్చెఁ కావున నీవు, సహాయంబుగా నర్జునుం దోడ్కొని పోవుట కర్జంబు.'
అనిన విని కంసమర్దనునకు బకమర్దనుం డిట్లనియె. 'బావా! నేను నీవానతిచ్చిన గుణంబులు గలవాఁడ నగుదు. నీకు నటువంటి గుణంబు లెవ్వియును లేవుగదా! నీ కామాతురత్వంబునకు గొల్ల యిల్లాండ్ర గుబ్బపాలిండ్లు సాక్షి. నీచస్త్రీసంగమంబునకు నీదు మత్స్య కూర్మ వరాహావతారంబులె సాక్షి. బహుబక్షకుండ వగుటకు బ్రహ్మాండకోటి పరిపూరితంబైన నీ కుక్షి సాక్షి. నీ స్త్రీలోలత్వంబునకు సత్యభామానిమిత్తంబుగా భూమికిం దెచ్చిన పారిజాతవృక్షంబు సాక్షి. నీదుమాయాచరితంబులు ప్రకటింప నెవ్వరితరంబు' దేవరకటాక్షంబు తోడుగఁ దొల్లి బక హిడింబ కిమ్మీర జరాసంధులు గెలిచి, నిప్పుడు నటువలెనే యౌవనాశ్వ విశ్వంభరావల్లభుని గెలిచి, యశ్వమేధాశ్వంబుఁ దెచ్చెద. నా హృదయంబులో దేవర దివ్యశ్రీపాదపద్మంబులు కుదురుగ నున్నంజాలు. తద్బలంబున గదాదండంబు కేలంగొని, కులపర్వతంబులం బెకలింతును. క్షోణీమండలంబుఁ జూర్ణంబు సేయుదు. దిగంతదంతావళంబుల దంతంబులు డుల్చివైతును. నాకసాధ్యం బేమి యున్నయది? చాతకంబులు మేఘాగమనంబుకరణి మేము నీరాక నపేక్షించుచున్నారము. మమ్ము నీ కృపాదృష్టిచే రక్షింపుము. మీయెడ భక్తిలేనివారలకు నీవె యగ్నివర్షంబు గురియుదువు. పంకనిర్మగ్నంబైన ధేనువును గోపాలకుచందంబున శోకమగ్నులమైన ముమ్ము నీ వుద్ధరింపుము.'
అని అనిలనందనుండు పలుకు పలుకులకు ముదంబు దొలఁక, గోపకులతిలకుండు తదీయతేజంబు వృద్ధి నొందించుచు, గాఢాలింగనం బొనరించి, 'సమీరకుమారా, నీ వాక్యంబులకు నా యంతరంగంబు సంతసంబు నొందె. నీవు ధన్యుండవు. రాజమూర్థన్యుండవు. మాన్యుండవు. మీ రాజన్యునకు దైన్యంబు వలదు. జన్నంబు నెఱవేఱెడిని. ద్రోణభీష్మకర్ణప్రముఖులైన గురు<noinclude><references/></noinclude>
2b0f6sb4830iazmuhoqyvjc2i83hm9g
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/28
104
186291
553425
504508
2026-04-17T06:33:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553425
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>జనులం, దక్కిన సంబంధి బాంధవులం, దురంబున మునిమిన దుష్కృతంబు మిమ్ములం జెందదు. అశ్వమేధాధ్వరంబు గావించి మాకు సమర్పణంబు సేయుఁడు. మీకు వంత వలవ దయ్యాగంబు నేన సాగించెద.'
అనిన విని, భీముండు గోపాలదేవుం గనుంగొని వెండియు దండప్రణామంబు గావించి, 'దేవా, నీపాణి ద్మంబున వస్తువొకటి కోటి గుణితంబై వృద్ధి బొందుంగాన, హయమేధంబు గావించి తత్ఫలంబు నీకె సమర్పింపఁ గోరియున్నవారము. నేను భద్రావతీపురంబునకుఁ జని, తద్రాజవర్యుని గెలిచి హయంబు దెచ్చుపర్యంతంబు సవ్యసాచి ధర్మరాజు సముఖంబునం గాచికొనియుండు'నని మాటలాడు సమయంబున, ద్రుపదరాజపుత్రి వచ్చి 'యారగింపుసమయం బయ్యె, విజయంబు సేయుఁ' డనుటయు, ధర్మనందనుండును, వసుదేవనందనుండును, గృతమజ్జనులై, ధౌతపరిధానంబులు ధరియించి, యిష్టాన్నపానంబులం బరితుష్టినొంది, యుచితప్రకారంబుల నారాత్రి సుఖనిద్రం జెంది, మఱునాఁడు వందిమాగధబృందంబుల బిరుదగద్యపద్యంబులు, గాయకవైణుకుల యంత్రగాత్రగానంబులు, నాలకించుచు, నిద్ర మేల్కొని స్నానసంధ్యావందనాది నిత్యకృత్యంబులు నిర్వర్తించి, సంతోషభరితాంతరంగులై సభాస్థలంబునకు వచ్చిరి.
{{p|ac|fwb}}భీముఁ డశ్వమునకై భద్రావతి కేగుట</p>
అంత భీమసేనుండును, యుద్ధసన్నద్ధుఁడై ధర్మతనయుపాదంబులకుఁ, బంకజాక్షుని పదపంకజంబులకు వందనంబు లొనరించి, కుంతికిం బ్రణమిల్లి, వివ్వచ్చుం గ్రుచ్చి, కౌఁగిటం జేర్చికొని, తాను వచ్చుపర్యంతంబు ధర్మతనయుం గాచి యుండుమని నియమించి, మాద్రీనందనుల నుపచరించి, ద్రౌపదికిం జెప్పి, మఱిమఱియు మురవైరి చరణాంబురుహములకుఁ బ్రణమిల్లి, ప్రమోదభరితమానసుండై, వృషకేతు మేఘవర్ణులు సంగరోత్సాహపరిపూర్ణులై తోడం
జనుదేర, యౌవనాశ్వుం డేలు భద్రావతీపురంబునకుం గతిపయప్రయాణంబులం జనిచని, బంగరుమెఱంగులం దురంగలించు నుత్తుంగంబులైన శృంగంబులం గీలుకొలిపిన కెంపుల సొంపులు గులుకు ప్రకాశంబుల రాత్రులం బగళ్ళు సేయుచు, నమరావతీపురసమానంబున స్ఫటికమణిమయంబులు, నంబరతలచుంబి<noinclude><references/></noinclude>
2nk3awfzjgkae8o7xpmpjz5qad7tt39
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/29
104
186292
553467
504509
2026-04-17T07:00:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553467
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తంబులునైన కోటలును, బాతాళతలగంభీరంబులు నుల్లోలకల్లోలసముల్లసితంబులుఁ, గమలకువలయగంధబంధురంబులు నైన యగడితలును, గనకమయశిఖరంబులం దాపిన గుత్తంపు ముత్తియంబుల డంబులచేఁ దారాగణంబుల విడంబించు సౌధంబులును, గోపురాగ్రంబులం గీలితంబులైన యింద్రనీలకాంతుల నకాలతిమిరములం గలుఁగఁజేయు గవనివాకిండ్లును, గలిగి, వేదఘోషంబుల మట్టుపడం జేయుచు హోమధూమంబులచే మార్గంబులం గానరానీయక యాగయూపసంఘంబులచే నడువం గూడక సాధుజనసంతోషణంబును, వైరిజనభీషణంబు నైన యాపురంబు సేరంజని, పూచి కాచి ఫలించి కైవ్రాలిన మావులు మోవులుఁ జొన్నలుఁ బొగడలుఁ దాలహింతాలతమాలనారికేళపనసక్రముకప్రముఖతరువులు, నల్లిబిల్లిగా నల్లికొనిన మల్లెలు మొల్లలు సన్నజాజులు మొదలైన తీవలం బొలుపొందుచు, చిలుకలుఁ గోయిలలు కారికలుఁ జకోరికలు నాదిగాఁ గల పక్షికులంబుల కలకలంబులును, జింకలు దుప్పులు నీహామృగంబులుఁ దక్కిన మృగవిశేషంబులచే భూషితంబులునైన పువ్వుబొదలం బొలుపొందు హృద్యంబైన యుద్యానంబునందు నిలిచి, సమీరకుమారుండు వృషకేతుఁ జూచి, 'కుమారకా, యీ వనంబునం జెంగలువలు నల్లగలువలుఁ దెలిగలువలుఁ జెందామరలు వెలిదమ్ములు దొరంగిన పుప్పొడులం దేనియలం బొంది చిత్రవర్ణంబులైన తరంగమాలికలం జెన్ను మెఱిసిన తటాకంబుఁ గనుంగొనుము. ఇచ్చటికి రాజు నగరి వాజిసంఘబులు నీళ్ళు ద్రావం జనుదెంచు, నందశ్వమేధయోగ్యంబైన యశ్వంబు వచ్చు, గావున దానిం గాపాడుకొని వచ్చుఁ సైనికానీకంబుం బాఱఁద్రోలి, హయంబు రయంబునం గొనిపోవుద, మని పలుకుచు నొక్కపొదరింటం బొంచియుండె.
అప్పుడు కర్ణసూనుండు పినతండ్రియగు భీమసేమం జూచి, యీ రాజునకు గల సేనయంతయుం బదియక్షౌహిణులు. వానిలోఁ గొంతకొంత తురంగంబువెంబడిం జనుదెంచుఁ గాని యెల్ల సైన్యంబుఁ బెల్లగిలిరాదు. కావున మన కీయశ్వంబు గ్రహించుట సుంభంబు. గంగాతీరంబునం జేరిన జనులపాతకంబులుం బలె, లలాటలోచనుం డాసిన కాలకూటంబుకరణి, శ్రీవాసుదేవపాదారవిందచింతనంబు వలన మానవుని జన్మంబునుం బలె, నిమిషమాత్రంబులో నీ గదాఘాతంబున యౌవనాశ్వుని సైన్యంబు లయంబు నొందు' నని సల్లాపంబు లాడుచు నుండు సమయంబున, దండి మెఱయ డిండిమవాద్యఘోషంబులును, గాంచనమణిమయంబులైన ఘంటల ఘణఘణారవంబులును, నంకుశాఘాతంబులం<noinclude><references/></noinclude>
b7qycb5o6x3nb8l8j93kteg68oqopzs
553468
553467
2026-04-17T07:02:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553468
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తంబులునైన కోటలును, బాతాళతలగంభీరంబులు నుల్లోలకల్లోలసముల్లసితంబులుఁ, గమలకువలయగంధబంధురంబులు నైన యగడితలును, గనకమయశిఖరంబులం దాపిన గుత్తంపు ముత్తియంబుల డంబులచేఁ దారాగణంబుల విడంబించు సౌధంబులును, గోపురాగ్రంబులం గీలితంబులైన యింద్రనీలకాంతుల నకాలతిమిరములం గలుఁగఁజేయు గవనివాకిండ్లును, గలిగి, వేదఘోషంబుల మట్టుపడం జేయుచు హోమధూమంబులచే మార్గంబులం గానరానీయక యాగయూపసంఘంబులచే నడువం గూడక సాధుజనసంతోషణంబును, వైరిజనభీషణంబు నైన యాపురంబు సేరంజని, పూచి కాచి ఫలించి కైవ్రాలిన మావులు మోవులుఁ జొన్నలుఁ బొగడలుఁ దాలహింతాలతమాలనారికేళపనసక్రముకప్రముఖతరువులు, నల్లిబిల్లిగా నల్లికొనిన మల్లెలు మొల్లలు సన్నజాజులు మొదలైన తీవలం బొలుపొందుచు, చిలుకలుఁ గోయిలలు కారికలుఁ జకోరికలు నాదిగాఁ గల పక్షికులంబుల కలకలంబులును, జింకలు దుప్పులు నీహామృగంబులుఁ దక్కిన మృగవిశేషంబులచే భూషితంబులునైన పువ్వుబొదలం బొలుపొందు హృద్యంబైన యుద్యానంబునందు నిలిచి, సమీరకుమారుండు వృషకేతుఁ జూచి, 'కుమారకా, యీ వనంబునం జెంగలువలు నల్లగలువలుఁ దెలిగలువలుఁ జెందామరలు వెలిదమ్ములు దొరంగిన పుప్పొడులం దేనియలం బొంది చిత్రవర్ణంబులైన తరంగమాలికలం జెన్ను మెఱిసిన తటాకంబుఁ గనుంగొనుము. ఇచ్చటికి రాజు నగరి వాజిసంఘబులు నీళ్ళు ద్రావం జనుదెంచు, నందశ్వమేధయోగ్యంబైన యశ్వంబు వచ్చు, గావున దానిం గాపాడుకొని వచ్చుఁ సైనికానీకంబుం బాఱఁద్రోలి, హయంబు రయంబునం గొనిపోవుద, మని పలుకుచు నొక్కపొదరింటం బొంచియుండె.
అప్పుడు కర్ణసూనుండు పినతండ్రియగు భీమసేమం జూచి, 'యీ రాజునకు గల సేనయంతయుం బదియక్షౌహిణులు. వానిలోఁ గొంతకొంత తురంగంబువెంబడిం జనుదెంచుఁ గాని యెల్ల సైన్యంబుఁ బెల్లగిలిరాదు. కావున మన కీయశ్వంబు గ్రహించుట సుంభంబు. గంగాతీరంబునం జేరిన జనులపాతకంబులుం బలె, లలాటలోచనుం డాసిన కాలకూటంబుకరణి, శ్రీవాసుదేవపాదారవిందచింతనంబు వలన మానవుని జన్మంబునుం బలె, నిమిషమాత్రంబులో నీ గదాఘాతంబున యౌవనాశ్వుని సైన్యంబు లయంబు నొందు' నని సల్లాపంబు లాడుచు నుండు సమయంబున, దండి మెఱయ డిండిమవాద్యఘోషంబులును, గాంచనమణిమయంబులైన ఘంటల ఘణఘణారవంబులును, నంకుశాఘాతంబులం<noinclude><references/></noinclude>
kcfeeh67jge3ifxmw6cd1mkcu64t4lc
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/30
104
186293
553520
504510
2026-04-17T08:04:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553520
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బొడము ఘీంకారంబులును, గండస్థలంబులం దొరఁగు మదజలంబుల పరిమళంబులకై మ్రోయు తుమ్మెదల ఝంకారంబులునుం జెలంగ, నేనుంగులు గుంపులు గుంపులుగా వచ్చి యా సరోవరంబు సొచ్చి మచ్చికలు హెచ్చఁ దుండాగ్రంబుల నుదకంబులం బూరించి పెంటియేనుంగులమీఁదం జల్లుచు, వానిచే జల్లబడిన సలిలంబులచే మేనులు దడియ మెల్లమెల్లనఁ దద్గాత్రంబులు నిమురుచుఁ, బుండరీకముకుళంబులం బెఱికి యొండొంటితో నేటులాడుచు, నన్యోన్యముఖసౌరభంబుల నాస్వాదించు సంతోషంబున ఘోషించుచు, నక్కు నక్కునుం జెక్కుఁ జెక్కును దొడఁ దొడయుం జెవిఁ జెవియుం బరిబరియు సరినొరయఁ, గరాగ్రమ్ముల జలంబులం బీల్చి చిమ్మనగ్రోవులంబలెఁ జిమ్ముచుఁ, బెద్దయుం దడవు తద్దయుం గ్రీడించి, మావంతుల బలవంతంబున జలవిహారంబులు చాలించి యమ్మదగజంబులు పురంబునకుం జనియె.
తదనంతరంబ క్రొమ్మించుల మించు తేరి గండ్లయంచులవలనం బొడమిన భూరేణువుల కాలతిమిరంబు సంపాదింపఁ, గాలరుద్ర ఢక్కాఢమఢమాత్కారంబులం ధిక్కరించు వాద్యఘోషంబులు మొఱయ, మృత్యువు నాలిక పోలికఁ జలదలంగదులు బిరుదకేతనంబులు మెఱయఁ, బట్టపగలింటి మార్తాండకిరణంబులకు ననుకరణంబులైన ప్రహరణంబులం బొలుపొందు భటసమూహంబును, సందడింప, నేలయీనిన తెఱంగున, సముద్రంబు పొరలిన చందంబున, వచ్చు సైన్యముం గనుంగొని, యౌవనాశ్వ భూపాలుండు వచ్చెనొ యను తలంపున దిగ్గన లేచి, కర్ణకుమారుఁ డాసైన్యమును గలయం జూచి నీరు గ్రోలఁ జనుదెంచు తురంగబృందంబుల సందడిగాని రాజు కాఁడని తెలిసి, యనిలనందనుం జూచి, 'యయ్యా, కయ్యంబునకుం గాలు ద్రవ్వు చందంబున ఖురంబుల భూతలంబు ద్రవ్వుచు నూరఁబిచ్చుకలు ముంగిసలు నొంటెలు నడచినకైవడి బెడంగు నడలు మెఱయం, బరిచారకులు వాగెలం గుదియఁబట్ట నిట్టట్టు గెరలుచు, వేనవేలు తురంగంబులు జలతరంగంబులకరణిఁ ద్రొక్కినచోటుం ద్రొక్కక యిక్కొలనికిం జనుదెంచి నీరు ద్రావుచుఁ బోవుచు నున్నయవి గాని యశ్వమేధాశ్వంబు గనంబడదు. దానికున్నచోటన గడ్డియుం గవణంబు నీరు సమరించి బయలుపుచ్చరు గాఁబోలు' ననిన వృషకేతుం జూచి యనిలసూతి, 'కుమారకా, మనము ధర్మజుని సమ్ముఖమున నానావిధంబులైన ప్రతినలు గావించితిమి. సవనహయంబు లేకయ రిత్తచేతులతో మగిడి పోవం జనదు.<noinclude><references/></noinclude>
7yqevjg4kl7czdo9evmdnsnidyhs9b4
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/31
104
186294
553521
504511
2026-04-17T08:22:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553521
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పుత్రులు లేనివానికిం గతి గలుగనేరని వితంబున, నంగనావశుడైన యజ్ఞానికి బంధుమర్యాదలు మాలినకరణిఁ, గార్యాలోచనము సేయని మనుజనాథునకు రాజ్యంబు సిద్ధింపని తెఱంగునఁ, శ్రీకృష్ణదేవుని చరణకమలంబులం దలంపనివానికి శుభంబులు లభింపని చందంబున, శంకరునిం బూజింపని వంకరకట్టెకు సంపదలు సంభవింపని కైవడి, హయంబునుం గైకొనకయ విఫలప్రతిజ్ఞుల మైతిమేని, మన కీర్తి హానిం జెందు' నని మాటలాడుచుండె.
{{p|ac|fwb}}అశ్వమేధాశ్వము నీరు ద్రావ వచ్చుట</p>
ఆ సమయంబున ద్విరదంబులు, నరదంబులు, ఘోటకంబులు, భటసమూహంబులు, వాద్యఘోషంబులు మ్రోయ, విచ్చలంపు ముత్యాలకుచ్చులగచ్చులు మెఱయు, ధవళాతపత్రంబు పున్నమచందురుచందంబునఁ గాంతిచంద్రికలు వెదచల్ల, నుభయచామరంబులు, ధవళశంఖంబులు, సాంబ్రాణిధూపంబులు, చంద్రకావిపావడలు దీపింప, మహామండలేంద్రునిచందంబున నతిశయితవైభవంబుతోఁ బద్మాకరంబునకు నయ్యాగహయంబు రా నాలోకించి, పట్టం దమకించు కుమారుని నివారించి, మనుమనిం గనుగొన్న, నమ్మేఘవర్ణుండు సమరవిజయనేతయగు తాతకు నమస్కరించి, 'మహాజలనందనా, రెక్కకు మిక్కుటంబైన కక్కసంపుజోదులు పెక్కండ్రు చుట్టునుం బరివేష్టింప వచ్చుచున్నట్టి యిత్తేజిం జెవి పట్టికొని లేఁగదూడ నిచ్చి తెచ్చినవిధంబునం బట్టి తెచ్చెద. యౌవనాశ్వుని, నాతనికుమారుని మూటకట్టుగాఁ గట్టి మీముందఱం దెచ్చి పెట్టెద. ఇంత యేల? తురంగంబె చాలు నంటిరేని, యత్తెఱంగునం జేసెద' నని సంగరోత్సాహంబున నంగంబు పొంగుచుండ, శైలశృంగంబునుండి చంగునం దుముకు సింగపుఁగొదమకరణి ధరణికిం జనుదెంచి, మాయాప్రభావంబునఁ గాలకంఠ కంఠ కుహళీకరాళ కాలకూటంబు కరణి, గాటంబైన యంధకారంబుఁ గల్పించి, దిక్కులు విదిక్కులుం దళుక్కున మెఱపు టూఱపులు మిగుల, బ్రహ్మాండకుహరంబు విరియిఁపంజాలు గర్జితంబు లూర్జితంబులై యెల్లడల వినంబడ, బలుపిడుగులు పడంజేసి, దేవమానవాదులకు భయంకరంబుగ మేఘనాదుని చందంబున సింహనాదంబు సేసి, యద్దనుజసింహుండు పరాక్రమంబు మెఱయించుటయు, దేవేంద్రుండు చారులవలన దత్వృత్తాతంబు విని, 'యా రక్కసుం డెక్కడివాఁడు? ఏల విజ్యంభించినాఁడు? తెలిసిర'మ్మని<noinclude><references/></noinclude>
4a34hpbrl58b3wguaj7nhxbcot8sabn
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/32
104
186295
553531
504512
2026-04-17T09:49:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553531
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యొక్కదూత నంపించిన, వాఁడుం ద్వరితంబుగా వచ్చి యంబరంబున నాడంబరంబులు సేయు హిడింబాపౌత్రునిం గాంచి, 'నీ వెవ్వండవు? ఏమిటి కిట్లు విపరీతంబులు సేసెదవు? దీన నీ కేమి ఫలంబు? ని న్నెవ్వ రంపించినారు? త్రైలోక్యవల్లభుండైన దివిజనాథుండు తెలిసి రమ్మనియె,' ననిన విని యాఘటోత్కచపుత్రుండు, 'నేను బాండుపుత్రుండైన భీమసేనుపౌత్రుండ. మా పెద్దతాత యగు ధర్మరాజు హయమేధంబు గావింపంగోరి యౌవనాశ్వుని నగరంబున యాగతురంగం బున్నదని విని నన్నుం బంపిన నేను దానిం బట్టికొనవచ్చి మాయలం బన్నుచున్నవాడం గాని, దేవతలకు విరోధంబు సేయందలంచినవాఁడఁ గాను'. అనిన విని, యాదూత దేవేంద్రున కత్తెఱఁ గెఱింగించిన నతండు సంతోషంబు నొందె. అంత నంతకాల కాలుని చందంబున, నద్దనుజుం డొక్కెడు బిడుగులు గురియించుచు, నొక్కదిక్కున ఱాళ్లు ఱువ్వుచు, నొక్కచోట మిడుంగుఱులు నింగి కెగయ నిప్పులు గుప్పలించుచు, నొక్కదెస ఝుంఝామారుతంబులు విసరించుచు, నొక్కచక్క మిక్కుటంబైన దుమ్ము గ్రమ్మంజేయుచు, నొక్కచోట గాటంబు లైన చీఁకటుల నుత్పాదించుచు, నొక్కతావునఁ బెళ పెళమని యుఱుము లుఱుమం జేయుచు, నొక్కొక్కదిక్కునం దళుక్కుమను మెఱుంగులచే దృష్టులు మిఱుమిట్లు పడం జేయుచు సేనల నెల్లం జీకాకు పఱిచి —
{{p|ac|fwb}}మేఘవర్ణుండు గుఱ్ఱము నపహరించుట</p>
పొట్టేటిపిల్లం బట్టినతెఱంగున నశ్వంబు నాలుగుకాళ్లుఁ బట్టి, మూఁపునం బెట్టికొని, గగనమార్గంబున కెగసిన, వియచ్ఛరు లచ్చరువొంది, 'యదెయదె దానవుండు హయంబుం బట్టికొని పోయెఁబోయె' ననియెడు నెలుంగులు నింగిముట్టం బ్రశంసించి, కృపాయత్తచిత్తులై మేఘవర్ణునిపయిం బుష్పవర్షంబులు వర్షించిరి.
ఇవ్విధంబున భీమసేనపౌత్రుండు మాయాబలంబున యాతురంగంబు నపహరించికొనిపోయినతెఱంగు హతశేషులయిన భటులు పలుకరించుటయు, యౌవనాశ్వ విశ్వంభరాధీశ్వరుండు విని, యులికిపడి నిప్పు లుప్పతిల్ల దశదిశలం జూచుచు దురాపప్రతాపదీపితుండై, యంబరతలంబున కెగయం జాలు రథికుల నాలుగువేలకుం బనుపుటయు, వారలు క్రోధంబున యూథంబు లగుచు<noinclude><references/></noinclude>
cmbep8sdwdzkzl3z5w14joes4bgp5h9
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/33
104
186296
553543
504513
2026-04-17T11:41:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553543
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విక్రమంబునఁ జక్రగదాకుంతకరవాలభిందిపాలముసలముసుండికాపరిఘపట్టిసాదిసాధనంబులు సారించుచు, నవ్వీరుం జుట్టుముట్టిన, నాబిరుదుమగండు బెట్టుగా నట్టహాసంబు సేసి, యశ్వంబు నమరావతీపురంబున నునిచి, తాను బెట్టిదంబైన చెట్టు వెఱికికొని, చుట్టుకొనిన మూకలం గనుపుకొట్టి, యిట్టట్టువడం జేసి, యాగహయంబును మగుడం గొనితెచ్చి, భీమసేను ముందఱంబెట్టి నిలిచిన, నతండు పౌత్రుం గౌఁగిలించుకొని దీవించె. ఆ సమయంబున యౌవనాశ్వునిసైన్యంబులు క్రమ్మఱం జుట్టుముట్టిన మేఘవర్ణుండు మహార్ణవంబునం దిరుగు మందరనగంబు చందంబునం దచ్చమూసముదయంబు గలగుండు వడంజేయుచుఁ, బరాక్రమించు సమయంబున, వృషకేతుండు తన మనంబున 'హయంబుం బట్టికొని వచ్చునప్పటి కయ్యంబున మేఘవర్ణుండు మిగుల నలసియున్నవాఁడు. పెక్కండ్ర నొక్కనికి గెలువ శక్యంబు గాద'ని యూహించి, యనిలసుతునకు మ్రొక్కి శస్త్రాస్త్రభీకరంబైన వైరిసైన్యనికరంబు సొచ్చి,
యరుణారవిందజైత్రంబులైన క్షేత్రంబులం జురజురం జూచుచు, లయకాలహుంకారశంకాకరంబైన శింజినీటంకారంబు దిశానిటంకంబులకు సంక్రమింపం, గోపాటోపంబునం దత్సైన్యంబుం జొచ్చి, మేఘవర్ణునకుం గౌతూహలంబు సంపాదించుచు, 'వత్సా, నీవు కయ్యంబున మిగుల నలసినాఁడవు. తలంచినకార్యంబు నెరవేర్చితిమి. ముహూర్తమాత్రంబు బడలిక తీర్చుకొమ్ము'. అని భీముచెంతకుం బంచి, కంఠీరవంబు గంధగజయూధంబుపై నుఱుకుచందంబున నుఱికి, క్రొవ్వాడి మెఱుంగు తూపు లనియెడు గోళ్ళచే భద్రగజకుంభస్థలంబులు పెకలించి, తురంగసంఘంబులం దెగటార్చి, యరదంబులం జెక్కులు సేసి, కాలుబంట్లఁ కాలుని ప్రోలుకనిచి, రోదసీకుహరమేదురంబైన సింహనాదంబు సెలంగఁ, ద్రిపురంబులపై గడంగు త్రిలోచనుని చందంబున, నిరర్గళంబుగ మార్గణవర్షంబులు వర్షించిన, విదళితమాతంగంబును, విధ్వస్తతురంగంబును, విశీర్ణశతాంగంబును, విఖండితభటాంగంబునునై, యాసైన్యంబు చచ్చియుఁ నొచ్చియు జీకాకు పడుటయు నందొక్కరుండు బలుగాయంబుల నెత్తురు జొత్తిల్లు గాత్రంబులోఁ బురంబునకుం బరువెత్తి, భద్రావతీశ్వరునకుం బ్రణమిల్లి, సైన్యంబు సమసిన తెఱంగును, యాగీయవాజిం గొనిపోయిన చందంబును విన్నవించిన, యౌవనాశ్వుండు రోషారుణితలోచనుండై, 'యెట్టెట్టురా! వింతలు వింటిమి! పరదళం బెంత వచ్చె? గుఱ్ఱం బెటువలెం బట్టువడె? వివరంబుగా నెఱుంగం బలుకు' మనిన 'దేవా, యెవ్వరో యెఱుంగము, మువ్వురు<noinclude><references/></noinclude>
as8wjya1cs41onz2foacur4gexv181x
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/317
104
203621
553345
529838
2026-04-16T12:00:56Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553345
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అయితే, రాశానే కాని ప్రకటించడానికి శక్తి లేకపోయింది నా కది.
సంపన్నులను కొందరిని చూశాను, ప్రయోజనం లేకపోయింది.
అంతా కాకపోతే, కొంతవర కయినా సాహాయ్యం చేసిన సంపన్నులు మాత్రం కొంద రున్నారు, వారిలో అనపర్తి కాపురస్థులు ద్వారంపూడి రామారెడ్డిగారు. ముఖ్యులు.
పెద్దరెడ్డిగా రని వారికి వ్యవహారం.
మహానుభావులు వారు, కైలాసవాసు లిప్పుడు, బతికివుండినంతకాలమూ ఔదార్యమూ సౌజన్యము మూర్తీభవించినవారని ప్రఖ్యాతి వారికి.
వారి తండ్రి గంగిరెడ్డిగారినిన్నీ బాగా యెరుగుదు న్నేను, గంగిగోవు అన్నమాట వారికే చెల్లుతుంది.
గంగిరెడ్డిగారు మా నాయనగారికి వార్షికం యిచ్చేవారు, అందుకోసం రెండుమూడుమాట్లు 'వెళ్ళా న్నేను, అంచేత, చిన్నప్పణ్ణుంచీ నాకు బాగా పరిచయం వుంది రామారెడ్డిగారితో.
వారి ఔదార్యాన్ని కెందరో యెన్నో వుదంతాలు చెప్పగా ఆశపడి, నమ్మి, పనికట్టుకుని వెళ్ళి "యిది అచ్చువేయించి పెట్టం"డని కోరా నొకనాడు, రాత ప్రతి చూపించి.
వినివిని "నే నొక్క వందరూపాయ లిస్తాను, పైగా పడేది మరోచోట చూసుకోండి, వొక్క వారందినాల్లో రండీ" అన్నారు వా రవ్యవధానంగా.
ఆ పుస్తకాని కిది చాలదు.
అయినా నూరురూపాయల మొత్తం చేదు కాదు కనక, సరిగా వారందినాలకే వెళ్ళాను; గాని "యింకో వారం" అన్నారు రెడ్డిగారు నన్ను చూస్తూనే.
ఆ బుధవారమే వారం వారం వెళ్ళాను, వూళ్ళోవుంటే.
అంత పెద్ద మొత్తం అంతకితం యెప్పుడూ వొక్కమాటుగా నా చేతికి రాలేదు, కనక, మాసం కాదు - రెండు మాసాలు కాదు - ఆరుమాసాలు వెళ్ళా నలాగ వారంవారమూ.
పన్నెండు గంటలకు భోజనం చేసి చుట్టకాలుస్తూ రెడ్డిగారు హాల్లో పచారుచేసే సమయమూ, నేను వారి గుమ్మం యెక్కే సమయమూ వొక్కటిగా వుండేది, తరుచు.
“మళ్ళీ వారం"
"మళ్ళీ వారం"
“మళ్ళీ వారం"
ఈ వొక్కమాటే పెట్టుకున్నారు నాతో మాట్టాడ్డానికి రెడ్డిగారు.
ఈ ఆరుమాసాల్లోనూ వారి ఔదార్యం ఇంకా యింకా తెలిసింది.
ఆ మాట అనడానికి వారికీ, ఆ మాటమీద వెళ్ళడానికి నాకూ గూడా విసుగన్నది లేకుండా పోయింది.
కాని "ఏమిటిదీ ?" అనిపించిం దొకనాడు, హఠాత్తుగా.
గుమ్మం దిగి వెనక్కి మళ్ళాను, ఆలోచనలో పడ్డాను.<noinclude><references/>
{{rh|293||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
azpr8z0sicmeqhw7lni2jc9it3nhhe1
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/318
104
203661
553348
529839
2026-04-16T12:07:38Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553348
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"పశ్చా చ్ఛబ్దో నాస్తిపర్యాయః”
"మళ్ళీ రమ్మంటే లేదు” అన్నమాట.
ఈరకం లౌక్యులు లోకంలో చాలామందే వున్నారు.
కాని సందుదాటి ధ్వజస్తంభం దగ్గిరికి వెళ్ళేటప్పటికి వెనకనే వచ్చి, పిలిచి “మీరు నిరాశ చేసుకో నక్కరలేదు. మా అన్నగారిని అపార్థము చేసుకోవద్దు. మీ సొంత రూపాయలు, నూరు, రెడ్డిగారి దగ్గిర వున్నాయి, తిరుగులేని మాట
యిది. అయితే, ఫలానా పెద్దమనిషి రెడ్డిగారి సన్నిధానంలో లేకపోడమూ రెడ్డిగారిని మీరు కలుసుకోడమూ యెప్పుడు జరుగుతుందో - జరుగుతుందో జరగదో - ఇదిమాత్రం చెప్పలేను; గాని జరిగిందా, మీ వందరూపాయలూ మీ చేతిలో
పడతాయి గళ్ళున" అని చెవిలో వూది వెళ్ళారు వారి తమ్ములు వేంకట రెడ్డిగారు, నా యింగితం యెలా గుర్తించారో మరి.
"కల్పవృక్షం” అని పేరు రామారెడ్డిగారికి.
దానిచుట్టూ ముళ్ళకంచె వున్నదని నే నదే వినడం, మొదటిమాటు.
లోకంలో అనేకచోట్ల వుం దది, నాకు తెలుసు.
కంచెపని కంచె చేసుకుంటుంది, కల్పవృక్షం పని కల్పవృక్షం చేసుకుంటుంది, వాటిలోనూ చాలాచోట్ల, నాకు బాగా
తెలుసు.
కనక, వేంకటరెడ్డిగారి సలహా కాదనలేకపోయాను.
వెళ్ళడమూ మానలేకపోయాను, వారంవారమూ.
రెడ్డిగారున్నూ మానలేకపోయారు “మళ్ళీవారం” అన్నమాట.
ఇటు వందరూపాయల మొత్తం, అటు వేంకటరెడ్డిగారి సలహా - చూస్తే, రామారెడ్డిగారి ముఖం సౌమ్యంగానే వుండడం - వింటే, వారి ఔదార్యోదంతాలు కొత్తకొత్తవి వారూ వీరూ చెబుతూ వుండడం - దీంతో నిశ్చలంగా వెళ్ళాను,
అన్నకొద్దీ.
వెడుతూనే వుండిపోయాను, దీక్షగా.
ఈలోపున కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగా రది అచ్చువేసి యిచ్చారు, అది మరోచోట.
ఆ అచ్చుప్రతిన్నీ అందుకున్నారు రెడ్డిగారు “మళ్ళీ వారం" అనిమాత్రం అంటూ.
అయితే, నేను నిర్వికల్పంగానే వుండినా, నే నలా తిరగడంమాత్రం కొందరి కసందర్భంగా కనపడింది.
"ఇక చాలించుకో" అన్నారు మా నాయనగారు.
“లాభం లేదండీ" అన్నారు శ్రీ దాట్ల సూర్యనారాయణ రాజుగారు.
"ఆశ వదులుకోవలసిందే" అన్నారు మల్లిడి సత్తిరెడ్డిగారు.
“ఇంగితజ్ఞానం వుండవద్దా?" అంటూ కనురుకున్నారు, మిత్రులు కొందరు.
అయినా వెళ్ళడం మానలేకపోయా న్నేను.
నా సంగతికేం, రమ్మని తామే చెప్పిన్నీ, మళ్ళీమళ్ళీ వెడితే మాత్రం చాలా బాధపడతారు కొందరు.
వెళ్ళకపోతే బాధపడతారు మరికొందరు.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||294}}</noinclude>
myh2zvaoyizcudvn83jhmcaid1zxpwe
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/319
104
203662
553349
529840
2026-04-16T12:11:39Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553349
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>వారూ వీరూ పదిమాట్లు తమచుట్టూ తిరుగుతూవుండడం తమకొక ఘనత అని భావించుకునేవా రుంటా రాకొందరిలో కొందరు, తెలుసు.
కాని తతిమ్మా కొందరూ మాత్రం మహానుభావులు.
నిష్కామంగా యిస్తారు వారు.
ఇవ్వడం తమ విధి అని భావించి యిస్తారు వారు.
తమకుంది కనక, ఒకరి కివ్వకపోడం ఈశ్వరద్రోహం అని భయపడుతూ యిస్తారు వారు.
“తమకుండినట్టు వారికిన్నీ లేకపోయినందు కెంత చిక్కు పడుతున్నారో” అంటూ పరితపిస్తూ యిస్తారు వారు.
"మన మే మివ్వగలిగామూ?" అంటూ సిగ్గుపడుతూ యిస్తారు వారు.
'దేహి' అన్నమాటతో తమ గుండెలు కరిగిపోయిస్తారు వారు. మళ్ళీమళ్ళీ వెడితే, అప్పుడున్నూ తా మివ్వలేకపోయినా, అవతలివారికి తమయెడల అసంతృప్తి - నిరసన - అపనమ్మకం ఇలాంటివి కలగలేదని గుర్తించుకుని అందుకు
బ్రహ్మానందం పడతారు వారు.
కాని అది నిలవదు.
అంతలో సిగ్గు ముంచుకువస్తుంది.
రోషం కెళ్ళిస్తుంది.
"అప్పయినా చేసి యివ్వా" లనుకుంటారు.
ఒక్కొక్కప్పు డలా యిస్తారు కూడా.
ఇవ్వరూ?
అయినా, తిరిగేవాడికి విసుగు కలగదు.
అలాంటివారిని మళ్ళీమళ్ళీ చూడ్డం పడ్డందుకు తిరిగేవాడికి సంతృప్తి కలుగుతుంది, మిక్కిలీ.
డబ్బున్నవారున్నూ స్నేహభావంతో మళ్ళీమళ్ళీ చూడతగ్గవారు రామారెడ్డిగారు.
అంచేత వెళ్ళడమే పెట్టుకున్నా న్నేను.
పోనీ, వేంకటరెడ్డిగారు చెప్పిన ఆ సన్నిధానవర్తి నాకు విరోధి యేమో అంటే - నా యెడల కోపంగా వున్నాడేమో అంటే, రామరామా, మే మెప్పుడూ ఏమీ అనుకోలేదు.
కనపడితే వోహో అంటే వోహో అనుకుంటా మెప్పుడూ.
రామారెడ్డిగారు “మళ్లీ వారం" అంటూనే వుండినా - తన యెదటే అంటూ వుండినా, ఆ సన్నిధానవర్తి, ఆప్యాయనంగానే మాట్లాడేవా డెక్కడ కనపడ్డా నాతో, రెడ్డిగారి ఆ మాటకు మాత్రం సంబంధం లేకుండా.
మరి యిదేమిటీ అంటే యేమో?
ఇంతాచేసి ఆ సన్నిధానవర్తి యెప్పుడయినా సఫలు డయినాడా అంటే - రెడ్డిగారు వందలూ వేలూ యిస్తూనే వున్నా రనేకులకు, ధారాళంగా.
కాదంటే నాకు లాగే అందరికీ వారాలో, పక్షాలో, మాసాలో వాయిదాలు - అంతే.<noinclude><references/>
{{rh|295||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
3b7q251b6p9fj61afmp5vjmnfivy6v4
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/320
104
203663
553352
529864
2026-04-16T12:55:00Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553352
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఓపిక పట్టినవా రెవరూ విఫలులు కాలేదు, నాకు తెలుసు.
{{c|<big><big>33</big></big>}}
అంచేత "సన్నిధానవర్తి ఈ సమయాన రెడ్డిగారి దగ్గిర వుండకపోవచ్చు" నన్న ఆశతో, తెల్లవారేటప్పటికీ వెళ్లాను, ఎనిమిదింటికి వెళ్లాను, పదింటికి వెళ్లాను, రెండింటికి వెళ్లాను, నాలుగింటికి వెళ్లాను, దీపాలు పెడతా రనగా వెళ్లాను,
మామూలుగా పన్నెండు గంటలకు వెడుతూనే వచ్చాను గాని ఆ “ముఖారవిందమే” కళ్లబడుతూవచ్చింది నాకు, రెడ్డిగారి ప్రసన్నగంభీరముఖం కంటేనూ ముందు.
నా విషయమై సన్నిధానవర్తి దీక్ష యేమిటో ఇదమిత్థంగా నాకు తెలియదు; గాని నేనుమాత్రం "నిన్ను జయించితీరతా" ననుకునేవాణ్ణి, రెడ్డిగారి దగ్గిర అతను కనపడగానే.
ఎప్పటికప్పుడే "యిది చివరిమాటు, మరి వాయిదా పడ", దనుకునేవాణ్ణి రెండేళ్ళదాకా, తరవాత మాత్రం యేమనుకోడమూ మానేశాను.
రానూపోనూ యెనిమిది మైళ్ళయినా, నడకశ్రమ తప్ప దమ్మిడీ అయినా ఖర్చులేదు కనక, అలా వెడుతూనే వచ్చా నదో అలవాటుగా.
బుధవారం వచ్చిందంటే, చెప్పకుండానే మా సీత పెందలాడే వంట చేసేసేది, భోజనం కానిచ్చి నే ననపర్తి బయలుదేరేవాణ్ణి, అనుకోకుండానే.
ఖరాగా మూడేళ్ళు తిరిగా నిలాగ నే ననపర్తి.
"అనగననగ రాగ మతిశయిల్లుచునుండు" నన్నాడు వేమన్న.
"తిరుగఁ దిరుగ ఫలము దొరకి తీరు” ననుకున్నా న్నే నొకనాడు.
జరిగిందే మిటంటే?
ఎప్పటిలాగే బయలుదేరా నా వేళ.
అనపర్తి దగ్గిర నల్లకాలవ యివతలి గట్టున నేను బల్లకట్టు రేవు చేరుకునేటప్పటికి అప్పుడే వచ్చిన బల్లకట్టు (రేవుదోనె) దిగి దక్షిణపుటొడ్డున నుంచునివున్నాడు, సన్నిధానవర్తి యిద్దరుముగ్గురు రెడ్లతో.
చూస్తూచూస్తూనే నేను బల్లకట్టెక్కేశాను, త్వరగా నడిపించ మని కళాసుని తొందరపెడుతున్నట్టు చిటికెలువేస్తూ.
"ఎక్కడి" కనడిగాడు సన్నిధానవర్తి, హఠాత్తుగా చూసి, కంగారుపడుతూ.
“తరవాత చెబుతాను, ముందు టయి మెంతయిందో చూడం" డన్నా న్నేను, వెనక్కి వచ్చి నే నెక్కిన బల్లకట్టే యెక్కుతాడేమో అని ఆదుర్దాపడుతూనే.
ఆ చుట్టుపక్కల వూళ్ళవాళ్ళు రాజమండ్రీ వెళ్ళాలంటే సరిగా ఆ సమయాన వొక రెయిలుంది.
నే నా బండికి వెడతాననుకుని వుంటాడు సన్నిధానవర్తి, జేబులోనుంచి వాచీ తీసి “నడిస్తే లాభం లేదన్నాడు, టైము చూస్తూనూ, వొత్తి పలుకుతూనూ.
అప్పటికీ నొకళ్ళ యింగితం వొకళ్ళం కనిపెట్టుకోవాలని చురుకుచూపులు చూసుకుంటూనే వున్నాం మేము, బల్లకట్టు కదిలింది, వెనక్కి తిరిగింది, బయలుదేరింది. రంయి మంటూ అవతలిగట్టూ చేరేసింది.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||296}}</noinclude>
6kqw0q0t3rmbckjm50yq2kmo82ozug3
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/321
104
203664
553353
529865
2026-04-16T12:58:52Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553353
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>వొడ్డింకా సగం దూరాన వుండగానే నా మన స్సురికేసింది, గజం దూరాన వుండగా నా శరీరం వురికేసింది, రెండూ చెట్టాపట్టాలు వేసుకుని వూళ్ళోకి బయలుదేరాయి వెంటనే.
సన్నిధానవర్తి అప్పు డనుమానించినా భయం లేదిక.
ఏమంటే?
ఇవతలినుంచి బల్లకట్టవతలికి వెళ్ళాలి, అంతదూరాన వుండగానే దూకేసి ఆయన యెక్కినా, వెళ్ళి వొడ్డు కది గుద్దుకోవాలి, వెనక్కి తిరగాలి, బయలుదేరాలి, నడవాలి, మళ్ళీ యివతలిగట్టు చేరుకోవాలి, రెడ్డిగారి యింటికి నాలుగు ఫర్లాంగులమేర వురుకులూ పరుగులూ పెట్టా లాయన.
రెడ్డిగారు కనపడ్డారా, సన్నిధానవర్తి బల్లకట్టు దిగకుండా నే నక్కడికే చేరుకుంటాను మళ్ళీ, పచ్చకాగితంతో.
తలుచుకుంటే యిప్పటికీ నవ్వు వస్తోంది.
నిజంగా, కంగా రక్కర్లేకపోయినా, నే నప్పుడు పరుగెత్తుతున్నట్టే నడిచాను, సన్నిధానవర్తి చూపానినంతమేరా.
{{c|<big><big>34</big></big>}}
యథాప్రకారం హాల్లో పచారుచేస్తున్నారు రెడ్డిగారు.
కాలవగట్టున చూసే వుండినా - మాట్టాడిన్నీ వుండినా నమ్మలేక కనపడ్డంతమేరా పరకాయించాను, రెడ్డిగారొక్కరే వున్నారు, సన్నిధానవర్తి లేడు సన్నిధిని.
వెంకటరెడ్డిగారు "వెళ్ళండి, వెళ్ళండి" అంటూ లోపలికి దారి చూపిస్తున్నట్టు మాత్రం అనిపించింది, అరుగుమీద నుంచుని, ఆత్రంగా.
చీడీలమీదే వుండగా నన్ను చూశారు పెద్దరెడ్డిగారు.
లోపలకు రమ్మనలేదు, వాయిదా వేసి పొమ్మనా లేదు, నాతో మాటే ఆడలేదు, ద్వారాన వున్న నౌకర్ని పిలిచి, తర్జనితో నిర్దేశిస్తూ యెవరో రెడ్డిగారి పేరు చెప్పి “నే నిమ్మన్నానని పచ్చకాగితం పట్టుకురా” అన్నారు, యెగిరి రావాలన్నట్టు చిటికెలు వేస్తూ.
అప్పు డన్నారు నన్ను వచ్చి కూచోమని.
నేనున్నూ మాట్టాడకుండా కూచున్నాను, భావోద్వేగం అణిచిపెట్టుకుంటూ.
వగర్చుకుంటూ వచ్చా డంతలో నౌకరు.
పచ్చకాగితం నా చేతిలో వుంచి "క్షమించండి" అన్నారు దోసిలి వొగ్గి, రెడ్డిగారు, వెంటనే.
మెరుపు మెరిసినంతలో అయిపోయిం దిదంతా.
నేను తిరిగిన మూడు సంవత్సరాలూ మూడు క్షణా లన్నట్టనిపించింది, దాంతో.
పెద్దనిట్టూర్పు మాత్రం వచ్చింది, మాట రాలేదు నాకు.
కొండంత భారం దింపుకున్నట్టు ఫీలయినారు రెడ్డిగారున్నూ.
“ఇవ్వలేకపోయా” నన్న తపన - "ఏమనుకున్నారో శాస్త్రి గారు?” అన్న<noinclude><references/>
{{rh|297||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
8l1wmtvt30u03dzkwf8raxm7as44j4c
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/322
104
203665
553354
529866
2026-04-16T13:03:03Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553354
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>బిడియం - "వెనక్కి వచ్చేస్తాడేమో?" అన్న అనుమానం - “నౌకరింకా రాడేం ?" అన్న ఆత్రం - “అమ్మయ్యా” అనుకుంటున్న ధోరణి - మూడు సంవత్సరాల యిన్ని మనోవికారాలు కనపడ్డాయి, రెడ్డిగారి ముఖాన నా కా సమయాన.
అప్పుడు మాట్టాడారు ఇష్టాగోష్టిగా వా రొక అరగంట సేపు.
వీరపూజ సంగతి - అప్పుడు రాస్తున్న రచన సంగతి - ప్రచారం యెలా వుందన్న విషయం - ఇత్యాదిగా చాలా సంగతులు వచ్చా యాసంభాషణలో.
ఇచ్చి రెడ్డిగారూ, పుచ్చుకుని నేనూ చాలా సంతోషించాం.
అయితే, ఏకకాలాన అంతవరకూ నే నెరగని మొత్తం వందరూపాయలు చేతిలో పడ్డాయన్న సంబరంతో నే నంటున్నవి కావు, వారం వారమూ మూడేళ్ళు తిరిగినా కష్టం అనిపించని తృప్తితో అంటున్న మాట లివి.
ఏమంటే?
తృప్తి హార్ధికం.
డబ్బుకీ దానికీ లేశమూ సంబంధం లేదు.
కడుపు కనకలాడుతున్నప్పుడు - పేగులు మాడిన్నీపోతున్న సమయాన కూడా చారూ అన్నమూ అయినా పెట్టనక్కరలేదు, ఆదరంగా వొక్క మాటాడితే చాలు, జాలిగా వొక్క చూపు చూసినా చాలు, కడుపునిండినంత తృప్తి
కలుగుతుం దెవళ్ళకయినా.
కోరి, ప్రార్థించి కూడా వొక్కొక్కరి దగ్గిర డబ్బు పుచ్చుకుంటాం అగత్యం అయి, కాని తరవాత చాలా బాధ పడతాం, నాలుకలు చాపి కీలుకీలునా మంటలు తాకుతున్నట్టు.
"ఛీ, ఎందుకువచ్చిన బతుకు?” అనిన్నీ అనుకుంటాం దౌర్భాగ్యం తిట్టుకుంటూ.
డబ్బు స్వరూపం వొక్కటే - స్వభావం మాత్రం వేరు వేరు, చేతుల మార్పు ననుసరించి.
ఎన్ని రకాల చేతుల్లో నుంచో కాస్తోకూస్తో వస్తూవచ్చింది నా చేతికి డబ్బు.
రెడ్డిగారి చెయ్యి వంటి చేతులు బహూ కొద్దిగా తగిలాయి నాకు.
ఎలాంటి నప్రతిగ్రహీతకూ కూడా ఉద్వేగానికి బదు లుత్తేజాన్ని కలిగించే యోగ్యత వుంది రెడ్డిగారి చేతికి.
ఇతరులవల్ల డబ్బు పుచ్చుకోడం యెలాగా తప్పనివాడికి రెడ్డిగారి ద్రవ్యం సంపాదించుకోలేకపోడం వొక అయోగ్యత.
అఖండైశ్వర్యంతోపాటు మహొదార్యమున్నూ యెప్పుడు ప్రారంభం అయిందో ఆ కుటుంబంలో మరి, తమ తండ్రి గంగిరెడ్డిగారి దగ్గిరనుంచి పుణికిపుచ్చుకున్నారు. రామారెడ్డిగారూ, వారి తమ్ములు వేంకటరెడ్డిగారున్నూ, సమవాటాలుగా.
దురదృష్టవశాన రామారెడ్డిగారి చుట్టూ ముళ్ళకంచె యేర్పడింది, అదృష్టవశాన వేంకటరెడ్డిగారి చుట్టూ యేర్పడలేకపోయింది, ఆ యేకోదరుల దగ్గిర కనపడే వ్యత్యాసం యీ కాస్త మాత్రమే.
సాహసౌదార్యాలలో మాత్రం యిద్దరి కిద్దరే వొకరికొకరు తీసిపోరు.
ఇంతేకాదు:-<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||298}}</noinclude>
4cu12vgvv6ztoezgk4cnft1j5rjyo5p
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/323
104
203666
553355
529867
2026-04-16T13:06:48Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553355
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇద్దరూ మితభాషులే, యిద్దరూ సులభదర్శనులే, యిద్దరూ దాపరికం లేకుండా మాట్టాడేవారే కాని యిద్దరూ కూడా యెప్పుడో కాని బయటికి రానివారే, ప్రభుసమ్మితంగా.
అయితే, రామారెడ్డిగారు బయటికి వచ్చారంటే, టెన్నిస్ ఆడ్డానికో వేటకి బయలుదేరడానికో.
రెడ్డిగారితో సమంగా టెన్నిస్ ఆడగలవారు జిల్లాలో బహుకొద్దిమంది మాత్రమే.
వారితో వేటకి వెళ్ళడానికి యెక్కడెక్కణ్ణుంచో వచ్చి చుట్టుకుని వుండేవా రలాంటి సంపన్నులే చాలామంది.
వారి సన్నిధి రాజయోగ్యంగా వుండేది.
ఒక్కమాటలో చెప్పాలంటే, -
రెడ్డిగారి విగ్రహం ఆజానుబాహువూ, పరాక్రమం సింహసంహననమూ, రూపం మదనమోహనమూ, చూపు ప్రసన్నగంభీరమూ, వేషం రాజయోగ్యమూ, ప్రవృత్తి మాత్రం సాత్వికమున్నూ.
వారి రాబడీ సాత్వికమే, వ్యవసాయం వారి ప్రధానవృత్తి.
అంచేతే వారి విరాళం సంపాదించుకోడాని కంత ఆత్రపడిపోయా న్నేను.
{{c|<big><big>35</big></big>}}
ఎవరి గ్రంథం వారే అచ్చువేయించుకోవలసిరావడం కంటే మరి దౌర్భాగ్యంలేదు కవులకు.
వనితలకు తమంత తామయి వలచివెళ్ళవలసిరావడం వంటిది కవుల కిది.
“తన రచన తన డబ్బుతో అచ్చువేయించుకోడమే కవికి దౌర్భాగ్యం అయితే, యాచించి తెచ్చిన యితరుల డబ్బుతో అచ్చువేయించుకోడం మరీ దౌర్భాగ్యం కాదూ?” అంటే కాదనే చెబుతాను.
ఏమంటే?
అచ్చువేయించుకోవలసిన బాధ్యత కవిమీద పడ్డమే అసలు, దౌర్భాగ్యం.
కాక, -. ప్రచురణకర్తలు ముందుకి రానప్పుడు తానయినా తన గ్రంథం, అచ్చువేయించుకోకపోతే, అదీ దౌర్భాగ్యమే అవుతుంది కవికి.
అది తప్పనప్పుడు ద్రవ్యం యెవరిదైనా వొకటే, యెలా వచ్చినా వొకటే.
కాగా, - అందుకోసం యాచించి అయినా యితరుల డబ్బు సంపాదించడం అంటే, ఇల్లు కట్టుకోడానికి యాచించడమూ, రుణాలు తీర్చుకోడానికి యాచించడమూ, బిడ్డలకు చదువు చెప్పించుకోడానికీ శుభకార్యాలు నిర్వహించుకోడానికీ యాచించడమూ వంటిది కానేకాదు.
అవి జానెడు పొట్టకోసం చెయ్యవలసినవి.
ఇది, అచ్చంగా, ఇతరుల నానందపెట్టడానికి చేసే మంగళకార్యం.
ఇతరుల చిత్తవృత్తులను సంస్కరించడానికీ, పరిణతి కలిగించడానికీ చేసే దోహదక్రియ.
సభ్యత అలవరిచి జాతి ఏకతాటిమీద నడిపించడానికి చెయ్యవలసిన విధికృత్యమున్నూ.<noinclude><references/>
{{rh|299||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
1xjwezir9e1953a0vr2u7hks3eg5pom
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/324
104
203667
553356
529868
2026-04-16T13:09:44Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553356
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మొత్తానికి కవి బాధ్యత యిది.
కవి ప్రాప్యమున్నూ యిదీ.
నలుగురూ చదవడమూ, పాఠకుని హృదయం స్పందించి మొగం ఆనందోత్పుల్లం కావడమూ, ఆ మనిషి కెంతో కొంత సంస్కారమున్నూ అబ్బడమూ, ఆవిధంగా తన జీవితం ధన్యం కావడమూ - ఇదీ తన రచనవల్ల కవి సాధించుకోవలసినవి.
నలుగురూ తన ప్రతిభ గుర్తించడమూ, కొంచెమయినా తనని మెచ్చుకోడమూ కూడా ఈ పద్దులోవే, సందేహం లేదు.
అయితే, గౌణా లివి.
ఆనుషంగికాలున్నూ.
అవి సిద్దిస్తేనే సిద్దించేవిన్నీ యివి.
నిజమే; కాని "అచ్చుపడే ప్రతీగ్రంథానికీ యీ శక్తి వుంటుందా?" అంటే, పోనీ, వుండేదాని మాట?
అది నిర్ధారణ కావడం మాత్రం యెలాగా?
చెట్టున పుట్టే ప్రతీపిందే సారవంతం కాదు.
నిలవనూ నిలవదు.
మరి, నిలిచే దేదో యెలాగా చెప్పడం?
అలాంటిదే కవుల గ్రంథాల విషయమున్నూ.
కాక, - పూర్వకవులు రాసిన గ్రంథాలు కొంచెమే వున్నాయి, మన కిప్పుడు.
ఆ రోజుల్లో యివి మాత్రమే పుట్టాయా?
కవులున్నూ వీరు మాత్రమే వుండినారా అప్పుడు?
నన్నయ్య భారతాది మాత్రమే రచించాడా?
తిక్కన్న భారతోత్తరభాగం మాత్రమే రచించాడా?
ఎర్రన్నా, శ్రీనాథుడూ, పెద్దన్నా, తిమ్మన్నా, రామరాజ భూషణుడూ - మొదలైనవారు ఇప్పుడు మనకు లభ్యాలయి వున్న పెన్నిధులు మాత్రమే రచించారా?
కాదు కాదు, అలాంటి వికరమైన శక్తీ నేర్పూ అలవడ్డానికి, వారు, ఎన్నో శతకాలూ, పద్యాలూ, మరింకా యెన్నో గ్రంథాలూ రచించివుంటారు, సాధకావస్థలో.
అయితే, యిప్పటి అనేకుల్లా కాక, వా రపరిమితమైన సంస్కారం గలవారు కనక, వారి ఆ ప్రాథమిక రచనలున్నూ జను లాదరించే వుంటారు.
కాని తపస్సిద్ధి కాక పూర్వం రచించినవి కనక, అవి కాలం సుడిగుండాలు తప్పించుకోలేక నశించిపోయి వుంటాయి.
అలా పోయినవి పోగా రత్నాలే మనకి మిగిలాయి.
ఎప్పు డయినా గట్టిగింజలే మిగులుతాయి; కాని పొల్లు గింజలకున్నూ పని తప్పనిదే.
కనక, గ్రంథం తయారయిందా అచ్చుపడవలసిందే, ఇప్పుడు.
దానివల్ల యితరులకు ఆనందాదిప్రయోజనం కలిగినా కలక్కపోయినా, అవి అచ్చు పడ్డంవల్ల మరో గ్రంథం రచించాలన్న ప్రేరణ కలుగుతుంది కవికి.
కవి అయినవాడికి ప్రాణాలకంటేనూ విలవయిం దీప్రేరణ.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||300}}</noinclude>
7npdsv0smb3smm94twlu76o74stparu
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/325
104
203668
553537
529921
2026-04-17T11:10:22Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553537
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కవి అయినవాడికి నిద్రాహారాలకంటేనూ యెక్కువ ఆవశ్యకమయిందీ ప్రేరణ.
ఈ ప్రేరణ తన్మయీభావం కలిగిస్తుంది కవికి.
ఈ ప్రేరణ దీక్ష పుట్టిస్తుంది కవికి.
ఈ ప్రేరణ ఆ దీక్షకు ఏకాగ్రత సంఘటిస్తుంది కవికి.
దాంతో రాత క్కూచుంటాడు కవి.
రాయగా రాయగా భాష స్వాధీనం అవుతుంది కవికి.
రాయగా రాయగా రచనావిధానం సుపరిష్కృతం అవుతుంది కవికి.
రాయగా రాయగా క్రాంతదర్శిత నిశితం అవుతుంది కవికి.
రాయగా రాయగా తపస్సు సిద్ధించి మహర్షి అవుతాడు కవి.
“నానృషి, కురుతే కావ్యమ్"
మహర్షి కానివాడు కావ్యం రచించలేడు.
మహర్షి కానివాడు రచించినది కావ్యమూ కాలేదు.
మరి వొక్క రోజులో మహర్షి కాగలడా యెవ డయినా?
సోపానక్రమంగా ఎంతో సాధన కావాలి దానికి.
రాతప్రతి అయినా అచ్చుప్రతి అయినా గ్రంథం నలుగురి చేతుల్లోనూ పడ్డం ఆ సోపానాల్లో వొకటి.
అలాగ వొకటితరవాత వొకటిగా యెన్నో సోపానాలెక్కితే గాని తత్కర్తకు తన భంగపాటేదో తెలియదు.
తనకి సాధ్యం - సాధించుకోవలసింది - ఏమిటో తెలియదు.
అది తెలిస్తే గాని అడుగు ముందుకి పడదు.
పడితే తప్ప సిద్ధి యెక్కడిదీ?
తన గ్రంథం తానే అచ్చువేయించుకోవలసివస్తే మాత్రం ప్రేరణ దుర్బలమూ, సిద్ధి దుర్లభమూ అయిపోతాయి, కవికి.
ఈ విషయమై కొందరి కపవాద (మినహాయింపు) లుండవని కాదు; కాని మొత్తాని కిది కవులకు దౌర్భాగ్యం.
ఏమంటే?
తన గ్రంథం తానే అచ్చువేయించుకుంటే, పెట్టిన డబ్బు తిరిగి రాబట్టుకోడమూ, తన సంసారం నిర్వహించుకోడానికీ మరో గ్రంథం అచ్చువేయించుకోడానికీ తగినంత లాభం లాగడమూ - ఇలాంటి ధోరణిలో పడిపోతాడు కవి.
దీనివల్ల అతని కవితాతపస్సు భంగపడిపోతుంది.
కవికి కాదు, తెలుసుకోగలిగితే జాతికే తీరని నష్టం అది.
అయితే, కవి అయినవాడల్లా దరిద్రుడయి వుండాలని కాదు.
కవి అయినవాడల్లా ధనికుడయి వుండకూడ దనిన్నీ కాదు.
ధనికత్వమూ నిర్దవికత్వమూ లోకసామాన్యాలు.
మరి కవి?
లోకాతీతుడు.
కనక?<noinclude><references/>
{{rh|301||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
1maa0zv034cdkl7wpkmssa1ybdfryrf
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/326
104
203669
553538
529922
2026-04-17T11:15:21Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553538
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ధనసంపాదన కవికి ధ్యేయం కాగూడదు.
కవికే కాదు, ధనసంపాదన యే కళావేత్తకూ ధ్యేయం కాగూడదు.
నిశ్చింతగా - చిన్న యెత్తున అయినా అతనికి కాలక్షేపం జరిగిపోవాలి - అంతే.
పంచభక్ష్యపరమాన్నాలే అక్కర్లేదు, చారునీళ్ళతో కాలక్షేపం చేసిన్నీ ఉద్గ్రంథాలు రచించగలడు కవి.
దారిద్ర్యమూ ఐశ్వర్యమూ కూడా ప్రేరకాలూ కాలేవు, భంజకాలూ కాలేవు కవిత్వానికి.
టాగూరు జమీందారు కనకనే - సాంసారికా లైన వడిదుడుకు లెరగనివాడు కాబట్టే అలాంటి ఉద్గ్రంథాలు రచించగలిగాడనీ, నోబిలుబహుమానమున్నూ గడించుకోగలిగాడనీ అనుకుంటా డనుకర్త.
కవితాసమాధిలో కూచున్నాడా - సరి అయిన తాదాత్మ్యం సిద్ధించిందా, ఇక అతనికి భోగాలమీదికీ దృష్టి పోదు, కష్టాలూ కనపడవు.
నీరసం వచ్చి చెయ్యి ముడుచుకుపోగూడదు, పేగులు మాడి దృష్టి చెదిరిపోగూడదు, ఈ ప్రతిబంధకాలు కలక్కుండా వుండడానికే కవి కాహారం.
ధనికు డైనవాడి కయినా కవితావేశం కలిగినప్పు డిదే ప్రవృత్తి.
పర్సులో (బహూమితంగానే) డబ్బుండినా, దృష్టి రచనావ్యగ్రమై కదలలేక - కలమూ కాగితాలూ కిందబెట్టలేక, కూరల కోసం బజారుకి వెళ్ళాలన్న స్ఫురణే కలక్క, "కూరగాయలేవీ లేవు మరి" అంటూ వంటింటోనుంచి కేక వినవచ్చినా ప్రకృతిలో పడలేక, వేళకి మాత్రం పీటమీదికి వెళ్ళి - ఆ పూటకు వూరుగాయలతోనూ చారు మజ్జిగలతోనూ భోజనం అయిందనిపించుకుని చెయ్యి ఆరడం తడువుగా మళ్ళీ కలంపట్టి, దాంతో, ప్రపంచం మరిచిపోయిన సందర్భా లెన్నో వున్నాయి, నా జీవితంలో.
"ఏదో" రాయకుండా వుండలేని నా స్థితే యిలా వుండగా, పద్యబంధం చేసినా వచనరచనే చేసినా మహాకవులే అయివుండినవారి స్థితి యెలా వుండనూ?
తెలుసుకోగలిగితే, ఈ భౌతిక దేహం నిలుపుకోగలగడానికి ఫలానా మాత్రమే అగత్యం అన్న నిర్ధారణ లేదు.
వేషం విషయమై కూడా అంతే.
ఉజ్వలవేషంతో వీధిలోకి వస్తాడు కవి, ఒక్కొక్కప్పుడు.
ఎంత డాబురా అనుకుంటా డల్పబుద్ధి.
చింకిపాతలతో కనపడతాడు కవి, మరొక్కొక్కప్పుడు.
“వో-ట్ఠి దరిద్రుడు" అనుకుంటుంది మాయలోకం.
పరిశీలిస్తే, ఆ భావనా యీ ఘోషణా కూడా అవివేకజన్యాలే.
ఏమంటే?
అతను మహర్షి అనడానికి నిదర్శనం అది.
ఆ చీనిచీనాంబరాలూ ఆ చింకి పాతలూ కూడా అతని ఇచ్ఛాపూర్వకాలు కావు.
లోకంలో శరీరధర్మాలు కొన్ని వున్నాయి.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||302}}</noinclude>
bfel3l1iiqe92xlqmolqjuenx6ygh7o
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/327
104
203670
553539
529923
2026-04-17T11:23:14Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553539
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>సంసారంలో వున్నప్పుడు అవి తప్పవు.
కాని, కవి అయినవాడికి అవి గడిచిపోవడమే ప్రధానం.
కవితావేగాని కవి అడ్డంకులు కాలేవు.
భిల్లాంగనతో మన్మథతంత్రంలో మునిగిపోయివుండిన వాల్మీకే రామాయణం రచించాడు.
గాఢారణ్యాల్లో తపోనిష్టుడయివుండిన కృష్ణద్వైపాయనుడే మహాభారత గాధలో ప్రముఖపాత్ర అయినాడు.
అంటీ అంటని మహాకవుల యీ అవస్థ, లోకం బోధపరుచుకోనూ లేదు, అనుసరించా లేదు.
"ఆయన దరిద్రుడే; కాని సకలసంపదలకూ కారణభూతుడు. వల్లకాటిలోనే తిరుగుతూ వుంటాడు; కాని త్రిలోకాలకూ నాథు డాయన. భయంకరంగా కనబడతాడు; కాని శుద్ధసౌమ్యుడు" అంటూ నిర్వచించి "మహేశ్వరుడి యాథార్థ్యం
తెలిసినవారు లే” రంది తపోనిష్ఠురాలయిన పార్వతి.
కవి యథార్థ్యమూ అలాంటిదే.
మహామహావ్యాఖ్యాతలున్నూ నిర్ధారణ చెయ్యలేకుండా వున్నా రది.
మనిషి యెంత నిర్లిప్తుడు కావచ్చునో అంత నిర్లిప్తుడూ కాగలడు, ఎంత
లిప్తుడు కావచ్చునో అంత లిప్తుడూ కాగలడు కవి.
ఇచ్ఛామాత్రా లతనికా అవస్థలు.
అతని చూపుమాత్రం యే అవస్థలోనూ వొకటే.
అది క్రాంతదర్శిత.
కనకనే ఆకాశసౌధాల్లో విహరించే ఆగర్భ శ్రీమంతుల భోగభాగ్యాలూ వర్ణించగలడు, ఎలకల కలుగులవంటి చుట్టుగుడిసెల్లో తల దాచుకునే కటికిదరిద్రుల యమయాతనలూ చిత్రించగలడు, కవి.
సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మరి దేనిమీదికీ దృష్టి పోదు, మనిషికి.
రకంలో భిన్నమే గాని రాశిలో అలాంటి మనోధర్మమే కవిదిన్నీ.
అయితే, జీవయాత్రలో భంగపాటు తటస్థపడితే, ప్రపంచం మనిగిపోయినట్టు గోలపెట్టేస్తాడు మామూలు మనిషి.
కాయికంగా బాధపడుతూ, మానసికంగా నిర్వికల్పు డయిపోతాడా స్థితిలో కూడా, కవి.
అతని తాదాత్మ్యతకు నిదర్శనం అది.
రసలోలుపత అలాంటి విశిష్టత కలిగిస్తుం దతనికి.
“రసో వై సః”
నిజమే; కాని రసనిష్ఠ రసికునకూ కలుగుతుంది, కవి యెక్కువ ఏమిటీ? అంటే, అంతానూ.
ఒకమాటలో చెప్పాలంటే రసికుని రసనిష్ఠ యేకదేశం.
రసికుడైనవానికి, కవి రచనలో, వొకప్పుడొక వాక్యంతో - లేదా వొక పద్యంతో బుద్ధి చమత్కృతం అవుతుంది.<noinclude><references/>
{{rh|303||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
sracyuipmgpwis5960zg9gwxb59plmh
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/328
104
203671
553540
529924
2026-04-17T11:26:06Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553540
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>హృదయం స్పందిస్తుంది.
ఆనందమున్నూ అనుభూతం అవుతుంది, దాంతో.
మరి, మరొకప్పుడు?
తక్కిన వాక్యాల - లేక - పద్యాల మాట?
ఏ రసికుడూ కూడా "ఈ కావ్యంలో యిక్కడే వుంది, ఇంతే వుంది రసం" అంటూ నిర్ధారణా చేయ్యలేడు, దానికి పరిమితీ కట్టలేడు.
ఏమంటే?
ఈశ్వరసృష్టివంటిది కవి సృష్టి.
కాళిదాసు రచనల కెందరో వ్యాఖ్యానాలు చేశారు.
ఎందరో యెన్నో సారస్యాలు తీశారు.
పూర్తి చెయ్యగలిగారా?
ఇంకా యింకా యెందరో కొత్త అందాలు చూపగలుగుతూనే వున్నారేం?
అయినా, యింకా యేదో నిగూఢంగా వుండిపోయినట్టే అనిపిస్తోందేం?
కవికీ రసికునకూ వుండే అంతరం అదిగో, అది.
రసికుని సత్తా సావధికం.
కవి సత్తా నిరవధికం.
ఇంతేకాదు.
అతనిది భౌతికం.
ఇతనిది ఆధ్యాత్మికం.
ఇంతమాత్రమున్నూ కాదు.
అఖండ గోదావరిలో జలపానం చేసే చలిచీమదీ, కవి రచనలో రసం ఆస్వాదించే రసికుడిదీ వొక్కటే అంతస్థు.
ఎంచేతనంటే?
రసికుడు రసపిపాసి మాత్రమే.
కవి రసస్రష్ట.
కాని ధనలోభం పుట్టిందా, కవి యీ శక్తి సన్నగిల్లిపోతుంది.
అటు దౌర్బల్యమూ ఇటు పతనమూను దీంతో, కవికి.
ఇలాంటిది తటస్థించకుండా వుండాలంటే, రసికు లైనవారు కవిని కనిపెట్టుకుని వుండాలి, సర్వకాల సర్వావస్థల్లోనూ.
కవికి, తన గ్రంథాలు స్వయంగా అచ్చువేయించుకునే దౌర్భాగ్యం పట్టకుండా చూడాలి.
చూడాలి కాదు, చూసుకోవాలి.
అంతమాత్రమే చాలదు.
కవిని ఆరాధించాలి.
కవిని అందలా లెక్కించాలి.
కవికి కనకాభిషేకం చెయ్యాలి.
ఇంతా చేస్తే కవి కిది "పత్రం పుష్పం ఫలం తోయ"మున్నూ మాత్రమే.
ఇక రసికులకా, ఇదే పరాయణం.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||304}}</noinclude>
oebrnxwnt6ncyysa9xaq9thf1iz1a4g
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/329
104
203672
553541
529925
2026-04-17T11:30:18Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553541
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>{{c|<big><big>36</big></big>}}
ఇదంతా మునుపు రాజులు చూసుకునేవారు.
ఇప్పుడు ప్రజలమీద పడింది.
"ఈ రాజాశ్రయం, అప్పుడు, కవుల సమ్యగ్దర్శనసత్తా భంగపరచలేదా” అంటే లేదనే చెబుతాను.
ఏమంటే?
అప్పటి ప్రజల కిలాంటి భావాలున్నాయా?
వారి దృక్పథం వేరు.
వారి అభిరుచులు వేరు.
వారి ఆశయాలు వేరు.
వారి విశ్వాసాలు వేరు.
వారి జీవనసరణే వేరు.
ఆ రాజులకూ ఆ కవులకూ ఆ జనులకూ సరిపోయింది.
ఆ రోజులే నయం, ఏ రాజో, యే మంత్రో, ఏ దండనాథుడో, యే రాజబంధువో, అవచి తిప్పయ్య వంటి యే
రాజవణిక్కో కవిదీ తనదీ సత్తా ననుసరించి - సంస్కారమున్నూ అనుసరించి, అగ్రహారమో, వృత్తో, మాన్యమో,
ద్రవ్యమో యిచ్చి కవి నాదరించేవాడు.
కవికి కాలం గడిచిపోయేది.
రాజాస్థానంలోనో, దేశాటనం చేస్తూ రసికుల సన్నిధినో తన రచన వినిపించి తన విశిష్టత ప్రకటించుకునేవాడు కవి.
తన అంతస్తు నిలుపుకునేవాడు కవి.
గ్రంథం రవవంతం - గొప్పది అన్నమాట పుట్టిందా, యెంత దూరమైనా నడిచివెళ్ళి, పచ్చిపులుసూ అత్తెసరు మెతుకులూ తింటూ రసికులు దానికి ప్రతులు రాసుకునేవారు, అన్ని పనులూ విడిచి.
ఈ విధంగా కవికీర్తి దిగంతవ్యాప్తం అయేది.
ఈ కారణంగా కవి కుత్సాహం పేటెత్తుతూ వుండేది.
వెనకటి అలాంటి రసికులే నిలుపుకుంటూ వచ్చా రుద్గ్రంథాలు, తత్కర్తలు కారు.
మరి యిప్పుడు?
ప్రజాసత్తాకం వచ్చింది, జనులకు నిరంకుశప్రభుత్వ పిశాచబోధ వొదిలిపోయింది.
అచ్చు వచ్చింది. రసికులకు ప్రతులు రాసుకోవలసిన అవస్థా తొలిగిపోయింది.
మరి కవికి?
అధికారం చేతికి వచ్చిందన్న వుబలాటమే గాని కవులను ఆదరించవలసిన బాధ్యత మీదపడిందన్న జ్ఞానం లేదు, మన ప్రజాసత్తాకానికి.
"మరి, ఆస్థానకవి పదవి ఏర్పాటు చెయ్యలేదూ?" అంటే, -
వాఙ్మయనిర్మాణం చెయ్యడాని కగత్యమైన ఆజ్ఞా అవకాశమూ వుందా ఆ యేర్పాటులో?<noinclude><references/>
{{rh|305||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
kzg7own8okeioxzjh74v18hqmi4n49l
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/330
104
203673
553542
529933
2026-04-17T11:37:01Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553542
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>సాహిత్యానికీ, కవిత్వానికీ, కవిలోకానికీ దానివల్ల వొరిగిందేమిటీ?
కాక : -
కవిత్వం అన్నా, కవి అన్నా సరి అయిన నిర్వచనం తెలిసినట్టుందా దాన్నిబట్టి చూస్తే?
పోనీ అంటే, - నా చిన్నప్పటికే కాదిప్పటికీ, కవికి గ్రంథకర్తకు తగిన ప్రతిఫలం యిచ్చి కాపీరైటు హక్కులు కొనుక్కునే ప్రచురణకర్తలు బయలుదేరలేదు, మన తెనుగు గడ్డమీద.
ఇది ప్రచురణకర్తల తప్పున్నూ కాదు, మన తెనుగు వారి వాఙ్మయప్రీతి అలా వుంది మరి.
ఏమంటే?
కవిసంగతి అలా వుండగా, -
కవి కిచ్చిన క్రియాధనమూ, అచ్చుపనులకూ ప్రకటన కార్యాలకూ పెట్టిన పెట్టుబడీ వచ్చి, తాను లక్షణంగా తినడానికీ, ఎప్పటికప్పుడు పెట్టుబడి పెడుతూనే వుండడానికీ తగినంత లాభమున్నూ రావాలి ప్రచురణకర్తకు.
వచ్చిన లాభం కాస్తా వడ్డీ మింగెయ్యకుండా వెంటవెంటనే పుస్తకా లమ్ముడుపోవాలి, ఎలాంటి ఉద్గ్రంథాలున్నూ అచ్చువేయించడానికి ప్రచురణకర్త సిద్ధపడాలంటే.
మరి, యిలాంటి పరిస్థితులు కల్పిస్తున్నారా మనవాళ్ళు?
ఇది జనుల తప్పూ కాదు.
బ్రిటిషువాళ్ళు మనవాళ్ళని ఆ స్థితికి తెచ్చివెళ్ళిపోయారు.
అయితే అయిందంటే, ఆ జనులకు లోకజ్ఞానమూ, రసానందానుభూతీ కలగడానికి మన ప్రజాసత్తాకం చేస్తున్న దోహదం కూడా యేమీ లేదు.
ఈ విషయమై ఆవేదన వున్నట్టయినా చిహ్నాలు లేవు, మన ప్రజాసత్తాకంలో.
ఉన్న లోటంతా యిది.
మరో పెద్దలోటు మనకు నాయకుడు లేకపోడం.
రాజ్యాలకు రాజులో ప్రెసిడెంట్లో యెంత అగత్యమో ప్రజాసత్తాకాలకు నాయకు లంత అగత్యం.
నాయకులు పరంపరగా వెలుస్తూ, ఎప్పటికప్పుడు సరి అయిన దారిలో వెడుతూ వుంటే గాని ఏ జాతీ నిలకడగా వొక అంతస్థులో వుండదు.
ఏ జాతికి నాయకుడు లేడో ఆ జాతివారు, చదవ్వలసినవి చదవరు, చూడవలసినవి చూడరు, చెయ్యవలసినవి చెయ్యరు, మానవలసినవి మానరు.
వారు తమవారు చెబితే లక్ష్యపెట్టరు, అసలు విననేవినరు.
పోనీ అంటే, ఇతరులు చెబితే దాసోహం అనకామానరు.
కప్పలతక్కెడకూ ఆ జాతికీ మాత్రమే పోలిక.
అచ్చంగా, యిప్పటికీ మన జాతి స్థితి యిది.
కాగా, - మన కవులకు ఎవరి గ్రంథం వారే అచ్చువేయించుకోడం తప్పనిసరి అవుతోంది.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||306}}</noinclude>
kj4bc90yfw6d3u5ncpogfqd5b4wrmeh
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/173
104
211386
553361
553299
2026-04-16T15:53:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553361
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
భావాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాలం. అందునా అపారమైన పుస్తక పఠన వ్యసనం కలిగిన లక్ష్మణరావులో
ఆధునిక భావాలు ఉండడంలో ఆశ్చర్యపోవలసిన పనేమీ లేదు. ఎం.ఎ. రెండో సంవత్సరం చదువుతున్న 1944లో
మామిడాల గ్రామవాస్తవ్యులు బోయినపల్లి లక్ష్మీనరసింహారావు కూతురు లలితను పెళ్లాడారు. ఈ రెండు కుటుంబాలకు
అనుసంధానకర్తగా వ్యవహరించి పెళ్లి జరగడానికి కారణమైన వ్యక్తి లక్ష్మణరావు డిగ్రీ సహాధ్యాయి మనోహరరావు గారే. వీరిని గురించి ఇంతకుముందే ప్రస్తావించాను. శ్రీమతి లలిత బాలవితంతువు కావడం వల్ల లక్ష్మణరావు తల్లికి, బంధు వర్గానికి ఈ పెళ్లి నచ్చలేదు. లక్ష్మణరావు సహనంతో, సౌజన్యంతో అందరినీ ఒప్పించారు. శ్రీమతి లలిత తన మంచితనంతో మెప్పించారు. స్వయంకృషితో ఓ స్థాయికి ఎదిగిన లక్ష్మణరావు తోబుట్టువులకు, వారి సంతానానికి అన్నివిధాలా చేయూత నిచ్చారు. భార్య చెల్లెళ్లకూ ఎంతో సాయం చేశారు. లక్ష్మణరావుకు సంతానం కలుగలేదు. ఒక మరదలి కొడుకును దత్తత తీసుకున్నారు. వారి పేరు రాజేంద్రప్రసాదు. వారిప్పుడొక ఉన్నతోద్యోగంలో రాణిస్తున్నారు. లక్ష్మణరావుకు పెళ్లయిన తరువాత పుట్టిన చిట్టి మరదలు సుజాత అంటే ఎక్కువ అభిమానం. ఆమెను చదివించారు. ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్పారు. పెళ్లి జరగడంలో సహకరించారు. ఆ సుజాత గారు నేడు 70 ఏళ్ల వ్యక్తి. అధ్యాపకురాలిగా పనిచేసి రిటైరయ్యారు. తనను చిన్నప్పుడు చదివించి, విద్యాబుద్ధులు నేర్చి తండ్రి లాంటి బావగారి పట్ల అపారమైన కృతఙ్ఞతాభావాన్ని, భక్తిభావాన్ని ఇప్పటికీ వ్యక్తీకరిస్తారు. అకస్మాత్తుగా గుండెపోటుతో లక్ష్మణరావు 1965, జులై 14న తన 48వ యేట అస్తమించారు. కుటుంబం తుఫానులో చిక్కుకున్న నావలాగా విలవిల లాడింది. ఆ విపత్కర కాలంలో శ్రీమతి లలితా లక్ష్మణరావును ఆదరించి అక్కున చేర్చుకొని 2002లో ఆమె స్వర్గస్థులయ్యే దాక బాసటగా నిలిచిన వారు శ్రీమతి సుజాత గారు. వీరికి తోడునీడగా నిలిచి సహకరించిన వారు శ్రీవారు నర్సింగరావు గారు. శ్రీమతి సుజాత గారు లక్ష్మణరావు ఫొటోలివ్వడమే గాక ఎన్నో విశేషాలు చెప్పి ప్రోత్సహించారు. మలక్ పేటలోని కాలడేరా కాలనీలోని ప్రభుత్వ క్వార్టర్స్ చిన్నగా, ఇరుకుగా ఉండడంతో లక్ష్మణరావు ఆఫీసులోనే ఐదారు అల్మారాల నిండా పుస్తకాలు పెట్టుకొన్నారు. వారు అస్తమించాక అల్మారాలతో సహా ఆ పుస్తకాలన్నింటినీ శ్రీకృష్ణరాయాంధ్ర భాషా నిలయానికి ఇచ్చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎం.ఎ. పట్టా పొందిన రెండవ విద్యార్థి అయిన లక్ష్మణరావు అప్పుడే
తెలుగు శాఖలో అధ్యాపకునిగా అవకాశం వచ్చి ఉంటే వెలిగిపోయేవారు. ఈ మాత్రం వివరాలయినా తెలుస్తున్నా
యంటే లక్ష్మణరావు గారి మేనల్లుడు 83 ఏళ్ల ప్రముఖ వైద్యులు సి. లక్ష్మీనరసింహరావు, మరదలు శ్రీమతి సుజాత
కట్టుకున్న పుణ్యం. మా గురువర్యులు ఆచార్య ఎం. కుల శేఖర గారు అందించిన ఆధారం. ఆచార్య బి. రామరాజు 1951లో ఎం.ఎ. పూర్తిచేశారు. వారు చాలాసార్లు తాను రెగ్యులర్ విద్యార్థుల్లో ఏడవ విద్యార్థినని, ప్రైవేటు విద్యార్థులను కూడా కలిపితే వదవ వ్యక్తినని చెప్పేవారు. మరి వారెవరో ఇప్పటికైనా తెలుసుకోవలసిన అవసరం లేదా ? తెలంగాణ
సాకారమయ్యాకనైనా చీకటికోణంలో దాగిన ఇలాంటి వారిని స్మరిద్దాం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |152| తేజోమూర్తులు}}</noinclude>
qbj5olfaipgz4rp9r0zrpq673rugdtp
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/174
104
211387
553362
551315
2026-04-16T16:01:50Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553362
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''45. గడ్డం రాంరెడ్డి '''</p>}}
{{right|- డా॥ రాయారావు సూర్యప్రకాశ్ రావు}}
విద్యాసౌకర్యాలు పెద్దగా లేని మారుమూల పట్టెటూర్లో పుట్టిన ఆ మహోన్నతుడు కాలేజీ చదువు పూర్తి చేయడమే గొప్ప. ఆ గ్రామం నుండే కాకుండా ఆ జిల్లా నుండే ఆ కాలంలో ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య బహు స్వల్పం. పేదరైతు కుటుంబంలో పుట్టిన ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లొ విద్యార్జన చేయగలిగారు.
మారుమూల పల్లెల్లో చదువుకోవడానికి సౌకర్యాలు లేని లక్షలాది మంది కోసం దూరవిద్యా విధానానికి శ్రీకారం చుట్టడంలో కీలకపాత్ర పోషించారు. దేశంలో దూరవిద్యకు పితామహుడిగా ఖ్యాతినార్జించారు. విశ్వవిద్యాలయాలకు
విరాళాలందించే ప్రధాన బాధ్యత నిర్వర్తించే విశ్వవిద్యాలయాల నిధుల సంఘానికి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనే ఆచార్య జి. రాంరెడ్డి.
కరీంనగర్ జిల్లాలోని మైలారం గ్రామంలో 1929 డిసెంబర్ నాలుగో తేదీన తమ అమ్మమ్మ ఇంట్లో రాంరెడ్డి జన్మించారు. ఆయన స్వగ్రామం రాజన్న-సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి. గడ్డం కృష్ణారెడ్డి, కాంతమ్మ దంపతుల సంతానంగా జన్మించిన ఆయన బండపల్లి, మైలారం గ్రామాల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు.కరీంనగర్లో మెట్రిక్యులేషన్ చదివారు.
డిగ్రీ పూర్తి చేసిన అనంతరం రాంరెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ. చేశారు. తర్వాత విశ్వవిఖ్యాత ఆర్థిక శాస్త్ర అధ్యయన కేంద్రం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోలో ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రత్యేక
అధ్యయనం నిర్వహించి పట్టా స్వీకరించారు.
దేశానికి తిరిగివచ్చిన అనంతరం 1959లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకుడిగా చేరారు. బోధనలో, పరిశోధనలో ప్రతిభ వల్ల దశాబ్ద కాలంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యారు. సోషల్ సైన్సెస్ రీసెర్చ్ కౌన్సెలు దక్షిణ భారత ప్రాంతీయ కేంద్ర సంచాలక బాధ్యతలు 1973లో చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 48 ఏళ్ల వయస్సులోనే 1977లో వైస్ ఛాన్సెలర్గా బాధ్యతలు స్వీకరించారు. 1982
వరకు ఆ పదవిలో కొనసాగారు.
సమాజ విద్యావసరాలు పెరుగుతున్నాయని, సాంప్రదాయిక విద్యావిధానానికి ప్రత్యామ్నాయంగా మరో విద్యావిధానం ఉండాలని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వైన్ ఛాన్సెలర్గా పనిచేసేటప్పుడే దూర విద్యకు సంబంధించిన అధ్యయనాన్ని చేపట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సాగిన ఈ అధ్యయనం ఫలితంగానే దేశంలో<noinclude><references/>
{{rh|తెలంగాణ |153| తేజోమూర్తులు}}</noinclude>
3er6zo3s29hpscnlz0pkoknmhoe2ra6
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/175
104
211388
553363
551316
2026-04-16T16:12:40Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553363
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా ప్రస్తుతం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంగా
పేర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1982లో ఏర్పడింది. దూరవిద్యలో ఆచార్య రాంరెడ్డి
ప్రగతిశీల దృక్పథం వల్ల ప్రభుత్వం ఆయనను ఈ విశ్వవిద్యాలయానికి మొదటి వైస్ చాంస్లర్ గా బాధ్యతలు
నిర్వర్తించారు. ఈ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సెలర్గా దూర విద్య ప్రతిష్ట పెంచేందుకు నిరంతరం శ్రమించారు. ఉన్నత
విద్యావకాశాల విషయంలోనూ, ఉద్యోగావకాశాల్లోనూ సాంప్రదాయిక విద్యాభ్యాసం చేసిన వారితో సమానంగా అవకాశాల కల్పన ఆయన శ్రమ ఫలితమే.
దూరవిద్యలో ఆచార్య రాంరెడ్డి చేసిన అధ్యయనం, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపనలో కృషి,
ఆ విశ్వవిద్యాలయ మొదటి వైస్ ఛాన్సెలర్గా ఆయన అనుభవం జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఫలితంగా కేంద్రప్రభుత్వం జాతీయ స్థాయిలో సార్వత్రిక విద్యావిధాన రూపకల్పన చేయవలసిందిగా
ఆయనను కోరింది.
ఆరు నెలల కాలంలోనే ఆచార్య జి. రాంరెడ్డి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి రికార్డు సృష్టించారు. ఆయన నివేదిక ఫలితంగా 1985లో ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ విశ్వవిద్యాలయానికి కూడా మొదటి వైస్ ఛాన్సరల్గా ఆయనే నియమితులయ్యారు. ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. వివిధ కోర్సులను దూరవిద్యలో ప్రవేశపెట్టడంతోపాటు వాటి పాఠ్యప్రణాళిక రూపకల్పనలో ఆయన కృషి శ్లాఘనీయం. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఆయన సేవలు అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి.
సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ సోషల్ స్టడీస్క 1989 నుండి 1995 వరకు ఆచార్య రాంరెడ్డి చైర్మన్ గా వ్యవహరించారు. విద్యారంగంలో ఆయనకున్న అపార అనుభవం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 1991లో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యు.జి.సి.కి ఆయనను చైర్మన్ గా నియమించింది. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం అధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేసిన ఆయన దేశంలో విశ్వవిద్యాలయాల గుర్తింపు కోసం అత్యుత్తమ పద్ధతిని అమల్లోకి తెచ్చిన ఘనత సాధించారు. ఆయన కృషి వల్లే విశ్వవిద్యాలయాల గుర్తింపు కోసం 'నేషనల్ అసెన్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ద్వారా పారదర్శకమైన విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా దేశంలో ఉన్నత విద్యారంగంలో నాణ్యత పెంపుదలకు ఆయన చేసిన కృషి మరువలేనిది. దక్షిణాసియా ప్రాంతంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని రూపుదిద్దడం విశేషం.
విద్యారంగంలో అద్వితీయ ప్రతిభ కనబర్చిన ఆచార్య జి.రాంరెడ్డి ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్
సంస్థకు కూడా చైర్మన్గా సేవలందించారు.
దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ సార్వత్రిక విద్యావ్యవస్థకు రూపురేఖలు తెచ్చారు ఆచార్య రాంరెడ్డి. ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సార్వత్రిక విద్యావ్యవస్థను ఆయన అధ్యయనం చేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేసిన సదస్సులో సార్వత్రిక విద్యావ్యవస్థకు ఒక నమూనాను ఆయన ప్రదర్శించారు.
ఈ నమూనా వివిధ దేశాల్లో సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు పునాది వేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సలహాదారుగా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
ఆసియా దేశాల సార్వత్రిక విశ్వవిద్యాలయాల అసోసియేషన్కు ఆయన మొట్టమొదటి సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ దూరవిద్యామండలిలో చురుకైన సభ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ మండలికి శాశ్వత సభ్యుడిగా నియమితులయ్యారు.
విద్యారంగంలో కామన్వెల్త్ దేశాలు నెలకొల్పిన కామన్ వెల్త్ ఆఫ్ లర్నింగ్ సంస్థ స్థాపనలో ఆయన కృషి ఎంతో ఉంది. ఈ సంస్థ స్థాపన కోసం నియమించిన రెండు కమిటీల్లోనూ ఆయన సభ్యుడిగా పనిచేశారు. అనంతరం ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో భారతదేశ ప్రతినిధిగా నియమితులయ్యారు. బోర్డు సభ్యుడిగా భారతదేశానికి, సంస్థకు మధ్య వారధిగా పనిచేశారు. దేశంలోని విద్యా<noinclude><references/>
{{rh|తెలంగాణ |154| తేజోమూర్తులు}}</noinclude>
eityxmvmvbp84r09lk8vuusrabhq5uc
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/176
104
211389
553364
551317
2026-04-16T16:21:10Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553364
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సంస్థలకు, వృత్తివిద్యా సంస్థలకు మార్గదర్శిగా నిలిచారు. ఆ సంస్థకు 1989లో మొట్టమొదటి ఉపాధ్యక్షుడయ్యారు.
1991 వరకు ఆ పదవిలో కొనసాగారు.
కామన్వెల్త్ దేశాలకు విద్యారంగంలో అనేక సేవలందించిన ఆచార్య రాంరెడ్డి కామన్వెల్త్ దేశాల అవార్డును స్వీకరించేందుకు లండన్ వెళ్లి అక్కడే 1995 జూలై 2న మరణించారు.
విద్యారంగంలో విశేష కృషి చేసిన ఆచార్య జి.రాంరెడ్డికి అనేక గౌరవాలు దక్కాయి. ప్రతిష్టాత్మక రాజాలక్ష్మీ ఫౌండేషన్
అవార్డును 1994లో ఆయన పొందారు.
దూరవిద్యారంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నెలకొల్పిన దూరవిద్యా కేంద్రానికి ఆయన పేరే పెట్టారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆయన పేరిట స్మారక ఉపన్యాసాన్ని 1996 నుండి ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా జూలై రెండవ తేదీన నిర్వహిస్తోంది. ఆయన పేరిట స్మారక కేంద్రాన్ని కూడా 2008 జూలై రెండవ తేదీన నెలకొల్పింది. ఈ స్మారక కేంద్రంలో ఆచార్య జి. రాంరెడ్డికి సంబంధించిన ఆడియో, వీడియో క్యాసెట్లను రెండు వేల పై చిలుకు రిఫరెన్స్ మెటీరియల్ ఈ స్మారక కేంద్రంలో ఉంచడం విశేషం. విద్యావేత్తలకు, పరిశోధకులకు, విద్యార్థులకు, అధికారులకు దూరవిద్యారంగంలో విధాన నిర్ణేతలకు ఉపయోగపడేలా ఈ స్మారక కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం 1993లో ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. ఉత్తమ సేవలందించిన యువ సామాజిక శాస్త్రవేత్తలకు ప్రతి రెండేళ్లకోసారి ఆచార్య జి.రాంరెడ్డి పేరిట పురస్కారాన్ని అందిస్తోంది రాంరెడ్డి ట్రస్టు.
దళిత మహిళల జీవన స్థితిగతులపై పరిశోధనలు నిర్వహించిన పూనా విశ్వవిద్యాలయానికి చెందిన షర్మిల రేగె, దూర విద్యపై పరిశోధనలు చేసిన సంజయ్ మిశ్రా మొదలైనవారికి పురస్కారాలను అందజేసింది ఈ ట్రస్టు.
ఆచార్య జి.రాంరెడ్డి ప్రత్యేక తెలంగాణ డిమాండును సమర్థించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని విశ్లేషిస్తూ 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆంగ్ల పత్రిక 'మెట్రిక్ స్టీమ్’లో ఒక వ్యాసం రాశారు. తద్వారా జాతీయ స్థాయిలో రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరుపై ఆచార్య జి. రాంరెడ్డి పరిశోధనలు వెలుగురేఖలను ప్రసరింపజేశాయి. పేదరికంపై ప్రభుత్వం విధానాల ప్రభావాన్ని ఆయన అధ్యయనం చేశారు. తూర్పు గోదావరి, మెదక్ జిల్లాలో పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు, ప్రభుత్వ నిధుల వ్యయంపై ఆయన చేసిన అధ్యయనం కొత్త ఆలోచనలకు దారి చూపింది.
ఎన్ని పదవులు నిర్వర్తించినా, గొప్ప స్థాయిలో ఉన్నా విద్యార్థుల సంక్షేమంకోసం తపించినవారు ఆచార్య జి. రాంరెడ్డి. నిరుపేదల జీవితాలను బాగు చేయడం పట్ల ఆయనకు ఆర్తి ఉండేది. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరగాలని భావించేవారు. అధ్యాపకుడిగా ఆయన క్రమశిక్షణ పాటించేవారు.
యువతరానికి ఆదర్శప్రాయంగా ఉండేది ఆయన ప్రవర్తన. ఆయన మాట్లాడితే విన్నవారికి ఎంతో అవగాహన
ఏర్పడేదంటారు. అనేక విషయాల పట్ల పరిజ్ఞానాన్ని పెంచేదిగా ఉండేది ఆయన ఉపన్యాసం. చతురోక్తులతో
ఆయన సంభాషణ సాగేది. విద్యార్థుల్లో ఎంతో స్ఫూర్తి నింపేవారు. స్నేహితులతో సన్నిహితంగా మెలిగేవారు. గొప్ప
మానవతావాదిగా ఆయనను ఆయన మిత్రులు పేర్కొంటారు.
వివిధ పదవులు నిర్వహించి, పరిపాలనా బాధ్యతల్లో తలమునకలైనప్పటికీ విద్యాపరమైన విధులను నిర్వర్తించడం,
పరిశోధనల నిర్వహణ ఆయన మానలేదు. దూర విద్యలో పాఠ్యప్రణాళిక రూపకల్పన, పాఠ్యపుస్తకాల రచన మొదలైన
అంశాల్లో శ్రద్ధ కనబర్చారు.
ప్రభుత్వ విధానాలపై, దూర విద్యారంగంపై, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై అనేక పరిశోధనాపత్రాలను
ఆయన సమర్పించారు. పది గ్రంథాలను ప్రచురించారు. దూరవిద్యారంగంలో ఆయన రూపొందించిన గ్రంథాలనే
జాతీయంగానూ అంతర్జాతీయంగానూ పలు విశ్వ విద్యాలయాలు ఇప్పటికీ ప్రామాణికమైనవిగా పేర్కొంటున్నాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |155| తేజోమూర్తులు}}</noinclude>
jpjrpkb2kw4cswqj6riz0vxwppf4mg2
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/177
104
211390
553365
551318
2026-04-16T16:23:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553365
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
మారుమూల గ్రామంలో జన్మించి, అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు ఆచార్య రాంరెడ్డి. దేశ భవిష్యత్తుకు విద్యావకాశాల కల్పన ప్రధానమైనదిగా ఆయన భావించారు.
విద్యావకాశాలు లేని వారి కోసం దూరవిద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చి, లక్షలాది మందికి చదువుకునే అవకాశాన్ని
కల్పించారు. ప్రభుత్వ విధానాల అమలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాల రూపకల్పన, దూర విద్యావకాశాల కల్పన,
సామాజిక శాస్త్రాల అధ్యయనం మొదలైన విషయాల్లో దేశానికి వన్నె తెచ్చిన ఆచార్య జి. రాంరెడ్డి సేవలు కలకాలం
నిలుస్తాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |156| తేజోమూర్తులు}}</noinclude>
qedabnvk7r59rkxe3hywnjenxevs19b
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/178
104
211391
553366
551319
2026-04-16T16:33:27Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553366
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''46. గడియారం రామకృష్ణ శర్మ '''</p>}}
{{right|- డా౹౹ గన్నవరాజు గిరిజా మనోహర బాబు}}
<poem>
{{left margin|5em}}
పరమ పావని తుంగభద్ర స్రవంతియే
పరుషమ్ములడగించు గంగాభవానీ
రసలింగ రూపుడౌ బ్రహ్మేశ్వర స్వామి
యెల్లరదన్పు విశ్వేశ్వరుండు
శుభకామనులు దీర్చు జోగులాంబ శక్తి
అఖిల జీవుల బ్రోచు అన్నపూర్ణ
వాస్తు శిల్ప విశేష వైభవాఢ్యము హేమ
లాపురంచే కాశికపురంబు
భవ్య చౌషష్ఠి ఘట్ట సంభరిత మగుచూ
తలప శ్రీగిరి పశ్చిమద్వారమగుచు
వ్యాసముని సన్నుతికి పాత్రమైన భూమి
భద్రగుణరాశి దక్షిణ వారణాశి'</poem>
అని గొంతెత్తి గానం చేసి తెలంగాణలో ఏకైక శక్తిపీఠంగా వెలుగొందుతున్న, దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన ఆలంపుర ప్రాశస్త్యాన్ని చాటిన పండిత కవి కీర్తిశేషులు గడియారం రామకృష్ణ శర్మ గారు.
ఇవాళ ఆలంపురాలోని అపురూప ఆలయాలన్నీ విశ్వమంతా ప్రాచుర్యం పొందడానికి అవసరమైన చారిత్రక నేపథ్యాన్ని పలు మార్గాల్లో అందించిన మాన్యులు ప్రముఖ చారిత్రక విషయ పరిజ్ఞాన కవి, విమర్శకులు, మహావక్తలు బ్రహ్మశ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు.
పాంచజన్యం (కవితా సంపుటి), చంద్రహాస, కువలయానంద సారం, భారతీయ వాస్తు విద్య, కన్నడపు చిన్నకథలు వంటి పలు గ్రంథాల్ని రచించి తెలుగు పాఠక లోకానికి అందించిన బ్రహ్మశ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు తెలుగు దేశాన సుప్రసిద్ధులైన పండిత వర్యులు. వారి ప్రతిభ బహుముఖీనమైనది. అనేక కార్యక్షేత్రములకు వారి అసమాన ప్రతిభ కారణంగా చెప్పలేనంత మేలు జరిగింది. పలు వేదికలకు వ్యాపించిన వారి ప్రతిభ ఆయా వేదికలకే వన్నె తెచ్చింది. సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలకు విస్తృత సేవలందించిన వారి జీవితం ప్రతివ్యక్తి విధిగా అధ్యయనం చేసి నేర్చుకోవలసిన ఒక పాఠ్యాంశం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మహోజ్వల చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న రాయలసీమలో జన్మించిన బ్రహ్మశ్రీ గడియారం వారు చిన్నవయసులోనే తెలంగాణకు వచ్చి ఇక్కడే స్థిరపడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆలంపురాతో పాటు యావత్ తెలంగాణకు తమ సేవలను విస్తరింపజేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన “కదిరి”లో శ్రీ కాలయుక్తి నామ ఫాల్గుణ శుద్ధ చవితి (06.03.1919)న సుప్రసిద్ధ జ్యోతిష్యులు శ్రీ గడియారం జ్వాలాపతి శాస్త్రి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వారి ప్రాథమిక విద్య<noinclude><references/>
{{rh|తెలంగాణ |157| తేజోమూర్తులు}}</noinclude>
6qbijwni12crudxfa2frwbvsdru6vah
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/179
104
211392
553367
551320
2026-04-16T16:47:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553367
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
1929 వరకు కదిరిలోనే కొనసాగింది. తన చిన్నాన్న గారైన రామశర్మ గారి వద్ద తాడిపర్తిలో సంప్రదాయ విద్యగా అమరకోశం, కబ్బమంజరి, రఘువంతాది గ్రంథాలను అభ్యసించారు. వాటితో పాటు తెలుగు భాషా సాహిత్యంలోని
భారత, భాగవతాదులను కూడా చదవడం ప్రారంభించారు.
కొన్ని ప్రత్యేక కారణాల వల్ల శర్మ గారు మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపుర గ్రామానికి 1929లో అంటే వారి 11వ యేట వచ్చి మరణ పర్యంతం తమ నివాసంగా దక్షిణ వారణాశి అని ప్రసిద్ధిచెందిన ఆలంపురాన్ని స్థిరవర్చుకున్నారు. 1930-31లో శర్మగారు ఆలంపురాలోనే తమ మాధ్యమిక విద్యను పూర్తిచేశారు. దాంతో శర్మ గారి జీవితంలో పాఠశాల విద్య ముగిసినట్లే, "పుణ్యగుణ భూమియైన ఈ తెలంగాణ సీమ" శర్మ గారి వంటి మహా విద్వాంసుని తనవానిగా చేసుకుంది.
పాఠ్యశాల విద్య ఆగిపోయినా శర్మగారిలోని జ్ఞానతృష్ణ తననొక జిజ్ఞాసునిగా మార్చినది. ఆ తృష్ణ శర్మగారిని
మహావిద్వద్వరేణ్యులు, శతావధానులు, బ్రహ్మశ్రీ వేలూరి శివరామ శాస్త్రుల వారి సన్నిధికి చేర్చింది. వారివద్ద చేసిన
శిష్యరికం శర్మ గారి జీవితంలోనే ఒక మహత్తర ఘట్టం. సంప్రదాయక రీతిలో కావ్య నాటకాలంకార వ్యాకరణములను అభ్యసించిరి. శర్మ గారిలోని సహజమైన ప్రతిభా పాండిత్యాలు గురువు గారి ప్రేరణ కారణంగా రాణించే సమయం రావడం వారి సహచర్యం వల్ల శర్మగారిలో నూతన వికాసం కలగడం వారి జీవితంలోనే అతి పెద్ద మలుపు. ప్రతి విషయంలోనూ ఉన్నత ఆదర్శాలకు మాత్రమే స్థానం కల్పించడం, త్రికరణ శుద్ధితో జీవన యానాన్ని సాధించడం, ఉత్తమ విలువలకు పెద్దపీట వేయడం, మానవతా దృక్పథానికి అంకితం కావడం వంటి సలక్షణాలు శర్మగారికి గురువు గారి వలన కలిగిన
సుగుణాలు. 1937 నుంచి 1939 వరకు శర్మ గారు శాస్త్రి గారి వద్ద శిష్యునిగా ఉండి పలు విషయాలపై విస్తృత
అవగాహనను పొందారు. పుత్రవాత్సల్య సమమైన వారి శిష్య వాత్సల్యం శర్మ గారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని
చూపించింది.
బ్రహ్మశ్రీ వేలూరి శివరామ శాస్త్రి గారి వద్ద నుంచి తిరిగివచ్చిన శర్మ గారు మరింత దీక్షతో వారు చూపించిన మార్గంలోనే విద్యార్ధన కృషి సాగించి పఠనాపాఠనాదులను కొనసాగించి తమలోని ప్రతిభకు మరింత వన్నెపెట్టిరి. కవితా కళను సాగిస్తూనే పాండితీ బలాన్ని కూడా పెంపొందింప చేసుకున్నారు. ఆంగ్ల, హిందీ, కన్నడాది భాషా సారస్వతాల అధ్యయనం చేసి స్వయంకృషితో ఎన్నో లోతులు సాధించారు.
అలంపురమే స్థిరనివాసంగా చేసుకున్న శర్మ గారు అప్పటికే తాలూకాలో ప్రసిద్ధమైన గ్రంథాలయాలుగా పేరుబడ్డ ఉండవెల్లి లోని సరస్వతీ గ్రంథాలయంలోనూ, ఆలంపురాలోని రామకృష్ణారెడ్డి స్మారక గ్రంథాలయంలోనూ వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి తమ వైదుష్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఈ సమయంలోనే శర్మ గారు తమ చదువుతో పాటు.. స్వీయానుభావం వలన, స్వయంకృషి వలన అనేక విద్యా విషయాలతో పాటు.. భావి జీవితానికి ఉపయుక్తములయ్యే పలు కార్యములకు సంబంధించిన విశేష జ్ఞాన సముపార్జన చేసి సమయాన్ని సద్వినియోగపర్చుకున్నారు.
కేవలం సాహిత్యవేత్తగానే గాక, శర్మ గారు ఒక చరిత్ర పరిశోధకునిగా, వాస్తు, శిల్ప, లిపి, శాస్త్రాదులందు అభిరుచిగల జిజ్ఞాసునిగా తమను తాము మలుచుకొని ఆయా రంగాలలో అధికంగా పరిశ్రమించి జ్ఞాన సముపార్జనం చేశారు. వీటితోనే సరిపెట్టుకోక.. నాటక కళారంగ సేవ, సమాజ సేవ, గ్రంథాలయోద్యమ నిర్వహణ, భాష ప్రచారోద్యమ సేవ వంటి పలు రంగాలకు తమ సేవలను విస్తరించారు.
1940-59 మధ్యకాలంలో నాటక రంగానికి విస్తృత సేవలందించారు. అనేక నాటక ప్రదర్శనలు నిర్వహించి అలంపురాలో 'ఆంధ్ర యువజన నాట్యమండలి'ని స్థాపించి దర్శకులుగా, నటులుగా హరిశ్చంద్ర, శ్రీకృష్ణ, బిల్వమంగళ, ఖడ్గ నారాయణాది పాత్రలను తామే ధరించి తెలుగు నేలపై విశేష ఖ్యాతినొందారు.
నాటి నిజాం ఏలుబడిలో తెలుగును, తెలుగుదనాన్ని మరిచిన ప్రజలకు తెలుగు పరిమళాలను వెదజల్లే ప్రయత్నమే
ఆంధ్రోద్యమమై వ్యాప్తి చెందింది. స్వాతంత్ర్యోద్యమంలో మిక్కిలి ఉత్సాహంగా పాల్గొంటున్న శర్మ గారు అంతకు
రెండింతల ఉత్సాహంతో ఆంధ్రోద్యమంలోనూ పాల్గొన్నారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |158| తేజోమూర్తులు}}</noinclude>
o08sgd3zhp6mknw8yk6yag2d1j7zdsp
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/180
104
211393
553417
551321
2026-04-17T06:05:12Z
A.Murali
3019
553417
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
ఉద్యమోప జీవియైన శర్మ గారు కొన్నాళ్లు ఆలంపుర తాలూకా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఆ సంస్థకు ఇతోధికసేవలందించారు. జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్లో కూడా వారు సభ్యులే.
ఆంధ్రోద్యమంతో పాటు.. గ్రంథాలయోద్యమంలోనూ చురుకుగా పనిచేసిన శర్మ గారి కృషి అసాధారణం. 1940 నుంచి 1956 వరకు ఈ ఉద్యమాలే ఊపిరిగా శర్మ గారు పనిచేశారు. నైజాం వ్యతిరేక పోరాట కార్యక్రమంలో రహస్య రేడియో కేంద్రాన్ని కూడా నడిపిన గొప్ప కార్యశీలి రామకృష్ణ శర్మ గారు. త్యాగాలకు వెనుకాడకుండా పట్టుదలతో ఈ ఉద్యమాలలో మమేకమై పనిచేసిన శర్మగారు స్వాతంత్య్రానంతరం రాజకీయాల్లో కల్మషాలకు విసిగి ఆ రంగాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు.
వారిలోని ప్రధాన కోణం సాహిత్యం. తమలోని ప్రతిభా కార్యదక్షతలకు తోడైన మరికొందరు ఔత్సాహికులైన పెద్దల
సహకారంతో "ఆంధ్ర సారస్వత పరిషత్"ను హైదరాబాద్లో ప్రారంభించారు. ప్రారంభం నుంచి సాన్నిహిత్యం ఉండుట
కారణంగా దాదాపు తన జీవితపు చివరి అంచుల వరకు ఆ సంస్థకు శాఖా కార్యదర్శిగా, కేంద్ర సంస్థ ప్రచారకులుగా,
కార్యవర్గ సభ్యులుగా, పరీక్ష కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా పలు స్థాయిల్లో తమ విశిష్టమైన సేవలందించి దాని విస్తృతికి తమవంతు సహకారాన్ని అందించారు.
పత్రికా రంగం పట్ల ఆసక్తి ఉన్నవారు శర్మగారు. 1950-53 మధ్యకాలంలో "సుజాత" మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. "తెలంగాణ సంచిక” “సప్తమ వార్షికోత్సవ సంచికలుగా వారి సంపాదకత్వంలో వెలువద్ద ప్రత్యేక సంచికలు. నేటికీ పలువురి ప్రశంసలకు పాత్రమవుతూనే ఉన్నాయి.
వారి మరో ప్రధాన రంగ చరిత్ర. విశేషమైన చరిత్ర కలిగిన ఆలంపురాలోని శ్రీ బాలబ్రహ్మేశ్వర దేవస్థానానికి ట్రస్టు బోర్డు అధ్యక్షులుగా 1954 నుంచి కొన్ని దశాబ్దాల పాటు గణనీయమైన సేవలందించారు గడియారం వారు. అసాధారణ శిల్ప సంబంధితములైన ఈ ఆలయాల అభివృద్ధి కొరకు పాటుపడ్డ శర్మగారి దక్షత అపూర్వం. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులో మునిగిపోవలసిన ఈ క్షేత్రమును, ఇక్కడి ఆలయాలను బహు కష్ట ప్రయాసలకోర్చి వాటి రక్షణకై తీవ్ర కృషిసల్పి సఫలులైనారు. వారి సఫలత్వానికి నిలువెత్తు సాక్ష్యమై చుట్టూ కనిపించే రక్షణ కుడ్యము.
కీర్తిశేషులు గడియారం రామకృష్ణ శర్మగారు తమ 18వ యేటనే చంద్ర హాసోపాఖ్యానం అనే పద్యకావ్య రచన చేసి సాహిత్య రంగంలోకి అడుగుపెట్టారు. అలంపుర శిథిలములు, దక్షిణ వారణాశి ఆలంపుర క్షేత్రం వంటి చరిత్ర సంబంధించి రచనలతో పాటు.. భారతదేశపు చరిత్ర, ప్రపంచ రాజ్యముల వంటి గ్రంథములను వారు అందించారు. మన వాస్తు సంపదను గురించి వారు రాసిన గ్రంథము ఆ శాస్త్రంలో శర్మ గారికి ఉన్న పాండిత్యానికి నిదర్శనం. భారతీయ వాస్తు శిల్ప విజ్ఞానం అను గ్రంథము కూడా ఈ కోవలోనిదే. చరిత్ర పరిశోధన మాత్రమే కాక.. శాసన పరిశోధనలోనూ పరిణత ప్రజ్ఞ కలిగిన శర్మ గారు వినయాధిత్యుని పల్లెపాడు తామ్ర శానసం తెలంగాణ శాసనములు (రెండో భాగం) కూడా వెలువరించారు. వారు కన్నడం నుంచి అనువదించిన బి.ఎం. శ్రీ కంఠయ్య గారి గదాయుద్ధ నాటకమునకు 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. కన్నడంలోని చిన్న కథలను కూడా వారు అనువదించారు. వారికి తెలుగు సిరి పాంచజన్యములు మనోజమైన పద్యకావ్యములు. బాలబాలికపై వారు 'వీరగాథలు' అనే కథా సంపుటిని కూడా
వెలువరించారు. ఇంకా పలు అముద్రిత గ్రంథాలుగా వారి రచనలు మిగిలిపోయాయి. విస్తృత సాహిత్య సేవ వారి
జీవితంలో ప్రధాన భాగం. వారు నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి ఎన్నోచోట్ల విరివిగా సాహిత్య సాంస్కృతిక, చారిత్రక విశేషాలపై వందలాది ప్రసంగాలు చేసి ఒక గొప్ప చైతన్యాన్ని కలిగించారు.
వీరిలోని కార్యదక్షతకు, మేధాశక్తికి అబ్బురపడిన అనేక సంస్థలు వారి సేవలను ఉపయోగించుకున్నాయి. వారు 1965 నుంచి 1975 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులు. 1968-70లలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు. 1962 నుంచి దాదాపు ఒక దశాబ్ద కాలం వారు గ్రంథాలయ సంస్థ సభ్యులు. 1970 ప్రాంతంలో ఆంధ్రోద్యమ చరిత్ర నిర్మాణ సంఘంలో సభ్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం<noinclude><references/></noinclude>
fypadz78y7j7vu8mrs04grf3oly25ts
553419
553417
2026-04-17T06:06:19Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553419
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఉద్యమోప జీవియైన శర్మ గారు కొన్నాళ్లు ఆలంపుర తాలూకా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఆ సంస్థకు ఇతోధికసేవలందించారు. జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్లో కూడా వారు సభ్యులే.
ఆంధ్రోద్యమంతో పాటు.. గ్రంథాలయోద్యమంలోనూ చురుకుగా పనిచేసిన శర్మ గారి కృషి అసాధారణం. 1940 నుంచి 1956 వరకు ఈ ఉద్యమాలే ఊపిరిగా శర్మ గారు పనిచేశారు. నైజాం వ్యతిరేక పోరాట కార్యక్రమంలో రహస్య రేడియో కేంద్రాన్ని కూడా నడిపిన గొప్ప కార్యశీలి రామకృష్ణ శర్మ గారు. త్యాగాలకు వెనుకాడకుండా పట్టుదలతో ఈ ఉద్యమాలలో మమేకమై పనిచేసిన శర్మగారు స్వాతంత్య్రానంతరం రాజకీయాల్లో కల్మషాలకు విసిగి ఆ రంగాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు.
వారిలోని ప్రధాన కోణం సాహిత్యం. తమలోని ప్రతిభా కార్యదక్షతలకు తోడైన మరికొందరు ఔత్సాహికులైన పెద్దల
సహకారంతో "ఆంధ్ర సారస్వత పరిషత్"ను హైదరాబాద్లో ప్రారంభించారు. ప్రారంభం నుంచి సాన్నిహిత్యం ఉండుట
కారణంగా దాదాపు తన జీవితపు చివరి అంచుల వరకు ఆ సంస్థకు శాఖా కార్యదర్శిగా, కేంద్ర సంస్థ ప్రచారకులుగా,
కార్యవర్గ సభ్యులుగా, పరీక్ష కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా పలు స్థాయిల్లో తమ విశిష్టమైన సేవలందించి దాని విస్తృతికి తమవంతు సహకారాన్ని అందించారు.
పత్రికా రంగం పట్ల ఆసక్తి ఉన్నవారు శర్మగారు. 1950-53 మధ్యకాలంలో "సుజాత" మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. "తెలంగాణ సంచిక” “సప్తమ వార్షికోత్సవ సంచికలుగా వారి సంపాదకత్వంలో వెలువద్ద ప్రత్యేక సంచికలు. నేటికీ పలువురి ప్రశంసలకు పాత్రమవుతూనే ఉన్నాయి.
వారి మరో ప్రధాన రంగ చరిత్ర. విశేషమైన చరిత్ర కలిగిన ఆలంపురాలోని శ్రీ బాలబ్రహ్మేశ్వర దేవస్థానానికి ట్రస్టు బోర్డు అధ్యక్షులుగా 1954 నుంచి కొన్ని దశాబ్దాల పాటు గణనీయమైన సేవలందించారు గడియారం వారు. అసాధారణ శిల్ప సంబంధితములైన ఈ ఆలయాల అభివృద్ధి కొరకు పాటుపడ్డ శర్మగారి దక్షత అపూర్వం. శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టులో మునిగిపోవలసిన ఈ క్షేత్రమును, ఇక్కడి ఆలయాలను బహు కష్ట ప్రయాసలకోర్చి వాటి రక్షణకై తీవ్ర కృషిసల్పి సఫలులైనారు. వారి సఫలత్వానికి నిలువెత్తు సాక్ష్యమై చుట్టూ కనిపించే రక్షణ కుడ్యము.
కీర్తిశేషులు గడియారం రామకృష్ణ శర్మగారు తమ 18వ యేటనే చంద్ర హాసోపాఖ్యానం అనే పద్యకావ్య రచన చేసి సాహిత్య రంగంలోకి అడుగుపెట్టారు. అలంపుర శిథిలములు, దక్షిణ వారణాశి ఆలంపుర క్షేత్రం వంటి చరిత్ర సంబంధించి రచనలతో పాటు.. భారతదేశపు చరిత్ర, ప్రపంచ రాజ్యముల వంటి గ్రంథములను వారు అందించారు. మన వాస్తు సంపదను గురించి వారు రాసిన గ్రంథము ఆ శాస్త్రంలో శర్మ గారికి ఉన్న పాండిత్యానికి నిదర్శనం. భారతీయ వాస్తు శిల్ప విజ్ఞానం అను గ్రంథము కూడా ఈ కోవలోనిదే. చరిత్ర పరిశోధన మాత్రమే కాక.. శాసన పరిశోధనలోనూ పరిణత ప్రజ్ఞ కలిగిన శర్మ గారు వినయాధిత్యుని పల్లెపాడు తామ్ర శానసం తెలంగాణ శాసనములు (రెండో భాగం) కూడా వెలువరించారు. వారు కన్నడం నుంచి అనువదించిన బి.ఎం. శ్రీ కంఠయ్య గారి గదాయుద్ధ నాటకమునకు 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. కన్నడంలోని చిన్న కథలను కూడా వారు అనువదించారు. వారికి తెలుగు సిరి పాంచజన్యములు మనోజమైన పద్యకావ్యములు. బాలబాలికపై వారు 'వీరగాథలు' అనే కథా సంపుటిని కూడా
వెలువరించారు. ఇంకా పలు అముద్రిత గ్రంథాలుగా వారి రచనలు మిగిలిపోయాయి. విస్తృత సాహిత్య సేవ వారి
జీవితంలో ప్రధాన భాగం. వారు నెల్లూరు, కర్నూలు, హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి ఎన్నోచోట్ల విరివిగా సాహిత్య సాంస్కృతిక, చారిత్రక విశేషాలపై వందలాది ప్రసంగాలు చేసి ఒక గొప్ప చైతన్యాన్ని కలిగించారు.
వీరిలోని కార్యదక్షతకు, మేధాశక్తికి అబ్బురపడిన అనేక సంస్థలు వారి సేవలను ఉపయోగించుకున్నాయి. వారు 1965 నుంచి 1975 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులు. 1968-70లలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు. 1962 నుంచి దాదాపు ఒక దశాబ్ద కాలం వారు గ్రంథాలయ సంస్థ సభ్యులు. 1970 ప్రాంతంలో ఆంధ్రోద్యమ చరిత్ర నిర్మాణ సంఘంలో సభ్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం<noinclude><references/>
{{rh|తెలంగాణ |159| తేజోమూర్తులు}}</noinclude>
fkngiaisibp8t5o6n3dfxt08np52gvg
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/181
104
211394
553420
551322
2026-04-17T06:10:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553420
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అకాడమిక్ కౌన్సెల్లో 1970 నుంచి సభ్యునిగా సేవలందించారు. ఇవి మాత్రమే కాక ఆలంపుర తాలూకాలోని రైతుల కొరకు కృషిచేసి రైతులందరినీ సంఘటితపర్చి "అలంపుర వ్యవసాయ సంఘాన్ని" ఏర్పర్చిరి.
వీరి ఆత్మకథ "శతపత్రం" 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న ప్రశవ్య గ్రంథం. 1977లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరిని విశిష్ట సభ్యులుగా గుర్తించి ఘన సన్మానాన్ని అందించడం శర్మ గారి సాహిత్య వ్యకిత్వానికి ఒక గొప్ప ఉదాహరణ.
వీరిలోని మరో ఘనమైన పార్శ్వం సంఘ సంస్కరణ. మూఢాచారాలను తీవ్రంగా వ్యతిరేకించే శర్మగారు 1945 నుంచి 1965 వరకు స్త్రీ జనాభ్యుదయం కొరకు ఒక మహాసంస్థ వలె కృషిచేశారు. స్వయంగా వితంతు వివాహం చేసుకున్న కర్మ గారు ఆ స్ఫూర్తితో ఆ రోజుల్లో హైందవ బాలవితంతువుల వివాహాలు తాము దగ్గరుండి జరిపించడమే గాక.. ఎదిరించిన పండితులతో శాస్త్ర వాదములు చేసి పునర్ వివాహములు శాస్త్ర సమ్మతములేనని నిరూపించు కున్నారు. అలంపురాలో అనాథ స్త్రీల కొరకు ప్రత్యేక విద్యాలయం స్థాపించి హిందూ, ముస్లిం, క్రైస్తవ విద్యార్థినులకు శిక్షణ ఇప్పించారు. దానివల్ల పలువురు స్త్రీలు
జీవనోపాధి పొందడం శర్మ గారి కృషికి ఫలితం.
గడియారం రామకృష్ణ శర్మగారి జీవితం ఒక మహాత్ముని జీవితం వంటిది. స్వాభిమానంతో స్వతంత్ర జీవనాన్ని గడిపి తాము జీవించినంత కాలం లోకోపకారమే లక్ష్యంగా సాగిన మాన్యులు శ్రీ రామకృష్ణ శర్మగారు 2006, జూలై 25వ తేదీన తుదిశ్వాస విడిచారు. భౌతికంగా శర్మ గారు లేకున్నా తెలుగు నేలపై సాహితీ సంస్కృతులు విలసిల్లినంత కాలం శర్మ గారు చిరంజీవులే.<noinclude><references/>
{{rh|తెలంగాణ |160| తేజోమూర్తులు}}</noinclude>
0dbak0t1ju6ibn0dh14ech2ufrt8ari
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/182
104
211395
553529
551323
2026-04-17T09:25:22Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553529
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''47> గణపతి రామచంద్రరావు '''</p>}}
{{right|- గన్ను కృష్ణమూర్తి}}
:జన్మస్థలం : ఇబ్రహీంపట్నం
:పుట్టినతేదీ : 25.07.1940 పరమపదించినది 12.10.2005
:తల్లిదండ్రులు : కీర్తిశేషులు యమునా బాయి, లక్ష్మీకాంతరావు
:వృత్తి : వ్యవసాయం
:ప్రవృత్తి : సాహిత్యం (అధ్యయనం, పరిశీలన, పరిశోధన, విమర్శ లేఖనం, మననం, ప్రవచనం, చర్చాగోష్ఠి)
'''రచనలు '''
ఆముద్రితాలు 1. శ్రీనివాస శతకం (సీసములు) 2. సంతోషీమాత శతకం (మంజరులు) 3. వేంకటేశ్వర శతకం (చంపకోత్పల మాల) 4.లక్ష్మీకాంతం (మంజరులు) 5. ధర్మపురి లక్ష్మీ నరసింహ శతకం (మధ్యాక్కరలు)
6. బాసర జ్ఞాన సరస్వతీ శతకం (మత్తకోకికలు) 7. శ్రీచక్ర శతకం (శార్దూల మత్తేభములు) 8. వరదాచార్యోదాహారణం
9. హృద్యపద్య కావ్య సంహిత 10. శ్రీ దుబ్బ రాజేశ్వర శతకం (తేటగీతలు)
ఆముద్రితాలు 1. గాయత్రీ శతకం (స్రగ్విణులు) 2. నీలకంఠేశ్వర శతకం (శార్దూల మత్తేభములు) 3. ఉమామహేశ్వర శతకం (సుగంధులు) 4. శ్రీ గణేశ శతకం (గేయాలు) 5. ఆంజనేయ శతకం (తేటగీతులు) 6. సుకవి రాట్యూర్తి శతకం (ఆటవెలదులు) 7. కవి రామేశ శతకం (కందములు) 8. బంధుకవిత్వ శతకం (అనేక వృత్తములు)
9. సరస్వతీదేవి ఉదాహరణం 10. మధుపానం (సప్తా శ్వాస గేయమహా ప్రబంధం)
నేను నిజామాబాద్లో (1929-89) వాణిజ్య శాస్త్రోపన్యాసకునిగా పనిచేస్తున్న రోజుల్లో వారితో నాకు పరిచయమేర్పడింది. అప్పుడు శ్రీ తిరునగరి నరసింహులు గారిచే స్థాపించబడి, నడిపించబడుతున్న 'నిజామాబాద్ జిల్లా రచయితల సంఘం' వేదికపై నా రెండవ కార్యం 'కవితా కాళించి' డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారిచే ఆవిష్కరించబడింది. ఆ సందర్భంగానే వీరితో మొదటిసారిగా నాకు పరిచయమేర్పడింది.
నిజం చెప్పాలంటే వారిని చూస్తే మహామహులకు దడపుట్టేది. సాహిత్య పీఠాధిపతులకు సైతం వీపులో వణుకు పుట్టేది. ఆపై చెమటలు పట్టేవి. ఒక పులినో, సింహాన్నో చూసినట్లుగా భయపడేవారు. 'మా జోలికి రాబోకండి! అన్నట్లుగా వేదికలపై కనబడగానే తమ రెండు చేతుల్ని జోడించి వినయ విధేయతలతో నమస్కరించేవారు. కారణం ఎక్కడ, ఏ దోషం కనపడినా, నిర్భయంగా, నిర్మొహమాటంగా ముఖం మీదే కడిగేసే వారాయన. ఆయన వాగ్దాటి కూడా<noinclude><references/>
{{rh|తెలంగాణ |161| తేజోమూర్తులు}}</noinclude>
r0cwj67ge96wsd548oc9l49lqd05wei
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/183
104
211396
553530
551324
2026-04-17T09:39:20Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553530
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అనుపమానం. ఏ విషయంపైనైనా తడుముకోకుండా, తట్టుకోకుండా అనర్హలంగా మాట్లాడగలిగేవారు. ఒక్కమాటలో ఆయన ప్రచండ భాస్కరుడే
వారెప్పుడైనా, ఎక్కడైనా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేసేవారు. దీనికొక ఉదాహరణ. ఓసారి ఓ మహాకవి తన కావ్యాన్ని వీరికిచ్చి అభిప్రాయం. రాసిమ్మన్నారు. వార్తా పుస్తకంలోని తమ ముందు మాటలో సృష్టి త్రిముఖాత్మాకం అని రాసిఇచ్చారు. వీరి వేగచూపు దానిపై పడింది. వీరు వారిని నిర్మొహమాటంగా ఖండిస్తూ "సృష్టి త్రిమూఖాత్మాకం కాదు చతుర్ముఖాత్మకం. కారణం సృష్టికర్త అయిన బ్రహ్మ చతుర్ముఖుడు కాబట్టి అంటూ రాసిచ్చాడు.
అలాగే మరోమారు అదే మహాకవి గారు 'అభినవ పోతన వానమాముల వరదాచార్యులపై రాసిన కవితా ఖండిక ఒకటి వీరి దృష్టికి వచ్చింది. అందులో వారు 'గుండెలోన రసవదర్ధ కాండమ్ములు గలవాడా! గొంతులోన పుంస్కోకిల కూజితములు గలవాడా! నిన్నేమని వర్ణింతును అన్నా ! వరదన్నా ! అంటూ రాశారు వారు.
'అం... ఏమున్నది౦దులో? నీ గుండెలో కల్లుకుండులున్నాయని చెబుతున్నాడు కవి' అన్నాడట వెక్కిరింతగా తన శిష్యులతో వీరు. అది ఈ నోటా, ఆ నోటా పాకి ఆ మహాకవుల వరకు చేరిందట. ఆయన తలపట్టుకున్నాట్టు, ఏమిటండి ! అని శిష్యులనడిగితే 'నిజమే వారు చెప్పేది నిజమే ! ఇలా మనకు చెప్పేవారు లేరు' అని బాధపడ్డారట.
ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు వారెన్ని చేసి ఉంటారో చెప్పలేం. వారు దర్శించే విధానమే వేరుగా, విలక్షణంగా ఉండేది. దానికి మరో ఉదాహరణ.
నేను 'అంతరంగం' పేరిట కొన్ని మినీ కవితల్ని రచించి ప్రచురించాను. వాటిపై వారి అభిప్రాయాన్ని తీసుకున్నాను. అందులో ఒక కవిత ఇలా ఉంది -
'ఆకాశంలో అక్షరాల నక్షత్రాలు ! చివరన ఫుల్ స్టాప్ గా చంద్రుడు. ఈ ఉత్తరం ఎవరికో! ? అనగా ఆకాశంలో నక్షత్రాలు వరుసగా ఒక వాక్యరూపంలో ఉన్నామని, వాని చివర ఒక పూర్ణబిందువు చంద్రుడున్నాడని, ఈ ఉత్తరం లేదా లేఖ ఎవరి కోసమో కదా !' అని ఆశ్చర్యపోవడమిది.
కానీ గణపతి గారెలా దానిపై స్పందించారో చూడండి.
'ఈ ఉత్తరం (అనగా ఉత్తరధ్రువం) దక్షిణ ధ్రువవాసులు కొరకు' అని రాశారు. నేనాశ్చర్యపోయాను. ఇలా కూడా
అర్థాన్ని చెప్పుకోవచ్చునా ? అని.
ఇలా ఆయన ప్రజ్ఞ ఆమోఘం. బహుముఖీనం. పద్యం రాశారు. గేయం రాశారు. ఉదాహరణ కావ్యాల్ని, ఖండకావ్యాల్ని రాశారు. అచ్చతెనుగులోనూ, హలంత తెలుగులోనూ కవిత్వం రాశారు. ఒకటీ.. అరా కాదు. మూడు లక్షణ గ్రంథాల్ని రచించారు. అవి 1. పొడశాలంకాల శబ్ద కళాశాస్త్రం 2. గేయ ఛందశ్శాస్త్రం 3. బంధ కార్య లక్షణం శాస్త్రం, అంతేకాదు... ప్రాచీన రసశ్శాస్త్రాన్ని తిరస్కరిస్తూ 'రసభూమిక' పేరిట రసజ్ఞాన సర్వస్వమును తెలిపే గ్రంథాన్ని
సైతం రచించమన్నారు వీరు. ఆపై ఇల్లిల్లూ తిరిగి సమాచారాన్ని సేకరించి కరీంనగర్ మండల చరిత్ర, మెట్పల్లి
సమితి చరిత్రలను సైతం వ్రాసియున్నారు. నిజామాబాద్ జిల్లా చరిత్ర కోసం కూడా కొంత కృషిచేశారు వీరు. తెలంగాణకు చెందిన అనేక కవిపండితులను సన్మానించి, సత్కరించి 'ఆవర కృష్ణ దేవరాయలన్న' బిరుదును సొంతం చేసుకున్నారు. వందలాది కవుల కావ్యాల్ని పరిష్కరించారు. అనేక సాహిత్య సంస్థలతో, కవి పండితులతో సత్సంబంధాల్ని ఏర్పర్చుకున్నారు. అనేక సంస్థల్లో అధ్యక్షులుగా, గౌరవాధ్యక్షులుగా సలహాదారులుగా ఉన్నారు. అనేక
వేదికలపై ముఖ్యఅతిథిలుగా, కార్యక్రమ అధ్యక్షులుగా వ్యవహరించారు.
అంతేనా.. ! భగవద్గీత అంతరార్థాన్ని ఆకళింపు చేసుకున్నారు. భగవద్గీత ఆయన నాల్యపై నడయాడేది. అంతేకాదు.. భగవద్గీతపై అవధానం చేయగల స్థాయికి ఎదిగారు. వీరు వ్రాసినన్ని చిత్రకవితలు, బంధగర్భ కవితలు మరొకరు వ్రాసిఉండరు. ఒకే పద్యంలో చతుర్విద కవిత్వములను చూపిన మహా మహుడీయన. అంతేనా! రోజుకొక శతకం చొప్పున పది శతకాలను రాసి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిన వారు. ఒకే ఒక అచ్చ తెనుగు ఏకాక్షర శబ్దాలతో, పంచవింశతి బంధాలతో రాసి<noinclude><references/>
{{rh|తెలంగాణ |162| తేజోమూర్తులు}}</noinclude>
7tk6vhuosirl1uq0im400fa3cvn28gh
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/184
104
211397
553532
551325
2026-04-17T09:50:05Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553532
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
చూపినవారు. షోడశ కళాపూర్ణమగు వీరి కవిత్వమందు పూర్వ మహాకవుల పద్యములు వెలవెలబోయేవి.
ఇలా వారు ఒక పండిత కవిగా, క్షణికులే కాక యోగవిద్యలోనూ గొప్ప సాధన చేసిన యోగపుంగవులు.1991లో హైదరాబాద్లో జరిగిన యోగ విద్యా పోటీల యందు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మహామహులు వీరు.
వీరు పంచ మహాకావ్యాలను లోతుగా అధ్యయనం చేశారు. ఉపనిషత్తులను అవపోసన పట్టినారు. ఆపై తమ చివరి రోజుల్లో జ్యోతిష్యంలోనూ సాధికారత సంపాదించినారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే పంచాంగకర్తలు సైతం వీరి వద్దకు వెళ్లి తమ సందేహాల్ని తీర్చుకొని వెళ్లేవారు.
కానీ వీరు వచన కవిత్వాన్ని కవిత్వంగా అంగీకరించే వారు కారు. అయినా అనేకమంది వచన కవులతో సత్సంబంధాల్ని కలిగి ఉండేవారు. హిందీ, ఉర్దూ, సాహిత్య సంస్థలతోనూ, సభ్యులతోనూ సంబంధాలు కలిగి ఉండేవారు. వారు ఏ ఊరికి వెళ్లినా కవిపండితుల్ని కలిసి తనివి తీరా మాట్లాడి కానీ తిరిగి వెళ్లేవారు కారు. వీరిలా ఎంతటి ప్రతిభావంతులైనా.. ఎదుటివారిలో ఏమాత్రం ప్రతిభ కనబడినా గొప్పగా స్పందించి ప్రశంసించేవారు. భుజం తట్టి ప్రోత్సహించే వారు. నేను రాసిన రామాయణ రహస్యాలు పేరిట దాదాపు రెండు సంవత్సరాలు సీరియల్గా ప్రచురించబడింది. ఇటీవల అది 'రామ్ కౌన్ హై ? రామయణ్ క్యా హై?" అన్నపేరిట వై.వి. రమణరావు గారితో అనువదింపబడి ముద్రింపబడినది కూడా. వీరు కేవలం నా వ్యాసాన్ని మాత్రమే చూశారు. చూచి.. ఒక సాగరంలా ఉప్పొంగిపోయారు.
ఆ తర్వాత ఇది 'రాముడంటే ఎవరు ? రామాయణ మంటే ఏమిటి ?' అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించబడి
మహామహుల ప్రశంసలెన్నింటినో అందుకున్నది. అప్పుడు వీరు లేరు.
వారి హృదయం ఎటువంటిదో, వారి స్పందన ఏ విధమైనదో.. ప్రపంచానికి చాటిచెప్పడానికే. అందుకే నేను అంటుంటాను. 'ఎదుటివాని ప్రతిభను గుర్తించడమూ ఒక ప్రతిభేనని' ఇలా అందులోనూ వీరు అత్యంత ప్రతిభావంతులే ! సందేహం లేదు.
మన తెలంగాణ ఆవిర్భావానికి పూర్వమే వీరు 'నా ''తెలంగాణ'యనే ఖండ కావ్యాన్ని రచించియున్నారు. దానిలోని ఒక పద్యాన్ని ఉదహరిస్తున్నాను చూడండి.
<poem>
{{left margin|5em}}
'నా తెలంగాణ కావ్యాంగన ముఖాంచత్కళా మూర్తి
నా తెలంగాణ శృంగార నాళిక మకరంద వర్తి
నా తెలంగాణ విజ్ఞాన నందనోద్యాన సూనమ్ము
నా తెలంగాణ భూలోక నాకమ్ము నాడు ప్రాణమ్యు
గతంలో ముఖాల్ని చూచి గౌరవించే సమాజం మనది.</poem>
పైరవీలకు పట్టంగట్టే సమాజం మనది. ప్రతిభా వ్యుత్పత్తులను పాతరేసే సమాజం మనది. అందువల్ల వీరికి తగినంత
గుర్తింపు లభించలేదు. ఏ విశ్వవిద్యాలయంలోనో, ఏ ఉన్నత సాహిత్య పీఠం మీదనో ఉండవలసిన వారు వీరు.
వీరి రచనలపై పరిశోధనలు జరపవలసిన అవసరం వీరి ప్రతిభా పాటవాలను రాబోవు తరాలకు అందజేయాల్సిన
బాధ్యత మన భుజస్కంధాలపై ఉన్నది.
వీరింకా జీవించి ఉంటే మరెన్ని అద్భుతాలను సృష్టించి ఉండేవారో.. ? వీరు లేని లోటు తీర్చలేనిది. వీరి ప్రతిభా
వ్యుత్పత్తుల్ని పొగడడానికి కారదరైనా మాటలు చాలవేమో ! అందువల్ల "పర్వయుగ కవి సమ్రాట్ అన్న వారి బిరుదు
సముచితమైనదే కాదు.. సార్థకమైనది కూడా!
వీరికి అంజలి ఘటిస్తూ.. శ్రీ ఎర్రాప్రగడ రామమూర్తి గారి పద్యంతో జేజేలు పలుకుదాం.
<poem>
{{left margin|5em}}
సర్వయుగ కవి సామ్రాట్టు జైత్రయాత్ర
చిత్రముల లోనికెలల్ల విచిత్రమగును
వర్తమాన మా దిశ నిరువైపులకిది
సర్వ కాలావధులు దాటి సాగిపోవు.</poem><noinclude><references/>
{{rh|తెలంగాణ |163| తేజోమూర్తులు}}</noinclude>
3m16cq7uvyn351bkkxuezy7kndxzo52
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/185
104
211463
553533
551483
2026-04-17T10:03:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553533
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''48. గోపాల్ రాజ్ భట్ '''</p>}}
{{right|-రాయప్రోలు రమణ}}
జానపద కళా చిత్రరూపశిల్పి “గోపాల్రాజ్ భట్”. చివరి నిజాం నవాబు పాలనా కాలంలో భారతదేశ స్వాతంత్య్రానికి ముందు తెలంగాణ ప్రాంతంలో వెన్నెల కిరణం జానపద కళపై ప్రసరించింది. వసంత మేఘమై వర్షించింది. గిరిజన, లంబాడీ, గోండు బలహీన వర్గాలు వారి వారి సంప్రదాయ పాట, ఆట. మాటకు గుర్తింపు గౌరవం కల్పించిన గోపాల రాజ్ భట్ చెన్నమాధవుని ఆ వెలుగు రేఖ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో జానపద కళకు బాటలు వేసిన మార్గదర్శి.
జానపద కళ అనే పదానికి విలువ, అర్థం తెలియని రోజుల్లో స్వయంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆదివాసీ, గిరిజన, లంబాడీ తెగల వారితో మమేకమై వారి సాంప్రదాయం, స్వభావం, వేషభాషలు అవగాహన చేసుకుని కొంత మెరుగులద్ది నగర పట్టణ ప్రాంతాలకు మార్గం పట్టించిన గోపాల్రాజ్ భట్ జానపద కళాబ్రహ్మగా గుర్తింపు పొందారు. వివిధ రాష్ట్రాల రాజధానుల్లోనే గాక దేశరాజధానిలో సైతం రిపబ్లిక్ డే. ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో గోపాల్ రాజ్ భట్ బ్బృందం. జానపద కళా ప్రక్రియలదే నాడు తొలిస్థానం.
1928 జూన్ 9న తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ తాలూకాలో కర్రేపల్లి గ్రామంలో జన్మించారు గోపాల్రాజ్ భట్. ఆరేళ్ళ వయస్సులోనే పగటి వేషాలు గట్టి అందరిని ఆశ్చర్యపరిచేవారు. తండ్రి వెంకట రామరాజు భట్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు కావడంవల్ల తెలుగు భాషా పరిజ్ఞానం అబ్బింది. బాబాయి చిత్రలేఖకుడు. గాయకుడు. ఆయనను అనుసరిస్తూ ఉండడంవల్ల సంగీత జ్ఞానం అబ్బింది.
1945లో ప్రీమెట్రిక్ పూర్తి చేసాడు. చిత్రలేఖనంపై మక్కువతో ఫైన్ ఆర్ట్స్ ఐదు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణుడయ్యాడు. హైదరాబాద్లోని ఉర్దూ షరీఫ్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న కాలంలో జానపద సాంప్రదాయం రీతులపై దృష్టి మళ్ళింది.
వివిధ ప్రాంతాల గిరిజన ఆదివాసీ తెగల ఆచార వ్యవహారాలు వారి సాంప్రదాయ కళలపై నికిత పరిశోధన చేసి ఆ కళలకు తన సంగీత పరిజ్ఞానం జోడించి చిత్రలేఖనం లోని మెళకువలతో జీవం తొణికిసలాడేలా కళాకారుల రూపాలను తీర్చిదిద్ది 1950 ప్రాంతం నుంచి భాగ్యనగరంతో పాటు ఇతర ప్రాంతాలలో జానపద కళలు లంబాడీ, గుస్సాడీ, గోండు థింసా, గురువాయలు తప్పెట గుళ్ళు, బోనాలు తదితర కళా ప్రక్రియల ప్రదర్శనలను నిర్వహించారు. స్వయంగా గోపాలరాజ్ వారితో కలిసి వర్తించేవారు.
చిత్రలేఖనంలో ఆరితేరిన చేయి అయినందున జానపద నర్తకుల రూపాలను చిత్రాలుగా రూపకల్పన చేయడంలో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ప్రఖ్యాత నటుడు పృథ్వీరాజ్ కపూర్ కూడా ఈయన రూపసృష్టికి<noinclude><references/>
{{rh|తెలంగాణ |164| తేజోమూర్తులు}}</noinclude>
meuzvkxkuxxalul8empbkk4oktam8ue
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/186
104
211464
553534
551484
2026-04-17T10:04:25Z
A.Murali
3019
553534
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అచ్చెరువు చెందారు. జానపద కళలల్లో గోపాలరాజ్ ప్రతిభకు
గుర్తింపుగా సంగీత నృత్యకళాశాలలో జానపద కళల తొలి
ఆచార్యునిగా నియమితులయ్యారు. తదనంతరం కాలంలో
తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత జానపద
కళాపీఠానికి తొలి అధిపతిగా నియుక్తులైనారు.
ప్రముఖ కవి డాక్టర్ సి. నారాయణరెడ్డి సహచర్యంలో
ఉర్దూ భాషా సాహిత్యంతోపాటు, తెలుగు భాషా సాహిత్యాన్ని
వంటపట్టించుకొని స్వీయ రచనలతో జానపద రూపకాలను
మలచారు. అప్పటి రాష్ట్ర సంగీత నాటక అకాడమీలో
సభ్యులుగా నృత్య అకాడమీ సంయుక్త కార్యదర్శిగా
సమైక్యాంద్రప్రదేశ్లోని జానపద కళావైభవాన్ని జాతీయ
అంతర్జాతీయ వేదికలపై నిలిపిన ప్రతిభాశాలి. గోపాల్రాజ్
భట్టును ఎరుగని గౌరవించని ప్రధానులు, రాష్ట్రపతులు నాడు
లేనరడం అతిశయోక్తికాదు.
నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ,
రాజీవ్
గాంధీ, పి.వి. నర్సింహారావు ప్రధానులు బాబూ
రాజేంద్రప్రసాద్, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ వివి
గిరి రాష్ట్రపతులు. ఆయన ప్రదర్శనలను వీక్షించి
అభినందించినవారే. దేశ సరిహద్దు నేపాల్ సైనికులను
ఉత్తేజితులను చేస్తూ జానపద నృత్యాలను 300 మందికి
పైగా కళాకారులతో నిర్వహించి జేజేలు అందుకున్న మహా
కళాస్రష్ట.
దేశంలోని అన్ని నగరాలతోపాటు పశ్చిమ, ఈశాన్య,
రాష్ట్రాలలోనూ ప్రదర్శనలివ్వడమేగాక అక్కడి ఆదివాసి
మూలవాసీయుల కళారూపాలను అధ్యయనం చేసి వారి
కళారూపాలను దేశంలోని అన్ని ప్రాంతాలకు పరిచయం
చేసిన సృజనశీలి, సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు
చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమిల్లి
జనార్దనరెడ్డి వంటి వారేకాక ఎన్టీఆర్ సైతం ప్రభుత్వోత్సవాల్లో
జానపద కళారూపాలపై గోపాల్రాజ్ను సంప్రదించేవారంటే
ఆయనకు జానపదంపై ఉన్న అవగాహన విశేష పరిజ్ఞానానికి
తార్కాణం.
తెలంగాణ జానపద కళారూపాలు డప్పు - చిందు,
యక్షగానం, గొల్లసుద్దులు, బతుకమ్మ, గోండు, థింసా,
బోనాలు, శారద కథలు వంటి కళారూపాలతోపాటు
రాజస్థాన్, జార్ఖండ్ మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల
జానపద నృత్యాలు గుమాల్, సంతాల్, కోయి, కుండియత్వాస్,
గెడ్డాలలో సైతం శిక్షణ ఇచ్చి ఆ కళారూపాలను దేశమంతటా
ప్రదర్శించారు. జాతి సమైక్యతకు సంస్కృతి కళల పరస్పర
అవగాహన సౌభ్రాతృత్వానికి వీరి ప్రదర్శనలు దోహదం
చేసేవి.
దేశరాజధాని ఢిల్లీలో రిపబ్లిక్స్డ్ డే ఉత్సవాల్లో 1952లోనే
తెలంగాణ బతుకమ్మ ప్రదర్శించిన ఘనత ఈయనదే.
లంబాడీ, గిరిజన తండాల వారిని హైదరాబాద్లోని తన
ఇంటిలో వసతి కల్పించి వారిని ప్రదర్శనలకు తీసుకెళ్ళడంతో
పాటు వారి జీవన శైలిలో మిళతమైన కళారూపాలను తన
శిష్యులు చూసి నేర్చుకునేవిధంగా గురుకులాలని
నిర్వహించిన గోపాల్రాజ్ భట్టు తన గృహానికి "జానపదం”
అని పెట్టుకున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ ప్రారంభ,
ముగింపు ఉత్సవాల్లో గోపాల్రాజ్ భట్టు 400 మంది
కళాబృందంతో ప్రదర్శించిన నృత్యాలు అపురూపం,
అపూర్వమని ప్రశంసలు అందుకున్నారు. పలు రాష్ట్రాల్లోని
జానపద అకాడమీలలో సభ్యునిగా జానపదమే జీవనంగా
ఆరు దశాబ్దాలు దేశీయ జానపద కళకు జీవితాన్ని అంకితం
చేసారు.
భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించి రాష్టేతర
ప్రాంతాల వారికీ శిక్షణనిచ్చి భవిష్యత్తు తరాలకు జానపదాన్ని
అందించిన క్రాంతిదర్శి, నాడు ప్రభుత్వ కార్యకలాపాల్లో
గోపాల్రాజ్ భట్టు బృందం జానపద నృత్యాలు తప్పనిసరి.
దక్కన్ రేడియో ప్రారంభోత్సవం రవీంద్రభారతి
ప్రారంభోత్సవం, ఉపగ్రహ దూరదర్శన్ ప్రారంభోత్సవంలతో
పాటు ప్రపంచ తొలి తెలుగు మహాసభల ప్రారంభోత్సవ
సందర్భంలో సినారె రచించిన తరతరాల తెలుగు వెలుగు
నృత్య రూపకంలో ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కన్న పోతన,
వాగ్గేయకారులు త్యాగయ్య, రామదాసు వంటి పాత్రల్లో
నటించి ప్రశంసలు అందుకున్నారు.
రాష్ట్రంలో సంగీత నాటక అకాడమీ ఆవిర్భావ
సందర్భంగా ప్రఖ్యాత నాట్యాచార్యులు వేదాంతం
సత్యనారాయణ శర్మ మోహినిగా కోరాడ నర్సింహారావు
A తెలంగాణ (165) తేజోమూర్తులు ఉం<noinclude><references/>
{{rh|తెలంగాణ |165| తేజోమూర్తులు}}</noinclude>
kgwpqoya70lccqkw4jgnjqogalezabj
పుట:Sangitarasataran022902mbp.pdf/19
104
212207
553347
553324
2026-04-16T12:05:03Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553347
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కన్య ౧ - మహాప్రపాదము (అని పుచ్చుకొని స్థానమును కేగును).
కన్య ౨ - {{left margin|5em}}<poem>గీ॥ నీల దొండపండుఁగోరుఁ ధోరంపుకీరంబు
నంబుజంబుఁగోరు హంసయెందు
కుసుమరసముఁగ్రోలఁ గోరుఁదుమ్మెదఱోఁడు
వారివారిరుచులు వేఱుగావె॥</poem> </div>
సర్వా — యువతీమణీ! ఈరత్న కంకణమునుగొనుము (ఆనియిచ్చును).
కన్య ౨ — (స్వీకరించి) మహాప్రసాదము (అని స్థానమును జేరును).
కన్య 3 - {{left margin|5em}}<poem>గీ॥ పూపజాబిలివలె మోముగల్గినగాని
వారిజాక్షికీరవాణియైన
కొలముగొప్పదైన కోరినసిరులున్న
గొనములేకయున్న వనితకాదు।</poem> </div>
సర్వా — పొలతీ, యీముత్యాలసరముగైకొనుము (అనియిచ్చును).
కన్య 3 — చిత్తముదేవా! (అనిపుచ్చుకొని స్థానమునుజేరును).
కన్య ౪ — {{left margin|5em}}<poem>గీ॥ కార్యమెంచువాఁడు శౌర్యవంతుఁడుగాఁడు
దీవిశాలుఁ డెపుడుఁ దెలిసెననఁడు
జ్ఞానియైనవాని జనులెఱుంగఁగ లేకు
నివురుగప్పియున్న నిప్పునుమ్ముః</poem> </div>
సర్వా - వధూమణీ! నీవాక్యములు కడుహృద్యములు. ఈరత్న హారముఁగైకొమ్ము
(అనియిచ్చుచున్నాడు).
కన్య ౪ — మహాప్రసాదము (అనిపుచ్చుకొని స్థానమునుజేరును).
సర్వా — ఇతరబాలికలారా! మీమీ బహుమానములు స్వీకరింపుఁడు॥
ఇతరకన్యలు - మహాప్రదము. ధన్యలమైతిమిదేవా! (అనిపుచ్చుకొని స్థానముఁదేరుదురు).
యశోధర - (చేతులుహృదయముననుంచి కనులెత్తిచూచి)
{{left margin|5em}}<poem>సీ॥ పొంగుచున్న ప్రేమపొరలిపైఁబడుగాని
దాచియుంచ నేరితరముగాదు
వెల్లిఒరిసియేఱువిచ్చలవిడిపారు
కడలిఁజేరినిలుచుఁగలకవిడుచు॥</poem> </div><noinclude><references/></noinclude>
44hg4ayjq3xao4ibp4xqrdgk1yfh9x8
పుట:Sangitarasataran022902mbp.pdf/20
104
212209
553351
2026-04-16T12:21:11Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
553351
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>సర్వా - (తనలో) ఔరా! నిర్మలాంగిసౌగుణ్యమేమి? ఈ లెక్కలేనిచక్కఁదనము, ఈకన్నియమున్నెన్నఁడోనన్నె ఱిఁగియున్న చందమునఁ గన్నులతో నన్నఁజేయుచున్నట్లున్నది. (పాఱఁజూచి) కానిమ్ము. (వెదకిచూచి దిగిన యాభరణముఁగానక).
ఉత్సాహ॥ జనమనోహరాంగినీదు చక్కదనము పెంచిన౯
ఘనమనీషనెంచిచూడఁ గాన్కయేమొసంగిన౯
దనివిఁదీరరామినేమొ దైనికంబుగానిట౯
గనులకొక్క భూషణంబు గానరాకయుండెడి౯
ఔరా ! యిప్పుడొక్కభూషణమైనను లేకయుండెఁగదా!
యశో— కం॥ భూషణము కాదు గౌరవ
భాషణములెవిలువలేని పసదనములగు౯
యోషాహృదయాకర్షణ
భూపణభాషణములేల బుధజనవర్యా॥
సర్వా - (తనలో యశోధరనుజూచి) భళీ యీయెన్న రానిమిన్న దనము. ఇట్టియం
సౌభాగ్య మెందుగను కొనగలము?
సీ॥ మేని వెల్లులగుంపు మించి చెంతలముంచి పాలసంద్ర మరీ త్రిఁబరిఢఃల్ల
లేము తీరగుమోము లేఁత వెన్ని లఁగాయు బాలచందు నిభాతిభా 2లంగ
కొమ్మవా తెఱమిఁది కమ్మపల్కులపాల్పు లమృక ధారలఁజీములాడుచుండ
తరళాక్షికనుచూపు కిరణంబులుడిలోని వజ్రకాంతుల వైభవంబుసూపు
సీ॥ భువన మోహనరూపఁబుఁ బూని భువిన
లంకరించెడుశృంగార లక్ష్మీయనఁగ
నెదురనిల్చినయీక న్నె నెన్న దాని
సంతసమ్యుం చెనామది పంచలించె
/ (అవి తన మెడలోనున్న హార మొసుగఁదలఁచి) మ మోహారిణీ! అశ్చిమైన
యీపచ్చలహారము నీయిచ్చ సమకూర్చు గాత. (అనియిచ్చుచున్నాఁడు).
యశో—గ్రహించి స్థానముచేరును),
గౌత—ప్ర్రాణేశ్వరా ! నీకుమార శేఖరుని ముఖ లాసమునుజూచితివే చక్కఁదనాల
యిక్క యగు నిక్కన్నియ యున్న తెఱంగునుగనుంగొనము.<noinclude><references/></noinclude>
1fdm37vco3hrgbsbeecifb5kaqp934v
553535
553351
2026-04-17T11:09:27Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553535
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సర్వా - (తనలో) ఔరా! నిర్మలాంగిసౌగుణ్యమేమి? ఈ లెక్కలేనిచక్కఁదనము, ఈకన్నియమున్నెన్నఁడోనన్నె ఱిఁగియున్న చందమునఁ గన్నులతో నన్నఁజేయుచున్నట్లున్నది. (పాఱఁజూచి) కానిమ్ము. (వెదకిచూచి దిగిన యాభరణముఁగానక).
{{left margin|5em}}<poem>ఉత్సాహ॥ జనమనోహరాంగినీదు చక్కదనము పెంచిన౯
ఘనమనీషనెంచిచూడఁ గాన్కయేమొసంగిన౯
దనివిఁదీరరామినేమొ దైనికంబుగానిట౯
గనులకొక్క భూషణంబు గానరాకయుండెడి౯</poem> </div>
ఔరా ! యిప్పుడొక్కభూషణమైనను లేకయుండెఁగదా!
{{left margin|5em}}<poem>యశో— కం॥ భూషణము కాదు గౌరవ
భాషణములెవిలువలేని పసదనములగు౯
యోషాహృదయాకర్షణ
భూపణభాషణములేల బుధజనవర్యా॥</poem> </div>
సర్వా - (తనలో యశోధరనుజూచి) భళీ యీయెన్న రానిమిన్న దనము. ఇట్టియంగ సౌభాగ్య మెందుగను కొనగలము?
{{left margin|5em}}<poem>సీ॥ మేని వెల్లులగుంపు మించి చెంతలముంచి పాలసంద్ర మరీ త్రిఁబరిఢవిల్ల
లేమతీరగుమోము లేఁతవెన్ని లఁగాయు బాలచందునిభాతిభాసిలంగ
కొమ్మవాతెఱమిఁది కమ్మపల్కులపాల్పు లమృతధారలఁజిమ్ములాడుచుండ
తరళాక్షికనుచూపు కిరణంబులుడిలోని వజ్రకాంతులవైభవంబుసూప॥</poem> </div>
{{left margin|5em}}<poem>సీ॥ భువన మోహనరూపఁబుఁ బూనిభువిన
లంకరించెడుశృంగార లక్ష్మీయనఁగ
నెదురనిల్చినయీకన్నె నెన్న రాని
సంతసమునించెనామదిసంచలించె</poem> </div>
(అవి తన మెడలోనున్న హారమొసంగఁదలఁచి) మమోహారిణీ! అచ్చమైన యీపచ్చలహారము నీయిచ్చసమకూర్చు గాత. (అనియిచ్చుచున్నాఁడు).
యశో — గ్రహించి స్థానముచేరును).
గౌత — ప్రాణేశ్వరా! నీకుమార శేఖరుని ముఖవిలాసమునుజూచితివే చక్కఁదనాల యిక్కయగు నిక్కన్నియ యున్న తెఱంగును
గనుంగొనము.<noinclude><references/></noinclude>
l65dw8umr7pijfz578fyei7s61kykwg
553536
553535
2026-04-17T11:10:18Z
Brjswiki
6801
553536
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సర్వా - (తనలో) ఔరా! నిర్మలాంగిసౌగుణ్యమేమి? ఈ లెక్కలేనిచక్కఁదనము, ఈకన్నియమున్నెన్నఁడోనన్నె ఱిఁగియున్న చందమునఁ గన్నులతో నన్నఁజేయుచున్నట్లున్నది. (పాఱఁజూచి) కానిమ్ము. (వెదకిచూచి దిగిన యాభరణముఁగానక).
{{left margin|5em}}<poem>ఉత్సాహ॥ జనమనోహరాంగినీదు చక్కదనము పెంచిన౯
ఘనమనీషనెంచిచూడఁ గాన్కయేమొసంగిన౯
దనివిఁదీరరామినేమొ దైనికంబుగానిట౯
గనులకొక్క భూషణంబు గానరాకయుండెడి౯</poem> </div>
ఔరా ! యిప్పుడొక్కభూషణమైనను లేకయుండెఁగదా!
{{left margin|5em}}<poem>యశో— కం॥ భూషణము కాదు గౌరవ
భాషణములెవిలువలేని పసదనములగు౯
యోషాహృదయాకర్షణ
భూపణభాషణములేల బుధజనవర్యా॥</poem> </div>
సర్వా - (తనలో యశోధరనుజూచి) భళీ యీయెన్న రానిమిన్న దనము. ఇట్టియంగ సౌభాగ్య మెందుగను కొనగలము?
{{left margin|5em}}<poem>సీ॥ మేని వెల్లులగుంపు మించి చెంతలముంచి పాలసంద్ర మరీ త్రిఁబరిఢవిల్ల
లేమతీరగుమోము లేఁతవెన్ని లఁగాయు బాలచందునిభాతిభాసిలంగ
కొమ్మవాతెఱమిఁది కమ్మపల్కులపాల్పు లమృతధారలఁజిమ్ములాడుచుండ
తరళాక్షికనుచూపు కిరణంబులుడిలోని వజ్రకాంతులవైభవంబుసూప॥</poem> </div>
{{left margin|5em}}<poem>సీ॥ భువన మోహనరూపఁబుఁ బూనిభువిన
లంకరించెడుశృంగార లక్ష్మీయనఁగ
నెదురనిల్చినయీకన్నె నెన్న రాని
సంతసమునించెనామదిసంచలించె</poem> </div>
(అవి తన మెడలోనున్న హారమొసంగఁదలఁచి) మమోహారిణీ! అచ్చమైన యీపచ్చలహారము నీయిచ్చసమకూర్చు గాత. (అనియిచ్చుచున్నాఁడు).
యశో — గ్రహించి స్థానముచేరును).
గౌత — ప్రాణేశ్వరా! నీకుమార శేఖరుని ముఖవిలాసమునుజూచితివే చక్కఁదనాల యిక్కయగు నిక్కన్నియ యున్న తెఱంగును
గనుంగొనము.<noinclude><references/></noinclude>
idtgvqg4ooomn03dudn90kp7a2aezwu
సూచిక చర్చ:Sarada Lekhalu Vol 1.pdf
107
212210
553390
2026-04-17T01:39:08Z
శ్రీరామమూర్తి
1517
[[WP:AES|←]]Created page with 'ఈ పుస్తకము సూచికలో 53, 54 పేజీలు రెండవసారి వచ్చియున్నవి.--~~~~'
553390
wikitext
text/x-wiki
ఈ పుస్తకము సూచికలో 53, 54 పేజీలు రెండవసారి వచ్చియున్నవి.--[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 01:39, 17 ఏప్రిల్ 2026 (UTC)
nlc56rp2qjcahfobk9k0nklozbfpc7u
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/488
104
212211
553427
2026-04-17T06:46:39Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తాయారు మరో అడుగు ముందుకు వేసి తనను పెళ్లి చేసుకుంటే తండ్రి కరణీకం ఇప్పిస్తాననీ లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనీ హెచ్చరిస్తుంది. మరోవైపు భూతగాదాల్లో లంబాడీల...'
553427
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తాయారు మరో అడుగు ముందుకు వేసి తనను పెళ్లి
చేసుకుంటే తండ్రి కరణీకం ఇప్పిస్తాననీ లేదంటే తీవ్ర
పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనీ హెచ్చరిస్తుంది.
మరోవైపు భూతగాదాల్లో లంబాడీలను కరణం మోసం
చేయగా ఆదుకోవాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా
ప్రజలపైనే కాల్పులు జరుపుతారు. ఓ లంబాడీ స్త్రీపై
అత్యాచారం చేయబోగా ఆత్మగౌరవంతో తనను తాను
కాపాడుకునేందుకు పోలీసు అధికారిని చంపుతుంది. ఆ
వెంటనే తానూ ఆత్మహత్య చేసుకుంటుంది. నిజాం
మనుషులు కూలీలను బలవంతంగా ముస్లీం మతంలోకి
మారిస్తే, ఆ తర్వాత అటు హిందువులూ కాలేక, ఇటు
ముస్లీంలుగానూ మనలేక పడే బాధలూ చిత్రీకరించింది.
దొర బండి రోడ్డుపై వెళ్తూన్న సమయంలో బండికి ముందు
మనిషి తప్పుకోమని అరుస్తూ పరుగులు పెట్టడం వంటివి.
చూపించారు. ఆపనిచేసే మనిషి వెట్టి చాకిరీతో తిండి లేక
ఎంత కునారిల్లిపోతాడో కూడా చిత్రించారు. నిజాం
పాలనలో దెబ్బతింటున్న తెలుగు భాషా సంస్కృతుల
సముద్ధరణకు కంకణం కట్టిన మాడపాటి హనుమంతరావు
కృషిని పాణి తెలుసుకోవడమూ నవలలో ఉంటుంది.
సాయుధ పోరాటానికి ముందున్న తెలంగాణ జీవితాన్ని
చిత్రించే పనిని నవలలో ఎంతగా విజయవంతంగా చేశారో
సినిమాలో కూడా తాళిబొట్టు మాధవరావు అంతే విజయ
వంతంగా చేశారు.
తొలి తెలంగాణ సినిమా ఇది. ఈ సినిమాలో వినయ్
కుమార్, ఉమాభారతి ప్రధాన పాత్రల్లో నటించారు. వరంగల్
జిల్లా, ఆత్మకూరు దేశాయ్ గడిలో చిత్రీకరణ జరుపుకున్న
ఈ సినిమా భూస్వాములు - పేదరైతుల మధ్య పోరాటాన్ని
చక్కగా చూపించింది. కే.వీ. మహదేవన్ అందించిన
సంగీతం ఈ సినిమాని మ్యూజికల్గా కూడా టాప్
పొజిషన్లో నిలిపింది. 'కలువకు చంద్రుడు ఎంతో దూరం'
అనే పాట బావుకతతో ఉండగా 'ఏటికేతం బట్టి ఎయిపుట్లు
పండించి ఎన్నడూ మెతుకరగరన్నా..... నేను గంజిలో
మెతుకెరగరున్నా' అనే పాట రైతు దయనీయ స్థితికి అద్దం
పడుతుంది.
ఇక చిల్లర దేవుళ్ళు సినిమాలో ఆత్రేయ రాసిన రెండు
పాటలు విశేష ప్రాచుర్యం పొందాయి. కె.వి. మహదేవన్
సంగీతం ఎంతో గొప్పగా తోడయింది. ఒకట 'కలువకు
చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ మరీ
దూరం...', రెండవది 'పాడాలనే వున్నది..... ఇక వీటిని
మించి తెలంగాణ గ్రామాల్లో జనం పాడుకునే గొప్ప పాట
'ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి ఎన్నడూ
మెతుకెరుగనన్నా... గంజిలో మెతుకెరుగరన్నా, కాళేయి
కడుక్కోని కట్టమీద కూసుంటే కాకి తన్ని పోయెకన్నా.....
కాకివిల్లా తన్ని పోయెరన్నా... ఇల్లా అద్భుతంగా
గుండెలోతుల్లోంచి సాగే పాటను దర్శకుడు మాధవరావు
చిల్లర దేవుళ్ళు సినిమాలో సందర్భోచితంగా ఉపయోగించు
కున్నారు. మహదేవన్ సంగీతంలో నరసింహ మూర్తి
పాడారు. జానపద పాటలకు రచయితలంటూ రాసిన
కవులంటూ వుండరు. అవన్నీ జనం తమ బాధల్నీ,
సంతోషాల్నీ వ్యక్తం చేసుకునే గీతాలు. అలాంటి ఈ పాట
అప్పటినుంచీ మరింత ప్రాచుర్యం పొందింది.
ఇలా తెలంగాణ గడ్డమీద పుట్టి గొప్ప సినిమాలు తీసిన
దర్శకుడు తాళిబొట్టు మాధవరావు.
చేతులు తెలంగాణ 467 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
lr0cumr3htjtwwefh661zypund4kqpe
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/489
104
212212
553428
2026-04-17T06:48:22Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '135 తాడేపల్లి లక్ష్మీకాంతారావు - హెచ్. రమేష్ బాబు క త్తిపట్టి మెరుపువేగంతో శత్రువును మట్టి కరిపించే 'విజయసింహుడు'. ఆపదలో ఉన్న రాకుమారిని రక్షించే 'ఖడ్గవీరుడు'. తెలుగు జానపద చి...'
553428
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>135
తాడేపల్లి లక్ష్మీకాంతారావు
- హెచ్. రమేష్ బాబు
క త్తిపట్టి మెరుపువేగంతో శత్రువును మట్టి కరిపించే
'విజయసింహుడు'. ఆపదలో ఉన్న రాకుమారిని
రక్షించే 'ఖడ్గవీరుడు'. తెలుగు జానపద చిత్రసీమలో
ఆడేయుడు 'అగ్గిదార'. నటనలో అసామాన్య ప్రతిభా
సంపన్నుడు. వెండితెరపై కత్తియుద్ధాలతో స్వైరవిహారం చేసి
తొలి తెలంగాణ సినీ కథానాయకుడిగా పట్టాభిషిక్తుడైన మన
మహానటుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు.
టి.ఎల్. కాంతారావు పేరు చెప్పగానే మనకు ఆయన
నటించిన సుమారు 50 జానపద సినిమాలు ఒకదాని వెంట
ఒకటి గుర్తుకు వస్తాయి. ధైర్యవంతుడు, సాహసవంతుడూ
అయిన రాకుమారుడు మాంత్రికుని మాయాజాలం నుండి
తన రాజ్యాన్ని రాకుమారిని ఎలా రక్షిస్తాడో కాంతారావు
సినిమాలు చూస్తే మనకు ఒక స్వాప్నిక జగత్తు ఆవిష్కార
మవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల వారి చేతుల్లో,
ఒకే సామాజిక వర్గం కనుసన్నల్లో నడిచే తెలుగు సినిమా
రంగంలో ఒక తెలంగాణవాడిగా, ఒక అగ్ర హీరోగా
కాంతారావు నిలద్రొక్కుకుని మనగలిగాడంటే అదొక అరుదైన
జీవన విజయగాథ. అతడు మనవాడు. మన కథానాయకుడు.
అచ్చ తెలంగాణవాడు.
నల్గొండ జిల్లా కోదాడ దగ్గరలోని గుడిబండ గ్రామంలో
తాడేపల్లి కేశవరావు - సీతారామమ్మ దంపతులకు 1923
నవంబర్ 16న జన్మించారు కాంతారావు. మూడేళ్ళ
ప్రాయంలోనే తండ్రిని కోల్పోయారాయన. కోదాడలోనే
ఉర్దూభాషలో వస్త్రానియా (7వ తరగతి) వరకు చదువుకున్నా
రాయన. చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి పెంచుకున్న
కాంతారావు రంగస్థలంపై చిన్న చిన్న వేషాలు వేశారు. ఆ
సమయంలోనే ఒకసారి తమ వూరికి 'సురభి' నాటక కంపెనీ
వచ్చింది. వాళ్లంతా కొన్నాళ్లు అక్కడే మకాం వేసి వరుసగా
నాటకాలు వేయాలనుకున్నారు. ఊరి పటేల్ మన కాంతారావు
గనుక, ఆయన అనుమతి తప్పనిసరి. కాబట్టి వెళ్లి కలిశారు.
ఎట్లయినా తాను అనుమతి ఇస్తేనే నాటకాలు ఆడతారని
గ్రహించిన కాంతారావు నటించాలనే తన కోర్కెను
తీర్చుకోవడానికి ఇదే అవకాశమని 'నాకు మీ నాటాకాల్లో
వేషాలిస్తే అనుమతిస్తా' నని కండీషన్ పెట్టారు. దీంతో
వాళ్లు అయిష్టంగానే ఒప్పుకున్నారు.
ఆవిధంగా తొలిసారిగా సురభి నాటక సమాజం వారి
నాటకంలో బ్రహ్మదేవుని వేషం వేశారు కాంతారావు.
ఆతరువాత మధుసేవ, కనకతార, గయోపాఖ్యానం వంటి
తెలుగు నాటకాల్లో, హిందీలో మేవాడ్, బొబ్బిలి వంటి
నాటకాల్లో నటించారు. ఇంతలో ఆయన మనసు
సినిమాలవైపు మళ్లింది. అప్పటికీ ఖర్చులకు పదెకరాల భూమి
అమ్మివేశారాయన. ఆ డబ్బుతో మద్రాసు వెళ్లారు. 1952
డిసెంబర్లో విడుదలైన 'ఆదర్శం' సినిమాలో ఇద్దరు హీరోల్లో
ఏదో ఒక వేషం వస్తుందని ఆశించినా ఏ అవకాశం
సమరము bhah తెలంగాణ ( 468 తేజోమూర్తులు ఓkkad
తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude>
axgl5p0n504ygonjv7ybwgurgvflmia
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/490
104
212213
553429
2026-04-17T06:48:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రాలేదాయనకు, ఆ రెండు వేషాలూ జగ్గయ్య, రామశర్మలకు దక్కినవి. ఇది తెలంగాణ నిర్మాతలు తీసిన తొలిచిత్రం. మద్రాసులో సినిమాల్లో నటించడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో కాంత...'
553429
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రాలేదాయనకు, ఆ రెండు వేషాలూ జగ్గయ్య, రామశర్మలకు
దక్కినవి. ఇది తెలంగాణ నిర్మాతలు తీసిన తొలిచిత్రం.
మద్రాసులో సినిమాల్లో నటించడానికి చేసిన ప్రయత్నాలు
ఏవీ ఫలించకపోవడంతో కాంతారావు ఇంటికి తిరిగి వెళ్లాలని
నిర్ణయించుకున్నారు. ఈమధ్యకాలంలో మద్రాసులో వేసిన
'మేవార్' నాటకంలో 'మొహబ్బతాన్' వేషం వేయవలసిన
టి. కృష్ణ (ఎడిటర్) కారణాంతరాల వల్ల పాల్గొనలేక
పోతున్నానని ఆ పాత్రను కాంతారావును వేయవలసిందిగా
కోరారు. అప్పటికే పలు హిందీ నాటకాల్లో నటించిన
అనుభవం ఉండటంవల్ల ఆ వేషం కాంతారావు వేశారు.
నాటకంలో ఆయన నటన చాలామంది ప్రశంసలందు
కున్నది. మరునాడు 'రోహిణీ' ఆఫీసుకు వెళ్లగానే అక్కడున్న
వారంతా చుట్టుముట్టి అభినందించడం మొదలు పెట్టారు.
అప్పుడు టి. కృష్ణ రోహిణీవారి 'నిర్దోషి'(1951)
సినిమాకు పనిచేస్తున్నాడు. “సినిమాల్లో నటించాలనే సరదా
తీరకుండానే ఎట్లాపోతా”వని 'నిర్దోషి'లో ఒక పల్లెటూరి రైతు
వేషం వేయించాడు. ఒకే ఒక్క డైలాగ్ ఉన్న పాత్ర! కానీ
ఆయన నటన, పలుకు రెండూ నచ్చి వెంటనే ఆ పాత్రకు
నాలుగు డైలాగులు రాయించి రీషూట్ చేయించారు దర్శకుడు
హెచ్.ఎం. రెడ్డి. సరిగ్గా ఇక్కడే కాంతారావు నట జీవితం
మలుపు తిరిగింది. నటనలో నిగూఢమైన మెరుపును
కనిపెట్టిన రెడ్డిగారు కెమెరామెన్ పి.ఎల్. రాయ్ని పిలిచి
ముఖవర్చస్సును, సౌండ్ ఇంజనీర్ని పిలిచి డైలాగ్ డెలివరీ
పరిశీలించి "ఇతడే నా తరువాతి సినిమా హీరో” అని
ప్రకటించారు. అట్లా తెలుగు సినిమా రంగంలోకి తొలి
తెలంగాణ హీరో ప్రవేశం జరిగింది. దాదాపుగా ఇదే
కాలంలో ఆర్. నాగేశ్వరరావు వచ్చినా అతడు విలన్
వేషాలకు ఎంపికైనారు.
1958లో "ప్రతిజ్ఞ' సినిమాతో మన కాంతారావు
హీరోగా వెండితెరకు పరిచయమైనారు. అదీ తెలుగు, తమిళ
భాషల్లో, తమిళంలో బాగా ఆడకపోయినా తెలుగులో శత
దినోత్సవాలు జరుపుకున్నది. హీరోయిన్గా సావిత్రి,
ప్రతినాయకునిగా నెల్లూరు రాజనాల కల్లయ్య నటించారు.
అయితే రాజనాలకు మొదటి నుండీ హీరో వేషంపై మోజు
ఉండటంతో తనకు విలన్ వేషం వచ్చినా యూనిట్ వారిని
మేనేజ్ చేసుకుని టైటిల్స్ తన పేరు ముందుగా, తరువాత
కాంతారావు పేరు వచ్చేటట్లు చేశారు. దాంతో కాంతారావును
విలన్
గా అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి నుండి
బయటపడటానికి చాలాకాలమే పట్టింది మన కాంతారావుకి.
తెలుగు సినిమా రంగంలో తెలంగాణ వారి పట్ల ఎలాంటి
వివక్షత వుంటుందో ఈ సంఘటన మనకు నిదర్శనంగా
నిలుస్తుంది.
'ప్రతిజ్ఞ' సినిమా విజయవంతమైనా ఆ వెంటనే రెండో
సినిమాకు అవకాశం రాలేదు. రెండేళ్ల తరువాత గాని
బిఠలాచార్య సాంఘిక చిత్రం 'కన్యాదానం' (1956)లో
నటించారాయన. ఈ సినిమా అంతగా ఆడకపోయినా
ఎన్.టి.ఆర్. తీసిన 'జయసింహా' (1955)లో తమ్ముడు
విజయసింహుడు వేషం ఇచ్చారు. జయసింహ గొప్పవిజయం
సాధించి కాంతారావుకి మంచి పేరు రావడమే గాక
భవిష్యత్తుకు ఆటంకాలు లేని బాట వేసి పెట్టింది. ఆ తరువాత
'భక్తమార్కండేయ', 'గౌరీమహాత్మ్యం' (శివునిగా), 'ఇలవేలుపు’
లో గెస్ట్రల్లో (1956), 'సతీ అనసూయ (1957),
శ్రీరామాంజనేయ యుద్ధం, గంగా గౌరీ సంవాదం (1959)
పౌరాణిక చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న వేషాలు వేసిన
కాంతారావు నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకుడు
విఠలాచార్య తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో
సినిమాలు నిర్మించి విడుదల చేయడం ఆయనలోని ప్రత్యేకత.
ఆ తరువాత విఠలాచార్య తానొక జానపదం
తీయాలనుకుని కాంతారావును హీరోగా ఎంపిక చేసుకుని
'జయ-విజయ' (1959) తీశారు. ఈ సినిమా విజయం
సాధించడంతో కాంతారావు- విఠలాచార్యల కాంబినేషన్లో
ఎన్నో హిట్ జానపదాలు రూపొంది తెలుగు సినిమారంగంలో
జానపద చిత్రాలకు ఒక అధ్యాయం ఏర్పడింది. విఠలాచార్య
డైరెక్షన్లో కాంతారావు 'కనకదుర్గ పూణా మహిమ (1960),
'వరలక్ష్మీ వ్రతం (1961), 'మదన కామరాజు కథ
-1962), గురువును మించిన శిష్యుడు- 1963', 'నవగ్రహ
పూజామహిమ - 1964), విజయసింహ-1965', 'జ్వాలా
ద్వీప రహస్యం-1966, 'ఇద్దరు మొనగాళ్లు- 1967, 'భలే
మొనగాడు', 'పేదరాశి పెద్దమ్మ (1968)' చిత్రాలతో కలిపి
మొత్తం డజను సినిమాల్లో హీరోగా నటించారు. ఈ
కాంబినేషన్లో కాంతారావు పక్కన నాయికలుగా కృష్ణ
కుమారి, రాజశ్రీలను తప్ప మరొకరిని ఆ రోజుల్లో
ఊహించేవారు కారు.
చేతులు తెలంగాణ 469 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
pzzrducd8eq59b4yvqxmtjsichcx3uk
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/491
104
212214
553430
2026-04-17T06:48:54Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తెలుగులో భారీ కలెక్షన్లు చేసిన 'అగ్గిదొర (1967) ను తమిళంలో 'మాయా మోదరం (మాయా ఉంగరం)' పేరుతో డబ్ చేశారు. తమిళనాడులో ఎమ్.జి.ఆర్., శివాజీ గణేషన్ల మాదిరిగా మన కాంతారావు భారీ కటౌట్లు పె...'
553430
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తెలుగులో భారీ కలెక్షన్లు చేసిన 'అగ్గిదొర (1967) ను
తమిళంలో 'మాయా మోదరం (మాయా ఉంగరం)' పేరుతో
డబ్ చేశారు. తమిళనాడులో ఎమ్.జి.ఆర్., శివాజీ గణేషన్ల
మాదిరిగా మన కాంతారావు భారీ కటౌట్లు పెట్టారు. డబ్బింగ్
చిత్రం స్ట్రైట్ చిత్రం కన్నా అధిక వసూలు చేసింది.
అంతకుముందే 'గురువును మించిన శిష్యుడు' సినిమా కూడా
'వీర మనోహర' పేరుతో డబ్ అయి బాగా ఆడింది. దాంతో
తమిళంలో జానపదాలకు పెట్టింది పేరైన ఎం.జి.ఆర్. తో
మన కాంతారావును పోల్చుతూ నీరాజనాలు పట్టారు.
సెలవ్లోని డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఆయన్ను అక్కడికి
తీసుకెళ్లి శతదినోత్సవాలు చేసి ఆంధ్రా ఎం.జి.ఆర్. అని
ఘనంగా సత్కరించారు.
తానపద చిత్రాల్లోనే గాక పౌరాణికాలలో సైతం
తనదైన ముద్ర వేయగలిగిన పాత్రలు పోషించగలగడం మన
కాంతారావులోని ప్రత్యేకత. కాగా తెలుగు సినిమా
పౌరాణికాల్లో నారదుని వేషానికి ఆయనకే పేటెంట్ హక్కు
ఉండింది. నారదునిగా కాంతారావు తొలిసారిగా 'గంగా
గౌరీ సంవాదం (1958)లో నటించారు. ఆ తరువాత రెండు
దశాబ్దాలకు పైగా నారదునిగా కాంతారావును తప్ప
మరొకరిని ఊహించుకునే పరిస్థితే లేదు.
ఒకవైపు సాంఘికాలలో అక్కినేని జగ్గయ్యలు
కాంబినేషన్, మరోవైపు జానపద, పౌరాణిక, సాంఘికా
అన్నింటిలోనూ కాంతారావు ఎన్టీఆర్ జోడి విజయయాత్ర
సాగించినవి. కంచుకోట, మర్మయోగి, చిక్కడు దొరకడు
వంటి జానపదాలు ఇక పౌరాణికాలు సరేసరి. సాంఘికాలలో
రక్తసంబంధం(1961), ఆప్తమిత్రులు(1963), దేశ
ద్రోహులు(1964), ఆడబ్రతుకు (1965), పల్నాటి యుద్ధం
(1966) చారిత్రాత్మకం, ఏకవీర (1969) వంటి చాలా
చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినవి. తెలంగాణకు
చెందిన ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి తన మిత్రులతో కలిసి
బెంగాలీ సినిమా 'దీప్ జాలాజాయ్'ను తెలుగులో 'చివరకు
మిగిలేది'గా తీశారు. ఇందులో కాంతారావుది ప్రత్యేకపాత్ర.
సినిమా కళాత్మకంగా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్నది.
సావిత్రి నటన ఉన్నత శ్రేణికి చెందినదిగా విమర్శకుల
ప్రశంసలందుకున్నది. కానీ ఆర్థికంగా ఫెయిలైంది.
ఈ సినిమా తరువాత మలయాళంలో నీలా ప్రొడక్షన్స్
'వారి 'భర్త కుచేల', ఉదయ స్టూడియోన్వారి "కృష్ణకుచేల'
పోటీగా తయారై 1961 నవంబర్ లో విడుదలైనవి.
ప్రేమ నజీర్ కృష్ణుడుగా నటించిన 'కృష్ణకుచేల' కన్నా
సి.ఎస్.ఆర్. కుచేలునిగా, కాంతారావు కృష్ణుడుగా నటించిన
'భక్తకుచేల' బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. కృష్ణుడిగా
కాంతారావు నటనకు మంచి పేరు వచ్చింది. ఆ వెంటనే
నీలా ప్రొడక్షన్స్ సుబ్రహ్మణ్యం కాంతారావు కృష్ణుడుగా
'గురువాయిరప్పన్' సినిమా తీశారు. ఇలా మొత్తం మూడు
మలయాళ చిత్రాల్లో నటించిన కాంతారావును అప్పటి
గురువాయూర్ దేవస్థానం వారు పది తులాల వెండి ఫలకం
మీద బంగారం పూత వేసిన స్వర్ణ పతకంతో అప్పటి కేరళ
గవర్నర్ వి.వి.గిరి చేతుల మీదుగా సత్కరించారు.
మళయాళీలు ఆయనను గౌరవంగా "కణ్ణన్" (కృష్ణుడు) అని
పిలిచేవారు. ఇదేకాలంలో కన్నడంలో 'కంఠీరవ',
'ఆశాసుందరి' చిత్రాల్లో హీరోగా నటించారు.
కాంతారావు సినిమాల్లోకి వచ్చి పదిహేనేళ్లు గడిచాక
నెమ్మదిగా పరిశ్రమలో కుట్ర రాజకీయాలకు తెరలేచింది.
సాటి హీరోలతోపాటు, విఠలాచార్య, భావనారాయణ వంటి
దర్శక నిర్మాతలు ఇందుకు కారకులైనారు. పరిశ్రమ నుండి
ఆయనను తప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేయించారు.
ఎంతగానో కాంతారావుచే లాభపడిన విఠలాచార్య, భావ
నారాయణలు చాలా రకాలుగా కాంతారావును వేధించేవారు.
ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన స్వంతంగా సినిమా నిర్మాణం
తలపెట్టారు. ఇక పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే సినిమా
. నిర్మాణమొక్కటే మార్గమని (1969లో) తానే హీరోగా
వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో 'సప్తస్వరాలు' చిత్రం
నిర్మించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా
నడుస్తున్నది. ఆ సమయంలో భావ నారాయణ పోటీగా
కృష్ణహీరోగా 'లవ్ ఇన్ ఆంధ్రా' తీసి 'ఒక తెలంగాణ వాడి
సినిమా చూస్తారా ఆంధ్రావాడి సినిమా చూస్తారా' అని
పోటీగా విడుదల చేశారు. కానీ రెండు సినిమాలు పరాజయం
పాలైనవి.
సప్తస్వరాలు ఫెయిలైనా ఆ వెంటనే 'గండర గండడు'
తీసి కొద్దిగా లాభపడినా సప్తస్వరాలు మిగిల్చిన అప్పులు
అలాగే ఉన్నవి. స్వంతంగా సినిమాలు తీస్తుండటం వల్ల
యు తెలంగాణ 470 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude>
lxfv6y4tmete5bmc5hi0s5f3msm0qsw
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/492
104
212215
553431
2026-04-17T06:49:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'బయటినుండి రావలసిన హీరో వేషాలు ఆగిపోయినవి. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని మలయాళ చిత్రం "వానుంపెట్" సినిమాను తెలుగులో "ప్రేమజీవులు(1971) పేరుతో తీశారు. సినిమా ఘోరంగా పోయింది...'
553431
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>బయటినుండి రావలసిన హీరో వేషాలు ఆగిపోయినవి.
పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని మలయాళ చిత్రం
"వానుంపెట్" సినిమాను తెలుగులో "ప్రేమజీవులు(1971)
పేరుతో తీశారు. సినిమా ఘోరంగా పోయింది. ఆ వెంటనే
హిందీలో వచ్చిన "గుమామ్" ఆధారంగా "గుండెలు తీసిన
మొనగాడు(1974)” తీసి మరోసారి చేతులు కాల్చుకున్నాడు.
ఆఖరుకు వాణిశ్రీ, రీఎంట్రీ చిత్రం "స్వాతి చినుకులు(1969)"
తీసినా నష్టాలే వచ్చాయి. ఇట్లా సినిమా నిర్మాణం
అచ్చిరాకపోవడం అటుంచితే, ఇటు రావలసిన అవకాశాలు
రాకుండా పోయినవి. నెమ్మదిగా అన్నయ్య, తండ్రి వంటి
క్యారెక్టర్ రోల్స్ వేయనారంభించారు.
ఇక ఆయన నటించిన సాంఘిక చిత్రాలను కూడా
ప్రస్తావించుకోవాలి. శభాష్ రాముడు, శభాష్ రాజా, బికారి
రాముడు, పెళ్లికాని పిల్లలు, ఖైదీ కన్నయ్య, శాంతి నివాసం,
చిట్టి తమ్ముడు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు,
మంచిరోజులు వస్తాయి. తోబుట్టువులు, చదువుకున్న భార్య,
శ్రీమతి, మా వదిన, పిన్ని, ఎవరు మొనగాడు వంటి చిత్రాలు
కాంతారావు నటించిన సాంఘికాలలో కొన్ని, కృష్ణకుమారి,
దేవిక, రాజశ్రీ, కాంచన, భారతి, జయంతి వంటివారు
ఆయనకు రెగ్యులర్ హీరోయిన్లు, వారిదంతా సుమారు రెండు
దశాబ్దాలపాటు సాగిన విజయవంతమైన కాంబినేషన్.
ఆయన నటించిన సినిమాల సంఖ్య 400 పైనే.
క్యారెక్టర్ రోల్స్ ఆయనది విలక్షణమైన ముద్ర.
దేవుడు చేసిన మనుషులు, సాహసవంతుడు వంటి చిత్రాల్లో
విలన్ గా కూడా నటించిన కాంతారావు - బాల భారతం,
మహాకవి క్షేత్రయ్య, నేరము శిక్ష, అల్లూరి సీతారామరాజు,
దేవదాసు, శ్రీసీత కథ, గాజుల కృష్ణయ్య, పాడిపంటలు,
ముత్యాలముగ్గు వంటి సుమారు 200 చిత్రాల్లో క్యారెక్టర్
రోల్స్ చేశారు. ఇక డజన్లకొద్ది టి.వి. సీరియల్స్
నటించారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం 'శంకరాదా
జిందాబాద్ (2007).
సంపాదించినదంతా నిర్మాతగా పోగొట్టుకొని 1990
లో హైదరాబాద్కు తమ మకాం మార్చిన కాంతారావు ఏ
ఆదెరువు లేక చిన్న చిన్న వేషాలు వేస్తూ కాలం గడిపారు.
అప్పటికే ఆయనకు నలభై ఏండ్ల సినీ జీవితం ముగిసింది.
ప్రభుత్వాల తరపున ఎట్లాంటి గుర్తింపు రాలేదు. ఎందరో
శ్రేయోభిలాషులు చేసిన సాయంతోనే జీవికను గడిపారు.
పాలకులు కాంతారావు నటనారంగ సేవలను
గుర్తించకపోయినా తెలుగునాట పలు సాంస్కృతిక సంస్థలు,
13 వ్యక్తులు ఆయనను ఘనంగా సత్కరించాయి. గురుమూర్తి
రాష్ట్ర సమాచార శాఖామంత్రిగా ఉన్నప్పుడు 'నటప్రపూర్ణ
బిరుదుతో సత్కరించారు. పాలకొల్లులో అల్లురామలింగయ్య
స్వర్ణకమలంతో, సామర్లకోటలో అభినందనవారి 'చిత్తూరు
నాగయ్య అవార్డుతో సన్మానించారు. 1987లో వంశీ
అవార్డు అందుకున్నారు. 1966లో నూరు చిత్రాలు
పూర్తయిన సందర్భంగా పుట్టిన గడ్డ కోదాడలో ఘనంగా
ఆయనకు పౌరసన్మానం జరిగింది. ఇంకా రామినేని
ఫౌండేషన్ పురస్కారంతో గౌరవింపబడ్డారు. చివరి రోజుల్లో
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని
నల్లకుంటలో ఒక కిరాయి ప్లాట్లో జీవనం గడిపిన
కాంతారావు 2009 మార్చి 22న తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం ఆయన భార్య హైమావతికి తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం నెలనెలా పదివేల జీవనభృతి ఇస్తున్నది.
తెలుగు సినిమారంగం అంటేనే ఆంధ్రావారికి
ఆలవాలమని వారి ఆధిపత్యంతో కొనసాగుతున్న కాలంలో
పరిశ్రమలోకి కాలుమోపి మండబలం, అర్థబలం ఉన్న
వారితో సమానంగా తనదైన స్థానాన్ని నిలబెట్టుకున్న
మహానటుడు మన కాంతారావు. నిజానికి కాంతారావే గనుక
తెలుగు సినిమా రంగంలోకి వెళ్లకుంటే జానపద సినిమాల
ప్రభావమే ఉండేది కాదనడంలో అతిశయం లేదు. ఆయన
జనం మెచ్చిన నటుడు. సామాన్య ప్రేక్షకుడి ఊహలకు
కార్యరూపమిచ్చి తెలుగు సినిమా కళామతల్లి నుదుటి
తిలకంగా నిలిచిపోయారు. మొత్తంగా తెలుగు సినిమా
రంగంలో తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించి
మన ఆత్మ గౌరవ పతాకంగా ఎగిరిన జానపద కథా
నాయకుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు.
చతురుడు తెలంగాణ (471 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
hgeb8mn8egwae9aefjwhv8ftw11609k
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/493
104
212216
553432
2026-04-17T06:49:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఒ 136 క దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు దాని సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. సమస్త భారతదేశం యొక్క సంస్కృతి సాహిత్యంలో ప్రతిబింబించి కనిపిస్తుంది. భారతీయ హృదయానికి సంస్కృత సా...'
553432
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఒ
136
క దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు దాని
సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. సమస్త భారతదేశం
యొక్క సంస్కృతి సాహిత్యంలో ప్రతిబింబించి కనిపిస్తుంది.
భారతీయ హృదయానికి సంస్కృత సాహిత్యం దర్పణం
వంటింది. అందుకే "ప్రతి భారతీయుడు గర్వించవలసిన
అద్భుత సంపద సంస్కృత వాఙ్మయములే" అని మనదేశ
మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన 'డిస్కవరీ
ఆఫ్ ఇండియా'లో పేర్నొన్నాడు.
పూర్వం తల నాడే ఋగ్వేదంతో
ఆరంభమైన సంస్కృత సాహిత్య సృష్టి ఇప్పటి వరకూ
నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇటువంటి
నిరంతర సృష్టి ఏ సాహిత్యంలోనూ కనిపించదు.
అలాంటి గొప్పదైన సంస్కృత సాహిత్య సృష్ఠిలో తన
వంతు పాత్రను నిర్వహించిన వారు మాన్యులు, కీర్తిశేషులు
శ్రీ తెలకపల్లి రామచంద్రశాస్త్రిగారు. దాదాపు పన్నెండు
సంవత్సరాల నిరంతర సంస్కృత భాషాధ్యయనం వల్ల ఆయన
కలం నుండి ఎన్నో రచనలు జాలువారాయి. ఆశువుగా
సంస్కృత శ్లోకాలను అలవోకగా చెప్పే శ్రీ రామచంద్ర
శాస్త్రిగారు ఎన్నో సన్మానాలను, బహుమతులను, పండితుల
మెప్పును, బిరుదులను పొందడం వింతేమీ కాదు. పూర్వపు
పాలమూరు జిల్లా, నేటి నాగర్ కర్నూలు జిల్లాలోని కోడేరు
తెలకపల్లి రామచంద్రశాస్త్రి
- వేదార్థం మధుసూదన శర్మ
మండలం రాజాపురం అనే గ్రామంలో జన్మించారు.
శ్రీ శాస్త్రిగారు.
“కవులున్నారు, పండితులున్నారు, పండిత ప్రకాండు
లున్నారు” అని గర్వంగా ప్రకటించిన శ్రీ కేశవపంతుల
నరసింహశాస్త్రిగారి మాటల ప్రకారం ఈ మూడు విశేషణాలు
కలబోసిన మూర్తిమత్వం వీరిది. స్వయంగా కవి. వీరు
కవికాంతా స్వయంవరం మొదలుకొని రవీంద్ర తపఃఫలం
వరకు 15 రచనలు వెలయించారు. సంస్కృతంలో
వ్యాకరణం, సాహిత్యం, వేదం, ఆయుర్వేదం, జోతిష్యం,
ధర్మశాస్త్రాలలో పాండిత్యం సముపార్జించారు. శాస్త్రిగారు
చేసిన చర్చలు, వాదాలు, నిరూపణలు వారి పండిత ప్రకర్షకు
నిదర్శనాలు.
పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రను ఒకసారి
పరిశీలిస్తే క్రీ.శ. 1000 సంవత్సరం నాటికే సంస్కృతంలో
శాస్త్ర రచన కొనసాగినట్లు తెలుస్తున్నది. ఆలంపురవాసి
అయిన మంధాన భైరవుడు రాసిన భైరవతంత్రం మొదటిది
అని చెప్పవచ్చు. ఇంకా జటప్రోలు సంస్థానంలో శేషభట్టరు
సింగరాచార్యులు, కవితార్కిక సింహ శ్రీనివాసాచార్యులు,
రాఘవాచార్యులు, వేదాంతాచార్యులు, కవి కంఠీరవ
కృష్ణమాచార్యులు, అక్షింతల సుబ్బశాస్త్రి, తిరుమల
బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు, హెూసదుర్గం కృష్ణమాచార్యులు
చే తెలంగాణ (472 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude>
sjdnzpqnkd7zsdc0urvbrqz9h2g3ltq
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/494
104
212217
553433
2026-04-17T06:49:48Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మొదలైనవారు సంస్కృత సాహిత్యంలో ఉద్దండ పండితులుగా పేరుగాంచారు. వీరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సంస్కృత భాషా సాహిత్య చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాది...'
553433
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మొదలైనవారు సంస్కృత సాహిత్యంలో ఉద్దండ పండితులుగా
పేరుగాంచారు. వీరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సంస్కృత
భాషా సాహిత్య చరిత్రలో తన కంటూ ఒక ప్రత్యేకమైన
స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీ తెలకపల్లి రామచంద్ర
శాస్త్రిగారు. వీరి గొప్పతనాన్ని చెప్పవలసి వస్తే శ్రీ విశ్వనాథ
సత్యనారాయణకు సహెూపన్యాసకులని, బెజవాడ
గోపాలరెడ్డి, మరువూరు కోదండరామిరెడ్డి, వై. బాలకృష్ణారెడ్డి,
కౌతా సోదరులకు గురువులని చెబితే చాలు.
వీరు కర్నూలు, శ్రీకాళహస్తి, ఆకిరిపల్లి, చిట్టిగూడూరు,
బందరు మొదలైన ప్రాంతాలలో విద్యాభ్యాసం చేసి, విద్య
ముగిసిన తర్వాత బందరు కళాశాలలోనే సంస్కృత
ఉపన్యాసకునిగా పనిచేసిన ప్రతిభావంతులు.
ఆనాడు సంస్థానాలలో ఉండే కవి పండితుల మధ్య
శాస్త్రచర్చలు, వాదోపవాదాలు జరగడం సాధారణం. అయితే
జటప్రోలు సంస్థాన ఆస్థాన పండితులైన శ్రీరామచంద్ర శాస్త్రి,
శ్రీ వెల్లాల సదాశివశాస్త్రి మధ్యకూడా ఇలాంటి వాదోప
వాదాలు జరిగి, రచనలుగా రూపుదిద్దుకున్నాయి. రామచంద్ర
'శాస్త్రి 'భారతీ తారామాల' కృతిని వెలయిస్తే, సదాశివ శాస్త్రి
'భారతీ తారామాల ఖండనం' రాశారు. సదాశివశాస్త్రి
'రామచంద్ర పంచకం' పేర రామచంద్రశాస్త్రిని విమర్శిస్తే,
రామచంద్రశాస్త్రి 'సదాశివాష్టకం' పేర ప్రతి విమర్శ చేసారు.
ఈ పరస్పర దూషణలు, నిందాత్మక కరపత్రాలు, రాజుగారికి
ఫిర్యాదులు, తీర్పులు మొదలైన వాటి ద్వారా ఆనాటి సాహిత్య
వాతావరణాన్ని అర్థం చేసుకోవచ్చు.
శ్రీ తెలకపల్లి రామచంద్రశాస్త్రిగారు ఇంకా లలితాస్త
వఝరి, హయగ్రీవ శతకం, హనుమత్సుప్రభాతం,
మామిళ్లపల్లి నృసింహ సుప్రభాతం, ఉమామహేశ్వర
సుప్రభాతం, ధూమశకట ప్రమాదం, రవీంద్ర తపఃఫలం,
కృష్ణవేణీ స్తుతి, గణేశ పంచరత్నములు, శ్రీ శారదా స్తుతి
శతకం, కవితాకాంతా స్వయంవరం వంటి ఎన్నో రచనలు
చేశారు. ఇవి శాస్త్రిగారి కోమల పదావళికి, సరసమధురమైన
శబ్ధ నంయోజనకు, భావానుగుణమైన భాషకు,
పదలాలిత్యానికి, స్వాభావికమైన అలంకార రచనకు, వివిధ
రసాల సహజ సుందర అభివ్యక్తీకరణకు, ఔచిత్య పోషణకు,
పాత్రల సజీవ శిక్షణకు నిదర్శనాలుగా నిలుస్తాయి.
శాస్త్రిగారి కల్పనతో సృష్టించిన కావ్యం 'కవితా కాంతా
స్వయంవరం'. ఇది సంస్కృత రచన. సరస్వతి బ్రహ్మల కథ.
వీరికి ఇద్దరు కూతుళ్లు, కవిత, గీత వారి పేర్లు. పెళ్లీడు
వచ్చిన తర్వాత కవిత తండ్రితో చెప్పి స్వయంవరం ఏర్పాటు
చేయిస్తుంది. చాలామంది స్వయంవరానికి వస్తారు.
శాస్త్రిగారు ప్రతీకాత్మకంగా రచించిన కావ్యం కనుక
'కవిత' వరుని ఎంపిక శాస్త్రి హృదయదర్పణమే. కవిత
అనుకొంటుందిట్లా. వ్యాకరణ శాస్త్ర పండితుడు తండ్రి' వంటి
వాడు కనక కుదరదు. వేదపండితుడు, తార్కికుడు 'అన్న'
వంటివారు కనక కుదరదు. కనుక కవిత రాసే శక్తి కలవాడిని
వరిస్తానని భావించి శ్రీకృష్ణుని వరిస్తుంది. ఇదే నిర్ణయాన్ని
'గీత' కూడ ఆచరిస్తుంది. ఈ కథ ద్వారా శాస్త్రిగారు 'కవి'
ప్రాధాన్యతను చెప్పాడు. ఇందులో 'కవి' పట్ల శాస్త్రి భావన,
కవిత్వం పట్ల తన అభిరుచి వ్యక్తమైనాయి.
కవులకు లోకం తెలిసి ఉండాలి. వాదించడానికి
వెనకాడని ధీరత ఉండాలి. ముఖంలో తేజస్సు, మనస్సులో
వివేకం ఉన్న ప్రేమికులకే కవిత్వం సాధ్యపడుతుందని, పాట,
గానం దానితో పాటే నడుస్తుందని ప్రతీకాత్మకంగా శాస్త్రిగారు
వర్ణించిన తీరు అమోఘం.
ఇలాంటి గొప్ప పాండిత్యం ఉన్న శాస్త్రిగారు తన
పాండితీ ప్రతిభకు ప్రతిఫలంగా శ్రీ బులుసు అప్పన్న
శాస్త్రిగారిచే 'అభినవ కాళిదాస', శ్రీ సురవరం ప్రతాపరెడ్డి
గారిచే 'సాహిత్య కల్పద్రువ', 'కవికుల తిలక', 'అలంకార
నటరాజ' బిరుదులను పొందారు.
గీర్వాణ భాషలో పండితుడుగా, శాస్త్ర చర్చల్లో దిట్టగా
గొప్ప కార్యనిర్వాహకుడిగా, ఆశుకవితా దురంధరుడిగా,
గొప్ప అధ్యయన శీలిగా, నాయకునిగా, హస్త కళానిపుణుడిగా
బహుముఖీనమైన ప్రతిభా వ్యుత్పత్తులు సొంతమైన
శ్రీ తెలకపల్లి రామచంద్రశాస్త్రిగారు చిరస్మరణీయులు.
తెలంగాణకే కాక భారతదేశానికి గర్వకారణం.
టే తెలంగాణ (473) తేజోమూర్తులు ఉండట<noinclude><references/></noinclude>
ax98vmz3imdyk2n06cs3xlki1agn0b5
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/495
104
212218
553434
2026-04-17T06:50:04Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '137 తోటపల్లి సుబ్రహ్మణ్యం - జి. వెంకట రామారావు సు బ్బయ్యా ! ఎంత పనిచేశావయ్య. ఇదంతా ముఖ్యమంత్రిగా నేను చేయలేనిది నీవు చేశావు' అని ఆశ్చర్యపోయారు హైదరాబాద్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత...'
553434
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>137
తోటపల్లి సుబ్రహ్మణ్యం
- జి. వెంకట రామారావు
సు బ్బయ్యా ! ఎంత పనిచేశావయ్య. ఇదంతా
ముఖ్యమంత్రిగా నేను చేయలేనిది నీవు చేశావు'
అని ఆశ్చర్యపోయారు హైదరాబాద్ రాష్ట్ర మాజీ
ముఖ్యమంత్రి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు. ఏమిటది..?
1926 ఏప్రిల్ 23న నాగర్ కర్నూలు సమీపంలోని
పాలెం గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన
సుబ్బయ్య అసలు పేరు తోటపల్లి సుబ్రహ్మణ్యం. తండ్రి
సత్యమూర్తి, తల్లి భగీరథమ్మ. బాల్యంలో ఆయనకు పాఠశాల
చదువు అబ్బలేదు. పౌరోహిత్యం చేసినా అభివృద్ధికి
ఆమడదూరంలో పాలమూరు జిల్లాలో ఆర్థిక పరిపుష్టి
దొరకలేదు. జాతి, కుల, మత వివక్షలకు అతీతంగా తన
తోటి మనుషుల్ని ప్రేమించి వారి అభ్యున్నతికి తన జీవితాన్ని
అంకితం చేసిన మహానాయకుడు పాలెం సుబ్బయ్య. ఆయన
సంపన్నుడు కాని మధ్యతరగతి రైతు.
1200 మంది జనాభా గల తన పల్లెకు డిగ్రీ కాలేజీ,
హైస్కూలు, గుడి, మంచినీరు, ప్రజా - పశువైద్యం, దక్షిణ
తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన సంస్థ, రాష్ట్రంలో
తొలి వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ, వ్యవసాయ ఉత్పత్తుల
ద్వారా నడిచే ఆగ్రో-ఇండస్ట్రీ, కుటీర, చిన్నతరహా పరిశ్రమల
ఏర్పాటు, రుణ, బ్యాంకుల సౌకర్యం... అన్నీ ఒకదాని వెంట
ఒకటి వరుసగా పాలెంలో నెలకొనేలా సుబ్బయ్య చేసిన
కృషి, ఆయన అసమాన కార్యదక్షతను రుజువు చేస్తుంది.
పాలెం ఒక కుగ్రామం. అక్కడ ఎలాంటి వనరులు లేవు.
రాజకీయ స్థానాలు ఆయన అధిష్ఠించ లేదు. రాజకీయాలకు
దూరంగా ఉంటూ వచ్చారు.
బిజినేపల్లి బ్లాకులో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్
ఏర్పాటు చేయాలని ప్రభుత్వ కార్యక్రమంలో ఉంది. దాన్ని
పాలెం తీసుకురావాలని సుబ్బయ్య అభిప్రాయం.
ఎం.పి.ఒ.ను విచారించగా రెండెకరాల స్థలం, పదివేల
రూపాయల ప్రజావిరాళం ఇస్తే పి.హెచ్.సి. సాధ్యమవు
తుంది. గ్రామంలో స్థలం, డబ్బు వారికిస్తారు. తను
సొంతంగా రెండెకరాలు, ప్రభుత్వానికి పదివేలు చెల్లించాడు.
సుబ్బయ్య పథకం ఫలించింది. పాలెంకు వైద్యశాల వచ్చింది.
ఉచిత భోజనం, నివాస సౌకర్యాలు ఉంటేనే పాఠశాలను
అభివృద్ధిపరిచే వీలవుతుందని గ్రహించిన సుబ్బయ్య వెంటనే
హాస్టల్ ప్రారంభించాడు. కులవివక్షకు దూరంగా హాస్టల్లో
విద్యార్థులకు ప్రవేశం కల్పించాడు.
ఒకే హాస్టల్లో హరిజన, గిరిజన, మైనార్టీ, రెడ్డి కులాల
విద్యార్థులను ఉంచిన ధైర్యశాలి. ఎందరో పేదపిల్లలు
ఓరియంటల్ కాలేజీలో చేరి భాషా పండితులై ఆ తర్వాత
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తెలుగు అధిపతులైనారు.
హాస్టల్ రావడం వల్ల ఎంతోమేలు జరిగింది. ఎందరో పేద
విద్యార్థుల పిల్లలకు హాస్టల్ ఆలంబనమైంది. తొలుత
అందులోకి గ్రాంటు లభిస్తే, అది దినదినాభివృద్ధి చెంది
తెలంగాణ (474 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
4mkdiaxkmczb5sivx8is5mvt2awew4u
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/496
104
212219
553435
2026-04-17T06:50:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చివరకు 400 మందికి పెరిగింది. ఉపాధ్యాయుల సంఖ్య ఒకటి నుంచి 36కు పెరిగింది. విద్య, వైజ్ఞానిక, సాహిత్య విషయాల్లో పాలెం ఆదర్శ గ్రామంగా నిలవడానికి నిలువెత్తు ప్రభావం సుబ్బయ్య, నీలం...'
553435
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చివరకు 400 మందికి పెరిగింది. ఉపాధ్యాయుల సంఖ్య
ఒకటి నుంచి 36కు పెరిగింది.
విద్య, వైజ్ఞానిక, సాహిత్య విషయాల్లో పాలెం ఆదర్శ
గ్రామంగా నిలవడానికి నిలువెత్తు ప్రభావం సుబ్బయ్య, నీలం
సంజీవరెడ్డి మొదలుకొని చెన్నారెడ్డి వరకు ఏదో ఒక
కార్యక్రమానికి పాలెం వచ్చినవారే. బ్రహ్మానందరెడ్డి,
పి.వి.నరసింహారావు, టి. అంజయ్య, వెంగళరావు, చెన్నారెడ్డి
ముఖ్యమంత్రులు ఈ విద్యా సంస్థల విషయంలో ఎంతో
శ్రద్ధ చూపి.. ఆర్థిక బాధలు గానీ, అధ్యాపకుల కొరత గానీ
లేకుండా చేశారు. వారి వద్దకు సుబ్బయ్యకు నేరుగా ప్రవేశం
లభించేది.
పాలెం సుబ్బయ్య స్కూల్లో సీటు అంత సులభంగా
లభించేది కాదు. ముఖ్యమంత్రి విజయ భాస్కరరెడ్డి
ఓరియంటల్ కళాశాల సీటు కోసం అప్పుడు జిల్లా పరిషత్
చైర్మన్ ఒక విద్యార్థికి పాఠశాల సీటు ఇవ్వమని సిఫారసు
చేశారంటే సుబ్బయ్య స్కూలు, కాలేజీ స్థాయి ఏ పాటిదో
అర్ధమవుతుంది. 1960ల్లోనే విద్యా విధానంలో ఆయన
నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. ఆయన చెప్పి
చేయలేదు. చేసి చూపించాడు.
ఆ రోజుల్లో రైలు పట్టాల వెంట ఉన్న ముఖ్యమైన
ఊళ్లు షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, మదనాపురం
లోనే టెలిఫోన్ ఎక్స్ఛేంజీలు ఉండేవి. ఆ పరిస్థితుల్లో జడ్చర్ల
నుంచి పాలెంకు ఒకే వారంలో టెలిఫోన్ ఎక్స్ఛేంజీ
తీసుకువచ్చారంటే సుబ్బయ్య ఎంత పట్టుదల వ్యక్తో తెలుసు
కోవచ్చు. ఆయన తలపెట్టిన అభివృద్ధితో లబ్దిపొందింది.
అణగారిన వర్గాల వారే.
నిస్వార్థంగా సేవలందించిన సుబ్బయ్య ఏనాడూ కూడా
రాజకీయ పార్టీల వల్ల గానీ, ఎన్నికల వల్ల గానీ పదవుల్లోకి
రాలేదు. ఆయన సేవలు విస్తృత స్థాయిలో వినియోగించు
కునేవారు. పీవీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వజూపినా
తిరస్కరించారు. జలగం వెంగళరావు 'పద్మశ్రీ' పురస్కారానికి
సిఫారసు చేసినా రాజకీయాలు అడ్డువచ్చి దాన్ని ఇతరులు
తన్నుకుపోయారు.
యాదృచ్ఛికమో లేక దైవ నిర్ణయమో కానీ సంపూర్ణ
సూర్యగ్రహణం 1980లో వచ్చింది. ప్రపంచంలో అత్యధిక
సూర్యగ్రహణ సమయం, సంపూర్ణ గ్రహణం పాలెంలోనే
సంభవిస్తుందని దేశ విదేశాల శాస్త్రజ్ఞులు తేల్చిచెప్పారు.
నాలుగు నిముషాల 48 సెకన్ల పాటు సూర్యగ్రహణం
పాలెంలో ఉంటుందని చెప్పడంతో ఒక్కసారిగా దేశవిదేశీ
ఖగోళ శాస్త్రజ్ఞులు పాఠం చేరుకున్నారు. ప్రపంచమంతటా
పాలెం పేరు మార్మోగింది. చెన్నారెడ్డి తన క్యాబినెట్తో
ఇక్కడకు ప్రవేశించారు. ఏమాత్రం సౌకర్యాలు లేని పాలెంలో
అందరికీ సుబ్రహ్మణ్యమే వసతులు కలిగించారు. దీనికి
ముగ్ధులైన అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఇక్కడివారి
సహకారానికి కృతజ్ఞతలు వెల్లడిస్తూ ఒక అభినందన
పత్రంపై సంతకం చేసి పంపించాడు. జాతీయంగానే గాక
అంతర్జాతీయంగా పాలెంకు ఖ్యాతితెచ్చిన సుబ్రహ్మణ్యం
అభినందనీయుడు.
విశ్రాంతి, విరామం లేకుండా పాలెం గ్రామానికి నలభై
వసంతాలు సేవచేసిన సుబ్బయ్యకు అది ఎంతో సంతృప్తి
నిచ్చింది. ప్రజల కోసం తన ఆస్తిని కర్పూరంలో కరిగించిన
వ్యక్తి. గ్రామ సౌకర్యాల కోసం తనకున్న 40 ఎకరాల భూమి
అమ్మేశారు. ప్రజా సేవలకు తనకున్న ఆస్తులన్నీ పోయాయి.
ఇక మిగిలింది ఆయన కాంస్య విగ్రహమే. ఆ మహనీయుడు
1986 జూన్ 23న కన్ను మూశారు.
చేతులు తెలంగాణ 475 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
jqxl93nlv231n3ujejzznanyegry0yt
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/497
104
212220
553436
2026-04-17T06:50:44Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఒ 138 క జాతి ఔన్నత్యాన్ని తెలిపే జీవనాడి లాంటి నానుడులుంటాయి. ఆ నానుడుల వెనుక ఉత్తేజ పరిచే వీరత్వం ప్రదర్శించే ధిక్కార స్వరం కనిపిస్తే 'ఆయన ఏమన్నా తురుంఖానా?' అని ప్రశ్నిస్త...'
553436
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఒ
138
క జాతి ఔన్నత్యాన్ని తెలిపే జీవనాడి లాంటి
నానుడులుంటాయి. ఆ నానుడుల వెనుక ఉత్తేజ
పరిచే వీరత్వం ప్రదర్శించే ధిక్కార స్వరం కనిపిస్తే 'ఆయన
ఏమన్నా తురుంఖానా?' అని ప్రశ్నిస్తారు, తురుంఖాన్ అయితే
మాత్రం ఎవరూ ఆపలేరు అనే అర్థంలో. ఇంతకీ ఎవరీ
తురుంఖాన్? ఆయన ధిక్కారమేమిటి? ఆయన వీరత్వ
మేమిటి? త్యాగమేమిటి?
1857 జూలై 17న కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీ మీద
మెరుపు వేగంతో దాడిచేసి, పట్టుబడి, తప్పించుకొని,
ఎన్ కౌంటర్ లో తల మొండెం వేరు వేరు చేయబడి బ్రిటిష్
వాళ్లచే భయంకరమైన హెచ్చరిక ప్రదర్శన చేయబడ్డ
హైదరాబాద్ భూమిపుత్రుడు తుర్రెబాజ్ ఖాన్ది ఆ ధిక్కారం,
వీరత్వం, అపురూపమైన త్యాగం.
బేగంబజార్ వాస్తవ్యుడైన రుస్తుంఖాన్ కొడుకు
తుర్రెబాజ్ ఖాన్. లభించిన ఆధారాలను బట్టి తుర్రెబాజ్
1820-30 ల మధ్య జన్మించి ఉంటాడు. అతడు జన్మించ
డానికంటే ముందే ప్రజ్వరిల్లిన 'వహబీ' ఉద్యమ ప్రభావం
తుర్రెబాజ్ మీద ఉన్నది. మహ్మదీయ మతానికి పూర్వ వైభవాన్ని
తీసుకురావడం కోసం సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్
వాహెద్ నెజ్జీ అనే అతను ప్రారంభించిందే వహబీ ఉద్యమం.
ఆ ఉద్యమ లక్షణం ఆంగ్లేయులకు, క్రైస్తవ ప్రచారానికి
వ్యతిరేకంగా పోరాడడం. సౌదీలో ప్రారంభమైన వహబీ 1830
తుర్రెబాజ్ ఖాన్
- డా॥ ఏనుగు నరసింహారెడ్డి
ప్రాంతంలో పెషావర్ ద్వారా భారత దేశంలోకి ప్రవేశించింది.
'షా వలీ ఉల్లా దేహవీ' దీన్ని భారతదేశంలో ప్రచారం చేసాడు.
హైద్రాబాద్లో 1838లో విలాయత్ అలీ, సలీం అనే ఇద్దరు
వహబీలు ప్రవేశించి ఆంగ్లేయ వ్యతిరేక ప్రచారం చేసారు.
నిజాం సోదరుడు ముబారిజుద్దాలా వహబీకు పూర్తి మద్దతు
ఇచ్చి, శిక్షకు గురై జైలులో పెట్టబడ్డాడు. అలా స్వయానా
నిజాం సోదరుడే బ్రిటిష్ రెసిడెంటు ప్రోద్బలంతో జైలుపాలు
కావడమే కాకుండా జైలులోనే 1854లో దయనీయమైన
మరణాన్ని చవిచూసాడు. 1853లో బేరారును నిజాం నుండి
ఆంగ్లేయులు లాక్కున్నారు. అంతకు ముందే కర్నూలు
ఆంగ్లేయుల పాలయింది.
ఈ సంఘటనలన్నీ గమనిస్తున్న యువ తుర్రెబాజ్
ఉగ్రుడయ్యాడు. బ్రిటిష్ వాళ్ళను తీవ్రంగా వ్యతిరేకించ
సాగాడు. వ్యక్తిగతంగా తుర్రెబాజ్ అనేక బ్రిటిష్ వ్యతిరేక
చర్యలకు ఒడిగట్టాడు. గతంలో ఎన్నోసార్లు అరెస్టు కూడా
అయ్యాడు. గుల్బర్గా, ఫిస్కల్, మన
కడపలలో అతని మీద
కేసులు నమోదై ఉన్నాయి. ఒక సందర్భంలో అతని మెడకు
చెక్కబంధం కూడా వేయబడింది. ఈ చక్రబంధం వల్ల
నిద్రపోవడానికి సరిగా పడుకోరాకుండా ఉండేది.
1857 మే మాసంలో ఉత్తర భారతదేశంలో చాలాచోట్ల
బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా సైనిక తిరుగుబాట్లు జరిగాయన్న
వార్తలు హైదరాబాద్ చేరాయి. ఆ వార్తలతో ప్రేరేపితుడైన
తెలంగాణ 476 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
0qj4l4kb9lsx8cdts0vlxettfaq7hnm
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/498
104
212221
553437
2026-04-17T06:51:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తుర్రెబాజ్ బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి హైదరాబాద్ సంస్థానంలో ఆంగ్లేయుల పాలన అంతమొందించాలను కున్నాడు. ఇదిలా ఉండగా జూన్ 10, 1857 నాడు బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నా...'
553437
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తుర్రెబాజ్ బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి హైదరాబాద్
సంస్థానంలో ఆంగ్లేయుల పాలన అంతమొందించాలను
కున్నాడు. ఇదిలా ఉండగా జూన్ 10, 1857 నాడు బ్రిటిష్
వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడనే నెపంతో మౌల్వీ ఇబ్రహీంను
బెదిరించారు, నిఘా పెట్టారు. జూన్ 12 నాడు అతన్ని
అరెస్టు చేసారు. 1857, జూన్ 23న డఫేదార్ మీర్ ఫిడాలీ
కెప్టెన్ అబ్బాట్ను కాల్చివేయడానికి ప్రయత్నించాడు.
ఆంగ్లేయులు మిర్ ఫిడాలీని పట్టుకొని ఉరి తీసారు. బ్రిటిష్
వారిపై దాడిచేసినట్లు రికార్డయిన జమేదార్ చీతాఖాన్లో
పాటు 13 మంది భారతీయ సైనికులు ఔరంగాబాద్ నుండి
తప్పించుకొని హైదరాబాద్ చేరుకొని నిజాంను శరణు
జొచ్చారు. నిజాం తన దివాన్ సలార్జింగ్ సలహాప్రకారం
చీతా ఖాన్ బృందాన్ని రెసిడెంటుకు అప్పజెప్పాడు. అలా
వాళ్ళు రాకాని ఒడికి చేరిపోయారు. కోరీ రెసిడెన్సీలోని
నేలమాళిగలో వాళ్ళను బందీ చేసి చిత్రహింసలకు
గురిచేసారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన
దేశభక్తులు చిత్ర హింసలకు గురికావడం తుర్రెబాజ్ ఖాన్
ను
కలచి వేసింది. ఆ దేశభక్తులను విడిపించడం కోసమైనా
రెసిడెన్సీ మీద దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.
తుర్రెబాజ్ మౌల్వీ అల్లా ఉద్దీన్తో చర్చించాడు. ఇతర రోహిల్లా
వీరులను పోరాటానికి సంసిద్దపరిచాడు. ముహూర్తం
నిర్ణయించబడిందో లేదో కాని దాడి చేయాలనే నిర్ణయం
జరిగిపోయింది. రెసిడెన్సీ మీద దాడికి నాలుగు రోజుల
మందు మొగిలిగిద్దకు వెళ్ళి కొన్ని ఆయుధాలను తెచ్చు
కున్నాడు, గుర్రాలకు దాణాకోసం వెళ్తున్న నెపంతో.
జులై 17 రోజున మక్కా మజీదులో ప్రార్థన సమయం
ఉద్రిక్తంగా మారింది. ఇమామ్ చేస్తున్న శాంతి ప్రవచనాలను
యువత అడ్డుకొంది. మక్కా మజీదు గోడల మీద పోస్టర్లు
వెలసాయి. మజీదు మినార్ల నుండి ఆకుపచ్చ జండాలు
జారిపడ్డాయి. ప్రజలంతా ఆ జెండాలను చేతబూనారు.
తుర్రెబాజ్ ఖాన్ చేతిలో జెండా పూని గుర్రం మీద ముందు
భాగాన దౌడు తీసాడు. మక్కా మజీదు నుండి బేగం బజారు
దిశగా ప్రయాణించి మౌల్వీ అల్లాఉద్దీన్ సిద్ధపరచిన 500
మంది రోహిల్లా వీరులను కలుసుకున్నాడు.
మజీదు వద్ద నమాజు పూర్తి చేసుకున్న పెద్దమనుషులు
ఉపద్రవ తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
నలుగురు మౌల్వీలు ప్రతినిధి బృందాన్ని నిజాం వద్దకు పంపి
రెసిడెన్సీలో బందీలుగా ఉన్న చీతాఖాన్ బృందాన్ని
విడిపించుటకు ప్రయత్నించాలని భావించింది. నలుగురు
మౌల్వీలు వెళ్ళారు. నిష్ప్రయోజకంగా వెనుదిరిగారు. ఆ
నలుగురు మౌల్వీలలో అల్లా ఉద్దీన్ కూడా ఒకరు.
రాయబారం ఫలించదని ఆయనకు ముందే తెలుసు. అందుకే
రోహిల్లా వీరులను సంసిద్ధం చేసే వెళ్ళారు. వెనక్కు తిరిగి
రాగానే రెసిడెన్సీ దిశగా కదలిక ప్రారంభించారు.
రాయబారం విఫలం కాగానే ఏదైనా దాడి జరిగే
అవకాశం ఉందని పసిగట్టి దీవాన్ సాలార్జింగ్ రెసిడెంటుకు
సమాచారమిచ్చి జాగరూకపరిచాడు. మధ్యాహ్నం ఒంటిగంట
ప్రాంతంలో రెసిడెంట్ డేవిడ్సన్ తనకు అందుబాటులో
ఉన్న సైన్యాన్ని సంసిద్ధపరిచాడు. సాలార్ జంగ్ను కొంత
సైన్యంకోసం అర్థించాడు కాని వాళ్ళు వచ్చేదాకా ముహూర్తం
ఆగదని డేవిడ్సనక్కు తెలిసిపోయింది.
మొదట తుర్రెబాజ్ ఇతర రోహిల్లా వీరులు పుల్లిబౌలీ
దిశగా నడిచి అబ్బాన్ సాహెబ్ ఇంటి ముందుకు చేరారు.
అబ్బాన్ సాహెబ్ ఇంటి ఎదురుగా ఉన్న రెసిడెన్సీ గేటులోపల
సైనికులు మరఫిరంగితో సిద్ధంగా ఉన్నారు. అంతలో మౌల్వి
అల్లాఉద్దీన్ అతని అనుచరులలో సహావచ్చి తుర్రెబాజన్ను
కలుసుకున్నాడు. మాక్కామజీదు వద్ద జన సమూహం
మాయమైంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో
500 మంది ప్రజలు రెసిడెన్సీ నైరుతి గేటు వద్ద గుమిగూడారు.
సమయం చూసుకొని రోహిల్లాలు రెసిడెన్సీ పడమటి గోడకు
ఎదురుగా ఉన్న అబాన్ సాహెబ్, జైగోపాలన్ దాసులు
రెండంతస్తుల భవనాలను ఎక్కేసారు. అబ్బాన్ సాహెబ్
ఇంట్లోకి చేరుకోగానే మూమెంట్ కోసం అబ్బాస్ సాహెబ్,
జైగోపాల్ దాస్, ఆజం అలీ ఖాన్ల ఇండ్లమధ్య అడ్డుకోడల్ని
కూలగొట్టారు. రెసిడెంటు నైరుతి గేటును పగులగొట్టి షావుకార్ల
ఇండ్లమీద నుండి దాడి చేద్దామని తుర్రెబాజ్, అల్లాఉద్దీన్
పథకం. సాయంత్రం 6.30 గం॥లకు తుర్రెబాజ్
నాయకత్వంలోని రోహిల్లాలు రెసిడెన్సీ గార్డెన్ గేటును
కూలగొట్టారు. ఇంకొక గేటును అల్లా ఉద్దీన్ ధ్వంసం చేసాడు.
ఈ దశలో రెసిడెన్సీ నుండి కమాండర్ బ్రీవెట్ కాల్పులు
ప్రారంభించాడు. ఏడు రౌండ్లు కాల్చాడు. రోహిల్లాలు
చెదిరిపోయారు. ఫైరింగ్ ఇరవై నిమిషాలపాటు నడిచింది.
చతురుడు తెలంగాణ (477) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
0xqhtgk73kpfnxnsh85liszufegzlve
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/499
104
212222
553438
2026-04-17T06:51:14Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రాత్రి 8.30 గం||ల వరకు దాదాపు తిరుగుబాటు దారులంతా చెదిరి పోయారు. తుర్రెబాజ్, అల్లాఉద్దీన్ మరికొద్దిమంది అనుచరులు షావుకార్ల ఇండ్లల్లో వేచి ఉన్నారు. చివరి కాల్పులు తెల్లారగట్...'
553438
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రాత్రి 8.30 గం||ల వరకు దాదాపు తిరుగుబాటు దారులంతా
చెదిరి పోయారు. తుర్రెబాజ్, అల్లాఉద్దీన్ మరికొద్దిమంది
అనుచరులు షావుకార్ల ఇండ్లల్లో వేచి ఉన్నారు. చివరి కాల్పులు
తెల్లారగట్ల 4 గంటల దాకా సాగాయి. దాడి విఫలమైంది.
32 మంది చనిపోయారు. 25 మంది శవాలను తీసుకొని
రోహిల్లాలు తప్పించుకున్నారు. ? శవాలు రోడ్డుమీద పడి
ఉన్నాయి. అందులో ఇద్దరు చిన్న పిల్లలు కూడా శవాలై
పోయారు. తెల్లవారగట్ల 6 గంటలకు మిగిలిన వీరులంతా
బేగంబజార్
లోని తుర్రెబాజ్ ఇంటికి చేరారు. నగరంలో
ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఒక్కొక్కరు ఒక్కో
ప్రాంతానికి వెళ్ళిపోయారు.
తుర్రెబాజ్ కొత్వాల్ గూడ ద్వారా షాద్నగర్కు దగ్గరలో
ఉన్న మొగిలిగిద్దకు పారిపోయాడు. అక్కడి నుండి ఇతర
రోహిల్లా వీరులు ఉంటున్న సాతుల్య ప్రాంతానికి చేరాడు.
తుర్రెబాజ్, అల్లా ఉద్దీన్లను అరెస్టు చేయమని అందరు
కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీలు అయినాయి.
జమేదార్ బుద్దఖాస్కు జవానులుగా ఉన్నవాళ్ళు తుర్రెబాజ్న
గుర్తించి కాల్పులు జరిపారు. ఒక తూటా తొడలో, మరొక
తూటా మోకాలు పైభాగాన తగిలింది. తుర్రెబాజ్ గుర్రాన్ని
చంపివేసారు. జాన్ మహ్మద్ అనే సహచరుణ్ణి చంపి
తుర్రవాళ్లను అరెస్టు చేసారు. తుర్రిబావక్కు ఒక కంటి కింద
ఉన్న మచ్చవల్ల ఆయనను గుర్తుపట్టి అరెస్టు చేయగలిగారని
జులై 22, 1857న సాలార్జంగ్ బ్రిటిష్ రెసిడెంటుకు రాసిన
లేఖ నెం. 1061 ద్వారా తెలుస్తుంది.
తుర్రెబాస్ను హైద్రాబాద్ కు తరలించి విచారణ చేసి
అండమాన్లో యావజ్జీవ కారాగార వాస శిక్ష విధించాలని
నిర్ణయించారు. యావజ్జీవ కారాగార శిక్షను ఉరిశిక్షగా
మార్చమని రెసిడెంటు డేవిడ్సన్ గవర్నరు జనరల్ను కోరాడు.
గవర్నరు జనరల్ కు ఆ అధికారం ఉన్నా హైదరాబాద్ కోర్టు
బిధించిన శిక్షను తాను మార్చ బోనన్నాడు. అండమాను
తరలించక ముందు హైద్రాబాద్లో కస్టడీ నుండి జనవరి
18, 1858న తుర్రెబాజ్ తప్పించుకోగలిగాడు. తుర్రెబాణ్
తలకు 5000 రూ॥ల నజరానా ప్రకటించింది ప్రభుత్వం.
తుర్రేబాజ్ మెదక్ జిల్లా తూప్రాన్లో ఖుర్బాన్ అలా, జమేదార్
మహ్మద్ ఖాన్ కంటబడి తప్పించుకోబోయాడు. కత్తితో
పోరాటం చేయబోగా ఖుర్బాన్ అలీ తుపాకితో కాల్చి చంపాడు.
తుర్రెబాజ్న. అలా 23-1-1859న చనిపోయిన
తుర్రెబాజ్వాన్ మృతదేహాన్ని హైద్రాబాద్ తీసుకు వచ్చి తలను
మొండాన్నీ వేరు చేసి కోఠీలో భీభత్సంగా కొన్ని రోజులపాటు
ప్రదర్శనకు పెట్టారు. తెలంగాణ త్యాగానికి, నిజాయితీకి మహా
సంకేతం తుర్రెబాజాన్. వీరత్వానికి పర్యాయపదం
తురుంఖాన్.
ఆనాటి బ్రిటిష్ రెసిడెంట్ చెప్పినట్లు కొద్దిపాటి ఆర్ధిక
వెన్నుదన్ను, ఒకింత ప్రణాళిక ఉండి ఉంటే బ్రిటిష్
సామ్రాజ్యవాదం ఉద్వాసన హైదరాబాద్ నుండే ఆరంభమయి
ఉండి ఉండేది.
య తెలంగాణ (478 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
drq30x1wffkyb4ngw5wcxf1bkat4jca
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/500
104
212223
553439
2026-04-17T06:51:29Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '139 క్రీ॥ శే॥ శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్య జగ మెరిగిన కవులు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్రప్రభుత్వ 'హంస' అవార్డులను పొందిన వ...'
553439
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>139
క్రీ॥ శే॥ శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్య జగ
మెరిగిన కవులు. కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు,
రాష్ట్రప్రభుత్వ 'హంస' అవార్డులను పొందిన వారు. తెలుగు
విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కార గ్రహీతలు దత్తపీఠ
(గణపతి సచ్చిదానంద స్వామి) ఆస్థానకవులు. ఇవికాక
మరెన్నో పురస్కారాలు అందుకొన్నారు. కలం పట్టిన నాటి
నుంచి అరవయ్యేళ్లకు పైగా అవిశ్రాంతంగా రచనా
వ్యాసంగం సాగించి, దాదాపు డెబ్భై గ్రంథాలు రచించిన
కవిశేఖరులు.
ఉత్పల ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో 4-7-
1928న జన్మించారు. 2007 సంవత్సరంలో హైదరాబాదు
లో పరమపదించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి అలివేలమ్మ,
శ్రీమాన్ రఘునాథాచార్యులు.
పేదరికం వల్ల ఆయన చదువు ఒడిదుడుకులతో
సాగింది. స్వయంకృషితో ఉన్నత విద్యనభ్యసించారు. తొలి
నాళ్లలో సర్దార్ జమలాపురం కేశవరావు అనుయాయి అయి
రాజకీయాల్లోను, ఉద్యమాల్లోను పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిగా ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది.
మధ్యలో కొంతకాలం తెలుగు అకాడమీలో పనిచేసి,
జూనియర్ కళాశాల ఉపన్యాసకునిగా రిటైరైనారు. 'భువన
ఉత్పల సత్యనారాయణాచార్య
- ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి
విజయం' ట్రూపులో అష్టదిగ్గజ కవులలో ఒకడుగా ఉండి,
యావదాంధ్ర దేశమంతా పర్యటించి పలు ప్రదర్శనలిచ్చారు.
అమెరికాలో కూడా పర్యటించి తన తీయని కంఠంతో తెలుగు
పద్యాల మాధుర్యాన్ని విదేశాంధ్రులు వీనులకు విందొనరించి
నారు. చిత్రసీమలో ప్రవేశించి కొన్ని మధురమైనపాటలు
రాశారు. అయితే ఆ రంగం ఆయన తత్త్వానికి సరిపడకపోతే
త్వరలోనే బయటపడ్డారు.
ఉత్పల కిశోర ప్రాయంలోనే కుమార సంభవం, దక్ష
యజ్ఞం, గంగావతరణం వంటి గేయక ృతులను రాశారు.
అవి చందమామ, బాలమిత్రమాసపత్రికలలో ప్రచురిత
"మైనందువల్ల వాటిని బాల సాహిత్యంగా భావించారు.
ఉత్పల పద్యరచనలలో పేర్కొనదగినవి కీచుని వీడ్కోలు,
గాంధారి, ఉత్పలని, తపతి, ఈ జంటనగరాలు-హేమంతశి
శిరాలు, పాతబస్తీవిలాసం, శతరూప, స్వప్నాల దుప్పటి,
రాసపూర్ణిమ, శ్రీ కృష్ణ చంద్రోదయం, శైవలినీ రాగాలు-
ఉత్తలినే పరాగాలు మొదలైనవి.
నవలలో పేర్కొనదగినవి విష బిందువు(ఇది సామాజిక
రాజకీయ నవల), రాజమాత. 'రాజమాత ఆంధ్రభూమి
వార పత్రికలో చాలాకాలం సీరియల్గా వచ్చి సంచలనాన్ని
కలిగించిన నవల.
నా తెలంగాణ 479 తేజోమూర్తులు ఓట<noinclude><references/></noinclude>
tv8b8wwu0n3jhxllr6fuysvt7lq26yf
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/501
104
212224
553440
2026-04-17T06:51:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భాసుని ప్రతిఙ్ఞయే గంధరాయణీయమ్' అనే సంస్కృత నాటకాన్ని తెనిగించినారు. రామనాంశ్ త్రిపాఠి హిందీలో రాసిన 'మిలన్'కు 'జ్యోత్స్న' అనే పేరుతో స్నేచ్ఛానువాదం చేశారు. ఆధునిక పద్యకవు...'
553440
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భాసుని ప్రతిఙ్ఞయే గంధరాయణీయమ్' అనే సంస్కృత
నాటకాన్ని తెనిగించినారు. రామనాంశ్ త్రిపాఠి హిందీలో
రాసిన 'మిలన్'కు 'జ్యోత్స్న' అనే పేరుతో స్నేచ్ఛానువాదం
చేశారు.
ఆధునిక పద్యకవుల్లో ఉత్పలకు అగ్రేసర స్థానమున్నది.
దాశరథి, మధునాపంతుల, వానమామలై వంటి వారి కోవలో
నిలుస్తారు. అలంకార శాస్త్రాలను కంఠదఘ్నంగా చదువు
కొన్ని సంస్కారం వారి కావ్యాలలో ఎల్లెడలా ప్రతిబింబిస్తుంది.
'ఆలోచనామృతం' అనే పేరుతో అలంకార శాస్త్ర గ్రంథాన్నే
రాశారు. ఉత్పల పద్యరచనలలో 'ఈ జంట నగరాలు-
హేమంత శిశిరాలు', 'పాతబస్తీ విలాసం' ఆధునిక
సమాజానికి సంబంధించినవి. పద్యం ప్రాచీన సమాజానికి,
సంప్రదాయానికి సంబంధించిన కవితా రూపమని, ఆధునిక
సమాజం, సమస్యల చిత్రణకు పనికిరాదనే అభిప్రాయాన్ని
పరాప్తం చేసి, వన కలిగిన, పసందైన, పకపకనవ్వించగలిగే
'ఈ జంటనగరాలు-హేమంత శిశిరాలు', 'పాతబస్తీ విలాసం'
రాసి పదుగురి చేతా మెప్పింపు పొంది, పద్యరచనకు
పట్టుగొమ్మ అయినారు.
ఈ జంట కావ్యాలు- జంట నగరాల జీవితానికి
సంబంధించినవి. 'జంట నగరాలు-హేమంతశిశిరాలు'
సికింద్రాబాదు, మూనీకి ఎడమవైపునున్న హైదరాబాదు
వాసులకు సంబంధించినదైతే, 'పాత బస్తీ విలాసం' పూర్తిగా
మూసీకి కుడివైపునున్న పాతబస్తీ వాసుల జీవితానికి
సంబంధించినది. ఈ రెండు కావ్యాల రచనా విధానం
క్రీడాభిరామాన్ని తలపిస్తుంది. 'ఈ జంటనగరాలు- హేమంత
శిశిరాలు' కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు
లభించింది.
ఈ కావ్యంలో నాయకుడు, సాహిత్యాభిమానమున్న
చిరుద్యోగి. పేవ్మెంటు మీదున్న పుస్తకాల షాపులో
మనుచరిత్ర కనబడితే, కొని ఇంటికి తీసుకొని వెళ్లి చూస్తే,
అసలైన రసవంతమైన వరూధిని-ప్రవరుని వృత్తాంతం
కత్తిరింపుకు గురికావడం రోడ్డు మీద నడుస్తుంటే కాలి జోడు
తెగిపోవడం, ఆ తెగిన జోడు ఎలా ఉన్నదంటే "దెబ్బతిని
విలవిలలాడి డ్రైళ్లు పక్షిపగిచి పూర్తిగా తెగనది పాదరక్ష'
చెప్పులరిగియరిగి చీలలే మిగిలెను. ముచ్చెవాడు గూడ
ముట్టడేదేమో' అని అనుకొంటూ, బాగు చేయించడానికి
టేబులు వెదికితే, డబ్బులు కనిపించకపోవడంతో అట్లాగే
ఈడ్చుకొంటూ, ముచ్చెటమలు పట్టిన ముఖంతో ముచ్చెవాడికి
తన గోడు చెప్పుకొని, మరుసటిరోజు ఇస్తానని, బాగు
చేయించుకొని, మరుసటి రోజు వెళ్లితే, ఆ ముసలి
ముచ్చెవాడు అచ్చోట లేకపోతే ఆ రుణాన్ని తీర్చడానికి
ఇప్పటికీ వెతుకుతున్నారని కరుణామయ, హాస్యపూరిత
వృత్తాంతం. తన బదిలీ కోసం ఒక మిత్రుడు, 'పదవులు
ద్యోగాలు పైరసీ వల్లేనే ప్రాప్తించుగాని, అర్హతను గాదు,
పైరవీ వల్ల నా ఫీసుఫైళ్లు కదలు, కార్డు రైళ్లు విమానలోకమ్ము
కదలు, పైరవీ చేయకున్నవే పనియుగాదు, పైరవీ
చేయకెవ్వండు పైకి రాడు' అని ఇచ్చిన హితవుతో, తన
బదిలీ కోసం ఒక పైరవీ సుందరిని ఆశ్రయిస్తే ఆమె టాక్సీ
తెమ్మంటే తీసుకొని రాగా, టాక్సీలో పోతున్నప్పుడు ఆయన
హృదయ స్పందన ఎలా ఉన్నదంటే...
"ఉన్నవి ఐదు రూప్యములు, ఒప్పులకుప్పడు
రుద్రాక్షపండ్లకై
చన్నవి రెండు, మీటరు వెసన్ పరువెత్తుచుండె, జేబులో
నున్నవి మూడు, డ్రైవరడహెూ కఠినాత్మడు, కారులో
గూ,
ర్చున్నను దాని క్రిందబడి రూప యేపనట్లు కుందితిన్
ఆ పైరవీ సుందరి ఒక ఆఫీసులో ఆఫీసరుతో
మాట్లాడటానికి వెళ్లినపుడు, టాక్సీ కిరాయిని భరించలేనని,
తన బదిలీ సంగతిని గాలికొదిలేము చల్లగా జారుకోవటం
అందులో వృత్తాంతం. ద్వ్యర్థి కావ్యంలోని అచ్చుతప్పుల వల్ల
అది త్య్రర్థి కావ్యమైందని ఒక చెణుకు పద్యం చెణికినాడు.
కోనసీమనుంచి ఒక మిత్రుడు నెలాఖరు రోజుల్లో పచ్చి
ఇంట తిష్ఠ వేయడం, ఆయనకు జంట నగరాలను చూపుతూ,
దారిలో తారసిల్లిన ఉస్మానియా విశ్వవిద్యాలయం, అసెంబ్లీ
హాలు వంటి భవనాలను, వ్యక్తులను, విగ్రహాలను వర్ణిస్తూ
చెప్పిన పద్యాలతో నడిచిన కావ్యమిది.
'శతరూప' కావ్యానికి బీజం ప్రథమ మిధునం. ఆ స్త్రీ
పురుషులక్రమానుషంగాన్ని వ్యంగ్యమధురంగా చిత్రించారు.
ఉత్పలవారు. సి.నారాయణరెడ్డి గారన్నట్లు 'ఈ కావ్యం ప్రౌఢ
పద్య విద్యకే కాదు, పరిణత భావుకతకు కూడా రత్న
ముకురం'.
చిరు తెలంగాణ 480 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
omo3q4u45yb1zffpohs8dg6027qcdg1
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/502
104
212225
553441
2026-04-17T06:52:05Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''రాస పూర్ణిమ' కావ్యం నుంచి ఉత్పల పూర్తిగా కృష్ణభక్తుడే. కృష్ణునికి సంబంధించిన ఇతివృత్తాల మీద కావ్యాలు రచిస్తూపోయారు. ఆ ఉత్సలా, ఈ ఉత్సలా పూర్తిగా భిన్నంగా కనిపిస్తారు. మొదట...'
553441
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>'రాస పూర్ణిమ' కావ్యం నుంచి ఉత్పల పూర్తిగా
కృష్ణభక్తుడే. కృష్ణునికి సంబంధించిన ఇతివృత్తాల మీద
కావ్యాలు రచిస్తూపోయారు. ఆ ఉత్సలా, ఈ ఉత్సలా పూర్తిగా
భిన్నంగా కనిపిస్తారు. మొదటి ఉత్సల పద్యరూపంలో కవిత
చెప్పినా ఎంతో సామాజిక స్పృహ ఉన్న సమకాలీన ఆధునిక
మహాకవి, రెండో ఉత్సల పూర్తిగా తన మనస్సునూ,
వచస్సునూ, కర్మలనూ కృష్ణార్పణం చేసిన పరమ భాగ
వతోత్తముడు.
'రాస పూర్ణిమ' పండ్లమ్ముకొనే వృద్ధ పుళిందాంగన
కథ. కృష్ణుడు ఆమె నుంచి పండ్లను తీసుకోగా, బదులిమ్మని
అడిగితే, కృష్ణుడు వడ్లగింజలిస్తే అవే దారిలో నవరత్నాలైతే,
వాటిని యమునానది ఒడ్డుననే పొరబోసి, కృష్ణభక్తితో తానూ
ఒక గోపికయై 'మంజరి' అయిన ఇతివృత్తం.
తర్వాత రచించిన 'శ్రీ కృష్ణచంద్రోదయం' కావ్యానికే
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించినది. ఆరాధ్యుడు
శ్రీకృష్ణుడు, ఆరాధిక రాధ, వారిదగు లీలావి-స్తారమెలో
కాద్భుత సంసారము- ఈ సర్వ భువన సామర్థ్యంబున్'
అనే సందేశమే ఇతివృత్తం. దీన్ని 'శ్రీ గణపతి సచ్చిదానంద
స్వామికి అంకితమిచ్చారు. నవ్వువన్నెలలు చిమ్మే శ్రీకృష్ణుడు
ఈకృతిలో చంద్రుడయ్యాడు.' శ్రీ అంటే రాధ అని ఉత్పల
వ్యాఖ్యానం.
"నవ్వుము స్వామి! నీనగవు నంగల మోహకతన్
భజించి దవ్వుల వారు నీముడు పదంబుల ప్రాలుదు
రంతరాత్మలన్
నెవ్వగ దీర, ఏక స నిషమునై కనుపట్టునట్టినీ
నవ్వది నందనందన! అనాదిగ
సాగుననంతకాలమున్
దీనికి పీఠిక రాసిన జి.బి. సుబ్రహ్మణ్యంగారు ఉత్పల
వారి శ్రీకృష్ణకావ్యాలలో ఇది ఉజ్వల నీలమణి! శ్రీ కృష్ణ
కావ్యకర్తలలో ఉత్పలవారు కవి శిఖామణి అన్న మాటలు
అక్షరసత్యాలు.
ఇక కృష్ణుని మీదనే భాగవత దశమస్కందంలోని
చిన్నచిన్న ఇతివృత్తాలను తీసుకొని ఎంతో పించి, 'వేణుగీతం',
'యశోదానందపాని', 'గోపీగీతం', 'భ్రమరగీతం', 'యుగళ
'గీతం' వంటి వచనకృతులను రాశారు. ఈ వచన కృతులలో
ప్రతివాక్యం కవితాత్మకం, కృష్ణభక్తి భరితం, కృష్ణశాస్త్రి
వచనంలోని 'తడి', చలం వచనంలోని 'వడి' పడుగు
పేకల్లాగా అల్లుకున్నట్లుగా ఉంటుంది ఈ కృతులలోని
వచనం. ఉదాహరణకు.
"శ్రీ కృష్ణుని మురళీరవం మర్త్యలోకం నుంచి
సుషిరసోపాన పంక్తుల ద్వారా నారమయమైన ఇంధ్రధనస్సు
ద్వారా అమరలోకానికి చేరుకొని, అక్కడి నుంచి,
ఆనందఝురిని పృథ్యీతలం మీదికి ప్రవహింపజేస్తుంది.
సమస్త జీవకోటికి అలౌకిక స్ఫూర్తిని కలిగిస్తుంది. మనమే
కాదు ప్రౌఢకైన ప్రజాంగనలు సైతం ఆ వంశీనాదాన్ని బిని,
ఉత్కంఠిత నయనాలతో బృందావన వీధులలో, సందులలో,
నికుంజ పుంజాలలో ఆ వేణుమాధవుని చూడాలని ఎదురు
తెన్నులు చూస్తుంటారు. అపార ప్రేమ మిశ్రితమైన ఆనందం
అతని పిల్లనగ్రోవి పాటలో అభివ్యక్తమవుతుంది.”
ළ
ఎంతటి కవితాత్మకమైన, లయాత్మకమైన పచనమిది.
వేణు ధరుని గురించి వేసటేలేకుండా వేయి విధాలుగా
అలివేణులు వేనోళ్ల చెప్పుకోవడం చదువముచ్చటగా
ఉంటుంది ప్రతిపంక్తీ.
ఉత్పల వారి హృదయపుటం ఉత్పలిని పరాగ కోశం,
అనురాగ భరితం, ఆయన మనిషిని ప్రేమిస్తారు. మమతను
పూజిస్తారు. మానవుని మనుగడకు దోహదం చేసే మంచి
సంస్థలను మనసారా మెచ్చుకొంటారు. మనిషిలోను,
సంస్థలోను ఏ కొంత మంచి ఉన్నా, ఏ కొంత మంచి చేసినా,
జరిగినా కొండంత పులకించిపోయి ప్రశంసలు కురిపిస్తారు.
పుష్పద ృష్టిలా పద్యాలను, అలా కురిపించిన పద్యాలను
ఏరి కూర్చినమాల 'శైవలిని రాగాలు - ఉత్పలినీ వరాగాలు'
దాశరథి చెప్పిన పద్యం చిత్తగించండి.
"ఓ కమనీయ కోమల మహోదయ! దాశరథీ త్వతీయ
మా
ద్వీక ఝరీ ధురీణ పదవీధులలో అనవద్య పద్య వి
ద్యా కృషి సల్పి, నీరునవదాత యశః
కలమాంకురంబులన్
లోకమునందు నాటెదన్ అననుగ్రహమెప్పటివోలె
"పద్య రచనా శిల్పంలో సమకాలిక ఆంధ్రకవులలో
చతురుడు తెలంగాణ ( 481 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
hu3cro1suecztca0ntbbtrpppzbd894
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/503
104
212226
553442
2026-04-17T06:52:18Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉత్పలతో సమానులు ఒకరిద్దరు ఉందురేమో కాని, ఆయనను మించినవారు నిస్సందేహంగా లేరు. శృంగార, హాస్య, కరుణ రసాలను పోషించడంలో ఉత్పలకు ఉత్పలయే సాటి" అన్న దేవులపల్లి రామానుజరావుగారి మ...'
553442
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఉత్పలతో సమానులు ఒకరిద్దరు ఉందురేమో కాని,
ఆయనను మించినవారు నిస్సందేహంగా లేరు. శృంగార,
హాస్య, కరుణ రసాలను పోషించడంలో ఉత్పలకు ఉత్పలయే
సాటి" అన్న దేవులపల్లి రామానుజరావుగారి మాటలలో
అతిశయోక్తి ఏ మాత్రం లేదు. అంతా సత్యమే!
బాలసాహిత్యం నుండి భాగవత సాహిత్యం దాకా
సాగిన ఆయన కవితాప్రస్థానంలో ప్రతి అడుగూ,
ప్రతినుడుగూ భావ బంధురం, సుమసుందరం, నాదమయం,
జగన్నాథమయం, ఎనభై ఏళ్ళ పాటు మనమధ్య మసలి
వెళ్లినవారు మరెవరో కాదు లీలాశుకులే, పోతన్ననే. వీరందరి
మూర్తి ఉత్పల వారిలోనే దర్శించాం.
తెలంగాణ 482 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
fl19hap7n9wgc0s3chkosl4ia97nz1r
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/504
104
212227
553443
2026-04-17T06:52:33Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '140 రవయో శతాబ్ది తొలినాళ్ళలో లబ్ద ప్రతిష్ఠులైన కవులు, రచయితలు, పత్రికా సంపాదకులలో వడ్డేపల్లి సోదరులు పేరెన్నిక గలవారు. వారిది మెదక్ జిల్లాలో ఏ వసతులు లేని మారుమూల గ్రామమైన...'
553443
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>140
రవయో శతాబ్ది తొలినాళ్ళలో లబ్ద ప్రతిష్ఠులైన
కవులు, రచయితలు, పత్రికా సంపాదకులలో
వడ్డేపల్లి సోదరులు పేరెన్నిక గలవారు. వారిది మెదక్ జిల్లాలో
ఏ వసతులు లేని మారుమూల గ్రామమైన మక్తా వడ్డేపల్లి.
వడ్డేపల్లి సోదరులలో పెద్దవాడు - బెల్లంకొండ నరసింహా
చార్యులు. 1896లో జన్మించాడు. చిన్నవాడు బెల్లంకొండ
వెంకటాచార్యులు. 1905లో జన్మించాడు. తల్లిపేరు
రుక్మిణమ్మ. తండ్రి లక్షణాచార్యులు. ఆ పూటకు సర్దుకు
పోయే బీదరిక కుటుంబం.
కవి పండిత కుటుంబమైనా ఛాందస భావాలు
గలవారు కాదు. వ్యవసాయం చేస్తూ జీవించారు. తెలంగాణా
ప్రాంతంలో ఒద్దిరాజు, దాశరథి, కాళోజి మొదలయిన
సోదరుల కృషి అనివార్యంగా వస్తున్నది. వారిలో బెల్లంకొండ
సోదరులు చెప్పుకోదగినవారు. సురవరం ప్రతాపరెడ్డి గారు
“వడ్డేపల్లి సోదరులని” పిలవడం వలన వారికి ఆ
ఊరిపేరిటనే పేరు సార్థకమైంది.
తండ్రి చిన్నతనంలోనే మరణించడం వలన తల్లి
కుటుంబ భారాన్ని వహించింది. ఆమె ఆనాటికే విద్య
నేర్చుకొని ఉండటం వల్ల సాయం పాఠశాల నిర్వహించింది.
నాటి పాలనా భాష ఉర్దూ కావడం వలన పిల్లలిద్దరికీ
స్థానికంగా ఉండే మోల్సాబ్ దగ్గర ఉర్దూ నేర్పించింది.
సిద్దిపేటలో సూర్యనారాయణ శాస్త్రి వద్ద శిష్యరికానికి
ఉ తెలంగాణ
వడ్డేపల్లి సోదరులు
- డా॥ బెల్లంకొండ సంపత్ కుమార్
పంపించి సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషలు నేర్పించింది.
అక్కడి నుండి నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్యుల వద్దకు
పంపించి తమిళ, కన్నడ భాషలు, తిరువాయి మొజి పాశు
రాలు, సేవాకాలం అభ్యసింప జేసింది. అక్కడనే సంస్కృత
కావ్యాలు, అమరం నేర్చుకున్నారు. రుక్మిణమ్మ దగ్గరి
బంధువుల దగ్గర బెల్లంకొండ నరసింహాచార్యులు ఆయుర్వేదం,
వెంకటాచార్యులు శిల్పం, చిత్రలేఖనం నేర్చుకున్నారు.
వెంకటాచార్యులు నఖచిత్రాలు వేయడంలో నేర్పరి. విద్య
అభ్యసిస్తున్న దశలోనే ఇరువురూ అవధాన ప్రక్రియ సాధన
చేశారు.
ఇంటికి పెద్దదిక్కయిన తల్లి అంటువ్యాధుల బారినపడి
మరణించడం వలన సోదరులపై కుటుంబ భారం పడ్డది.
సోదరులిద్దరికీ వ్యవసాయమంటే, ఊరంటే వదలలేని ప్రేమ.
తల్లి మరణానికి వగచి వారు “మాతృనివేదన” ఆశు పద్యాలు
చెప్పారు. అక్కడి నుండి వారు జంట కవులుగా రచనా
వ్యాసంగాన్ని ప్రారంభించారు. కలిసి కథలు, అనువాదాలు,
దేశబంధు పత్రిక నిర్వహణ చేశారు.
గోలకొండ కవుల సంచికలో బెల్లంకొండ నరసింహా
చార్యులు, వెంకటాచార్యుల కవిత్వం, ఇతర వివరాలు
పేర్కొనబడ్డాయి. ఇరువురు కలిసి చేసిన రచనలేకాక స్వతంత్ర
రచనలు చేశారు. వారి పద్యరచన నాటకీయంగా కనుల
ముందు కదలాడినట్టుగా ఉంటుంది. రామభార్గవ సంవాదం
483) తేజోమూర్తులు పలు<noinclude><references/></noinclude>
bmo0bd563yd16i0c63vvmkzmimrhvi7
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/505
104
212228
553444
2026-04-17T06:52:47Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'లో బెల్లంకొండ నరసింహాచార్యుల రచనను ఇందుకు ఉదహరించవచ్చు. సందర్భానికి అవసరమైన ఛందస్సును వాడారు. వృత్తపద్యాలయిన చంపక, ఉత్పల, మత్తేభ, శార్దూలాలు సంస్కృత సమాసయుక్తంగా వీరరసం...'
553444
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>లో బెల్లంకొండ నరసింహాచార్యుల రచనను ఇందుకు
ఉదహరించవచ్చు. సందర్భానికి అవసరమైన ఛందస్సును
వాడారు. వృత్తపద్యాలయిన చంపక, ఉత్పల, మత్తేభ,
శార్దూలాలు సంస్కృత సమాసయుక్తంగా వీరరసంతో కూడి
ఉన్నాయి. సీసగీతం, కందం, తేటగీతులు సరళంగా ఉన్నాయి.
బెల్లంకొండ నరసింహాచార్యుల సంపాదకత్వంలో......
సోదరులు ఇద్దరూ 1926లో దేశబంధు పత్రికకు
శ్రీకారం చుట్టారు. 'దేశబంధు' పేరు పట్ల ఆనాటి నిజాం
ప్రభుత్వం, మంజీర కావర్తనం, నిజాం రాష్ట్రాభ్యుదయ
పరమార్ధమే తప్ప రాజకీయ దురుద్దేశ్యం లేదని, లిఖిత
పూర్వక హామీ పత్రం మీద చిన్ననాడు ఉర్దూ నేర్పించిన
మోల్సాబ్ జమానత్ సంతకం చేయడం వలన చాలా
కాలానికి అనుమతి వచ్చింది. రాజకీయ, పాలనాణోక్యం
లేకుండా పత్రిక నడువుకోవచ్చని వెంటవెంటనే నివేదికలు
సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సోదరులిద్దరూ మదరాసు నుండి ముద్రణాలయం
సామగ్రి పోగు చేసుకొని 1927లోనే దేశబంధు పత్రికను
ప్రారంభించారు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి
హనుమంతరావు వంటివారు దేశబంధును ప్రోత్సహించారు.
పత్రికా నిర్వహణకు కాగితం అవసరమైనందున
ప్రాంతాల నుండి కాగితం తెచ్చుకోవడం శ్రమ, అధిక
వ్యయంతో కూడుకొని ఉండటం వలన స్థానికంగా గూడూరు
పల్లెలో కాగితం పరిశ్రమను కుటీర పరిశ్రమగా తీర్చిదిద్దారు.
కాగితం రవాణాకు గుర్రం బండిని వాడడంతో నవాబులు
ఆగ్రహించి జరిమానా విధించారు. ప్రత్యామ్నాయంగా
గాడిదను ఉపయోగించారు. అభ్యంతరకరమైన విషయాలు
ప్రస్తావించారని ప్రతులు నిలుపుదల చేసి జరిమానా
విధించారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వారు పత్రిక
నడవడం సాహసోపేతమైంది. పత్రికలో ధార్మిక
విషయాలతోపాటు సమకాలీన విషయాలకు ప్రాధాన్యత
నిచ్చారు. సాహిత్యానికి పెద్దపీట వేశారు. తోకచుక్క దేశానికి
అరిష్టమని జ్యోతిషులు చెప్పేవార్తలను “పిచ్చివార్తలు”గా
ప్రకటించారు. పునర్వివాహాలు ప్రోత్సహించారు. దేవాలయ
ప్రవేశాన్ని దాని అవసరాన్ని ప్రచురించారు. శేషభట్టర్లాంటి
వారి “అంటరాని వాడు” పద్యాలను ఈ పత్రికలో ప్రథమంగా
ప్రచురించి మన్ననలందుకున్నారు. వేద విషయాలు శాసన
పాఠం వివరాలు, యోగతరంగిణి, సంస్కృత పాఠాలను వివిధ
శీర్షికలుగా నిర్వహించారు. వ్యవసాయ పనులలో ఆటంకాలను,
నక్కలదాడిని, జాగ్రత్తలను తెల్పారు. స్త్రీ విద్య పాఠశాలల
స్థాపన, సర్వమత జనుల ఐక్యత, గ్రంథాలయాల స్థాపన,
మత్తు వస్తువుల నిరాకరణ, స్త్రీ పురుషుల వివాహ వయసు,
వివాహకాలంలో నిరర్థక వ్యయం తీసివేయుట, విధవా
వివాహాలు, పిల్లల ఆరోగ్యం, బహిరంగ సభలను ప్రభుత్వం
ఆపకుండా ఉండుట, అనాధ వికలాంగులకు తప్పక
సహాయం చేయుట ఖాన్లీ పాఠశాలలపై ప్రభుత్వ నిర్బంధం
నివారించుట వంటివి పరమ శ్రేయంగా తలచి సంపాదకీయంలో
సమర్ధించారు.
దేశబంధు సోదరులు "సర్వజన సమ్మతములై దేశ
హితముగా" ఉన్న విషయ వ్యాసాలను ఆహ్వానిస్తూ ప్రకటన
చేశారు. పరస్పర కలహాస్పద విషయాలకు, మత విషయా
లకు చోటులేదని పత్రికలో స్పష్టంగా తెలియపర్చారు.
1927లో వెలువడిన దేశబంధు పత్రికలో మొదటి
సారిగా మెదక్ జిల్లా కథకుల రచనలు అచ్చు వేశారు.
కథలో వెనకబడి లేమని ఈ పత్రిక రుజువు చేసింది.
శేషభట్టర్ వెంకట రామానుజాచార్యులు, వానమామలై
లక్ష్మణాచార్యులు, హకీం అడవయ్య, పెద్దమందడి కృష్ణకవి,
గుప్తయోగ, మేఘాద్రి పెరుమాళ్ళు, మిట్టదొడ్డి రామదాసకవి,
వెంకట రాజన్న లాంటి పండితుల రచనలను ప్రచురించారు.
బెల్లంకొండ సోదరుల కథలు, నవలలు, అనువాదాలు
చేశారు. బెల్లంకొండ నరసింహాచార్యులు, 'సియాసీ సభలు
కథ రాశారు. ఇది చారిత్రాత్మక సందర్భంలో వచ్చిన
రాజకీయ కథ. ఈ కథ దొంతి దొరల పరిసరాలలోని
పాములబండ కేంద్రంగా మొదలవుతుంది. కుల వ్యవస్థను,
భూస్వామ్య విధానాన్ని నిరసించిన కథ సియాసీ సభ అంటే
ఏమిటనే ప్రశ్నకు 'నిజాం రక్కసి ఫర్మానాలను ధిక్కరించి
మెదులుకొను వ్యూహమని జవాబు పలికించాడు. నిజాం
ఉత్తర్వులను ధిక్కరించి బతుకుతామా? అన్నంత నిర్బంధంలో
రచయిత సాహసంగా కథను మలిచాడు. ఈ కథలో
జనులందరి ఐక్యతను కోరాడు. కుల వివక్షతను ప్రశ్నించాడు.
"పుట్టకమైల, చావు మైల, మట్టి మైల మనం మనుషులం
అంటుంటే తెలంగాణ 484 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
qh5gkflsw7kc8nbcocpphwof2szi8v1
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/506
104
212229
553445
2026-04-17T06:53:02Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మైలడాము. దేవుడు చెప్పింది ముక్తి" అని గణేంద్రమోక్ష ఘట్టాన్ని మొసలి నుండి చక్రాయుధం ఏనుగును ముక్తి చేసిన సందర్భాన్ని రచయిత ప్రస్థావించాడు. "తెలుగు సాహిత్యంలో వెట్టికి వ్య...'
553445
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మైలడాము. దేవుడు చెప్పింది ముక్తి" అని గణేంద్రమోక్ష
ఘట్టాన్ని మొసలి నుండి చక్రాయుధం ఏనుగును ముక్తి
చేసిన సందర్భాన్ని రచయిత ప్రస్థావించాడు. "తెలుగు
సాహిత్యంలో వెట్టికి వ్యతిరేకంగా రాసిన తొలికథలలో దీనికి
ప్రత్యేకస్థానం ఉందని" సంగిశెట్టి శ్రీనివాస్ మెతుకు కథల
ముందు మాటలో పేర్కొన్నారు. ఈ కథ గస్తి నిషాన్ తిర్చన్ ను
వ్యతిరేకిస్తుంది.
బెల్లంకొండ వెంకటాచార్యులు రాసిన "భక్త
విజయము" కథ వడ్డేపల్లి నుండి ప్రారంభమవుతుంది.
భర్తునుల సమీకరణ నరసింహావతారమెత్తి రాజ్యం దుర్మార్గా
లను ఎదిరించడం కథలోని ఇతివృత్తం.
వడ్డేపల్లి సోదరులు ఇద్దరు కలిసి రాసిన కథ "సంఘ
సంస్కార సభ. గ్రంథాలయం స్థాపించినందుకు, అంట్లో
గ్రంథాలు దొరికినందుకు ఎదురైన నిర్బంధాన్ని ఈ కథలో
చిత్రించారు. బాలింత స్త్రీ అని కూడా చూడకుండా ఆమె
డొక్కలో తన్నినందుకు విలవిలలాడడం ఆనాటి దౌర్జన్యాన్ని
కండ్లకు కడుతుంది. రఫియొద్దీన్ గ్రంథాలయాలను, అణా
గ్రంథమాలను, ప్రజల విద్యను ప్రోత్సహించే ఆలోచనా
పరుడు. ఆ జాగీరు ప్రాంతంలోనే నౌకరుగా ఉంటూ
ప్రభుత్వం ఇచ్చిన ఇల్లును కాదని ఊరూరా తిరుగుతూ
గ్రంథాలయాలు నిర్వహించడం పట్ల ఆయన పై జహంగీర్
సేన గిరఫ్తార్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద జంగు జరిగే
సూచన కనబడడం వలన సేనలు వెనుదిరగడం, శతసహస్ర
గూడాలకు విజ్ఞాన వ్యాప్తి జరగడం, శారీరక దారుఢ్యం,
కుస్తీ, సారస్వత గ్రంథాలయ స్థాపనకు అందరూ ఉద్యుక్తం
కావడం ఒక ఆశావహ దృక్పథంగా ఈ కథ సాగింది. ఏ
ప్రాంత ప్రత్యేకతలు ఆ ప్రాంత రచనల ద్వారా తెలుసుకోగల
ఆ
వీలును గల కథలుగా డా. నందిని సిధారెడ్డిగారు మెతుకు
కథలకు తొలిమాట రాశారు. స్థలకాలాల చారిత్రక
కోణంలోంచి ఆడెపు లక్ష్మీపతి ఈ కథలను పరిశీలించారు.
బెల్లంకొండ సోదరులు సాహిత్యాన్ని, పత్రికలను
ఊపిరిగా నమ్ముకొని జీవించారు. తాముగా నేర్చుకున్న
ఉర్దూభాష పాలకులతో వ్యవహరించడానికి, సంస్కృతం
పరిజ్ఞానానికి, సాహిత్య అవగాహనకు ఉపయోగపడింది.
వారు మూఢ నమ్మకాలను వ్యతిరేకించారు. విదేశాలలో
సంస్కృత ప్రభావం. సంస్కృత సాహిత్యానికి విదేశీయుల
సేవ వారిని ప్రాథమికంగా ఆలోచింపజేసింది. స్వభాష కోసం
ఏదైనా చేయాలని తపనపడ్డారు. "మనము సల్చునట్టి కృషియే
చరిత్రము జనుల జీవనమే చరిత్రము ఇంతకన్నా ఇంకేమి
కావలయునని పత్రికా సంపాదకుల గోష్టి సభ ట్రూప్ బజారు
హైదరాబాదు నందు 1927వ సంవత్సరం సమావేశంలో
ప్రకటించారు. ఆ ఆలోచనా విధానమే “దేశబంధు" పత్రికను
అనివార్యంగా నడిపింపజేసింది.
బెల్లంకొండ నరసింహాచార్యులు, తమ్ముడు వెంకటా
చార్యులు పలు ప్రాంతాలకు వెళ్ళి అవధానాలు చేశారు.
అవధానాలు చేయగా వచ్చిన అభిమాన పూర్వక పారితోషికాన్ని
పత్రిక కోసం ఉపయోగించారు. బెల్లంకొండ వెంకటాచార్యుల
నఖ చిత్రాల వలన పోగైన ధనం దేశబంధు నిర్వహణకు
ఉపయోగించారు.
బెల్లంకొండ సోదరులలో నరసింహాచార్యులు
బహుగ్రంధ కర్త, ఆయన రామాశ్వమేథం, ఆంధ్రవిశ్వ
గుణదర్పణం, ప్రభావతీ ప్రద్యుమ్నం, మండోదరి పరిణయము,
భాగవత సంగ్రహము, రామాయణ సంగ్రహము, మీనాక్షి
సత్యభామ గర్వాపహరణము, ఉత్తర కళ్యాణము, కుశలవ
వివాహము, అభిమన్యు వివాహము, కీచక వధ, తులసీ
వివాహము, కనకసేన విజయము, ఉగ్రపాండ్య చరిత్రము,
చీనా సుందరి నవల, మల్లికార్జున కీర్తనలు, శ్రీ శివభక్త
విజయము ఐదుభాగాలు రచించాడు.
సోదరులు 'ఋణ సంపాదనే కన్నడ అనువాదం.
'లవంగి' మరాఠి అనువాదం, అకారాది కథల ప్రయోగం
చేశారు. ఆ కథలలో ఎనిమిది మాత్రమే లభ్యమైనాయి.
వీరి పట్ల ఇంకా సమగ్ర కృషి జరగవలసి ఉన్నది.
So
చేతులు తెలంగాణ 485 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
dae753gloaw6v6num7fct3tmk570dj8
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/507
104
212230
553446
2026-04-17T06:53:16Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '141 ర్దూ రాజభాషగా ఉన్న నిజాం నిరంకుశ పరిపాలన లో తెలుగు భాషా సంస్కృతులు వెలవెలబోతున్న సమయంలో మాతృభాషలో అందులోనూ స్త్రీ విద్యక ప్రాధాన్యతనివ్వడం, సాంస్కృతిక పరంగా ప్రజలను చ...'
553446
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>141
ర్దూ రాజభాషగా ఉన్న నిజాం నిరంకుశ పరిపాలన
లో తెలుగు భాషా సంస్కృతులు వెలవెలబోతున్న
సమయంలో మాతృభాషలో అందులోనూ స్త్రీ విద్యక
ప్రాధాన్యతనివ్వడం, సాంస్కృతిక పరంగా ప్రజలను
చైతన్యపర్చడం, నాటి జనాభాలో అత్యధికంగా ఉన్న బలహీన,
బడుగు వర్గాలు. తాడిత, పీడిత, దళిత జనోద్ధరణకు, వారి
అభ్యున్నతికి నిరంతరం కృషిచేసిన సంఘసేవా తత్పరుడు..
సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పి, కలం
నడిపిన సంఘ సంస్కర్త, తెలంగాణలో జరిగిన ఉద్యమాలకు
అపారమైన సేవలు చేసి ప్రజలలో చైతన్యం కలిగించిన
నవయుగ వైతాళికుడు వడ్లకొండ నరసింహారావు గారు.
ఆచార కట్టుబాట్లు ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో
1893 జనవరి 20వ తేదీన హన్మకొండలో శివరామయ్య,
రత్నమ్మ దంపతులకు తృతీయ సంతానంగా జన్మించారు.
వరంగల్ రంగశాయిపేట పాఠశాలలో మెట్రిక్ వరకు చదివిన
వడ్లకొండ విద్యార్థి దశలోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
1908లో విద్యార్థి సంఘాన్ని స్థాపించిన సంవత్సరమే మూసీ
నదికి వరదలు వచ్చినపుడు బాధితుల కోసం విద్యార్థుల
పక్షాన నిలబడి విరాళాలు సేకరించారు. బందరు జాతీయ
కళాశాల సహాయనిధికి విరాళాలు సేకరించారు. పువ్వు
పుట్టగానే పరిమళిస్తున్నట్లుగా బాల్యం నుంచే సమాజ
సేవాతత్పరత మొగ్గ తొడిగింది. మేనమామ కూతురు
వేంకటమ్మతో వివాహం జరిగింది. ముగ్గురు కుమారులు,
వడ్లకొండ నరసింహారావు
- డా|| చీదెళ్ళ సీతామహాలక్ష్మి
ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నందగిరి ఇందిరాదేవి
రచయిత్రిగా పేరు గడించడమే కాక, నైజాం ప్రభుత్వ
కాలంలో ఏర్పాటైన 'దక్కన్ రేడియో' కార్యక్రమాల్లో పాల్గొన్న
తొలి మహిళ.
మెట్రిక్ చదివేతే చాలు ఆ రోజుల్లో ఏదో ఒక
ఉద్యోగం తప్పకుండా వచ్చేది. తాను చదువుకొన్న పాఠశాల
లోనే ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు.
తర్వాత నిజాం రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఆడిటర్ ఉద్యోగం
రావడం వల్ల 1910లో హైదరాబాద్కు మకాం మార్చారు.
ఆ శాఖలో 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేసి
అంచెలంచెలుగా ఎదిగి రిజిస్ట్రార్ స్థాయి వరకు చేరి పదవీ
విరమణ చేసిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు
ఉద్యోగంలో కొనసాగారంటే ఆనాటి నిజాం ప్రభుత్వానికి
ఈయన పట్ల ఉన్న విశ్వాసానికి, పనితనానికి గొప్ప
నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అకౌంట్లు, ఆడిట్, పరిపాలనా
విషయాలలో వడ్లకొండకు గొప్ప పరిజ్ఞానముండేది.
నిజాం పరిపాలన కాలంలో ఉర్దూ తప్ప మిగతా
మాతృభాషలు బోధించే పాఠశాలలపై 1925లో గస్తీ
నిషాన్- 53 చట్టం నిషేధాన్ని ప్రకటిస్తూ అమల్లోకి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉంటూ స్వీయ సంస్కృతి, భాష
పట్ల అభిమానంతో వడ్లకొండ వారు మొక్కవోని ధైర్యంతో
తన సమకాలీకుడు మాడపాటి హనుమంతరావు గారితో
తెలంగాణ 486 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
05hzw7etzke82y5awmk6gi636j7i1mu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/508
104
212231
553447
2026-04-17T06:53:33Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కలిసి ఇంటింటికీ తిరిగి చందాలు వసూలు చేయడం, విద్యార్థులను సేకరించి ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాలను స్థాపించడంలో, నిర్వహించడంలో అహర్నిశలు కృషిచేశారు. బాలికల కోసం పాఠశాలను స్థ...'
553447
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కలిసి ఇంటింటికీ తిరిగి చందాలు వసూలు చేయడం,
విద్యార్థులను సేకరించి ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాలను
స్థాపించడంలో, నిర్వహించడంలో అహర్నిశలు కృషిచేశారు.
బాలికల కోసం పాఠశాలను స్థాపించడం అట్టి దుర్బర
పరిస్థితుల్లో సాహస కార్యంగానే చెప్పక తప్పదు. వ్యయ
ప్రయాసల కోర్చుకోవడమే గాక, అద్దె కట్టలేని పరిస్థితుల్లో
అద్దెకున్న తన ఇంటిలోని నాలుగు గదుల్లో మూడు గదులను
స్కూలు ఇచ్చి ఒక్క గదిలోనే సంసారం నడిపిన పరోపకారి
వడ్లకొండ, పరిచారికలను పెట్టుకొనే స్తోమత లేక పాఠశాల
గదులను తెల్లవారకముందే ఊడ్చి ఆ విషయం ఎవరికీ
తెలియకుండా జాగ్రత్తపడిన సేవాతత్పరుడు, నిగర్వి, అపర
గాంధీ మహాత్ముడు.
ఈనాడు అభ్యున్నతి పొందిన మాడపాటి హనుమంతరావు
ఉన్నత పాఠశాలగా ఉన్నా ఆనాటి నిజాం ప్రభుత్వం వారు
గుర్తింపు ఇవ్వలేదు. తెలంగాణలో ఉన్నందుకు ఆంధ్ర
విశ్వవిద్యాలయం వారు గుర్తింపు ఇవ్వనపుడు వడ్లకొండ
వారు ప్రయత్నం చేసి పుణెలోని కార్వే మహిళా విశ్వ
విద్యాలయానికి అనుబంధంగా విద్యార్థుల చేత పరీక్షలు
రాయించారు.
స్త్రీ విద్య కోసం పరితపించే వడ్లకొండ పరోపకారిణీ
బాలికా పాఠశాల ఏర్పాటులో భాగ్యరెడ్డి వర్మ గారికి సహాయం
చేశారు.
వెట్టిచాకిరి నిర్మూలనకు కృషిచేశారు. శ్రీ కృష్ణ
దేవరాయాంధ్ర భాషా నిలయం కోసం రజతోత్సవాలు,
స్వర్ణోత్సవాల్లో కార్యదర్శిగా ఉండి చక్కగా నిర్వహించారు.
హైదరాబాద్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి బూర్గుల
రామకృష్ణారావు గారు అధ్యక్షులు. వడ్లకొండ పైసా పైసాకు
లెక్కచూపి ఖర్చు విషయంలో కచ్చితంగా ఉండి 'ఐరన్
ఫైనాన్షియర్' అని పేరు తెచ్చుకున్నారు.
రజాకార్ల దమనకాండ ఎదుర్కోవడానికి ప్రభుత్వోద్యోగి
అయిఉండి కూడా స్వాతంత్య్ర సమర యోధులకు అండగా
ఉండి కావలసిన సహాయం అందించారు. తెలంగాణ
కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, హైదరాబాద్ కాంగ్రెస్
కార్యాలయ కార్యదర్శిగా వివిధ హెూదాల్లో పనిచేశారు.
ఆయుర్వేదం పట్ల అభిమానంతో 1950లో ఆల్ ఇండియా
ఆయుర్వేదిక్ యూనియన్ గౌరవ సలహాదారునిగా ఉండి
'ప్రజాసేవాసక్త' బిరుదును పొందారు. ఆంధ్రోద్యమం,
ఆయుర్వేదోద్యమం, ఆంధ్ర వైద్యులు అను పుస్తకాలను
ప్రచురించారు. విశాల దృక్పథం, మానవత్వం కలిగిన
మహనీయులు వడ్లకొండ.
అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా బలహీన వర్గాల
వారికి ఎంతో సేవచేసిన సంఘసేవా తత్పరుడు. మాల
మాదిగ కులానికి చెందినవారు ఎలా నిర్బంధ శ్రమకు
గురవుతున్నారో 'బలోతా ఇనాం' పేరుతో గ్రామంలోని
మాలమాదిగలకు ఇచ్చిన ఇనాం భూములకు ప్రతిఫలంగా
'దౌరా'కు వచ్చిన అధికారులు ఉచితంగా ఊడిగం చేయించు
కోవడం న్యాయసమ్మతం కాదని, అందుకు చట్టాలు
అంగీకరించవని అర్థమయ్యే భాషలో 'వెట్టిచాకిరి' అనే
పుస్తకాన్ని రచించి, తెలంగాణ వికాసోద్యమంలో ఒక
ముఖ్యపాత్రను పోషించిన గొప్ప అభ్యుదయవాది వడ్లకొండ
చేసిన సేవ చిరస్మరణీయం.
వెనుకబడిన కులాల వారికి సంఘాలు ఏర్పాటు
చేసుకోవడంలో, సమావేశాలు నిర్వహించుకోవడంలో,
తెలుగు భాష విద్యా బోధనలో, సహపంక్తి భోజనాలు చేసి
సమీకరించడంలో కొండంత అండగా ఉన్న గొప్ప
కృషీవలుడు వడ్లకొండ. అనుకున్న పని ఎంత కష్టమైనా
సాధించే పట్టుదల కలవాడు, ఉదార స్వభావి.
ఎంత కష్టపడ్డా శ్రమకు తగ్గ గుర్తింపు మాత్రం
వడ్లకొండకు దక్కలేదు. ఆయన అజ్ఞాత కార్యశూరుడు.
1955 అక్టోబర్ 28వ తేదీన తుదిశ్వాస విడిచినను
తెలంగాణ ప్రజల మనసులో చెరగని ముద్రవేసిన
గొప్పమనీషి, చైతన్యదీప్తి, ధైర్యశాలి, భావి తరాలకు స్ఫూర్తి,
ప్రజలు మరిచిపోలేని మహనీయుడు. కీర్తిశేషులు, తెలంగాణ
ముద్దుబిడ్డ, నిశ్శబ్ద సంస్కర్త, నవయుగ వైతాళికుడు
శ్రీ వడ్లకొండ నరసింహారావు గారు.
చేతులు తెలంగాణ 487 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
tlph80g0nzt3d3sli22hi0txh0bp2yy
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/509
104
212232
553448
2026-04-17T06:53:46Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రై 142 తు వాల్మీకి - ప్రజాకవి శేఖర్" బిరుదాంకితులైన మహాకవి శ్రీ వానమామలై జగన్నాథాచార్యుల వారు. వరంగల్ జిల్లా మడికొండ వీరి స్వగ్రామం. తల్లి సీతాంబ. తండ్రి బక్కయ్యశాస్త్రి. శ్ర...'
553448
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రై
142
తు వాల్మీకి - ప్రజాకవి శేఖర్" బిరుదాంకితులైన
మహాకవి శ్రీ వానమామలై జగన్నాథాచార్యుల
వారు. వరంగల్ జిల్లా మడికొండ వీరి స్వగ్రామం. తల్లి
సీతాంబ. తండ్రి బక్కయ్యశాస్త్రి. శ్రీ బక్కయ్య శాస్త్రిగారిది
అమోఘమైన అద్భుత కంఠస్వరం. మైకులులేని ఆ కాలంలో
మూడూ మైళ్ళ దూరం వినపడేలా గంభీరస్వరంతో బక్కయ్య
శాస్త్రిగారు పురాణం చెబుతుంటే - దూర దూరాల ప్రజలు
కూడా ఎక్కడి వారక్కడే కూర్చొని ఆలకించేవారట!
"బ్రతికి బక్కయ్య శాస్త్రిగారి పురాణం వినవలె, చచ్చి
స్వర్గానికి పోవలె” అనేదట. ఆనాటి ప్రజానీకం, అలాంటి
మహనీయుని పుత్రరత్నం - మన ప్రజాకవి శేఖర
శ్రీ వానమామలై జగన్నాథాచార్యులవారు. వీరి తమ్ముడే
అభినవ పోతన బిరుదాంకితులైన "పోతన చరిత్రము”
రచించిన మహాకవి డా. వానమామలై వరదాచార్యులవారు.
శ్రీ జగన్నాథాచార్యుల వారి అత్యద్భుత సృష్టి "రైతు
రామాయణము”. 3000 పద్యాలపై చిలుకు మహాకావ్యం.
తెలుగు కవిత్వంలోని అన్ని పోకడలు పోయిన అలంకార
పరిచం. తెలంగాణా గ్రామీణ, రైతాంగ వ్యవహారంలో
ఉన్న వేల పదాల రాశి ఇది. పల్లె జీవనశైలిని ప్రత్యక్షం
చేసే అపూర్వమైన ఆశ్చర్యకర కావ్యం. వీరి రైతు వాల్మీకి -
ప్రజాకవి శేఖర - బిరుదులను సార్థకం చేసిన కృతి.
వానమామలై జగన్నాథాచార్యులు
- ఆచార్య రావికంటి వసునందన్
శ్రీ వ్రతగీతి, తెలుగుబిడ్డ శతకం, కార్పాస లక్ష్మి వంటివి
వీరి ఇతర రచనలు.
వీటిలో 'శ్రీవ్రతగీతి' - ధనుర్మాసంలో శ్రీ ఆండాళ్
వ్రతం సందర్భంగా చెప్పిన 'తిరుప్పావై' తమిళ గేయ
కావ్యానికి తెలుగు అనుసరణం. ఆమె రోజూ సుప్రభాతాన్నే
ఒక పాట శ్రీరంగనాథుని మీద అల్లి ఆయన సేవగా
ఆలపించేది. అలా ఒక నెల రోజులపాటు ప్రతిదినమూ
శ్రీ ఆండాళ్ ఆల్వార్ ఆశువుగా రచించిన ఆ గేయాలను
'పాశురాలు' అంటారు. ఇవి ముప్ఫై కలసి 'తిరుప్పావై' అన్న
పేరుతో ప్రపంచ ప్రసిద్ధాలైనవి. వాటికి మక్కీకి మక్కీ
అనువాదంగా కాక, చాలావరకు స్వతంత్ర భావాలు
సంతరించుకొన్న అనుసరణ కావ్యం ఆచార్యుల వారి తెలుగు
శ్రీవ్రతగీతి.
దీనిలో తెలుగు సంస్కృత శబ్దములు పడుగు - పేకవలె
కలదిరిగి ఉన్నవి. “నాళాతుంగఘనస్త తటిపై నిద్రించు
భద్రాత్మ గోపాలుని మెల్లగ మేలుకొల్పు శ్రుతిదీప్త" అనే
ఆచార్యులవారి మొదటి పద్యంలోనే వారి సంస్కృతపద
వైభవం, ఆండాళ్ ఆరాధనా సంప్రకటితములైనాయి. ఇది
“నీళాతుంగస్తనగిరితటీ!” అనే సుప్రసిద్ధ శ్లోకానికి అనుసరణ
మైనా స్వతంత్రమై సాగింది.
తెలంగాణ 488 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
cpfuej74ov99htfhrxznz74or81yyd4
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/510
104
212233
553449
2026-04-17T06:53:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఇక ఆచార్యుల వారి తెలుగు పలుకుబడల వరుస "మాగిదినపు తొలి నెలలో మంచు మరియు వెన్నెలలో అంటూ ధనుర్మాసాన్ని వర్ణించడం” తేనె వలపు చెలులూర! అని ఆండాళ్ తన తోటి కన్యలను సంబోధించడం కావ...'
553449
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఇక ఆచార్యుల వారి తెలుగు పలుకుబడల వరుస
"మాగిదినపు తొలి నెలలో మంచు మరియు వెన్నెలలో
అంటూ ధనుర్మాసాన్ని వర్ణించడం” తేనె వలపు చెలులూర!
అని ఆండాళ్ తన తోటి కన్యలను సంబోధించడం కావ్యాది
లోనే కలకండ పలుకులవంటి కమ్మని తెలుగు పదాలు.
చిలిపివాడైన శ్రీకృష్ణుని చూపులలో "కలువలు చెలగి
పూసినవట. ఆవ్రత దినములలో ఆండాళ్ నెరికురులు
మూడవలేదట - కనుల కాటుక దిద్దలేదట.” ఐనా సహజ
సౌందర్యశోభ-
పెందలకడ తీర్థమాడి కందొర గాటుక దిద్దము
అందాల కురుల సన్నని మందారములను ముడువము
మా పెద్దలొనర్చని మరి యే పనులును సేయబోము
కొండెములను చాడీలను గోరంతము చెప్పబోము
చేతనైన దానమ్మును జేతుము ధర్మము జేతుము
ఖ్యాతిగ మను జీవితమును గలిగి వెలిగి జీవింతుము”
అంటూ కవి ఎంతటి ముద్దు ముద్దు తెలుగు
పలుకులలో చిత్రించినారో!
ఒడువని సిరి
"కొండెత్తున - కడవలకొలదిగ
తిరుమేన - పిడుగుట - కాలుమేను - పులుగు జతలు
పిల్చా! ఇటులే చిరమ్ము' వంటి ప్రయోగాలు ఆచార్యుల
వారికే సాధ్యం.
-
-
Life work - “రైతు
వీరి జీవన సాఫల్యకృతి
రామాయణము”. కవిత్రయానికి భారతంవలె, పోతనకు
భాగవతంవలె! ఇది రామాయణ మహాకావ్య నాయకుడు
శ్రీరామచంద్రునికి పోలికగా రైతు రాముడిని చిత్రించిన కృతి.
కర్షక జీవనరీతి ప్రధానమైన ఆరాశ్వాసాల అద్భుత
పద్యప్రబంధం. రామాయణంలోనూ కాండలు ఆరేకదా! ఐతే
ఇది శ్రీ జగన్నాథాచార్యుల వారి ఊహా సంజనిత కల్పిత
కథా కావ్యం.
"వస్తానని రాతిని సుస్తీ చేసినది" వంటి అచ్చ
తెలంగాణ పల్లె పదాలతో కూర్చినది. ఎక్కడనో ఒక్కచోట
పల్లీయ పదాల పోహళింపు, నుడికారం వెయ్యడమే గొప్ప
అలాంటిది కావ్యమంతా తెలంగాణా జానపద శబ్దమయం
చెయ్యడం ఎంత గొప్ప అంతటి 'రామనక్కందనపు' కృతి
ఇది. నిజానికి సీత చక్కందనము మీదనే రామరావణయుద్ధం,
మొత్తం రామాయణమే నడిచింది. మరి "రామచక్కందనము"
నుడికారానికి ఎలా ఎక్కిందో తెలియదు. ఇలాంటివన్నీ ఎన్నో
తెలిసిన పల్లె పదాల మయబ్రహ్మ జగన్నాథాచార్యులవారు.
వాల్మీకి రామాయణంలో వలెనే ఈ రైతువాల్మీకి రైతు
రామాయణంలోనూ ఆరు కాండాలున్నాయి. అవి వరుసగా
శిశుకాండము, శిక్షణ కాండము, కళ్యాణ కాండము,
కృషికాండము, నిర్బంధకాండము, విజీయకాండము అనేవి.
వీటిలో రామాయణంలోని అరణ్యకాండ బదులు 'కృషి
కాండము వచ్చింది. రామాయణ అరణ్యకాండలోని
శ్రీరాముడు చేసింది - రాక్షస సంహార రూపమైన కృషేకదా!
ఇక్కడ రైతు రాముడు చేసింది పాడిపంటల అభివృద్ధి.
రైతుజన సంఘాభ్యుదయమనే కృషి. అందుకని ఇక్కడ ఇది
కృషి కాండమైనది. రైతుల అభివృద్ధి వోర్వలేక, వారికి
వెన్నుపూసవంటి రైతు రాముని సత్కార్య నిరతి సహించలేక
పాపాల పుట్టఐన పాపారావు, రావణుని ప్రతిరూపం - ఈ
కావ్యంలోని రైతు రాముని భార్య సీతను అవహరించి
నిర్బంధిస్తాడు. అందుకని రామాయణంలోని 'సుందరకాండ'
ఇక్కడ 'నిర్బంధకాండ' అయింది.
దీనికి మూలకారణం కూడా శూర్పణఖ వంటి
పాపారావు చెల్లెలు 'సుందరమ్మ. రాముని తమ్ముడు లక్ష్మణుని
వలచి విఫలురాలౌతుంది. దానితో రైతురాముని భార్య సీత
సౌందర్యాన్ని పూసగుచ్చినట్టు, కైపు తలకెక్కునట్టు అన్న
పాపారావుకు వర్ణించి చెప్పి సీత నిర్బంధానికి కారకురా
లైంది. ఇది రైతు రామాయణం కథా విలక్షణత! మరి, ఇన్ని
మాటల తర్వాత అసలీ కావ్యం కథ ఏమిటో తెలుసుకోవాలని
ఈ కావ్య కథానాయకుడు రైతు రాముడు. అతని
తమ్ముడు లక్ష్మణుడు. వారిద్దరి భార్యలు వరుసగా సీత,
ఊర్మిళ. బంటు హనుమన్న. సీతజాడలు తీయించిన
రైతురాముని స్నేహితుడు ధర్మారావు - సుగ్రీవునికి ప్రతీక.
రైతుల అభ్యుదయం పోరాటలో పాపారావుకు బుద్ధిచెప్పి
రాముడు సీతను తెచ్చుకొనుట, రైతురాజ్య స్థాపనము, ఆ
ఊరు రామాపురానికి రైతురాముని గ్రామపెద్దగా పాపారావు
స్థానంలో ఎన్నుకోవడంవంటి కథా ఘట్టాలు. అచ్చం
రామాయణేతి వృత్తాన్నే స్ఫురణకు తేవడంలేదా?
చేతులు తెలంగాణ (489 తేజోమూర్తులు విడు
ఆ<noinclude><references/></noinclude>
nd34mj1zvqvi07lmvwqyqj4nk9t7dmn
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/511
104
212234
553450
2026-04-17T06:54:20Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '- ఇది రైతు రామాయణం కాబట్టి కవి దీనిలోని ఆశ్వాసాలకు కాండములనే పేరు పెట్టారు. శిశుకాండలో వృద్ధులైన రైతురాముని తల్లిదండ్రులు దైవపూజాదికాలు చేసి సంతానం పొందడం పిల్లల అభివృద...'
553450
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>-
ఇది రైతు రామాయణం కాబట్టి కవి దీనిలోని
ఆశ్వాసాలకు కాండములనే పేరు పెట్టారు. శిశుకాండలో
వృద్ధులైన రైతురాముని తల్లిదండ్రులు దైవపూజాదికాలు చేసి
సంతానం పొందడం పిల్లల అభివృద్ధి వర్ణితాలు. శిక్షణ
కాండలో రామలక్ష్మణుల విద్యాభ్యాసం, రామాపురం
గ్రామాభ్యున్నతికై దీక్షబూని రాముడు నిరక్షరాస్యులైన
రైతులను చేరదీసి వారికి ఇతోధిక విద్యాబుద్ధులు నేర్చి,
కాపు సంఘాన్ని స్థాపించి వారిలో చైతన్యం తీసుకురావడం,
నూత్న వ్యవసాయ పద్ధతులను నేర్పి వారిని శాంతియుత
హరిత విప్లవ యోధులుగా మార్చడం కథాంశాలు.
ఇక కల్యాణ కాండలో సీతా ఊర్మిళలతో రామ
లక్ష్మణుల వివాహం, కృషి కాండలో దుర్భిక్షం, కరువు
కాటకాల నుండి రైతాంగాన్ని తన పలుకుబడితో రైతు
రాముడు అధికార ఆర్థిక సహాయం చేయించి, వారిని నిరాశా
నిప్పుృహల నుండి మరల్చడం వర్ణితాలు. అంతలో విధవయైన
పాపారావు చెల్లెలు సుందరమ్మ లక్ష్మణుని మోహించి,
తిరస్కృతురాలై ఆ కసితో సీతను పాపారావుచేత నిర్బంధింప
జేస్తుంది.
విజయకాండలో సుగ్రీవుని స్ఫురణకు తెచ్చే ధర్మారావు
సాయంతో రైతురాముడు పాపారావు గుట్టు రట్టుచేసి,
నలుగురిలో ఛీ అనిపించి సీత చెఱ విడిపిస్తాడు. ఆ తర్వాత
రామాపురానికి రైతు రాముడు గ్రామపెద్దగా అభిషిక్తుడు.
కావడం వంటి అచ్చం రామాయణ కథాంశాలను రైతు
జీవితానికి అన్వయించిన శ్రీ వానమామలై జగన్నాథా
చార్యులవారి కావ్యం 'రైతు రామాయణం" సార్ధక నామ
ధేయాన్ని సంతరించుకున్నది.
ఇక ఇందులోని పల్లీయత, రైతు జన సాధారణమైన
పదాల, నుడికారాల, సమాసాల ప్రయోగం-
"పచ్చతి పేర్చి తీర్చిన తివాచులు పచ్చిక బీళ్ళు,
కొండలో
దిచ్చలు గొట్టుచున్ పరుగు దీసెడి మేల్ సెలయేళ్ళు,
నింగికిన్
నిచ్చెన లెత్తినట్లుగ వనీస్థలి నిల్చిన బట్టతాళ్ళు, పైర్
పచ్చలచుట్టు కోట దరబాగులు దీర్చిన కొండ
చాళ్ళునుస్”
అని రామాపురాన్ని వర్ణించడంలో ప్రకృతి వర్ణన -
అంచులు దిద్దుకొన్నది.
"చేయురెక్కలు నాలుగోయన నిమ్మది
. |
పాల్గొనర్చెడి చతుర్భాహుడతడు
నలుమూలలగల పంట పొలాల దానమై
నలు ముఖాలన్ జూచు నలువయతడు
పశుపోషణమ్మునన్ బ్రత్యేకమాయొక
కనుగల్లి వెలుగు ముక్కంటి యతడు
పూని వేగన్నులన్ జేని మొక్కల సదా
రక్షించుకొను సహస్రాక్షుడతడు
చిట్టిగొడ్డలింగాని జట్టు గొట్టునపుడు
అపర పరశురాముడు, దండిహులమనుగాని
కదల బలధాముడును బాలికాపువెంట
రమణి కూడిరాన్ శ్రీ రఘురాముడతడు”
అంటూ రైతుని రాముడిగా వరుసగా నారాయణుడు,
బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు, పరశురాముడు, బలరాముని
తో పోల్చి చివరికి సీతతో కూడిన శ్రీరాముడని వర్ణించడం
అత్యద్భుతం.
"పంటలక్ష్మికి తొలియాట పట్టులబక్క
కాపుజనముల పాలి బంగారు గట్టు
కదుపు మొత్తాలు పురికట్టు కాటకాలు
కరువులరికట్టు పెరటికల్పకపు చెట్టు
పట్టణముల యాయువుపట్టు పల్లిపట్టు
అదియెలేక నగరజీవి యాటకట్టు
అంటూ పల్లెను గాంధీజీ భావించిన గ్రామ స్వరాజ్య
భావనతో, కర్షక ప్రాధాన్యత చిత్రించిన తీరు అనన్య
సామాన్యం, అలాంటి పల్లెలో
“పచ్చ చేమంతి పూదోట, పసిడికోట,
పడుచు పరువాల పాల మీగడల తేట
చిలిపి సిగ్గు సింగారాల జిలుగుమూట
పల్లె చెలిమోర్తు జను వరి పంపునాట”
అంటూ నాట్ల ఘట్టాన్ని పరమ రమణీయంగా
వర్ణించడం కవిగారి మరోకృతి "కార్పాసలక్ష్మి'ని స్ఫురణకు
తెస్తుంది. అంతేకాదు పాపారావు రాక్షస బలగాలను
అయయం చేయుటయు తెలంగాణ 490 తేజోమూర్తులు ఉండి<noinclude><references/></noinclude>
04gf3zyqcxlaz6nnky085bvltetibvo
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/512
104
212235
553451
2026-04-17T06:54:35Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '"అతని పటాలముల్ యమభటావళితిం బ్రతిరూప మచ్చ మా కుతుకలదాక సంజుళుల కూరలు మెక్కుచు నల్లగల్లు తలకు బోసుకోదగిన వెళ్ళినపాటున వస్తు దూలుచున్ గుతుపల వోలె నా యినుప గలిండ్లటులుండ్ర...'
553451
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>"అతని పటాలముల్ యమభటావళితిం బ్రతిరూప
మచ్చ మా
కుతుకలదాక సంజుళుల కూరలు మెక్కుచు నల్లగల్లు
తలకు బోసుకోదగిన వెళ్ళినపాటున వస్తు
దూలుచున్
గుతుపల వోలె నా యినుప గలిండ్లటులుండ్రుణ నా
మొదల్'
సరై అంటూ చేసిన రచన పల్లె పదాల మూటకదా?
అలా ఎన్నని చెప్పడం? చెప్పుబూనితే కావ్యమంతా జానపద
భాషారీతికి ఉదాహరణగా చెప్పాలి!
రైతు రామాయణం పరువానికి వచ్చిన ఇక్షుర్సిండం
అమృత భాండం! అది తెలుగు జాతికి అందించిన
మధురకవి శ్రీ వానమామలై జగన్నాథాచార్యుల వారు పల్లె
కవితకు ప్రాతఃస్మరణీయుడు.
చతురుడు తెలంగాణ (491 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
iet8yf14z1x681ci1glbeh2py9mc25m
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/513
104
212236
553452
2026-04-17T06:54:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '143 ఉ త్తమ కవితాలేఖన చిత్తమ్మెల్లారకు మరక చిక్కునె కూర్పన్ విత్తమ్మా? నేరిచికా పొత్తమ్మా? పూర్వజన్మ పుణ్యమెకాకన్” అని కంఠోక్తిగా కవిత్వం గురించి తమ అభిప్రాయం ప్రకటించిన మ...'
553452
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>143
ఉ త్తమ కవితాలేఖన
చిత్తమ్మెల్లారకు మరక చిక్కునె కూర్పన్
విత్తమ్మా? నేరిచికా
పొత్తమ్మా? పూర్వజన్మ పుణ్యమెకాకన్”
అని కంఠోక్తిగా కవిత్వం గురించి తమ అభిప్రాయం
ప్రకటించిన మహాకవి అభినవ పోతన డా. వానమామలై
వరదాచార్యులు గారు. వీరి మహాకావ్యం "పోతన చరిత్రము” |
25 వేల పై చిలుకు పద్యగద్యాల సమాహారం. శ్రీమాన్
వానమామలై మహాకవే కాక, పోతనవలెనే మహాభక్తుడు.
వాగీశ్వర మహామంత్రోపాసనచే సాక్షాత్ శ్రీ సరస్వతీ దేవిని
ప్రసన్నం, ప్రత్యక్షం చేసుకొన్న ధన్యాత్ములు, పుణ్యాత్ములు.
వీరి తల్లి సీతమ్మ, తండ్రి బక్కయ్య శాస్త్రి. మైకులులేని
పూర్వకాలంలో మూడు మైళ్లు వినబడే కంచుకంఠంతో,
మేఘగంభీరస్వరంతో పురాణ ప్రవచనం చేసేవారట వీరు.
"తింటే గారెలే తినాలె, వింటే బక్కయ్య శాస్త్రి పురాణమే
వినాలె” అనేది ఆనాటి నానుడి.
వరంగల్ దగ్గరి మడికొండ వరదాచార్యుల జన్మస్థలం.
చిరకీర్తి నార్జించిన కాళోజీ, పల్లా దుర్గయ్య, బిరుదరాజు
రామరాజు గారి వంటి ప్రసిద్ధ వ్యక్తులందరూ మడికొండవారే!
వీరికి సమకాలికులే! కలిసిమెలిసి ఆడుకొన్నవారే! వీరి పుట్టిన
తేదీ పరీధావి నామ సం|| శ్రావణ బహుళ ఏకాదశి -
సరియైన ఇంగ్లీష్ తేదీ 16 ఆగస్టు, 1912. పరమపదించిన
వానమామలై వరదాచార్యులు
- ఆచార్య రావికంటి వసునందన్
తేదీ రక్తాక్షి నామ సం|| అశ్వయుజ శుద్ధ అష్టమి, 31
అక్టోబర్, 1984. బిరుదులు : అభినవ పోతన, అభినవ
కాళిదాసు, ఆంధ్రకవి వతంస, మధురకవి, కవి కోకిల,
ఉత్ప్రేక్షా కవి చక్రవర్తి, మహాకవి శిరోమణి, కవి శిరోవతంస
మొదలైనవి.
ఎన్నెన్నో మధురకృతులు వెలయించిన శ్రీమాన్
వరదాచార్యుల వారి జీవితం నిరంతర వీడామయం.
యౌవనంలో తీవ్రక్షయవ్యాధితో మైసూరు శానిటోరియంలో
పదిసార్లు ఆపరేషన్లు, చెడిపోయిన ఒక ఊపిరితిత్తి తీసివేత,
అంతిమ సమయంలో పక్షవాతం, 26 మాసాలపాటు
కోమాలో ఉండటం వీరనుభవించిన బాధలు. రాష్ట్ర సాహిత్య
అకాడమీ అవార్డు, స్వర్ణాభిషేకం, స్వర్ణకంకణం, స్వర్ణగండ
పెండేరం, వారణాసి విశ్వవిద్యాలయం వారి డి.లిట్.,
తెలుగుదేశం నిండా అనేక సన్మాన సత్కారాలు, ఎం.ఎల్.సి.
పదవి వీరందుకొన్న వైభవాలు. సుమధుర, సంగీత
స్వర సంయుతంగా కోకిల గళంతో కావ్యగానం చేయడం
వీరి ప్రత్యేకత!
వయః పరిమితినీ, విద్యార్హతలనూ సడలించి రాష్ట్ర
ప్రభుత్వం, శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారి ముఖ్యమంత్రిత్వంలో
వీరికి ఉపాధ్యాయ పదవీ నియామకం చెయ్యడం వీరి
“సహజ పాండిత్యానికి నిదర్శనం.
తెలంగాణ 492 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
bxp39cjlnmzfq6g1lk364h6nn7m8awq
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/514
104
212237
553453
2026-04-17T06:55:40Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పోతన వలెనే సహజ పాండిత్య విభాసితులైన అభినవ పోతన శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు వ్యవసాయమూ చేసిన కృషీవలులు కూడా. సాహిత్యంలో, వ్యక్తిత్వంలో ముమ్మార్తులా పోతన మూర్తీభవించిన...'
553453
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పోతన వలెనే సహజ పాండిత్య విభాసితులైన అభినవ
పోతన శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు వ్యవసాయమూ
చేసిన కృషీవలులు కూడా. సాహిత్యంలో, వ్యక్తిత్వంలో
ముమ్మార్తులా పోతన మూర్తీభవించిన అభినవ పోతన -
మహాకావ్యం "పోతన చరిత్రము”. ఈ మహాకావ్య రచనకు
వీరికి పన్నెండేళ్లు పట్టింది. ఇందులోని "భోగినీలాస్యం”
కూర్చున్న చోటునుండి లేవకుండా రాత్రంతా సమాధిస్థితిలో
విరచించిన అత్యద్భుత సంగీత సాహిత్య నాట్యమయ ఘట్టం.
పన్నెండు స్కంధాలతో పరిపూర్ణమైన పోతన శ్రీమహా
భాగవతం వలెనే; అభినవ పోతన విరచితమైన “పోతన
చరిత్రము” కూడా ద్వాదశాస్వాస విలసితం. అంతగా
ఇతివృత్త పటుత్వంలేని పోతన జీవన ఘట్టాలను ఒక
మహాకావ్యంగా, మలచడం వరదాచార్యులవారు చేసిన గొప్ప
తపస్సు! "విన్ననఖింత భాగవత విశ్రుత వీఠికలోన తాను
పోతన్న వచించినంతను... మనమ్మున దోచినంత - అనే
పద్యం మూడు మార్గాల కూడలిగా పోతనకావ్యం ఉన్నదని
తెలుపుతున్నది.
''ఓరుగల్లు 'బమ్మెర పోతన్న కడపజిల్లా “ఒంటిమిట్ట"
వాడని ఒక వాదం. పోతన చరిత్ర రచనా కాలంలో
ఉండేది. ఆ ప్రవాదాన్ని కూడా తోసివేయక వరదాచార్యుల
వారు - 'పోతన తన ప్రవాసకాలంలో, సర్వజ్ఞ సింగ
భూపాలుని ధాటికి స్వస్థలం విడిచిపోయిన సమయంలో
తన భాగవతాన్ని ఒంటిమిట్టలోని కోదండ రామస్వామికి
అంకితం చేసినాడని వ్రాసి ఒక అద్భుతమైన
సమన్వయదృష్టిని ప్రదర్శించారు. ఆ సమయలో వ్రాసిన
ఒక
"చిన్ననటంచు నెంచక సిగ్గాక ఇంచుకలేక భక్తపో
తన్నను గూడి భాగవతతత్త్వముబాడ గళము విప్పితిన్
నన్నిక దిట్టిపొండు కరుణంగని దీవెనలిండునాల్గుకో
యి ఆంధ్రపదాల
నివాళిబట్టితిన్.”
ఈ పద్యాన్ని బహుశా, తర్వాత వానమామలై పీఠికల్లో
చేర్చి ఉంటారు. ఇందులో తన “అభినవ పోతన" తనంతో
పాటు - మంగళార్థమయి అనే ప్రయోగంలో "కావ్యం
యశసేవృతే శివతరక్షతయే” అనే పూర్వాలంకారిక
నిర్వచనదృష్టి కూడా ఉన్నది.
"ముందర నీకు మ్రొక్కి కలముంగయిబూనితి, దాని
జిహ్వపై
నందము చిందగా బదములందు సువర్ణపుటందెలూని
తద్ధింధిమితైతతోమ్మనుచు దివ్యరసధ్వనులూరె
నాట్య మి
పొందగజేయవే! సహృదయుల్విబుధుల్ వినుతింప
భారతీ!"
అనే కావ్య ప్రారంభ సరస్వతీస్తోత్రంలో సంగీతసాహిత్య
నాట్య వైభవాల ధ్వని ఉన్నది.
పోతన్న భాగవత రచనా సందర్భంలోని ఈ పద్యంలో
'స్వభావోక్తి' అనే అలంకారం అంచులు దిద్దుకున్నది. ప్రక్కన
నున్న ముల్లుగొని, పచ్చలు విచ్చెడి తాటికమ్మపై జెక్కదొడంగె
ముత్తియపు చేరుల దీరుచు నక్షరాళి, పై కెక్కిడు బొమ్మలన్
నుదుట నేర్పడు రేఖలు - భావవాహినిస్ జక్కని యానకట్టన
సౌరులు దిద్దగ దన్మయాప్తతన్.
ఈ పదాల పోహళింపులో పోతన్నమూర్తి చెక్కిన
శిల్పంలా దర్శనమియ్యడం లేదా?
రుచిరార్థసూక్తులకు పోతన చరిత్రము పెన్నిధి.
"ధరనుపాధ్యాయుడెదా యొక్క తరుణమందు
భ్రాంత పరిమిత జనులకు పాఠమిపను
కాని సత్కవి వాణి శిక్షణ మొసంగు
సకలకాలమ్ములందు విశ్వప్రకృతికి”
వంటి పద్యాలు వరదాచార్యుల సూక్తి నిధిత్వానికి
ఆనవాలు.
వ్యక్తుల, పాత్రల చిత్రణం - వర్ణనమే కాక తదితర
సందర్భాల్లోని కవిత్వ వైచిత్రి కూడా అద్భుతం. ఒక ఎద్దుల
బండి ఎక్కి శ్రీనాథుడు పోతన్న దగ్గరికి వస్తాడు. ఆ
సందర్భంలో చేసిన వర్ణనం
"చకచకగిత్తల కదముకు
త్రకిట ధికి ధకిటగా మృదంగధ్వని టక్
టికుమనుకేదారాహతి
నికటతటిని శకటమొకటి నిలిచినయంతన్.”
దీనిలోని మృదంగధ్వని పూర్వక అక్షర విన్యాసం
అభినవపోతనకు ఉన్న మహాశబ్దాధికారాన్ని వెల్లడించడం
లేదా?
తెలంగాణ 493 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
s9fnjqlha5vaw3kwa9bu58jc8leu17k
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/515
104
212238
553454
2026-04-17T06:56:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పోతనవలెనే అభినవ పోతన కూడా తన మహాకావ్యాన్ని శ్రీరామాంకితం చేశారు. సొమ్ములయాసలో బడక క్షుద్రకృపాలుర నీవడించి చొక్కమ్మగు భక్తి భాగవత కావ్యరమన్ గృతినిచ్చె నీకు శ్రీ బమ్మెర...'
553454
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పోతనవలెనే అభినవ పోతన కూడా తన మహాకావ్యాన్ని
శ్రీరామాంకితం చేశారు.
సొమ్ములయాసలో బడక క్షుద్రకృపాలుర నీవడించి
చొక్కమ్మగు భక్తి భాగవత కావ్యరమన్ గృతినిచ్చె నీకు
శ్రీ బమ్మెర పోతరాజుతని భవ్యచరిత్రమునే మహాప్రబంధమ్ము
నొనర్చి నిన్ను కృతినాథునిగా నానరించి చెప్పెదన్.
“సుతుని గొప్పలగీర్తింప నతిముదమున
వినుచు దనుదాన చెడి జనకుని వలె
నాలకింపవె దేవ! మహానుభావ!
జనవినుతకీర్తి శ్రీరామచక్రవర్తి"
అనే పద్యాల్లో తనకూ పోతన్నకూ ఉన్న సమాన
లక్షణాలైన నిరీహ, నిత్య సంతృప్తి, భగవద్భక్తి వంటి వాటిని
వరదాచార్యులు ధ్వని గర్భితం చెయ్యడం గమనార్హం. ఇలా
ఎంత చెప్పినా సరిపోలని వరదాచార్యులు పోతన చరిత్రము
ప్రకృతి చిత్రణకూ మానవ స్వభావ చిత్రణకూ మంచికీ
మానవతకూ ఒక రత్నదర్పణం.
తెలుగు సాహిత్యంతో పరదాచార్యుల వారు వెలయించిన
మహానాటకం 'వైశాలిని' వారికున్న 'అభినవ కాళిదాస'
బిరుదాన్ని అన్వర్ధం చేస్తున్నది. రచనలో, పాత్రచిత్రణలో,
సంభాషణా వైఖరిలో దానికదే సాటి. శ్రేయోరాజ్యస్థాపన
జరగాలనే ఆకాంక్షతో రచించిన ఈ తొమ్మిదంతాల
మహానాటకానికి మూలకథ మార్కండేయపురాణంలో కొంత
ఉన్నది. అవీక్షితుడు, వైశాలినిని పెండ్లి ఆడటం ప్రధాన
కథ. చాలా కల్పనలతో మిశ్రకథగా ఆచార్యుల వారు
రూపొందించిన ఈ నాటకంలోని సన్నివేశ కల్పనం,
సంవిధాన చాతుర్యం, రసపోషణం, కవితా సౌందర్యం
అద్వితీయాలు.
"ప్రాణమేగుట మృత్యువు కానె కాదు
నరుడు అభిమానహతుడైన నాడె చచ్చు,
మనుపుట్టుట జన్మము కానేకాదు.
కీర్తి యుదయించునాడె యామూర్తి పుట్టు!" వంటి
పంక్తులు ఉత్తమ మానవతా ప్రతిపాదకాలు. ఈ నాటకం
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎం.ఎ.కు పాఠ్యగ్రంథంగా
కొంతకాలం ఉన్నది.
కులమతాలకు అతీతమైన మానవతా ప్రబోధంతో
వెలువడిన సుమధుర గేయ కావ్యం 'విప్రలబ్ధ'. ఏటిలో
కొట్టుకొని పోతున్న ఒక మహ్మదీయ బాలికను ఒక విప్రుడు
కాపాడి ఆమెరు 'లక్ష్మి' అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా.
పెంచుతాడు. ఆమెకు 'రాముడు' అనే ఒక రైతుతో వివాహం
జరిపిస్తాడు. కులమతాల సంకుచితత్వాలకు అతీతంగా
వెలసిన ఈ విప్రలబ్ధ కావ్యం అంతా గేయమయమే!
నీవెవడవు నీవెవడవు నిజం చెప్పుమానవుడా!
నిజముగ మానవుడ వీవు నీజాతీయ మానవత
ఆలరంగదేదియైన పొలరంగు ఒక్కటియే!"
అని ప్రబోధించే సర్వమానవ సౌభ్రాతృత్వ రచన ఇది.
"వచ్చెను వచ్చెను వర్షాలు మానసుధారాణికి తలంబ్రాలు
పంటచేలకు ప్రాణాలు” అని ముగ్ధమనోహరంగా వర్ణిస్తూనే
వాటిని, "వరికంకులనోళ్లకు చనుబాలు" అని మాతృ
మధుర హృదయంతో విరచించడం కేవలం వరదాచార్యులక
సాధ్యమేమో!
చంద్రుడట, చుట్టూ చుక్యులతో కలిపి "చదల పిల్లలకోడి
తిరిగినట్టుంటాడట!" ఈ భావనకు గొప్ప కృషీవల హృదయం
కావాలి. చదలు అంటే ఆకాశం. చదలు అంటే కోడి, తన
పిల్లలతో కలిసి ఏరుకొని తినే చదలు. ఎంతటి విశ్లేషరమ్యం
ఇది!
“ఎవ్వరీ చిన్నది ఎంతబాగున్నది?
కన్ను ఇక్కడనుండి కదలనంటున్నది!
పెదవి చెలియలికట్ట నొదుగు సిగ్గుల కడలి
నవ్వు ముత్యాల్ బోసి నా గుండె కొన్నది"
అని నాయిక లక్ష్మిని చూసి నాయకుడు రైతు రాముడ
సుకోవడం ఎంతటి సహజ పల్లీయ వర్ణన! "సిగ్గుల కడలి
నవ్వు ముత్యాలు" అనే ప్రయోగం మన అలంకార శాస్త్రంలో
పూర్ణోపమ! వాళ్లిద్దరికీ అదేమి తెలియదు పరిపూర్ణ స్నిగ్ధ
ప్రజయం తప్ప.
అరవైకి పైగా ఇలా అత్యద్భుతంగా అభినవ పోతన
డా. వానమామలై వరదాచార్యులు సృష్టించిన మహోన్నత
సాహిత్యంలో మరికొన్ని - మణిమాల, ఆహ్వానం,
జయధ్వజం, స్తోత్రరత్నావళి, గీతరామాయణం, సూక్షి
వైజయంతి, స్తవరాజ పంచశతి, అభ్యుదయ నాటికా సంపుటి,
యువతులు తెలంగాణ 494 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
o02gckidex6z2ifnmabknet4jbttg49
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/516
104
212239
553455
2026-04-17T06:56:15Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రైతుబిడ్డ, దాగురింతలు, వ్యాసవాణి వంటి మేటి రచనలు వాటికవే సాటి. "వరదాచార్యులు మద్గురూత్తములు శ్రీవాగీశ్వరీలబ్ధి దివ్యరసోల్లాస కవిత్వ విద్యులు తలంపన్ పోతనామాత్యులే కరుణన...'
553455
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రైతుబిడ్డ, దాగురింతలు, వ్యాసవాణి వంటి మేటి రచనలు
వాటికవే సాటి.
"వరదాచార్యులు మద్గురూత్తములు శ్రీవాగీశ్వరీలబ్ధి
దివ్యరసోల్లాస కవిత్వ విద్యులు తలంపన్
పోతనామాత్యులే
కరుణన్ రెండవసారి బుట్టిణ తెలంగాణమ్మునన్
వానమా
మల వంశాంబుధి చంద్రులై సుక విరాణ్మంచార
బృందారు!"
విడుచును తెలంగాణ
495 తేజోమూర్తుల బడులు<noinclude><references/></noinclude>
8c6fg6tf9o2efl4y4i47hgvtke0m2ls
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/517
104
212240
553456
2026-04-17T06:56:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '144 వం దేమాతరం రామచంద్రారావు అసలు పేరు వావిలాల రామచంద్రారావు. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేకసార్లు జైలుకు వెళ్ళిన ధీశాలి. 'వందేమాతరం' తన ఊపిరిగా నినదించిన సత్యా...'
553456
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>144
వం దేమాతరం రామచంద్రారావు అసలు పేరు
వావిలాల రామచంద్రారావు. ఆనాడు నిజాంకు
వ్యతిరేకంగా పోరాటం చేసి అనేకసార్లు జైలుకు వెళ్ళిన
ధీశాలి. 'వందేమాతరం' తన ఊపిరిగా నినదించిన
సత్యాగ్రహి, అంతేకాదు గొప్పవక్త, ఆర్య సమాజ కార్యకర్త,
అధికార భాషాసంఘం అధ్యక్షులుగా ఉండి తెలుగు భాష
ఉన్నతి కోసం తపించిన సంస్కర్త.
వందేమాతరం రామచంద్రారావు 1917లో ఏప్రిల్
25వ తేదీన, మహబూబ్ నగర్ జిల్లాలో, రామలక్ష్మమ్మ
రామారావు దంపతులకు జన్మించారు. వీరిది సంప్రదాయ
కుటుంబం. వీరి అన్న వీరభద్రరావు కూడా నిజాంకు
ఎదురొడ్డి నిలిచిన ధీరుడు. రామచంద్రరావుకు తల్లిదండ్రుల
సాహచర్యం వలన బాల్యదశయందే సంస్కార భావాలు
అలవడ్డాయి. విద్యార్థి దశలోనే ఆర్య సమాజ కార్యకర్తగా
శిక్షణ పొందారు. ఆనాడు హైదరాబాదు మర్షణలు
జరుగుతుండేవి. ఒకవైపు ఆర్యసమాజం హిందూమతంలో
దురాచారాలను నిర్మూలిస్తూనే మరొకవైపు హిందువుల ఐక్యత
కోసం పాటుపడేది. నిజాం ప్రభుత్వం మాత్రం ఆర్య
సమాజాన్ని మతవిరోధ సంస్థగా భావించేది.
వందేమాతరం గారు హిందువులందరినీ ఒక త్రాటిపై
నడిపించడానికి ఎంతో ప్రయత్నించారు. హైందవ
సమాజంలో కుల, వర్ణ వ్యవస్థవల్ల ఐకమత్యం కొరవడిందని
వందేమాతరం రామచంద్రారావు
- డా|| యం. దేవేంద్ర
గ్రహించి కులరహితమైన ఆర్య సమాజ సిద్ధాంతాలపట్ల
ఆకర్షితుడై వాటిని అనుసరించారు. ప్రజలందరిని ఆర్య
సమాజంవైపు మళ్ళించారు. ఒక వారందరిని ఒక సంఘటిత
శక్తిగా రూపొందింపచేశారు. హైదరాబాదులోనే గాక
ఢిల్లీలోని ఆర్యసమాజ ప్రధాన కేంద్రాల్లో కూడా అనేక కీలక
పదవులను నిర్వహించి దేశవ్యాప్తంగా ఆర్య సమాజాన్ని
ప్రచారం చేశారు. దేశభక్తిని చాటారు.
ఆనాడు భారతదేశమంతటా స్వాతంత్ర్యోద్యమం
దశలవారిగా బలవడుతుంటే స్వయం ప్రతిపత్తి కలిగిన
హైదరాబాదు రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
బ్రిటిషు పరిపాలనతో సంబంధం లేకుండా నిజాం తనదైన
శైలిలో పరిపాలనను కొనసాగిస్తున్నాడు. కాబట్టి తెలంగాణ
ప్రజలకు స్వాతంత్య్ర కాంక్ష ఉన్నప్పుడు నిర్బంధంలో ఉండి
పోవల్సిన పరిస్థితి. నిజాం రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థల్లో
ప్రార్థనాగీతం నిజాంకు సంబంధించినదే పాడేవారు. కాని
1938 నవంబరు 30వ తేదీన ఉస్మానియా విశ్వ
విద్యాలయంలో చదివే విద్యార్థులు సాహసించి 'వందే
'మాతరం' గీతం ప్రార్థన గీతంగా ఆలపించారు. ఆ రోజు
చరిత్రలో కీలకమైన రోజుగా చెప్పవచ్చు. ఆలపించడమే
కాకుండా ఆనాటి యువ విద్యార్థులు అచ్యుతరెడ్డి,
హరిహరరావు దేశపాండే, వి.కె. రెడ్డి నాయకత్వంలో
ఉస్మానియా విద్యార్థులు ఒక కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు
చేసుకున్నారు. అనతికాలంలో 'వందేమాతరం' ఉద్యమంగా
తెలంగాణ 496 తేజోమూర్తులు దీ<noinclude><references/></noinclude>
p3zubzvgeqeapdj7zhia9b1due03722
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/518
104
212241
553457
2026-04-17T06:56:43Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మారి తెలంగాణ వ్యాప్తంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. అంతకంటే ముందే 1938 అక్టోబరు 22వ తేదీన గౌలిగూడలో హిందూ పౌరహక్కుల సంఘం తరపున యశ్వంతరావు, దిగంబరరావు జోషి, జుక్కల్క...'
553457
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మారి తెలంగాణ వ్యాప్తంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం
మొదలైంది.
అంతకంటే ముందే 1938 అక్టోబరు 22వ తేదీన
గౌలిగూడలో హిందూ పౌరహక్కుల సంఘం తరపున
యశ్వంతరావు, దిగంబరరావు జోషి, జుక్కల్కర్ తదితర
నేతలు నిజాం సర్కారు వైఖరికి నిరసనగా ఒక గొప్ప
ప్రజాప్రదర్శనకు పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో
పాల్గొన్నారు. కొంతమంది ఉత్సాహంతో ప్రసంగించారు.
వారిలో రామచంద్రారావు ఒకరు. ఊహించిన విధంగానే
ప్రభుత్వం ప్రదర్శనకారుల్ని అదుపులోకి తీసుకుంది. ఉద్రిక్త
పరిస్థితులు నెలకొన్నాయి. అట్లా అరెస్టయిన వారిలో
రామచంద్రారావు కూడా ఉన్నారు. జైల్లో తనతోపాటు స్వామి
రామానంద తీర్థ ఉన్నారు. శిక్షను అనుభవించే ఆర్యసమాజ
కార్యకర్తల జంధ్యాలన్నీ తీసివేశారు. రామచంద్రారావు గారి
నాయకత్వంలో జైల్లో నిరసన దీక్షకు కూర్చున్నారు. తమకు
జంధ్యాలు వేస్తేనే భోజనం చేస్తామని ప్రకటించారు. అప్పుడు
జైలు అధికారులు దిగిరాక తప్పలేదు. దానితో రామచంద్రా
రావు సామాన్యుడు కాడని అధికారులకు తెలిసివచ్చింది.
సత్యాగ్రహులైన ఖైదీలు రోజూ సంధ్యావందనం
ఆచరించేవారు. అటు తర్వాత వందేమాతరం అంటూ
నినదించేవారు. ఈ విషయంలో జైలు అధికారులకు
తీవ్రమైన అసహనం ఉండేది. వారు ఈ నినాదాన్ని
పలకవద్దని పలుమార్లు ఖైదీలను హెచ్చరించారు. ఖైదీలు
ఈ హెచ్చరికల్ని ఎంతమాత్రం ఖాతరుచేయలేదు. ఈ
విషయం కాస్తా నిజాం రాష్ట్ర జైళ్ళ డైరెక్టర్ జనరల్ హెచ్.బి.
హాలిన్స్ వరకు చేరింది. ఆయన చంచల్గూడ వచ్చి
సత్యాగ్రహులైన ఖైదీలకు హెచ్చరికలు జారీ చేశాడు.
అయినప్పటికీ ఖైదీలు వందేమాతరం నినదించడం
మానలేదు. వారి నాయకుడిగా ఉన్న రామాచంద్రరావు
మీదికి జైలు అధికారుల దృష్టి మళ్ళింది. ఆయనను తీవ్రంగా
హింసించాలనుకున్నారు. కట్టివేశారు. కరడుగట్టిన నేరస్తుడితో
ఆయనను కొట్టించారు. కొట్టిన ప్రతికొరడా దెబ్బకు
వందేమాతరం అంటూ నినదిస్తూనే ఉన్నాడు. కొట్టిన దెబ్బల
కారణంగా శరీరమంతా రక్తం కారుతున్నప్పటకీ
వందేమాతరం గొంతెత్తి పలుకుతూనే ఉన్నారు. రామచంద్రా
రావు స్పృహతప్పి పడిపోయేవరకు కొడుతూ పోయారు జైలు
అధికారులు. నిజాం సర్కారు ఎంతగా హింసించినా
రామాచంద్రారావులోని పోరాట పటిమ ఎదుగుతూ
వచ్చిందేకానీ బలహీనం కాలేదు. చంచల్ గూడ జైలు నుండి
విడుదలైన కొంతకాలానికే తిరిగి ఉద్యమంలో చేరారు.
గౌలిగూడ రామమందిరం ప్రాంతంలో అశేష
ప్రజానీకాన్ని ఉద్దేశించి "బాధ్యతాయుత ప్రభుత్వాన్ని
సాధించితీరుతాను” అంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం
అతడిని తిరిగి అరెస్టు చేసింది. రాజద్రోహ నేరాన్ని మోపింది.
1941లో రామచంద్రారావు జైలు నుండి విడుదలయ్యారు.
హైదరాబాదు సంస్థానంలో కె.ఎం. మున్నీ భారత
ఏజెంట్ జనరల్గా ఉన్నరోజుల్లో ఆయనకు సహకరిస్తూ
వందేమాతరం సోదరులు ఎన్నో సాహసాలు చేశారు. ఈ
విషయాన్ని దాశరథి రచించిన యాత్రాస్మృతిలో ఒకచోట
పేర్కొన్నారు. "తన రాష్ట్రాన్ని స్వతంత్ర రాష్ట్రంగా.
నిలబెట్టుకోవడానికి నిజాం నవాబు చేస్తున్న సన్నాహాలలో
కొత్త కొత్త ఆయుధాల ఉత్పత్తి ఒకటి. ముఖ్యంగా జపాన్
టైవ్ త్రీనాట్ త్రీ డ్రైఫిల్ ఐకాప్రింట్ శ్రీ మున్నీకి
కావలసివచ్చింది. ఆ పని మేం చేస్తామని వందేమాతరం
సోదరద్వయ ముందుకు వచ్చారు. ఒక చీకటిరాత్రి, నిజాం
సైన్యాల అధిపతి ఎల్.ఎ. డ్రూస్ విశ్వాసపాత్రుడైన జె.సి.ఓ.
ఒకడు ఉండేవారు. అతడు గోల్కొండలోని మోతీమహల్లో
ఉన్న ఆయుధ నిర్మాణశాలకు అధికారి, ఎలాగో అతని
కన్నుగప్పి ఈ ఇద్దరు సోదరులు ఆయుధ నిర్మాణశాలలో
ప్రవేశించారు. పులినోట్లో తలపెట్టినట్లే. పద్మవ్యూహంలో
ప్రవేశించినట్టే. ప్రశాంతచిత్తంతో వజ్ర సంకల్పంతో
నిర్దుష్టమైన పథకం ప్రకారం ఆ రహస్యాన్ని సాధించారు.
శ్రీ మున్నీకి అందించారు." ఎంతటి సమయస్ఫూర్తి ఉంటే
తప్ప ఇట్లాంటి సాహసకృత్యాలు సాధిస్తారు. ఈ విధంగా
అఖిల భారతస్థాయిలో కె.ఎం. మున్షీ వీరసావర్కర్ వంటి
ప్రశంసల్ని అందుకున్నవారు వందేమాతరం సోదరులు,
రామచంద్రారావు తొలుత హైదరాబాదు రాష్ట్రంలోనూ,
అటు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ క్రియాశీలంగా
పనిచేశారు. శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి
గెలిచారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని
బలపరిచారు. చిన్నరాష్ట్రాలు ఏర్పడాలని కోరుకున్నారు.
చేతులు తెలంగాణ (497 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
tv8hxiryj2bk4o05dg2gf5yfa458dqg
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/519
104
212242
553458
2026-04-17T06:56:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1980 ప్రాంతంలో ఇప్పటి మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వం వీరిని అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి ఛైర్మన్ గా నియమించింది. ఆ హోదాలో వీరు రాష్టేతర ప్రాంతాలలో విదేశాలలో ఉన్న తెలుగువార...'
553458
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>1980 ప్రాంతంలో ఇప్పటి మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వం
వీరిని అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి ఛైర్మన్ గా
నియమించింది. ఆ హోదాలో వీరు రాష్టేతర ప్రాంతాలలో
విదేశాలలో ఉన్న తెలుగువారికి అనేక భాషా సేవా
కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత 1981లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా
నియమించింది. తెలుగు భాష అమలు కోసం నిరంతరంగా
కృషి చేశారు.
ఈ విధంగా జీవితంలో అనేక సాహసాలు చేసి,
ఉద్యమం ఊపిరిగా జీవించి అనేక పదవులను అలంకరించి
ప్రజావ్యక్తిగా చరిత్రలో నిలిచిన సాహసి వందేమాతరం
రామచంద్రారావు.
తెలంగాణ (498 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
3wiivyrnqlif7yagnina49qxwqmnbb6
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/520
104
212243
553459
2026-04-17T06:57:11Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '145 నువులోను అణువణువున తర తరాల పోరాటం... భూమి కోసం, భుక్తికోసం, చైతన్యం కోసం, రేపటి తరానికి మంచి భవిష్యత్ కావాలనే తపనతో పోరాటం నాడు తెలంగాణాలో కన్పించిన వాతావరణం. ప్రజా వ్యతిర...'
553459
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>145
నువులోను అణువణువున తర తరాల పోరాటం...
భూమి కోసం, భుక్తికోసం, చైతన్యం కోసం, రేపటి
తరానికి మంచి భవిష్యత్ కావాలనే తపనతో పోరాటం నాడు
తెలంగాణాలో కన్పించిన వాతావరణం. ప్రజా వ్యతిరేకంగా
పాలన సాగించిన నైజాం రాజ్యంలో ప్రజల ఆర్తి, ఆరాటం,
బలిదానాలు, త్యాగాలు ప్రజల దుస్థితికి తార్కాణాలు.
ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ మొత్తం చీకటి కాలంగా
పేర్కొనవచ్చును. ఆ రోజుల్లో ప్రజలందరు నిజాంకు కొమ్ము
కాస్తున్న దొరలకూ, దేశ్
ముఖ్ కు తల వంచి హీనంగా
బతకవలసి వచ్చింది.
ఇంతటి గడ్డుపరిస్థితి తెలంగాణలో నెలకొని ఉండటం
విచారకరం. అయితే దీనిని ఎదిరించడంలో ఎందరో
మహానీయులు హింస, అహింసా (గాంధేయ) మార్గాలతో
తమ తమ పోరాటశక్తిని చూపారు. అయితే కాలం చెరిపేసిన
జ్ఞాపకాలలో నైజాం రాజు పాలనను ఎదిరించిన వారిలో
పేరున్నవారు మాత్రమే ఈనాటికీ పోరాట యోధులుగా
నిలచిపోయారు. కాని చరిత్ర పుటలకెక్కని వారిని శోధించి
సమాజానికి అందించవలసిన అవసరం పరిశోధకులపై
ఉంది.
నైజాం రాజ్యంలో దొరలు, దేశముఖ్ ఆగడాలు
భరించలేని బడుగు, బంజార తెగలవారు అణచబడ్డ చరిత్రకు
సాక్షీ భూతంగా నిలిచారు. అయితే వారిని మనుష్యులుగా
వాంకుడోత్ జోగ్యా నాయక్
-
- డా॥ వి. రామకోటి
మలిచిన నాటి నిప్పు కణాలు చరిత్రలో మణిపూసలుగా
నేటికీ తళుకులీనుతునే ఉన్నాయి. తెలంగాణాలో గ్రామాల
అభ్యున్నతి కోసం సమాజ వికాసం కోసం జాతి ఔన్నత్యం
కోసం బంజారాలు ఆజన్మాంతం శ్రమించారన్నది స్పష్టపడే
విషయం. ఈ నేపథ్యంలో నిజాం రాజుకు కొమ్మకాస్తున్న
దొరలను, దేశముఖ్ ను ఎదిరించి లంబాడ జాతికి మరో
గాంధీలా వెన్నుదన్నుగా నిలిచి పోరాడిన అహింసామూర్తి
జోగ్యా నాయక్ వాంకుడోత్,
జోగ్యా నాయక్ నేటి జనగాం జిల్లా లక్ష్మక్కపల్లి గ్రామ
నివాసి. ఈయన తన కుటుంబాన్ని పోషించుకోవడమే
కాకుండా ఆ గ్రామ తండా వాసులతోపాటు ఇతర గ్రామ
ప్రజల బాగోగులను చూసుకునేవాడు. ఈ బంజారాలు
బంజరు భూములను సాగులోకి తీసుకొచ్చి పుట్లకు పుట్లు
పంటదీస్తుంటే దీనిని చూసి భరించలేని ఆ గ్రామ దొర
పుసుకూరి రాఘవరావు ఆ భూమిని తీసుకొని వీరిని మరో
చోటుకు పంపించేవాడు. ఈ విధంగా ఆ గ్రామంలోనే
అనేకచోట్లు తిరిగిన లంబాడాలు జోగ్యా నాయక్ ఆధ్వర్యంలో
దొరను ధిక్కరించడంతో భూ పోరాటానికి బీజం పడింది.
ఈయన ఆధ్యర్యంలో అనేకమంది బంజార యువకులు
దొరలను తీవ్రంగా వ్యతిరేకించి పోరాటాలకు
సన్నద్ధులయ్యారు. ఆ సమయంలో ఉన్న క్రిమినల్ ట్రైబ్స్
(Criminal Tribes) (CT) యాక్టుతో దొరలు వీరిని
దొంగలుగా ముద్రవేశారు. ఈ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ
చేతులు తెలంగాణ 499 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude>
o0oiyh89eqy4fe7b4659f56k6q8jo71
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/521
104
212244
553460
2026-04-17T06:57:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'జోగ్యా నాయక్ భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా హైదరాబాదుకు వచ్చిన గాంధీ గారిని కలిశారు. గాంధీగారి సలహాతో తన పోరాటాన్ని గాంధేయ (అహింసా) మార్గంలో నడిపించిన ఉద్యమ యోధుడు బంజ...'
553460
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>జోగ్యా నాయక్ భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా
హైదరాబాదుకు వచ్చిన గాంధీ గారిని కలిశారు. గాంధీగారి
సలహాతో తన పోరాటాన్ని గాంధేయ (అహింసా) మార్గంలో
నడిపించిన ఉద్యమ యోధుడు బంజార నాయకుడు
శ్రీ జోగ్యా నాయక్.
ఒకసారి విసునూరి రామచంద్రారెడ్డి బండిలో తాను
కూర్చొని ఇద్దరు దళితులతో బండి లాగిస్తూ బండి వెనకాల
మరొక దళితున్ని చేతులు కట్టేసి చెన్నూరు నుండి మంచుప్పుల
రోడ్డుపై కొట్టుకుంటూ పరుగెత్తిస్తుంటే, దీనిని గమనించిన
జోగ్యానాయక్ బండికి అడ్డంగా పరుగెత్తి బండిముందు
అడ్డంగా పడుకున్నాడు. నన్ను చంపిన తర్వాతే వారికి శిక్ష
వేయమని దొరకు సవాల్ విసిరాడు. ఆనాటి నుండి ఆయన
ధైర్యసాహసాలకు నాటి జనం జేజేలు పలికారు.
ఆ తరువాత గ్రామ ప్రజలు జోగ్యానాయకున్ను తమ
నాయకునిగా ఎన్నుకున్నారు. కమ్యూనిస్టులకు, నిజాం
రాజుకు దొరల ఆగడాలను వివరించే బాధ్యతను
ఆయనకప్పగించారు. నాయకత్వ లక్షణాలు, మాట్లాడే
చతురత, సమయస్ఫూర్తి, గాంధీ స్ఫూర్తితో దొరలను
ధిక్కరిస్తూ నాటి జనం గుండెల్లో శాశ్వత కీర్తిని సంపాదించు
కున్నాడు. దొరలు తనను అంతమొందించడానికి పన్నే
కుట్రలను భగ్నం చేస్తూ సమయస్పూర్తితో మెలిగేవాడు.
జోగ్యానాయక్ ప్రేరణ నాటి బంజార యువకులపై
బలంగా పడింది. కమ్యూనిస్టులు తండాలకు వచ్చి
సమకాలీన పరిస్థితులను వివరించి పోరాటాలకు సిద్ధం
చేసేవారు. అటువంటి వారిలో పాలకుర్తి సమీపంలో
కొండాపురం గ్రామంలో లకావత్ హేమ్లా బంజార తెగలో
పాలకుర్తి ఏరియా తొలి కమ్యూనిస్టు నాయకుడు గండర
గండరాలుగా పిలువబడ్డ జాటోతు తాన్యా నాయక్, దర్యా
నాయక్లు కర్రలు, గొడ్డళ్ళు, కత్తులు, తుపాకుల (308)తో
రజాకార్లపై రౌడీలపై విరుచుకపడ్డారు. ఒక సందర్భంలో
రౌడీలను నరసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి చంపినట్లుగా
చంపారని ఈ ప్రాంత వాసులు ఇప్పటికి కథల కథలుగా
చెప్పుకుంటారు. జాటోతు కాన్యా నాయక్ పోరాటపటిమ
లంబాడ సమాజానికి ఒక స్ఫూర్తి.
ధరావత్ ఐగ్యానాయక్, ధరావత్ పంతుల్యాలు కూడా
మొండ్రాయి గ్రామంలో దొరలను తీవ్రంగా ప్రతిఘటించి
తరిమికొట్టారు. తమ భూములను కాపాడుకోగలిగారు.
సింహం కడుపున సింహమే పుడుతుందన్నట్లుగా
జోగ్యానాయక్ కడుపున ధైర్యానికి నిలువెత్తు దర్పణమైన
తార్వా నాయక్ను ఈ సందర్భంగా ప్రస్తావించడం
అనివార్యం. ఇతని పోరాట పటిమ అమోఘం. లంబాడజాతి
పోరాటయోధుల కీర్తి కిరీటంలో కలికితురాయి. తార్యా
నాయక్ను తుపాకి తార్య అనడం ఇప్పటికి ఒక రివార్డ
అవుతుంది. పోరాటయోధులు ఆరుట్ల రామచంద్రారెడ్డిని
లక్ష్మక్క పల్లి గ్రామానికి తీసుకు వచ్చి నిజాం వ్యతిరేక
పోరాటంలో ఆ గ్రామ దొర అయిన రాఘవరావుకు
వ్యతిరేకంగా ఎడ్లబండ్లతో ఊరేగించి ఆ దొర ఇంటిముందు
వ్యతిరేక నినాదాలు చేస్తూ అనేక గ్రామ ప్రజలను ఒక్క
త్రాటిపైకి తీసుకు వచ్చిన జోగ్యానాయకు తోడుగా
నిలబడ్డాడు తనయుడు కార్యానాయక్.
జోగ్యానాయక్ నిజాం వ్యతిరేకంగా భూపోరాటం
చేసిన కాలంలో లక్ష్మక్క పల్లిగ్రామం దొరపై కేసుపెట్టడానికి
తన గ్రామం నుండి భువనగిరి కోర్టుకు సుమారు 70 కి.మీ.
నడిచి వచ్చిన సంఘటన తార్వానాయక్పై చూపింది.
లంబాడా జాతిని ఉద్దరించడానికి, సామాజిక న్యాయం,
గౌరవం, రక్షణ వంటి వాటికై అనునిత్యం శ్రమించిన
శక్తిశాలి. తండ్రి ఆశయం, చైతన్య స్పూర్తిని మనసు నిండా
నింపుకొని దొరలపై యుద్ధం ప్రకటించాడు. నిజాం
ప్రభుత్వంలో పెద్ద వర్గానికే పరిమితమైన తుపాకిని తన
చతురతతో లైసెన్స్ తుపాకి సంపాదించి తుపాకి తార్యగా
ప్రసిద్ధుడయ్యాడు.
మనం మనం జనం జనం కలిసి కదిలితే బలం
బలగం అన్నట్లు అందరి కోసం బతకడమే సిద్ధాంతంగా
ముందుకు సాగాడు. తార్యానాయక్ తండ్రి నుండి వచ్చిన
వారసత్వం, పోరాడేతత్వం అతనిని మానవతవాదిగా
మార్చాయి. బలం అంటే తార్యానాయక్ తన కులం, తన
జాతియే కాకుండా మానవత బలమని చాటాడు. ఈ తత్వమే
ఈయనను వెనుకబడిన జాతులకు ఆప్తుణ్ణి చేసింది. చదువుతో
అయయం చేయుటయు తెలంగాణ (500 తేజోమూర్తులు ఉండి<noinclude><references/></noinclude>
o9zx9mtulmswgrhtv0imlnqtr64b5og
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/522
104
212245
553461
2026-04-17T06:57:39Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పని ఏమి హృదయమున్న చాలు అన్నట్లు తల్లిదండ్రుల నుండి తెచ్చుకున్న పరోపకార జ్ఞానం పరమాత్మ జ్ఞానంగా మలుచు కున్నాడు. శ్రమను నమ్ముకున్న తార్య ఆశ్రమఫలం పరాయి పరం కాకుండా ఉద్యమా...'
553461
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పని ఏమి హృదయమున్న చాలు అన్నట్లు తల్లిదండ్రుల నుండి
తెచ్చుకున్న పరోపకార జ్ఞానం పరమాత్మ జ్ఞానంగా మలుచు
కున్నాడు. శ్రమను నమ్ముకున్న తార్య ఆశ్రమఫలం పరాయి
పరం కాకుండా ఉద్యమాలకు ఊపిరి పోశాడు. హైదరాబాద్
సంస్థానంలో జాగీరుదారులు, భూస్వాములు, జమిందారులు
చేసే దౌర్జన్యాలను ఎదిరించడంలో తార్యనాయక్ ముఖ్య
భూమికను పోషించాడు. ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో
పోరాటం చేస్తూ పుస్కూరు రాఘవరావు, విసునూరి
రామచంద్రా రెడ్డిలు చేసే దుర్మార్గాలను ముందే పసిగట్టి
వారిచేత ఆక్రమించబడ్డ భూములను తిరిగి బంజారాలకు
ఇప్పించిన పోరాటయోధుడు. ఆరుట్ల రామచంద్రారెడ్డిపై
జరిగే హత్యాయత్యాన్ని పసిగట్టి, భగ్నంచేసి ఆయనకు
దన్నుగా నిలబడ్డాడు.
లంబాడ ప్రజల హక్కులను నేల రాస్తున్న దొరలపై
కర్మకంగా ప్రవర్తించాడు. అజ్ఞానం, అమాయకత్వం, ఆవిద్య
ఏ జాతి ఎదుగుదలకైనా అవరోధాలని భావించి, వాటిని
రూపుమాపడానికి జీవితాంతం కృషి చేశాడు. బిరుదులు,
గుర్తింపులకు అతీతంగా సమాజ సేవ చేసే మహనీయుల
సరసన సగౌరంగా నిలబడగలిగిన వ్యక్తి తార్యా నాయక్
తండ్రి జోగ్యానాయక్.
లంబాడ జాతి ఉద్ధరణ కోసం తమ జీవితాలను
తరింపచేసిన వ్యక్తులు. బంజార యోధులు జోగ్యా నాయక్,
తార్యా నాయర్లు. తెలంగాణ ప్రజలు నిజాం రాజ్యం నుండి
విముక్తులై స్వాతంత్ర భారతావనిలో కలిసినపుడు
ప్రజాస్వామ్యంలో లంబాడాలకు లభించిన హక్కులను
చూసిన జోగ్యా నాయక్ 1987లోను, తార్యానాయక్
2015లోను తెలంగాణ చరిత్ర శిఖరాలను చేరారు.
తెలంగాణ చరిత్రలో మరచిపోలేని పుటలు వాంకుడోత్
జోగ్యానాయక్.
"మీకు మీరై జన్మించారు
ఎందరి కోసమో జీవించారు”
చతురుడు తెలంగాణ ( 501 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
oymg3xj4w82t879ybuu5r0e584tyy6s
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/523
104
212246
553462
2026-04-17T06:58:14Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '146 వరహాల భీమయ్య - డా॥ రంగి కమల ణ్యదంపతులు శ్రీ వరహాల రాజన్న, శ్రీమతి అంబక్కగార్ల ఏకైక పుత్రుడు వరహాల భీమయ్య గారు. 1911, అక్టోబర్లో ఆయన జన్మించారు. మంథనిలో 7వ తరగతి వరకు విద్యాభ్య...'
553462
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>146
వరహాల భీమయ్య
- డా॥ రంగి కమల
ణ్యదంపతులు శ్రీ వరహాల రాజన్న, శ్రీమతి
అంబక్కగార్ల ఏకైక పుత్రుడు వరహాల భీమయ్య
గారు. 1911, అక్టోబర్లో ఆయన జన్మించారు. మంథనిలో
7వ తరగతి వరకు విద్యాభ్యాసము చేసి, 8వ తరగతి
కరీంనగర్లో 9, 10 తరగతులు హన్మకొండలో పూర్తి
చేసారు. హైద్రాబాదులోని సిటీ కళాశాల నుండి
ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
ఉస్మానియా యూనివర్శిటీ నుండి బి.ఎస్సీ., తర్వాత
రసాయనశాస్త్రంలో ఎం.ఎస్సీ. పట్టా సంపాదించారు.
ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఫస్టుర్యాంకు సంపాదించి
గోల్డ్ మెడల్ స్వంతం చేసుకొన్నారు. వీరు కరీంనగర్
హైస్కూల్లో టీచరుగా కొద్దిరోజులు ఉద్యోగం చేసి ఆ తర్వాత
హన్మకొండలోని హైస్కూలుకు బదిలీ అయినారు.
తెలంగాణాలోని ఒక మారుమూల అగ్రహారంలో,
సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన బాల్యం,
విద్యాభ్యాసం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది.
1949 - 50 ప్రాంతంలో హైద్రబాదులోని సుల్తాన్
బజార్ విఠల్ మారుతిగల్లీలో నివాసముండే గట్టు పురుషోత్తం
గారింటికి సాయంత్రం వేళల్లో మంథని విద్యార్థులు,
ఉద్యోగులు చేరుకునేవారు. అక్కడ ఆనాటి వివిధ రాజకీయ,
విద్యారంగ విషయాల గురించి ఆసక్తికర చర్చలు జరిగేవి.
ముఖ్యంగా శ్రీ భీమయ్యగారు ఆ సందర్భంలో చెప్పే
విశేషాలతో చాలామంది ప్రభావితమయ్యేవారు. గ్రామాల
నుండి విద్యార్జనకు వచ్చే విద్యార్థులకు ఉచితవసతి
కల్పించాలని గౌలిగూడ అక్బర్బగ్లోని శంకర్సేర్
హెూటలు వద్ద నరసిన బుచ్చయ్య అనే షావుకారు ఒక
ధర్మశాలను ఉచితంగా యిచ్చారు. ఇప్పటికి దాన్ని మంథని
గ్రామస్థులు ఉపయోగించుకుంటున్నారు.
పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం నవాబు భారత
సేనలకు లొంగిపోయి, అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని
పెద్దలతో ముఖ్యంగా ఉక్కుమనిషి సర్దారు వల్లభభాయి పటేల్
గారితో ఒప్పందం చేసుకొని తన అధికారాలను మిలటరీ
అధికారి జె.ఎస్. చౌదరికి అప్పజెప్పిన రోజులవి.
ఆ మిలటరీ ప్రభుత్వంలో అప్పటి హైద్రాబాదు
రాష్ట్రంలో కర్ణాటక, మరాఠ్వాడా మరియు తెలంగాణ
ప్రాంతానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులను
గవర్నింగ్ కౌన్సిల్లోకి తీసుకోవటం జరిగింది. అలా
అధికారం చేపట్టిన వ్యక్తుల్లో శ్రీ ధోండేరాజ్ బహదూర్ గారు,
శ్రీ డి.జి. బిందు, శ్రీరామాచారి, శ్రీ వి.బి. రాజు వంటి
ప్రముఖులుండిరి. శ్రీ ధోండేరాజ్ మహారాజ్
గారు తన
పి.ఏ.గా శ్రీ వరహాల భీమయ్యగారిని నియమించు కున్నారు.
కొద్ది రోజులకే ఈ మిలటరీ ప్రభుత్వంపైన అనేక ఆరోపణలు
ఏ తెలంగాణ (502 తేజోమూర్తులు
ఉండ<noinclude><references/></noinclude>
6eilhy6wleuf7oe76q00i2qnl6vjktm
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/524
104
212247
553463
2026-04-17T06:58:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వెల్లువెత్తిన నేపథ్యంలో అప్పటి భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు సివిల్ ప్రభుత్వం ఏర్పాటు చేసి సి.యం. వెల్లోడిగారికి అధికారాలప్పజెప్పారు. శ్రీ ధోండేరాజ్ బహదూర్, శ...'
553463
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వెల్లువెత్తిన నేపథ్యంలో అప్పటి భారత ప్రధాని శ్రీ జవహర్
లాల్ నెహ్రూ గారు సివిల్ ప్రభుత్వం ఏర్పాటు చేసి సి.యం.
వెల్లోడిగారికి అధికారాలప్పజెప్పారు. శ్రీ ధోండేరాజ్ బహదూర్,
శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు వంటి ప్రముఖులు
అధికారపగ్గాలు చేపట్టారు.
విద్యాశాఖ నిర్వహించిన శ్రీ ధోండేరాజ్ నమ్మకస్తుడు
నీతిమంతుడైన వరహాల భీమయ్యగారిని వి.ఏ.గా
నియమించుకున్నారు. ఆ తర్వాత శ్రీ బూర్గుల రామకృష్ణారావు
ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే ఏర్పడిన కాంగ్రెస్
ప్రజాప్రభుత్వంలో నిజాయితీ, ముక్కుసూటిగా వ్యవహరించే
తత్త్వం వంటి సద్గుణాలు నచ్చినందున ముఖ్యమంత్రిగారికి
మంచిసలహాదారుగా భీమయ్యగారిని నియమించారు. మంచి
పనిచేసి, ప్రశంసలందు కున్నారు.
1950-51లో అప్పటి ప్రభుత్వం విద్యా సంస్కరణలకు
నాంది పలికింది. పాఠశాలల్లో ఉర్దూమీడియంలో విద్యా
బోధన జరిగే రోజులవి. తెలుగులో విద్యాబోధన జరగాలనే
చారిత్రక నిర్ణయం తీసుకోబడినది. దీనికి శ్రీ వరహాల
భీమయ్యగారి అకుంఠిత కృషి, దూరదృష్టి ఎన్నటికీ
మరువరానిది.
మంథనిలో మొట్టమొదటి మిడిల్ స్కూలును
హైస్కూలుగా అప్ గ్రేడ్ చేయించిన ఘనత శ్రీ భీమయ్య
గారిదే. హైస్కూల్ హెడ్మాస్టరుగా శ్రీ వేంకటాచారి తర్వాత
శ్రీ గోవిందాచారి హెచ్.ఎమ్ ఉండిరి.
1954లో శ్రీ లోకే కిషన్గావుగారు మంథని హైస్కూల్లో
గణితం బోధించేవారు. ఆయన హైద్రాబాదుకు బదిలీ
అయినారు. అప్పుడు, గణితం బోధించటానికి శ్రీ
డి. రాజన్నగారిని, ఇంగ్లీషు బోధించటానికి శ్రీ రంగయ్య
నాయుడుగారిని శ్రీ భీమయ్యగారు బదిలీ చేయించినారు.
శ్రీ రంగయ్యనాయుడు హెచ్.ఎం.గా ఉన్న సమయం
ఓల్డ్ బాయిస్ మీటింగ్ వారు 3 రోజులు ఒక పెద్ద
ఉత్సవం జరుపుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి
అందరిని ప్రోత్సహించి, ఆశీస్సులందించారు.
శ్రీ భీమయ్యగారు హై క్వాలిఫయిడ్ మరియు జీనియస్.
యువకులెందరికో ఆయన రోల్ మోడల్గా నిలిచారు.
ఎందరో ఆయనను ఆరాధ్య భావంతో గౌరవించేవారు. వారి
మాటలనెంతో శ్రద్ధగా విని ఉన్నత స్థానాలకు చేరుకో
గలిగా
ఆ రోజుల్లో కరీంనగర్ జిల్లా మొత్తంలో రెండే
పాఠశాలలుండేవి. ఒకటి కరీంనగర్లో, మరొకటి మంథని.
ఎక్కడెక్కడో సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసేవారిని, కుటుంబా
లకు దగ్గరగా రప్పించారు. పాఠశాల అభివృద్ధికి వారు
తోడ్పడేలా చేసారు. మిలట్రీ గవర్నమెంట్లో మెంబర్ ఆఫ్
ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నూతన విధానలనెన్నిటినో
ప్రవేశపెట్టారు. రీజినల్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాష ఉర్దూ
నుండి తెలుగుకు మార్పించారు.
ఆడపిల్లలకు చదువులు చెప్పించటం శుద్ధ దండగ
అని భావించే ఆ రోజుల్లో, వీరు ప్రభుత్వ బాలుర హైస్కూలు
శ్రీ వేంకటరాజన్న అవధాని కూతురు ప్రేమలతాదేవి శ్రీలోకే
లక్ష్మణశర్మ కూతురు క్రాంతికుమారి ఉన్నతపాఠశాలలో
ధరఖాస్తు పెట్టుకుంటే ఆడపిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వటానికి
రూల్సు ఒప్పుకోవన్నారు. రాజన్న అవధాని హైద్రాబాద్ వచ్చి
శ్రీ భీమయ్యగారిని కలిసి విషయం వివరించారు. వెంటనే
ఒక ప్రభుత్వ ఉత్తర్వు జి.ఓ. ద్వారా బాలుర హైస్కూల్లో
బాలికలకు విద్యాభ్యాసానికి అనుమతి ప్రసాదించారు. ఆ
తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు చదువుకొని ఉన్నతస్థానాల్లో
రాణించారు. భీమయ్యగారు స్వయంగా తన కూతుర్లు రాధ,
కమలలని మాడపాటి హన్మంతరావు స్కూల్లో ఆ రోజుల్లో
చదివించారు.
శిఖాం (పర్దా బండ్లల్లో) ఆడపిల్లలు వచ్చి చదువు
కునేవారట. భీమయ్యగారా పద్ధతిని మార్పించి, స్వేచ్ఛగా
స్త్రీలు చదువుకునేటట్లు చేశారు. ఇలా శ్రీ భీమయ్యగారు స్త్రీ
విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన మహనీయులు. హైద్రాబాద్
స్టేట్ ప్రజలందరికి ప్రాతఃస్మరణీయుడు.
1988లో ఆయన సిటీ కాలేజీలో లెక్చరర్గా
ఉన్నప్పుడు అనేకమంది విద్యార్థుల కాయన యింట్లో
ఆశ్రయమిచ్చి అన్నంపెట్టి ఆదుకున్నారు. ఆ సమయంలో
ఆయన మార్గదర్శకత్వంలో, ప్రోత్సాహంతో ఎదిగిన
వారెందరో. భీమయ్యగారి మాతృమూర్తి అంబక్క అర్ధరాత్రి
అతిథులు వచ్చినా వండి వార్చి అరుసుకునే మంచిగుణమున్న
మనీషి. భీమయ్య గారికి జన్మనిచ్చిన తల్లి అన్న, జన్మభూమి
మంతని అన్నా ఎనలేని గౌరవం.
A తెలంగాణ (503 తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude>
914su4vzp1cx1pheg88kq3g6bqdl5ys
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/525
104
212248
553464
2026-04-17T06:58:48Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుగారి పర్సనల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిని మంథని దర్శింప తీసుకొని వచ్చారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల షెడ్లను, చదువుకుంటున్న విద...'
553464
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుగారి పర్సనల్
సెక్రటరీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిని మంథని
దర్శింప తీసుకొని వచ్చారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల
షెడ్లను, చదువుకుంటున్న విద్యార్థుల స్థితిగతులను
తెలియజేశారు. ఆయన ద్వారా ప్రాథమిక స్థాయి నుండి
హైస్కూలు వరకు అభివృద్ధి చేసారు. బూర్గుల వారు వెంటనే
లారీలలో వందలాది రేకులను పంపగా, తిరిగి షెడ్లను
వేయించి స్కూలు నడిపించారు. ఇప్పటికి ఆ షెడ్లు చెక్కు
చెదరకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వాటి నీడన
చదువుకున్న వెయ్యిమంది విద్యార్థులీనాడు దేశ, విదేశాల్లో
ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారంటే అది భీమయ్యగారి భిక్షే.
ఉద్యమకాలంలో రఘనాథ్ కాబే, పనకంటి గణపతి
రావు అవధానుల (హకీం) కిష్టయ్య వంటి స్వాతంత్య్ర
సమరయోధులను ఔరంగాబాద్, నిజామాబాద్ జైళ్ళకు వెళ్ళి
పరామర్శించి వచ్చిన ధైర్యశాలి. విద్యావంతులు, వివేక
వంతులైన మంథని వారికెందరికో జీవనాధారం కల్పించిన
కల్పతరువాయన. ఆనాడు హైస్కూలే లేకుంటే పొరుగు
ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే స్థోమత ఎందరికుండేది?
అక్కడ చదువుకున్నవారంతా ఇంజనీర్లు, డాక్టర్లై పిల్లపిల్లతరం
వాడున్నారంటే దాని వెనుక త్యాగశీలి భీమయ్యగారి హస్తమే
అనటం నిర్వివాదాంశము. కోఠిలోని వై.యం. ఐ.ఎస్.లో
ప్రతి సాయంత్రం ఉండేవారని, విద్యావిషయాల్లో గ్రామీణ
పరిస్థితులను మెరుగు పరచాలనే తపన ఆయన మాటల్లో
ఉండేదని సమకాలికు లంటుంటారిప్పటికి. ఆయన నిస్వార్ధ
సేవను తలచుకొని కృతజ్ఞతలర్పిస్తున్నారంటే ఆయనెంత
గొప్ప వ్యక్తో ఇప్పటి తరానికి తెలుస్తున్నది. హైదరాబాదుకు
పరీక్ష రాయటానికి వచ్చే బంధుమిత్రులెందరో వారింట్లో
నెలలుండేవారట.
1934లో ఉస్మానియా యూనివర్శిటీ కెమిస్ట్రీ
డిపార్ట్మెంట్ నుండి బంగారు పతకాన్ని పొందారు. అనేక
కార్యక్రమాలు అతి చిన్న వయసులో ముగించి, 6.1.1956
లో అకస్మాత్తుగా మరణించారు. అప్పటికే 6 గురు పిల్లలు,
భార్య 6 నెలల గర్భవతి. ఆయన జ్ఞాపకార్థం మంథనిలో
వరహాల భీమయ్య టోర్నమెంట్సుని డిసెంబర్ నెలలో
విద్యార్థులచే ఆడించి, జనవరి 26కు బహుముతులంది
స్తున్నారు. ఇంతకుముందీ ఆటలు తాలూకా లెవల్ నుండి
జిల్లా స్థాయివరకుండేవి. వరహాల భీమయ్య మెమోరియల్
గోల్డ్ మెడల్ వారి కుటుంబ సభ్యులిప్పటికి కెమిస్ట్రీ
డిపార్ట్మెంట్కిస్తున్నారు. 1973లో ఆ పతకం అందుకున్న
వారిలో వైస్ ఛాన్సలర్ శ్రీ జె. అనంతస్వామి ఉన్నారు.
ఇన్ని ప్రశంసలందుకొని, ఎంతోమందికి నిస్వార్థంగా
సహాయపడిన మహామనీషి శ్రీ వరహాల భీమయ్యగారు.
తెలంగాణ (504) తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
7qawfpqkzsejtno1x1ypuin5q98ysnx
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/526
104
212249
553465
2026-04-17T06:59:22Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '147 లంగాణా నవలా సాహిత్యం... అనగానే స్ఫురించే మొదటి పేరు వట్టికోట ఆళ్వారుస్వామి. 'అబద్ధాసురుని పాలిట తల్వార్ ఆళ్వార్' అంటూ ఆళ్వారు స్వామిని కాళోజి అభివర్ణించాడు. దాశరథి తమ 'అగ్...'
553465
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>147
లంగాణా నవలా సాహిత్యం... అనగానే స్ఫురించే
మొదటి పేరు వట్టికోట ఆళ్వారుస్వామి.
'అబద్ధాసురుని పాలిట తల్వార్ ఆళ్వార్' అంటూ ఆళ్వారు
స్వామిని కాళోజి అభివర్ణించాడు. దాశరథి తమ 'అగ్నిధార'
కావ్యాన్నీ, కేతవరపు రామకోటిశాస్త్రి తమ పిహెచ్.డి.
సిద్ధాంత గ్రంథాన్నీ, దాశరథి రంగాచార్య 'జనపదం'
నవలనూ శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితమిచ్చి తమ
గౌరవాన్ని ప్రకటించారు.
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ సమీపాన గల
'మాధవరం' అనే గ్రామంలో 1915 నవంబర్ ఒకటిన
నిరుపేద శ్రీవైష్ణవ బ్రాహ్మణ దంపతులు శ్రీమతి సింహాద్రమ్మ,
శ్రీమాన్ రామచంద్రాచార్యులకు పుట్టిన బిడ్డ ఆళ్వార్ స్వామి.
నిరుపేద కుటుంబం, దుర్భర దారిద్ర్యం, బాల్యంలో
చదువు వంటబట్టలేదు. బడిమాని, ఇంట్లోంచి పారిపోయి
వచ్చి, హెూటల్ సర్వర్గా పనిలో కుదిరాడు. నెలకు నాలుగు
రూపాయల జీతం. చాలీచాలని జీతంతో జీవితయాత్ర
కొనసాగిస్తున్న ఆళ్వార్ స్వామి పన్నెండవ ఏట, వారి తండ్రి
మరణించారు.
నకిరేకల్ వాస్తవ్యులు శ్రీ కంచినేపట్టి సీతారామారావనే
ఉపాధ్యాయుడికి వంట చేసి పెడుతూ, ఆళ్వార్ అతని వద్ద
విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆ ఉపాధ్యాయుడు
సూర్యాపేటకు బదిలీ కావటంతో ఆళ్వార్ స్వామి కూడా
వట్టికోట ఆళ్వారుస్వామి
- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
గ్రామం నుండి తాలూకా కేంద్రానికి నివాసాన్ని మార్చాడు.
కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు అతనిలో నూతన
ఉత్తేజాన్ని నింపాయి. 1928-29 సంవత్సరాల నడుమ
శ్రీ కోదాటి నారాయణరావుగారితో సూర్యాపేటలో పరిచయం
ఏర్పడింది.
కొంతకాలం గడిచాక కందిబండ గ్రామానికి చెందిన
శ్రీ నారపరాజు రాఘవరావుగారింటికి అళ్వార్ స్వామి తన
మకాం మార్చాడు. రాఘవరావు గారిది సంపన్న కుటుంబం.
అతిథి, అభ్యాగతులకు ఆదరణ, గౌరవమిచ్చే కుటుంబంతో
అతనికి అతి స్వల్పకాలంలోనే సాన్నిహిత్యం ఏర్పడింది.
రాఘవరావుగారి సోదరుల్లో ఒకడిగా ఆళ్వార్ స్వామి
కలిసిపోయాడు. నారపరాజు సోదరులు తమ తండ్రి
జ్ఞాపకార్థం 'సీతారామ గ్రంథాలయాన్ని' నెలకొల్పారు.
విలువైన గ్రంథాలనూ, అందుబాటులో ఉన్న పత్రికలనూ
తమ గ్రంథాలయానికి తెప్పించడం ప్రారంభించారు. దీంతో
సహజంగానే ఆళ్వారా స్వామి పఠనాసక్తి, పత్రికా పఠనం
పెంపొందించాయి.
1933 ప్రాంతంలో శ్రీ యామనాచార్యుల ప్రోద్బలంతో
ఆళ్వార్ స్వామి హైదరాబాద్ పట్టణానికి తన మకాం
మార్చాడు. అప్పటికే హైదరాబాద్ కు చేరి, అక్కడ గోలకొండ
పత్రికలో శ్రీ కోదాటి నారాయణరావు ఫ్రూఫ్ రీడర్గా
ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఉద్యోగాన్ని మానేయాలని కోదాటి
తెలంగాణ (505 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
1mitwu0undgx155jsh4ozljnv4c25vl
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/527
104
212250
553466
2026-04-17T06:59:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వారు భావిస్తున్న రోజుల్లో వారికి ఆళ్వారస్వామి కన్పించాడు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి సిఫారసు చేసి, కోదాటి నారాయణరావుగారు ఆళ్వార్ స్వామికి గోలకొండ పత్రికలో ప్రూఫ్...'
553466
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వారు భావిస్తున్న రోజుల్లో వారికి ఆళ్వారస్వామి కన్పించాడు.
శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి సిఫారసు చేసి, కోదాటి
నారాయణరావుగారు ఆళ్వార్ స్వామికి గోలకొండ పత్రికలో
ప్రూఫ్ రీడర్ గా ఉద్యోగం ఇప్పించారు. నెలకు పదిహేను
రూపాయల జీతం. అతికష్టంగా సరిపోయేది. జీతం సంగతి
ఎలా ఉన్నా పత్రికాఫీసులో పనిచేయడం వలన సమాజాన్ని,
జీవితాన్ని, సాహిత్యాన్ని అధ్యయం చేసే అవకాశం ఆళ్వార్కి
దొరికింది.
కొంతకాలానికి ఆళ్వారస్వామి ఈ ఉద్యోగం మానేసి,
మళ్ళీ కందిబండలోని రాఘవరావు గారి కుటుంబాన్ని
ఆశ్రయించాడు. అక్కడి గ్రంథాలయంలోని అనేక గ్రంథాలను
ఆసక్తిగా వరించాడు. అంతేకాదు క్రమంగా రచనా వ్యాసంగం
ప్రారంభించాడు. ఆంగ్ల భాషాధ్యయనంపై అతని దృష్టి
మళ్లింది. స్వయంకృషితో ఆంగ్లం నేర్చుకోవడం ప్రారంభించాడు.
నారపరాజు వారి కుటుంబం తరచుగా బెజవాడ వెళ్లి
వస్తూ ఉండేది. ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసి
పోయిన ఆళ్వార్ కూడా మివాడకు వెళ్తూ ఉండడంతో, అక్కడి
'వెల్కం హెూటల్' వారితో ఇతనికి పరిచయమేర్పడింది.
హెూటల్ యాజమాన్యంతో మాట్లాడి, అక్కడ సర్వర్
ఉద్యోగంలో చేరాడు. ఉచిత భోజన వసతులతో పాటు అరవై
రూపాయల నెల జీతానికి కుదిరాడు. తన సంపాదన నుండి
ఎనిమిది రూపాయల ఫీజు చెల్లించి, ఇంగ్లీషు తరగతులకు
హాజరయ్యాడు. జీతం రాళ్లను పొదుపుగా ఖర్చు పెడుతూ,
కొంత డబ్బు మిగిల్చి పుస్తకాలనూ, పత్రికలనూ కొని
చదవడం కొనసాగించాడు.
1934-36 నడుమ రెండేళ్ళపాటు బెజవాడ హెూటల్
కార్మికుడిగా పని చేయడంతో ఆళ్వార్స్వమి జీవితం కొత్త
మలుపు తిరిగింది. అప్పటి బెజవాడ, మద్రాసు రాజధానిగా
బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. నిజామాంధ్ర ప్రాంతంతో
పోలిస్తే సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం.
పత్రికాస్వేచ్ఛ, సభా స్వేచ్ఛలుండేవి. వెట్టి చాకిరి ఉండేదికాదు.
ఏదో ఒక మేరకు ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుండేవి.
నారపరాజు రాఘవరావుగారి కుటుంబ సభ్యుల
అవసరాల నిమిత్తం 1986లో ఆళ్వారస్వామి తన నివాసాన్ని
బెజవాడ నుండి హైదరాబాదుకు మార్చాల్చి వచ్చింది.
హైదరాబాదులో ఉన్నత విద్య చదువుకుంటున్న నారపరాజు
కుటుంబ సభ్యులకు వంట చేసి పెడుతూ, తీరిక సమయంలో
వారి వద్ద ఇంగ్లీషు విద్యను కొనసాగించాడు.
ప్రజాహిత సంస్థలతో, సంఘసేవకులతో, సాహితీ
వేత్తలతో క్రమంగా ఆళ్వార్ స్వామి పరిచయాలు పెంచు
కున్నాడు. సికింద్రాబాద్లోని యువకులను సమీకరించి,
చైతన్యపరచి, వారిని సామాజిక సేవా రంగంవైపు ఆకర్షించాడు.
గ్రంథాలయోద్యమంతో, ఆంధ్రోద్యమంతో సంబంధాలు
ఏర్పడ్డాయి. నిజామాబాద్లో జరిగిన ఆరవ ఆంధ్ర మహా
సభలో సికింద్రాబాద్ ప్రాంతం నుండి ఏకైక ప్రతినిధిగా
హాజరయ్యాడు. 'ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం'లో
కొంతకాలం పాటు కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు
నిర్వహించాడు. శ్రీమతి రాచమల్ల సత్యవతీదేవి సంపాదకత్వాన
ప్రారంభమైన 'తెలుగుతల్లి' పత్రికను కొంతకాలం పాటు
ఆళ్వార్ స్వామి నిర్వహణ బాధ్యతలు చేపట్టి వెలువరించాడు.
1938లో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు స్ఫూర్తితో
'దేశోద్ధారక గ్రంథమాల'ను ఆళ్వార్స్వమి నెలకొల్పాడు.
ఆరవ ఆంధ్ర మహాసభలో అతివాదుల పక్షం వహించిన
ఆళ్వార్స్వామి, చిలుకూరులో జరిగిన ఎనిమిదవ ఆంధ్ర
మహాసభలో మితవాదుల వెనక నిలిచాడు.
1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమ ప్రేరణతో
సికింద్రాబాద్ లో జరిగిన సత్యాగ్రహంలో కాంగ్రెస్వదిగా
పాల్గొన్న ఆళ్వారస్వామిని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది.
సికింద్రాబాద్ జైలులో ఏడాదిపాటు జైలు జీవితాన్ని
గడిపాడు. అక్కడే కమ్యూనిస్టు పార్టీ నాయకులతో
సాన్నిహిత్యం ఏర్పడింది. కమ్యూనిజం ఆదర్శాలు, లక్ష్యాలు,
పోరాట నిబద్ధతలతో ప్రభావితుడైనాడు. జైలు నుండి విడుదల
కాగానే ఆంధ్ర మహాసభకు ఆర్గనైజర్ గా పనిచేస్తూ
హైదరాబాద్ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
1944లో మీ స్మాయిల్ ప్రధానిగా నియమింపబడ్డాడు.
కమ్యూనిస్టు పార్టీపై విరుచుకుపడ్డాడు. పెద్ద ఎత్తున కార్యకర్తల
అరెస్టులు జరిగాయి. ఆళ్వార్స్వేమిని అరెస్టు చేసిన నిజాం
పోలీసులు రెండేళ్ళ పాటు సంగారెడ్డి, గుల్బర్గా, హైదరాబాద్,
వరంగల్ రైళ్ళలో తిప్పారు. కారాగార జీవితాన్ని గ్రంథ
పఠనానికి, మేధోవికాసానికి ఉపయోగించుకున్నాడు. జైల్లో
తోటి ఖైదీలకు చక్కని విజ్ఞానాన్ని అందించడంతోపాటు,
అంటుంటే తెలంగాణ (506 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
jynlrg1rateq1gpjbez0yu9s0yn1702
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/528
104
212251
553469
2026-04-17T07:03:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కమ్మని వంటకాలు వండి తినిపించేవాడు. రాజకీయ ఖైదీలతోనూ, సాధారణ ఖైదీలతోనూ ఆత్మీయంగా మెలిగిన ఆళ్వార్ స్వామి వారి జీవితానుభవాలను, కష్టసుఖాలను తెలుసుకున్నాడు. ఖైదీల సమస్యలపై జ...'
553469
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కమ్మని వంటకాలు వండి తినిపించేవాడు. రాజకీయ
ఖైదీలతోనూ, సాధారణ ఖైదీలతోనూ ఆత్మీయంగా మెలిగిన
ఆళ్వార్ స్వామి వారి జీవితానుభవాలను, కష్టసుఖాలను
తెలుసుకున్నాడు. ఖైదీల సమస్యలపై జైలు అధికారులకు
విజ్ఞప్తి పత్రాలు సమర్పిస్తూ, పరిష్కారం కోసం కృషి
చేసేవాడు. తోటి ఖైదీల జైలుజీవితం, తన స్వీయ
అనుభవాలను జోడించి 1950లో 'జైలు లోపల' కథలను
రచించాడు. 'ప్రజల మనిషి', 'గంగు' అన్న రెండు గొప్ప
నవలలను రచించి, తెలంగాణ సాయుధ పోరాట నవలా
సాహిత్యానికి ఒరవడి దిద్దాడు.
1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచనం
జరిగిన తరువాత, అనేక మంది రాజకీయ ఖైదీలు జైలునుండి
విడుదలయ్యారు. ఆళ్వార్స్వామి మాత్రం మరో ఏడాదిన్నర
పాటు జైల్లో మ్రగ్గవలసి వచ్చింది. నిజాం ప్రభుత్వం అతనిపై
మోపిన క్రిమినల్ కేసులే దానిక్కారణం. 'దేశోద్ధారక సూచి
గ్రంథాలయం' పేరిట సికింద్రాబాద్లో ఒక రిఫరెన్స్ లైబ్రరీని
ఏర్పాటు చేశాడు. అనేక అరుదైన ప్రాచీన గ్రంథాలను
సేకరించాడు. కొత్త ప్రచురణలనూ సమకూర్చాడు. దిన,
మాసపత్రికలు సంపుటాలను సంపాదించి పెట్టాడు.
పెదాలపై వెన్నెల వంటి చిరునవ్వు, హృదయంలో
ప్రేమ నిండిన ఆత్మీయత, మాటల్లో మమకారం, చేతల్లో
నిజాయితీ నిండిన ఉత్తమ మానవుడు శ్రీ ఆళ్వార్ స్వామి.
పరిచయమైన ప్రతి వ్యక్తిపై ప్రగాఢమైన ప్రభావాన్ని వేసిన
ఉన్నతమైన వ్యక్తిత్వం అతనిది. నమ్మిన సిద్ధాంతాల పట్ల
నిబద్ధత, కార్యాచరణ పట్ల నిమగ్నత కలిగిన ఆళ్వారస్వామి
చిత్తశుద్ధి అతని రచనల్లో ప్రతిబింబిస్తున్నది. అతనికి
పరిచయమైన సామాజిక వాతావరణం, గ్రామీణ జీవన
పరిణామాలు, వ్యక్తుల మనస్తత్వాలు అతని కథల్లోనూ,
నవలల్లోనూ వ్యక్తమైనాయి. 1961 ఫిబ్రవరి 6న 'డిప్తీరియా'
వ్యాధి వలన హృదయ చలనం ఆగిపోయిన ఆళ్వారస్వామి
అకాల మరణం పొందాడు. వినాదైన్యేన జీవనం, అనాయాస
మరణం పొందిన ఆళ్వార్ స్వామి వేలాదిమంది మిత్రుల,
సహచరుల, సన్నిహితుల హృదయాలలో శాశ్వత స్థానం
సంపాదించుకున్నాడు.
ఏ తెలంగాణ (507 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude>
8q4musms2410hap4h3654vzm8yy7r7r
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/529
104
212252
553470
2026-04-17T07:07:42Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '148 వె లిచాల కేశవరావుగారు చారిత్రక ప్రాముఖ్యత ఉన్న బొమ్మలమ్మ గుట్ట సమీపంలోని కురిక్యాలలో జన్మించారు. జన్మించిన సంవత్సరం నిక్కచ్చిగా తెలియదు. 1908 లేదా 1809 కావచ్చని వారే చెప్పు...'
553470
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>148
వె లిచాల కేశవరావుగారు చారిత్రక ప్రాముఖ్యత
ఉన్న బొమ్మలమ్మ గుట్ట సమీపంలోని కురిక్యాలలో
జన్మించారు. జన్మించిన సంవత్సరం నిక్కచ్చిగా తెలియదు.
1908 లేదా 1809 కావచ్చని వారే చెప్పుకున్నారు.
ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కురిత్యాల
గ్రామానికి చెందిన వెలిచాల కృష్ణారావు, రామక్క, పెంపకం
తీసుకున్న తల్లిదండ్రులు కొండలరావు, రత్నమ్మ.
కేశవరావుగారు, వారిని పెంపకం తీసుకున్న తండ్రి
కొండలరావు నివసించిన ప్రస్తుత రామడుగు మండలంలోని
గుండి గ్రామంలో చాలా సంవత్సరాలు గడిపారు. ఏళ్ళు
పైనబడ్డాక ఎక్కువగా కరీంనగర్ పట్టణంలోని వారి స్వంత
ఇంట్లోనే ఉంటూ అడపాదడపా గుండి గ్రామానికి వెళ్లి
వచ్చేవారు.
కురిక్యాలలో బాల్యదశలో తండ్రిగారందించిన శిక్షణ
కేశవరావుగారి సాహిత్య, సాంఘిక, రాజకీయ వికాసానికి
పునాదులు వేసింది. వారి మాటల్లోనే చెప్పాలంటే...
“1917-18లో ఉప్పరమల్యాల భట్టుమూర్తి, గూడూరి
అక్షరాజు వద్ద భారత భాగవతాలు, అమరం ద్వికాండలు,
పౌరాణికులు దేవరాజు నరసింహరాజువలె అభినయిస్తూ
రసపోషణతో నేను ఆ పురాణగాథలను చెప్పగా విని మా
నాన్నగారు ఏకసంథాగ్రాహి, ద్విసంథాగ్రాహి అని మెచ్చు
కుంటూ బంధుమిత్రుల ముందు నాతో కథలు చెప్పిస్తూ,
వెలిచాల కేశవరావు
- వి.కె. ప్రేమచంద్
చదివిస్తూ మురిసేవారు. సంస్కృతశ్లోకాలు కూడా అనేకం
నాకు కంఠస్థంగా ఉండేవి. ప్రతిదినం భారతం, భాగవతం
చదివించేవారు. నా ఆంధ్రభాషా పరిజ్ఞానానికి వారే
కారకులు. నా దురదృష్టం వల్ల వారు నా పదునాఱవ యేటనే
మరణించారు.”
కేశవరావుగారి భార్య పేరు రాధాబాయి. ఆమె గుండి,
గోపాల్రావుపేట గ్రామాలలో ఆపద్భాంధవి యని పేర్గాంచిన
మహాసాధ్వి. కేశవరావుగారికి అయిదుగురు కుమారులు -
కొండలరావు, జగపతిరావు, రామ్మోహన్రావు, ప్రేమ్చంద్,
కరంచందర్ రావు. ముగ్గురు కుమార్తెలు - చెన్నమనేని
సుందరమ్మ (భర్త గోపాల్రావు), కాకులమర్రి వసుమతి (భర్త
విజయరామారావు), తక్కల్లపల్లి లక్ష్మీదేవి (భర్త డా.దేవేందర్
రావు).
కేశవరావుగారికి తెలుగుభాష పైన, ముఖ్యంగా అనేక
సంస్కృత తెలుగు పదాల పైన లోతైన అవగాహన, పట్టు
ఉండడానికి, తదుపరి సాహిత్య కృషి చేయడానికి చిన్ననాడు
వారు కంఠస్థం చేసిన అమరకోశం చాలా ఉపయోగపడింది.
సాహిత్య, సామాజిక స్పృహ కలిగిన కేశవరావుగారు.
సిరిసిల్లలో బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన
హిందూ మహాసభ సమావేశాల్లో పాల్గొన్నారు. గుండి లాంటి
చిన్నగ్రామంలో నివసించినప్పటికీ మొదటినుండి దేశభక్తి,
సాహిత్య విపాస కలవారైనందున కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక,
మమమమమము : తెలంగాణ 508 తేజోమూర్తులు kellు
తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude>
ientnbl4o1b28ip1k3izdj721sdw8fa
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/530
104
212253
553471
2026-04-17T07:07:58Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికలు, స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి లాంటి వారపత్రికలు, భారతి, జయంతి లాంటి సాహిత్య పత్రికలు తెప్పించుకుని చదివేవారు. ప్రప్రధమంగా ముద్రితమై అప్...'
553471
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికలు, స్వతంత్ర, ఆంధ్రప్రభ,
ఆంధ్రజ్యోతి లాంటి వారపత్రికలు, భారతి, జయంతి లాంటి
సాహిత్య పత్రికలు తెప్పించుకుని చదివేవారు.
ప్రప్రధమంగా ముద్రితమై అప్పుడే మార్కెట్లోకి వచ్చిన
కాళోజి నారాయణరావుగారి “నా గొడవ" కవితా సంకలనం
కేశవరావుగారికిష్టమైన పుస్తకం, కాళోజి నారాయణరావు
గారు కరీంనగర్ వచ్చినపుడు కేశవరావుగారి వద్దకు వచ్చి
పోయేవారు. కాళోజి నారాయణరావు గారి ప్రభావం వలననే
కావచ్చు అంతవరకు ఛందోబద్ధమైన పద్యకవిగా
పేరుగాంచిన కేశవరావుగారు వచన కవిత్వం వైపు కూడా
మొగ్గారు. ఇరు ప్రక్రియలలో రచనలు చేశారు.
వెలిచాల కేశవరావుగారికి తన కులంతో సహా అన్ని
కులాలపైన గౌరవముండెడిది. తన కులమంటే అభిమానమే
కాని దురభిమానం మాత్రం కాదు. తన కులంలో జన్మించిన
గొప్ప వ్యక్తులతో స్ఫూర్తి పొందండని వెలమలనుద్దేశించి
వ్రాసిన ఈ క్రింది సీసపద్యాలు చూడండి. ఇతర కులాలలో
కూడా గొప్పవారున్నారు, అలాంటి వారు మన కులంలోనూ
ఉన్నారు. కనుక మన కులాన్ని చిన్నదని, మనవారిని
చిన్నవారని అనుకోకండని చెప్పిన పద్యాలివి. వారికి
పద్యరచనపై, ముఖ్యంగా సీస పద్య రచనపై ఎంతో
గుణాత్మక, సృజనాత్మక సాధికారత ఉందని కూడా ఈ
పద్యాలు తెలియజేస్తాయి.
సీ॥ గాంధి యంతటి వాడు ఘనుడు మా బ్రహ్మన్న
కలడు మాలోనని గర్వపడుడు.
సర్వజ్ఞు పోలిన సర్వజ్ఞ సింగన్న
కలడు మాలోనని గర్వపడుడు.
సంగర రుద్రుడౌ లింగమ నాయుడు
కలడు మాలోనని గర్వపడుడు.
అపరాభిమన్యుడౌ యా బాలచంద్రుడు
కలడు మాలోనని గర్వపడుడు.
ఎవరినో యన్యులను జూచి యేలపొగడ
మురియు చుంటిరి యడుగులు ముందువైచి
స్థల చరిత్ర విమర్శనల్ సలుపుడయ్య
ఎందరో యశ్లకాయులు నిందుగలరు
సీ॥ మన వరంగలు కోట కనుమని మిము బిల్చె
మనపూర్వ గోత్రాల మరుగుదెబ్బ
అదిగొ దేవరకొండ యతివేగ రమ్మనె
ఘనవీర సింగన్న ఘనత తెలుప
రాచకొండకు పోయి రావలెనది కూడ
విలువైన తన గత స్థితిని దెలుపు
రేచర్ల దుర్గమున్ జూచి రావలెనది
కబురంపై తద్దోత్ర కథను దెలుప
పానుగంటి పాల్వంచయు బాహుబలము
చూపి గెల్చిన గోల్కొండ సుందరమగు
భువనగిరి రామగిరి దుర్గములను మెదకు
నిర్మలయు వెలిగందులన్నాడు కనుడు.
(ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ తండ్రి
దద్దనాల లక్ష్మీ సత్యనారాయణయ్య గారు తాడేపల్లిగూడెం
నుండి ప్రచురిస్తూ ఉండే 'పద్మనాయక' పత్రికలో పై పద్యాలు
ముద్రింపబడినవి.)
వెలిచాల కేశవరావుగారు కులవివక్షకు బద్ద వ్యతిరేకి.
ఆ కాలంలోనే ఊళ్లోని దేవుని గుడిలో హరిజనులను
ప్రవేశపెట్టడానికి పూనుకున్నవారు. ఆయన ఇంట్లో పనిచేసిన
వాళ్లు ఎక్కువగా హరిజనులే. కులవివక్షను నిరసిస్తూ ఆయన
రాసిన ఈ క్రింది పద్యం చూడండి.
గీ॥ కుల విచక్షణలేదు సద్గుణుల కెపుడు
జ్ఞానులను భక్తజనమును మౌనులగన
బ్రహ్మఋషి రాజఋషులును బహుజనులకు
పూజనీయు బాజ్వారాది పుణ్య పురుషు
లెందరో నీచకులజులె యెంచిచూడ
బుద్ధి తక్కువ కులతత్వ పోకనేల?
సెప్టెంబరు 2, 1975 నాడు కరీంనగర్ సారస్వతజ్యోతి
ఆధ్వర్యాన జరిగిన కవి సమ్మేళనానికి ఆయన అధ్యక్షులుగా
వెలువరించిన కవితలో నుండి...
కం॥ పండిత పామర జనకవు
లుండిరి పూర్వమున నేడు నుందురు ముందున్
ఖండన మండన రచనలు
పండించిరి వారి వారి ప్రజ్ఞల కొలదిన్||
పై పద్యం ద్వారా వారు కవితా ప్రక్రియలనేకాలు,
అన్ని కాలాల్లోనూ ఉంటాయన్న భావనను వ్యక్తపరిచారు.
సమరమును తెలంగాణ 509
509 తేజోమూర్తులు బయబడు<noinclude><references/></noinclude>
f851snzypq1o55lj3qeef6yuevkr1fg
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/531
104
212254
553472
2026-04-17T07:08:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విశ్వనాథ సత్యనారాయణగారు ఎస్. ఆర్. ఆర్. కళాశాల ప్రిన్సిపాల్గా రావడం కరీంనగర్లో సాహిత్య వికాసానికి పెద్ద ఊపునిచ్చింది. ఆయన ప్రియ శిష్యుడు జువ్వాడి గౌతమరావు కరీంనగర్ వాసి క...'
553472
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>విశ్వనాథ సత్యనారాయణగారు ఎస్. ఆర్. ఆర్.
కళాశాల ప్రిన్సిపాల్గా రావడం కరీంనగర్లో సాహిత్య
వికాసానికి పెద్ద ఊపునిచ్చింది. ఆయన ప్రియ శిష్యుడు
జువ్వాడి గౌతమరావు కరీంనగర్ వాసి కావడం, ఆయన
పద్యపఠనంలో దిట్ట అవడం, విశ్వనాథ మరియు
గౌతమరావు ఆధ్వర్యంలో 'జయంతి' సాహిత్య పత్రిక
వెలువడడం, కళాశాలలో అనేక కవిసమ్మేళనాలు జరగడం
అన్నీ కలిసి కరీంనగర్లో సాహిత్య స్వర్ణయుగానికి ద్వారాలు
తెరిచాయి. ఆ కాలంలోనే విశ్వనాథ వారు 'కేదారగౌళ యను
కావ్యాన్ని కేశవరావుగారికి అంకితమివ్వడం జరిగింది. ఆ
సందర్భంలో విశ్వనాథగారు కేశవరావుగారిపై చెప్పిన
పద్యం...
ఒక కవి గొప్పవాడను ఏడూళ్లను నల్వురు
చెప్పికోగ, నీ
తికి నిలబడ్డ వాడనియు దేశము
మొత్తముమీద పెద్ద మ్రో
త కలుగ, సంకితముగను సతృతి
యొక్కడు గైకొనంగ కో
రిక కలవాని, వాణి కబరీగత సూనముగా
దలంచెదన్.
వెలమవారిలోన వెల్చాల కేశవ
రావనగ నొక 'యుమరావు' కలడు
చదువు కవిత సిరియు సంపత్తి కలవాడు
ఈ కరీంనగరపు టిరుగులందు.
విశ్వనాథ సత్యనారాయణగారు వారి అంకితపద్యాల్లో
కేశవరావుగారి గురించి ప్రస్తావిస్తూ 'యుమరావు' అనే పదం
వాడారు. ఇది ఒక అసాధారణమైన పద ప్రయోగం.
యుమరావు / ఉమ్రావు అను పదానికి గొప్ప హృదయం
కలవాడు (నోబుల్) అను అర్థం కూడా ఉంది. కనుక
విశ్వనాథ ఆ పదాన్ని ఆ సందర్భంలో 'నోబుల్,
'సహృదయుడు' అనే అర్ధాల్లో వాడారని తెలుస్తోంది. పై
పద్యాల్ని ఫిబ్రవరి 9, 1975న కరీంనగర్ జిల్లా పరిషత్
హాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు స్వయానా చదివి
వినిపించారు.
డా. అంబేద్కర్ వలె కేశవరావుగారు ఆస్తికత్వపు
నమ్మకాలతో జీవితాన్ని ఆరంభించి, ఏళ్లు గడచిన తర్వాత
నాస్తికవాదం వైపు మొగ్గుచూపారు. ఆయనవలెనే, మతం
మానవత్వపు విలువల్ని పెంచేదిగా ఉండాలని భావించేవారు.
ఆచారాలకన్నా సాంఘిక సేవలు మేలన్న భావానికి,
గుళ్ళు గోపురాలకన్నా విద్యాలయాలు, వైద్యాలయాలు
మున్నగు వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలని నమ్మారు.
కేశవరావుగారు గ్రామీణాభివృద్ధి వాది. దవాఖానాలు
ఎక్కువగా పట్టణాల్లోనే నెలకొల్పే ఆ రోజుల్లో గుండి
గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టాలని స్వయానా
సత్యాగ్రహానికి పూనుకున్న గాంధేయవాది.
కేశవరావుగారు తన జీవితకాలంలో మూడు పుస్తకాలు
ప్రచురించారు. ఊహాలోకం-64 (64వ ఏట చెప్పిన
కవితలు, 1972), మిత్రనీతి (కవితలు, 1975), నేనూ నా
జ్ఞాపకాలు (సంక్షిప్త ఆత్మకథ, కవితలు, 1977).
వయస్సులో పెద్దయినా కేశవరావుగారు మధ్య
వయస్కులతో, యువకులతో మాట్లాడడానికి, పలువిషయాలు
చర్చించడానికి ఆసక్తి చూపేవారు. ఆయనకు జీవితాంతం
కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన ఉండేది. ప్రపంచ
జ్ఞానం ఎక్కువగా ఉన్నవారు కాబట్టి, వారిని కలవడానికి
పలువురు సాహిత్యవేత్తలు, కవులు, సంస్కర్తలు, రాజకీయ
వేత్తలు, విద్యావేత్తలు వస్తుండేవారు. అతని ఇల్లు ఎప్పుడూ
సాహిత్య, సాంఘిక, రాజకీయ ఇష్టాగోష్ఠులకు వేదికగా
ఉండేది.
కొంతకాలం ఆయన కరీంనగర్ జిల్లా రచయితల
సంఘం అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. ఆ సమయం
లో వెలువడిన పుస్తకాల్లో "కరీంనగర్ మండల చరిత్ర" కూడా
ఒకటి. ఈ పుస్తక ప్రచురణకు వారు ఆర్థిక సహాయ
మందించారు.
కేశవరావుగారు స్వయానా కవిత్వం వ్రాయడమే కాక
పలు రచయితలకు వారికి తోచిన రీతిలో సహాయం
చేస్తుండేవారు. కరీంనగరం రచయితల సంఘ భవన
నిర్మాణానికి కూడా వారు నిధులు సమకూర్చారు. అలా
అతడు కవి పోషకుడు కూడా.
కేశవరావుగారు మే 13, 1989న సుమారు 82వ
యేట హైదరాబాదులో మరణించారు.
చిరు తెలంగాణ (510 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
dhqvez5j21vyavh3fmvac2jszm247s5
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/532
104
212255
553473
2026-04-17T07:08:25Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఈ వ్యాసాన్ని ముగించేముందు, "ప్రణాకవి శిరోమణి" రాజాపేట (చిలకలూరిపేట మండలం, గుంటూరు జిల్లా) కు చెందిన చెన్నుపల్లి సుబ్బారావుగారు కేశవరావు గారిపై చెప్పిన పద్యాలు ఉటంకించడం స...'
553473
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఈ వ్యాసాన్ని ముగించేముందు, "ప్రణాకవి శిరోమణి"
రాజాపేట (చిలకలూరిపేట మండలం, గుంటూరు జిల్లా)
కు చెందిన చెన్నుపల్లి సుబ్బారావుగారు కేశవరావు గారిపై
చెప్పిన పద్యాలు ఉటంకించడం సబబేమో!
వెలిచాల వంశచంద్రా
కలకాలము నీదు కవిత కమనీయంబై
వెలుగుచు తెలుగు జగంబున
వెలయించు త్వదీయ కీర్తి విస్తారముగన్.
వెలమ కుల మండనుడవై
తెలుగమ్మరు సేవచేసి ధీనిధి పగుచున్
వెలగల కబ్బము లల్లుచు
సలలితముగ యశము గొనుము సర్వాంధ్రమునన్.
శారద నీపై నెంతో
గారవమును జూపుచుండె కడువేడుకతో
ధీరులు శూరులు మెచ్చగ
శ్రీరితితో వెలుగుమయ్య కేశవరాయా!
అతను తెలంగాణ (511) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
3bm21846ehcozegt94e8ddkdhlolvou
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/533
104
212256
553474
2026-04-17T07:08:39Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '149 గత శతాబ్ది తొలి దశాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతులపట్ల సర్కారు ఎటువంటి ఆదరణను చూపించలేదు. తెలుగు మాస్టరు పాఠశాలలు లేవు. తెలుగు కవులు - రచయితలకు...'
553474
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>149
గత శతాబ్ది తొలి దశాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలో
తెలుగు భాషా సాహిత్య సంస్కృతులపట్ల సర్కారు
ఎటువంటి ఆదరణను చూపించలేదు. తెలుగు మాస్టరు
పాఠశాలలు లేవు. తెలుగు కవులు - రచయితలకు
ప్రభుత్వపరమైన సహాయము, సహకారము శూన్యమే. ఈ
వాతావరణంలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల
పరిరక్షణను తమ విద్యుక్త బాధ్యతగా భావించిన అక్షర
మూర్తులు తమ సంకల్ప సాధనకోసం విశేషమైన కృషి
చేశారు. వీరి ప్రయత్నాలను ఏటికి ఎదురీదే సాహసంగా
పేర్కొనవచ్చు. మాడపాటి హనుమంతరావు, సురవరం
ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, ఒద్దిరాజు సోదరులు,
వట్టికోట ఆళ్వార్స్వామి ఈ వరుసలో పేర్కొనవలసిన
కొందరు. ఇదే కోవలో చేరేవారు వెల్దుర్తి మాణిక్యరావు.
మాడపాటివారి మార్గదర్శత్వంలో కార్య నిర్వహణా
దక్షతను, ప్రతాపరెడ్డి సాన్నిహిత్యంలో పత్రికా సంపాదక
ప్రతిభను, దాశరథి కవిత్వం ద్వారా లలితమైన కవితాభివ్యక్తినీ
అలవర్చుకున్న మాణిక్యరావు తెలంగాణ తేజోమూర్తులలో
ఒకరు. తెలంగాణ సాంస్కృతిక విశేషాల అన్వేషణ ప్రారంభ
మైన ఇటీవల క్రమంలో మాణిక్యరావు కృషి ఆయన సాహిత్య
సృజన, చరిత్ర రచన, సంపాదకీయం వహించిన రచనలు,
కవిత్వం ఇవన్నీ తిరిగి వెలుగులోకి వస్తున్నాయి. అయితే
మాణిక్యరావు తను జన్మించిన మెదక్ జిల్లాలో సుప్రసిద్ధ
సాహితీవేత్తగా దశాబ్దాల క్రితమే గుర్తింపును పొందారు.
వెల్దుర్తి మాణిక్యరావు
- డా॥ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి
సుమారు నాలుగు దశాబ్దాల క్రితమే మల్యాలదేవీ ప్రసాద్
రచించిన మెదక్ మండల సాహిత్య చరిత్రలో మాణిక్యరావు
ప్రస్తావన ఉంది.
పేరు ప్రఖ్యాతులు గాంచిన ఉత్తమ రచయితలలో
వీరొకరు. ప్రబోధకరమగు రచనలు, సాంఘికాచరములు
విమర్శించు రచనలు అబ్బురము గొల్పునవియేగాక
ఆనందము కలిగించును. నీతిదాయకములగు వీరి రచనలు.
లోకమునకు సంఘానికి జాతికి ఉపకరించును. చీకటి
వెలుగుబాటయై యుండును. ఆంధ్రోద్యమ కాలమున వీరు
'అణ్ణా' గ్రంథమాలను స్థాపించి తద్వారా ఆంధ్రలోకానికి
జాగృతి కలిగించారు. 'మాణిక్యరావుగారు మణిపూసవంటి
వారు' అని దేవీ ప్రసాద్ తమ గ్రంథంలో పేర్కొన్నారు.
1914వ సంవత్సరంలో మాణిక్యరావు జన్మించారు.
మెదక్ జిల్లాలోని వెల్దుర్తి గ్రామం ఆయన స్వస్థలం. బాల్య
విద్య స్వగ్రామంలో కొనసాగింది. అటు తరువాత మెదక్
పట్టణములో కొంతకాలంపాటు చదువుకున్నారు. అనంతరం
హైదరాబాద్ చేరుకున్నారు.
అప్పటికి నగరంలో స్వచ్ఛంద స్థాయిలో తెలుగు భాషా
సాహిత్య పరిరక్షణ ప్రయత్నాలు బలపడ్డాయి. సాధనా
సమితివంటి సంస్థలు, ఆంధ్రమహాసభ సమావేశాలు
ఇందుకు దోహదం చేస్తున్నాయి. మాణిక్యరావు ఖమ్మంలో
జరిగిన మూడవ ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. పెద్దలతో
తెలంగాణ ( 512 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
js242km4sy9jrk89geo4mjimixw494g
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/534
104
212257
553475
2026-04-17T07:08:52Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఇట్లా తొలి పరిచయం ఏర్పడింది. అప్పటికాయన ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా నిండని యువకుడు. ఆ రోజుల్లో పలువురు భాషాభిమానులు గ్రంథమాలలు ఏర్పాటు చేసుకొని పుస్తకాలు ప్రచురించేవారు. ఒ...'
553475
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఇట్లా తొలి పరిచయం ఏర్పడింది. అప్పటికాయన ఇంకా
ఇరవై సంవత్సరాలు కూడా నిండని యువకుడు. ఆ రోజుల్లో
పలువురు భాషాభిమానులు గ్రంథమాలలు ఏర్పాటు చేసుకొని
పుస్తకాలు ప్రచురించేవారు. ఒద్దిరాజు సోదరులు, వట్టికోట
ఆళ్వార్ స్వామి ఈ దిశలో మునుముందు నిలిచారు.
హైదరాబాద్ లో కె.సి. గుప్త అనే భాషాభిమాని పేరుతో
ప్రచురణలు ఆరంభించారు. కేవలం ఆరు పైసలకే చక్కని
పుస్తకాలు విక్రయించేవారు. ఇది ఎంతో గొప్ప విషయం.
ఈ పుస్తకాలు కూడా విజ్ఞాన వ్యాప్తిని కలిగించే రీతిలోనే
ఉండేవి. వెల్దుర్తి మాణిక్యరావు గ్రంథమాలకు సంపాదకు
లయ్యారు.
''అడ్డా' గ్రంథమాల ఎన్నో రచనల్ని ప్రచురించింది.
అందులో రెండు పుస్తకాలను నాటి నిజాం ప్రభుత్వ
యంత్రాంగం నిషేధించింది. కె.వి. గుప్తాను నిర్బంధించింది.
మాణిక్యరావు "రైతు" పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు.
'అణ్ణా' గ్రంథమాల తరఫున అనేక పుస్తకాలు వెలుగు
చూడడం వెనుక వెల్దుర్తి వారి కృషి ఎంతో ఉంది. ఆనాటి
నిర్భంధ కాలంలో ఒక రచయితగా ఆయన చూపించిన
సాహసం, ఎన్నుకున్న వైఖరి, బాధ్యతాయుతమైన ధోరణి
ఎల్లవేళల్లోనూ ఆదర్శప్రాయమైనవి. 'అణ్ణా' గ్రంథమాల
విశేషాల్ని మహాకవి దాశరథి తమ ఆత్మకథలో వివరించారు.
నాటి సమాజంలో మద్యపాన వ్యసనాన్ని నిర్మూలించే
సత్సంకల్పంతో ఒక మాస పత్రిక పనిచేసింది. దాశరథి
పేర్కొన్న వివరాల ప్రకారం “ఆంధ్ర భాషా ప్రచారం బాగా
జరగాలి. అత్యధిక సంఖ్యలో ప్రజలు పుస్తకాలు చదవాలి.
తద్వారా విజ్ఞానాన్ని ఆర్ధించాలి. ఇదే మా గ్రంథమాల
ఆదర్శం" అని 'అజ్ఞా' గ్రంథమాల ప్రచురణ కర్తలు తమ
ఆశయాన్ని ప్రకటించారు. 'అణ్ణా గ్రంథమాల కార్యాలయం
బజారులో ఉండేది. నూరు పుస్తకాలు కొంటే వాటిని ఐదు
రూపాయలకే విక్రయించేవారు. 'అణ్ణా గ్రంథమాల తరపున
ప్రచురించిన "నెహ్రూ జీవిత చరిత్ర పుస్తకానికి బూర్గుల
రామకృష్ణారావు వీఠిక రాశారు. 'ఖాదీ' అనే పుస్తకాన్ని
మాడపాటి వారు పీఠికను రచించారు. కాళోజి కథల్ని 'అణ్ణా'
గ్రంథమాల ప్రచురించింది. గ్రంథమాల రెండవ ప్రచురణ
"రైతు" అనే పుస్తకం. రైతుల్లో అశాంతి, తిరుగుబాటు
వస్తుందని చెబుతూ నిజాం సర్కారు రైతు పుస్తకంపై నిషేధాన్ని
విధించింది.
"మాణిక్యరావు గారు చక్కని కవి, ఆయనది సరళమైన
కై" అని దాశరధి ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతులు
వెల్దుర్తి.
మాణిక్యరావు సంపాదకత్వంలో వెలువడిన "అజ్ఞా
గ్రంథము గ్రంథ ప్రచురణ రంగంలో ఆనాడు ఒక విప్లవాన్ని
తెచ్చిందని చెప్పడం అతిశయోక్తి కానేకాదు” అని మహాకవి
దాశరథి తమ యాత్రాస్మృతిలో వ్యాఖ్యానించారు. ప్రారంభ
మైన ఈ పత్రికకు సర్కారులోని పెద్దల అండదండలు
ఉండేవి. సమాజ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ పత్రిక
ప్రచురణ జరిగింది. మద్యపాన నిరోధ మాస పత్రికకు వెల్దుర్తి
మాణిక్యరావు సంపాదకత్వం వహించారు. ఇదే పత్రిక
ఉర్దూలోనూ వెలువడింది. దానికీ మాణిక్యరావే సంపాదకులు,
తెలుగుతోపాటు ఉర్దూలోనూ ఆయనకు చక్కని రచనా ప్రతిభ
అలవడింది. ఒక ప్రజ్వలమైన చెడు వ్యసనానికి వ్యతిరేకంగా
వెలువడిన గొప్ప పత్రికగా మద్యపాన నిరోధ పత్రిక చరిత్రలో
నిలిచిపోతుంది.
నాడు తెలంగాణ ప్రాంతంలో గోలకొండ ప్రముఖ
పత్రిక. ఇతర పత్రికలు కూడా ఉండేవి. అవి సాహిత్య,
ధార్మిక పత్రికలుగా గుర్తింపును పొందాయి. గోలకొండ
మాత్రం తెలంగాణ సమాజ ప్రతిబింబంగా అందరి
ఆదర్శాన్ని అందుకున్నది. ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో
గోలకొండ వారానికి రెండుసార్లు వెలుగు చూసేది. రచనా
ప్రతిభ కలిగిన మాణిక్యరావు గోలకొండ పత్రిక సంపాదక
వర్గంలో చేరారు. ఉపసంపాదకులుగా బాధ్యతలు
నిర్వహించారు. ఈ సమయంలోనే పలు రచనలు చేశారు.
కథానిక ప్రక్రియపై ప్రముఖంగా దృష్టి పెట్టారు. తన వచన
రచనా శైలిని మరింత సరళతరంగా తీర్చిదిద్దుకున్నారు.
ఈ శైలి ఆయన అనంతర రచనల్లో కనబడుతుంది.
అప్పటి తెలంగాణ తెలుగు వచన రచయితలపై మునీ,
ప్రేమ చంద్ ప్రభావం ప్రగాఢంగా ఉండేది. ప్రేమ చంద్ తన
రచనల్లో చిత్రించిన పరిస్థితులకు నాటి తెలంగాణ సమాజం
సన్నిహితంగా ఉండడం, ప్రేమ్చంట్లోని వాస్తవికతా
ధోరణులు తెలంగాణ తెలుగు రచయితలను ఆకట్టుకున్నాయి.
చూడు తెలంగాణ (513 తేజోమూర్తులు ఉండటంతో<noinclude><references/></noinclude>
fikyaj34p7e9okyg3p6j2k97z56lilz
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/535
104
212258
553476
2026-04-17T07:09:12Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మాణిక్యరావుపై కూడా ప్రేమ చంద్ ప్రచారం ఉంది. ఆయన కథల్లో ఇది కనబడుతుంది. కథానిక రచనా ప్రక్రియ సూత్రాలతో చూసినపుడు కొంత క్లిష్టమైనదిగానే కనబడుతుంది. నవలా ప్రక్రియలా ఉండే వి...'
553476
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మాణిక్యరావుపై కూడా ప్రేమ చంద్ ప్రచారం ఉంది. ఆయన
కథల్లో ఇది కనబడుతుంది.
కథానిక రచనా ప్రక్రియ సూత్రాలతో చూసినపుడు
కొంత క్లిష్టమైనదిగానే కనబడుతుంది. నవలా ప్రక్రియలా
ఉండే విస్తృతి కథానికలో ఉండదు కనుక కథానిక రచయిత
అది చూచి సంభాషణల్ని నిర్మించుకోవాలి. సంక్షిప్తతతోపాటు
ముగింపులో ఒక అనూహ్యరీతి కథానికలో కన్పించాలి.
వెల్దుర్తివారు కథానిక ప్రక్రియ సూత్రాల్ని బాగా అర్ధం
చేసుకున్నారు. కొద్ది కథలే రాశారు కానీ అవి తెలుగు
కథానికా చరిత్రలో నిలుస్తాయి. అందుకు ఎయిర్ మేల్
కథ ఒక చక్కని ఉదాహరణ. ఇది “పరిసరాలు” అనే కథల
సంకలనంలో ప్రచురణ పొందింది. దాదాపు అరవై
సంవత్సరాల నాటి కథ ఇది. ఈ కథలో మాణిక్యరావు
స్థానీయమైన తెలుగు మాటల్ని ప్రయోగించారు.
“ఉపాహారం" "కల్పి” “వర్సగా “అంది” “బేసిస్ లడ్డూ'
"అల్మారి డబ్బి' 'చావతు" ఇటువంటివి నాడే కాదు.
నేడూ తెలంగాణలో నిత్య జీవితపు వాడుకలో ఉన్నాయి.
మాణిక్యరావు "స్వయంప్రకాశం" అనే పేరుతో రచనలు
చేశారట. మాణిక్యరావు కథలు ఒక సమగ్ర సంకలన
రూపంలో వెలువడవలసిన అవసరం ఉంది. శైలిలోనూ
ఆయన విలక్షణత్వం ఎయిర్మేల్ కథలో కనబడుతుంది.
"ఆకుపచ్చని చీర ప్రకృతికన్య కోయిల కూతలలో
కట్టుకునేది”
"పెదవులు నవ్వుల పువ్వులు విసురుతున్నాయి, కండ్లు
వలపు జల్లులు చల్లుచున్నట్టి"
"గడియారం ప్రతిగంట మోతలో హెచ్చరిక...”
'దయ్యాల పడు' అనే నాటికతోపాటు పలు చాలా
గేయాలు, మాణిక్యవీణ పేరుతో ఆధునిక వచన కవితలు,
సామాజిక వ్యాసాలు ఎన్నో రచించారు వెల్దుర్తి మాణిక్యరావు.
తొలుత పాత్రికేయుడుగా జీవన పయనాన్ని ప్రారంభించి
ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డారు. హైదరాబాద్లో నివాసం
ఏర్పర్చుకున్నారు.
మాణిక్యరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక
వైపు
గ్రంథమాల సంపాదకత్వం, ఆ తరువాత గోలకొండ పత్రికలో
ఉపసంపాదకత్వం, నాటిక, బాలగేయరచన, వచన కవితా
కోవడం
-
సృజన, కథా రచన తదితర అంశాలపట్ల ఆసక్తిని పెంచు
ఉర్దూ భాషా సాహిత్యాలపై పట్టును కల్గి
ఉండడం. ఇదంతా మాణిక్యరావు జీవితంలో ఒక భాగమైతే
చరిత్ర రచన మరొక భాగం. విశాలాంధ్ర అవతరణ తరువాత
చాలా సంవత్సరాలపాటు ఆయన పెద్దగా రచనలేవీ
చేయలేదు. అయితే 1980లలో మాణిక్యరావు ఒక బృహత్
చారిత్రక గ్రంథాన్ని రచించారు.
మరొక అతికీలకమైన చారిత్రక రచనకు సంపాదకత్వం
వహించారు. ఆయన రచించిన సుదీర్ఘ సమగ్ర చారిత్రక
గ్రంథం. హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర' తెలంగాణ
ఆధునిక చారిత్రక క్రమాన్ని, ఇక్కడ జరిగిన ఉద్యమాలు,
నిజాం వ్యతిరేక పోరాటాల్ని గురించి తెలుసుకోవాలనుకునే
వారికి "హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర నిత్య
పారాయణ గ్రంథం.
1964వ సంవత్సరంలో హైదరాబాద్ స్వాతంత్య్ర
సమరయోధుల సంఘం "హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమ
చరిత్ర"ను ప్రచురించింది. ఎనిమిదవందల
పైచిలుకు
పుటలున్న ఈ గ్రంథాన్ని రచించేందుకు ఐదు సంవత్సరాల
కాలం పట్టింది. మాణిక్యరావు స్వయంగా ఆనాటి నిజాం
వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. కనక ప్రామాణిక రీతిలో
చరిత్రను రచించగలిగారు. తెలంగాణాలో జరిగిన
ఉల్లేఖనీయమైన ఉద్యమాలను గురించి ఇక్కడి ఆధునిక
చారిత్రక క్రమంపై చాలామంది దృష్టి నిల్బని రోజుల్లో
మాణిక్యరావు ఈ గ్రంథాన్ని రచించారు. ఈ నిజం
విస్మరణకు వీలులేనిది. దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రను
రచయిత అంకితం చేశారు.
ఇక్కడ స్వాతంత్య్ర సమరయోధుడిగా మాణిక్యరావు
నిబద్ధత వ్యక్తమవుతోంది. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్
డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ఈ గ్రంథానికి పీఠికను రచిస్తూ
"స్వాతంత్ర్యోద్యమ చరిత్రను ఒక తరం నుంచి మరొక తరం
వారికి తెలియపరుస్తూ జాతి ధైర్య సాహసాలనూ వీరోచిత
కృత్యాలనూ వెలుగులోకి తెచ్చేటువంటి సంఘటనలను,
సన్నివేశాలను నమోదు చేసి చరిత్రగా తీర్చిదిద్ది గతాన్ని
భద్రపరచడంకంటె ముఖ్యమైనది. పవిత్రమైనది వేరొకటి
ఏమీలేదు.
చిరు తెలంగాణ 514 తేజోమూర్తులు<noinclude><references/></noinclude>
s3rj1tp8cw10122mrvw3vrdiyhlejk7
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/536
104
212259
553477
2026-04-17T07:09:28Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ్రీ వెల్దుర్తి మాణిక్యరావు రచించిన హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమ చరిత్ర యధార్థాలు పాఠకుని ముందుంచి వాటిని సత్య సంధతతో వ్యాఖ్యానించేదిగా ఉన్నది. ఈ హైదరాబాదు స్వాతంత్ర్య...'
553477
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>శ్రీ వెల్దుర్తి మాణిక్యరావు రచించిన హైదరాబాద్
స్వాతంత్ర్యోద్యమ చరిత్ర యధార్థాలు పాఠకుని ముందుంచి
వాటిని సత్య సంధతతో వ్యాఖ్యానించేదిగా ఉన్నది. ఈ
హైదరాబాదు స్వాతంత్ర్యోద్యమ చరిత్ర "సమగ్ర భోగట్టా
ఇచ్చే గ్రంథంగా వండితులకూ చరిత్ర విద్యార్థులకే కాక అశేష
తెలుగు పాఠక లోకానికి ఉపకరిస్తుందని ఆశిస్తాను” అని
అభిప్రాయపడ్డారు.
నేటితరం వారి కోసం "హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమ
చరిత్ర'ను ఈ సందర్భంలో సంక్షిప్త రీతిలో సమీక్షించడం
నముచితమే అవుతుంది. ఇందులో మాణిక్యరావు
హైదరాబాద్ సంస్థాన చారిత్రక నేపధ్యాన్ని తొలి అధ్యాయాల్లో
లోతుగా పరిచయం చేశారు. హైదరాబాద్లో 1857కు
పూర్వం బ్రిటిష్ వ్యతిరేకత అంకురించినతీరు, 1857 ప్రథమ
స్వాతంత్య్ర సంగ్రామ సంగతులు, హైదరాబాద్ సంస్థానంలో
19వ శతాబ్దిలోనే ప్రజా జాగృతి అంకురించిన వాస్తవమూ
వీటన్నింటినీ రచయిత ప్రామాణిక రీతిలో నమోదు
చేశారు. అది హిందూ ఉద్యమం, ఆర్య సమాజ ఉద్యమం,
మత ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభలు,
గ్రంథమాలలు, హైదరాబాద్ మహా సభలు, పత్రికలు
రాజ్యాంగ సవరణలు, కాంగ్రెస్ పార్టీ స్థాపన, సత్యాగ్రహ
ఘట్టాలు - వీటన్నింటితోపాటు చరిత్రలో ప్రమాణంగా
ప్రచారాన్ని పొందని ఘటనల కూడా ఈ గ్రంథంలో
మాణిక్యరావు నమోదు చేశారు. భాగ్యనగర్ రేడియో
నిర్వహణవంటివి ఇందుకు ఉదాహరణ.
ఆంధ్ర మహాసభల విశేషాన్ని రచయిత ఎంతో
ఆసక్తికరంగా వివరించారు. సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర
మహాసభ విశేషాల్ని గురించి నా ప్రస్తావనలో మొదట జరిగిన
మూడు సభావేదిక స్థలాలకు నామకరణం జరుగలేదు. సభా
స్థలమైన సిరిసిల్లకు వేములవాడ సమీపం కాబట్టి వేములవాడ
భీమకవి దివ్యస్మృతిగా సభావరణానికి భీమకవి, నగరం
అని నామకరణము చేసినారు.
ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుండి
వందలాది ప్రతినిధులు ప్రత్యేక బస్సులలో సిరిసిల్ల
చేరుకున్నారు. బస్సుల ఏర్పాటు బొజ్జం నర్సింలుగారు
చేసినారు. ఇక మార్గమధ్యంలో అధ్యక్ష అధ్యక్షరాలితోపాటు
నగర ప్రతినిధులందరికీ బీదు గోపాల్రెడ్డి గారు తూఫ్రాన్లో
సత్కరించినారు. ఆమ్లా కామారెడ్డిలో ప్రముఖులు సత్కరించారు.
ఇట్లా అన్ని ఆంధ్ర మహాసభల విశేషాలు హైదరాబాద్
స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో విపుల రీతిలో లభిస్తాయి.
నాటి హైదరాబాద్ స్వాతంత్ర్యోద్యమ ప్రముఖుల్లో
సర్దార్ జమలాపురం కేశవరావు ఒకరు. తెలంగాణ సర్దార్గా
పేరున్న మహానాయకులాయన. నిజాం వ్యతిరేక పోరాటాల్లో
చురుకుగా పాల్గొన్నారు. ధీరుడు, త్యాగి అయిన సర్దార్
లక్షలాది ప్రజానీకం అభిమానాన్ని చూడగొన్నారు. కందిలో
జరిగిన చిట్టచివరి ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు.
కాంగ్రెస్ ప్రముఖ నాయకుల్లో ఒకరు.
యైభై సంవత్సరాల లోపు వయస్సులోనే ఈ లోకం
నుండి నిష్క్రమించిన సర్దార్ జమలాపురం కేశవరావు
జ్ఞాపకాలు ఎందరిలోనో నిండుగా ఉండేవి. అయితే ఆయన
జ్ఞాపకాలకు అక్షర రూపాన్ని అందించవలసిన అవసరాన్ని
ఆయన మిత్రులు, అభిమానులు గుర్తించారు. పర్యవసానంగా
ఒక చక్కని పుస్తకం వెలువడింది. "స్వాతంత్ర్య సమరము,
నాటి జ్ఞాపకాలు, సంఘటనలు - సర్దార్ జమలాపురం
కేశవరావు గారి పేరుతో మూడు దశాబ్దాల క్రితం ప్రచురణ
పొందిన ఒక పుస్తకానికి హీరాలాల్మెరియాతో పాటు వెల్దుర్తి
మాణిక్యరావు సంపాదకులు.
మాణిక్యరావుకు జమలాపురం కేశవరావుపట్ల
అపరిమితమైన ఆదరణ ఉండేది. ఆయన కేశవరావును
గురించి ఒక చక్కని గేయాన్ని రచించారు. ఇందులో
కేశవరావు వ్యక్తిత్వం పరిచయమైంది. కేశవరావు జ్ఞాపకాల
రూపకల్పనలో మాణిక్యరావు ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు
ఎంతో గొప్పవి. కేశవరావు గారు ప్రజా చైతన్యం కోసం
బురకథలు చెప్పడంలోనూ ప్రావీణ్యతను సాధించారన్న
సంగతితోపాటు పలు అపూర్వ విశేషాలు జ్ఞాపకాలుగా
ఉన్నాయి.
ఇటువంటి జ్ఞాపకాల రచనలు రేపటి చరిత్ర
రచనాధ్యాయాలకు కీలకమైన ముడిసరుకులు అవుతాయన్న
సత్యాన్ని మాణిక్యరావు ఆనాడే గుర్తించారు.
చతురుడు తెలంగాణ ( 515 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
mt284o644f2lhhut0dii7s8f7fh7wip
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/537
104
212260
553478
2026-04-17T07:09:44Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆ క్షణాన్ని సామాజిక చైతన్యం స్వాతంత్ర్య సాధనల కోసం వినియోగించిన రచయితలు, కవుల శ్రేణిలో వెల్దుర్తి మాణిక్యరావు చేరిపోయారు. మాణిక్యరావు తన జీవితంలో పెద్దగా పురస్కారాలు స...'
553478
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఆ క్షణాన్ని సామాజిక చైతన్యం స్వాతంత్ర్య సాధనల
కోసం వినియోగించిన రచయితలు, కవుల శ్రేణిలో
వెల్దుర్తి మాణిక్యరావు చేరిపోయారు.
మాణిక్యరావు తన జీవితంలో పెద్దగా పురస్కారాలు
సత్కారాలు అందుకోలేదు. తన రచనలద్వారా ఇవి తనకు
దక్కాలని ఆయన ఆశించనూ లేదు.
మాణిక్యరావు గారి కొన్ని కథలు, బాలసాహిత్యం సైతం
విస్తారంగా పాత్రికేయ రచనలు కూడా ప్రచారాన్ని
పొందలేదు.
మాణిక్యరావు అన్ని రచనలను ఒక సమగ్ర
సంకలనంగా తీసుకొనరావలసిన అవసరం ఎంతైనా
ఉంది. ప్రముఖ పాత్రికేయుడు జి. కృష్ణ జ్ఞాపకాలతోపాటు
మరెన్నో గ్రంథాలలో మాణిక్యరావు జీవిత విశేషాలు కొన్ని
దొరుకుతాయి. శ్రద్ధతో వాటిని సమీకరించి మాణిక్యరావు
సంక్షిప్త జీవిత చరిత్రనైనా రచించవలసిన అవసరమూ
ఉంది.
A తెలంగాణ (516 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
aap8hob9rttlr4kdj6dxxvwn12ps1xu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/538
104
212261
553479
2026-04-17T07:09:58Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '150 స న్నని గీరు నామము. ప్రసన్నో ముఖంబు భుజంబుపై జరీ యనువ శాల్వ విద్వదమృతాంబుది సంగ్రహరూపమొందిన ట్లున్న బుధోత్తముని రసోజ్జ్వల కావ్య కళాప్రపూర్ణునిన్ గన్నులగంటి కపపుటనంటి...'
553479
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>150
స న్నని గీరు నామము. ప్రసన్నో ముఖంబు
భుజంబుపై జరీ
యనువ శాల్వ విద్వదమృతాంబుది
సంగ్రహరూపమొందిన
ట్లున్న బుధోత్తముని రసోజ్జ్వల కావ్య కళాప్రపూర్ణునిన్
గన్నులగంటి కపపుటనంటిని సత్కవి వేముగంటినిన్
సుప్రసిద్ధ సాహితీవేత్త
ఉత్పల సత్యనారాయణాచార్యులు కలం నుండి
జాలువారిన వేముగంటి నరసింహాచార్యులు రూప వర్ణన
ఇది.
ఇప్పటికీ సిద్ధిపేట పురవీధులలో నిరాడంబరంగా
తిరుగాడిన వేముగంటి జ్ఞాపకాలను ఆ ప్రాంత ప్రజలు
అనునిత్యం నెమరువేసుకుంటూ ఉంటారు.
ఇరవయ్యవ శతాబ్ది ప్రథమార్ధంలో జన్మించి ద్వితీ
యార్ధంలో హృద్యమైన పద్యప్రసూనాలతో తెలుగు భారతిని
అర్చించిన వేముగంటి తెలంగాణాకు వన్నె తెచ్చిన కవి
పుంగవులలో అగ్రశ్రేణికి చెందినవారు. ఆరు దశాబ్దాలపాటు
సాగిన తమ అద్భుత కవితాసృష్టితో పోతన, విశ్వనాథ,
జాషువా, దాశరథి, కరుణశ్రీ వంటి కవుల సరసన సుస్థిర
స్థానాన్ని సంపాదించుకున్న సాహితీమూర్తి ఆయన.
వేముగంటి నరసింహాచార్యులు
- డా॥ చెప్పెల హరినాథ శర్మ
సిద్ధిపేట పట్టణంలోని సంప్రదాయ వైష్ణవ కుటుంబం
లో 1930వ సంవత్సరం జూలై 14వ తేదీన శ్రీమతి
రామమ్మ రంగాచార్యుల దంపతులకు వేముగంటి నరసింహా
చార్యులు జన్మించారు. భారతదేశం దాస్యశృంఖాలలో
మగ్గుతున్న కాలంలో, తెలంగాణాలో తెలుగు భాషా
సాహిత్యాలు కొడిగట్టిన చందంగా ఉన్న సమయంలో
జన్మించిన వేముగంటి నిరంతర పఠనతో తాత లక్ష్మణా
చార్యులు, తండ్రి రంగాచార్యులు, తల్లి రాములమ్మలు
అందించిన సంస్కార ప్రభావంతోపాటు చిరుప్రాయంలోనే
శతక సాహిత్యం కంఠోపాఠం చేసారు. వీధిబడిలోని ప్రాథమిక
విద్యాభ్యాసాన్ని పూర్తిచేసున్నారు.
వీరేశలింగం పంతులు వాచకాలతో సాగిన విద్యా
భ్యాసంలో భాగంగా సంస్కృత, ఆంధ్ర పంచకావ్యాలు, రుక్మిణి
కల్యాణం, గజేంద్రమోక్షం, వామనావతారంవంటి భాగవత
గాథలు, అమరం, సుప్రసిద్ధ తెలంగాణ శతకాలు బోధించేవారు.
ఇవి వారిలో బలమైన ముద్ర వేయడంతోపాటు వారు గొప్ప
కవిగా ఆవిర్భవించేందుకు దోహదపడ్డాయి.
1946లో వరంగల్ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర
కళాశాలలో చేరి సంస్కృతాన్ని తెలుగును కూలంకషంగా
అధ్యయనం చేశారు. 1946లోనే మదన్ మోహన్ మాలవ్య
ఏ తెలంగాణ (517) తేజోమూర్తులు ఓట<noinclude><references/></noinclude>
i006uvd1cm1mrcsmeeii4e8fwu3pzhs
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/539
104
212262
553480
2026-04-17T07:10:12Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పరమపదించినప్పుడు 'భాష్పాంజలి' పేరుతో వీరు రచించిన పద్యాలు అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడిన తెలుగు 'మీజాన్' పత్రికలో అచ్చయ్యాయి. ఇదే వీరి తొలి రచన. అప్పటి నుండి వారి లేఖ...'
553480
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పరమపదించినప్పుడు 'భాష్పాంజలి' పేరుతో వీరు రచించిన
పద్యాలు అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడిన
తెలుగు 'మీజాన్' పత్రికలో అచ్చయ్యాయి. ఇదే వీరి తొలి
రచన.
అప్పటి నుండి వారి లేఖిని నిరంతరం జాలువార్చిన
కవితాఖండికలు కాకతీయ, గోలకొండ, కృష్ణాపత్రిక,
ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, స్రవంతి, భారతి
తదితర పత్రికలలో అచ్చయ్యాయి.
తర్వాతి కాలంలో ఆంధ్ర సారస్వత పరిషత్ వారి
విశారద, ఉస్మానియా విశ్వవిద్యాలయం బి.ఓ.ఎల్.
పరీక్షలలో ఉత్తీర్ణులై తెలుగుపండితునిగా ఉద్యోగ బాధ్యతలు
స్వీకరించి వేలాది మంది శిష్యులను సాహితీ ప్రియంచావుకు
లుగా తీర్చిదిద్దారు. 1946లో మొదలైన వీరి కవితా రచన
2006 అక్టోబర్ 29న తుదిశ్వాస విడిచే వరకు నిరా
ఘాటంగా కొనసాగింది.
దేశభక్తి ప్రపూరితమైన 'ప్రబోధం' వేముగంటి వారి
రెండవ రచన. ఆనాటి యువతలో దేశభక్తిని నింపి
స్వాతంత్ర్యోద్యమం వైపు పరుగులెత్తించిన రచన ఇది.
వీరపూజ, తిక్కన, ఆంధ్ర విష్ణువు, శ్రీ వివేక విజయం, భక్త
రామదాసు, శ్రీ భాసర సరస్వతీవైభవం, మేలుకొలుపు,
పురుపకరాము, కవితాకాహళి, భావతరంగిణి, తెనుగుబాల
శతకం, బాల గేయాలు మొదలైన కావ్యాలతోపాటు
వ్యాసకలాపం పేరిట ఒక వ్యాస సంకలనాన్ని వెలువ
రించారు.
రామో విగ్రహవాన్ ధర్మః అన్న వీరి పుస్తకం వాల్మీకి
రామాయణంలోని ధర్మ సూక్ష్మాలను విడమరచి చెప్పింది.
భారతదేశంపై పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడి
నప్పుడు భారత వీర సైనికులు పాక్ మూకలను లాహోర్
వరకు తరిమికొట్టారు. ఆ సన్నివేశాన్ని 64 పద్యాలతో
వీరపూజ అన్న లఘుకావ్యంగా మలిచారు.
“ఎవడురా పయినయిన్ నివురు గప్పిన
నిప్పురవల వెదకి సూద తివిరినాడు.
కోరలు పెరుకగా కోరినాడు.
ఎవడురా వాడు భయమించుకేని లేక
భరత ధాత్రిపై వచ్చినాడు"
అని గర్జించిన వారి కలం జాతీయభావాలను దేశభక్తిని
రగిలించింది. ఈ కావ్యం రాష్ట్రపతి మహోదయులు డాక్టర్
సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రశంసలందుకున్నది.
కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన జీవితాన్ని,
ఆనాటి చారిత్రిక సన్నివేశాలను జోడిస్తూ 321 పద్యాలలో
నాలుగు ఉల్లాసాలుగా 'తిక్కన' కావ్యాన్ని రచించారు. తిక్కన
రాజనీతిజ్ఞత, గణపతిదేవ చక్రవర్తి సభలో ప్రతిభా
పాటవాలతో రాణించిన తీరు కళ్ళకు కట్టినట్లు ఈ కావ్యం
చిత్రీకరించింది.
"ప్రతిభా పాండిత్య సమా
హితనుగు నటులుగ లోకహితమీ కవితా
ప్రతమును సాగించెదనిక
బ్రతుకంతయు ముడుపుగట్టి భవ్యాత్యుడనై
అని తిక్కన నోటి వెంట తమ కవితా లక్ష్యాన్ని
ప్రకటించారు. విశ్వశ్రేయస్సే సాహిత్య ప్రయోజనమన్న
సూక్తిని పునరుద్ఘాటించారు.
రెండువేల సంవత్సరాల నాటి ఆంధ్రజాతి వీరుని
గాథను ఆంధ్రవిష్ణువు కావ్యంగా మలిచారు. కవిసామ్రాట్
విశ్వనాథ ఆంధ్ర నిశుంభుని వధించిన ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్
అన్న ఖండకావ్యంగా అందిస్తే వజ్జల కాళీదాను ద్విపద
కావ్యంగా రచించారు. అదే స్ఫూర్తితో వేముగంటి వారు
131 పద్యాల కావ్యంగా 'ఆంధ్రవిష్ణువు' సాహితీలోకానికి
అందించారు. ఈ కావ్యం విశ్వవిద్యాలయాల పాఠ్యగ్రంథ
మైంది.
భారతీయ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే
ఆత్మ విస్మృతి నందిన జాతికి పునరుజ్జీవనాన్ని అందించిన
మహనీయుడు స్వామి వివేకానంద. వారి మహిమాన్వితమైన
జీవితకథను 150 పద్యాలతో శ్రీ వివేక విజయము అన్న
కావ్యంగా వెలువరించారు.
ఎవడురా భీషణ వ్యవసాయ మిన్నాగు
అయయం చేయుటయు తెలంగాణ (518 తేజోమూర్తులు ఉండి<noinclude><references/></noinclude>
2ryf7ywpmlnsiph0nmycfhthjw03fkm
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/540
104
212263
553481
2026-04-17T07:10:27Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భద్రగిరిపై శ్రీరామచంద్రుడికి భవ్యమైన ఆలయం నిర్మించి భక్తిపారవశ్యంతో రాముడిని మనసారా కీర్తించిన రామదాసు కథను 'భక్త రామదాసు' అన్న కావ్యంగా సమకూర్చారు. 302 పద్యాలతో రూపుదిద...'
553481
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భద్రగిరిపై శ్రీరామచంద్రుడికి భవ్యమైన ఆలయం
నిర్మించి భక్తిపారవశ్యంతో రాముడిని మనసారా కీర్తించిన
రామదాసు కథను 'భక్త రామదాసు' అన్న కావ్యంగా
సమకూర్చారు. 302 పద్యాలతో రూపుదిద్దుకున్న ఈ కావ్యం
వేముగంటి కావ్యాలలో
కెల్లా పెద్దది. తెలంగాణా సంస్కృతికి
జీవగర్ర అయిన బతుకమ్మ పండుగను ఈ కావ్యంలో
అద్భుతంగా వర్ణించారు రామదాసు. సీతారామలక్ష్మణులకు
చేయించిన ఆభరణాలను రమణీయంగా పేర్కొన్నారు.
'సీతమ్మ కిమ్ముగా చింతాకు పతకమ్ము
చేయించే చక్కని శిల్ప మెసగ
రామయ్య తండ్రికి రతనాల కలికి తు
రాయి చేయించి అర్పణ మొనర్చె
భరతునకు మేలి పచ్చల పతకమ్ము
కైసేసే డెందంబు కందలింప
లక్ష్మణస్వామికి లలితమౌ ముత్యాల
పతక మర్పించే సంబరము వెలయ
కోరి శతృఘ్ననకును బంగారు తళుకు
కులుకు మొలత్రాడు నర్పించుకొని మురిసేను
స్వర్ణ మాణిక్య భూషణావళిని దైవ
తముల కర్పించి గోపన్న ధన్యుడయ్యె
సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకమ్ము అన్న
రామదాసు కీర్తనను రమ్యమైన సీసపద్యంగా అందించారు.
సరస్వతీ మాత చతుష్షష్టి కళాప్రపూర్ణ. అందుకే
అమ్మవారిని చతుష్షష్టి ఉపచారాలతో అర్చిస్తారు. చదువుల
తల్లి సరస్వతీదేవి వెలసిన క్షేత్రం బాసర. బాసరగా,
వ్యాసపురిగా ప్రశస్తికెక్కిన బాసరలో వెలిసిన సరస్వతీమాతను
అరవైనాలుగు పద్యాలలో స్తుతిస్తూ శ్రీ బాసర సరస్వతీ వైభవం
అన్న కావ్యంగా తీర్చిదిద్దారు.
ఆయన సంప్రదాయాన్ని ఎంతగా అభిమానించేవారో
అంతే అభినివేశంతో సామాజిక సమస్యపై కొరడా
ఝళిపించేవారు. ప్రకృతి వర్ణనలలో ప్రబంధ కవులను
మించిన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే అవకాశం చిక్కిన
ప్రతిసారి సమాజంలోని దళిత, పేద వర్గాల పట్ల సాను
భూతిని, సహానుభూతిని తమ రచనలలో ప్రదర్శిం చారు.
గ్రీష్మతాపాన్ని వర్ణించే సందర్భంలో మహా కార్యాలలోని
వర్ణనకు తీసిపోని రీతిలో వారు నుడివిన ఈ పద్యాన్ని
పేర్కొనవచ్చు.
"నల నీలాకాశ ఫాలభాగమునుండి
చినుచివు అగ్నికుంకుమరాలె
ఎండమావుల నీటికుండలెత్తుక దిశల్
దాహార్తులను కడు మోహపరిచె
వట్టిపోయిన కన్నెవాగు గుండెలలోన
వెచ్చని ఇసుకగుహళ్లెన్నో లేచె
పచ్చ పచ్చని ఆకువలువలుజార్చి
కాననములు నగ్న తాండవమొనర్చె
నట్టనడి ఎండలోన బండలనుగొట్టు
చున్న శ్రమిక మానవుల నిట్టూర్పు సెగల
విధమునక వడగాడ్పులు విస్తరించే
గ్రీష్మ భీష్మాతపము చెలరేగినంత”
ఆంధ్రవిష్ణువు కార్యంలోని ఈ పద్యం వేముగంటి
కల్పనావై చిత్రికి ఉదాహరణ. మరో పద్యంలో జీవ
కారుణ్యాన్ని ప్రదర్శించారు.
“వాగాత్మికపై నితాంత భాసుర దిషణా
యోగాత్మికవై సురుచిత
భాగాత్మికమైన నీకు మ్రొక్కెద వాణీ" అంటూ శ్రీవాణీ
వైభవాన్ని కీర్తించారు.
సరస్వతీ మాతకు ఆలయాలు చాలా తక్కువగా
ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఉండగా
మరొకటి కాశ్మీర్లో ఉంది. సిద్ధిపేట జిల్లాలో వర్గల్ విద్యా
సరస్వతీ ఆలయం, అనంతసాగర్ సరస్వతీ ఆలయాలు
ఇటీవల వెలిసాయి.
"అమ్మ భారతి జగతి నీకాలయమ్ము
లొకటటొ రెండొ కలవనియు నులుక నేల
తెలంగాణ (519) తేజోమూర్తులు ఉం<noinclude><references/></noinclude>
fnqy34vnnmv8a1fb8aogus2mn9qmohi
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/541
104
212264
553482
2026-04-17T07:10:43Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విశ్వమానవ మానవ వీధి నీకు వేలుగానున్న మేలి కోవెలలు గావె” సరస్వతీ ఆలయాలు తక్కువగా ఉన్నప్పటికీ విశ్వంలోని మానవుల మనస్సులన్నీ అమ్మ ఆలయాలే అన్న కవి భావన ఉదాత్తమైనది. మదన్ మోహ...'
553482
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>విశ్వమానవ మానవ వీధి నీకు
వేలుగానున్న మేలి కోవెలలు గావె”
సరస్వతీ ఆలయాలు తక్కువగా ఉన్నప్పటికీ విశ్వంలోని
మానవుల మనస్సులన్నీ అమ్మ ఆలయాలే అన్న కవి భావన
ఉదాత్తమైనది.
మదన్ మోహన్ మాలవ్య జీవితాన్ని 'భాష్పాంజలి'
అన్న లఘుకావ్యంగా మలిచినట్లుగానే జాతిపిత గాంధీజీ
త్యాగమయ జీవనగాధను 'బాపూజీ' అన్న ఖండకావ్యంగా
రచించారు. “ఎవడైన నీ వంక కన్నెర్ర జేసి చూచేసేవి నా
గుండె నారాచ మగును. ఎవడైన నీనీడ నొప్పించెనేని నర
నరమ్మున వేడి నెత్తురులు పొంగు" అంటూ గాంధీజీ పట్ల
తనకున్న భక్తినీ దేశభక్తి పట్ల అనురక్తినీ చాటుకున్నారు.
ఇవేకాక శ్రీవేంకటేశ్వరోదాహరణం, గణేశోదాహరణం
వంటి లఘుకృతులు రచించారు. 1960వ సంవత్సరంలో
గాంధీజయంతి సందర్భంగా సిద్ధిపేటలో సాహితీ వికాస
మండలిని స్థాపించి సాహిత్య వ్యాప్తి కోసం కృషి చేశారు.
సాహితీసదనం పేరిట సిద్ధిపేటలో తాను స్థాపించిన సంస్థకు
చక్కటి భవనాన్ని నిర్మించారు.
ఎందరో యువకులను కవులుగా సాహితీవేత్తలుగా
తీర్చిదిద్దారు. వేముగంటి వారికి పద్యమంటే ప్రాణం అయినా
వచనాన్ని పలికారు. గేయాన్ని అద్భుతంగా మలిచారు. ఏ
ప్రక్రియపట్ల ఏనాడూ ద్వేషాన్ని గానీ, వ్యతిరేక భావాన్నిగాని
ప్రకటించని సమభావుకు డాయన. "మంజీరానాదాలు” అనే
గేయ కావ్యం వీరి గేయ రచనా
చమత్ర్కుతికి నిదర్శనం.
"ఏనాటి దానవో ఏవీటి జాణవో గానమై మూగ
తెలంగాణ వీణను మీటి పలికింప
చకచకచ్చనిత పింఛములిచ్చుకొనుచు
నృత్యము చేయు నెమలిరాయని బెడంగు
పసిడి వన్నెల మేనిపై నల్లచారల
సాగియించు చెబ్బులి సొమ్ముగమ్ము
కల కలారావ సంకులమున ప్రకృతిని
పులకింపగాజేయు పులుగు సొగసు
భాసురములగు దీర్ఘపు కేసరములు
కెంపురాయి తురాయిగా సొంపులొలుక
దొరతనము సేయు మృగరాజు నెఱతనమ్ము
గలుగు వనరమా గరిమకు కవన వినుతి”
వనాలనూ, వన్యప్రాణులనూ కాపాడుకొందామనే
భావనతో అందమైన సీసపద్యాన్ని అల్లడం వేముగంటి వారికే
సాధ్యపడింది. మంజీరనాదాలు అనే గేయకృతిలో వర్షాకాలం
ప్రవాహాలన్నిటికీ కొత్తదనాన్నిస్తుందని పలికే సందర్భాలు...
"పీడిత ప్రజ మనసు దూసుక
వెడలు చైతన్య ప్రవాహమొ
దుష్టచేష్టలు ధిక్కరించే
దుర్దరమ్మ గుజనసమూహమొ” అంటాడు.
ఎండాకాలంలో పిల్లకాలువలా మారే మంజీరానది
వర్షాకాలంలో వీడిత ప్రజలు తిరుగుబాటు చైతన్య
ప్రవాహంవలె, దుష్ట దోపిడీ దుశ్చేష్టల్ని ధిక్కరిస్తున్న వెల్లువలా
తయారై నిలుస్తుందంటారు. ప్రవాహ ఉధృతిని జీవన
సౌష్టంతో పోల్చడం సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించడం
విశేషం.
రాగ స్రవంతివై వచ్చితివి అంటారు. రాయప్రోలు
ప్రబోధం, విశ్వనాథ ఆంధ్రప్రశస్తి, దాశరథి రుద్రవీణ,
అగ్నిధార జాషువా ఖండకావ్యాల ప్రభావం వీరి కావ్యాలపై
కనిపిస్తుంది. సీసపద్యాన్ని అల్లడంలో శ్రీనాథుడి సోయగం
భక్తిభావ బంధురతలో పోతన ప్రభావం, పద్యశిల్పాన్ని
చెక్కడంలో నన్నయ శైలి వేముగంటి కావ్యాలలో అక్కడక్కడా
తళుక్కుమంటాయి.
ఎంతటి ప్రాచీనుడో అంతటి ఆధునికుడిగా వేముగంటి
కనిపిస్తారు. ప్రకృతి వర్ధనలో, సనాతన సంప్రదాయాభి
మానంలో ఎంతటి అభిమానాన్ని ప్రదర్శిస్తారో కులమత
వైషమ్యాలను నిరసించడంలో అంతటి తీవ్రతను చూపిస్తారు.
వేముగంటివారి రచనలను పలు విశ్వవిద్యాలయాలు
పాఠ్యాంశాలుగా స్వీకరించాయి. తిక్కన కావ్యాన్ని
ఉస్మానియా, ఆంధ్రవిష్ణువు కావ్యాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వ
విద్యాలయం.
ad తెలంగాణ (520 తేజోమూర్తులు ఉండ<noinclude><references/></noinclude>
8vpgxjcfvgbgjvyqfyi7h8qs9iepw4q
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/542
104
212265
553483
2026-04-17T07:11:03Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గుల్బర్గా విశ్వవిద్యాలయం పాఠ్యాంశాలుగా స్వీకరిం చాయి. తెలంగాణా ప్రభుత్వం వీరి మంజీరా నాదాలను పాఠ్యాంశంగా స్వీకరించింది. తెలుగు విశ్వవిద్యాలయం, గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్...'
553483
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గుల్బర్గా విశ్వవిద్యాలయం పాఠ్యాంశాలుగా స్వీకరిం
చాయి. తెలంగాణా ప్రభుత్వం వీరి మంజీరా నాదాలను
పాఠ్యాంశంగా స్వీకరించింది.
తెలుగు విశ్వవిద్యాలయం, గౌరవ డాక్టరేట్ ఇచ్చి
సత్కరిస్తే, భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి విద్వత్కవి
అన్న బిరుదుతో సత్కరించారు. కవికోకిల, సుకవిభూషణ
అన్నవి వారికున్న మరికొన్ని బిరుదులు.
"దినకరుండుండు నందాక తేజరిల్లు
గాత భవదీయ రసరమ్య కావ్య వితతి
ఓయి వేముగంటి సుకవీ వేయి వత్స
రాలు హృదయాలలో నీవు వ్రాలు గాత
అని ఆచార్య తిరుమల ఆకాంక్షించినట్లు తెలుగు
పద్యానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు వేముగంటి పద్యానికి
వెయ్యేళ్ళు నిలువగల సత్తా ఉంది.
ఏ తెలంగాణ 521 తేజోమూర్తులు ఉంటాయ<noinclude><references/></noinclude>
39d62jucy6ax4yuikyzedvt36qw6w43
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/543
104
212266
553484
2026-04-17T07:11:16Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '151 వేముల పెరుమాళ్ళు - డా|| దేవరాజు మహారాజు ఇం టికి వాకిలి సాక్షి అన్నట్టు ఈ తెలుగింటికి, ఈ తెలంగాణ ఇంటికి వాకిలి లాంటి వాడు వేముల పెరుమాళ్ళు. తెలుగు భాషా సంస్కృతుల గూర్చి, తెలు...'
553484
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>151
వేముల పెరుమాళ్ళు
-
డా|| దేవరాజు మహారాజు
ఇం
టికి వాకిలి సాక్షి అన్నట్టు ఈ తెలుగింటికి, ఈ
తెలంగాణ ఇంటికి వాకిలి లాంటి వాడు వేముల
పెరుమాళ్ళు. తెలుగు భాషా సంస్కృతుల గూర్చి, తెలుగు
జీవనానికి సంబంధించిన జాతీయాల గూర్చి వేముల
పెరుమాళ్ళు ఒక జీవిత కాలపు కృషి చేశారు. అయితే ఆ
కృషి గురించి తెలుగు సాహితీ లోకంలో జరగాల్సినంత
చర్చ జరగకపోవడం విచారకరం. పెరుమాళ్ళు మాటల్లోనే
చెప్పాలంటే మన సాహిత్య చర్చలన్నీ 'ఉత్తుత్తి పుట్నాలు -
మూడు మూడు కుప్పలన్నట్లుగా సాగుతున్నాయి.
మంచి మనిషిగా, నిగరిగా గుర్తింపు ఉన్న పెరుమాళ్ళు
కొంతకాలం రాజకీయాలలో కూడా ఉన్నారు. స్వతంత్ర
అభ్యర్థిగా పోటీచేసి కరీంనగర్ జిల్లాలోని రాయికల్ మండల
అధ్యక్షులుగా ఎన్నికై కొద్దికాలం పనిచేశారు. 1989లో
శాసనసభకు కూడా పోటీచేశారు. కానీ గెలవలేకపోయారు.
అయినా ఆయన ప్రజా జీవితానికి దూరం కాలేదు. సమస్యల
పరిష్కారానికి ఎప్పుడూ ముందుండేవారు. అందువల్లే లేబర్
కాంట్రాక్టు సహకార సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్రం టెలిఫోన్
కమిటీ సభ్యులుగా చాలాకాలం కొనసాగారు. అస్వస్థులై
17 సెప్టెంబర్, 2005 కన్నుమూసే నాటికి ఆయన వయసు
62 మాత్రమే.
వేముల పెరుమాళ్ళు 8 జనవరి, 1943న కరీంనగర్
జిల్లా రాయికల్ గ్రామంలో జన్మించారు. కోరుట్ల, జగిత్యాల,
శ్రీకాళహస్తిలో హైస్కూలు చదువు పూర్తిచేసి గ్రామీణాభి
వృద్ధిలో డిప్లమా తీసుకున్నారు. ఇక సాహిత్య రంగాన గౌతమి
సాహిత్య సమాఖ్య కరీంనగర్ కార్యవర్గ సభ్యులుగా అనేక
సభలు నిర్వహించారు. స్వయంగా ప్రసంగాలు చేశారు.
తెలంగాణ జాతీయాలపై ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం
నుంచి ఎన్నో ప్రసంగాలు చేశారు. అవి గాఢమైన చింతనతో
సూటిగా, స్పష్టంగా ఉండేవి. తన అనుభవాల్ని ఆలోచనల్ని
రంగరించి జాతీయాలను విశ్లేషిస్తూ ఉంటే ఎవరో వృద్ధ
పండితుడు మాట్లాడుతున్నట్టు ఉండేది. నిజానికి అప్పుడాయన
వయసు నలభైకి పైచిలుకు. చదువు స్కూలు ఫైనలే. కానీ
ఆయన వాక్యం రసాత్మకం. శైలి ఒక ప్రవాహం. నిగూఢమైన
అంశాల్ని వంగడిస్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు ఆయనది
మహా మేధావుల స్థాయి.
ఒక పది పుస్తకాలు ప్రచురించడానికి సరిపడినన్ని
జాతీయాలు సేకరించిన పెరుమాళ్ళు అతి కష్టం మీద 2
వందల 70 పేజీల 'తెలంగాణ జాతీయాలు' 1998లో
ప్రచురించగలిగారు. ఆ ఒక్క పుస్తకం అచ్చువేయడానికి
పెద్దమొత్తంలో అప్పుకావడం వల్ల అది తనకు 'చిన్న ముందుకు
'పెద్ద శోకం' అంటే శక్తికి మించిన పని అయ్యిందని
చెప్పుకున్నారు. ఆ పుస్తకం చదివిన వారికి ఆయన స్థాయి
ఏమిటో అర్థమవుతుంది. ఎవరూ పట్టించుకోని జాతీయాల్ని
ఉడతా భక్తిగా సేకరించి, వాటికి వివరణలు, వ్యాఖ్యానాలు
తేజోమూర్తులు denied
సమరము bh తెలంగాణ ( 522 తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
n4dm3rs2cqg80ub153ipckyz7mbcppn
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/544
104
212267
553485
2026-04-17T07:11:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రాసి ప్రసంగిస్తుంటే వినడం ఒక గొప్ప అనుభవం. ఆ విషయాన్ని ఆచార్య బిరుదురాజు రామరాజు, ఆచార్య నాయని కృష్ణకుమారి, డాక్టర్ దాశరథి రంగాచార్య వంటి నాటి సాహితీ ప్రముఖులు పుస్తకాని...'
553485
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రాసి ప్రసంగిస్తుంటే వినడం ఒక గొప్ప అనుభవం.
ఆ విషయాన్ని ఆచార్య బిరుదురాజు రామరాజు, ఆచార్య
నాయని కృష్ణకుమారి, డాక్టర్ దాశరథి రంగాచార్య వంటి
నాటి సాహితీ ప్రముఖులు పుస్తకానికి రాసిన ముందు
మాటలలో వివరించారు. విశ్వవిద్యాలయాలు, అకాడమీలు
లేదా సాహిత్య సంస్థలు చేయాల్సిన పనిని వేముల పెరుమాళ్ళు
ఒంటరిగా చేశారు. ఉడుంపట్టు, దీక్ష, కార్యశూరత్వం
గలవారు ఎలాంటి మహాకార్యాన్నయినా అలవోకగా
చేయగలరని 'తెలంగాణ జాతీయాలు' పుస్తకం చూస్తే
తెలుస్తుంది. పాఠకులు 'తంతే పరుపులో పడ్డట్టు పడతారు.
తెలుగు సంస్కృతి అంతా ఒకటే ! అయినా తెలంగాణ
సంస్కృతిలో కొంత భిన్నత్వం ఉంది. భాషలో, యాసలో
ప్రత్యేకత ఉంది. అందుకు కారణం సుమారు ఎనిమిది
వందల సంవత్సరాలకు పైగా ఇతర జాతీయులు ఈ
ప్రాంతాన్ని పాలించారు. తెలుగు చదవడం, రాయడం
నిషేధింపబడ్డ రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు వారి
భాషను, యాసను పదిలపర్చుకున్నారు. వారి సామెతల్ని,
మౌఖిక సాహిత్యాన్ని, లిఖిత సాహిత్యాన్ని భద్రపరుచు
కున్నారు.
నిజాం పాలకులు సృష్టించిన ప్రతికూలమైన పరిస్థితు
లలో కూడా ఇక్కడి ప్రజలు వాటిని కాపాడుకోవడం ఒక
సాహసవంతమైన చర్య వ్యవసాయ పరంగా చూస్తే ఈ
ప్రాంతపు భూములు పెద్దగా పంటలు పండేవి కావు. రాళ్ళు,
రప్పలు, గుట్టలు, నీటికొరత, వ్యాపారానికి కూడా అనువైన
ప్రదేశం కాదు. అందువల్ల ఆర్థికంగా బలపడే అవకాశాలే
లేవు. అంటే అన్ని రకాల ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ
ప్రజలు తమ భాషను, యాసను, సంస్కృతీ సంప్రదాయాలను
కాపాడుకుంటూ వచ్చారన్నది మనం గ్రహించాలి.
సహృదయంతో అందులోని గొప్పతనం అర్థం చేసుకోగల
వారికైతే అది అర్థమవుతుంది. అది అర్ధం చేసుకునే ఒక
అవకాశం వేముల పెరుమాళ్ళు మనకిచ్చారు. 'ఇది గుర్రం
'- ఇది మైదానం' అన్నట్లు తేటతెల్లం చేశారు.
'తెలంగాణ జాతీయాలు' ఏకాగ్రతతో మనసుపెట్టి
చదివిన వారికి తెలుగు జాతి ఔన్నత్యం గూర్చి తెలుస్తుంది.
మన పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్లు, పేరంటాలు, క్రీడలు,
విందులు, వినోదాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, ఆచరణలో
ఉన్న వివిధ విధానాలు, వాటివాటి ప్రత్యేకతలు అన్నీ
కొంతవరకైనా తెలుస్తాయి. ఇంగ్లీష్ చదువులు ఎక్కువైపోయి,
విదేశీ సంప్రదాయాలు మక్కువైపోయి తమ అస్థిత్వాన్ని తామే
వదులుకుంటూ పరాయీకరణ చెందుతున్న నేటి యువతరం
ఎంత సత్వరంగా తమను తాము గుర్తించుకుంటే అంత
మంచిది. ఎన్నెన్నో అవరోధాల్ని తట్టుకుంటూ కొన్ని వేల
సంవత్సరాల నుంచి అఖండ దీపంలా వెలుగుతూ వస్తున్న
మన జానపద సంస్కృతి విలువను నేటితరం అర్థం
చేసుకోవాలి. 'ఇంటోడు దొంగల్ల కల్సినట్టు కాకూడదు'.
మన పాతతరం మనుషులు ఏ రెండు నిముషాలు
మాట్లాడినా అందులో పుష్కలంగా జాతీయాలు, సామెతలు,
పొడుపు కథలు, పదాలు అలవోకగా వినిపించేవి. ఇప్పుడు
ఈ మారిన కాలంలో అన్నీ మారిపోయాయి. 'చిత్తు
బొత్తయ్యింది' అంటే తారు మారయ్యింది. భాష కాలుష్యమై
పోయింది. యాస కాలుష్యమైపోయింది. జానపదుల
ఆత్మసౌందర్యం గుబాళించే జాతీయాలు కనుమరుగై
పోతున్నాయి. ఈ కనిపించని వరదల్లోంచి, ఉప్పెనలోంచి,
గుండాల్లోంచి, సునామీల్లోంచి మనల్ని మనం
రక్షించుకోకతప్పదు. అలాంటి ముఖ్యమైన విషయాన్ని ఎత్తి
చూపి మన బాధ్యతను మనకు గుర్తు చేసిన పెరుమాళ్ళు
చిరస్మరణీయులు.
పరభాషా దురాక్రమణ వల్ల మన జాతీయాలెన్నో
కాలగర్భంలో కలిసిపోయాయని ఆయన ఆవేదన చెందారు.
'పోయింది పొట్టు, ఉన్నది గట్టి అన్న పెద్దల వాక్యానికి
కట్టుబడి, ఆయన తెలంగాణ మారుమూల పల్లెల్లోంచి
జాతీయాలు పోగుచేశారు. ఆయనకు అదొక యజ్ఞ్నం. అదొక
తపస్సు. ఒక్కోసారి జాతీయం వెంట సామెత, సామెత వెంట
జాతీయం కలిసి ఉంటాయి. తల్లీ పిల్లల్లాగా, అది
విడదీయరాని బంధం. జాతీయాల్లో అక్కడక్కడా కొంత
బూతు తొంగిచూస్తుంది. అయితే అది నాగరికులైన
అక్షరాస్యుల దృష్టి కోణంలో మాత్రమే బూతు, వారి దృష్టిలో
అంటే జానపదుల లేదా నిరక్షరాస్యుల దృష్టిలో అది బూతు
కాదు. వారు అమాయకంగా, సహజంగా, స్వచ్ఛంగా,
స్వచ్ఛందంగా పదాలు వాడతారు. మనం వాటిని వారి
కోణంలోంచే, వారి స్థాయిలోంచే పరిశీలించాలి.
చతురుడు తెలంగాణ (523 తేజోమూర్తులు ఓ<noinclude><references/></noinclude>
rkf4xo9vtx52pnfrqttejl2e1gxiq24
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/545
104
212268
553486
2026-04-17T07:11:44Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వేముల పెరుమాళ్ళు ఈ విషయంలో ఎంతో సాహసవంతుడు. తెలంగాణ జాతీయాల్ని పరిరక్షించడం తన కర్తవ్యమని, జీవిత ధ్యేయమని భావించారు. యథాతథంగా జాగ్రత్తగా వాటిని గ్రంథస్తం చేశారు. ఒకవిధంగ...'
553486
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వేముల పెరుమాళ్ళు ఈ విషయంలో ఎంతో
సాహసవంతుడు. తెలంగాణ జాతీయాల్ని పరిరక్షించడం
తన కర్తవ్యమని, జీవిత ధ్యేయమని భావించారు.
యథాతథంగా జాగ్రత్తగా వాటిని గ్రంథస్తం చేశారు.
ఒకవిధంగా చెప్పాలంటే తరతరాల తెలంగాణ సామాజిక
చరిత్రను గ్రంథస్తం చేశారన్న మాట. 'పిర్రలు చూసి వీటలు
వేసే కాలమిది' వేముల పెరుమాళ్ళు వంటి వారి గూర్చి
ఎవరు మాట్లాడుతారు ?
తెలంగాణ (524) తేజోమూర్తులు ఉ<noinclude><references/></noinclude>
dvwvvhknbnmmzdjeukztqco5v3rkzkl
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/546
104
212269
553487
2026-04-17T07:11:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '152 ప్పటి నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం కరీంనగర్ జిల్లా మంథనిలో శ్రీ వేంకటరాజన్న అవధాని గారు తేది. 10.6.1909న శ్రీ కృష్ణయ్య అవధాని, శ్రీమతి సీతమ్మ దంపతులకు జన్మించారు. శ్రీ...'
553487
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>152
ప్పటి నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం
కరీంనగర్ జిల్లా మంథనిలో శ్రీ వేంకటరాజన్న
అవధాని గారు తేది. 10.6.1909న శ్రీ కృష్ణయ్య అవధాని,
శ్రీమతి సీతమ్మ దంపతులకు జన్మించారు.
శ్రీ అవధాని గారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతి
రేకంగా సాగిన సంస్థాన విలీనకరణ, స్వాతంత్య్ర పోరాటపు
ఉద్యమాలలో పాల్గొని, సత్యాగ్రహము చేసి నైజాం ప్రభుత్వము
చేత అరెస్టుకాబడి, అప్పటి నిరంకుశ నిజాం పోలీసులచే
చిత్రహింసలపాలైన వీరు, తమ జీవితంలో ఎంతో ధైర్యముగా
ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లెక్కచేయక అన్ని ఉద్యమాలలో
ముందుండి, అప్పటి స్టేట్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొని,
తమ సర్వస్వాన్ని దేశం కొరకు సమర్పించడానికి సిద్ధపడి
పోరాటం సాగించినారు.
1946లో అప్పటి ప్రభుత్వం వీరిని అరెస్టు చేసి 6
నెలలు కరీంనగర్ జిల్లా జైలులో బంధించింది.
శ్రీ శ్రీ వేంకట రాజన్న అవధాని గారు ప్రముఖ స్వాతంత్య్ర
సమరయోధులు, కవి, పండితులు బహు భాషా కోవిదులు,
సంఘ సంస్కర్త, అధివక్త (అడ్వకేట్) ఆయుర్వేద వైద్యులు.
"వైద్యపర" బిరుదాంకితులు.
హైద్రాబాద్లో వథాలతో చదవడానికి నివాసముంటున్న
సమయంలో శ్రీ కాళోజి నారాయణరావు, శ్రీ వెల్దుర్తి
మాణిక్యరావు గారలతో కలిసి ఆనాటి పరిస్థితులపై
వేంకటరాజన్న అవధాని
- ప్రమోద్ అవధాని
చర్చించుకొనేవారు. వారు ముగ్గురు "తెలంగాణా వైతాళిక
సమితి" పేరుతో ప్రసిద్ధులు.
కొంతకాలం వీరు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి
సంపాదకత్వంలో వెలువడిన అప్పటి “గోలకొండ పత్రిక”కు
ఉప సంపాదకులుగా పని చేసినారు. తెలంగాణాలో కవులే
లేరని, వీరికి కవిత్వమే రాదన్న ఒక అపవాదును సవాలుగా
తీసుకొని ప్రతాపరెడ్డిగారు వెలువరించిన "గోలకొండ కవుల
సంచిక"లో శ్రీ అవధానిగారి కవిత “మంథెనద్విజలు" అను
శీర్షికతో ప్రచురింపబడుట అత్యంత విశేషం. శ్రీ అవధాని
గారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి సన్నిహితులు,
సమకాలీకులు ప్రతాపరెడ్డి గారు వ్రాసిన "హిందువుల
పండుగలు" అనే ఉద్గ్రంథానికి శ్రీ వేంకట రాజన్న అవధాని
వీరి నినారు. ఈ పుస్తకం ఇటీవలనే
పునర్ముద్రించబడినది.
ఆనాటి “ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో కరీంనగర్
జిల్లా కేంద్రంలో చాలా చురుకుగా పాల్గొని దానికి సారథ్యం
వహించి, ఎంతోమంది యువకులను తమ వాగ్ధాటితో
ఉద్యమంవైపు ఆకర్షింపజేసి చైతన్యవంతులను చేసిన ఘనత
శ్రీ అవధానిగారిదే. అందుకేకావచ్చు అప్పటి మన భారత
ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారు మంథని ప్రసక్తి
వచ్చినపుడు తరచు "There were times when we used
to derive inspiration from shri Avadhani garu"
అంటుండేవారు.
చూడు తెలంగాణ (525) తేజోమూర్తులు ఉండటంతో<noinclude><references/></noinclude>
2pc6ghfn173bw3mdxwn8h4kbqv11x77
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/547
104
212270
553488
2026-04-17T07:12:16Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఓసారి శ్రీ పి.వి. గారు మంథనికి భారత ప్రభుత్వం విదేశాంగ శాఖామాత్యుల హోదాలో విచ్చేసినవుడు స్వయంగా శ్రీ అవధానిగారి ఇంటికి వెళ్ళి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నపుడు వార...'
553488
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఓసారి శ్రీ పి.వి. గారు మంథనికి భారత ప్రభుత్వం
విదేశాంగ శాఖామాత్యుల హోదాలో విచ్చేసినవుడు
స్వయంగా శ్రీ అవధానిగారి ఇంటికి వెళ్ళి వారి యోగ
క్షేమాలు అడిగి తెలుసుకొన్నపుడు వారు అన్న మాటలు
"Mr. Avadhani, Thave only friends like you, Thave
no followers and group".
1945-46 సంవత్సరంలో అవధానిగారు కరీంనగర్
లో తమ న్యాయవాద వృత్తి కొనసాగించుచున్న సమయంలో
ఒకనాటి రాత్రి రజాకర్ ముష్కరులు వీరి ఇంటిమీద దాడి
జరిపినపుడు, మొత్తం వారి కుటుంబ సభ్యులంతా కలిసి
ఎంతో ధైర్యసాహసాలతో ఆ దాడిని ఎదుర్కొన్నారు. అవధాని
గారు గ్రంథాలయోద్యమ నిర్మాతగా, సంఘసంస్కర్తగా అనేక
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని జిల్లాలోని అన్ని ముఖ్యమైన
సంఘటనలలో ముందుండి పని చేసినారు.
స్వాతంత్య్రానంతరము శ్రీ అవధాని గారు అప్పటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనువాద సంఘములో అనధికార
సభ్యులుగా 1967-70 కాలంలో పని చేసినారు.
సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశపు ఏడవ సంపుటములో
శ్రీ అవధాని గారు వ్రాసిన వ్యాసము ద్వారా మంథని ప్రాచీన
వైభవమును గూర్చిన అనేక చారిత్రక విషయాలు మనకు
తెలియుచున్నవి.
"Census of India 1971, Andhra Pradesh M
special survey reports on selected towns-
Manthani" అనే ప్రభుత్వ సమాచార శాఖ తరఫున
ప్రచురింపబడిన గ్రంథంలో (8వ పేజి) నాటి గణాంక శాఖ
డైరెక్టర్ శ్రీ వేదాంతం I.A.S. ఆఫీసర్ గారు, అవధాని గారి
గురించి ఇలా వ్రాసారు.
"I visited the town twice before finalizing this
monograph and I acknowledge with thanks the
enlightened conversations I had with Shri Venkata
Rajanna Avadhani, a scholar of infecluctual emi-
nence an Advocate and freedom fighters"
వ్రాస్తూ వారిని ఎంతగానో కొనియాడారు.
మరల వారే ఈ గ్రంథం యొక్క 164–165 పేజీలలో
శ్రీ అవధాని గారు సాహిత్య, సాంఘిక రంగాలలో చేసిన
సేవలను ఉల్లేలిస్తూ
"In the year 1926, a Telugu Monthly manu-
script Magazine (viz) Namely, 'Prabodha
Chandrika' was started both in poetry and prose
under the editor ship of Shri Avadhani, a local
Scholar. The Editor himself a Scholar, Advocate,
Social worker and" vaidya vara".
Shri Venkata Rajanna Avadhani is also au-
thor of (1) "Agni Shabda Mahatyam.
(2) జన్మరహస్యం "He possesses very intimate
knowledge of Art, literature, History and grouth
of Manthani Town" అని వీరి ప్రతిభా పాటవాలను
గురించి ఎంతగానో ప్రశంసించారు.
వీరు సంఘ సంస్కర్తగా అనాదిగా వచ్చుచున్న కొన్ని
సాంఘిక మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటము
సలుపుటయేగాక 4 రోజుల “ఉపనయన క్రతువును అనగా
వడుగులను కుదించి ఒకరోజులో ముగించవచ్చని, తాము
స్వయంగా తమ రెండవ కుమారుని ఉపనయనమును
ఒకరోజులో నిర్వహించి ఈ ప్రాంతానికి మార్గదర్శులైనారు.
వీరు హరిజనోద్ధరణకు నడుము బిగించి ఒక హరిజన
యువకుని తమవద్ద సహాయకునిగా నియోగించుకొన్నారు.
అతనే స్వాతంత్య్రానంతరము రాష్ట్ర శాసన సభ్యునిగా
మేదారం రిజర్వుడు స్థానం నుండి ఎన్నికైనారు. ఇతను
మంథని గ్రామ నివాసియైన గడిపెల్లి రాములు M.L.A.
గారు. ఆనాటి ఏ రాజకీయ సభలైనా, సాహితీ సభలైనా వీరు
అధ్యక్షత వహించని సంఘటన ఈ ప్రాంతములో చాలా
అరుదుగా ఉండేది.
అప్పటి కరీంనగర్ జిల్లా పరిషత్ ఆధ్వర్యాన జరిగిన
ఒక సమావేశంలో ధారాళంగా సాగిన వీరి ఉపన్యాసము
బిని, ముగ్ధులై, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
గారు వీరి దగ్గరకు వచ్చి వీరిని వేదికపైననే అలింగనం
చేసుకొని "తెలంగాణా ప్రాంతంలో కూడా ఇంత చక్కటి
తెలుగులో మాట్లాడేవారు ఉన్నారని తెలిసి తాను
ఆనంద పరవశుడనైతి"నని ఎంతగానో శాఘించారు.
మంథని M.LA గా పని చేసిన శ్రీ గులుకోట
శ్రీరాములు గారి షష్ఠి పూర్తి సందర్భంగా ప్రచురింపబడిన
విశేష సంచికలో శ్రీ వేంకట రాజన్న గారి జీవిత సంగ్రహము
ప్రచురింపబడినది. భారత స్వాతంత్య్ర 25వ వార్షికోత్సవాల
సందర్భంగా 1972లో భారత ప్రభుత్వపు తరఫున
అంటుంటే తెలంగాణ 526 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
415tqsvcgpm5vk38nnhqjzq3cauj904
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/548
104
212271
553489
2026-04-17T07:12:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అవధానిగారి త్యాగాలకు సేవలకు గుర్తింపుగా తామ్రపత్రము రవీంద్రభారతిలో బహూకరింపబడినది. పరకాల గ్రామ వాసులు, శ్రీ రేపాల నరసింహ రాములుగారు "కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్యోద్యమ చ...'
553489
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అవధానిగారి త్యాగాలకు సేవలకు గుర్తింపుగా తామ్రపత్రము
రవీంద్రభారతిలో బహూకరింపబడినది. పరకాల గ్రామ
వాసులు, శ్రీ రేపాల నరసింహ రాములుగారు "కరీంనగర్
జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర - సజీవ కిరణాలు" అనే
పుస్తకంలో శ్రీ అవధాని గారి జీవిత విశేషాలు, నాటి
స్వాతంత్య్ర పోరాటంలో వారు నిర్వహించిన విశిష్ట పాత్రను
గురించి ఫొటోలతోసహా ప్రచురించారు.
ఈ గ్రంథం పేజి 27లో ప్రచురింపబడిన గ్రూపు
ఫొటోలో 1948 సంవత్సరపు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్
పార్టీ నాయకులు శ్రీయుతులు వేంకట రాజన్న అవధాని,
కె.వి. నర్సింగ్గారావు, రఘునాథ్ రావ్క్చ, బాడ్ల భూపతి,
గులుకోట శ్రీరాములు, బి.వి. రాంరెడ్డి, కాసం శివరాజం
గుప్త, పి.వి. నరసింహారావు, బి. వేంకటరామారావు,
బి. మురళీధర్ రావు గార్లను చూడవచ్చు. శ్రీ వి.వి. గారు
అనేక సందర్భాలలో అవధాని గారిని తమ గురువులుగా
భావించేవారు.
ప్రజాకవి, పద్మభూషణ్ శ్రీకాళోజి నారాయణ రావు
గారికిని, వారి అన్నగారైన శ్రీ కాళోజీ రామేశ్వర రావు
గారికిని శ్రీ అవధానిగారు ఆప్తులు, మిత్రులు, శ్రీ కాళోజి గారి
“నా గొడవ” 4వ సంచిక పరాభవ వర్షంను శ్రీ అవధాని
గారు 1966 వరంగల్లో జరిగిన సభలో ఆవిష్కరించారు.
దాదాపు 60 సంవత్సరాల క్రితం మంథనిలో
బాలికలకు 7వ తరగతి వరకే పాఠశాల విద్యావకాశాలు
ఉండినవి. 10వ తరగతి చదవడానికి అవకాశాలే లేవు. ఆ
సమయంలో ధైర్యముగా శ్రీ అవధానిగారు తమ రెండవ
కుమార్తె శ్రీమతి ప్రేమలతాదేవికిని మరియు శ్రీ లోకీ లక్ష్మణ
కర్మగారి కుమార్తె శ్రీమతి క్రాంతి కుమారికిని, అప్పటి
హైద్రాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు
గారి వద్ద సహాయకులుగా మరియు సలహాదారుగా
పనిచేస్తున్న శ్రీ వరహాల భీమయ్యగారి చొరవతో ప్రభుత్వము
నుండి ప్రత్యేక అనుమతి పొంది ప్రభుత్వ బాలుర ఉన్నత
పాఠశాలలో బాలికలకు ప్రవేశము కల్పించి, 10వ తరగతి
వరకు విద్యాప్రకాశములను కల్పించినారు.
ఆడపిల్లలకు చదువు ఎందుకు? ఇంటిపని, వంటపని
చూసుకుంటే చాలు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి ఉల్లేలాలా?
అని అనుకొనే రోజుల్లో శ్రీ అవధానిగారి కృషి వలన
అనేకమంది బాలికలకు తమ ఉన్నత విద్యాభ్యాసానికి
మార్గదర్చుకులైనారు. స్త్రీ విద్యను ప్రోత్సహించినారు. తమ
అందరు కుమార్తెలను డిగ్రీ వరకు చదివించిన ఘనత
శ్రీ అవధాని గారికే దక్కుతుంది.
ఆ తరువాతి కాలంలో బాలికలకు పదవ తరగతి
వరకు ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి కావలసిన
స్థలాన్ని శ్రీరాజు వేంకట ముత్యంరావు గారి గదిని వారిచే
మంథని ప్రజలకు దానమిప్పించిన ఘనత శ్రీ అవధాని
గారి కుమార్తె శ్రీమతి ప్రేమలతాదేవి గారిదే అని తెలుపడం
సమంజసంగా ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు, మ్యూజియంల శాఖకు
సలహాదారులుగాను, పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క
ప్రాముఖ్యతను నాటి కాలంలో అమలులో ఉండిన వ్యవస్థకు
అనుగుణంగా పంచాయితీ సమితుల సభ్యులకు తెలుపడానికి
ప్రభుత్వము వారిపక్షాన ఉపన్యాసకులుగా కూడా పనిచేశారు.
శ్రీ అవధానిగారు తమ 87వ ఏట తేది 22.09.1995
నాడు మంథనిలోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచి
ఇహలోకయాత్ర చాలించినారు.
చతురుడు తెలంగాణ (527 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
qbxc2p4phw9vc3boivw1ymuksrnefb2
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/549
104
212272
553490
2026-04-17T07:12:44Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '153 న ల్లగొండ జిల్లా సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి, సాహితీ ప్రచారానికి, సంఘ సంస్కరణకు శ్రీకారం చుట్టిన షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు తన జీవితాన్ని సాహితీ సేవకు, స...'
553490
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>153
న ల్లగొండ జిల్లా సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి,
సాహితీ ప్రచారానికి, సంఘ సంస్కరణకు శ్రీకారం
చుట్టిన షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు తన
జీవితాన్ని సాహితీ సేవకు, సమాజ స్ఫూర్తిని అర్పించిన
మహానుభావులు.
వార్త లేనిచో లోకము అంధకార బంధురమవుతుందని
భావించి వార్తలను ప్రజలకు అందచేసే పత్రికలేని పక్షంలో
ప్రజలకు రక్షణ కరువవుతుందని పత్రిక అవసరాన్ని గుర్తించి
నల్లగొండ జిల్లాలో 24 ఆగష్టు 1922లో 'నీలగిరి' అను
పేర పత్రికను స్థాపించి ప్రజాసేవ చేసిన ధన్యుడు.
ఆనాడు నిజాం పాలనాకాలంలో నిర్భంధాన్ని
అధిగమించి ఉస్మానియా ముద్రణాలయం స్థాపించి దాని
ద్వారా 'సంస్కారిణి గ్రంథమాల' నెలకొల్పి దాని ద్వారా
ప్రతి నెల ఒక మంచి పుస్తకాన్ని అందించి ఎనలేని సాహితీ
సేవ చేశారు.
షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు 1896
నవంబరు నెలలో షబ్నవీసు లక్ష్మీ నారాయణ రావు, రంగ
నాయకమ్మలకు జన్మించారు. లక్ష్మీ నారాయణరావు గారి
తండ్రి గోపాలరావు గారు నల్లగొండకు సమీపాన గల
మామిళ్ళగూడెం గ్రామాన్ని ముఖాగా సంపాదించారు. వీరు
ప్రతి సం॥ము హైదరాబాదు వెళ్ళి నిజాం ప్రధాని అయిన
నవాబు సాలార్జంగ్ బహదూరును వారి అనుచరులను
వెంకట రామ నరసింహారావు
- షబ్నవీసు ఇందిర
కలిసి వచ్చేవారు. లక్ష్మీ నారాయణ రావు గారు కొన్ని
సంవత్సరములు ప్రభుత్వ ఉద్యోగము చేసి కొన్ని గ్రామాల్లో
భూములు, వ్యవసాయం చేయిస్తూ మామిళ్ళగూడెంలో పెద్ద
బంగళా కట్టించిన సంపన్నులు. వీరి కుమారుడు వెంకట
రామ నరసింహారావు స్వయం కృషితో సంస్కృతాంధ్ర, పారసీ,
ఉర్దూ భాషలలో పాండిత్యం సంపాదించినారు.
పదహారవయేట పులిజాల తిరుమలరావు, రామ
చూడమ్మ గారి జ్యేష్ఠ కుమార్తె మరియు పులిజాల రంగారావు
గారి సోదరి రాధమ్మను వివాహం చేసుకొని ఆ తరువాత
ఆమె పేరును జానకీబాయిగా మార్చినారు. ఆమెకు ఆంధ్ర
భాషలో ప్రవేశం కలిగించి, గ్రంథావతరానికై నరసింహరావు
గారు చాలా కృషి చేశారు.
నల్లగొండలో ఆ రోజుల్లో మహబూబియా రీడింగు
రూము అనే పేరున అనే గ్రంథాలయం ఉండేది. 18 మార్చి
1918లో ఆనాటి అవ్వల్ తాలుకు దార్ ఆధ్వర్యంలో వెంకట
రామ నరసింహరావు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర
సరస్వతీ నిలయమనే పేరున ఒక గ్రంథాలయాన్ని స్థాపించి
నిర్వహించారు. ఈ గ్రంథాలయం ఆ తర్వాత జిల్లా
గ్రంథాలయ సంస్థలో విలీనం అయింది.
12 నవంబరు 1921 నాడు హైదరాబాదు నగరంలో
సంఘ సంస్కార సభ, మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు
అయిన కార్వే పండితుని అధ్యక్షతన జరిగింది.
Thashah : తెలంగాణ (528 తేజోమూర్తులు ఉయబడుతు
తేజోమూర్తులు denied<noinclude><references/></noinclude>
covgrl2n8fo707uvuxhnthe8wtzlc0m
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/550
104
212273
553491
2026-04-17T07:12:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అతని అధ్యక్ష ఉపన్యాసం మరారిలోను, ఇంగ్లీషులోను జరిగింది. తదనంతరం వక్తలందరు మరాఠి, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో అచ్చట ప్రవేశపెట్టిన తీర్మానాలపై ప్రసంగిస్తూ వచ్చారు. ఈ విషయం ఈ సమా...'
553491
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అతని అధ్యక్ష ఉపన్యాసం మరారిలోను, ఇంగ్లీషులోను
జరిగింది. తదనంతరం వక్తలందరు మరాఠి, ఉర్దూ, ఇంగ్లీషు
భాషలలో అచ్చట ప్రవేశపెట్టిన తీర్మానాలపై ప్రసంగిస్తూ
వచ్చారు. ఈ విషయం ఈ సమావేశానికి హాజరయిన తెలుగు
ప్రముఖుల మనస్తాపానికి కారణమయింది. దానిలో
నగరంలో సుప్రసిద్ధ న్యాయవాదిగా ఉన్న శ్రీ అలంపల్లి
వెంకట రామారావు గారు ఒక తీర్మానంపై తెలుగులో
ప్రసంగించడానికి ఉపక్రమించగానే సభికులు అరచి గోల
చేసి ప్రసంగం కొనసాగనీయకుండా చేశారు. ఈ సంఘటన
మాతృభాషకు జరిగిన అవమానంగా భావించి వెంటనే
సభలోయున్న తెలుగువారు సభా కార్యక్రమాలు పూర్తికాక
ముందే నిరసన తెలుపుతూ బయటకు వచ్చేసారు. ఈ
సంఘటన ఆంధ్ర జనకేంద్ర సంఘ స్థాపనకు బీజం వేసింది.
కొంతమంది ప్రముఖులు టేకుమాల రంగారావు, మాడపాటి
హనుమంతరావు గారు, మిట్టూ లక్ష్మీ నరసయ్యగారు,
ఆదిరాజు వీరభద్రరావు గారు, నడింపల్లి, జానకీరామయ్య
గారు, బూర్గుల రామక్రిష్ణారావు గారు, ముందుముల
నరసింగరావు గారు, బోయినపల్లి వెంకట రామారావు గారు,
కొమ్మవరపు సుబ్బారావు గారు, బూర్గుల నరసింహారావు
గారు, పండిట్ రామస్వామి నాయుడు గారు సమావేశమై
ఆ రాత్రి ఆంధ్ర జన సంఘమును స్థాపించారు. సం॥ చందా
ఒక రూపాయి నిచ్చువారు సభ్యులుగా తీర్మానించారు.
నూరుగురు సభ్యులు గల ఆంధ్ర జన సంఘం మొదటి
సమావేశం కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన రెడ్డి
విద్యాలయంలో 1922 ఫిబ్రవరి 24న జరిగింది. మార్చి
మరియు ఏప్రియల్ నెలలలో మరో రెండు సమావేశములు
జరిగాయి.
ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి
షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు 24 ఆగష్టు
1922లో 'నీలగిరి' పత్రికను నల్లగొండలో ప్రారంభించారు.
ఆంధ్ర జన కేంద్ర సంఘ ప్రథమ సమావేశము హైదరాబాదు
లోని ట్రూపు బజారులో గల మాడపాటి హనుమంతరావు
గారి ఇంట్లో 27 జూలై 1923న జరిగింది. ద్వితీయ
సమావేశము 'నీలగిరి' పత్రికా సంపాదకులు షబ్నవీసు
వేంకట రామ నరసింహారావు కార్యాలయ ఆవరణలో
నల్లగొండ నందు 21 మార్చి 1924న జరిపినారు. ఈ
సమావేశానికి రావు బహదూర్ వెంకటరెడ్డి అధ్యక్షత
వహించారు. తెలంగాణా జిల్లాల నుండి 7 గురు ప్రతినిధులు,
వివిధ జిల్లాల నుండి 50 మంది ప్రేక్షకులు హాజరయినారు.
ఈ సభలో చిత్రాడ జమిందారు, సాహిత్య పోషకుడు
చెలికాని లచ్చారావు, శతక కవుల చరిత్ర గ్రంథకర్త,
సాహితీవేత్త వంగూరి సుబ్బారావుల మృతికి సంతావం
ప్రకటించిరి. ఈ సభలో ప్రముఖులు కొన్ని ముఖ్యమైన
నిర్ణయాలు తీసుకొనుట జరిగినది. మొదటిది నిజా
రాష్ట్రంలో ఆంధ్రోద్యమ వ్యాప్తికి "నిజాం రాష్ట్రాంధ్రనిధి”ని
ఏర్పాటు చెయ్యాలని దానికి కొండా వెంకట రంగారెడ్డి
వ్యవహారకర్తలుగా ఉండాలని నిర్ణయించినారు. రెండవది
వేతనముతో పూర్తికాలము పని చేయుటకు ప్రచారకుని
నియమించాలని, మూడవది - "ఆంధ్ర పరిశోధక మండలి”
అను పేరుతో స్థాపితమైన ఐమఱ్ఱజు వెంకట లక్ష్మణరావు
మరణించిన తరువాత "లక్ష్మణ రాయ పరిశోధన మండలి"గా
నామకరణము చేయబడిన పరిశోధన సంఘం ఆంధ్రజన
సంఘము ఆఫీసులో పని చేయుచుండెను. దానిని కేంద్ర
సంఘము యాజమాన్యము క్రింద వచ్చునట్లు నిర్ణయించి
నారు. నాలుగవ నిర్ణయము - హెచ్.ఎస్.ఎస్.సి. ఉస్మానియా
విశ్వ విద్యాలయపు, మెట్రిక్, ఇంటర్మీడియట్, బి.ఓ.
పరీక్షలందు ఆంధ్ర భాషలలో ప్రథములుగా వచ్చిన వారికి
బంగారు, వెండి పతకములతో సత్కరించాలని, ఐదవది -
ఆంధ్ర వాఙ్మయం ప్రచారము చేయుటకు పరీక్షల నేర్పాటు
చేయుటకు ఒక విధానము సిద్ధము చేయాలని నిర్ణయించి
నారు. ఆరవది - నిజాం రాష్ట్రంలో ఆంధ్ర స్థితులను తెలుపు
లఘు పుస్తకమును వ్రాయించి, తగిన వెలకు విక్రయించాలని
నిర్ణయించినారు.
నల్లగొండ నందు ఈ సమావేశము ముగింపున
బహిరంగ సభను పింగళి వెంకట రామారెడ్డి అధ్యక్షతన
నిర్వహించారు. ఈ సభలో శేషాద్రిరావు వకీలు, మాల్వీ
మన్సూర్ సాహెబ్, ఇంకొందరు నాయకులు ప్రసంగించారు.
ప్రభుత్వం నందలి లామిరాల్ శాఖలో ఉద్యోగం
చేయుచుండిన శ్రీ కూర్మారావు గారు కేంద్ర సంఘ సభ్యులకు
ఆ రాత్రి విందును ఏర్పాటు చేసినారు. హైదరాబాద్ నుండి
కాక తెలంగాణా జిల్లాల నుండి వెలువడిన తెలుగు పత్రికలు
రెండు. ఇవి 1922లో ఆగష్టు నెలలో నాలుగు రోజుల
చేతులు తెలంగాణ 529 తేజోమూర్తులు విడు<noinclude><references/></noinclude>
geaeazqtlag6kttanjlhmkf72sbfmyx
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/551
104
212274
553492
2026-04-17T07:13:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '| వ్యత్యాసంలో ప్రారంభమైనవి. 1922 ఆగష్టు 24న మొదలైన నీలగిరి పత్రిక మొట్టమొదటి పూర్తిస్థాయి రాజకీయ పత్రిక. ఆగష్టు 27న వరంగల్ జిల్లా మానుకోట, తాలుకా ఇనుగుర్తి నుండి "తెనుగు పత్రిక"...'
553492
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>| వ్యత్యాసంలో ప్రారంభమైనవి. 1922 ఆగష్టు 24న మొదలైన
నీలగిరి పత్రిక మొట్టమొదటి పూర్తిస్థాయి రాజకీయ పత్రిక.
ఆగష్టు 27న వరంగల్ జిల్లా మానుకోట, తాలుకా ఇనుగుర్తి
నుండి "తెనుగు పత్రిక" ప్రచురింపబడింది. ఈ పత్రిక
సంపాదకులు వొద్దిరాజు సీతారామచంద్రరావు, వొద్దిరాజు
రాఘవ రంగారావు సోదరులు.
1925 వరకు నీలగిరి పత్రికను అత్యంత సమర్థతతో
షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు నడిపారు.
ఆనాటి ప్రముఖ నాయకులైన మాడపాటి హనుమంతరావు,
బూర్గుల రామకృష్ణారావు గారు, పులిజాల రంగారావు గారు
తదితరులు వివిధ విషయాలపై ఈ పత్రికలో ఎన్నో కవితలు,
వ్యాసాలు రాసేవారు. ఆ రోజులలో గుడిపాటి వెంకటాచలం
రాసిన ఒక సంచలనాత్మకమైన కథను పత్రికలు ప్రచురించ
డానికి నిరాకరించాయి. అప్పుడు షబ్నవీసు వారు నీలగిరి
పత్రికలో ఆ కథను ప్రచురించి సంచలనం సృష్టించారు.
షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు 'నీలగిరి'
పత్రికతోపాటు "వీరేశలింగం కంఠాభరణ గ్రంథమాల" అని
పేరు పెట్టారు. ఈ గ్రంథమాల పక్షాన దాదాపు పది
పుస్తకాలను ప్రచురించారు. అందులో ఒకటి వెంకట
నరసింహారావు గారి తండ్రి ప్రేరణతో "మామిళ్ళ గూడెం
మత్త, రామాశ్రీ ఆంజనేయ ధార్మిక దేవ" అనే మకుటంతో
శేష భట్టారు రామానుజాచార్యులు రచించిన శతకం
ప్రచురించారు. "సంస్కారిణి గ్రంథమాల" అనే సంస్థ ద్వారా
నెలకో పుస్తకం అందించే కార్యక్రమంలో భాగంగా "బాలికా
విలాపం" అను గ్రంథాన్ని 1921లో తొలి గ్రంథంగా
రచించారు. ఈ గ్రంథంలో సమాజంలో ఉన్న దురాచారాలు,
దర్నీ ప్రజలందరికి తెలియచేసే ఉద్దేశంతో రచించారు.
ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ “బాలికా విలాప” రచనను
చేపట్టలేదని నరసింహారావు గారు తమ అవతారికలో
పేర్కొన్నారు.
నీలగిరి పత్రికా ప్రచురణకు నరసింహారావు గారి భార్య
జానకీబాయి గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. కందుకూరి
వీరేశలింగం గారి స్ఫూర్తితో స్త్రీ విద్య, వితంతు వివాహం
ప్రయత్నాల కృషి నరసింహారావు గారు, జానకీబాయిలు
చేపట్టారు. జానకీబాయి వితంతు సోదరి పునర్వివాహానికై
దంపతులిద్దరు ప్రయత్నిస్తున్న సందర్భంలో నరసింహారావు
బాలికా విలాపం శ్రీ ద్వారా బాల్య వివాహ వ్యవస్థను అంతమొం
దించడానికి ఈ రచనను అందించారు. ఒక బ్రాహ్మణ
కుటుంబంలో పుట్టిన నలుగురు అక్కచెల్లెళ్ళు దీనగాథే ఈ
'బాలికా విలాపం'. పసి వయసులో పెళ్ళి జరిగి ఈ
సోదరీమణులు ఆదరణ లేక, ఇతరుల సహాయంలేక,
ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. ఆ గాథనే 'బాలికా విలాపం'గా
రచించారు.
నరసింహారావు గారి భార్య జానకీబాయి జీవితాన్ని
“ఉదయలక్ష్మీ" అను పేరుతో శేషాద్రి రమణ కవులు రచించిన
107 పద్యాలను కూడా ప్రచురించారు. షబ్నవీసు వెంకట
రామ నరసింహారావు గారి భార్య జానకీబాయి నీలగిరి
పత్రికా ప్రచురణకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. కాని
పత్రిక ప్రారంభించిన రోజే ఆమె మరణించింది. ఆమె
జ్ఞాపకార్ధం పత్రిక ముఖపత్రం మీద....
"పూస ప్రాయము నందు యీ భూమిని విడిచి
స్వర్గగతమైన తన తల్లి షబ్నవీసు
జానకీబాయి స్మారక శాసనముగ
నీలగిరి పత్రికా పుత్రి నెగడుగాతో".
అనే పద్యాన్ని ప్రచురించేవారు. ఆమె జ్ఞాపకార్థం
దేశాభివృద్ధి, భాషాభివృద్ధికాక ఆమె ఆత్మశాంతికై నీలగిరి
పత్రికను నడిపారు. జానకీబాయి భర్తకు అన్ని విషయాలలో
సహకరిస్తూ ప్రోత్సాహనిచ్చి తోడు నీడగా నిలిచిన ఆదర్శ
గృహిణి. స్త్రీకి విద్యలేని రోజుల్లో గ్రంథాలు చదివి ధర్మం,
నీతిని గ్రహించిన సద్గుణశీలి. షబ్నవీసు వెంకట రామ
నరసింహరావు మిత్రులైన శేషాద్రి రమణ కవులు
జానకీబాయి మరణానికి తపించి తమ మిత్రుల ఆవేదన
తమ ఆవేదనగా భావించి, తమను ఆదరించిన ఆమె
జీవితాన్ని స్మృతి కావ్యరూపంగా 'ఉదయలక్ష్మి" పేర మలిచి
ఆమె చరిత్రను లోకోత్తరం చేశారు. ఆమె కార్యాచరణను
గూర్చి తెలుపుతూ....
"సంఘ సంస్కరణమ్ము సలుప నెంచును గాని
విగ్రహారాధన విముఖగాదు.
విధలా జనోద్వాలూ విధనియ్యగాను గాని
ప్రౌఢ వివాహ తత్పరత లేదు.
స్త్రీ విద్యకై కృంగి చేయుచుందును గాని
స్త్రీ స్వతంత్రమున కాగింపబోదు.
J తెలంగాణ (530 తేజోమూర్తులు ఉంటా<noinclude><references/></noinclude>
q7qc2g2qxlzfgomit5th1w20z9p9zu8
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/552
104
212275
553493
2026-04-17T07:13:27Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భర్త కేలూతతో పనులు తీర్చును గాని స్వచ్ఛంద మతితోట సాగిరాదు తల్లిగా తండ్రిగా పతి తలంచుగాని శూన్య వాదంబునకు మదిచొచ్చనీదు జానకీ బాయి నాజన్య నా హృదయంబు లభయ వంశంబులకు కీర్తి న...'
553493
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భర్త కేలూతతో పనులు తీర్చును గాని
స్వచ్ఛంద మతితోట సాగిరాదు
తల్లిగా తండ్రిగా పతి తలంచుగాని
శూన్య వాదంబునకు మదిచొచ్చనీదు
జానకీ బాయి నాజన్య నా హృదయంబు
లభయ వంశంబులకు కీర్తి నొసగసాగె
జానకీబాయి చివరి రోజులలో కూడా భర్త నిర్వహించిన
కార్యక్రమాలకు బాసటగా నిలిచింది.
నీలగిరి పత్రికకు శ్రీ వెంకట రామ నరసింహారావే
సంపాదకులు. నీలగిరి పత్రిక ప్రథమ సంపాదకీయంగా
జానకీబాయి మరణాన్ని గూర్చే రాయబడింది. దాదాపు
అయిదు సం॥రాలు నీలగిరి పత్రికను నిర్వహించారు.
ఒద్దిరాజు సోదరులు ప్రారంభించిన వరంగల్లోని తెనుగు
పత్రిక, నల్లగొండలోని నీలగిరి పత్రిక ఒకేసారి ప్రారంభ
మయి ఒకేసారి నిలిపివేయబడ్డాయి.
నీలగిరి పత్రికలో నిజాం దేశ వార్తలు, నీలగిరి
గ్రంథాలయాలు, నవలా ప్రపంచం, తాళపత్ర గ్రంథాలు,
వృత్తాంతములు, పుక్కిటి పురాణాలు మొ॥లు శీర్షికలు
ఉండేవి. షబ్నవీసు వెంకట రామ నరసింహారావు వ్రాసే
సంపాదకీయాలు, ఆనాటి రాజకీయ, సాంఘిక, సాహిత్య,
సంగీత, శిల్ప కళలకు సంబంధించిన అనేక విషయాలపై
ప్రముఖంగా ఉండేవి. ఈ నీలగిరి పత్రిక కొన్ని ప్రతులు
నాంపల్లిలోని వేమన గ్రంథాలయంలో మాత్రమే నేటికీ
చూడవచ్చు.
ఈ పత్రికలో బూర్గుల రామక్రిష్ణారావు, మాడపాటి
హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, శేషభట్టరు
రామానుజాచార్యులు, శేషాద్రి రమణ కవులు, గవ్వా
అమృతరెడ్డి సోదరులు మొ||వి. ఎందరివో రచనలు
ప్రచురించేవారు. శేషభట్టరు వెంకట రామానుజాచార్యులు
రచించిన “ఆంధ్ర నామ సంగ్రహం" లకు పేరడీ పద్యాలు
నీలగిరి పత్రికలో ప్రచురించబడ్డాయి. కె. రాములు "బుద్ధుని
సందేశం" అనే పేరుతో ఒక శీర్షిక నిర్వహించేవారు. ఆంధ్ర
ప్రాంతం నుండి తెలంగాణాలో అడుగుపెట్టిన శేషాద్రి రమణ
కవులను శ్రీ వెంకట రామ నరసింహారావు గారు ఆదరించి
నల్లగొండలో వీరి అవధానాన్ని ఏర్పాటు చేసి ఆర్ధికంగా
తోడ్పాటును అందించారు. ఆ మైత్రి నరసింహారావు మరణం
వరకు కొనసాగి నీలగిరి పత్రికలో అనేక వ్యాసాలను,
పద్యాలను రచించారు.
| 22 ఫిబ్రవరి 1925న ఆంధ్ర గ్రంథాలయ మొదటి
మహాసభ మధిరలో జరిగినప్పుడు పింగళి వెంకట రామారెడ్డి
గారు అధ్యక్షత వహించారు. దానిలో నీలగిరి గ్రంథాలయం
తరపున శ్రీ షబ్నవీసు వెంకటరామ నరసింహారావు కూడా
పాల్గొన్నారు.
షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు ఈ
పత్రిక నిర్వహణ సందర్భంగానే అనారోగ్యంపాలై 18
అక్టోబరు 1929న మరణించారు. వీరి మరణం తెలంగాణా
లో జరిగిన ఆంధ్రోద్యమానికి సాహితీ సాంస్కృతోద్యమాలకు
తీరని లోటు.
నల్లగొండలో ఆంధ్ర సారస్వత గ్రంథాలయ స్థాపకుడు,
దురాచారాల నిర్మూలనకు ధర్మపత్ని సహకారం పొందిన
వాడు, భాషా, సంస్కృతి వ్యాప్తికి 'నీలగిరి' వార్తా పత్రిక
నడిపినవాడు “షబ్నవీసు వెంకట రామ నరసింహారావు మన
"తెలంగాణా తెలుగు తేజమే”.
చతురుడు తెలంగాణ (531) తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
0t2paf1cs0qcd2tkntg8y0oatgngu8v
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/553
104
212276
553494
2026-04-17T07:13:50Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Writers & Addresses A.M. Thayaru Plot No.302, Shiva Ganga Towers, Father Balayya nagar, Old Alwal, Secuderabad. Annavaram Devender 406, Maruthi Heaven, Bharat Nagar, Karimnagar-505 001. Dr. Bellamkonda Sampat Kumar 302, Sri Shiva Towers, Majira Nagar Colony, Rd. No. 9, Old Alwal, Secunderabad-10. Dr. Bheempalli Srikanth H.No. 8-5-38, Teachers Colony, Mahbubnagar - 509 001. Chetan K. 8-43/36/3, East Balaji Hills, Nr. Ayyappa Temple, Boduppal-...
553494
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>Writers & Addresses
A.M. Thayaru
Plot No.302, Shiva Ganga Towers,
Father Balayya nagar, Old Alwal,
Secuderabad.
Annavaram Devender
406, Maruthi Heaven, Bharat Nagar,
Karimnagar-505 001.
Dr. Bellamkonda Sampat Kumar
302, Sri Shiva Towers, Majira Nagar Colony,
Rd. No. 9, Old Alwal, Secunderabad-10.
Dr. Bheempalli Srikanth
H.No. 8-5-38, Teachers Colony,
Mahbubnagar - 509 001.
Chetan K.
8-43/36/3, East Balaji Hills,
Nr. Ayyappa Temple, Boduppal-500 039.
Deshapati Srinivas
Quarter No. 99, Jalavayu Vihar,
Arjun Theater Road, Kukatpally, Hyd.
Dr. Ammangi Venu Gopal
11-9-317, Laxmi Nagar, Rd No. 4, Kothapet,
R.K.Puram, Hyderabad-102.
Dr. Anugu Narsimha Reddy
H.No. 3-14-50, Vijaya Sri Colony,
Vanasthalipuram, Dilsukhnagar, Hyderabad.
Dr. B. Mallaiah Chary
H.No.2-10-4-1/302, V.S. Apts.,
Near Bharat Petrol Pump, Gokale Nagar,
Ramanthapur, Uppal, Hyd-13.
Dr. B.S. Ramulu
201, Sulekha Golden Towers, 2-2-186/53/5,
Ramakrishna Nagar Bagh Amberpet,
Hyderabad 500013.
Dr. B.V.N. Swamy
H.No. 9-6-161, Ram Nagar,
Karimnagar-505 001.
Dr. Ch. Lakshmana Chakravarthy
H.No. 2-3-402, Krishna Nagar Colony,
Machabollaram, Alwal,
Secunderabad-500 010.
Dr. Chavva Venkata Reddy
H.No. 1-9-37, Road No. 1, Lane 27,
Ravi Shankar Colony, Habsiguda, Hyd-07.
Dr. Cheedella Sitamahalakshmi
Plot No. 30, Hasthinapuram Central,
Vyshalinagar Post, Sagar Road,
Hyderabad -79.
Dr. Cheppela Harinatha Sarma
Government Degree and P.G. College,
Siddipet-502 103.
Dr. Dasoju Padmavathi
Plot No. 301, Sapthagiri Heights, Srinagar
Colony, Opp. Pochamma Temple, Kushaiguda,
Medchal Dist.
Dr. Devaraju Maharaju
G1, Aastha Heights, Opp. Apama Sarovar,
HCU Post, Nallagandla, Gopanpalli Road,
Hyderabad-46.
అంటుంటే తెలంగాణ 532 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
c6fa7zvxk52wzf69tg637m1bztau5ex
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/554
104
212277
553495
2026-04-17T07:14:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Dr. Devulapalli Prabhakar Rao Rajesh Nilayam, 1 floor, Street No. 3, Nallkunta, Hyderabad-44. Dr. Gummannagari Bala Srinivas Murthy Street No. 20, 6-242/6, M.N. Reddy Nagar, Nr.Suchitra Circle, Secunderabad. Dr. Mavisri Manikyam H.No. 20-2009, Papi Reddy Nagar, Serilingampalli, R.R. Dist.-19. Dr. Motkuri Manikya Rao Flat No. 301, Shiva Sai Apts., Gokale Nagar, Ramanthapur, Hyderabad-13. Dr. J. Chennaiah Plot No. 92, Flat no.502, Jayabheri Vi...
553495
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>Dr. Devulapalli Prabhakar Rao
Rajesh Nilayam, 1 floor, Street No. 3,
Nallkunta, Hyderabad-44.
Dr. Gummannagari Bala Srinivas Murthy
Street No. 20, 6-242/6, M.N. Reddy Nagar,
Nr.Suchitra Circle, Secunderabad.
Dr. Mavisri Manikyam
H.No. 20-2009, Papi Reddy Nagar,
Serilingampalli, R.R. Dist.-19.
Dr. Motkuri Manikya Rao
Flat No. 301, Shiva Sai Apts., Gokale Nagar,
Ramanthapur, Hyderabad-13.
Dr. J. Chennaiah
Plot No. 92, Flat no.502,
Jayabheri Vijayalakshmi Homes,
Motinagar,
Hyderabad-18.
Dr. J. Vijayakumar ji
Flat No. 405, ABR Residency,
Sai Ram Colony,
Saidabad, Hyderabad-500059.
Dr. Karnati Lingayya
Plot No. 26, H.No. 33-26, T.S.R. Nagar,
Phase-II, Meerpet P.O., Saroornagar Mandal,
Hyderabad-500097.
Dr. Kondapalli Niharini
H.No. 1-2-214/5/1, Domalguda,
Hyderabad-29.
Dr. M. Devendra
H.No. 12-5-35/A/9,4 FB, Ballad Estate,
Tarnaka, Secunderabad - 70.
Dr. Madikonda Shyam Sunder
H.No. 1-8-702/26/1/2, Flat No. 401,
Sai Amrutha Apts., Padma Colony,
Nallkunta, Hyderabad - 44.
Dr. Masana Chennappa
9-76-2, Uday Nagar Colony,
Boduppal, Hyderabad-92.
Dr. Muktevi Bharathi
Plot NO. 258, Road No. 4, Trinuthi Colony,
Mahendra Hills, Secunderabad-500026.
Dr. Naleshwaram Sankaram
16-11-774/1, Sharada Apts., Moosaram Bagh,
Hyderabad-36.
Dr. Nanumasa Swamy
12-10-682, Udayasri Nilayam, JRT Colony,
Seetaphal Mandi, Secunderabad-06.
Dr. Nori Rajeshwar Rao
Sai Amruth Apts., 4th floor, 402, Padma
Colony, Nallkunta, Hyderabad-44.
Dr. Pasunuri Ravinder
Flat No. 406, Gulmohar Park,
Serilingampally,
Hyderabad - 500019.
Dr. Pattipaka Mohan
National Book Trust of India,
Osmania University Campus, Hyderabad.
Dr. R. Kamala
Flat No. 502, Lotus Gagan Vihar Apts.,
Domalguda, Hyderabad-29.
Dr. Ravikanti Vasunandan
H.No.6-35/26, Malla Reddy Enclave,
Sai Colony, Berumguda, Hyderabad-32.
చతురుడు తెలంగాణ ( 533 తేజోమూర్తులు ఓడ<noinclude><references/></noinclude>
c1j7aotcocmn5ysi09xk02nhpeou95b
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/555
104
212278
553496
2026-04-17T07:14:29Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Dr. S. Jathin Kumar Janta Hospital, HMT Road, Chintal, Hyderabad-54. Dr. V. Jaya Prakash T.S. Model School, Regoele (VDM), Medak-502 290. Dr. S.M. Pran Rao H.No. 9-14/1, Ravinder Nagar Colony, Habsiguda, Hyderabad-07. Dr. S.V. Satyanarayana Vice Chancellor, Telugu University, Nampally, Hyderabad. Dr. Sangisetty Srinivas Flat no. 212, Nandanavanam Apts., Attapur, Hyderabad-48. Dr. Sunkireddy Narayana Reddy Plot No. 69, Sai Nagar, Mushrupalli...
553496
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>Dr. S. Jathin Kumar
Janta Hospital, HMT Road, Chintal,
Hyderabad-54.
Dr. V. Jaya Prakash
T.S. Model School, Regoele (VDM),
Medak-502 290.
Dr. S.M. Pran Rao
H.No. 9-14/1, Ravinder Nagar Colony,
Habsiguda, Hyderabad-07.
Dr. S.V. Satyanarayana
Vice Chancellor, Telugu University,
Nampally, Hyderabad.
Dr. Sangisetty Srinivas
Flat no. 212, Nandanavanam Apts., Attapur,
Hyderabad-48.
Dr. Sunkireddy Narayana Reddy
Plot No. 69, Sai Nagar, Mushrupalli Road,
Nalgonda-508 001.
Dr. Surabhi Vani Devi
Surabhi Education Society, 86 Madhapur,
Hyderabad
Dr. T. Gowri Shankar
1-1-217, Vivek Nagar,
Chikkadpally Hyderabad-20
Dr. Tirumala Srinivasa Charya
A 40-201, Singapore (Sanskruti) Township,
Ghatkesar Mandal, Medchal Dist.,
Hyderabad-82.
Dr. Tirunagari Devaki Devi
Sai Ram Symphoy Buildings,
Flat No. 13, 1 Floor, Anand Nagar,
Khairtabad, Hyderabad.
Dr. Tirunagari Ramanujaya
H.No.6-17/5, D.Nagar, Chintal HMT,
Hyderabad-54.
Dr. V. Rama Koti
H.No. 7-44-/2, Viharika Enclave,
Medipally-98
Dr. V.V. Rama Rao
Flat No. 104, Highlight Heaven, Street No. 6,
Jaya Nagar, Habsiguda, Hyderabad-07.1
Dr. Veludanda Nityanandarao
Department of Telugu,
Osmania University, Hyderabad.
Dr. Vishnu Vandana Devi
1-5-577/1, Chetana Housing Colony, Old
Alwal, Secunderabad - 500010.
Dr. Yelluri Siva Reddy
Siva Residency, 1-1-336/77, Vivek Nagar,
Chikkam, Hyderabad.
Dr. G. Chennakeshava Reddy
Plot no.5, Cyber Meadows, Masid Banda,
Cambridge School, Konpur, Hyderabd-84.
G Venkata Ramarao
18-7-739/2, Gowlipura, Gandhi Statue,
Sri Ramnagar Colony, Hyderabad - 50.
GV. Krishna Murthy
Retd. PGHO, H.No.8-5-434,
Raghavendra Nagar, Karimnagar - 505 001.
Dr. Gandra Lakshman Rao
H.No. 10-3-537, Vivekananda Puram, Rd.
No.3, Karimnagar-505 001.
అంటుంటే తెలంగాణ 534 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
3cxawsvy1ibw1jh4rhnz7kocelozpv4
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/556
104
212279
553497
2026-04-17T07:14:43Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Dr. Gannamaraju Girija Manohara Babu 2-11-501/5, Vijayanagar Colony, Hanumakonda-506009. Gannu Krishnamurthy Retired Lecturer, Kamareddy. H. Ramesh Babu H.No. 15-108/20/A, Nagarkurnool - 509 205. Inampudi Shrilaxmi 103, Durga Apartments, Durganagar Colony, Somajiguda, Hyderabad-500082. Jwalitha Aksharavanam', Flat No. 202, Seshasai Paradise, Vijayanagar Colony, Khammam-507002. K. Yadav Reddy (Nikhileshwar) H.No. 2-2-647/185/107, Sharada Naga...
553497
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>Dr. Gannamaraju Girija Manohara Babu
2-11-501/5, Vijayanagar Colony,
Hanumakonda-506009.
Gannu Krishnamurthy
Retired Lecturer, Kamareddy.
H. Ramesh Babu
H.No. 15-108/20/A, Nagarkurnool - 509 205.
Inampudi Shrilaxmi
103, Durga Apartments, Durganagar Colony,
Somajiguda, Hyderabad-500082.
Jwalitha
Aksharavanam', Flat No. 202,
Seshasai Paradise, Vijayanagar Colony,
Khammam-507002.
K. Yadav Reddy (Nikhileshwar)
H.No. 2-2-647/185/107, Sharada Nagar,
Bagh Amberpet, Hyderabad-13.
Kala Krishna
105, Shivaleela Apts., 7-1-2,
Begumpet, Hyderabad.
Kandalai Raghavacharyulu
Ranga Prasad Residency, Flat No. 403,
Serilingampalli, Hyderabad-19.
Dr. M. Dattatreya Sharma
H.No. 20-1499/6/1, Rd. No.1,
West Kakatiya Nagar, Neredmet,
Secunderabad-56.
Dr. M. Purushottama Charya
616, Sri Ramachandra Enclave,
Ramagiri, Nalgonda.
Mereddy Yadagiri Reddy
Plot No. 51, Alkapuri Colony, MLG Road,
Nalgonda-508 001.
Nagilla Ramasatry
2-7-458, Excise Colony, Subedari,
Hanumakonda, Warangal.
P.V. Rammohan Naidu
103, Grand Apts., Aurora Colony, Road no. 3,
Banjara Hills, Hyderabad-34.
Ponnam Ravichandra
7-2-990, Mankamma Thota,
Karimnagar-505 001.
Pramod Avadhani
16-7-464/6, SBH Colony,
Azampura, Hyderabad-500024.
Prof. G. Chennakesava Reddy
Villa No. 5, Cyber Medows,
Opp. Jain Heritage School Road,
Masjid Banda, Kondapur, Hyd- 84.
Prof. Rama Chandramouli
11-24-498, Telephone Bhavan Lane,
Pochamma Maidanam Lane, Warangal.
Prof. S.V. Rama Rao
205, Sai Balaji Residency, Chitra Layout, LB
Nagar, Hyderabad-74.
Punna Anajayya
H.No. 6-2-954/2, Meerbagh Colony,
Hyderabad Road, Nalgonda-508 001.
Dr. R. Surya Prakasha Rao
FZ Om Residency, Uma nagar,
Medchal-501 401.
తెలంగాణ (535) తేజోమూర్తులు
ఉ<noinclude><references/></noinclude>
e46leog3xruvzvrcyhycyofjihz0mdw
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/557
104
212280
553498
2026-04-17T07:14:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Rayaprolu Ramana Journalist, B7, 2nd Floor, Indian Bank Apartments, New Bakaram, Gandhinagar, Hyderabad. S.Bhanu Sri Devi C/o Rajaseker, Plot no.115/2, Mata laksmi Nagra, Saroor nagar, Hyd-35 Shabnaviz Indira H.No. 34-39/3/4, Vivekananda Puram, Sainikpuri, Secunderabad-94. Shabnaviz Venkata Rangarao H.No. 34-39/3/4, Vivekananda Puram, Sainikpuri, Secunderabad-94. Sreedhar Beechuraju G-1, Rajamannar Residency, H.No. 8-3-222/B/7/10, D-31, Madh...
553498
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>Rayaprolu Ramana
Journalist, B7, 2nd Floor,
Indian Bank Apartments, New Bakaram,
Gandhinagar, Hyderabad.
S.Bhanu Sri Devi
C/o Rajaseker, Plot no.115/2,
Mata laksmi Nagra, Saroor nagar, Hyd-35
Shabnaviz Indira
H.No. 34-39/3/4, Vivekananda Puram,
Sainikpuri, Secunderabad-94.
Shabnaviz Venkata Rangarao
H.No. 34-39/3/4, Vivekananda Puram,
Sainikpuri, Secunderabad-94.
Sreedhar Beechuraju
G-1, Rajamannar Residency,
H.No. 8-3-222/B/7/10, D-31,
Madhuranagar, Ameerpet, Hyd-38.
Sriramoju Hara Gopal
202, Medha Residency, Near Old Lions Club
Hospital, West Maredpally, Secunderabad-26.
Tummuri Ram Mohan Rao
H.No. 11-5-173, Sreet No.5,
Rayancha Avenue, Feerzadi Guda, Uppal, Hyd.
Undrala Rajesham
20-105/28, Vinayaka Nagar, Siddhipeta,
Medak District.
V. Chennaiah (Doraveti)
F 1-101, SLB Nilayam,
H.No.1-4-938/2/A, Bakaram,
Musherabad,
Hyderabad-20.
V. Padma
Journalist, Krishi TV,
Centre for Sustainable Agriculture,
Nargarjuna Nagar, Tarnaka, Hyderabad.
V. Shanthi Prbodha
H.No. 3-6-69/402, Venkat Rama Towers,
Sky Line Center, Basheer Bagh, Hyd - 29.
V.K. Premchand
11-4-654/2, Red Hills, Near Nilofar Hospital,
Lakadi-ka-pul, Hyderabad-4.
V.R. Vidyarthi
2-7-1083, Kanakadurga Colony, Vaddepalli,
Warangal
Vadla Sailu Chary
S/o. Malliah, Uttulur(V),
Peddashankarmpet (M), Medak(Dist)-502 271.
Vajhala Sivakumar
Sivananadalahari', 1-20-198/2, Gokul Nagar,
Venkatapurama, Secunderabad-500050.
Varala Anand
8-4-641, Hanuman Nagar, Karim Nagar.
Vedartham Madusudana Sharma
Opp. MRO Office, Raju Street, Koppalur Post,
Nagar Kurnool-509 102.
Velichala Kondala Rao
11-4-654/2, Red Hills, Near Nilofar Hospital,
Lakadi-ka-pul, Hyderabad-4.
Venu Sankoju
5, LIGH, Housing Board Colony, Rajeev Park,
Nalgonda 508 001.
అంటుంటే తెలంగాణ 536 తేజోమూర్తులు kond<noinclude><references/></noinclude>
e1r7w6fd5djlazv5a7sud27q3dten0n
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/558
104
212281
553499
2026-04-17T07:15:22Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భాగ్యరెడ్డి వర్మ'
553499
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భాగ్యరెడ్డి వర్మ<noinclude><references/></noinclude>
lr9coalnls5zmt1trpj83zh3qtroimh
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/559
104
212282
553500
2026-04-17T07:15:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సరోజినీ నాయుడు rathakers'
553500
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సరోజినీ నాయుడు
rathakers<noinclude><references/></noinclude>
oz7xk9jhyybhmcz5nrf3f1bkk972ts6
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/560
104
212283
553501
2026-04-17T07:16:09Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'Prabhaker కాళోజీ నారాయణరావు'
553501
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>Prabhaker
కాళోజీ నారాయణరావు<noinclude><references/></noinclude>
j8jj0wene02gwfrlxpxtfalfx384q0n
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/4
104
212284
553502
2026-04-17T07:16:42Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తెలుగు సాహితీ జగతి - తెలంగాణ ఘనకీర్తి తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకం...'
553502
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తెలుగు సాహితీ జగతి - తెలంగాణ ఘనకీర్తి
తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు
మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన
భాషగా తెలుగుభాష కీర్తి పొందింది. నికోలె డి కాంటి అనే పాశ్చాత్య పండితుడు తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా కొనియాడారు.
తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి 'సుందర తెలుంగు' అని కీర్తించారు.
మన తెలంగాణ ప్రాచీనకాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం. చరిత్రకు
అందినంత వరకు తెలంగాణలో 2000 ఏండ్ల పూర్వం నుంచే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు
నిరూపిస్తున్నాయి. క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన హాలుని 'గాథా సప్తశతి'లో తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు
కనిపిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద బొమ్మలమ్మ గుట్టపై ఉన్న జినవల్లభుని శాసనం కంద పద్యాలలో ఉండటం విశేషం. దీనిని బట్టి
క్రీ. శ. 947 నాటికే తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెబుతున్నది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ
ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ఉరుతర గద్య పద్యోక్తుల కన్న సరసమైన పరగిన జాను తెనుగులో కావ్యసృష్టి చేస్తానని ప్రతిజ్ఞ
చేసి, అచ్చ తెలుగు పలుకుబడికి పట్టం కట్టిన పాల్కురికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి.
అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది
తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన 'బసవ పురాణం' తొలి
శతకం 'వృషాధిప శతకం', తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం పాల్కురికి సోమన వెలువరించిన అనర్ఘ కావ్యరత్నాలు, తొలిగా
సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీనిని బట్టి తెలుగు భాషా సాహిత్య
ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదాంశం.
తేట తెలుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోన బుద్ధారెడ్డి వెలువరించిన 'రంగనాథ రామాయణం' తెలుగులో తొలి
'ద్విపదకావ్యం'. మెదక్ జిల్లా పటాన్ చెరువు నివాసి పొన్నిగంటి తెలగన రచించిన 'యయాతి చరిత్రం' తొలి అచ్చ తెలుగు కావ్యం.
సకల నీతి సమ్మతం అనే తొలి నీతిశాస్త్ర గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి. తొలి కథాసంకలన కావ్యం
'సింహాసన ద్వాత్రింశిక'ను రచించిన కొఱవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి. చాటు పద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ
భీమకవిది వేములవాడ.
'వాణి నా రాణి' అని ప్రకటించిన 'జైమినీ భారత' కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లా వాసి. రాచకొండనేలిన సర్వజ్ఞ
సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా. తెలుగువారి పుణ్యపేటిగా భావించే బమ్మెర పోతన రచించిన 'శ్రీమద్భాగవతం'
మధురభక్తికి, మంజుల పదవిన్యాసానికి, మనోహరమైన అలంకారిక శైలికి అలవాలమై అజరామర కీర్తి పొందింది. ఆ మహనీయుడు
జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వ్యర్థి, త్ర్యర్థి, చతురర్థి కావ్యాలు, చిత్ర, బంధ
అవధాన పదవిద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు.<noinclude><references/></noinclude>
41q6lnp38x7drrkm5msd7axca32zho5
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/5
104
212285
553503
2026-04-17T07:17:06Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నిరక్షరాస్యులైన శ్రామికుల నోటి నుంచి ఆశువుగా వెలువడి, అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న సజీవ నిధులు. ఆయా శ్రమ సందర్భాల్లో పాడు...'
553503
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>నిరక్షరాస్యులైన శ్రామికుల నోటి నుంచి ఆశువుగా వెలువడి, అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు
తెలంగాణ కాపాడుకుంటున్న సజీవ నిధులు. ఆయా శ్రమ సందర్భాల్లో పాడుకునే నాటుపాటలు, రాటు పాటలు, మోటపాటలు,
కల్లాలదగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసుర్రాయి పాటల్లో పల్లె జనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది. వివిధ
పండుగల సందర్భంగా సామూహికంగా ఆడిపాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమి పాటలు, అసోయి ధూల అని పాడే పీరీల
పాటలు ప్రజల సంఘజీవన సంస్కృతిని చాటుతున్నాయి.
ఒకతరం నుంచి మరోతరానికి సజీవమైన తెలుగు పద సంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుతల
రామాయణం, హరికథ, యక్షగానాలు, ఒగ్గు కథలు, బుడిగ జంగాల శారద కథలు, బాలసంతుల పాటలు ఇంకా ఎన్నో విశిష్ట, విలక్షణ
కళారూపాల్లో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది.
పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రే చరిత్రగా చలామణి అయింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలో మాణిక్యాలుగా
మిగిలిపోయాయి. వేములవాడ భీమకవి, బమ్మెర పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల గురించిన చరిత్ర వక్రీకరణకు గురైంది.
ఒకదశలో 'తెలంగాణలో కవులే లేరు' అనే స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలు చోటుచేసుకున్నాయి.
ఆ సందర్భంలోనే మహెూన్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి, పండితుడు సురవరం
ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో శ్రమకోర్చి, తెలంగాణ నాలుగు చెరుగులా తిరిగి, 354
మంది కవుల రచనలతో 'గోలకొండ కవుల సంచిక'ను వెలువరించారు. అది మన స్వాభిమాన ప్రతీక. సాహిత్య జయపతాక, జలపాత
సదృశమైన ధారతో, అద్భుతమైన ప్రౌఢిమతో 'అగ్నిధార', 'రుద్రవీణ' వంటి పద్య కావ్యాలను సృజించిన మహాకవి దాశరథి ‘'నా
తెలంగాణ తల్లి కంజాత వల్లి' అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించారు. 'భూగర్భమున గనులు, పొంగిపారే నదులు నా తల్లి
తెలంగాణరా! వెలలేని నందనోద్యానమ్మురా!' అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల వెంకట రామారావు తెలంగాణ తల్లి యశస్సును
అద్భుతంగా గానం చేశారు.
వెక్కిరించిన వారికి కాళోజీ కవితలు దీటైన సమాధానం
ప్రజాకవి కాళోజీ తన కవితలతో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పతనాన్ని ప్రకటిస్తూనే, తెలంగాణ ప్రజల తెలుగును
వెక్కిరించినవారికి దీటైన సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు తమపై అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి
బయటపడేందుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో
వెలుగొందిన తెలుగు భాషా వైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉన్నది.
నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలిజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృత నిశ్చయంతో కృషి చేస్తున్నది.
తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరుగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం
ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ అధ్యక్షుడిగా ప్రసిద్ధ కవి నందిని సిధారెడ్డిని నియమించి,
సారథ్య బాధ్యతలు అప్పగించింది.
అలాగే, డిసెంబర్ 15 నుంచి 19 వరకు (ఐదు రోజులపాటు) తెలంగాణలో మహోత్సవంగా ప్రపంచ తెలుగు మహాసభలు
నిర్వహించాలని భావించింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వివిధ అంశాలపై పుస్తకాల్ని ప్రచురించడం అత్యావశ్యకం. ఈ
పుస్తకాలు వివిధ రంగాలలో తెలంగాణ జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిక్సూచిగా ఉంటాయి. ఈ దిశగా చొరవ చూపి
అందంగా, హృద్యంగా ప్రచురించిన భాషా సాంస్కృతిక శాఖను అభినందిస్తున్నాను.
॥ శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖరరావు
ముఖ్యమంత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం<noinclude><references/></noinclude>
hdh5j7wyyhggtby7dm5b0y2o2fr8ihc
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/6
104
212286
553504
2026-04-17T07:17:25Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కృతజ్ఞతలు శ్రీ అజ్మీరా చందూలాల్ గారు డా|| కె.వి. రమణాచారి, ఐ.ఎ.యస్.(రి) ప్రభుత్వ సలహాదారు శ్రీ రసమయి బాలకిషన్ అధ్యక్షులు, సాంస్కృతిక సారథి డా॥ నందిని సిధారెడ్డి చైర్మన్, సాహిత...'
553504
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కృతజ్ఞతలు
శ్రీ అజ్మీరా చందూలాల్ గారు
డా|| కె.వి. రమణాచారి, ఐ.ఎ.యస్.(రి)
ప్రభుత్వ సలహాదారు
శ్రీ రసమయి బాలకిషన్
అధ్యక్షులు, సాంస్కృతిక సారథి
డా॥ నందిని సిధారెడ్డి
చైర్మన్, సాహిత్య అకాడమి
బుర్రా వెంకటేశం, ఐ.ఎ.యస్.
ప్రభుత్వ కార్యదర్శి
శ్రీ దేశపతి శ్రీనివాస్
ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి
- మామిడి హరికృష్ణ<noinclude><references/></noinclude>
sdb3cduj9wf4ry78ctny4grm7gjxed9
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/7
104
212287
553505
2026-04-17T07:17:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధన్యవాదాలు 'తెలంగాణ తేజోమూర్తులు' పేరుతో వస్తున్న ఈ 153 వ్యాసాల సంకలనం ఓ అరుదైన, అపురూప ప్రయత్నం. దీనిని సాకారం చేసి చూపించిన తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ఆకాశవాణి...'
553505
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ధన్యవాదాలు
'తెలంగాణ తేజోమూర్తులు' పేరుతో వస్తున్న ఈ 153 వ్యాసాల సంకలనం ఓ అరుదైన, అపురూప ప్రయత్నం. దీనిని
సాకారం చేసి చూపించిన తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిబ్బందికి
కృతజ్ఞతలు.
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ నిరంతరం చేస్తున్న సాహితీ సేద్యానికి నిత్యస్ఫూర్తి ప్రధాతగా ఉన్న
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు!
రవీంద్ర భారతి ప్రాంగణానికి సరికొత్త సొబగును అద్దుతూ 2017 ఏప్రిల్ 4వ తేదీన తెలంగాణ తేజోమూర్తుల్ని
(చిత్ర పటాల్ని) ఆవిష్కరించిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేక
ధన్యవాదాలు.
సాహితీ, సాంస్కృతిక, కళారంగాలలో తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడంలో
మా శాఖ చేస్తున్న కృషికి నిరంతర ప్రోత్సాహాన్ని అందిస్తూన్న మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారికి, ప్రభుత్వ
సలహాదారు డా. కె.వి. రమణాచారి ఐ.ఎ.యస్.(B) గారికి, సాంస్కృతిక సారథి అధ్యక్షులు శ్రీ రసమయి బాలకిషన్ గారికి,
సాహిత్య అకాడమి చైర్మన్ శ్రీ నందిని సిధారెడ్డి గారికి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం ఐ.ఎ.యస్. గారికి,
ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.
ఈ సాంస్కృతిక యజ్ఞంలో తమవంతు పాత్రను విజయవంతంగా పోషించిన ఆకాశవాణి సిబ్బందికి ముఖ్యంగా
చావలి దేవదాసు గారు, సి.యస్. రాంబాబు గారు, ఎన్. విజయ రాఘవ రెడ్డి గారికి ధన్యవాదాలు. పుస్తక కూర్పులోను,
నిర్వహణలోను అంతా తానై నిలబడ్డ అయినంపూడి శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు
సహకారం అందించిన జమ్ముల శ్రీహర్ష, ధాత్రిక సాయి రఘునాథచరణ్, తమనం నాగేశ్వరావు, గోపిశెట్టి కార్యవర్ది,
పి.వి.జి. సతీష్ లకు ధన్యవాదాలు.
ఈ సంపుటిలోని పరిశోధనా వ్యాసాలను రచించడమే కాకుండా అవసరమైన సమాచారాన్ని కూడా అందించిన
పరిశోధకులు, రచయిత (త్రు) లకీ, ప్రూఫ్ చూసిన మధుకర్ వైద్యుల, సౌమ్య, శ్రీధర్ కు, ప్రచురించిన రైనో ప్రింట్
ప్యాక్ నరేంద్రగారికి, భాషా సాంస్కృతిక శాఖ సిబ్బంది రఘునందన్, నాగరాజు, ప్రసాద్, స్రవంతి, ఇతరులకి
ధన్యవాదాలు....
- మామిడి హరికృష్ణ
విష్ణుభట్ల ఉదయశంకర్
(సంపాదకులు)<noinclude><references/></noinclude>
f0xaii24ubyatm8oxc4cqvye86uloja
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/8
104
212288
553506
2026-04-17T07:18:01Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ప్రాతః స్మరణీయులు! తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే - తెలంగాణలో ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, సాహితీ మ...'
553506
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ప్రాతః స్మరణీయులు!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే - తెలంగాణలో ఎంతో
మంది కవులు, పండితులు, కళాకారులు, సాహితీ మిత్రులు, సాంస్కృతిక మిత్రులు ఈ తెలంగాణా జాతిని జాగృతం చేసిన మహనీయులు ఎంతో
మంది ఉన్నారు. వారందరినీ కూడా ఈ తరం వారు, భావితరం వారు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా
ప్రాతః స్మరణీయులు, చిరస్మరణీయులు.
ఎవరు తెలంగాణా వైతాళికులు, తేజోమూర్తులు అనే విషయం మీద మనం ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ వైతాళికులు అనే
పదమే ఎంత పవిత్రమో! ఎంత ఉదాత్తమో! ఎంత సమున్నతమైన పదమో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఎవరైతే ఒక జాతిని
సుసంపన్నం చేస్తారో, జాగృతం చేస్తారో, చైతన్య పరుస్తారో, ఎవరి ద్వారా సమాజంలో ఒక పెద్ద కదలిక వస్తుందో ఆ మార్పుకి కారణమైన వారే
వైతాళికులు. ఆ రకంగా తెలంగాణాలో ఎంతో మంది వైతాళికులు ఉన్నారు. అందరినీ మనం ఒకేసారి చెప్పడానికి గాని, చూపడానికి గాని,
తెలపడానికి గాని ఇబ్బంది కలగొచ్చు. అందుకే ఒక చిరు ప్రయత్నం. అందుకే ఈ మంచి ప్రయత్నంలో ఎంతోమంది మన దృష్టిలో ఉన్నా, కొద్ది
మందినైనా ముందు మనం పరిచయం చేసి ఈ తరం వారు, భావితరాల వారు తలచుకొనేట్టుగా, మదిలో పదిల పరచుకునేట్టుగా జీవిత పరిచయ
వ్యాస సంకలనాన్ని భాషా సాంస్కృతిక శాఖ, ఆకాశవాణి కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.
తెలంగాణా తేజోమూర్తులలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వారు ప్రతాపరెడ్డి గారు. సురవరం ప్రతాపరెడ్డి గారంటేనే మనకు
"గోల్కొండ" పత్రిక జ్ఞాపకం వస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి గారంటేనే నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి ఆ
1930వ సంవత్సరం గుర్తొస్తుంటుంది. "గోల్కొండ కవుల సంచిక గుర్తొస్తుంది. ఆనాటి నగర కొత్వాల్గా ఉన్న రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి
గారి కోరిక మేరకు "హిందువుల పండుగలు" అనే గ్రంథాన్ని వ్రాయడమనేది, ముస్లిం పరిపాలనలో ఒక గొప్పనైన విషయం! అన్నిటికంటే మించి
1949లో “ఆంధ్రుల సాంఘిక చరిత్ర"ను మనకందించి, మన సమాజం యొక్క స్థితిగతులెలా ఉన్నాయి... ఆనాటి పండుగలు ఎలా ఉన్నాయి...
ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి... అని చెప్పిన సురవరం ప్రతాపరెడ్డి ఒక పండితుడు, ఒక కవి, ఒక దార్శనికుడు, ఒక విమర్శకుడు, ఒక
సంపాదకుడు, ఒక సామాజిక చైతన్య శీలి. అందుకే సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ తేజోమూర్తి.
అలాగే డా. బూర్గుల రామకృష్ణా రావు గారు! నిజానికి రామకృష్ణారావు గారింటి పేరు పుల్లంరాజు. ఊరిపేరే ఇంటిపేరుగా మారినంత
స్థాయిలో బూర్గుల రామకృష్ణారావు సేవజేశారు. అందుకే వారిని పుల్లంరాజు రామకృష్ణారావు గారని అంటే తెలియకపోవచ్చు గాని డా. బూర్గుల
రామకృష్ణారావు గారని అంటే మనకందరికీ తెలుస్తుంది. హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్న నీరు ముఖ్యమంత్రిగా
భూ సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చిన మహానుభావుడు డా. బూర్గుల రామకృష్ణా రావు.<noinclude><references/></noinclude>
p8h057p7of2rbeb0z9dhnxjt87e7mdn
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/9
104
212289
553507
2026-04-17T07:18:17Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అలాగే డా.మాడపాటి హనుమంతరావు గారు, ఎంత తపించారో తెలంగాణా కోసం, ఎంత తపించారో మహిళల్లో విద్యావ్యాప్తి కోసం, ఎంత తపించారో అనాటి నిజాం కాలంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసమని. ఆయన 1935ల...'
553507
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అలాగే డా.మాడపాటి హనుమంతరావు గారు, ఎంత తపించారో తెలంగాణా కోసం, ఎంత తపించారో మహిళల్లో విద్యావ్యాప్తి కోసం,
ఎంత తపించారో అనాటి నిజాం కాలంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసమని. ఆయన 1935లో నిజాం రాష్ట్ర చతుర్ధాంధ్ర మహాసభకి సిరిసిల్లలో
అధ్యక్షత వహించారు. అందరినీ చాలా చైతన్యవంతుల్ని చేశారు. 1951లో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్కి మేయర్గా ఎన్నికయ్యారు.
1958-64 సంవత్సరాల మధ్య కాలంలో శాసనమండలికి అధ్యక్షులయ్యారు. అడుగడుగునా, అణువణువునా ఈ సమాజానికి నేనుగా ఎంత
వరకు తోడ్పడతాను అని ఆలోచించిన ఆ మహానుభావుడు మన తెలంగాణా తేజోమూర్తుల్లో ఒకరు. అందుకే... అప్పుడే డా. మాడపాటి
హనుమంతరావు గారిని భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' బిరుదునిచ్చి సత్కరించింది. అలాగే కొండా వెంకట రంగారెడ్డి గారు. ఆయన నిజాం
రాష్ట్ర 5వ మహాసభకి షాద్ నగర్ 1936లో అధ్యక్షత వహించారు.
వీరంతా ఆ రోజుల్లో ఆంధ్ర భాషా ఉద్యమం, జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం - అన్నిటినీ ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించిన
మహానుభావులు అధ్యక్షత వహించి అందర్నీ కూడా చైతన్య వంతుల్ని చేశారు. అలాగే 1943వ సంవత్సరంలో కూడా హైదరాబాద్లో ఏర్పడిన
7వ సభకి అధ్యక్షత వహించిన కొండా వెంకట రంగారెడ్డి మొదట్నుంచీ ప్రత్యేక తెలంగాణా కోసం కృషి చేసినవారు. 'పెద్ద మనుషులు
ఒప్పందం'లో భాగస్వామిగా ఉన్నారు. అప్పటి నుంచే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం గురించి ఆలోచించిన మహానుభావుల్లో మెదక్ జిల్లా కందిలో
నిర్వహించబడిన 13వ సభకు అధ్యక్షత వహించినవారు సర్దార్ జమలాపురం కేశవరావు. వీళ్ళందరితో పాటు షోయబుల్లాఖాన్ గురించి కూడా
మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పత్రికా రచయిత షోయబుల్లాఖాన్ 'రేజ్' అనే పత్రికను నిర్వహిస్తున్నప్పుడు దాన్ని ఆనాటి నిజాం
ప్రభుత్వం నిషేధించింది. తర్వాత 'రయత్' అనే పత్రికలో పనిచేస్తే ఆ పత్రికను కూడా నిషేధించారు. ఆ తర్వాత 'ఇమ్రోజ్' పత్రికను ప్రారంభించి,
1948 ఆగష్టు 21వ తేదీ నాటి రాత్రి 12 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పులకు, కత్తిపోట్లకు గురైన షోయబుల్లాఖాన్ మత సమైక్యత కోసం కృషి
చేసిన అమరజీవిగా మనం స్మరించుకోవలసిన అవసరం ఉంది. మరొక తేజోమూర్తి ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు శ్రీమతి జె.ఈశ్వరీబాయి!
పుట్టింది, పెరిగింది పేదరికంలో అయినా, అంబేద్కర్ సిద్ధాంతాల్ని పరివ్యాప్తి చేయడానికి నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో తన
యొక్క చతురతతో, వక్తృత్వ ధోరణితో, వాక్చాతుర్యంతో అందరిని కూడా అలరింపజేసిన నాయకురాలు ఈశ్వరీబాయి! ఇక రావి నారాయణ రెడ్డి
గారు! భువనగిరిలో నిర్వహించబడిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించడమేకాక; ఆ తరువాత జాతీయ ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు
ఆంధ్రమహాసభ అని రెండుగా చీలిపోయిన రోజుల్లో అజ్ఞాతవాసం చేసి, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం పాటు పడిన వాళ్ళలో అగ్రగణ్యుడిగా రావి
నారాయణ రెడ్డి గారిని మనం పేర్కోవాల్సిన అవసరం ఉంది. 1952వ సంవత్సరంలో ఆయన నల్గొండ నియోజకవర్గం నుండి పార్లమెంట్
సభ్యుడిగా ఎన్నిక కావడం మరో గొప్ప విషయం.
నిత్య స్మరణీయులుగా ఉండేవారు మాదిరి భాగ్యరెడ్డి వర్మ. మాదిరి భాగ్యరెడ్డి వర్మ కూడా చాలా పేదరికంలో హైదరాబాద్ లో పుట్టి తన తోటి
వారందరిని కూడా చూసి ఈ అంటరాని తనమేమిటి? ఈ బాల్య వివాహాలేమిటి? ఈ అంధవిశ్వాసాలేమిటి? ఈ మూఢాచారాలేమిటి? అని
నిరసిస్తూ, వాటిని రూపుమాపడానికి ఒక సంఘ సంస్కర్తలాగా నిలబడి జీవితాన్నంతా సామాజిక చైతన్యం కోసం తెలంగాణా జాగృతి కోసం
పాటుపడిన మాననీయుల్లో భాగ్యరెడ్డి వర్మ గారొకరు. వారు తలచుకొని ఒక సంకల్పశుద్ధిగా నిర్మించిన 'ఆది హిందూ భవనం' చాదర్ ఘాట్
వంతెన దగ్గర ఇవ్వాల్టికి కూడా సజీవంగా నిలిచి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ నాటి విద్యార్థులు, ఈనాటి యువత తెలుసుకోవాల్సిన బాధ్యత
ఉంది.
దాశరథి స్వాతంత్య్ర్య సమరయోధుడు, గొప్ప కవి, పండితుడు. శ్రీ వైష్ణవ సంప్రదాయం నుంచి వచ్చిన వాడు. అయినా వేటినీ
లెక్కచేయకుండా తెలంగాణా కోసం, తెలుగు భాష కోసం జీవించినంత కాలం పాటుపడిన దాశరథి... మనం జనం, జనం మనం / జనం లేంది
మనం లేము అని చెప్పి జనాన్ని ఉర్రూతలూగించి తన కవిత్వంతో చైతన్యపరచిన జనకవి. తెలంగాణా బిడ్డగా ఆనాడు నిజాం, రజాకార్లకి
వ్యతిరేకంగా పోరాడి నిజామాబాద్ జైల్లో గోడమీద “నా తెలంగాణా కోటి రతనాల వీణ" అని రాసిన దాశరథి - తెలంగాణా ఉద్యమకారులకి,
తెలంగాణా ప్రజలకి ప్రతి ఒక్కరికీ ఆరాధ్యుడు. "వా గీతావళి ఎంత దూరం ప్రయాణంబవునో అందాక ఈ భూగోళమ్మునకు అగ్గిపెట్టెను" అని
చెప్పిన విప్లవకవి దాశరథి. ఎంత వామనుడో - అంతటి త్రివిక్రముడు!<noinclude><references/></noinclude>
96sx0qmtodqr2ty4mgpw1do3nldqt35
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/10
104
212290
553508
2026-04-17T07:18:32Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మరొకరు వందేమాతరం రామచంద్రరావు గారు. ఆయన పేరులోనే వందేమాతరం నిలిచిపోయింది. నిజానికి వారు వావిలాల రామచంద్రరావు. జైల్లో వందేమాతరం అని అన్నప్పుడు ఆ జైలు సూపరింటెండెంట్ చెంప...'
553508
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>మరొకరు వందేమాతరం రామచంద్రరావు గారు. ఆయన పేరులోనే వందేమాతరం నిలిచిపోయింది. నిజానికి వారు వావిలాల
రామచంద్రరావు. జైల్లో వందేమాతరం అని అన్నప్పుడు ఆ జైలు సూపరింటెండెంట్ చెంప దెబ్బ కొడితే 'వందేమాతరం' అన్నాడు. కొరడాదెబ్బ
కొడితే 'వందేమాతరం' అన్నాడు. 24, 25 దెబ్బలు కొడితే 24, 25 సార్లు వందేమాతరం, వందేమాతరం అంటూ నినదించిన ఆయన
బయటకొచ్చాక వందేమాతరం రామచంద్రరావుగా వెలిగిపోయాడు. ఇవ్వాల్టికి పందేమాతరం రామచంద్రరావు గారంటేనే
రోమాంచితమవుతుంది మనకు. ఆయన ఆర్య సమాజ నిర్మాణానికి, తెలంగాణాలో చాలా ప్రయత్నం చేశారు. అలాగే తెలంగాణా ప్రత్యేక
రాష్ట్రంగా కావాలని, చిన్న రాష్ట్రాలవల్ల మనకెంతో మేలు జరుగుతుందని చెప్పిన వారిలో వందేమాతరం రామచంద్రరావు గారు కూడా
ప్రముఖులు.
తెలుగు భాషకు సముచిత స్థానం లేని రోజుల్లో తెలుగు భాషకోసం పాటుపడిన వారిలో శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు కూడా ఒకరు.
దేవులపల్లి రామానుజరావు గారు ఆంధ్రసారస్వత పరిషత ను 1943వ సంవత్సరంలో ఏర్పరచినారు. పరిషత్ దీపమే లేకుంటే తెలంగాణా అంతా
చీకటే అనే రీతిలో తెలంగాణాలో ఎంతో మందిని విద్యావంతుల్ని చేయడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఎంత నిరాడంబరుడో అంతగా
ఈ సమాజం కోసం పాటుబడిన మహానుభావుడు. ఈ సంవత్సరం దేవులపల్లి రామానుజరావు గారి శతజయంతి ఉత్సవాలని భాషా సాంస్కృతిక
శాఖ అత్యంత వైభవంగా రవీంద్రభారతిలో నిర్వహించినందుకు ప్రభుత్వ చొరవను అభినందించాలి.
మరొక తేజోమూర్తి కాళోజికి ఆయన నిండా ఆవేశపరులు, ఉద్వేగంతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో తన జీవితాన్నంతా ఈ సమాజానికి
సమర్పించుకోవాలనే సమర్పణా భావంతో ఉండే నిజమైన మనిషి కాళోజికి తన కవితలన్నీ కూడా తానేదో ఆలోచించో, భావన జేపో,
రాత్రింబవళ్ళు కష్టపడి రాసినటువంటివి కావు. తన నోటినుంచి అన్నమాట ప్రతిదీ కూడా ఒక కవితలాగా, నా గొడవనే కవితలై పోయినాయి అని
చెప్పినటువంటి కాళోజి, 1969 తెలంగాణా ఉద్యమం నుంచి తెలంగాణా కోసమనే పాటుపడిన మహానుభావుడు. తెలుగు కవుల్లో
'పద్మవిభూషణ్'గా పేరెన్నికగన్న ఏకైక కవి కాళోజి! ఒక పక్క సాహిత్యాన్ని బట్టి చూసినా, మరోపక్కన సామాజిక చైతన్యవంతుడిగా చూసినా అన్ని
రకాలుగా కూడా కాళోజిని తెలంగాణా వైతాళికుడిగా మనం తప్పకుండా స్మరించుకోవాలి.
ఒక పి.వి.నరసింహారావుగారు బహుభాషా కోవిదుడు, పండితుడు, సున్నిత మనస్కుడు, సాత్వికుడు, నిరాడంబరుడు. దేశం కోసం,
సమాజం కోసం పాటుపడాలని, చిన్నప్పటి నుంచి కూడా అహరహం కృషి చేసినవారు. వారు జైళ్ళ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు 'ఓపెన్ ఎయిర్
జైల్ సిస్టంను ప్రవేశపెట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో. అప్పటి ఆంధ్రప్రదేశ్లో విద్యా మంత్రిగా తెలుగును అధికార భాషగా తీర్చిదిద్దారు. తెలుగు
అకాడమీని స్థాపింపజేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే సర్వశ్రేయోనిధిని ఏర్పరచి వేదపండితులను, పండితులను, అర్చకులను
గౌరవించే స్థితిని కల్పించారు. ముఖ్యమంత్రిగా ఉంటే భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రధాన మంత్రిగా సరళీకృత విధానం తీసుకొచ్చి, ఇవ్వాళ
భారతదేశంలో ఒక గొప్పనైన విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచమంతా ఒకటే అనేటువంటి రీతిలో భారతదేశం ప్రవర్తించడానికి మూలకారణమైన
వారు, మన తెలంగాణా బిడ్డ శ్రీ పి.వి. నరసింహారావు!
ఇలాంటి మరెంతోమంది తెలంగాణ తేజోమూర్తుల జీవిత చరిత్రలను ఒక్కచోట చేర్చి బృహత్ వ్యాస సంకలనంగా తీసుకురావడంలో భాషా
సాంస్కృతిక శాఖ సంచాలకుడు చిరంజీవి మామిడి హరికృష్ణ చూపిన చొరవను, వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నాను. తెలంగాణ
మహనీయులందరికీ మరొక్కసారి సవినయంగా నమస్సులర్పిస్తూ....
డా. కె.వి రమణాచారి, ఐ.ఎ.ఎస్. (8)
ప్రభుత్వ సలహాదారు<noinclude><references/></noinclude>
mlo6iy9di5ep78fez6ctj8whaew5cqm
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/11
104
212291
553509
2026-04-17T07:18:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ముందు మాట స్ఫూర్తివంతమైన జీవన చిత్రం! పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కారు! కానీ వారు పెరుగుతున్న క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు, సంఘటనలు, వారిని ప్రభావితం చేసిన వ్యక్తులు,...'
553509
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ముందు మాట
స్ఫూర్తివంతమైన జీవన చిత్రం!
పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కారు!
కానీ వారు పెరుగుతున్న క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు, సంఘటనలు, వారిని ప్రభావితం
చేసిన వ్యక్తులు, సిద్ధాంతాలు, వారిలో అంతర్గతంగా ఎదిగిన ఆలోచనారీతులు, ఆచరణ తీరులు ... అన్నీ
కలిసి వారిని ఇతర మనుషుల కన్నా భిన్నమైనవారిగా, ఉన్నతమైన వారిగా గుర్తింపునిస్తాయి.
మనిషి మనిషిగా ఎదగడానికి కావలసిన అన్ని రకాల జీవనానుభవాలు కోకొల్లలుగా ఉన్న నేల -
తెలంగాణ!
ఏ వ్యక్తీ ఒక్కరోజులో గొప్పవాడు కాలేదు!
ఒక మనిషి తను నమ్మిన, తనకు నచ్చిన మార్గంలో మొక్కవోని దీక్షతో నిరంతరం కొనసాగి, ఎన్ని
ఆటుపోట్లు ఎదురైనా తలొగ్గకుండా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ నిశ్చలంగా ముందుకెళ్ళినపుడే ఆ
మనిషికి తనదైన ముద్ర రూపొందుతుంది.
వ్యక్తిత్వముద్ర ఇన్ స్టెంట్ కాదు.... కాలాతీతంగా కాన్స్టంట్ గా కొనసాగే మానవ ప్రవర్తన!
మనుషులలో నిరంతరత్వాన్ని, నిలకడతత్వాన్ని కొనసాగించగలిగే నేపధ్యాన్ని సృష్టించగలిగిన
జీవగడ్డ – తెలంగాణ!!
ఇపుడు చూస్తున్న మహావృక్షపు చిటారు కొమ్మల చిగురుటాకులు ఇప్పటివి కావు.... ఎన్నో ఏళ్ళుగా
ఎదిగి ఒదిగిన కనిపించని వేళ్ళలో దాని తొలి ఆనవాలు దాగి ఉంది!
ఇపుడు మనం స్మరిస్తున్న, తలచుకుంటున్న మహనీయుల కీర్తి ఈ క్షణానిది కాదు... ఎన్నో ఏళ్ళ
క్రితమే మొదలైన వారి ప్రయాణంలోని తొలి అడుగులలో, ఈనాటి వారి ప్రభ ఉంది!
అలాంటి జీవతత్వాన్ని జన్యువుల పరంగా సైతం అందించగలిగిన పోరుగడ్డ - తెలంగాణ!!!
భౌగోళికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా,
ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని వైవిధ్యతలు, విభిన్నతలు భారతదేశంలో ఉన్నాయో అవన్నీ ఒక్కచోట
కలబోసిన విశిష్టప్రాంతం - తెలంగాణ!
ప్రపంచాన్నంతా ఒక్కచోట చూడాలనుకుంటే భారతదేశాన్ని చూస్తేచాలు అని అంటారు! అదే
కోవలో, భారతదేశాన్ని ఒక్క దగ్గర చూడాలనుకుంటే తెలంగాణలో అడుగుపెడితే చాలు అనేంతగా
అనాది కాలం నుంచీ అనంతమైన ప్రత్యేకతని కలిగిన భూమి - తెలంగాణ!<noinclude><references/></noinclude>
ks2jdno5dzlj8s6xk2ioids2ada5dp1
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/12
104
212292
553510
2026-04-17T07:19:12Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అందుకే ఈ నేల, ప్రపంచపు రెండు భిన్నమైన దిగంతాలను ఒక్కచోట సృష్టించింది. సంఘర్షణను ఎంతగా అనుభవించిందో, సమృద్ధతను అంతగానే అనుభూతి చెందింది. మహా విషాదానికి - మహదానందానికి సాక్...'
553510
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>అందుకే ఈ నేల, ప్రపంచపు రెండు భిన్నమైన దిగంతాలను ఒక్కచోట సృష్టించింది.
సంఘర్షణను ఎంతగా అనుభవించిందో, సమృద్ధతను అంతగానే అనుభూతి చెందింది. మహా
విషాదానికి - మహదానందానికి సాక్షిగా నిలిచింది! దోపిడీకి - శ్రామిక స్వర్గానికి ప్రయోగశాలగా
మిగిలింది!
దీనికంతటికీ కారణం ఇక్కడ జీవితం ఉంది! జీవితంలోని బహు పార్యాలు ఇక్కడ
దర్శనమిస్తాయి!
అందుకే వ్యక్తులు చరిత్రను నిర్మిస్తారా? లేక చారిత్రక పరిస్థితులు వ్యక్తులను తయారు చేస్తాయా?
అంటే ఈ రెండూ జరుగుతాయి అని చెప్పడానికి ఈ భూమిమీద లభించే అద్భుతమైన సాక్ష్యం
తెలంగాణ!
చాలా సందర్భాలలో ఈ నేలమీద కొనసాగిన చారిత్రక సందర్భాలు, పరిస్థితులు ఆయా
కాలాలలో, ప్రదేశాలలో వ్యక్తులను తయారుచేసి ఉండవచ్చు. అదే సమయంలో, అలాంటి వ్యక్తులు
తమవెంట, తమ అడుగుల వెంట చరిత్రను కూడా తీస్కెళ్ళారు. సమాజ పథగామిగా దిశా నిర్దేశం
చేసారు. ఇలాంటి అద్భుత ఘట్టాలెన్నింటినో తన గుండె పౌరల్లో భద్రంగా నిక్షిప్తం చేస్తున్న అపురూప
ప్రాంతం - తెలంగాణ!
ఇదే సందర్భంలో మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి...! అసలు ఈ
'తేజోమూర్తులు' భావన పుట్టుకకు సంబంధించిన తెర వెనుక కథ...!
భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుని కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి
గాను ఒక హాల్ ఉంది. ఉమ్మడి రాష్ట్రకాలంలో అందులో తెలుగు సాహితీ కళామూర్తుల
ఛాయాచిత్రాలతో 'కీర్తిహాల్' పేరిట 'హాల్ ఆఫ్ ఫేమ్'ను ఏర్పాటు చేసారు. ఆ హాల్లో తెలంగాణ సాహితీ
కళామూర్తుల చిత్రాలను అలంకరించాలనే సంకల్పం ఏర్పడిన తర్వాత శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు,
సంగిశెట్టి శ్రీనివాస్ గారు, నందిని సిధారెడ్డి గారు వంటి కొందరు ప్రముఖుల సూచనల (తెలుగు
అకాడెమీ వారి జాబితాను కూడా పరిశీలించి) మేరకు ఓ జాబితాను రూపొందించుకొని, ఆ జాబితాలోని
ప్రముఖుల ఛాయా చిత్రాలను సేకరించి, వాటి ఆధారంగా తైలవర్ణ చిత్రాలను వేయించాలని
నిర్ణయించాము. ఆ మేరకు సిద్దిపేటకు చెందిన చిత్రకారుడు అహూబలం ప్రభాకర్కు ఆ బాధ్యతను
అప్పగించాం. దాదాపు సంవత్సర కాలపు ప్రాజెక్టు అది.
ఆ తరువాత 2017 తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నాటికి మొదటి దశగా దాదాపు
32మంది సాహితీ కళామూర్తుల తైలవర్ణ చిత్రాలను సిద్ధంచేసి గోడలపై అందంగా ప్రతిష్ఠించాం. దానికి
'తేజోమూర్తుల హాల్ 'గా నామకరణం చేసి 2017 ఏప్రిల్ 4వ తేదీన శ్రీమతి కల్వకుంట్ల కవిత,
పార్లమెంట్ సభ్యులు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.
మొదటి దశలో 32 మందివి మాత్రమే చిత్రించడం జరిగింది. మిగతా తేజోమూర్తుల తైలవర్ణ
చిత్రాలు పూర్తి చేయాల్సివుంది.
ఈ తేజోమూర్తులకు సంబంధించిన చర్చ అంతరంగికంగా మా మధ్య జరుగుతున్నకాలంలోనే ఈ
మహనీయుల జీవన చిత్రాలను కూడా ఒకే సమగ్ర పుస్తకరూపంలో తీసుకురావాలని భావించాం. అలా
ఎన్నో మేధోమథనాలు, చర్చోపచర్చల ఫలితమే ప్రస్తుత ఈ గ్రంథం! అందుకే ఈ గ్రంథంలోని కొందరు
మహనీయుల చిత్రాలకు భాషా సాంస్కృతిక శాఖ వేయించిన తైలవర్ణ చిత్రాలనే ఉపయోగించడం
జరిగింది. అలాగే 'తేజోమూర్తుల హాల్ ఆవిష్కరణ సందర్భ ఛాయాచిత్రాలను కూడా ఈ పుస్తకంలో
ప్రచురించాం.<noinclude><references/></noinclude>
tu5179jas965ws07xhv42oog5oq1a92
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/13
104
212293
553511
2026-04-17T07:19:28Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తెలంగాణ ముఖచిత్రాన్ని లిఖించడంలో తమదైన పాత్ర పోషించిన మహనీయుల జీవన పరిచయాన్ని గ్రంథస్తం చేయాలనే సంకల్పమే ప్రస్తుత "తెలంగాణ తేజోమూర్తులు” పుస్తక రచనకు అంకురం! సమీప గతంల...'
553511
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తెలంగాణ ముఖచిత్రాన్ని లిఖించడంలో తమదైన పాత్ర పోషించిన మహనీయుల జీవన
పరిచయాన్ని గ్రంథస్తం చేయాలనే సంకల్పమే ప్రస్తుత "తెలంగాణ తేజోమూర్తులు” పుస్తక రచనకు
అంకురం! సమీప గతంలో అంటే 19, 20 శతాబ్దాలలో తెలంగాణ బతుకు చిత్రాన్ని ప్రభావితం చేసిన
ప్రాతఃస్మరణీయుల జీవనరేఖల్ని ఒడిసిపట్టే ప్రయత్నమే ఈ పుస్తకం!
ఇక, ఈ పుస్తకంలోని 153 మంది తేజోమూర్తుల జీవిత ప్రస్థానాన్ని ఒక్కచోట చదవడం ద్వారా
పైన చెప్పిన విషయాలలోని వాస్తవికత మనకు సుబోధకం అవుతుంది. వీరిలో చరిత్ర గమనాన్ని బట్టి
తమ మార్గాన్ని నిర్దేశించుకున్నవారు... చరిత్రని కొత్తగా రాసినవారు... చరిత్రను పక్కకు పెట్టి తామే
చరిత్రగా మారినవారు కూడా ఉన్నారు!
అయినా, తమదైన మార్గంలో, తమదైన ముద్రతో వెలిగి ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్మరణీయ
స్థాయిని, స్థానాన్ని సంపాదించుకున్నవారు ఉన్నారు. అయితే వీరి చరిత్ర, కృషి, సేవలు, ప్రత్యేకతలు
ఇంతకాలం 'మబ్బుపట్టిన ఆకాశం' లాగా ఉన్న స్థితి ఉండేది! కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత
మన చరిత్ర పురుషులు - స్త్రీమూర్తుల గురించిన అన్వేషణను, వీక్షణను ఆవిష్కరించాల్సిన ఆవశ్యకతను
భాషా సాంస్కృతిక శాఖ గుర్తించింది. అందుకే ఈ తేజోమూర్తుల ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా, సుదీర్ఘ
కాల పరిశోధనలోంచి ఇప్పుడు ఆవిష్కరిస్తోంది. దాదాపు 18 నెలల కృషి, నిపుణులతో చర్చోపచర్చల
ఫలితంగా వస్తున్న ఈ బృహత్ గ్రంథం, ఆయా మహనీయుల జీవన చరిత్రలను పరిచయం చేసే
ప్రయత్నం చేసింది. ఆ దిశగా ఇది ఓ అపూర్వ, అపురూప ప్రయత్నం!
ఇందులోని, తేజోమూర్తుల జీవిత ఘట్టాలని, జీవన గమనాలని చదివిన తర్వాత, మనలో ఖచ్చితంగా
వారిపట్ల గౌరవభావం ఎంతగా పెరుగుతుందో, ఈ తెలంగాణ నేలపట్ల అంతకంటే ఎక్కువ అభిమానం
పెరుగుతుందనడంలో ఆశ్చర్యంలేదు.
ఎందుకంటే ఈ భూమిపుత్రులందరూ తమ జీవితాన్ని, ఈ నేల భవిష్యత్తునూ వేరుగా చూడలేదు...!
ఈ మట్టినే తమ జీవితంగా చూసారు...!
తమ జీవితాలనే ఈ మట్టికోసం అంకితం చేసారు...!
అలాంటి త్యాగధనులకి, తేజోమూర్తులకి సవినయంగా భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న సాష్టాంగ
ప్రణామం - ఈగ్రంథం!
- మామిడి హరికృష్ణ<noinclude><references/></noinclude>
55kdnk2ug6lu20tyym33kom8br1l3q0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/14
104
212294
553512
2026-04-17T07:19:42Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తెలంగాణ తేజోమూర్తులు - ఓ సాంస్కృతిక ప్రయాణం! ఇది చాలా ఆసక్తిదాయకమైన ప్రయాణం! తెలంగాణ ఉద్యమకాలంలో ప్రారంభమై, రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణకు సంబంధించిన కళలు, కళారూపాల...'
553512
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తెలంగాణ తేజోమూర్తులు - ఓ సాంస్కృతిక ప్రయాణం!
ఇది చాలా ఆసక్తిదాయకమైన ప్రయాణం!
తెలంగాణ ఉద్యమకాలంలో ప్రారంభమై, రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణకు సంబంధించిన కళలు, కళారూపాలు, కళాకారులు,
వైతాళికులు, చారిత్రక విషయాలు గురించిన చర్చ, పరిశోధన, ప్రచారం అనివార్యం అయింది. అయితే సాంస్కృతికశాఖ పక్షాన ఆ పరిశోధనను,
ప్రచారాన్ని విస్తృతం చేయడం, శాస్త్రీయంగా నిర్వహించడం అవసరమైంది. అదే సమయంలో చాలామంది వ్యక్తులు, కళలు, కళాకారులు,
చిరస్మరణీయులకు సంబంధించిన వివరాలు దొరకని పరిస్థితి కూడా నెలకొంది.
ఈ పరిస్థితిని గమనించిన సాంస్కృతికశాఖ ఈ అంశాలను డేటా బ్యాంక్ లా తయారుచేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అవన్నీ
అసంపూర్ణంగానే కనిపించాయి. 'ఆకాశవాణి' వంటి జాతీయ ప్రసారసంస్థతో కలిసి ఈ బృహత్ యజ్ఞాన్ని నిర్వహించాలని భావించాము.
దాన్లోంచే ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ శ్రీ ఉదయశంకర్ తో కల్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ అవతరణ నుంచి
'భాషా సాంస్కృతికశాఖ ఆకాశవాణి' సంయుక్తంగా కొన్ని జానపద, సంగీత ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. అవి మంచి విజయాన్ని
ప్రజాదరణను చూరగొన్నాయి. ఆ నేపధ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ వైభవం' కార్యక్రమాన్ని ఆరంభించాం.
అలా ఆకాశవాణిలో 2017, ఏప్రిల్ 2వ తేదినుంచి పూర్తిగా తెలంగాణ కేంద్రీకృతంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం
చేయాలని నిర్ణయం తీసుకున్నాము. తెలంగాణాకు సంబంధించి ఈ క్రింది అంశాలను కూడా నిర్ధారణ చేసాము.
-
1. వైతాళికులు/చిరస్మరణీయులు / తేజోమూర్తులు వారికి సంబంధించిన జీవిత విశేషాలు, వివిధ రంగాలలోవారు చేసిన కృషి,
2.
కళలు - కళారూపాలు - వాటి ప్రత్యేకత
3. పర్యాటక, చారిత్రక ప్రదేశాలు - వాటి విశిష్టత
స్థూలంగా ఈ క్యాటగిరీలను నిర్ధారించిన తర్వాత, ఆయా క్యాటగిరీలలోని మౌలికాంశాలను ఎంపిక చేయడానికి, తెలంగాణాకు
సంబంధించిన లబ్దప్రతిష్టులైన ప్రముఖులతో కమిటీలను వేసాం. వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపి, మేధోమధనం చేసి అంశాలను,
వాటిగురించి రాయగలిగిన నిపుణలను కూడా ఎంపిక చేసి, ఆయా అంశాల రచనా బాధ్యతలను వారికి అప్పగించడం జరిగింది. ఇలా వచ్చిన
పరిశోధనా పత్రాలను ఆకాశవాణి నుండి ప్రసారం చేయడం ప్రారంభించాం.
ఇక పుస్తకం ప్రచురణ బాధ్యతను పూర్తిగా భాషాసాంస్కృతికశాఖ చేపట్టింది. ఒక్కచోట చేర్చి గ్రంథస్థం చేసే మహా యజ్ఞానికి శ్రీకారం
చుట్టింది.
ఆవిధంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 2017 ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం గం. 7.15 ని.ల నుండి గం. 7.30
ని.ల వరకు, రైనో ఎఫ్.ఎమ్ కేంద్రం నుండి మధ్యాహ్నం 2.45 ని.ల నుండి 3.00 గంటల వరకు (శనివారం మినహాయించి) ప్రసారం చేస్తూనే
ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారాలను ఉదయశంకర్ (డైరెక్టర్) గారి సారధ్యంలో శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి, చావలి దేవదాస్, సి.ఎస్.
రాంబాబు, ఎస్. విజయరాఘవరెడ్డి బృందం సమర్థవంతంగా రేడియో ప్రసారాలు చేసి తెలంగాణాకు సంబంధించి ప్రజలకు తెలియని ఎన్నెన్నో
విషయాలను, విశేషాలను అందించాము.
ఇక ఈ రేడియో ప్రసంగాలను పుస్తకంగా ప్రచురించే బాధ్యతను భాషా సాంస్కృతిక శాఖ మొదలుపెట్టి, వాటిని 'ప్రపంచ తెలుగు
మహాసభల'లో ఆవిష్కరించే ప్రణాళికను రూపొందించింది.
-
మొత్తంగా దీనికి సంబంధించి ఆకాశవాణి ప్రసారాల విషయంలోనూ, పుస్తక ప్రచురణ విషయంలోనూ సమన్వయం, నిర్వహణ కూర్పు
బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించినవారు శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మిగారు.
అలా ఈ పుస్తకంలోని ఆయా అంశాలను పరిచయం చేయడంలో, వాటి విశిష్టతలను అద్దం పట్టడంలో రెండు శాఖలూ సఫలీకృతం
అయ్యాయి. వీటిని రాసిన రచయితలు కూడా ఆయా రంగాలలో లబ్ద ప్రతిష్టులు, విశేష కృషి చేసినవారు కనుక, ఈ పరిశోధనా, పరిశీలనా
వ్యాసాలకు సాధికారత కూడా సమకూరిందని భావిస్తున్నాం. అందువల్ల భవిష్యత్లో ఇంకా లోతుగా జరిగే పరిశోధనలకు ఈ గ్రంథం ఒక ఆధార
భూమికను, ఒక విశాల అవగాహనను కలిగిస్తుందని కూడా నమ్ముతాము. దాదాపు 18 నెలల నిరంతర కృషి ఫలితంగా వెలువడుతున్న ఈ
గ్రంథం ఈ వరుసలో మొదటి సంపుటిగానే భావిస్తూ, మరింత విస్తృత పరిశోధనతో రాబోయే కాలంలో మరిన్ని పుస్తకాలుగా రావాలని దానికి
తగిన ప్రయత్నాలను కూడా భాషాసాంస్కృతికశాఖ, ఆకాశవాణి సంయుక్తంగా పూనుకుంటాయని సవినయంగా మనవి చేస్తున్నాము.
ఇలా ఎన్నెన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెలువడుతున్న ఈ గ్రంథం తెలంగాణా పునర్నిర్మాణ ప్రస్థానంలో, సాంస్కృతిక కళారంగంలో ఓ
అపురూప డాక్యుమెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.
ఇలాంటి అపూర్వ గ్రంథం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రపంచ తెలుగు మహాసభలు'లో ఆవిష్కృతం కావడం
ఆనందంగా భావిస్తున్నాము.
-
సంపాదకులు<noinclude><references/></noinclude>
6ioacfztmwspq6y6em5o8scwiasmwjn
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/15
104
212295
553513
2026-04-17T07:20:01Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '4వతేది ఏప్రియల్ 2017న తేజోమూర్తుల చిత్ర పటాల్ని ఆవిష్కరిస్తున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, డా. కె.వి రమణాచారి గారు, దేశపతి శ్రీనివాస్ గారు...'
553513
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>4వతేది ఏప్రియల్ 2017న తేజోమూర్తుల చిత్ర పటాల్ని ఆవిష్కరిస్తున్న
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు,
డా. కె.వి రమణాచారి గారు, దేశపతి శ్రీనివాస్ గారు,
సుద్దాల అశోక్ తేజ గారు, మామిడి హరికృష్ణ మున్నగు వారు.<noinclude><references/></noinclude>
sgal9v7siwtofahwggn67iu53tbq7ci
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/16
104
212296
553514
2026-04-17T07:20:20Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''
553514
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude><noinclude><references/></noinclude>
6blhqhrde5y33c05h64eiyhk5018kgr
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/17
104
212297
553515
2026-04-17T07:20:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ''
553515
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude><noinclude><references/></noinclude>
6blhqhrde5y33c05h64eiyhk5018kgr
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/18
104
212298
553516
2026-04-17T07:21:02Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '1. 2. ఆదిరాజు వీరభద్రరావు 3. అజిత్ 4. 5. 6. 7. ఆనందరావు తోట 8. 9. 10. ఆరుట్ల కమలాదేవి 11. ఆవుల పిచ్చయ్య 12. బి. భానుప్రకాష్ అబిద్ హసన్ సఫ్రానీ అలిశెట్టి ప్రభాకర్ అంబటిపూడి వేంకటరత్నం ఆనందాంబ అన...'
553516
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>1.
2.
ఆదిరాజు వీరభద్రరావు
3.
అజిత్
4.
5.
6.
7.
ఆనందరావు తోట
8.
9.
10.
ఆరుట్ల కమలాదేవి
11.
ఆవుల పిచ్చయ్య
12.
బి. భానుప్రకాష్
అబిద్ హసన్ సఫ్రానీ
అలిశెట్టి ప్రభాకర్
అంబటిపూడి వేంకటరత్నం
ఆనందాంబ
అనంతోజు బ్రహ్మయ్య
అనుముల కృష్ణమూర్తి
ఇవీ తేజస్సులు
జి. వెంకటరామారావు
డా. వెలుదండ నిత్యానందరావు
వారాల ఆనంద్
డా. నాళేశ్వరం శంకరం
డా॥ తిరునగరి
డా. ఆర్. కమల
డా. వెలిచాల కొండలరావు
వడ్ల సాయిలూచారి
వి.ఆర్. విద్యార్థి
డా. తిరునగరి దేవకీదేవి
ఎ.ఎం. తాయారు
శ్రీధర్ బీచరాజు
1
3
7
10
13
16
19
23
26
29
32
36
13.
బి.యస్. శాస్త్రి
డా. జె. చెన్నయ్య
39
14.
బి.యస్. నారాయణ
15.
భండారు అచ్చమాంబ
వారాల ఆనంద్
డా. సంగిశెట్టి శ్రీనివాస్
43
16.
భావానంద భారతీస్వామివార్లు
డా. ఎం. దత్తాత్రేయశర్మ
17.
భీంరెడ్డి నరసింహారెడ్డి-
18.
భూపతి కృష్ణమూర్తి
19.
భాగ్యరెడ్డి వర్మ
20.
21.
బొమ్మ హేమాదేవి
బిరుదురాజు రామరాజు
డా. ఏనుగు నరసింహారెడ్డి
డా. రామా చంద్రమౌళి
డా. సంగిశెట్టి శ్రీనివాస్
డా. అమ్మంగి వేణుగోపాల్
శాంతి ప్రబోధ
46
50
54
57
60
63
68
22.
బూర్గుల రామకృష్ణారావు
డా. ఎస్.వి. రామారావు
72
23.
బోయ జంగయ్య
డా. మేరెడ్డి యాదగిరిరెడ్డి
77
24.
బూర్గుల రంగనాథరావు
డా. ఎస్.వి. రామారావు
81
25.
సి. నారాయణ రెడ్డి
డా. జె. చెన్నయ్య
84
26.
చందా కాంతయ్య శ్రేష్ఠి
డా. రామా చంద్రమౌళి
88
27.
చందాల కేశవదాసు
డా. యం. పురుషోత్తమాచార్య
92
28.
చెర్విరాల భాగయ్య
డా. నోరి రాజేశ్వరరావు
95
29.
చిదిరిమఠం వీరభద్రశర్మ
దోరవేటి
98
30
చిలువేరు రామలింగం
అయినంపూడి శ్రీలక్ష్మి
101
31.
చిందుల యల్లమ్మ
వి. ద
105
32.
చొప్పకట్ల చంద్రమౌళి
వారాల ఆనంద్
108
33.
చుక్క సత్తయ్య
డా. కె. చెన్నయ్య
110
34.
డి. రామలింగం
డా. దేవరాజు మహారాజు
114
35.
దాశరథి కృష్ణమాచార్య
డా. తిరుమల శ్రీనివాసాచార్య
117
36.
దాశరథి రంగాచార్య
డా. వి. జయప్రకాష్
121<noinclude><references/></noinclude>
dle0f0kxwwzmzsx9q2ui5mqrq0j4jst
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/19
104
212299
553517
2026-04-17T07:21:28Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '37. దేవులపల్లి రామానుజరావు దేవులపల్లి ప్రభాకరరావు 125 38. దేవులపల్లి వెంకటేశ్వరరావు డా. ఎస్. జతిన్ కుమార్ 129 39. ధవళా శ్రీనివాసరావు పున్నా అంజయ్య 133 40. దొడ్డి కొమురయ్య డా. ననుమాస స్వా...'
553517
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>37.
దేవులపల్లి రామానుజరావు
దేవులపల్లి ప్రభాకరరావు
125
38.
దేవులపల్లి వెంకటేశ్వరరావు
డా. ఎస్. జతిన్ కుమార్
129
39.
ధవళా శ్రీనివాసరావు
పున్నా అంజయ్య
133
40.
దొడ్డి కొమురయ్య
డా. ననుమాస స్వామి
135
41.
డోకూరుకోట్ల బాలబ్రహ్మచారి
డా. మాలిక్రీ మాణిక్యం
138
42.
ఎదిరి చెన్నకేశవులు
డా. భీంపల్లి శ్రీకాంత్
141
43.
ఈశ్వరీబాయి
డా.
ముక్తేవి భారతి
146
44.
ఈటూరి లక్ష్మణరావు
45.
గడ్డం రాంరెడ్డి
డా. వెలుదండ నిత్యానందరావు
డా. రాయారావు సూర్యప్రకాశరావు
149
153
46.
గడియారం రామకృష్ణశర్మ
డా. జి. గిరిజా మనోహరబాబు
157
47.
గణపతి రామచంద్రరావు
గన్ను కృష్ణమూర్తి
161
48.
గోపాలరాజ్ భట్
రాయప్రోలు రమణ
164
49.
డా. పసునూరి రవీందర్
168
50.
గూడూరి సీతారాం
డా. పత్తిపాక మోహన్
172
51.
గులాం అహ్మద్
ఎస్. భాను శ్రీదేవి
175
52.
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ
డా. చెప్పిల హరినాథ కర్మ
179
53.
గుండేరావు హరారే
డా. మసన చెన్నప్ప
184
54.
55.
56.
జమాలుద్దీన్
ఇల్లిందల సరస్వతీ దేవి
జమలాపురం కేశవరావు
డా. చవ్వా వెంకటరెడ్డి
డా. దేవరాజు మహారాజు
షబ్నవీజ్ ఇందిర
187
191
194
57.
జయశంకర్ సర్
దేశపతి శ్రీనివాస్
197
58.
జొన్నవాడ రాఘవమ్మ
డా. భీంపల్లి శ్రీకాంత్
201
59.
పి.వి. రామమోహన్ నాయుడు
206
60.
జువ్వాడి గౌతమ్రావు
గండ్ర లక్ష్మణ్ రావు
209
61.
జ్వాలాముఖి
నిఖిలేశ్వర్
214
62.
కె.వి. రాఘవాచార్యులు
డా. సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి
218
63.
కాళోజి నారాయణరావు
నాగిళ్ళ రామశాస్త్రి
222
64.
కాళోజి రామేశ్వరావు (షాద్)
65.
కాల్వ బాలయ్య
66.
కనపర్తి రామచంద్రుడు
67.
కాంచనపల్లి చినవెంకటరామారావు
వి.ఆర్. విద్యార్ధి
ఉండ్రాల రాజేశం
డా. దాసోజు పద్మావతి
226
230
234
వేణు సంకోజు
238
68.
కాపు రాజయ్య
డా. సురభి వాణీదేవి
241
69.
కాటం లక్ష్మీనారాయణ
డా. వెలుదండ నిత్యానందరావు
244
70.
కేశనకుర్తి వీరభద్రాచారి
కందాళై రాఘవాచార్యులు
247
71.
కేవల్ కిషన్
డా. బెల్లంకొండ సంపత్కుమార్
250
72.
ఖండవల్లి లక్ష్మీరంజనం
డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
254
73.
కోదాటి నారాయణరావు
డా. టి. గౌరీశంకర్
259
74.
కుమ్రం భీం
డా. ఎస్.ఎం. ప్రాణావు
262
75.
కొమర్రాజు వెంకటలక్ష్మణరావు
డా. వి. జయప్రకాష్
266<noinclude><references/></noinclude>
q661lw0sjthesoizgj6brh63skvcpyf
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/20
104
212300
553518
2026-04-17T07:21:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '76. 77. కొండా లక్ష్మణ్ బాపూజీ కొండపల్లి శేషగిరిరావు డా. బి.యస్. రాములు 270 డా. సురభి వాణీదేవి 276 78. కోవెల సంపత్కుమారాచార్య డా. గండ్ర లక్ష్మణరావు 279 79. కృష్ణమాచార్య శతావధాని డా. సి.హెచ్. ల...'
553518
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>76.
77.
కొండా లక్ష్మణ్ బాపూజీ
కొండపల్లి శేషగిరిరావు
డా. బి.యస్. రాములు
270
డా. సురభి వాణీదేవి
276
78.
కోవెల సంపత్కుమారాచార్య
డా. గండ్ర లక్ష్మణరావు
279
79.
కృష్ణమాచార్య శతావధాని
డా. సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి
283
80.
కొత్తూర్ సీతయ్య గుప్త
డా. కర్నాటి లింగయ్య
286
81.
82.
కుమారయ్య (జస్టిస్)
ఎం. ఎల్. జయసింహ
అన్నవరం దేవేందర్
290
పి.వి. రాంమోహన్ నాయుడు
292
83.
ఎం. ఎస్. ఆచార్య
డా. రామా చంద్రమౌళి
295
84.
మచ్చ వీరయ్య
డా. బి.వి.యన్. స్వామి
298
85.
మాడపాటి హనుమంతరావు
డా. టి. గౌరీశంకర్
302
86.
మడికొండ సత్యనారాయణ శాస్త్రి
డా. మోత్కూరి మాణిక్కరావు
305
87.
మామిడిపల్లి సాంబశివ శర్మ
డా. విష్ణువందనాదేవి
308
88.
మందపాటి వెంకటరాజు
డా. ఎం. పురుషోత్తమాచార్య
312
89.
మందముల నరసింగరావు
షబ్నవీజ్ వెంకట రంగారావు
315
90.
మఖూం మొహియుద్దీన్
డా. ఎస్.బి. సత్యనారాయణ
319
91.
మంత్రి శ్రీనివాసరావు
డా. జె. విజయ కుమార్
322
92.
93.
మాటేటి రామప్ప
మిద్దె రాములు
డా. దేవేంద్ర
326
డా. ననుమాస స్వామి
329
94.
95.
మోత్కూరి మధుసూదనరావు
ముకురాల రామారెడ్డి
డా. మడికొండ శ్యామస్సుందర్
332
డా. జి. చెన్నకేశవరెడ్డి
335
96.
నల్లా నరసింహులు
డా. రామా చంద్రమౌళి
339
97.
నటరాజ రామకృష్ణ
కళాకృష్ణ
343
98.
నెల్లూరి కేశవస్వామి
డా. పత్తిపాక మోహన్
348
99.
100.
నీలా జంగయ్య
ఒద్దిరాజు సోదరులు
డా. చెన్నకేశవరెడ్డి
353
డా. కొండపల్లి నీహారిణి
356
101.
పి.వి. నరసింహారావు
డా.
వి.వి. రామారావు
360
102.
పైడి జయరాజ్
పొన్నం రవిచంద్ర
363
103.
పైడిమర్రి వెంకటసుబ్బారావు
మేరెడ్డి యాదగిరిరెడ్డి
367
104.
పాకాల యశోదారెడ్డి
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి
370
105.
పాలకుర్తి బలమ్మ
డా. తిరునగరి దేవకీదేవి
373
106.
పల్లా దుర్గయ్య
డా. మసన చెన్నప్ప
376
107.
పల్లెర్ల హనుమంతరావు
డా. అమ్మంగి వేణుగోపాల్
380
108.
పందిళ్ల శేఖర్ బాబు
డా. గిరిజా మనోహర్ బాబు
384
109.
పార్వెళ్ళ గోపాలకృష్ణశర్మ
డా. జి.వి. కృష్ణమూర్తి
387
110.
పేర్వారం జగన్నాథం
డా. తిరునగరి
390
111.
పొట్లపల్లి రామారావు
112.
ప్రభాకర రెడ్డి
వి.ఆర్. విద్యార్ధి
హెచ్. రమేష్ బాబు
393
396
113.
పులిజాల గోపాలరావు
పున్న అంజయ్య
400
114.
పులిజాల వెంకట రంగారావు
వేణు సంకోజు
402<noinclude><references/></noinclude>
jlb1fighvkfbuyx7q1n584zzopkfbo2
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/21
104
212301
553519
2026-04-17T07:22:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '115. ఆర్. విద్యాసాగర్ డా. జె. విజయకుమార్ 404 116. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి డా. టి. గౌరీశంకర్ 408 117. 118. రాజబాబు రామానంద తీర్థ పి.వి. రాంమోహన్ నాయుడు 412 డా. టి. గౌరీశంకర్ 415 119. రావెళ్ళ వెంకటరా...'
553519
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>115.
ఆర్. విద్యాసాగర్
డా. జె. విజయకుమార్
404
116.
రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి
డా. టి. గౌరీశంకర్
408
117.
118.
రాజబాబు
రామానంద తీర్థ
పి.వి. రాంమోహన్ నాయుడు
412
డా. టి. గౌరీశంకర్
415
119.
రావెళ్ళ వెంకటరామారావు
419
120.
రావి నారాయణ రెడ్డి
డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి
421
121.
సదాశివుడు
వఝల శివ కుమార్
424
122.
సాహు
అన్నవరం దేవేందర్
427
123.
సైబ పరంధాములు
కందాళై రాఘవాచార్యులు
430
124.
సామల సదాశివ (యాది)
తుమ్మూరి రాంమోహన్రావు
433
125.
శంకర్ (కిషన్)
హెచ్. రమేష్ బాబు
436
126.
శేఖర్ (కార్టూనిస్ట్)
తనకె.
440
127.
షోయబుల్లాఖాన్
డా. దేవులపల్లి ప్రభాకరరావు
443
128.
సిద్దప్ప వరకవి
డా. బి.వి.ఎస్. స్వామి
446
129.
సిరికొండ వెంకట్రావు
వెల్చాల కొండలరావు
449
130.
సిరిప్రెగడ భార్గవరావు
డా. తిరునగరి
452
131.
132.
సుద్దాల హనుమంతు
సుమిత్రాదేవి
శ్రీరామోజు హరగోపాల్
455
డా. ముక్తేవి భారతి
459
133.
సురవరం ప్రతాపరెడ్డి
134.
టి. మాధవరావు
135.
136.
తెలకపల్లి రామచంద్రశాస్త్రి
137.
తోటపల్లి సుబ్రహ్మణ్యం
తాడేపల్లి లక్ష్మీ కాంతారావు
డా. ఎల్లూరి శివారెడ్డి
వారాల ఆనంద్
హెచ్. రమేష్ బాబు
వేదార్థం మధుసూదనశర్మ
జి. వెంకటరామారావు
462
465
468
472
474
138.
తుర్రెబాజ్ ఖాన్
డా. ఏనుగు నరసింహారెడ్డి
476
139.
ఉత్పల సత్యనారాయణాచార్యులు
డా. జి. చెన్నకేశవరెడ్డి
479
140.
141.
వడ్డేపల్లి సోదరులు
వడ్లకొండ నరసింహారావు
డా. బెల్లంకొండ సంపత్కుమార్
484
డా.
చీదెళ్ళ సీతామహాలక్ష్మి
486
143.
142. వానమామలై జగన్నాథాచార్యులు
వానమామలై వరదాచార్యులు
డా. రావికంటి వసునందన్
488
డా. రావికంటి వసునందన్
492
144. వందేమాతరం రామచంద్రరావు
డా. ఎం. దేవేంద్ర
496
145.
వాంకుడోత్ జోగ్యానాయక్
డా. వి. రామకోటి
499
146.
వరహాల భీమయ్య
డా. రంగి కమల
502
147.
వట్టికోట ఆళ్వాస్వామి
డా. ఎస్.వి. సత్యనారాయణ
505
148.
వెలిచాల కేశవరావు
బి.కె. ప్రేమచంద్
508
149.
వెల్దుర్తి మాణిక్యరావు
డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
512
150.
వేముగంటి నరసింహాచార్యులు
డా. చెప్పల హరినాథ కర్మ
517
151.
వేముల పెరుమాళ్ళు
152.
153.
వేంకట రాజన్న అవధాని
వేంకట రామ నరసింహారావు
డా. దేవరాజు మహారాజు
ప్రమోద్ అవధాని
షబ్నవీజ్ అందిర
522
525
528<noinclude><references/></noinclude>
8yox96txfs65zv178fpfljaq8hory01
పుట:Sangitarasataran022902mbp.pdf/21
104
212302
553544
2026-04-17T11:47:11Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553544
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ఉ॥ మున్నొకవేళనెక్కయెడఁ బూర్ణపునేస్తముసల్పినట్టు లీ
కన్నియతోడనీసుతుఁడు గన్నులుకన్నులఁజేర్చి పల్కుచో
స్విన్న సుధాకరప్రతిభఁ జేకొనెమోముకళావికీర్ణమై
వెన్నెలఁగాచెలేనగవు వెల్గులపేరిటఁబేర్మిపెంచుచు౯</poem> </div>
శుద్ధో — ప్రాణేశ్వరీ! పరమేశ్వరుని కరుణాలవఁబుమనపైనుండెసేయని విశ్వసింపుము. సర్వార్థసిద్ధునకును యశోధరకును బరస్సరామరాగ ముదయించెననుకొనుటకు సందియంబేల? కానిమ్ము. ఇంతటనీసామాజికులనెల్లరు వారివారినెలవులకు వీడ్కొల్పియావెన్కనీప్రసంగము ననుఁదుముగాక. (సర్వార్థసిద్ధుని జూచి) కుమారా! విచ్చేసియున్న బంధుమిత్ప్ర బృందమ్ములకువిందొనర్ప నానావిధసలంబులును
భక్ష్యంబులును నావలిదెసనమర్పఁబడియున్నవి. కావుననెల్లరు నటుబోవలయును. బంధులారా! మిత్రులారా! మీరెల్లరునట్లువిచ్చేయవేఁ
దుచున్నాఁడను.
మంత్రి — సేవకులారా! సర్వమును సిద్ధముగానున్నదికదా!
సేన - దేవా! సర్వమునీవఱకే యమర్చబడియుండెను.
దేవదత్తుఁడు — (కోపముతో) ఔరా యీ రాజపుత్రుని కపటవేదాంతము. ఇట్లేకదాజనులచిత్తములను విత్తములనుహరింపవలయును. (అని దిగ్గున వెడలిపోవును)
శుద్ధో - బంధువులారా! మిత్రులారా!
అందఱు — శాక్యవంశభూషణా! జయమగుఁగాక
{{Center|{{p|fs125}}పాట. కనడా</p>}}
{{left margin|5em}}<poem>రాజచంద్రభూజనేంద్రిసుధీజనాగ్రణీ
తేజోరాజితధీరపరాక్రమ దివ్యకృపాజలధీ
రాజులశాక్యులరాజపదఁబున రమక్రీడించు౯మించు౯
వాజిహస్తిచయవాహనాది బహువైభవములునిలసిల్ల౯
బహుతరఘనతరవటుతరగురుతధరణీధరవరశ్రీ॥</poem> </div>
{{right|(అని యందఱునిష్క్రమించుచున్నారు)}}
{{Center|ఇది}}
{{Center|ప్రధమాంకము}}
{{rule |6em }}<noinclude><references/></noinclude>
hub2skx2ocdhpvhibbs2zfemurxviwp