వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.24 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk పుట:Sarada Lekhalu Vol 1.pdf/127 104 59282 553755 553618 2026-04-18T22:48:54Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553755 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|101}}</noinclude>చుందురు. దేవవేశ్యలైననేమి మర్త్యవేశ్యలైననేమి; వేశ్యజాతి మూలకముగా స్త్రీసంఘమునకు చెందిన యపఖ్యాతి అపారము, కాని యీజాతిని సృష్టించినవారును పురుషులే, దూషింపుచున్న వారును పురుషులే. కాన వీని నన్నింటిని బాగుగా గుర్తించి నూతనోద్యమమునకు చేయూత నిచ్చుటో నిరసించుటో యనెడు బాధ్యత ప్రతిస్త్రీపైనున్నది. ఇది మనదిగాదని యూరకొనుట మనజాతి సౌభాగ్యమును నష్ట పఱచుకొనుట. మఱియు దీనివలన గలిగెడు మంచిచెడ్డలు స్త్రీలవే కాబట్టి పురుషులకంటె స్త్రీలే ఈవిషయమును పూర్ణముగా విచారించి కర్తవ్యమును నిర్ణయించుకొనవలసినవారై యున్నారు. రసపోషణకే, భావపుష్టికే, కళాభివృద్ధికే, స్త్రీనాటకరంగములో ప్రవేశించిన తరువాత మోటారుబస్సుల యందును, రైలుబండ్లయందును, ఒదిగి కూర్చున్నట్లును, విధిలేక తలవంచుకొని ఆపత్కాలమందు డాక్టరుగారికి చేయిచూపించినట్లును, చిన్ననాడు తప్పని సరిగా బడిలో పంతులుగారియొద్ద చదువుకొనినట్లును, సభామధ్యమున తనకిష్టమైన విషయమును గూర్చి ఒడలు వణుకుచునో మాటలు తడబడుచునో నాల్గు ముక్కలు చెప్పినట్లును, నాటకరంగములో చరించుటకు వీలులేదు. లజ్జావతియగు స్త్రీ, నాటకరంగమధ్యమున పరపురుషుడని యాంగికాభినయమున నాతనితో సమముగ జరించుట కే కొంచెము వెనుదీసినను నాటకకళ అధ్వాన్నమైపోవును. హంగు<noinclude></noinclude> 36svnlbslh2lmuj94kh4w43k5m5oics పుట:Sarada Lekhalu Vol 1.pdf/128 104 59283 553756 553619 2026-04-18T22:57:07Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553756 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|102|శారదలేఖలు|}}</noinclude>చెఱచినయెడల స్త్రీ రంగమునకెక్కిన ప్రయోజనమేమి? నవరసముల పోషించి హావభావప్రకటనమునందు లోటులేకుండ ప్రదర్శించి నాటకములలో స్త్రీ ప్రవేశింప కుండుటవలన గలిగెడి గొప్పలోటును తొలగించి నాటకకళను మహోన్నతస్థితికి దెచ్చుటకే గదా స్త్రీ, నటకురాలు కావలసివచ్చినది? కాన స్త్రీ, రంగమున కెక్కినతరువాత, మడిలేని పిన్న పెద్దలు సంచరించెడిచోట మడిగట్టుకొనిన ముసలమ్మ యొదిగియొదిగి నడచినట్లు, ఎడ యెడగానుండుటకు వలనుపడదు. కలిసి చరించుట స్త్రీలకర్హము గాదు. అయినను నాటకకళాభివృద్ధికొఱకు స్త్రీల నేల బలవంతముగా నాకర్షింపవలెనో నాకు తోచకున్నది. రాముడుగాని తా నచ్చముగ రాముడుగను, సీతగానితా నచ్చముగ సీతగను, నటించి వేషధారి ప్రేక్షకుల నానందింపజేయుటయే నాటకము. తాము సీతారాములముగామని నటకులకు దెలియును, ప్రేక్షకులకును దెలియును. అట్టిచో సీతవేషమును స్త్రీవేసినను నొకటే పురుషుడు వేసినను నొకటే. పురుషుఁడు స్త్రీగా నటించిన నందు కొంత సామర్థ్యప్రకటన ముండునేమోగాని నటించినచో నందద్భుత మేముండును? స్త్రీయైన మాత్రమున పలుభావములు ప్రకటించుటలో కౌశలము వలదా? యనిన నదియు నిజమేకాని పురుషుఁడే యిన్నిభావములు ప్రదర్శించిన మఱియు నధికకుశలతయనిపించు కొనునుగదా! శీలము మనుష్యునిబట్టి యుండును గాని వృత్తినిబట్టియుండదని కొందఱనుచున్నారు. కాని సీతవంటి శీలవతి నాటకరంగములో సీతవేషమును ధరించు ననుకొనుము. ఆదర్శపాత్రమగు సీతశీలమును ప్రతిస్త్రీయును తన<noinclude></noinclude> 9fgfzdokkftc7uvjpd4abb90meoh056 పుట:Sarada Lekhalu Vol 1.pdf/129 104 59284 553757 553620 2026-04-18T23:05:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553757 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|103}}</noinclude>జీవితమునందనుష్ఠేయముగా నుంచుకొనదగినదికదా. హనుమంతుడు సీతను తనమూపున నిడుకొని శ్రీరామచంద్రుని కడకు గొంపోవుదునని సీతతోఁజెప్పినప్పుడు పరపురుషునంటనని సీతచెప్పినది. ఉత్తమమైన యాసతీధర్మము ననుష్ఠించెడు యా సీత వేషధారిణి, నాటకరంగములో నెట్లు చరించును? నాకు దుర్జేయముగా నున్నది. అదిసరే. భాగవతములు నాటకములు మున్నగు నీకాలక్షేపము లెందులకుఁ బుట్టినవి? ఇంచుక యోచింతము. ప్రజలలో నీతిని పెంపొందించుటకును, దేశానురక్తిని గలిగించుటకును మతాసక్తిని బుట్టించుటకును దైవభక్తిని వ్యాపింపఁజేయుటకును, జనులను కూటమిగాఁజేర్చి కాలక్షేపములు జరుపుట మనదేశములో ననాదిగా నడచుచున్న యాచారము. ఇవి సామన్యముగా పామరజనుల ప్రబోధము కొఱకే యేర్పడినవి. వీనిలో మొదటిమెట్టు కథలు చెప్పుకొనుట. కథ నీతికరమైనదియు కథకులు వచోనైపుణిగలవారును నైనచో ఆటపాటలు, మద్దెల తాళములు, బహుపాత్రలు లేకపోయినను, వినువారి మనస్సు నట్టె యాకర్షించి చిత్రప్రతిమలుగాఁ జేయవచ్చును. వీనిలో శ్రోతలు కథలోని పాత్రలను మానసికముగా సృష్టించుకొందురు. వీనిలోనున్న యేకాగ్రత మేళతాళాడంబరములలో నుండెడి కాలక్షేపములలో నుండదు. తల్లివద్ద నేకాగ్రచిత్తముతో నిట్టి కథల నాలకించియే మహారాష్ట్రచక్రవర్తియైన శివాజీ, యంతటి శూరుడైనాఁడు. వీనికి కొంచెము పైమెట్టు గొల్లసుద్దులు, తందాన పదములు మున్నగునవి. వీనిని వినువారు ముఖ్యముగా జాన<noinclude></noinclude> 8xfc70zbl25k9r5dujssj5rruiu7331 పుట:Sarada Lekhalu Vol 1.pdf/130 104 59285 553758 553621 2026-04-18T23:13:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553758 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|104|శారదలేఖలు|}}</noinclude>పదులు. ఈ పదములు వట్టి పొడిమాటలు కాకపోయినను తత్తుల్యములగు కొంచెము రాగముతోగూడిన పదములు. వీనికి కొంచెమూత ఏకతంత్రీసాధనమగు తంబూరయు కొమ్ము, తిత్తి, మున్నగునవియు. పూర్వము జనసామాన్యములో మతము, యుద్ధము, మున్నగు వానినిగూర్చి ప్రబోధము కలిగించ వలసినప్పుడు పరవశచిత్తులగు వారిచే నుద్రేకముగా చదువబడెడి యీ పదములు బహూపయోగకరముగ నుండెడివి. ఇప్పటికిని బొబ్బిలికధ, పల్నాటి వీరచరిత్రము, మున్నగు వీరచరితములు పాడబడునపుడు జానపదులలో గల్గెడి యుత్సాహ మద్భుతము. వీనికి పై మెట్టు తోలుబొమ్మలాటలు. జనులలో నాగరికత యభివృద్ధియైన కొలది యీకాలక్షేపముల యభివృద్ధియు పలు తెఱగులుగా నుండజొచ్చినది. ఉపనిషత్కాలమున మానసికముగానున్న యేకేశ్వరోపాసన, కాలక్రమమున ఆడంబరములతోగూడిన ప్రతిమార్చనగా మాఱి మనుజుని పతనమునకు కారణమైనట్లు ఈకాలక్షేపముల వృద్ధియు మన పతనమునకే దారిచూపినది. కథలను గేయములను వినునప్పు డాయాకధలలోని యుత్తమపాత్రలకు మానసికముగా రూపకల్పన గావించుకొని వాని సత్యశీలసామర్థ్యములను గుర్తించి వానిని తమ జీవితములం దనుష్ఠేయముగా నుంచుకొనుటకు శ్రోతల కవకాశ ముండెడిది. కాని తోలుబొమ్మలాటలలో ప్రసిద్ధవ్యక్తులకు కృత్రిమరూపములు కల్పించుటచే చిత్తైకాగ్రత నశించినది. తోలుబొమ్మలాటతోనే రంగస్థలమున తెఱయెత్తబడినది.<noinclude></noinclude> kzudnansb5i7vjw4yageln4uuuuqqbb పుట:Sarada Lekhalu Vol 1.pdf/131 104 59286 553759 553622 2026-04-18T23:20:07Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553759 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|105}}</noinclude>వాయిద్యపరికరములుగూడ నధికమైనవి. గాత్రమాధుర్యమునకు ప్రాముఖ్యత ఈయబడినది. కాన కథలకు కళాసాంకర్యము గల్గినది, ఈతోలుబొమ్మలాటలయందేనని చెప్పవచ్చును. కాని మన భరతఖండమునందలి ప్రసిద్ధేతిహాసములగు రామాయణ భారతాది యుద్గ్రంథములయందలి శూరభక్తానీకముల చరిత్రములను బొమ్మలద్వారాసుబోధముగావించి పామరజనులలో నీతిప్రబోధము గావించుటయే యీతోలుబొమ్మలాటల లక్ష్యముగూడ నై యుండెను. కాని యచేతనములగు తోలుబొమ్మల నాడించి సచేతనపు తోలుబొమ్మలగు జనసామాన్యము నానందింపజేయుట యనునది కాలక్రమమున నాగరికులకు మోటుగా తోచినది. కాన తామే ఆయాపాత్రములు ధరించి నటించుట యుక్తముగా భావించినారు. అవియే భాగవతములు. తోలుబొమ్మలాటవఱకు మనుజుఁడు మొగమునకు రంగుపూసికొని రంగమున కెక్కలేదు. మఱియు తోలుబొమ్మలాటవఱకు నీకథల నడుపువారు సామాన్యముగా శూద్రులే యైయుండిరి. ప్రాయికముగా వీరి గురువులు బ్రాహ్మణులై యుండినను నలువురిలో నాడెడివారు మాత్రము బ్రాహ్మణేతరులే. బ్రాహ్మణేతరులలో నిట్టియాటపాటల కాలక్షేపములు జరుగుచుండ బ్రాహ్మణు లూరుకొనలేదు. పురాణపఠనము హరికథలు మున్నగునవి వారి కాలక్షేపములుగా నుండెడివి. అయితే వారి కాలక్షేపములకు వీరును వీరికాలక్షేపములకు వారును పోకుండిరని భావనకాదు. వాని ఆధిపత్యము లాయాజాతులవారు మాత్రమే చేయుచుండిరని యర్థము. అయితే భాగవతములలో<noinclude></noinclude> nuffxpvtwu4drlz1lihl888om247glo పుట:Sarada Lekhalu Vol 1.pdf/132 104 59287 553761 553623 2026-04-18T23:27:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553761 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|106|శారదలేఖలు|}}</noinclude>అన్నిజాతులవారును పాల్గొనిరి. బ్రాహ్మణభాగవతులు-వీరే కూచిపూడిభాగవతులు. గొల్లభాగవతులు, ఏనాదిభాగవతులు, మాలభాగవతులను పేరులతో వేర్వేఱు కులములవారు భాగవతముల నాడుచుండుట యిప్పటికిని కందుము. నాట్యకళా బ్రహ్మయగు భరతాచార్యునకు పూజ్యత ఈ భాగవతముల యందే కల్గినది. మఱియు హావభావముల కాధిక్యతయు, శృంగారమునకు ప్రాముఖ్యతయు, కృష్ణచారిత్రమునకు ప్రాధాన్యతయు, నీతికి న్యూనతయు నీభాగవతముల కాలముననే గల్గెను. కాని యొకమేలు, వీధిభాగవతముల వఱకు వీని వ్యయము జనసామాన్యమునకు తగిలెడిదికాదు. గ్రామములో పెద్దలైనవా రేనలుగురైదుగురో దానివ్యయమును భరించి ప్రజాసామాన్యమున కాయాటను సందర్శించుభాగ్యమును ధారాగతము చేసిడివారు. వాని తరువాతివే నాటకములు. ఈనాటకములలో గూడ వీధినాటకములని యొక్కటే తెఱతో వీధులలోనాడునవి కలవు కానివాని ప్రచారము స్వల్పము. ఇప్పటి నాటకములనగా వానికొక ప్రత్యేకమందిరముండును. రంగాను కూలములైన పరికరము లధికము. నేపథ్యాడంబర మెక్కువ. నృత్యగీతాభినయములకు ప్రాముఖ్యత యధికము. మఱియు ప్రతిచూపరియు కొంతమూల్యమును తన స్థితినిబట్టి యిచ్చు కొనవలయుట వీనిలో ముఖ్యవిషయము. టిక్కెట్లపద్ధతితో గూడిన నాటకములు ధనికులను పేదలను విడదీసినవి. కాన భాగవతములు నాటకములు మున్నగు కాలక్షేపములు జరుపుట ప్రజాప్రబోధమునకనెడి యాదర్శమును నాటకములు<noinclude></noinclude> hjegp577hkca615gyuail9l0jntjwx1 పుట:Sarada Lekhalu Vol 1.pdf/133 104 59288 553762 553624 2026-04-19T01:32:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553762 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|107}}</noinclude>చెఱచినవి. నాటకములు శ్రీమంతులగు నాగరికుల కానందమును గూర్పవచ్చును, కాని ప్రజాసామాన్యమునకు వీని ప్రయోజనములేదు. ఒకవేళ యేపాటకపు జనుఁడైనను పావలా, అర్థా, చెల్లించి నాటకమునకు వెళ్ళి యుండినచో త్రాగుబోతైనవాడు; యింటిలోనిభార్యాబిడ్డలగోడు జూడక కల్లంగడికి వెళ్లినట్లే నాటకముల చూడవచ్చిన కూలివాడు కూడ ఇంటిలో మఱుపూట గంజి కాధారములేకుండజేసి నాటకసందర్శనమనెడి దుర్వ్యసనపిసాస దీర్చుకొనుటకు వచ్చి యుండెననుట స్పష్టము. కాన ధనికులకే నాటకములు. వీరి యానందమునకు పురుషవేషధారులు చాలలేదు. కాన స్త్రీలనుగూడ రమ్మనుచున్నారు. ఇటీవల కొంతకాలమునుండియు నాటకకళ విషయమై మనయాంధ్రదేశమునందు ప్రచారము జరుగుచున్నది. సమర్థులైన నటకులు కొందఱు బయలుదేరి బహుమానములు, బిరుదులు, పొందుచున్నారు. ఈకళాభివృద్ధికై గ్రంథములు కొన్ని ప్రకటింపఁబడినవి. పత్రికలుగూడ స్థాపింపఁబడినట్లు జ్ఞాపకము. కాని ఈప్రచారమంతయు పురుషులలోనే జరుగుచున్నది. స్త్రీలుగూడ నాటకరంగములో పాల్గొనకుండుట లోపమను సంగతిని కళావిదులు నిన్నమొన్నటివఱకు గుర్తింప లేదు. బహశఃయిది ఈవత్సరమే దేశములో ప్రవేశించిన నవ్య మారుతము. ఇది పశ్చిమవాయువని కొందరన కాదు, కాదిది<noinclude></noinclude> 1b3beu8npdu65t0kmon7un5z25a2vko పుట:Sarada Lekhalu Vol 1.pdf/134 104 59289 553763 553625 2026-04-19T01:37:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553763 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|108|శారదలేఖలు|}}</noinclude>ప్రాచ్యమారుతమే యని కొందఱనుచున్నారు. ఇది యేగాలియైననేమి మనహిందూస్త్రీ మనస్తత్వముల కిదిసరిపడునా లేదా? యనునదియే యోచింపవలసిన యంశము. వేశ్యాజాతి స్వర్గలోకములోనున్నది. మర్త్యలోకములో నున్నది. పాతాళలోకములోనున్నది. చతుర్యుగములకు సంబంధించిన శ్రుతి స్మృతిపురాణేతిహాసములలో వీరి ప్రస్తావనగలదు. కాన నిది అతిపురాతనమైన తూర్పు వాయువు అని చెప్పుటకు సందేహములేదు. అయిన నేమి? నీతిభ్రష్టమైన యీజాతిధర్మమును కూకటివేళ్ళతో గూడ పెల్లగించుటకు దేశహితైకాభిలాషులెల్లరు తీవ్రముగా యత్నింపుచున్నారుగదా. అట్లె ఈ నాటకరంగ ప్రవేశోద్యమముగూడ ప్రాచ్యమైననేమి, ప్రతీచ్యమైననేమి, ప్రాక్తనమైననేమి అధునాతనమైననేమి? సతీశ్రేయమునకు భంగకరమైనచో నది నిర్మూలింపఁజేయుట స్త్రీల కర్తవ్యము. మనయింటిదీపమని ముద్దుపెట్టుకొననగునా? కల్పలతా, "లోకోభిన్నరుచి” యన్నట్లు జనులతలపులు బహువిధములు. నీతిలక్ష్యము కొందరికి, కళాప్రియత్వము కొందఱికి, కనులపండువు కొందఱికి, ఎవరి యుద్దేశము కాదనినను వారి కావేశమే యెత్తుకొనివచ్చును, కాని ఆలోచింపవలసిన విషయముల కావేశముచెందిన లాభములేదు. కాన ఒకప్పుడు శీలమునకై యాత్మార్పణము గావించి యశోవిశాల<noinclude></noinclude> irdji1w0v0chgcpz0qwx7614dyr6wrl పుట:Sarada Lekhalu Vol 1.pdf/135 104 59291 553764 553626 2026-04-19T01:43:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553764 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|109}}</noinclude>మైన భారతమహిళ నేడు నాటకకళకు బలియై తన పూర్వౌన్నత్యమును చెఱుచుకొనుట యుత్కృష్టమో, నాటకకళకు లోపముకల్గిన గల్గుగాక తన శీలమునే ప్రాథాన్యముగా బెట్టుకొని నాటకరంగములకు వెలిగానుండుట యుత్కృష్టమో, స్త్రీలును స్త్రీసంఘాభ్యుదయపరులగు పురుషవరేణ్యులును యోచింతురు గాక. దూకుదూకుమనువారేగాని తోడు దూకువారుండరు. స్త్రీ లిందు పాల్గొనుటవలన దేశ మభివృద్ధిజెందుననియు, నాట్యకళ పెంపొందుననియు, స్త్రీ పురుషులు యోగ్యులై యున్నచో వా రెంత కలిసి మెలసియున్నను ప్రమాదము లేదనియు, కళాభిమానులగువారు తమ యుద్యమవిస్తారమునకై పలుతెఱగుల సమాధానములు చెప్పి స్త్రీల నాకర్షింప వచ్చును. కాని నాటకములాడు స్త్రీలనుగాంచి లఘుభావమున పలుగాకిమూకలాడు ప్రల్లదముల నాప వీరితరమా? మహాత్మునివంటి యుత్తమోత్తమ పురుషవరేణ్యునిచే నడుపబడుచున్న సబర్మతీ సత్యాగ్రహాశ్రమమును బోలు నిష్ఠురనియమవిధానములుగల సంస్థయందే స్త్రీ పురుషులలో లోపములు గననయ్యెనని మహాత్ముడు వలవల విలపించినాడు. శీలభంగభయముచేతనే స్త్రీ పురుషులు కలిసి పనిచేసెడు ఫ్యాక్టోరీ విధానమును మహాత్మునివంటి ప్రాజ్ఞులు నిరసింపుచున్నారు. అట్టిచో నిక నాటకరంగములా స్త్రీల మర్యాదను చెక్కు చెదరకుండ రక్షింపునవి ?<noinclude></noinclude> 6b0movzvcyferrwqknar726nhvlnfue పుట:Sarada Lekhalu Vol 1.pdf/136 104 59292 553765 553627 2026-04-19T01:49:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553765 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|110|శారదలేఖలు|}}</noinclude>పూర్వము మన దేశమున స్త్రీలు నాటకములలో పాల్గొనినట్లు కానము. ఉండిరని చూపఁబడుచున్న వారు దేవవేశ్యలైన అప్సరసలేగాని సంసారిణులుగారు. మన శాస్త్ర మహోదధియందు బాల్యవివాహవాదులకును ప్రౌఢవివాహవాదులకును నుదాహరణములుగా జూపదగిన శ్లోకరత్నములు లభించినట్లే ఒకవేళ వెదకినచో నీ విషయమునగూడ యుభయ వాదులకును నుదాహరణ శ్లోకరత్నములు కొదువలేక దొరకవచ్చును. వేషధారణము గృహస్థ నిషిద్ధకర్మమని శాస్త్ర దృష్టాంతములు పెక్కులుగలవు. వానినెల్ల నిక్కడ వాకొనుట అనవసరము. ముంజేతి కంకణమున కద్దమెందులకు? స్త్రీ నాటకరంగ ప్రవేశముయొక్క ఫలితములు సాధారణ విషయములను బట్టియే కరతలామలకమగుచుండ ప్రాచీనోదాహరణములకొఱకు ప్రాకులాడుటేల? కల్పలతా! నాటకకళనుగూర్చి సందర్భమునుబట్టి యింతగా విమర్శించుటచే నాటకకళ యనిన నాకు ద్వేషమని భావింపకుము. స్త్రీల ప్రవేశమునుగూర్చియే నా కభిప్రాయభేదముగాని కళాకోవిదులగు పురుషవరేణ్యు లీ నాట్యకళోద్ధరణకై విశేషముగా పాటుపడి మన యాంధ్రదేశమును నీ విషయమునగూడ తీసిపోనిదానినిగాఁ జేసిరేని నాకు పరమసంతోషము. కాని యే స్త్రీజనాభ్యుదయచింత స్త్రీ జనప్రయోజనకరములగు నుదారసంస్కరణములకు నన్ను సుముఖురాలనుగాఁ జేయుచున్నదో ఆ మహనీయచింతయే నన్నీ యుద్యమమునకు వ్యతిరేకాభిప్రాయముగా చేయు<noinclude></noinclude> 6zcrkyk39nx952km17pynp75gplt1ed పుట:Sarada Lekhalu Vol 1.pdf/137 104 59293 553767 553628 2026-04-19T01:53:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553767 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|111}}</noinclude>చున్నది. దీర్ఘముగా నాలోచించిన పిదపనే నే నీ నిశ్చయమునకు వచ్చితిని. అది నా కళానభిజ్ఞతయు ఛాందసమునునని యేరైన నధిక్షేపించినను నదియు నాకొక యలంకారమే యనుకొందును. {{rh|భావపురి||మిత్రురాలు.}} {{rh|1929 జూలై||శారద.}} {{rule|2cm}}<noinclude></noinclude> 1i1o8pnfcaschhji4l6ssi3h9b4kemp పుట:Sarada Lekhalu Vol 1.pdf/138 104 59294 553768 553629 2026-04-19T02:00:45Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553768 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|112|శారదలేఖలు|}}</noinclude>{{c|'''సౌభాగ్యవతి కల్పలతకు—'''}} '''నెచ్చెలీ!''' చూచితిని, సమదర్శినీగర్భశుక్తిముక్తాఫలమగు ఉగాది సంచికను చూచితిని. చక్కని కాగితములతో ముచ్చటైన అచ్చుతో రమ్యములైన చిత్తరువులతో మనోహరములైన భావగీతావళులతో దివ్యములైన వ్యాసములతో సంచిక రమణీయమై యొప్పారుచున్నది. ఆఱేండ్లు నిరాఘాటముగా చెన్నరాజధానీప్రజాయత్త శాఖల బాలించిన ప్రతిభాశాలియగు నా సచివశేఖరుని రాజలాంఛనాలంకృతంబగు త్రివర్ణముఖ చిత్రము నిజముగా నాసంచిక కపూర్వశోభనే గూర్చుచున్నది. రాజకీయసాంఘికార్థిక సారస్వతానేక విషయములనుగూర్చి వ్రాయబడిన ప్రసిద్ధవ్యాసములు పునఃపునః పఠనీయములై తనరారు చున్నవి. అందందు తనరారుచున్న పద్యమాల లాసంచికాబాలకు మణిహారములే! సందియములేదు. కాని యెట్టి చక్కదనాలచుక్కకైన ఇంచుకంతలోప ముండకపోదు. విధాతృ సృష్టిలోనే యిట్టిలోటు సర్వసాధారణముగా కనిపించుచుండును. ఇఁక మానవసృష్టియందుండుటలో వింతయేమున్నది? పాశ్చాత్య స్త్రీలనుగూర్చి వ్రాయఁబడిన వ్యాస మాసంచికలోఁ జేరుట నిజముగా నాసంచిక కొకకళంకమనియే చెప్పవచ్చును. అయినను నీ విషయమై యాసంచిక నిర్వాహకులనుగాని యావ్యాసకర్తనుగాని యనవలసిన పనిలేదు. వారి పత్రికానామమే వారి<noinclude></noinclude> gpu6zk095jbbn5u9a0vrz29xysfodde పుట:Sarada Lekhalu Vol 1.pdf/139 104 59295 553770 553630 2026-04-19T03:45:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553770 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|113}}</noinclude>మతమును నిరూపింపుచున్నది. కాన సమదర్శన భావముతో నావ్యాసము నందుకొనిరి. ఇక వ్యాసకర్త విషయమా? ఆ సోదరునకు పాశ్చాత్యస్త్రీలనుగూర్చి తెలిసినంత మాతృదేశ స్త్రీలనుగూర్చి తెలియదు. పాపము తెలిసియుండినచో అంత అసభ్యముగను నంతపేలవముగను వ్రాసియుండరు. దానికేమి? ప్రమాదోధీమతామపి. ధీమంతులకుగూడ నొక్కొక్కప్పుడు పొరబాటు కలుగుచుండును. కాని ఆకథలేమి? మాణిక్యము వంటి సంచికలో మసి చుక్కలుపెట్టినట్లున్న వే? కల్పలతా! ఆకథలను జదువగనే నాకు మితిలేని విచార మొదవినది. ఏమి ప్రయోజనము గోరి యాపట్టభద్రు లిట్టి చెట్టకథలను వ్రాసిరో నేనిప్పటికిని ఊహింపలేకున్నాను. మానవులు సహజముగా కథాప్రియులు. పాలుత్రాగు పసిబిడ్డగూడ చీమకథనో చేపకథనో చెప్పమొదలిడితిమేని యేడ్పుమాని ఊఁకొట్టును. ఈ పసితనమునాటి కథాప్రియత్వము మనుజులకు వార్ధక్యము వచ్చినను సడలదు. పత్రికా పాఠకులైనవారిలోగూడ సారస్వతవిషయములనిన విసుగుకొనెడి వారును, చారిత్రకవృత్తాంతమనిన తలకంటగించుకొనెడి వారును, ప్రపంచవార్తలనిన వలదనెడి వారును, మతవిషయములనిన మాకెందు కనెడువారును, భావగీతావళులనిన నేవపడెడువారును, కలరుగాని కథలనిన చెవి గోసికొనని వారుండరు. ప్రతినెలయు మాయిరుగు పొరుగు అమ్మలక్కలు “ఏమండీ, గృహలక్ష్మివచ్చిందా? భారతి వచ్చిందా? ఏం కథ<noinclude></noinclude> 7tsf0l21v1xavovqpf361y85ui3t89j పుట:Sarada Lekhalu Vol 1.pdf/140 104 59296 553771 553631 2026-04-19T03:53:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553771 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|114|శారదలేఖలు|}}</noinclude>లున్నాయి. ఒకమారు చూపరూ” అని కథలకొఱకే భారతీ గృహలక్ష్ముల క్షేమసమాచారము లడుగుచుందురు. ఆపత్రికలలోని యొకటి రెండుకథలు చదివినచో వారి చదువు పూర్తి యైనట్లే. ఇఁక వానిలో వివిధవిషయములను గూర్చి కూర్చిన విజ్ఞానమంతయు వారి దృష్టిలో వట్టిచెత్త. చదువగనే యర్థ మయ్యెడివిని చదివినంతనే యానందమును గూర్చెడివిని కథలు. కాన అన్నివిషయములకంటె కథలనిన ప్రజలకెక్కువమక్కువ. ఈవిధముగా పండితపామరవివక్షతయు, బాలవృద్ధభేదమును లేక యెల్లరియామోదమును బడసెడి కథలెంత - ప్రశస్తములై యుండవలెను? అది యేమిపాపమోగాని ఆధునికకథావాఙ్మయ మట్టి ప్రశస్తతను గోల్పోయియుండుటకు కడుంగడు విచారము గొల్పుచున్నది. ఒకమారు మాఅన్నగారితో మాట్లాడుచుండగా మాటల సందర్భమున “కథలు యెట్లా ఉండాలె?” అని నేను మాసోదరునడిగితిని. "తన వాళ్లను నలుగురిని దగ్గరకూచోపెట్టుకొని చదివేటట్లుండాలె” అని ఆయన అనెను. అంటే? అన్నాను నేను. మగవాడు తన తల్లికి, కొమార్తెకు, తోబుట్టువుకు, భార్యకును; ఆడుది, తన తండ్రికి, సోదరునకు, పెనిమిటికి, పుత్రునకును, చదివి వినిపించుటకు అర్హమైనదిగా ఉండాలె. కథలేగాదు చిత్తరువులుగూడ అట్లే ఉండాలె అని ఆయన యనెను. నాకు హితోపదేశము చేయుటకై మాసోదరు డావాక్యము లనకపోయినను, ఆమాటలు గురుమంత్రమువలె నామనస్సున శాశ్వతముగా నాటిపోయినవి. ఏదేనియొక కథవ్రాయ దొరకొనినచో భావగర్భితమైన యావాక్యము<noinclude></noinclude> ruf2gedreda8a048osrayak1ukfp05q పుట:Sarada Lekhalu Vol 1.pdf/141 104 59297 553772 553632 2026-04-19T04:00:45Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553772 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|115}}</noinclude>నాకు మాటిమాటికి స్ఫురణకు వచ్చుచు అంధకారపథమున దీపకళికవోలెతోచి నాకర్తవ్యతాపథమును నిరూపింపుచుండును. ఇతరకథలను చదివినప్పుడు గూడ ఆకథలు పైవాక్యమునకు సరిపడియున్న వాయని యోచించుట నాకు పరిపాటి. సమదర్శినీ సంచికలోని కథలను జదివిగూడ నే నిట్టులనేయోచించితిని. రెడ్డిరంగమ్మ యెడ్డెతనపుగాథను జదివి అసభ్యము, అసాధారణము అని మనస్సున చీకాకుపడి, సావిత్రి యను చల్లనిపేరుగాంచి యీకథయైన మనశ్శాంతి నీయకపోదని కుతూహముతో జదివితిని. మొదటికథకంటె నధ్వాన్నముగ నున్నదీ కథ. “మాప్రణయగాథ” సరేసరి. అన్నిటికంటె గొడవగానున్నది అమ్మడు గొడవ. సమదర్శినీపత్రికాధిపతులు తమ సమదర్శకత్వమును తేటపఱచుటకై హితాహితములను గమనింపక యిట్టి కథలకు తావొసంగి రనుకొందము. కాని వ్రాసినవా రివి యెందులకు వ్రాసిరి? ఆకథలు తల్లి, బిడ్డకు చదివి వినిపింప దగినవికావు. బిడ్డ తండ్రికి చదివి వినిపింప దగినవికావు. సోదరుఁడు తోబుట్టువు నాకథలను జదువుమని చెప్ప సాహసింపజాలడు. స్నేహితుఁడు ఒకస్నేహితునిముంద రాకథలను సిగ్గువిడిచి చదువజాలడు. తుదకు అగ్నిసాక్షిగా పెండ్లాడిన ఆలుమగలు కాదుగదా కూరిమికిగూడిన స్త్రీపురుషులైన ఆకథలను జదివి మోదింపజాలరు. సావిత్రివంటి, రెడ్డి రంగమ్మవంటి, పనికిమాలిన స్త్రీలెచ్చటైన నున్నచో వారిని గూర్చి బహిరంగముగా జెప్పుకొనుటకే యోగ్యులైన వారు పూర్వము జడియువారు. మనసున తలపరాని వాక్కున నుచ్చ<noinclude></noinclude> eogm94p9426jeb4i9nga65kccbc2ma0 పుట:Sarada Lekhalu Vol 1.pdf/142 104 59298 553781 553633 2026-04-19T08:30:43Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553781 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|116|శారదలేఖలు|}}</noinclude>రింపరాని యట్టి వృత్తాంతము లిప్పుడు విధ్యాధికుల లేఖనీ సన్మానమునందుచు రమణీయకథలై పత్రికలలో పొత్తములలో నెక్కుచున్నవి. ఆహా! కాలమహిమ ! కథ అచ్చుపడి దేశములో ప్రవేశించిన తరువాత అవివాహితయైన బాలిక చదువును. అన్నెపున్నెము లెఱుగని బాలవితంతువు చదువును. సత్యనురక్తయగు నిల్లాలు చదువును. వైరాగ్యోదయమైన వృద్ధురాలు చదువును. అట్లే పురుషులలో గూడ విద్యార్థులు మున్నగు పలురకములవారు చదువుదురు. అందఱు చదువుట కర్హమైనదిగా నుండవలయుట కథారచయితల ముఖ్యధర్మమై యున్నది. కథకులేగాక కథకురాండ్రుగూడ యిట్టి కథలను వ్రాయ సాహసించుచున్నారు. దైవము వీరికి మంచి త్రోవను చూపుగాక. కల్పలతా! యోచింప, యోచింప, భావకవులనబడెడి వారేదియో యొక ఆడపేరు బట్టుకొని 'ప్రేయసీ! ప్రేయసీ' యని యల్లాడుటయు, కథకులైనవారు 'ప్రేమప్రేమ’యనుచు స్త్రీలనుగూర్చి యిట్టి విపరీతపు అసమంజసపు గాథలల్లుటయు, జూడ ఆంధ్రభాష దురదృష్టమో ఆంధ్రస్త్రీల దురదృష్టమో యోచింపలేకున్నాను. {{rh|భావపురి||ఇట్లు}} {{rh|ఆగస్టు 1928||శారద.}}<noinclude></noinclude> 96u8ubec51r6dterdzcp557yifa20f1 పుట:Sarada Lekhalu Vol 1.pdf/143 104 59299 553782 553634 2026-04-19T08:39:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553782 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|117}}</noinclude>{{c|'''సౌభాగ్యవతి కల్పలతకు''' : -}} '''నెచ్చెలీ !''' నీవు వ్రాసిన జాబు చూచితిని. అందు నీవు “ఇటీవల జరుగుచున్న ప్రతిసభలోను పురుషులకు గౌరవబిరుదు లొసంగుచు స్త్రీల కొక్కరికైన నీయక ఆంధ్రమహాజనులు స్త్రీలను చిన్న చూపు చూచుచున్నారు. చూచితివా? బిరుదు లందు కొనదగిన విదుషీరత్నము లాంధ్రస్త్రీలలో లేకనా? లేక స్త్రీల యెడగల నిరసనభావమా? ఏది దీనికి కారణము? ఇప్పటి పురుషులకు స్త్రీలయందు గౌరవభావ మేర్పడుచున్నదని నీవు వాదింతువుగాని నేను నమ్మను” అని నీవు వ్రాసిన వాక్యములు నా కెన్నిమాఱులు తలఁచిన అన్నిమాఱు లత్యధికముగా నవ్వు వచ్చుచున్నది. నీకుగూడ బిరుదులపిచ్చి యున్నదా యేమి? నంద్యాలసభలకు పూర్వ మొకపత్రికలో చదివితిని లెమ్ము. ఇంతకుపూర్వ మిచ్చిన బిరుదులన్నియు బ్రాహ్మణులకే చెందినవి. ఈమాఱు బ్రాహ్మణేతరులకుగూడ నొకబిరుదు నిచ్చుట యవసరమని అందు వ్రాయబడినది. అదిచూచి అర్హతానర్హతలను పరికింపవలసిన వాటికి బ్రాహ్మణ బ్రాహ్మణేతరభేదములు తీయబడుచున్న వేమని విచారించితిని. ఇప్పుడు నీవు స్త్రీ పురుష భేదములను గొనివచ్చితివి. బిరుదులపై మోహముగలవారు స్త్రీలలోగూడ నున్నారని నీ యుత్తరముచూచి ఆశ్చర్యముతో ననుకొంటిని.<noinclude></noinclude> 61zb0uq9ovf5ot9398c7z1l0by1vvcl పుట:Sarada Lekhalu Vol 1.pdf/144 104 59300 553783 553635 2026-04-19T08:45:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553783 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|118|శారదలేఖలు|}}</noinclude>కాని విచారించిచూడ నా ఆశ్చర్యము పొరఁబాటే! ఏలనందువా? ఈ బిరుదులు మన దేశమునకు క్రొత్తలుగావు. రాజులకు, రాణులకు, మంత్రులకు, సేనాపతులకు, కవులకు, గాయకులకు, పండితులకు, మల్లులకు, శిల్పులకు వేయేల ప్రజ్ఞాచణులైనవారి కెల్లరకు కడుదీర్ఘములైన బిరుదావళులున్నట్లు ప్రాచీన శిలాశాసనములును, గ్రంథములును చాటుచున్నవి. ముఖ్యముగా సుప్రసిద్ధులగు మన ప్రాచీనకవివరేణ్యులలో బిరుదుపదములు లేనివారే లేరు. ఆదికవియైన నన్నయభట్టు వాగనుశాసనుడను బిరుదుపొందెను. ఆరణ్యపర్వశేషపూరణము గావించిన యెఱ్ఱనార్యునకు ప్రబంధ పరమేశ్వరుడను బిరుదుగలదు. తక్కుంగల భారతమును రచియించిన తిక్కయజ్వ కవిబ్రహ్మ యని వినుతిబొందెను. మనుచరిత్ర కావ్యకర్తయైన అల్లసాని పెద్దన ఆంధ్రకవితాపితామహుఁడను బిరుదము నందెను. రమణీయమంజులకవిత కధినాధుండైన శ్రీనాధుండు కవిసార్వభౌముండను బిరుదును బడసెను. ఇఁక కృష్ణదేవరాయాది రాజేంద్రులకును, తిమ్మరుసు మున్నగు మంత్రిసత్తములకును, తదితర రాజకీయోద్యోగులకునుగల బిరుదావళులకు లెక్కయేలేదు. ఇప్పటికిని మన దేశమునందలి సంస్థానాధిపతుల పేరులు చూచిన మన పూర్వులకు బిరుదావళులపై మోహ మెంతగానుండెడిదో విశదమగును. అలనాటినుండియు మనవారికి ఉండిన బిరుదులపై వాంఛ నేడును మనవారిని వీడదుగదా! ఈ బిరుదులు పలు<noinclude></noinclude> 63uacshe2ejxypzh6ugnzrpwtfx1har పుట:Sarada Lekhalu Vol 1.pdf/145 104 59301 553784 553636 2026-04-19T08:52:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553784 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|119}}</noinclude>విధములు. పాండిత్యమునకు మెచ్చి ఈయబడెడివి కొన్ని. ప్రజ్ఞకు సంతసించి యిచ్చెడివి కొన్ని. ఈ బిరుదములను కొన్నిటిని ప్రజలొసంగుదురు. కొన్నిటిని యేవేని విద్యాపీఠములో జాతీయసంస్థలో పరిషత్తులో యొసంగును. మన దేశమం దసహాయోద్యమము బయలు వెడలిన తరువాత దేశీయులు బహిష్కరింపవలసినవాటిలో ప్రభుత్వపు బిరుదములుగూడ నొకటిగాఁ జేర్పబడినవి. అప్పటినుండి ప్రభుత్వబిరుదములు పలుకుబడి చాలవఱకు సన్నగిల్లినది. మఱియు వానిపై నొకవిధమగు నిరసనభావముగూడ నేర్పడినది. నిరాకరణోద్యమము విస్తరించియున్న యాదినములలో పలువురు పూర్వదత్తబిరుదములను విసర్జించి ప్రజల పొగడ్తల బడసిరి. "బిరుదుపదవులను బురదలో దిగబడి" దేశమును దాస్యములో ముంచకుడని జాతీయాత్మగల కవులు గానము చేసిరి. ఈవిధముగా దొరతనపు సన్నదులపై మోహము జనులకు తొలగింపఁబడినను బిరుదులపై మోహముమాత్రము జనులకు పూర్తిగా వదలలేదు. దొరతనమువారి రావు సాహేబు, రావు, రాయ, దివాన్ బహద్దూర్, సర్ ఇత్యాది బిరుదులపై పోటీకి వచ్చినవో యనినట్లు దేశభక్త, దేశబంధు, దేశోద్ధారక మున్నగు బిరుదులు దేశసేవపరాయణుల పూజ్యనామములకు తగిలించి పిలుచుట అసహాయోద్యమ కాలమునుండి పరిపాటిగానున్నది. దేశపూజ్యులైనవారికి నిండుప్రేమతో ప్రజలొసంగెడి దేశభక్తాది బిరుదములు మాన్య<noinclude></noinclude> kc0u8sfi49feg7tkl9ppc5gstpyxua2 పుట:Sarada Lekhalu Vol 1.pdf/146 104 59302 553787 553637 2026-04-19T09:01:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 553787 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|120|శారదలేఖలు|}}</noinclude>ములేయైనను వీని ఆధిక్యతయేమో నాకు గోచరించుటలేదు. మహాకవియైన రవీంద్రనాథటాగోరుగారికి సర్ బిరుద మీయబడినప్పు డా మహాపురుషు డనెనట. ఏమని? "సర్ రవీంద్రనాథటాగోరు అనుటకంటె నా దేశీయులు 'రవిబాబు' అనుటయే నా కెక్కువ ప్రీతికరము” అని. కాన మహనీయులగు వారికి వారి నామాక్షరములే వేయి బిరుదులపెట్టు. ఎంత గొప్ప బిరుదమైన, వారి నామాక్షరములతో జేరినప్పుడే గదా రాణించును? అయినను స్త్రీలకుగాని పురుషులకుగాని యీ బిరుదులవలన గలుగబోయెడి ప్రయోజనమేమి? మునుపే గౌరవనీయులగువారి కీ బిరుదములవలన గౌరవ మినుమడింప బోదు. గౌరవహీనులగువారి కీ బిరుదులవలన గౌరవము కలుగను కలుగదు. మన ఆంధ్రమహాసభవారు గౌరవనీయులగువారి కీ గౌరవబిరుదములీయు టారంభించినది కీ॥ శే॥ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారికి ఆంధ్రరత్న బిరుద మొసంగుటతో నని జ్ఞాపకము. నాటినుండి యేటేట నొకరికో యిద్దరికో యీ బిరుదములు చదివించుచునేయున్నారు. అన్నిటి కేమిగాని శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారికి దేశోద్ధారక బిరుద మీయబడినదని పత్రికలలో చదివినప్పుడు నిజముగా నాకు నవ్వే వచ్చినది. పత్రికల మూలకముగా, ఉపన్యాసముల మూలకముగా, వితరణలమూలకముగా శ్రీపంతులుగారు దేశమునకు చేయుచున్న సేవ అమూల్యము. వారి సేవానిరతి అసదృశము: వారి దేశభక్తి యనుపమానము: వారి దానశీలత యసామాన్యము: వారి సౌజన్యకారుణ్యాదు<noinclude></noinclude> 5mnio9xiezljejg6uwguh4he39e0z4j పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/43 104 186306 553752 504523 2026-04-18T19:26:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553752 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దానును బంగరు మెఱుఁగుఁ బళ్లెరంబున ముత్తియంబులుఁ బగడంబులుఁ గూర్చిన రంగవల్లికలు రంగమరఁ, గర్పూరదీపంబులు వెలుంగఁ, జెలంగుం జనుదెంచి, 'సంగరంబునఁ దనదు మంగళసూత్రంబు సంగతిగ నిలిపిన సదయునకు జయమంగళం నిత్య శుభమంగళ 'మ్మనెడు పాటలు పాడుచుఁ, గర్ణకుమారుని కీర్తి లోకవిఖ్యాతం బగుగాక యని దీవించి, వారలకు నివాళి దీసి, యప్పరమసాధ్వి యంతిపురంబునకుం జనియె. తరువాత వరుణకాంతలు జలకంబులాడుచు, సన్నెకంటిమీద నునిచిన పసుపుముద్దచందంబున, నరవిందమిత్రుం డస్తగిరిశిఖరంబు నలంకరింపఁ, గాటుకపొడి చల్లినతెఱంగునఁ జీకటులు నలుఁగడల నల్లుకొనియె. క్రేపులఁ దలఁచి మందలనున్న యావులు తిరుగం బడియె. పక్షులు గూండ్లకు బంతులు గట్టె. కమలవనంబులు సొగసె. కలువలు విరిసె. అవ్వేళ గబ్భిగుబ్బెతలు తెచ్చిన బంగరుకుండలసలిలంబుల సంధ్యావందనాది కృత్యంబులు నిర్వర్తించి, యౌవనాశ్వుండు భీమసేన వృషకేతు మేఘవర్ణులును, దక్కుంగల బాంధవులును, బంతి గూర్చుండి బంగరు పళ్లెరంబులు, పటికపు గోరలు, మగఱాల గిన్నెలు, కుందనపు గిండ్లు నునుచి, చలువ పరకాళ కుచ్చెళ్ళ పెళపెళలు, మగరాల కమ్మల ధళధళలు, మొలనూలి చిఱుగంటల ఘణంఘణలు, కంకణంబుల ఝుణంఝణలు, కీలందియల ఝళంఝళలు, మట్టియల గిలుకుగిలుకులం గులుకులు మెఱయఁ, గొమరుప్రాయంపుబడంతులు చతుర్విధాన్నంబులు నింపుతో వడ్డింప, రుచుల నుతియింపుచు భోజనంబు గావించి, గంధోదకంబులఁ గరపదప్రక్షాళనంబు చేసి, గందపొళ్ళం జేతులార్చుకొని, యూడిగంబులు కరంపు వీడియంబు లందియఁ గొలువునఁ గూర్చుండి, పవననందనుని కోపప్రసాదంబులు, వృషకేతను విక్రమంబును, మేఘవర్ణు నేర్పును వినుతించి, ధర్మనందన వసుదేవనందనుల సందర్శనంబు సేయఁగలిగెఁగదా యని తన పూర్వపుణ్యపరిపాకంబునకు మెచ్చుచుఁ బట్టణంబునఁ జాటంబనిచి, యగసాలె పట్టుసాలె కుమ్మరి కమ్మరి చిత్రకార కలాద ప్రముఖులు, రజక క్షౌరక శిల్పాచార్య ప్రభృతులునైన పదునెనిమిది జాతులవారిం బయనము సేసి, తనయొద్దనున్న మన్నీల వజీరుల రాజులం జూచి, 'మీమీ యంతిపురంపుటింతులతో దంతిపురంబునకుం జనుఁడు. కుంతీద్రౌపదీప్రముఖకాంతాజనంబుల<noinclude><references/></noinclude> agegxjif9q1mgldso1e9vs8m67cotjr పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/44 104 186307 553753 504524 2026-04-18T19:38:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553753 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గనుంగొని, ముకుందచరణారవిందంబులకు మ్రొక్కి, గంగాతరంగిణిలో నశ్వమేధావభృధస్నానంబులు సేసి, పావనమూర్తులరై వత్తురుగాక,' యని యాజ్ఞాపించి, సుతుండగు సువేగునిం జూచి, 'నీవు సకలదళంబులం దోడ్కొని మున్నుగా హస్తినాపురంబునకు నీ జననియగు ప్రభావతి తోడంగూడ నీపల్లకుల మున్నిడుకొని పొమ్ము.' {{p|ac|fwb}}ప్రభావతి మౌఢ్యము</p> అని యాజ్ఞాపించిన నతఁ డంతిపురంబునకుం జని తల్లికి మ్రొక్కి, 'అమ్మా, ధర్మనందనుని యజనంబుఁ గనుగొనుటకు గరినగరంబునకుం బోవలెఁ బయనంబుగ' మ్మనవుడు, నవ్వనిత కోపించి, 'పుత్రకా, నీ కేమిటికి వెఱపట్టె? ఈ ధనంబు లీధాన్యంబులు నీరూకలు నీకోకలు నీయిండ్లు మొదలగు సంపదలు, వీటిఁ బుచ్చి న న్నెందుకు వెడలి రమ్మనియెదు? మదిమది నుండి రాజ్యంబు విడిచి పోవుటకు నీ కేల బుద్ధి పుట్టె? పురజనులు, మీరలు నెచ్చటకేనియుం బొండు; నీ వేమి చెప్పిన నే వచ్చుదానం గాను.' అనిన సువేగుఁడు, 'అమ్మా, ఇంత మూఢత్వంబు, నింత సంసారభ్రాంతియు, నీ కేల వచ్చె? ధర్మజుని అశ్వమేధంబున వేదవ్యాసప్రముఖులైన మహామునులును, నింద్రాదిదేవతలును, దేవదేవుఁడైన వాసుదేవుండును, రుక్మిణీసత్యభామాప్రముఖ లైన యద్దేవుని పట్టమహిషులును జనుదెంతురు. వారల సందర్శనంబు వలనఁ బంచమహాపాతకంబులు బంచబంగాళంబులై పాఱిపోవుం గావున మఱుమాటాడక లేచి రమ్మ'నిన, 'నోరీ! మాతాతతరంబున, మాతండ్రితరంబున నాతరంబున నణుమాత్రం బేని పుణ్యంబు సేసి యెఱుంగము. ఈ ముదుసలివయసున నీ తొడుసులు నాకు వలదు. ధర్మనందన వసుదేవనందనుల దర్శింపకున్న నాకు గోరంత కొఱంతలేదు. ధర్మజునకు యాగంబుమీఁద విశ్వాసంబు, శౌరికి ధర్మరక్షణంబునఁ బ్రేమ, నాకు సంసారంబుమీదఁ భ్రాంతి, ఇది యెవ్వరికిం దప్పింప శక్యంబు కాదు. వేయేటికి? నేను యాగంబునకు వచ్చుదానను గాను, వలయునేని మీరు సనుండు.' అనిన సువేగుఁడు యౌవనాశ్వ భీమసేనులకు నాయమ్మ పల్కులు పల్కరించి కొంత తడవు నవ్వించి, యంతటం బరిచారికాజనంబులచే నయ్యంబం<noinclude><references/></noinclude> 2kpy5vmf0fmhhesxftudfys3rlec6im పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/45 104 186308 553754 504525 2026-04-18T19:48:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553754 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బట్టి తెప్పించి మొఱ్ఱో యని కూఁతలు పెట్టుచు నీడిగిలంబడ, నెట్టకేలకుం దిగిచి యందలంబుపై నిడికొని కరిపురంబునకుఁ బయనమయ్యె. పల్లకులందలంబులు, భద్రగజంబులు, కొలారుబండ్లు, గుఱ్ఱపుమోటులు, వేసడములు, మహోష్ట్రములు మొదలైన వాహనంబు లెక్కి, పురంబులోనం గలుగు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాది పౌరజనంబులు రాజుకంటె నయిదుదినంబులు మున్నుగా హస్తపురంబునకుం జనిరి. కరితురగస్యందనములు, వీరభటసమూహంబు లిరువంకలఁ గొలువఁ, జలువలు వెదజల్లు వెల్లగొడుగులనీడ, యువనాశ్వ పృషదశ్వ తనూజులును, గుఱ్ఱముతో వృషకేతు మేఘవర్ణులును, గతిపయప్రయాణంబుల హస్తినాపురంబునకుఁ జేరవచ్చచుండ, నిరువదియామడదూరంబున నిలిచి, భీముడు యౌవనాశ్వుం గాంచి, 'కాంచనాహార్యధైర్యా, మీరు విజయంబు సేయువిధంబు మున్నుగా మా యన్నతో నెఱింగించి యెదురుగ తోడి తెచ్చెద, వృషకేతుండు మిమ్ముం గొలిచివచ్చు' నని పలికి, శీఘ్రంబుగఁ గరిపురంబునకుం జని యంద నవరత్నఖచితం బైన సభామందిరంబున బంగరు సింగపుమోము గద్దెయందుఁ దమ్ములు గొలువ, రెండవ యాఖండలుండన, నిండోలగంబైన యగ్రజుం గాంచి, సవినయంబుగా సాష్టాంగనమస్కారంబు గావించిన, నతండు దీవించి, దిగ్గున లేచి కౌఁగిట జేర్చుడు నర్జునుండును, మాద్రీనందనులును దనకు వందనములు సేసిన, వారల నభినందించె. అంతఁ గౌంతేయాగ్రజుండు 'సమీరకుమారకా, సేమమే?' యని యడిగినఁ గరకమలంబులు ఫాలతలంబునఁ గీలించి 'రాజోత్తమా, యుత్తమంబైన నీ కరుణ గలిగియుండ సేమంబునకుఁ గొఱంత యేమి? భద్రావతీశ్వరుండగు యౌవనాశ్వుం డశ్వమేధాశ్వంబుఁ గొనివచ్చె. విశ్వంబున నీ కీర్తి శాశ్వతంబుగా వర్తించు, అతనిసతి ప్రభావతి సఖీసహస్రంబుతోఁ బాంచాలిని కనుగొన వచ్చుచున్నయది. వృషకేతుండు భండనంబున నప్పుడమిఱేని మెప్పించె. మేఘవర్ణుండు సాదఘళంబుగా నధ్వరాశ్వంబుఁ బట్టి కొని వచ్చె' ననిన, ధర్మనందను డానందకందళితాంతరంగుఁడై 'మనవిజయంబు యాజ్ఞసేనికి నెఱింగించి రమ్మ'నిన, నతఁడు నంతిపురంబునకుఁ జనినఁ, గనకపీఠంబునం గమలకర్ణికాసీనయగు కమలాదేవికరణిం గూర్చున్న ద్రౌపతి దిగ్గన గద్దియ డిగ్గి, యెదురు వచ్చి వాయుతనూభవుం గనకపీఠంబున నునిచి, 'విజయంబు గలుగ విజయం చేసితిరే? కర్ణనందనుఁడును నా మనుమఁడు మేఘవర్ణుండును సేమంబున నున్నవారె?' అని యడుగుచు నతని కడిందిఱొమ్మునఁ గనుపట్టు వెడదగాయంబులు<noinclude><references/></noinclude> 02x1hewv6zobs44er9469j5vsinv5da పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/46 104 186309 553760 504526 2026-04-18T23:27:21Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553760 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కరకమలంబుల నిమురుచుఁ గుశలప్రశ్నంబులు వేసిన, 'భద్రేభయానా, భద్రావతీశ్వరు రాణియగు భద్రావతీ ముంజువాణి వేవురుచెలులతోడంగూడ నిన్నుఁ జూడ వచ్చుచున్నయది. కావున నీవు నలంకరించుకొని యమ్మించుఁబోడికి నెదురుఁగ రమ్ము. మనకు రక్షకుఁడైన పుండరీకాక్షుండు ద్వారకానగరంబునకు నరిగెనో? ఇచ్చట నున్నవాఁడో?' యని యడిగినఁ గృష్ణ యిట్లనియె. ఆ శ్రీకృష్ణుండు నల్లదె నీలంపుటుప్పరిగలో నున్నవాఁడు, అనిన సంతోషభరితాంతరంగుఁడై, నీమందిరంబున నిందిరాకాంతుఁ డున్నవాఁడు గావున నీవు ధన్యవు. తామసింపక శృంగారంబు సేసికొని యంగనాజనులు, నీవునుం బ్రభావతికి నెదురుగా రండని' పలికి యనిలనందనుండు చనినఁ, బాంచాలియుఁ బన్నీట జలకంబులాడి, వెన్నల న్నిరసించు సన్నహొన్నంచువలువ విన్నాణంబుగాఁ గట్టి, నెఱికురుల విరులు దుఱిమి, సిస్తుగాఁ గస్తూరిరేఖ ఫాలతలంబునం దీర్చి, తారహారంబులు, హీరకంకణంబులును, జారు కాంచీపుంజీరంబులు మొదలగు సొమ్ములు ధరించి, యలంకృతలైన సఖీసహస్రంబులతోఁ గూడ జీవరత్నంపుగుంపుల నుల్లసిల్లు పల్లకిపై నెక్కి, హల్లకపాణులు వింజారమంబులు వీవ, నంతఃపురసంచారులగు కంచుకులు సందడి యెడగలుగం, జడియ వెడలునపుడు యుధిష్ఠిరుండును, నచ్యుతుండును, శృంగారితంబులైన యేనుఁగులపై నెక్కి, శంఖ కాహళ దుందుభి మృదంగ పటహ మురజ ఝల్లరీ జర్ఝరీ డిండిమ ప్రముఖవాద్యంబులు, భూనభోంతరంబున బోరు కలంగ మ్రోయ, నెదురు వచ్చిన, యౌవనాశ్వుం డధ్వరాశ్వంబు గానుకగా నునిచి, దండప్రణామంబు సేసినం, బాండవాగ్రజుం డేనుంగు డిగ్గి, యానృపాలునిం గౌఁగిటం బొదివి 'నరవరేణ్యా! భీమార్జుననకులసహదేవులట్ల నీవును నాకు నొక్కసహోదరుండవు. ద్రౌపదితోఁ గూడఁ బ్రభావతి నంతిపురంబునకుఁ బంపు' మనుటయు నతండు నట్ల కావించె. తదనంతరంబ, యౌవనాశ్వ మహీశ్వరుండు గోవిందుని పదారవిందంబులు తనశిరంబున సోఁకం బ్రణమిల్లి, 'ముకుందా, నందనందనా, అరవిందనయనా, ఇంద్రాదివందితా, భవదీయపాదారవిందంబులు దర్శింపఁగంటిఁ గావున నా జీవనంబు సఫలంబు. భవదీయభక్తులైన వృషకేతు మేఘవర్ణులు మెట్టిరి గావున మా పురంబు సిరులకుం గాపురంబు. ధర్మజుని జన్నంబున<noinclude><references/></noinclude> drt2cffnvsh7df996gg6seh2coatgd5 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/47 104 186310 553766 504527 2026-04-19T01:51:09Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553766 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కొదవెంగావున నీ తురంగమంబును జనహృదయంగమంబు. ఇన్నిటికి శేఖరంబుగ నీకు జోడు కోడెయైన యర్జునిం జూడఁగలిగె' నని పలుకు నవసరంబున, సవ్యసాచి యవ్విశ్వంభరాధీశ్వరుఁ బరిరంభణం బొనర్చి, 'నీవు నాకు ధర్మనందనునట్ల పూజ్యుండవు. నాచేసిన పురాకృతపుణ్యంబున నీ సందర్శనంబు గలిగె,' నని కొనియాడె. అప్పుడు పాంచాలికిఁ, గుంతీదేవికిఁ, బ్రభావతి చాగిలి మ్రొక్కిన, వార లక్కోమలి నక్కునం గదియించి మిక్కిలి గారవించిరి. అంత భద్రావతీశ్వరపుత్రుండైన సువేగుఁడు, ధర్మజప్రముఖులకు వందనంబు సేసి, 'కర్ణనందనునికతంబున శ్రీవాసుదేవచరణారవిందంబులు సేవింపగలిగె. మా భాగ్యంబు నెంతని వినుతింతుము? ఇంక, సర్వకాలంబులందును నద్దేవునిచరణకమలంబులు స్మరియింపుచునుండగలవారము. శ్రీకృష్ణునికి నర్పితంబుగాని రాజ్యంబు ధనంబును వ్యర్థంబులు. మఖతురంగంబువెంట నన్నుఁ బనుపుము. ఎదిరించు మేదినీపతుల నెల్ల చెల్లాచెదురుగాఁ బాఱంద్రోలి, నేన యశ్వంబు రక్షించుకొని వచ్చెద,' నని పలికిన సువేగునిఁ గౌఁగిటంజేర్చి, శ్రీహరి కరుణాకటాక్షవీక్షణంబుల వీక్షించె. వృషకేతుండును నందనందన పురందరనందనులకు వందనంబు గావించిన, నందఱుం బ్రమోదకందళితమానసులై కరినగరంబునకుం జనుదెంచిరి. అంత, రుక్మిణీకాంతుండు దంతిపురంబున నొక్కనెల వసియించి, ధర్మతనయుం జూచి 'యిందునకుఁ బదునొకండవనెల చైత్రశుద్ధపౌర్ణమాసినాఁడు జన్నంబు నొనర్చుట ముఖ్యంబు గావున నిప్పు డుగ్రసేనభూపాలకునిచే సంరక్షితంబైన ద్వారకాపురంబునకుం జనియెద యౌవనాశ్వు, నర్జును, భీమునిం దక్కినయోధులను దురగంబుఁ గావం బంపవలయు. నీవు ద్రౌపదీసమేతంబుగా యాగదీక్షఁ గైకొని సావధానంబుగా నుండదగినది. యాగదీక్షాకాలంబున మమ్ముం బిలిపించితివేని బంధుమిత్రసమేతంబుగా వచ్చెద' మని పలికిన, గోవిందుని కందువ యెఱింగి కుంతీనందనుఁడు బహువిధములగు బహుమానములు గావించి వీడ్కొలిపిన, సంపత్పారంపరీనిర్జితాలకాపురంబైన ద్వారకాపురంబునకు వనజాక్షుండు విజయంబు సేసె. {{p|ac|fwb}}వ్యాసుఁడు మరల వచ్చుట</p> తదనంతరంబ కృష్ణద్వైపాయన మహామునీంద్రుండు సన్నిహితుండగుటయు ధర్మతనయుండు వినయంబున వందనంబు సేసి, యర్ఘ్యపాద్యాది<noinclude><references/></noinclude> 0gr9knn9i5a0j58qot915t77mydqovs పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/48 104 186311 553769 504528 2026-04-19T03:13:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553769 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విధులం బూజించి, నవరత్నపీఠమున నునిచి, కృతాంజలియై, 'మహాత్మా, మున్ను మరుత్తుండను మహారాజు యాగం బెవ్విధంబునం జేసె? నానతి యొసంగవలయు' ననిన, వ్యాసమునీంద్రుఁడు నరేంద్రునిం జూచి, 'తొల్లి హరిధ్యానసమాయత్తచిత్తుండైన మరుత్తుం డశ్వమేధం బొనర్పఁగోరి బృహస్పతి నాచార్యునిగా వరించిన, నింద్రుం డసూయచే నతనిఁ బోవలదని నివారింప, నతని తమ్ముండైన సంపర్తుని గురువుగా వరియించి యాగం బొనర్చునపు డింద్రాగ్నులు విఘ్నంబు సేయందలంచిన, వారల నిరాకరించి యాగంబు నెఱవేర్చి యామరుత్తునకు వరంబు లొసంగి సంవర్తుండు యథేచ్ఛంబుగాఁ జనియె. అన్నరేంద్రుండు సర్వభూతనివాసుండైన శ్రీనివాసదేవుని సాయుజ్యంబు వడసె' ననిన, విని, యమతనయుం 'డేధర్మము వలన నరుండు భవబంధంబులఁ దరించు? నాధర్మం బానతీయవలయు ననుటయు, సాత్యవతేయుండు కౌంతేయునిం గాంచి, 'వేదశాస్త్రంబులు సదివి, తద్దర్థంబు నెఱింగి తాను నాచరించిన బ్రాహ్మణుండును, నయమార్గంబున భూమండలంబును పరిపాలించిన క్షత్రియుండును, వంచన లేక క్రయవిక్రయాదులు గావించిన వైశ్యుండును, శ్రీమన్నారాయణస్మరణయు బ్రాహ్మణపూజయుం గావించిన శూద్రుండును, నైహికాముష్మికంబులసుఖంబుం గాంతురు. ఇంక స్త్రీజనులలక్షణంబు వినుము. చక్కని పురుషునిం గన్నఁ గూడఁజనుటయు, బిత్తరంపుఁజూపున ఱెప్ప లల్లార్చుటయుఁ, జెలికత్తెలఁ బిలుచువిధంబున నుచ్చైస్వనంబునఁ కూయుటయు, బలుమాఱు నవ్వుటయుఁ, బొరుగిరుగులకుఁ బోవుటయు, మేర మీఱి పలుకుటయు, సారెసారెకుం బైట జార్చుటయు, మిగుల సిగ్గరికత్తెయుంబలె మెలంగుటయుఁ, బరపురుషులచంక నున్న పసిబిడ్డల ముద్దాడుటయు, గోడ నెక్కి చూచుటయుఁ, గొప్పు దిద్దుకొనుటయు, నత్తమామలకు మగలకు మాఱు మలయుటయు, నివి మొదలగు వికారంబులు జారకాంతల లక్షణంబులు. మఱియుఁ బువ్వులమ్ము పువ్వుఁబోడితోడ, దాసీజనులతోడ, సైరంధ్రులతోడ, దాదులతోడ, మగలు విడిచిన సతులతోడ, మంత్రసానులతోడ, దూతికలతోడ, జోగురాలితోడ, నాకులమ్మెడి యంగనతోడ, వితంతువుతోడఁ గూడి చెలిమి చేయుదానిం గుంటయని యెఱుంగవలయు. ఈ చెప్పిన దుష్టసతులలో దూతయు, దాదియు నను నిరువురు జారిణికి సాహససముద్రంబు గడడం దెప్పలు. కావున మానధనులగు పురుషులు చానలకుం జనవీయం జనదు. జననంబు మొదలు మరణపర్యంతంబు వారల నమ్మంగూడదు. కావున నత్తయు, మామయు, మగండుకు, గత్తులబోనులవలె మత్త<noinclude><references/></noinclude> kjq9l7b16ckhrya0urca76h927vet35 553773 553769 2026-04-19T04:07:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 553773 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విధులం బూజించి, నవరత్నపీఠమున నునిచి, కృతాంజలియై, 'మహాత్మా, మున్ను మరుత్తుండను మహారాజు యాగం బెవ్విధంబునం జేసె? నానతి యొసంగవలయు' ననిన, వ్యాసమునీంద్రుఁడు నరేంద్రునిం జూచి, 'తొల్లి హరిధ్యానసమాయత్తచిత్తుండైన మరుత్తుం డశ్వమేధం బొనర్పఁగోరి బృహస్పతి నాచార్యునిగా వరించిన, నింద్రుం డసూయచే నతనిఁ బోవలదని నివారింప, నతని తమ్ముండైన సంపర్తుని గురువుగా వరియించి యాగం బొనర్చునపు డింద్రాగ్నులు విఘ్నంబు సేయందలంచిన, వారల నిరాకరించి యాగంబు నెఱవేర్చి యామరుత్తునకు వరంబు లొసంగి సంవర్తుండు యథేచ్ఛంబుగాఁ జనియె. అన్నరేంద్రుండు సర్వభూతనివాసుండైన శ్రీనివాసదేవుని సాయుజ్యంబు వడసె' ననిన, విని, యమతనయుం 'డేధర్మము వలన నరుండు భవబంధంబులఁ దరించు? నాధర్మం బానతీయవలయు ననుటయు, సాత్యవతేయుండు కౌంతేయునిం గాంచి, 'వేదశాస్త్రంబులు సదివి, తద్దర్థంబు నెఱింగి తాను నాచరించిన బ్రాహ్మణుండును, నయమార్గంబున భూమండలంబును పరిపాలించిన క్షత్రియుండును, వంచన లేక క్రయవిక్రయాదులు గావించిన వైశ్యుండును, శ్రీమన్నారాయణస్మరణయు బ్రాహ్మణపూజయుం గావించిన శూద్రుండును, నైహికాముష్మికంబులసుఖంబుం గాంతురు. ఇంక స్త్రీజనులలక్షణంబు వినుము. చక్కని పురుషునిం గన్నఁ గూడఁజనుటయు, బిత్తరంపుఁజూపున ఱెప్ప లల్లార్చుటయుఁ, జెలికత్తెలఁ బిలుచువిధంబున నుచ్చైస్వనంబునఁ కూయుటయు, బలుమాఱు నవ్వుటయుఁ, బొరుగిరుగులకుఁ బోవుటయు, మేర మీఱి పలుకుటయు, సారెసారెకుం బైట జార్చుటయు, మిగుల సిగ్గరికత్తెయుంబలె మెలంగుటయుఁ, బరపురుషులచంక నున్న పసిబిడ్డల ముద్దాడుటయు, గోడ నెక్కి చూచుటయుఁ, గొప్పు దిద్దుకొనుటయు, నత్తమామలకు మగలకు మాఱు మలయుటయు, నివి మొదలగు వికారంబులు జారకాంతల లక్షణంబులు. మఱియుఁ బువ్వులమ్ము పువ్వుఁబోడితోడ, దాసీజనులతోడ, సైరంధ్రులతోడ, దాదులతోడ, మగలు విడిచిన సతులతోడ, మంత్రసానులతోడ, దూతికలతోడ, జోగురాలితోడ, నాకులమ్మెడి యంగనతోడ, వితంతువుతోడఁ గూడి చెలిమి చేయుదానిం గులట యని యెఱుంగవలయు. ఈ చెప్పిన దుష్టసతులలో దూతయు, దాదియు నను నిరువురు జారిణికి సాహససముద్రంబు గడవం దెప్పలు. కావున మానధనులగు పురుషులు చానలకుం జనవీయం జనదు. జననంబు మొదలు మరణపర్యంతంబు వారల నమ్మంగూడదు. కావున నత్తయు, మామయు, మగండుకు, గత్తులబోనులవలె మత్త<noinclude><references/></noinclude> dxqjiunxjmdbno9p6tqqak25y366xkw పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/49 104 186312 553774 504529 2026-04-19T04:43:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553774 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కాశినులం గదల మొదలకుండఁ గాపాడం దగు. కొమరుబ్రాయంపుటింతులచిత్తము సదా పరపురుషభోగాయత్తంబై యుండునని యెఱుంగుము. విధవ యగు వెలంది యుపవాసంబులచే మేనుఁ గృశింపచేయక, పాలు పెరుగు ఘృతంబు మొదలగు రసద్రవ్యంబులచే దేహంబుఁ బోషించుచు, మలినవస్త్రంబులు గట్టక, మడుంగులు గట్టుకొని, మైపూతలు బెట్టుకొని, దానధర్మంబులు సేయక, వడ్డీ కిచ్చి కూడబెట్టుచు, తల్లిదండ్రులకింద నడంగక, పొరుగిరుగిండ్లం దిరుగుచు, హరిస్మరణంబు లేక దుర్భాషలం గూయుచు నుండెనేని, పెనిమిటితోడం గూడ దానును గల్పాంతరంబులు నరకకూపంబునం గూలు. నాలుకయుం, దాలువులు, నధరంబులు, నీలవర్ణంబులై యెవ్వతె కుండు, నేతరుణి పాదంబులు నేలమోపకయుండు, నత్తరుణి శీఘ్రంబుగ వైధవ్యంబు వహించు. విధవాసంగమంబు సేసిన యధముండు దాను జేసిన పుణ్యంబులెల్లం గోల్పడి నరకంబునం బడు. బాల్యంబునఁ దల్లిదండ్రులమఱుంగునఁ, బ్రాయంబున మొగనియొద్ధ, వార్ధకంబునఁ దనయునికడ నుండవలయుంగాని, స్త్రీలకు స్వాతంత్ర్యం బెన్నటికిం జెల్లదు. ఇది నీ యడిగిన ప్రశ్నంబునకు నుత్తరంబు. నీవు జూదరుల, నాస్తికుల, నసూయాపరులఁ, గొండెంబులు పలుకువారలం జెంతంజేరక ప్రజలం బాలింపుము. పోషింపఁబడిన జనులచేత ధనంబుచే ధర్మంబును, ధర్మంబునఁ గీర్తియుఁ, జేకుఱుఁ గావున, రాజులకుం బ్రజాపరిపాలనం బవశ్యంబును జేయవలయు. తనకీర్తి మర్యులకుఁ గీర్తనీయంబై యుండ నారాయణచరణారవిందసంస్మరణశీలుండై యున్న భూపాలుం డిహంబున భోగంబును, గీర్తిని, బరంబునఁ గైవల్యంబును గాంచు. శమదమసదాచారసంపన్నుండైన బ్రాహ్మణుండేనియు, శ్రీవిష్ణుభక్తివిరహితుం డయ్యెనేని చండాలుండని యెన్నుము. చండాలుండేనియు శ్రీహరిపదాయత్తచిత్తుఁడైనఁ త్రైలోక్యపూజ్యుండగుం గావున, నీవు శ్రీవాసుదేవచరణారవిందంబులు త్రికరణంబుగ నమ్మి సుఖంబున నుండు' మన, ధర్మనందనుఁడు, 'మహానుభావా, ఆ భక్తి ఎవ్విధంబున వచ్చు? లక్ష్మీవల్లభుం డెవ్వారల గృహంబుల నిలుచు?' నని యడిగిన, నమ్మునీంద్రుండు తన శక్తివంచన చేయక పితృదినంబులు నెఱవేర్చునతండును, దీర్థయాత్రాపరుండును, దానశీలుండయ్యు వినయపరుండగువాఁడును, బరకాంతాసంగమంబు గోరనివాఁడుగను, ధీరుండును, సత్యము శుచిత్వమును గలుగువాఁడును, జననీజనకుల బాంధవులం దోషించువాఁడును, బాపభీరువును,<noinclude><references/></noinclude> gyn6vkpw1p3qr62bf3lwtvlq86gnjom పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/50 104 186313 553775 504530 2026-04-19T04:57:36Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553775 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సప్తసంతానంబులం బడసినవాఁడు, దయాపరుండు, చేసినమేలు మఱవనివాఁడు, తక్కుంగల పుణ్యపురుషుల గృహంబుల మహాలక్ష్మి వాసంబు సేయు, నచ్చటనే శ్రీమన్నారాయణుఁడు నెలకొనియుండు. జూదగాని, దుష్టుని, దుర్వ్యసనశీలునిం జోరునిఁ, జారుని, సజ్జనదూషకుని, నిర్దయు, గృహదాహకు, లుబ్ధుని, స్వోదరపోషకుని గర్వోద్ధతుం బెడఁబాసి లక్ష్మి, పరాన్నభోజనశీలుఁడగు బ్రాహ్మణుని వేదాదివిద్యలు విడిచినతెఱంగునఁ దొలంగి పోవు. ధర్మనందనా, తొల్లి నీవు దుర్వ్యసనాసక్తుండవై జూదం బాడితి వది కారణంబుగా నింత యనర్థంబు సంభవించె. ఇంక నెన్నండట్టు లాచరింపకుము. కృష్ణపదభక్తిపరాయణుఁడవయి యుండుము. వ్యతీపాతవైధ్రుతి, సంక్రాంతి, యమావాస్య మొదలగు పితృదినంబులఁ, దీర్ఘయాత్ర, వ్రతచర్యాదినంబుల వనితాసమాగమం బొనర్చినవానియొద్ద లక్ష్మి చేర వెఱచు. నీకుం దెలియవలయు నర్థంబులు దేటపఱిచితి. ఇంకఁ దామసింపక జన్నం బొనర్పవలయు. కావున సకలశ్రేయంబులకు హేతువయిన శ్రీకృష్ణదేవుం బిలిపింపు' మని యానతిచ్చె. {{p|ac|fwb}}ధర్మజుపనుపున భీముఁడు ద్వారక కేగుట</p> అంత నజాతశత్రుండు వైరిసేనాభీముండైన భీముం బిలిచి, 'నీవు ద్వారావతికిం జని యాగయోగ్యంబైన చైత్రమానసంబు సేరవచ్చెంగావున, మంత్రిపురోహితసామంతదండనాథబంధుమిత్రపుత్రకళత్రసమేతంబుగా, రుక్మిణీకాంతుం దోడ్కొనిర'మ్మని పంచిన, నన్నపాదంబులకు మ్రొక్కి వృకోదరుండు సత్వరంబుగా ద్వారకానగరంబునకుం జని, దేదీప్యమానదివ్యరత్నప్రభాధగద్ధగితనిజారంబైన హజారంబు సొచ్చె. {{p|ac|fwb}}శ్రీకృష్ణుని భోజనసమయము</p> చిరత్నరత్నమయంబులును, గాంచనసమంచితంబులును గలధౌతనిర్మితంబులు నైన జోడ పక్కెర పల్లంబు జానంబు వంకవన్నెలు మున్నగు ముస్తీదులతోఁ గైజామోఱ లల్లార్చుచు రాజిల్లు వేనవేలు పడివాగె తేజీలును,<noinclude><references/></noinclude> 0s9imp69qoie26f0iyucainpc8u9c51 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/51 104 186314 553776 504531 2026-04-19T05:07:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553776 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నడగొండలు సెలయేఱులం బొలుపొందుకైవడి మడధారాదూసరితగండస్థలంబులైన వేదండతండంబులును, వివిధాయుధసంపన్నంబైన వీరభటవ్రాతంబును, బొలుపొందు కక్ష్యాంతరంబులు గడచి, ఫణిహారిం గనుంగొని తనరాక లోకరక్షకుండైన పుండరీకాక్షునితో విన్నవింపుమని పంచుటయు, వాడునుం జని, దివ్యరత్నప్రభానికరంబులచే నంధకారంబు దూరంబునఁ ద్రోయుచుఁ, గాలాగరు సాంబ్రాణి గంధసార కర్పూరధూపంబుల పరిమళంబులచే భూనభో౽౦తరంబులు వాసింపంజేయుచు, బంగరుచెఱంగుల రంగుమెఱయు చీనిచీనాంబరంబుల తెరలునుఁ, గొత్తముత్తియంపుజల్లుల నుల్లసిల్లుచు గందొవలం విందుసేయు చెందొవల చందువలును, రత్నప్రభాడంబరంబులైన రత్నకంబళంబులును. జిలుకలుఁ, గోయిలలు, గోరువంకలుఁ, జకోరంబులు, శతపత్రంబులుఁ<ref>శతపత్రము = చెగ్గురుపిట్ట</ref>, బావురంబులు, మయూరంబులు, లేళ్లు, దుప్పులు, జింకలు మొదలగు సకలవిషదోషపరిహారక్రియానిపుణచాతురీధుర్యంబులగు మృగపక్షిసమూహంబులచే నభిరామంబును, మల్లెలు, మొల్లలు, జాజులు, విరజాజులు, పొన్నలు, పొగడలు, సంపంగలు, గోరంటలు, చేమంతులు, చెందామరలు, చెంగలువలు మొదలగు పూవులతోరణంబులచే నేత్రానందకారణంబును నైన భోజనాగారంబున మృగమదంబున నలికిన, ఘనసారరజంబున రంగవల్లికలం దీర్చిన చతురస్రవేదికయందు, బాలభానుప్రభాభాసమానరత్నపీఠంబున సుఖాసీనుండై, నవరత్నమయంబగు పళ్ళెరంబున దేవకీదేవి వడ్డింపఁ, దుమ్మిపూవులచందంబునఁ దెల్లనగు రాజాన్నంబులును, సువర్ణచ్ఛాయారూపంబులగు సూపంబులును, సద్యోఘృతంబులును, నప్పడంబులు, వడియంబులుఁ, దాలింపులు, సంభారపరిమళగంభీరంబులై నులివెచ్చనగు పడిదెంబులు గల వంటకంబులుఁ, దియ్యచేరులు, మోరుఁజేరులుఁ, బంచదారలు, బానకంబు లానవాలుఁ, జక్కెరపొంగలి, దధ్యోదనంబు, పులియోర, యెళ్ళోగిరంబు, నతిరసంబులు, వడలు, నప్పంబులు, దోసె, లిడ్డనలు, లడ్డుకంబులుఁ, బేణీలు, సుకియలు, గుడుములు, మణుంగుబూలు, సారె<noinclude><references/></noinclude> dozwb8s2uxag2wadabyyeolydhy1u55 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/52 104 186315 553777 504532 2026-04-19T06:07:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553777 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సత్తులు, మనోహరంబులు, నరిసెలు, నమృతఫలంబులు, మండెగలు మొదలగు భక్ష్యవిశేషంబులును, బాయసంబులు, శిఖరిణులు<ref>శిఖరిణులు = సిగరులు, మజ్జిగపులుసు</ref>, ఫలరసాయనంబులు, బచ్చళ్ళుఁ, బెరుఁగు, లూరుఁగాయలు, వరుగులు నాదియౌ భక్ష్యభోజ్యలేహ్యచోష్యపానీయంబులును, గుందేలు, ఉడుము, ఆళువ, లేడి, యడవిపంది మొదలైన భూచరంబులును, గండె, వాలుగ, జెల్ల, మలుగు, కొఱ్ఱ, మారువాయి, బొమ్మడాయ, యిసుకదొందు, ఉలచ, తిరికిచేఁప, తాబేలు మొదలగు జలచరంబులును, గౌజు, పూరేడు, పొట్టిపిట్ట, పొన్నంగి, వెలిచె, బెడిచె, లావుక, కేరజము, బెళవ, పొడబెళవ, పచ్చబెళప, కాటిగాఁడు, ఉల్లంకి, చింతవంకలు, లకుముకి, వంగపండు మొదలగు ఖేచరంబులుం దెచ్చి, లవణామ్లమరీచికాజారకకర్పూరమృగమదాది పరిమళసంభారసంభృతంబులుగాఁ బాకం బొనర్చి, బంగరుగిన్నెలఁ బటికంపుదొన్నెల నుంచి యమర్చియుండ, రుక్మిణీసత్యభామ లిరుకెలంకులఁ గంకణఝణఝణాత్కారంబులు తోరణంబులుగా సురటులు వీవ, జాంబవతీమిత్రవిందలు చేపావడలు వీవ, లక్షణాసుదంతలు బంగారుగిండ్లతో గంధోదకంబులు పూని యాయత్తముగా నిలువ, భద్రయుఁ గాళిందియుఁ జెలికత్తెల నంపి యియ్యైవస్తువులు వేవేగఁ దెమ్మని తీవరించుచుండ, నారగించుచు నుండిన సమయంబున నప్పుండరీకాక్షునితో దౌవారికుండు భీమసేనురాక నెఱిగించిన, నవ్వి, నవ్విరించిగురుండు 'వాకిట నిలుపనేల? వేగఁ దోడుకొని రమ్మ'ని పంచిన వాయునందనుండు నందనందనుని సన్నిధికిం జని సాష్టాంగదండప్రణామంబు సేసిన; {{p|ac|fwb}}శ్రీకృష్ణ భీముల సంభాషణము</p> వాసుదేవుండు మందహాసభాసురవదనారవిందుండై, 'బావా, నీభావంబున నున్నకార్యంబులన్నియుఁ గుశలప్రశ్నంబును, వెనుక నొడువుదువు. ఇంతియకాని మున్నుగ బుద్ధిమత్కృత్యంబగు భోజనంబు నాకంఠపరిపూర్తిగఁ గావింపుము. అట్లుగాక నీ కెద్దియుం దోచదు. నీపలుకులకు శంక వలదు. నీకరణి బహుభక్షకు లగస్త్యకుంభకర్ణాదులు కొందఱు గలరు. నీ వేమిటికి సిగ్గుపడియెదపు?' అనిన ననిలనందనుండు మందస్మితంబు వదనం<noinclude><references/></noinclude> 4ib76z750wg89e3e4vzt0k7ms6xrzuh పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/53 104 186316 553778 504533 2026-04-19T06:20:34Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553778 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బునం గనుపట్ట, 'యాదవేంద్రా, నీవింత లెన్నెన్ని పల్కరింతు? కడుపారం దల్లిపాలు గ్రోలియుఁ జాలక పురిటింటిలోనఁ బూతన చనుబాలు గ్రోలి దానిం బిలుకు మార్చితివి. జనని పెట్టిన యుగ్గునం తృప్తినొందక వ్రేపల్లెలో నున్న వెన్నలు పాలు నిచ్చనిచ్చలు మ్రుచ్చరించితివి. యశోదమ్మ పొత్తున భుజియించియు, నాఁకలి యడంగమి, నింద్రయాగవిఘాతంబు సలిపి, యతనికై యుంచిన యన్నరాసులు భక్షించితివి. మాత యొసంగు నేతికజ్జాయంబులు చాలక కుచేలుచేతి యడుకులు నాఁచికొని మెసమితివి. యుగాంతకాలమునఁ జరాచరపరిపూర్ణంబులైన బ్రహ్మాండకోటు లుదరంబులోఁ గూడికొని యుండిన నఱకొఱఁతయగానిఁ తృప్తుండవుం బోలె నుండలేదు. ఇట్టి నీపొత్తునం భుజియింపు మనిన నాకుం బొసంగునె? నీవు మెండైన దీపనంబు గలవాఁడవు.' అని పరిహాసంబు లాడుచుండ, వాయునందనునిఁ గనకాసనంబునఁ గూరుచుండ నియమించి, సరసాన్నంబులం దృప్తి నొందించి, యొక్కరమ్యస్థలంబున వసియించి, యంగరాగంబులు, కర్పూరతాంబూలంబులుఁ, గుసుమమాలికలు, నవరత్నఖచితభూషణంబులు, దుకూలంబులు, వలయు వస్తువాహనంబులు బహుమానంబు లొసఁగి, వచ్చినకార్యం బడిగి, యతనివచనంబు లాలకించి, కృతవర్మం బిలిపించి, 'పౌరజనులకెల్ల నజాతశత్రుని యశ్వమేధాధ్వరంబు గనుగొనుటకుఁ బయనంబు గండని చాటింపఁ బనుపుము. నగరసంరక్షణంబునకు మాతండ్రియగు వసుదేవుని, నన్నయగు బలభద్రుని నియోగించుచున్నవాఁడ' నని యానతిచ్చె. {{p|ac|fwb}}శ్రీకృష్ణుఁడు సకలజనులతో హస్తినాపురమునకు వచ్చుట</p> అపుడు భోజభూనాయకుండు కల్పాంతకాలతంతవ్యమానధారాధరగర్జితానుకారియైన ప్రయాణభేరి వేయించినఁ, బురజను లాబాలగోపాలంబుగాఁ బయనంబు వెడలిరి. అప్పుడు పుండరీకాక్షుండు వసుదేవునిచెంత కరుదెంచి, నమస్కరించి, తన పయనంబుం దెలుపుటయు, నతండు కుమారుం జూచి, 'నీవు ధర్మజు నర్వమేధాధ్వరంబు నవలోకింపం బోవునప్పుడు, హరికథావిముఖుండును, నన్యాయవర్తనుండును, ధర్మార్థకామరహితుండును, దపోవర్జితుండును, మిత్రవంచకుండు, స్వామిద్రోహి, పతితుండుఁ, బందయుఁ, బరదారానిరతుఁడు, నల్లునిసొమ్ము భజించునధముండు, ధర్మబాహ్యుండు, విదూషకుండు, దుర్వ్యసనాసక్తుండు, బహుభాషియు, విశ్వాసఘాతకియు, ఋతుకాలపరిత్యాగియుఁ,<noinclude><references/></noinclude> qxt9clvb6aqc6d3c9p3cgpjr3ol1j8v పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/54 104 186317 553780 504535 2026-04-19T06:54:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553780 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గష్టలోభియు, ఖలుండు, నాత్మస్తోత్రపరుండు, గలహశీలుండును, గృతఘ్నుండు, భృత్యవంచకుండును, క్షేత్రవిత్రాపహారకుండును నగువారలఁ దోడుకొనిపోవలదు. నినుం బాసి నిమిషమాత్రంబేనియు నోరువంజాల' నని తానును బయనంబైనఁ, గమలలోచనుండు 'నగరసంరక్షణార్థంబు మీకుండక తీరద'ని యొడంబడఁ బలికి, ప్రశస్తముహూర్తంబున నాప్తమంత్రియోధభృత్యవర్గము పరివేష్టింపఁ, బల్లకుల ముందరం బనిచి, యదువృష్ణిభోజాంధకవీరులతో నిరాఘాటధాటీపాటవంబునం బటుతరంబైన తురంగంబు నెక్కి పురంబు వెడలి, గండస్థలంబులఁ దొరఁగు మదాంబుధారావాసనలకుం గ్రమ్ము తుమ్మెదలకై శిరంబులు గదల్చుచు ఘీంకారంబులు సేయు సింధురంబులును, సింధురంబులం జూచి కెరలి రాహూత్తులు తత్తఱం బంద దాఁటు తురంగంబులును, దురంగహేషారవంబులకు బెదరి గోనెలు దిగవైచి పాఱు వృషభంబులును, వృషభమ్ముల సందడి దందడి గొని మోపులుఁ క్రిందఁ బడవైచి దైవంబును దూఱు భారవాహకులును గలిగి ఱొమ్ము ఱొమ్ముఁ దొలఁగఁ ద్రోయరానిసందడిలో మందగమనమ్మున గోవిందుఁడు చనుచు, జనుపనారులుంబోలు తలవెండ్రుకలు గాలి కల్లాడ, వెలిచిన చెవ్వాకులు కర్ణంబుల వీడ, రొంటిమీఁదఁ గట్టిన మురుకచేలంబు లూడ నాడాడ నల్లుండ్రం జూచి 'యింటికి రావైతివేమి? నాకూఁతురు నిన్నుం జూడక రాతిరియెల్ల నిదుకరాక విరహవేదనం బొరలుచుండె' నని పలికి, చెల్లించి విటుల చేతులనున్న వక్కలాకులు జల్లించి కోల యూనికొనుచు, మెల్లమెల్లనం జని యెవ్వరినిఁ గన్న నవ్వింధంబుననె పలుకుచుఁ బయనంబు సనుచున్న వృద్ధాకాంతలం గనుంగొని, చిఱునగవు దళుకొత్త భీమసేనుదిక్కు మొగంబై, 'వాయునందనా, తొల్లి వయసుకాలంబున నాటిన గోటిమీటులు, మోవికాటులు కాయలు కాచి, నీమేని గాయంబులకరణి కనుపట్టు. చొట్టలం బోని పొట్టలు నీపొట్టకు సమానంబై చూపట్టు. అతిస్థూలాకారంబు నీకు సమానలై యున్న యీ వృద్ధవేశ్యలం బరిగ్రహింపు' మనిన, నవ్వి భీమసేనుండు, 'మున్ను మధురానగరంబున మువ్వంక గూనిదాని నొక్కతెం జక్కఁబెట్టితివి. పాదపద్మరాగంబులచేఁ బాషాణంబును యోషారత్నంబు సేసితివి. ఇట్టి కొఱమాలిన జంతువులనెల్ల దిద్దుకొనుట నీభారంబుగాని మాకుం దరంబే? ఎంత పాఱవేసినవారలై నను నీకటాక్షంబున ధన్యు లగుదు' రని పలుకుచు, నాయిరువురుఁ బరిహాసంబు లాడుకొనుచుఁ గొంతదూరంబు చనిరి.<noinclude><references/></noinclude> q2td4vk4mcffie3brdgnoyx1y0brgq8 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/55 104 186318 553785 504536 2026-04-19T08:58:37Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553785 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రుక్మిణీకాంతుం డందైబైన చెందొవల వలనం జెందిన పుప్పొడులు గప్పి యొప్పులు గులుకు తరగంబులం జెలంగు రాజహంస చక్రవాక బకక్రౌంచాది పక్షిగణంబుల కోలాహలముచే మనోహరంబును, బాపహరంబును, మాధురాజితసుధాసారంబునైన కాసారంబుఁ గాంచి దానితీరంబులఁ జందనమందారకుందకురవకాశోకకదళీప్రముఖతరువులనీడల బాళెంబులు విడువ నియమించి, బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులును, నటవర్తకగాయకవందిమాగధులును, జిత్రకారఘటకారపటకారసూచీకారకులు మొదలైన జాతులవారును, నయ్యైతావుల గుడారంబులు వైచికొని నిలిచిరి. అంతఁ బ్రియకాంతయైన రుక్మిణీరమణిం జూచి, 'రాజహంసములు, మదపుటేనుంగులు, గండుతుమ్మెదలు మధురసంబుల నాస్వాదింప సొంపు మెఱయు నీపద్మినిం గంటి పురుషులకంటెఁ బొలతులకుఁ గామం బెనిమిదింత లధికముగదా! అనిన నక్కాంత తనకాంతునితో, 'దేవా, నీవు సర్వభూతాంతర్యామివి. నీ వెఱుంగని యర్థం బేమి యున్నది? నీకుమారుండగు బ్రహ్మకు వాహనంబు రాజహంస, నీవాహనం బేనుంగు. తేఁటులు దాని యెడం బుట్టినవి. అన్నియుఁ దనూజలకు సమానం బగుటంజేసి యిట్లు పలుకందగ' దని పరిహాసపల్లవితంబగు సల్లాపంబుఁ జేయు పల్లవాధరితో నాజగద్వల్లభుం డుల్లసిల్లుచున్నసమయంబునఁ దెల్లని పట్టెనామంబులును, దీగెల యెుడ్డాణంబును, బాదంబులం బెట్టిన బిల్లచెప్పులును, జెవులం జెక్కిన నెమలిఱెక్కలుకు, గటితటంబునం దాల్చిన కంబళ్ళును, బెరుఁగు పాలు నేతులు నించిన కావళ్లును నుల్లసిల్ల, వేలకొలది గొల్ల లచ్చటికి వచ్చి, తెచ్చిన ద్రవ్యంబులు కానుకగా నిచ్చి, గ్రుచ్చి కౌఁగిలించుకొని, యచ్యుతునిం జూచి, 'ఓరి కిసనా! నీయప్పటి కంబళి యేడ నేసితివి? కొండగోఁగుల పువ్వులచాయ కంబళి యెవ్వ రిచ్చిరి? చుక్కలం దెచ్చి గ్రుచ్చిన యట్లున్నయది. ఈ తెల్లగురిగింజపేరు లేడ సంపాదించుకొంటివి? అన్నన్న! చండ్రనిప్పుల యొప్పున నొప్పులు గులుకు నీగాజుపూస లేడఁ దెచ్చుకొంటివి? గబ్బుకంపులం బొల్చిన నల్లనితిరునామం బేడ దొరకె? జల్లితోఁక యేంది? మెడమీద జడ లేంది? నిక్కుచెవు లేంది? అప్పప్ప! ఈ కోడెబోడి యెద్దేడ సవరించుకొంటివి? వింతవింతవేసంబులతో నీచుట్టునుం జుట్టుకొన్న యీగొల్ల లెచ్చట నుండువారలు?' అని పలుక, వారి మూఢవాక్యంబులకు సంతసించి విధించి జనకుఁడు వారల నాదరించె. అప్పు డొక్కకుంభస్తని<noinclude><references/></noinclude> pcyv4ueq0yody3qwj1dsouvi51lfn1h 553786 553785 2026-04-19T08:59:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 553786 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రుక్మిణీకాంతుం డందంబైన చెందొవల వలనం జెందిన పుప్పొడులు గప్పి యొప్పులు గులుకు తరగంబులం జెలంగు రాజహంస చక్రవాక బకక్రౌంచాది పక్షిగణంబుల కోలాహలముచే మనోహరంబును, బాపహరంబును, మాధురాజితసుధాసారంబునైన కాసారంబుఁ గాంచి దానితీరంబులఁ జందనమందారకుందకురవకాశోకకదళీప్రముఖతరువులనీడల బాళెంబులు విడువ నియమించి, బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులును, నటవర్తకగాయకవందిమాగధులును, జిత్రకారఘటకారపటకారసూచీకారకులు మొదలైన జాతులవారును, నయ్యైతావుల గుడారంబులు వైచికొని నిలిచిరి. అంతఁ బ్రియకాంతయైన రుక్మిణీరమణిం జూచి, 'రాజహంసములు, మదపుటేనుంగులు, గండుతుమ్మెదలు మధురసంబుల నాస్వాదింప సొంపు మెఱయు నీపద్మినిం గంటి పురుషులకంటెఁ బొలతులకుఁ గామం బెనిమిదింత లధికముగదా! అనిన నక్కాంత తనకాంతునితో, 'దేవా, నీవు సర్వభూతాంతర్యామివి. నీ వెఱుంగని యర్థం బేమి యున్నది? నీకుమారుండగు బ్రహ్మకు వాహనంబు రాజహంస, నీవాహనం బేనుంగు. తేఁటులు దాని యెడం బుట్టినవి. అన్నియుఁ దనూజలకు సమానం బగుటంజేసి యిట్లు పలుకందగ' దని పరిహాసపల్లవితంబగు సల్లాపంబుఁ జేయు పల్లవాధరితో నాజగద్వల్లభుం డుల్లసిల్లుచున్నసమయంబునఁ దెల్లని పట్టెనామంబులును, దీగెల యెుడ్డాణంబును, బాదంబులం బెట్టిన బిల్లచెప్పులును, జెవులం జెక్కిన నెమలిఱెక్కలుకు, గటితటంబునం దాల్చిన కంబళ్ళును, బెరుఁగు పాలు నేతులు నించిన కావళ్లును నుల్లసిల్ల, వేలకొలది గొల్ల లచ్చటికి వచ్చి, తెచ్చిన ద్రవ్యంబులు కానుకగా నిచ్చి, గ్రుచ్చి కౌఁగిలించుకొని, యచ్యుతునిం జూచి, 'ఓరి కిసనా! నీయప్పటి కంబళి యేడ నేసితివి? కొండగోఁగుల పువ్వులచాయ కంబళి యెవ్వ రిచ్చిరి? చుక్కలం దెచ్చి గ్రుచ్చిన యట్లున్నయది. ఈ తెల్లగురిగింజపేరు లేడ సంపాదించుకొంటివి? అన్నన్న! చండ్రనిప్పుల యొప్పున నొప్పులు గులుకు నీగాజుపూస లేడఁ దెచ్చుకొంటివి? గబ్బుకంపులం బొల్చిన నల్లనితిరునామం బేడ దొరకె? జల్లితోఁక యేంది? మెడమీద జడ లేంది? నిక్కుచెవు లేంది? అప్పప్ప! ఈ కోడెబోడి యెద్దేడ సవరించుకొంటివి? వింతవింతవేసంబులతో నీచుట్టునుం జుట్టుకొన్న యీగొల్ల లెచ్చట నుండువారలు?' అని పలుక, వారి మూఢవాక్యంబులకు సంతసించి విధించి జనకుఁడు వారల నాదరించె. అప్పు డొక్కకుంభస్తని<noinclude><references/></noinclude> 4deff8639yhye6nxa24mqche7q8y7n6 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/56 104 186319 553788 504537 2026-04-19T09:06:34Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553788 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నవనీతకుంభంబును, నొక్కమెఱుగుఁబోఁడి పెరుగువంటకంబును, నొక్కబాలిక వనమాలికయు, బంగరుకుండయుఁ దెచ్చి శౌరినిం బొడ గనిరి. ఒక్కవాలుగంటి జుంటితేనియఁ గానుక యొసంగిన గోపాలచక్రవర్తి దాని యధరామృతంబు తొల్లి గ్రోలినవాఁ డగుటంజేసి, తలంచుకొని నవ్వె. ఒక్కవేదండయాన పూదండ దండనుండుటయుఁ దదీయభుజాలతాలింగనంబు స్మరించి కనుగీఁటె, ఒక్కచెల్వ బిల్వఫలంబులు ముందర నునిచిన దానికుచంబుల దృష్టి నిలిపె మఱియొకతె నెమ్మిగరులకుంచె యెదుటనుంచిన నయ్యింతి కుంతలంబులు మున్ను దాఁ బట్టి యీడ్చినది తలంచి కనుమొగిచె. ఇవ్విధంబునం దొంటివలపులం దలపింప నాగోపకాంతలం జూచి గోపాలదేవుండు నర్మగర్భంబుగాఁ బలుకుచు, వారల వీడు కొలిపి యారాత్రి యచట వసియించె. అని జైమినిమునీంద్రుఁ డాన తిచ్చుటయు, జనమేజయ నరేంద్రుండు తదనంతరకథావృత్తాంతశ్రవణకౌతూహలాయత్తచిత్తుండై యుండె. {{Telugu poem|type=చ.|lines=<poem>అవిరళదానశీల, శరణాగతరక్షణలీల, సత్కళా కువలయమిత్ర, సూనశరకోటిమనోహరగాత్ర, సాహితీ నవరసభోజ, నూత్నదిననాథవిడంబకతేజ, రాజమా న్యవిజయరంగ చొక్క నరనాయక సజ్జనభాగ్యదాయకా.</poem>|ref=}} {{Telugu poem|type=క.|lines=<poem>శ్రీరంగ కృష్ణ ముద్దుల వీరేంద కుమార, సమరవితరణశూరా, శ్రీరంగ పతి పదాంబుజ సారంగ సమదశైల సమసారంగా.</poem>|ref=}} {{Telugu poem|type=మానినీ.|lines=<poem>సనయహృదయపద్మా, శాశ్వతైశ్వర్యసద్మా, మదనవిమతశౌర్యా, మందారాహార్యధైర్యా, విదితవిభవసాంద్రా, విశ్వనాథాన్వయేంద్రా, ముదితకవిసమాజా, ముద్దమాంబాతనూజా.</poem>|ref=}}<noinclude><references/></noinclude> ioeja66ger61vj4geye7hfdp6x6h793 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/57 104 186320 553789 504538 2026-04-19T09:11:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553789 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|<poem>గద్య ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగచొక్కనాథ మహీనాథకరుణాకటాక్షసంపాదితగజతురంగమాందోళి కాపాప్రముఖనిఖిలసంపత్పారంపరీసమేధమాన సముఖ మీనాక్షినాయకతనూభవ మీనాక్షీ దేవికటాక్షలబ్ధకవితాసంప్రదాయ వేంకటకృష్ణప్పనాయకప్రణీ తం బైనజైమినిభారతం బున నశ్వమేధపర్వం బనువచనకావ్యంబు నందు ప్రథమాశ్వాసము</poem>}}<noinclude><references/></noinclude> e645h3sta4z6ci8ivvr8j7uznwr4ghc పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/58 104 186321 553807 504539 2026-04-19T11:45:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553807 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}} {{p|ac|fs150}}జైమిని భారతము</p> {{p|ac|fs125}}ద్వితీయాశ్వాసము</p> {{Telugu poem|type=|lines=<poem>శ్రీరాధావరచరణాం భోరుహభృంగాయమాన, భుజకరవీరా ధారాఖండితశాత్రవ శూరా, శ్రీ విజయరంగ చొక్క వజీరా!</poem>|ref=}} అవధరింపుము; జైమిని మునీంద్రుండు జనమేజయ నరేంద్రుం గనుంగొని యిట్లనియె. 'అమ్మఱునాఁటి వేకువజామున స్నానసంధ్యావందనాది నిత్యకర్మంబులు నిర్వర్తించి, నందయశోదాదులున్న తావునకుం బోయి, కుంతీదేవి మామేనత్త గావున నద్దేవికి నమస్కరించి, 'ధర్మజుని యశ్వమేధంబు గనుంగొని వత్తురుగాక, మీరలు ప్రద్యుమ్నాదికుమారులం దోడ్కొని మెల్లన రండని చెప్పి, కోడండ్రును, దానును, దేవకీదేవి కుంతీదేవి యొద్దను, నుషాకన్య సఖీజనంబులతోడఁ బాంచాలిసమీపంబునను, బ్రద్యుమ్నుని యాదవకుమారులతోడఁ గూడ ధర్మజునిసమీపంబునఁ దనతో మున్ను బాల్యంబున నాటలాడిన గోపాలకుల నెల్ల గాండీవిచెంత నుండునట్లుగా నియమించి, యాభీరవరులం జూచి, సింహరాశియందు బృహస్పతి యుండుసమయంబునఁ బ్రశస్తతరంబైన గోదావరీప్రభావంబు గాంచి, సకలతీర్థంబులు విస్మయంబు జెందినభంగి, మీరలు కిరీటిపరాక్రమంబు గాంచి ఱిచ్చవడి యుండక, తోఁచినపాటి పరాక్రమంబు గావించి, యతని మెప్పింపుడని యాజ్ఞాపించి, కృతవర్మ భీమసేనులఁ గాంచి, 'మీరిరువురు సకలదళంబులం దోడ్కొని మెల్లన రండు. నేను మున్నుగాఁ గరినగరంబునకుం జనియెడ' నని పలికి, పవనజవంబైన తురంగంబు నెక్కి మిత్రజనపరిమితసమేతంబుగా హస్తినాపురంబునకు వచ్చి, ధృతరాష్ట్ర, విదురకృపసంజయసమేతుండైన ధర్మనందనుం గదిసి, కంసారి సంసారిచందంబున సాష్టాంగదండప్రణామంబు గావించె.<noinclude><references/></noinclude> 86cedqm0k5w8f4kh2rq86p1c3fbcvdg పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/338 104 203620 553748 530011 2026-04-18T12:55:16Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553748 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఎదురువాదం చేశారు మొదట; కాని వారు గుర్తించని క్రూరగ్రహవిశేషదృష్టి నేను సూచించగా, నా నిశ్చయం అంగీకరించా రిష్టపూర్తిగా. అతిథి అన్నది మాత్రమే కాక, పండితు డన్నదిన్నీ ఆదరభావం కలిగించింది నా యెడల వారికి, దాంతో. ప్రశ్న చెప్పినందుకు నాలుగు రూపాయలు సత్కారమున్నూ చేశారు వారు. మృష్ణాన్నభోజనం చేసి, విశ్రమించి, బయలుదేరి వెళ్ళిపోయా నక్కణ్ణుంచి రెండయాక. {{c|<big><big>39</big></big>}} ఇలాగ చాలా విశేషం వుంది వేషంలో. మనకంటే యెక్కువ శ్రద్ధగా వుంటారీ వేషం విషయమై యితర మతాలవారూ యితర ఖండాలవారున్నూ, స్త్రీలూ పురుషులూ కూడా. మనలోనయినా వేషభాషలనే నానుడి. వీధిలోకి వెళ్ళేవారి కవి రెండూ యెంత బాగా వుంటే అంత మన్నన. "బాగా వుండడం" అంటే, డాబుగా వుండడం అని కాదు, నీటుగా వుండడం. అయితే, వేషం విలవా తెస్తుంది, విలవా చెరుపుతుంది, మనిషికి. జనసామాన్యం భాషదాకా వెళ్ళలేదు, వేషం చూసే ప్రవృత్తి నిర్ణయించేస్తుంది, తరవాత మార్చుకోవలసివచ్చినా. డబ్బు కాదు, చదువూ కాదు, సామాజిక ధర్మానికి లోబడ్డ చిత్తవృత్తి కారణం వేషానికి. సామాజికధర్మం అనెందు కన్నానంటే, వొక్కాక్క దేశం - వొక్కొక్క మతం - వొక్కొక్క ప్రాంతంవారి వేషం వొక్కొక్క విధంగా వుంటోంది లోకంలో. వేషం చూసి మనిషిని అర్థం చేసుకోవచ్చు, చాలామట్టుకి. వేషమూ భాషా - అంటే మాటతీరూ వీటివల్ల తమ అంతరప్రవృత్తి పైకి పొక్కకుండా గుప్తపరుచుకోగలవారి సంఖ్య బహూ తక్కువ, లోకంలో. అయితే, వారు పక్కావ్యవహర్తలో, శుద్ధవంచకులో అయివుంటారు. కాని జీవితానికింత ప్రాధాన్యం వహించే వేషం విషయమై మన తెనుగువారి కిప్పుడు శ్రద్ధా లేదు, సంప్రదాయ గౌరవమూ లేదు, అనుకరణ పరాయణత్వం తప్పించి. ఇక తెనుగుతనం యెలా నిలుస్తుందీ వారికి ? మంచి యెక్కడ వుంటే అక్కణ్ణుంచి అది గ్రహిస్తా మంటారు మనలో కొందరు, మన సంప్రదాయం మంచిచెడ్డలు మాత్రం లేశమూ యెరగరు. ఇదిగాక, - "భారత జాతీయత" అంటూ పెద్దపెద్ద మాటలు వాడేస్తారు కొందరు, అదెక్కడుందో మరి. భారతదేశానికి ప్రత్యేకభాష యేదీ, ప్రత్యేకవేషం యేదీ, ప్రత్యేక సంప్రదాయమున్నూ యేదీ భారతజాతీయత రూపొందడానికీ?<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||314}}</noinclude> o2kz9zlb5r5f4ubtrfgslnocyhjo175 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/332 104 203675 553741 529935 2026-04-18T12:24:07Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553741 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మంచిదయినా చెడ్డదయినా తన గ్రంథం జనుల కందుబాటులో వుండడమే కవి ప్రయత్నం. అంచేత ఎలాగయినా నా వీరపూజ అచ్చు వేయించుకోవాలని వ్రతంపట్టా న్నేను. {{c|<big><big>37</big></big>}} భావనకేసి తిప్పవలసిన చూపు ధనికులకేసి తిప్పా నొకనాడు. పిఠాపురం మహారాజులుంగారిని ఆశ్రయిద్దామని తోచింది వెంటనే. కళావేత్తల కిలాంటి ఆశలు రేకెత్తించే దారోజుల్లో, మొక్కపాటి సుబ్బారాయుడుగారి దివాన్గిరీ. దీనికి సాయం, గురువులు వాక్సహాయం చేస్తారని ధీమా. వెంటనే పిఠాపురం వెళ్ళాను. "సాఫల్యం నిశ్చయమే" అన్నారు వేంకటరామశాస్త్రిగారు. వీరపూజ విషయమై నా పరోక్షంలో సుబ్బారాయడు గారితో మాట్టాడివచ్చి, వెళ్ళి వారికి గ్రంథం చూపించి - అగత్యం అయితే వినిపించి రమ్మని పంపారు రామకృష్ణశాస్త్రిగారు నన్ను, సంగతి చెప్పగా "వింటాను చదవండి" అన్నారు సుబ్బారాయడుగారు, సావధానత కనబరచి. మొదట రెండు చరిత్రలు మాత్రమే వింటామన్నారు. ఆ రెండూ విన్నాక అన్నీ వినిపించమన్నారు. విని ప్రశ్నిస్తూ వచ్చారు, ప్రశ్నించి చర్చిస్తూనూ వచ్చారు. పృథ్వీరాజు, గోరీని ఆరుమాట్లు విడిచిపెట్టడం దగ్గిర గంభీరంగానే జరిగిందీ చర్చ. అనుకున్నదే నే నది. ఎవరయినా అది చదివి - కనీసం విని అది గుర్తించకపోతే నాకేమి తృప్తీ? ఇంతవర కెవరూ చెయ్యని ఆక్షేపణ చేశా నక్కడ నేను. కనక, చాలామంది నాతో భేదిస్తా రక్కడ. మరి, భేదిస్తే? ఏమవుతుందో చూడ్డమే నా నిశ్చయం, అటయినా యిటయినా. ఈ నిశ్చయంతో నా వాదం విస్తరించా నా వేళ. సావధానంగా విన్నారు సుబ్బారాయుడుగారు. మూడోనాడు గ్రంథం పూర్తవుతుంది. ఆవేళా వస్తుంది నా ఆక్షేపణ మరొకటి. అక్కడా అభిప్రాయాలు భేదిస్తాయి, తప్పదు. గురువుగారితో ముందే చెప్పా నీసంగతి. “హఠవాదం మాత్రం చెయ్యవ” ద్దన్నారు వారు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||308}}</noinclude> lpg2t4h2r1q4ps05r1wz4c2qcfjf6n1 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/333 104 203676 553742 529936 2026-04-18T12:28:24Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553742 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"సిద్దాంతం సిద్దాంతమే అని మాత్రం స్పష్టంగా చెప్ప” మనిన్నీ అన్నారు వారు. గత రెండుదినాలూ జరిగిన పద్ధతే అది. ఆవేళ పానుగంటి నరసింహారావువంతులుగారు కూచుని వున్నారు, నేను వెళ్ళేటప్పటి కక్కడ. పరిచయం లేదు; గాని పిఠాపురంలోనే రెండుమూడుమాట్లు చూసివున్నాను వారి న్నేను, దూరంగా. సుబ్బారాయడుగారు నా సంగతి చెప్పగా విని, కీగంట మాత్రం చూసివూరుకున్నారు పంతులుగారు. నే నది గుర్తించకపోలేదు. వా రలా చెయ్యడానిక్కారణమూ లేకపోలేదు. రామకృష్ణకవులంటే యిష్టం లేదు పంతులుగారికి. కోటలో జరిగిన మొదటి శతావధానంలో కాబోలు రామకృష్ణకవులు "వాసింగన్న కవీశ్వరుండు" అన్న మీసాలపద్యం తమ్ముద్దేశించి చెప్పిందే అని అప్పణ్ణుంచీ పంతులుగారికి, వారంటే వులుకు. ఇదంతా నా కప్పటికే తెలుసు. ఆ రామకృష్ణకవుల శిష్యుణ్ణి నేను. ఈ స్థితిలో సంభవించింది నా రచన వారున్నూ వినడం. భీమసింహుని చరిత్ర మొదట చదివా నా వేళ. రాజపుత్రులు - వారిలో మిక్కిలి శిష్టులని పేరుపొందిన మేవాడు రాణాలు, అల్లాఉద్దీనుకు పద్మినీదేవి నద్దంలో చూపించి, అతణ్ణి గౌరవంగా సాగనంపడమూ - ఆ సందర్భంలో అల్లాఉద్దీను భీమసింహుణ్ణి చెరపట్టడమూ - దీనిమీద నేను ఆక్షేపణ చేశాను. అది విని చకితులయినారు పంతులుగారు. అది గుర్తించి సుబ్బారాయడుగారు పృథ్వీరాజు సంగతి కూడా వినమన్నారు పంతులుగారిని. నేను చదివాను. వినివిని "శతాబ్దులు గడిచాయి. ప్రపంచంలో చారిత్రిక విమర్శకు లెందరో ఆ ఘట్టాలు చదివే వున్నారు; కాని వారెవరూ చెయ్యని ఆక్షేపణ లివి" అన్నారు పంతులుగారు, కళ్ళుచికిలించి చూస్తూ వ్యంగ్యంగా. అది భరించలేకపోయా న్నేను. “సుబ్రహ్మణ్యశాస్త్రి వొక్కడే చెయ్యగల పని అది" అన్నానుకూడా, పెంకిగా,. పంతులుగారు మరి మాట్టాడలేదు. ఎదటివాణ్ణి, యిట్టే మాట అనేస్తారు కొందరు; తమకున్నూ అలాంటి మాట వచ్చి తగులుతుందన్న యింగితజ్ఞత లేకుండా. సుబ్బారాయడుగారివంటి గంభీరులు మిక్కిలీ తక్కువగానూ వుంటారు లోకంలో. ఆ చదవడం చదవడం భీమసింహుని చరిత్ర పూర్తిచేసి ప్రతాపసింగు రాణా చరిత్ర కూడా చదివాను, తరవాత.<noinclude><references/> {{rh|309||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> gaa181y2eh078w7h8s4i8ykyl9zyn1k పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/334 104 203677 553743 529938 2026-04-18T12:33:35Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553743 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పంతులుగా రది సూటిగా వినలేదు. ఉండనూ లేదు, చివరికి. సుబ్బారాయడుగారికీ పంతులుగారికీ వుండిన పరిచయం సంగతి నాకు తెలుసు. మహారాజులుంగారికీ పంతులుగారికీ వుండిన దోస్తీ సంగతి కూడా వినేవున్నా న్నేను. కనక, నా ప్రయత్నం విఫలం అయితే కావచ్చు. ఇది నిశ్చయమున్నూ చేసుకున్నాను. ఏమయినా, భిన్నాభిప్రాయం కనబరిచినవారిని గౌరవించగలనుగాని - విమర్శలు వచ్చినా సావధానత కనబరచగలను గాని - వెక్కిరింతలు సహించలే న్నేను. ఇదంతా విని గురువు లిద్దరూ చకితులయినారు. ఇలాంటి సందర్భాలు చాలా చూసీ, వినీ వున్నారు వారు. “ఇది అపశకున” మన్నారు వేంకటరామశాస్త్రిగారు. “కావచ్చు” నన్నారు రామకృష్ణశాస్త్రిగారు. ఇందు కనుగుణంగా, మర్నాడు నేను వెళ్ళీ వెళ్ళడంతోనే "మీ గ్రంథం విషయం ప్రభువే ముందు ప్రస్తావించా” రన్నారు సుబ్బారాయడుగారు. "రాకపోకల ఖర్చుల నిమిత్తం మీకందచెయ్యమని గురువుల దగ్గిరికి యాభైరూపాయలు పంపించారుకూడా" అనిన్నీ చెప్పారు వారు. ప్రభువే ముందు ప్రస్తావించడంలో అర్థం వుంది. “కారణం స్పష్టమే” అంటూ గురువులూ వొప్పుకున్నా రది. యాభైరూపాయలు పంపడంలో మాత్రం సమన్వయం కుదరలేదు నాకు. “మరి ఆ ద్రవ్యం పుచ్చుకోడమూ మానడమా?” "నా ధోరణి గుర్తించి యిప్పటికి పుచ్చుకోండి" అన్నారు సుబ్బారాయడుగారు. బసకి వచ్చాక గురువులూ ఆ మాటే అన్నారు. ప్రయత్నం వొకటీ పర్యవసానం వొకటీనీ. ఎక్కడా కూడా సన్నిధానవర్తుల ధోరణి వొక్కలాగే వుంటుంది. నా సిద్ధాంతాలు నచ్చకపోతే కోరిక తిరస్కరించాలి, లేకపోతే కారణాంతరా లేమిటో చెప్పి వీలులేదనాలి, చివరికి దర్శనమే యివ్వకపోవాలి; గాని యిదేమిటీ యాభైరూపాయ లివ్వడం? రాకపోకల ఖర్చు లివ్వడమే అయితే అయిదు చాలు, యాభై యెందుకూ? ప్రభువులైన వారంత తక్కువ యివ్వ రంటే యెటూ కాకుండా యివ్వడం యేమనాలి? ఇప్పించేవా రొకరు - ఇచ్చేవా రొకరు - ఇవ్వకుండా చేసేవా రొకరు - స్పష్టంగా ముగ్గురు కనపడుతున్నా రిక్కడ. దర్శనం చేసి నేను వాచా కోరకుండా - నేను కాగితం రాసి పంపుకోకుండా - సుబ్బారాయడుగారున్నూ యేమీ చెప్పకుండా నా గ్రంథం విషయమూ, నా ఆక్షేపణల సంగతీ ప్రభువు కెలా తెలిసిందీ లేకపోతే?<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||310}}</noinclude> pqahurglk1mp2yxwez2fm1n93jwv34j పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/335 104 203678 553745 530008 2026-04-18T12:37:59Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553745 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఏమయినా, నేనా డబ్బు పుచ్చుకోకపోతే, నా విషయమై సుబ్బారాయడుగారి దగ్గిర అలాంటి ప్రయత్నం చేసిన గురువులు బాధ్యు లవుతారు మహారాజులుంగారి యెదట. నేను బాగానే వుంటాను, చిక్కు గురువుల కవుతుంది. ఇది నాకు శ్రేయస్కరమా? పోనీ, ధర్మమా? ఆ డబ్బు పుచ్చుకోడం అనివార్యం అయిపోయింది నాకు. ఒక్క తృప్తిమాత్రం మిగిలింది. "లోకం గతానుగతికం. వేత్తల మనుకునేవారున్నూ శుద్ధసత్యాలు వొప్పుకోలేరు, సాధారణంగా" అన్నారు, స్టేషనుదాకా వచ్చి రెయిలు కదులుతుందనగా రామకృష్ణశాస్త్రిగారు. “చాలు” అనుకుని నిర్వికారంగా యింటికి వచ్చేశా న్నేను. {{c|<big><big>38</big></big>}} పిఠాపురం వెళ్ళేటప్పటికి హోటల్ భోజనం చెయ్యగూడదన్న నియమం విడిచిపెట్టేశా న్నేను. అయితే, దినమ్మూ హోటల్లో భోజనం చేస్తే ఆరోగ్యం చెడుతుందన్న భయం అటూ, విద్యార్థి అయినవాడికి వారాల భోజనమే శ్రేయస్కరం అన్న నమ్మకం యిటూ బలంగా వుండడంవల్ల నే నక్కడ కూడా వారాలే చేసుకున్నాను, కొన్నాళ్లు. కాని, వల్లూరిలోనూ, వేట్లపాలెంలోనూ, కానూరగ్రహారంలోనూ అడిగినంత చురుగ్గా యెవరినీ నే నక్కడ వారా లడగలేకపోయాను. హోటలున్న వూరుగదా, గృహస్థులను మొగమాటపెట్టటమా అన్న సంశయం పీడిస్తూనే వుండింది నన్ను. వేదశాస్త్రాలు చదువుకునే విద్యార్థుల్లో కాక, నేను లౌక్యవేషంతో వుండడం కూడా నా వెనకతీతకు కొంత కారణం అయింది, చెప్పకేం? ఆ వేషం నాకో వింత అనుభవం కూడా కలిగించిం దొకనాడు. ఆవేళ మా అత్తవారి యింటికి ముక్కామల వెడదామని బయలుదేరాను. అప్పటికి నేను పంచాంగం చెయ్యడం మానుకుని వున్నాను, జాతకాలూ ప్రశ్నలూ మాత్రం చెబుతున్నా నింకా. అనుకోకుండా, అప్పుడప్పుడు కొంచెంకొంచెం డబ్బు దొరుకుతూ వుండడం అందు క్కారణం. రెండు గోదావరులు దాటి అడ్డదారిన నడిచివెళ్ళడమున్నూ అప్పటికి మానుకునివుండడంవల్ల ఉదయం యేడున్నరకి అనపర్తిలో రెయిలెక్కి తొమ్మిదిన్నరకి నిడదవోలు చేరుకున్నాను. ఆ సమయానికి, నరసాపురం వెళ్ళే మెయిలు బోటుండేది; కాని ఆవేళ దాటిపోయింది.<noinclude><references/> {{rh|311||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> g0o8bola2e4p03hi8i8gailtoh95aa3 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/336 104 203679 553746 530009 2026-04-18T12:45:57Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553746 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>దాటిపోయిందంటే దానికది కాదు, డెల్టాకుసంబంధించిన వుద్యోగి వొకాయన సకుటుంబంగా బయలుదేరి, నిర్ణీత సమయానికి గంటకి ముందే గెంటించుకుపోయాట్ట, తన బిళ్ళబంట్రోతుచేత కళాసులనూ, కళాసులచేత బోటున్నూ. అక్కడికి పదిహేను మైళ్ళకి పైన వుంది ముక్కామల. రహదారీ పడవమీద వెళ్ళవచ్చు; కాని రాత్రి తొమ్మిదింటి దాకా నిడదవోల్లో పడివుండాలి, వుసూరుమంటూ. అయినా సరే అంటే, తెల్లవారుజాము నాలుగించిగ్గాని, ముక్కామల వెళ్ళలేము. రోడ్డుంది గాని బస్సుల “ఐడియా”యే లే దప్పటికి. టూరింగుకార్లే బహూ తక్కువ ఆరోజుల్లో. అంచెజట్కాల పద్ధతిన్నీ యేర్పడలే దప్పటికి. కాగా, నడిచివెళ్ళడమే గతి అయిం దావేళ. అడ్డదారిని వెడితే పొలమూరినుంచి యెంత దూరం నడవాలో నిడదవోలినుంచిన్నీ అంతదూరమూ నడిచివెళ్ళవలసి వచ్చింది. అయితే పది కావస్తోందప్పటికే, యెంత వురుకులూ పరుగులూ పెట్టినా మూడయినా అవుతుంది ముక్కామల వెళ్ళేటప్పటికి. అప్పుడూ భోజనం. ఇది బాగాలేదని వూళ్ళోకి బయలుదేరాను, బ్రాహ్మల యిళ్ళు వెతుక్కుంటూ. ఒక బ్రాహ్మ డెదురై "ఇక్కడ కాదు. దారే కనక అట్లపాడు వెళ్ళండి, మీ కక్కడ యెవరయినా పెడతారు భోజనం" అన్నాడు. కాలవ దాటితే, కాలవపక్కనే అట్లపా డక్కడికి మైలు. రేవులో స్నానసంధ్యాద్యనుస్ఠానాలు నిర్వర్తించుకుంటున్న ఆ వూరి బ్రాహ్మలు "డి.పి.డబ్ల్యూ. మానేజరుగారి యింటికి వెడితే యెందరికయినా భోజనం పెడతా"రని చెప్పా రడగ్గా. వెతుక్కుంటూ వెళ్ళాను. మండువా హాల్లో పదిపదిహేనుగురు కూచుని వున్నారు, దర్జాగా కొందరూ, కొంచెం వొదిగివొదిగి కొందరూను. వారిలో యెవరు ఎవరో తెలియదు, ఉద్యోగస్థు లన్నట్టు మాత్రం వున్నా రందరూ. "మానేజరుగా రెవ" రని నే నడగడమూ, వొకాయన వారిని చూపించడమూ "యేమి పనిమీద వచ్చా" రని మానేజరుగారు నన్నడగడమూ వెంటవెంటనే జరిగిపోయాయి. "నా కీపూట భోజనం కావాలి. ఎవరి కయినా మీరు పెడతారని విని వెతుక్కుంటూ వచ్చా” నని బదులు చెప్పాను, క్లుప్తంగా నేను. మిక్కిలీ సూటి అయిన మాట యిది. వైదికులయినవారి కిందులో అసందర్భం కనపడకపోడమే కాదు, మంచి సంప్రదాయమున్నూ కనపడుతుంది.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||312}}</noinclude> 44w5dqq37l1p254iq0k9mjylqtokg6b పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/337 104 203680 553747 530010 2026-04-18T12:49:44Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553747 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కాని, అక్కడివారిలో చకితులై కొందరు నాకేసి వింతగా చూశారు, పకాలుమని నవ్వేశారు మరికొందరు. మానేజరుగారు నిశ్చలంగానే వున్నారు మొదట, కాని కొంచెం చురుగ్గా చూశారు, తరవాత అటు. ఆ నవ్వులూ ఆ చూపులూ వికటంగా కనపడ్డాయి నాకు. "ఏం, నవ్వుతారేం” అనడిగా న్నేను, అసంతృప్తి కనపరుస్తూ. అప్పుడు తటాలున లేచి నా దగ్గరికి వచ్చి మా యింటి పేరడిగారు మానేజరుగారు. నేను చెప్పాను. “అంటే, వైదికులా?" అని మళ్ళీ అడిగారు. "అవు"నన్నా న్నేను. వెంటనే నా చెయ్యిపట్టుకుని దయచెయ్యండంటూ లోపలికి తీసుకువెళ్ళి పక్కన కూచోబెట్టుకుని “ఇక్కడ వున్నవాళ్ళం మేమందరమూ నియోగులం. ఒకరిద్ద రితరులూ వున్నారనుకోండి, అయితే, అన్నదాతలచేత 'ఈపూట భోజనం చేసి వెళ్ళండి' అనిపించుకుంటాం మేము యుక్తిచేసి. ఆ యెత్తు సాగకపోతే, ఆ పూటకి పస్తుంటాం, గాంభీర్యం చెడకుండా. 'అన్నం పెట్టండి' అని మాత్రం యెవరినీ అడగం. ఇది మంచిదా చెడ్డదా అన్న విచారణ వద్దు. ఏమంటే? ఒక విధంగా మంచిదీ మరొక విధంగా చెడ్డదీని. అడిగించుకోడం మా పద్దతీ, అడగడం మీ సంప్రదాయమూను మరి. రెండూ సమర్థనీయాలే శాఖామర్యాదలనుబట్టి; కాని మీ విషయమై కొత్త సమస్య వచ్చింది మావాళ్ళకి. మీ వేషం లౌక్యంగానూ, మీ ప్రకృతి వైదీకంగానూ వుండడమే అందు క్కారణం. ఇప్పు డిక్కడ, మీ మాటమీద కొందరు చకితులయినా రన్నా, కొందరు నవ్వనే నవ్వా రన్నా మీ వేషమూ మీ ప్రవృత్తీ సమన్వయపరుచుకోలేకపోడమే కారణం. ఎవరికీ హేళన భావం లేదు, నమ్మండి. మీ కిక్కడ భోజనానికిన్నీ లోటులేదు, కూచోండి వేళ అవుతోంది" అన్నారు సాదరంగా మావూళ్ళో నియోగులు - సంపన్న నియోగులే వున్నారు కనక, నాకు బాగా తెలుసు ఇది. కొన్ని వైదికసంప్రదాయా లిప్పటికీ విడిచిపెట్టలేకుండానే వున్నాను; కాని అప్పటికే నా వేషం మారివుంది, నిజమే. కాగా, మానేజరుగారు చెప్పినదాంతో తృప్తిపడ్డాను. తరవాత, నేను నేర్చిన విద్యలసంగతి వచ్చింది. ప్రశ్న చెప్పమన్నారు మానేజరుగా రవ్యధానంగా. ఫలితం చెప్పా నాలోచించి నేను. ఆ విద్యలో తమకూ ప్రవేశం వున్నట్టు తేల్చి, నేను ఆలోచించిన విధానం చెప్పమన్నారు వారు. చెప్పాను. కొంచెం చర్చ సాగింది.<noinclude><references/> {{rh|313||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> dojmxo2h8d08d5bqr1cg486606m0hdg పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/339 104 203686 553749 530012 2026-04-18T13:01:58Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553749 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఈ విషయమై మనవారికి సరి అయిన పరిజ్ఞానం వున్నట్టు లేదు, పరప్రత్యయనేయత తప్ప. సేతువు మొదలు శీతాచలం దాకా తరుచు తిరుగుతూ వుండిన్నీ యీ విషయం గ్రహించనివారే వున్నారు, మనలో చాలామంది. గుజరాతీలూ, మహారాష్ట్రులూ, అరవలూ, మలయాళీలూ, కన్నడులూ, ఓడ్రులూ, బెంగాలీలూ, పంజాబీలూ - వీరి ప్రత్యేక భాషలూ, ప్రత్యేక వాఙ్మయాలూ, ప్రత్యేక సంస్కారాలూ, ప్రత్యేక సంప్రదాయాలూ, ప్రత్యేక వాంఛలూ, ప్రత్యేక ప్రాప్యాలూ, ప్రత్యేక ప్రయత్నాలూ, ప్రత్యేక దృక్పథాలూ చూస్తూవుండిన్నీ భారతజాతీయత అంటూ మనవారిలో కొంద రెలా మాట్టాడతారో అది వారికే తెలియాలి. పోనీ, పైని చూపినవారిలో యెవరిది భారతజాతీయతో చెప్పగలరా ఆ మాట్టాడేవారు? ఈ అసందర్భపు చిత్రవృత్తికి తోడు ఉత్తరదేశపు రాజకీయాల పక్షాల వ్యామోహం వొకటీ మనవాళ్లకి. ఆంధ్రులందరూ - ముఖ్యంగా ఆంధ్రనాయకు లందరూ యేకం కావాలిట నుంచున్నపాళంగా, యెలా అవుతారు మరి, తమ కాత్మీయసంస్కారం అబ్బందే? అయితే, యీ చర్చ మరొకప్పుడు. పిఠాపురంలో నా వారాల భోజనం సంగతి ప్రకృతం. ఎలా అయితేం, నెలదినాలు గడిచేటప్పటికి స్టుఅర్జుపేటలోనే ఆరువారాలు కుదిరాయి నాకు. మూడు మాసాలు గడిచినా - వూళ్ళో కూడా ప్రయత్నించినా ఏడోవారం శనివారం మాత్రం కుదరలేదు. గురువులు తమయింట భోజనం చెయ్యమన్నారు; గాని మొగమాటపడిపోయాను. ఒక శనివారం రాజావారి సత్రానికి వెళ్లాను, మధ్యాహ్నిక భోజనం మాత్రం పెట్టిపొమ్మన్నారు. మరో శనివారం బాదం (?) వారి సత్రానికి వెళ్లాను, పదకొండు కొట్టేదాకా అదిగో యిదిగో అంటూ జరిపి “ఇంతవరకూ వంటబ్రాహ్మడు రాలేదు, భోజనం దొరక" దనేశాడు గుమాస్తా. ఇంకో శనివారం మరో అసందర్భం జరిగింది. శుక్రవారంనాడు, రాజా శ్రీ రావు చెల్లాయమ్మారావు జమీందారుగారి దివాను ఆకొండి వేంకటరత్నం పంతులుగారి యింట వారం నాకు. వారి యింటికి చేరే మహారాజులుంగారి భావమరిది శ్రీ సోములుదొరగారి యిల్లూ, నేదునూరి శంకరంగారి యిల్లూను. శుక్రవారం సాయంత్రం, నేనూ వేంకటరత్నంగారి పెద్ద కుమారులు కామరాజుగారూ, సోములుదొరగారి తండ్రిగారూ దొరగారి అరుగుమీద కూచుని యేదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నాము. ఇంతలో నేదునూరి శంకరంగారు వచ్చి మాటలో మాట కలిపి "రేపు మా<noinclude><references/> {{rh|315||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> di2p6rprs04ifabgfh3d7phkwrhyzfk పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/340 104 203687 553750 530029 2026-04-18T13:09:35Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553750 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>యింటికి భోజనానికి రండి" అని పిలిచారు నన్ను. అదెందుకో నా కవగాహన కాలేదు గాని పెద్దమనిషి రమ్మంటే తిరస్కరించడం ధర్మం కాదు కనకా, నా కది వారం లేని రోజుకూడా కనకా, “సరే” అన్నా నిష్ణాపూర్తిగానే. ఇది ప్రభాకరశాస్త్రిగారికి ప్రత్యుత్తరం రాసి కవితలో ప్రకటించిన మలీవారం జరిగింది. ఆ పద్యాలు కామరాజుగారు చదివారు. కామరాజుగారూ, రామకృష్ణకవులూ, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారూ దగ్గిరో దూరమో బంధువర్గానికి చెందినవారు. కాగా, - కామరాజుగారు, తిరుపతివేంకటకవులనూ కాదనలేరు, రామకృష్ణకవులనూ కాదనలేరు. అయితే, వొకవూళ్ళో కాపరాలు కనకా, తాము సాహిత్య ప్రియులు కనకా, తరుచు రామకృష్ణకవుల దగ్గిర కూచుని సాహిత్య చర్చలు వింటూ ఆనందించేవారు. శంకరంగారు తిరుపతి వేంకటకవుల పక్షం. రామకృష్ణ కవులంటే ద్వేషం కూడానుట. ఈ సంగతి, తమ యింటోనే నేను మడికట్టుకుని వారి యింటికి భోజనానికి వెళ్ళేటప్పుడు పనికట్టుకుని కామరాజుగారే చెప్పారు, మరి యే మనుమానించారో? దీనిమీద, శంకరం గారు ఆ వుభయుల ప్రస్తావనా చెయ్యక మానరనుకుంటూనే వెళ్ళా న్నేను. అనుకున్నట్టే జరిగింది. ప్రస్తావన చెయ్యడమే కాదు, చాలా అసభ్యంగా కూడా ప్రవర్తించారు శంకరంగారు, తీరా భోజనం ప్రారంభించాక. సగం భోజనం అయేదాకా నాయెడల ఆయన కనబరిచిన దయ అంతా యింతాకాదు, ఇప్పటికీ కళ్ళక్కట్టినట్టుంది నాకు. అది నే ననుకున్న ప్రస్తావనకు నాంది అని మొదటే నాకు స్పష్టం అయిపోయింది. అది యెలా కొనసాగుతుందో మాత్రం వూహించలేకపోయాను, కాస్తా కూడా. అదృష్టవశాన శంకరంగారి బంధువున్నూ నొక వృద్ధులున్నారు బంతిలో. దొడ్డంపేట సంస్థానసిద్ధాంతు లయిన మా నాయనగా రంటే మిక్కిలీ ఆదరాభిమానాలున్నవా రాయన. మా యింటిపేరూ నా పేరూ తెలుసుకుని, మా నాయనగారి పేరు జ్ఞాపకంరాగా "ఏమవుతారు మీ ”కనడిగి, సంగతంతా విని నేను కనపడ్డందుకు చాలా సంతోషమున్నూ కనపరిచా రాయన. శంకరంగారున్నూ రాజా శ్రీ వాడ్రేవు రంగనాయకమ్మ జమీందారుగారిని చూసయినా నా విషయమై సభ్యంగానే ప్రవర్తించవలసినవారు. కాని, కొంతసేపటికి వంటలక్క అలా చారు వడ్డించి వెళ్లింది, ఆయన యిలా పోరంటాలు మొదలు పెట్టారు. ఆ పద్యాలు న న్నుపసంహరించుకో మని ఆ పోరంటా లయినా.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||316}}</noinclude> 4vp8fpses69al0cs6sh3561gbj1a9fx పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/341 104 203688 553751 530030 2026-04-18T13:13:48Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553751 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>తిరుపతివేంకట కవులు మహానుభావులుట. రామకృష్ణకవుల లెక్కేమిటిట. ఆ పద్యా లుపసంహరించుకోడమే కాదుట, రామకృష్ణ కవులను విడిచిపెట్టేసి, వెళ్ళి వేంకటశాస్త్రిగారి నాశ్రయించాలిట నేను. "ఏమిటి మీరు చెప్పే" దనడిగా న్నేను, భోజనం ఆపుచేసి. ముల్లీ చెప్పా రాయన, మరికాస్త విస్తరించి. నాకు చాలా కోపం వచ్చింది. అనిష్టుల విషయమై భోజనాని క్కూచోపెట్టి బ్రాహ్మణ స్త్రీలు మాత్రమే చేసే పద్ధతి యిది. నన్నుద్ధరిద్దామనే అనుకున్నారు; గాని శంకరంగారీ అనుపపత్తి చూసుకోలేదు. "పిలిచి భోజనం పెట్టినవార"న్న ఆదరభావం విడిచిపెట్టేశా న్నేనున్నూ. "తిరుపతి వేంకటకవులు మహానుభావులో రామకృష్ణకవులు మహానుభావులో, వారూ వారూ కూడా మహానుభావులేనో - వారూ వారూ వున్నారు, చదువుకున్న సరసులూ వున్నారు, మీరు దిగవద్దా ప్రసక్తిలో" అన్నాను, వెంటనే నేను. "మీకు తిరుపతి వేంకట కవులమీద భక్తి వుంటే కావలసినంతా - మీకు చేతనైనంతా కూడా చూపించుకోండి, వారి యెడల. రామకృష్ణ కవులమీద యిష్టం లేకపోతే అదీ చూపించుకోండి, చేతనయినంతా; కాని నా విషయమై మీరేమీ కలగజేసుకోవద్దు" అని దృఢంగా చెప్పాను. మాటమీద మాట పెరిగింది. దురుసుమాటలు ప్రారంభం అయినాయి. “ఆ, ఆ, ఏమి చేస్తున్నావు శంకరం? పిలిచి భోజనానిక్కూచోపెట్టా తగువులాడ్డం ?” అంటూనే వున్నారు వృద్ధులు. శంకరంగారు వినిపించుకోలేదు. నేనూ వెనక్కి తగ్గలేదు. “నువ్వెంత” అంటే “నువ్వెంత దాకా వెళ్ళిపోయింది. "నే నా పద్యాలు నుపసంహరించుకోను సరిగదా, మీ యీ లౌక్యానికి నిరసనగా, మీ తిరుపతివేంకట కవులమీదే రాస్తాను పద్యాలు, తెలుసా? ఇంతకీ, - ఇంత దుశ్చింతతో భోజనానికి రమ్మన్నారు మీరు, మీ యింటో నేను భోజనం చెయ్యడం చాలా పొరపాటు" అనేశాను. అంటూనే ఉత్తరాపోశనం పట్టేసి చర్రున బయటికి చక్కా పోయాను. కామరాజుగారూ, సోములు దొరగారి తండ్రిగారూ దొరగారి అరుగుమీద కూచునివున్నారు. నా వాలకం చూసి “యేమయిందేమిటి?" అనడిగా రిద్దరూ, ఆత్రంగా. అంతా విని చాలా నొచ్చుకున్నారు. “తరవాయి మా యింటో భోజనం చెయ్యండి" అన్నారు కామరాజుగారు; కాని నే నంగీకరించలేదు.<noinclude><references/> {{rh|317||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> 44yxug3emuaw8urdbond4fnfxrqk44y పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/342 104 203689 553808 530031 2026-04-19T11:46:11Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553808 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"అయితే వుండండి" అంటూ మజ్జిగ తెప్పించి, పుచ్చుకునేదాకా బలవంత పెట్టారు దొరగారు. ఆ సాయంత్రం గోష్ఠిలో కామరాజుగారే తెచ్చారు గురువుల దగ్గిర యీ ప్రసంగం. వేంకటరామశాస్త్రిగారు చకితులు కాగా, ఉగ్రులయి పోయారు రామకృష్ణశాస్త్రిగారు. ఏమయినా, దీంతో "పిఠాపురంలో శనివారం మనకి శనిగొట్టుదినం అయిపోయిం"దని స్థిరపరుచుకున్నా న్నేను. తరవాతి శనివారంనాడే హోటల్ భోజనం ప్రారంభించా నావేళమట్టుకి, మరి వారం ప్రయత్నం చెయ్యలేదు. {{c|<big><big>40</big></big>}} "మరి, ప్రయత్నం చెయ్యలే" దన్నాను. అంటే, నాకు నేనయి ప్రయత్నించలేదు. అయినా, శనివారంనాడున్నూ వారం భోజనం తటస్థించింది నాకు. అప్రయత్నమే కా దది, అనుకోనిదిన్నీ. ప్రతీ మనిషికీ తటస్థిస్తూనేవుంటా యప్పుడప్పుడిలాంటి వెన్నో. వాటికి కార్యకారణసంబంధాలు కనపడ వొక్కొక్కప్పుడు. ప్రబుద్ధాంధ్రకు రెండో సంవత్సరం నడుస్తోంది. మానేజిమెంటు ససిపడక నష్టం రాగా సొంత ముద్రాక్షరశాల అమ్మేసి, కాకినాడ స్కేపు అండుకోలో అచ్చు వేయిస్తున్నా నప్పుడు. ఒక నెల అరువిస్తారు వారు. అంటే, వెనుకటి నెల బిల్లు చెల్లిస్తే వచ్చేనెల సంచిక అచ్చు వేసి యిస్తారు. వా రరువుగా. ఉదయం పనివాళ్లు స్టిక్కు పట్టేలోపున రచనలిస్తే సాయంత్రానికి సంచికలు బెండున్నూ చేసి యిచ్చేవారు వారు. తమ వాగ్దానం ప్రకారం గతమాసం బిల్లు కొవ్వూరి బసివిరెడ్డిగారి రెండో కుమారులు శ్రీ సూర్యనారాయణరెడ్డిగారు చెల్లించేసి వుంటారు, కనక, కాకినాడ వెడితే చాలు, పన్నెండుగంటల పని. దీపాలు పెట్టాక తొస్సిపూడిలాకు దగ్గిర పడవ యెక్కితే తెల్లవారేటప్పటికి కాకినాడ - మళ్ళీ దీపాలు పెట్టాక భోజనమున్నూ సావకాశంగా కానిచ్చుకుని కాకినాడలో పడవ యెక్కితే తెల్లవారేటప్పటికి తొస్సిపూడిలాకు - రానూపోనూ పడవకేవు రెండణాలు. కాకినాడలో రెండుపూటలా పెరుగుతో భోజనం అర్థ రూపాయి, వెరశి పదణాలు కావాలి; గాని పదికాసుల్లేవు చేతిలో. ఇరుగు పొరుగువారిలో చేబదు ళ్లివ్వగలవారా సమయాన ఇళ్ళల్లో లేరు, వంట మాత్రం అయిపోతోంది ఇంట్లో సాయంత్రం అయిదుగంటల వేళ. వెళ్ళాలి.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||318}}</noinclude> 43rc9akubpgpvkddz6zkh7t7ykndesh పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/186 104 211464 553801 553534 2026-04-19T10:40:58Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 553801 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> అచ్చెరువు చెందారు. జానపద కళలల్లో గోపాలరాజ్ ప్రతిభకు గుర్తింపుగా సంగీత నృత్యకళాశాలలో జానపద కళల తొలి ఆచార్యునిగా నియమితులయ్యారు. తదనంతరం కాలంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత జానపద కళాపీఠానికి తొలి అధిపతిగా నియుక్తులైనారు. ప్రముఖ కవి డాక్టర్ సి. నారాయణరెడ్డి సహచర్యంలో ఉర్దూ భాషా సాహిత్యంతోపాటు, తెలుగు భాషా సాహిత్యాన్ని వంట పట్టించుకొని స్వీయ రచనలతో జానపద రూపకాలను మలచారు. అప్పటి రాష్ట్ర సంగీత నాటక అకాడమీలో సభ్యులుగా నృత్య అకాడమీ సంయుక్త కార్యదర్శిగా సమైక్యాంద్రప్రదేశ్లోని జానపద కళావైభవాన్ని జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలిపిన ప్రతిభాశాలి. గోపాల్రాజ్ భట్టును ఎరుగని గౌరవించని ప్రధానులు, రాష్ట్రపతులు నాడు లేనరడం అతిశయోక్తి కాదు. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి. నర్సింహారావు ప్రధానులు బాబూ రాజేంద్రప్రసాద్, డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ వివి గిరి రాష్ట్రపతులు. ఆయన ప్రదర్శనలను వీక్షించి అభినందించినవారే. దేశ సరిహద్దు నేపాల్ సైనికులను ఉత్తేజితులను చేస్తూ జానపద నృత్యాలను 300 మందికి పైగా కళాకారులతో నిర్వహించి జేజేలు అందుకున్న మహా కళాస్రష్ట. దేశంలోని అన్ని నగరాలతోపాటు పశ్చిమ, ఈశాన్య, రాష్ట్రాలలోనూ ప్రదర్శనలివ్వడమేగాక అక్కడి ఆదివాసి మూల వాసీయుల కళారూపాలను అధ్యయనం చేసి వారి కళారూపాలను దేశంలోని అన్ని ప్రాంతాలకు పరిచయం చేసిన సృజనశీలి, సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమిల్లి జనార్దనరెడ్డి వంటి వారేకాక ఎన్టీఆర్ సైతం ప్రభుత్వోత్సవాల్లో జానపద కళారూపాలపై గోపాల్రాజ్ను సంప్రదించేవారంటే ఆయనకు జానపదంపై ఉన్న అవగాహన విశేష పరిజ్ఞానానికి తార్కాణం. తెలంగాణ జానపద కళారూపాలు డప్పు - చిందు, యక్షగానం, గొల్లసుద్దులు, బతుకమ్మ, గోండు, థింసా, బోనాలు, శారద కథలు వంటి కళారూపాలతోపాటు రాజస్థాన్, జార్ఖండ్ మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల జానపద నృత్యాలు గుమాల్, సంతాల్, కోయి, కుండియత్వాస్, గిడ్డాలలో సైతం శిక్షణ ఇచ్చి ఆ కళారూపాలను దేశమంతటా ప్రదర్శించారు. జాతి సమైక్యతకు సంస్కృతి కళల పరస్పర అవగాహన సౌభ్రాతృత్వానికి వీరి ప్రదర్శనలు దోహదం చేసేవి. దేశరాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే ఉత్సవాల్లో 1952లోనే తెలంగాణ బతుకమ్మ ప్రదర్శించిన ఘనత ఈయనదే. లంబాడీ, గిరిజన తండాల వారిని హైదరాబాద్లోని తన ఇంటిలో వసతి కల్పించి వారిని ప్రదర్శనలకు తీసుకెళ్ళడంతో పాటు వారి జీవన శైలిలో మిళతమైన కళారూపాలను తన శిష్యులు చూసి నేర్చుకునేవిధంగా గురుకులాలని నిర్వహించిన గోపాల్రాజ్ భట్టు తన గృహానికి "జానపదం” అని పెట్టుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో ఏషియన్ గేమ్స్ ప్రారంభ, ముగింపు ఉత్సవాల్లో గోపాల్రాజ్ భట్టు 400 మంది కళాబృందంతో ప్రదర్శించిన నృత్యాలు అపురూపం, అపూర్వమని ప్రశంసలు అందుకున్నారు. పలు రాష్ట్రాల్లోని జానపద అకాడమీలలో సభ్యునిగా జానపదమే జీవనంగా ఆరు దశాబ్దాలు దేశీయ జానపద కళకు జీవితాన్ని అంకితం చేసారు. భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీని స్థాపించి రాష్టేతర ప్రాంతాల వారికీ శిక్షణనిచ్చి భవిష్యత్తు తరాలకు జానపదాన్ని అందించిన క్రాంతిదర్శి, నాడు ప్రభుత్వ కార్యకలాపాల్లో గోపాల్రాజ్ భట్టు బృందం జానపద నృత్యాలు తప్పనిసరి. దక్కన్ రేడియో ప్రారంభోత్సవం రవీంద్రభారతి ప్రారంభోత్సవం, ఉపగ్రహ దూరదర్శన్ ప్రారంభోత్సవంలతో పాటు ప్రపంచ తొలి తెలుగు మహాసభల ప్రారంభోత్సవ సందర్భంలో సినారె రచించిన తరతరాల తెలుగు వెలుగు నృత్య రూపకంలో ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కన్న పోతన, వాగ్గేయకారులు త్యాగయ్య, రామదాసు వంటి పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రంలో సంగీత నాటక అకాడమీ ఆవిర్భావ సందర్భంగా ప్రఖ్యాత నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణ శర్మ మోహినిగా కోరాడ నర్సింహారావు<noinclude><references/> {{rh|తెలంగాణ |165| తేజోమూర్తులు}}</noinclude> 98yy94fg1zqbko6jwqo8x1jwhkxg6rd పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/187 104 211465 553802 551485 2026-04-19T10:55:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 553802 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> భస్మాసురినిగా జాలరి నృత్యకళాకారుడు సంపత్కుమార్, శివునిగా నటించగా గోపాల్రాజ్ భట్టు వారికి సరి ఉజ్జీగా నారదునిగా నటించి మోహినీ భస్మాసుర నాటకాన్ని రక్తికట్టించిన సంగతి నేటికీ నాటి ప్రముఖుల మనస్సుల్లో నిలిచి ఉన్నాయి. గోపాల్రాజ్ భట్టు జానపద కళాకారునిగా గాక, బహుముఖాలుగా ఆయన ప్రతిభ ఆవిష్కృతమైంది. చిత్రలేఖనంలో ప్రవీణతపల్ల రంగలు సమ్మేళనంలో పూర్తి అవగాహన కల్గి కళాకారులకు పాత్రోచిత ఆహార్యం రూపకల్పన చేయగల ఉత్తమ రూపశిల్పి సంగీతంపై పట్టు ఉండడంతో శిష్యులకు పాటల్లోనూ శిక్షణ నిచ్చి, రాగ, తాళ జ్ఞానం నేర్పిన మంచి సంగీతజ్ఞుడు. వేదికపై రంగోద్దీపనం, రంగస్థల అలంకరణ మైక్ సెట్టింగ్లపై పరిజ్ఞానం గల థియేటర్ పర్సనాలిటి. దేశవ్యాప్తంగా బదువేలకు పైగా శిష్యులకు శిక్షణ ఇచ్చిన గోపాల్రాజు భట్టుకు శిష్యులు దేశవిదేశాల్లో ఎందరో. నలభైవేలకు పైగా ప్రదర్శనలు ఆయన కీర్తికిరీటానికి వన్నెలద్దాయి. శాస్త్రీయ నృత్యకారులను జానపదం నేర్చుకుంటే సహజమైన అభినయం పట్టుపడుతుందని చెప్పే గోపాల్రాజ్ రంగస్థలం ప్రేక్షకుల మనస్సులో నిలిచి ఉండేలా ప్రదర్శనఉండాలని శిష్యులకు బోధించేవారు. కేవలం కళా ప్రదర్శనలేగాక సామాజిక సేవా కార్యక్రమాల్లో నేను సైతం అంటూ ముందుకు వచ్చేవారు. దివిసీమ తుపాన్ సందర్భంగా తన కళాబృందంతో దాదాపు నెలరోజులపాటు ఆ ప్రాంతంలోనే ఉండి బంధుమిత్రులను ఆస్తులను కోల్పోయిన అభాగ్యులకు నూతనోత్సాహం తన ప్రదర్శనల ద్వారా ఇచ్చిన విశేషాలను నాటి వారు ఇప్పటికి చెప్పుకుంటారు. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు మెహమూద్ ఇబ్బందుల్లో ఉన్న సందర్భంలో సౌజన్యప్రదర్శనలు (చారిటీ షోన్) నిర్వహించి, వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు. ఇట్టి ఉదంతాలు ఎన్నో..... సినీ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య, రావుగోపాలరావు, కాంతారావు, ప్రభాకరరెడ్డి, గుమ్మడి, జమునలతో సన్నిహితంగా మెలిగినా సినీ నటునిగా స్ఫురద్రూపి అయినందున అవకాశాలు వచ్చినా జానపద కళకే అంకితమయిన జానపద కళాజీవి. జానపద గాయకుడు ఎం. నర్సింహమూర్తిని ప్రోత్సహిస్తూ తన ప్రదర్శనల్లో స్థానం కల్పించారు. జానపదానికి పర్యాయ పదంగా ఆ కళకు దశ, దిశ చూపిన నిర్దేశకునిగా గోపాల్రాజ్ భట్టు ఆరు దశాబ్దాల కళాజీవితం 2006 జనవరి 29లో అమరజీవనత్వం పొందింది. ఆయన వెలిగించిన జ్యోతిరేఖల్లో ఎందరో జానపద కళాకారులు వెలుగులోకి వచ్చారు. ఆయన వారసత్వంగా వారి ఇరువురి కుమారుల్లో ఒకరు రూపశిల్పి కాగా మరొకరు ప్రముఖ కథక్, జానపద కళాకారుడు రంగరాజు భట్టు. కుమార్తెలిరువురు జానపద నృత్య కళల్లో ప్రతిభాశీలురు. ఒక ప్రముఖుడు మాటల్లో... "Gopal Raj Bhatt highly disciplained, sensor of manner. Dressed simple with dedication, devotion. He himself and institution". '''అందుకున్న పురస్కారాలు...''' :1. డాక్టరేట్ - తెలుగు విశ్వవిద్యాలయం.. :2. జానపద నృత్యకళానిధి - ఆంధ్రప్రదేశ్ గిరిజన నృత్య అకాడమి :3. జానపద బ్రహ్మ - జంటనగరాల కళా సంస్థలు :4. జానపద కళాతపస్వి - రాష్ట్ర కళాకారుల సంఘం :5. జానపద కళాసామ్రాట్ జంటనగరాల సాహితీ సాంస్కృతిక సంఘాలు '''గౌరవ సభ్యత్వాలు ''' :1. సమైఖ్యాంధ్రప్రదేశ్ నృత్య అకాడమీలో సంయుక్త కార్యదర్శి :2. రాష్ట్ర సంగీత నృత్య అకాడమీలో సభ్యుడు :3. ఆకాశవాణి సౌత్ జొన్ (తంజావూర్, నాగపూర్) సలహామండలి సభ్యుడు :4. దూరదర్శన్ సలహామండలి సభ్యుడు :5. వివిధ రాష్ట్రాల్లోని జానపద అకాడమీలో సభ్యత్వం<noinclude><references/> {{rh|తెలంగాణ |166| తేజోమూర్తులు}}</noinclude> o5qwe1l0dnc6w35m4bb22k9ywyc0xwb పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/188 104 211466 553803 551486 2026-04-19T10:59:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 553803 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> '''రూపొందించిన జానపద నృత్య రూపకాలు ''' :1. వార్ అండ్ పీస్ :2. మాన్ అండ్ మెషిన్ :3. టెంప్టేషన్ ఆఫ్ బుద్ధ :4. శిల్పి :5. ఈగల్ :6. మాపల్లె :7. ఒలియో ఓలియో - బంగారు పంట :8. నా డేశం <poeem> 'రాజు మరణించే ఓతార రాలిపోయే కవియు మరణించే ఒకతార గగనమెక్కే రాజు జీవించే రాతివిగ్రహాలలోన సుకళాకారుడు జీవించే ప్రజల జీవితాల్లోనే' అన్నట్లుగా</poem> ఇప్పుడు వెలుగుతున్న ప్రతి కళాకారుడికి స్ఫూర్తిని, ఆదిలోనే ఎన్నో అవకాశాల్ని అందించిన గొప్ప కళాకారుడు గోపాల్రాజ్ భట్.<noinclude><references/> {{rh|తెలంగాణ |167| తేజోమూర్తులు}}</noinclude> 0gnns9tc0pxiuhjlpi09j2377why8ho పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/189 104 211467 553804 551487 2026-04-19T11:12:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 553804 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''49. గూడ అంజన్న '''</p>}} {{right|-డా॥ పసునూరి రవీందర్}} ప్రజలకోసమే కలం పట్టి, కడదాకా ఉద్యమాలకోసమే బతికిన ప్రజావాగ్గేయకారుడు గూడ అంజయ్య, అడవి బిడ్డల అమ్మవొడి ఆదిలాబాద్ లో ఒక మారుమూల గ్రామం లింగాపురంలో 1955లో పుట్టిన అంజన్న 61 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అందులో నాలుగున్నర దశాబ్దాల కాలాన్ని ఉద్యమాలకే కేటాయించాడు. ఫార్మసిస్టుగా కొలువు చేసినప్పటికీ, పోరాటాల్లోనే అతని జీవితమంతా గడిచింది. అంజన్న పాటలు విన్నా అంజన్నను చూసినా చీలీ దేశ ప్రజాగాయకుడు విక్టర్ జారా గుర్తుకొస్తాడు. ఉరితీసే ముందు ఆయన అన్న మాటలు గుర్తుకొస్తాయి. “నేను మీ చప్పట్ల కోసం పాడడం లేదు నేను మీ అభినందనల కోసమూ పాడడం లేదు నేను నా దేశ స్వాతంత్య్రం కోసం పాడుతున్నాను" అన్నాడు విక్టర్ జారా. సరిగ్గా అంతటి ప్రజా వాగ్గేయకారుడు గూడ అంజయ్య. తెలంగాణ విముక్తి కోసం తన చివరి శ్వాస వరకు అంకిత మయ్యాడు. సాధారణంగా చాలామంది ఉద్యమాల్లో పాటలు రాస్తారు. అవి ఆ ఉద్యమ లక్ష్యాలను ప్రచారం చేసి కనుమరుగవుతాయి. కాని, గూడా అంజన్న పాటలు సావులేని పాటలు. అందుకు సాక్ష్యంగా అంజన్న రాసిన అనేక పాటల్ని ఉదహరించవచ్చు. భారతదేశ సామాజిక స్వరూపాన్ని వర్గ దృక్పథంతో అర్ధం చేసుకొని కొన్ని పాటలు, ఆ తరువాత దళితోద్యమం ముందుకు వచ్చినప్పుడు అంబేద్కర్ను చదువుకొని మరిన్ని నెత్తురసొంటి పాటలు రాసిండు అంజన్న. ఆ పాటల చరిత్రలో చెరగని స్థానం అంజన్నది. నలభై ఏండ్ల కిందట విప్లవోద్యమం రాజుకుంటున్న వేళ అంజన్న రాసిన "ఊరు మనదిరా.... ఈ వాడ మనదిరా” అన్న పాట యావత్ దేశాన్నే ఊపేసింది. ఈపాట దేశంలోని పలు భాషల్లోకి ప్రజలు అనువదించు కున్నారు. విప్లవ సిద్ధాంతం ఏం చెబుతున్నదో తెలుసు కోవాలంటే అంజన్న రాసిన ఈ ఒక్కపాట చాలు. అలా సామాన్యుని గుండెను తట్టిలేపింది గూడ అంజన్న పాట. ఈ పాట భూస్వాముల గుండెల్లో ఫిరంగినా పేలింది. కూలీ చేసి ప్రతీ దళితుడు ఇది నాపాటే అనుకునేలా చేసింది. 'నడుమ దొరా ఏందిరో... దొర పెత్తనమేందిరో...' అని పాడుకునేలా చేసింది. కులమే ఈదేశంలో వర్దంలా మారి, ఆధిపత్యలను కొనసాగిస్తుంటే అంజన్న చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఆ ఆధిపత్యాలను కూలగొట్టడానికి అంజన్న తన పాట ద్వారా పథక రచన చేసిండు. ఈ పాటలో అంజన్న దళిత తత్వం పదపదాన ప్రతిధ్వనిస్తది. గ్రామం కింద కులాల రెక్కల కష్టం మీద నిర్మితమవుతుంది. ఆ నిర్మితమైన గ్రామం మీద దొరలు, భూస్వాముల పెత్తనం ఏంటని నిలదీసింది అంజన్న పాటే. "బండ మనదిరా... బండెడ్లు మనయిరా...” అంటూ, "సావు కాడ మనమే... సన్నాయికాడ మనమే...” అని<noinclude><references/> {{rh|తెలంగాణ |168| తేజోమూర్తులు}}</noinclude> 3f1wwoeiiy07at1ftafp9n6v7ud5eve పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/190 104 211468 553805 551488 2026-04-19T11:43:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 553805 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> దళితుల శ్రమను కీర్తించి అంజన్న ఊరుకోలేదు. "నడుమ దొర ఏందిరో.... దొర పెత్తనం ఏందిరో..." అంటూ దోపిడి గుట్టురట్టు చేసిండు అంజన్న. అలా అంజన్న పాటలు విప్లవోద్యమానికి జవజీవాలను అందించాయి. ప్రజా యుద్ధనౌక గద్దర్ వేదికలమీద ఈ పాటందుకుంటే జనం ఊగిపోయేవారు. అందువల్లనే ఈపాట గద్దరే రాశాడేమోనని చాలాకాలం పాటు జనం అనుకున్నారు. కాని, ఆ తరువాత గద్దర్ గూడ అంజన్న పేరును వెలుగులోకి తీసుకొచ్చాడు. అంజన్న కండ్లముందు ఊపిరిపోసుకున్నది తెలంగాణ ఉద్యమం. ఆనాటి అరవై తొమ్మిది నుండి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణ వెంటే నడిచిండు గూడ అంజన్న. మలిదశ ఉద్యమానికి జనాన్ని సన్నద్ధం చేసింది సాహిత్య సాంస్కృతిక రంగాలే. అలాంటి సాంస్కృతిక రంగానికి ముందునడిచిన నాయకుడు, గాయకుడు అంజన్న.తెలంగాణ ఉద్యమం రాజుకోవాలని అంజన్న కలగన్నాడు. ఆ కల అక్కడివరకె ఆగలేదు. తెలంగాణ వచ్చి తీరుతుందనే ఒక ఆశాభావాన్ని అందించే వరకు వెళ్ళేలా చేసింది అంజన్న పాట, 'ధూంధాం' వేదికల మీద కూడా అంజన్న పాటలు మరోసారి జనం గుండెల్ని తాకాయి. తెలంగాణ కోసం ఎందుకు పోరాడాలో చెప్పింది అంజన్న పాట. ఎలా తెలంగాణ సాధించుకోవాలో అంజన్న పాటే దిశానిర్దేశం చేసింది. రసమయి బాలకిషన్ వంటి గాయకులు అంజన్న పాటల్ని వేదికలమీద పాడితే జనం ఊగిపోయారు. పదిజిల్లాల గుండా అంజన్న పాటలు తెలంగాణ సాధించుకోవడానికి కావల్సిన భావజాల పునాదిని ఏర్పరచింది. తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక రంగం గురించి మాట్లాడితే, అందులో అంజన్న చేసిన అవిశ్రాంత కృషిని గుర్తు చేయాల్సిందే. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాటలు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జనం నోళ్ళల్లో నానుతున్నాయి. అంతటి శక్తివంతమైన పాటలు అంజన్నవి. తాను వాగ్గేయకారునిగా, ఉద్యమకారునిగా, కథకునిగా, నవలాకారునిగా మాత్రమే కాకుండా, గొప్ప మానవతామూర్తి కూడా. అందుకే తన తోటి కళాకారులను, కవులను, ఉద్యమాలను, పోరాటాలను గుండెల నిండా హత్తుకున్నాడు. ఏనాడూ ఉద్యమాన్ని మరిచి తాను దూరం జరిగింది లేదు. సాంస్కృతిక రంగం తనమీద పెట్టిన బాధ్యతను మరిచిపోయింది లేదు. అందుకే అంజన్న అస్వస్తతకు గురైతుండంటే యావత్ తెలంగాణ సమాజం ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంది. మరణశయ్య మీదుండి కూడా ఉద్యమాలనే కలగన్నాడు అంజన్న. ప్రజలకు విముక్తి కలిగించే ఉద్యమాలకోసం పాటల పహారా కాసిన కన్ను గూడ అంజయ్య. తెలుగు సమాజానికి సుపరిచితమైన ప్రజా రచయితే గూడ అంజయ్య. ఆయన పాటల్ని గురి చూసి గుండెల్ని తాకే చూపున్న పాటలు, ఆయన పాట పాడుతన్నా, వింటున్న ఈదేశంలో తిండి, బట్ట, నీడకు అల్లాడే పేదల దుఃఖం ఒక దృశ్యకావ్యమై మనల్ని కదిలిస్తది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే నెత్తురసొంటి శక్తి అంజన్న పాటలది. అవి ఉద్యమాల్ని రగిలించి మండించి, పేద ప్రజల వేదనల్ని, అంటరానివాళ్ల సంవేదనల్ని అర్థం చేయిస్తాయి. దోపిడి కోటల్ని కూల్చడానికి, బడుగుజీవులకు సరికొత్త శక్తిని నూరిపోస్తాయి. పాట రాయాలంటే, మిగిలిన రచయితలలాగ ఆయన పుస్తకాల్లోకి తొంగిచూడడు. ప్రజల మధ్యలోకి పోయి, వారితో మాట్లాడి, వారి బాధలను పల్లవులుగా, వారి కష్టాలను చరణాలుగా మలుస్తాడు. అందుకే గూడా అంజయ్య పాటలు మనలో ఒక తాత్మిక చర్చను లేవుతాయి. అలతి అలతి పదాలతో బతుకును సజీవంగా కండ్లముందుంచడం, ఆ జీవితాలు అలా ఎందుకు అయ్యాయో విడమరిచి చెప్పడం అతని పాటల లక్షణం. అందుకే బతుకును పాటలకు ఒంపిన జాత మన గూడ. నాలుగు దశాబ్దాలుగా తెలుగు నేల మీద అంజయ్య పాటలు ఉద్యమాలకు ఊపిరిపోశాయి. ఒక్క ఉద్యమంలో పాల్గొంటేనో, పనిచేస్తేనో ఒక మనిషి జీవితకాలం పూర్తవుతుంది. కొన్నిసార్లు ఆ ఉద్యమం గమ్యానికి చేరుకోక ముందే ఉద్యమకారుడు అలసిపోవడమో, అందులో నుండి నిష్క్రమించడమో జరుగుతుంది. అలాంటిది గూడా అంజయ్య మాత్రం తన పదహారవయేటనే విప్లవోద్యమంలో అడుగుపెట్టి, అందులో అనేకపాటలు రాసి, పాడి ప్రజల మధ్య జీవితాన్ని ఆరంభించాడు. అలా విప్లవోద్యమమే కాదు తెలుగునేల మీద పుట్టినదళితోద్యమంలో తన వంతు పాత్రను పోషించాడు. రెండు ఉద్యమాల్లో పనిచేసినా సరే తను అలసిపోలేదు. ప్రపంచం తలతిప్పి చూసిన మహత్తర తెలంగాణ ఉద్యమంలో కూడా తనదైన పాత్రను విజయవంతంగా పోషించాడు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం కూడా సిద్ధమై పదునైన పాటల<noinclude><references/> {{rh|తెలంగాణ |169| తేజోమూర్తులు}}</noinclude> dpf51flyn1tlt6o3rth3lei7greej4n పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/191 104 211469 553810 551489 2026-04-19T11:58:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 553810 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> నందించాడు. ఇలా అనేక ఉద్యమాల్లో ముందుండి పనిచేసిన ఘనత గూడ అంజయ్యదే. గూడ అంజయ్య తొలిపాట "ఊరిడిసి నేబోదునా...అయ్యో ఉరిపెట్టుకొని సద్దునా...". ఈ పాటకూడా గ్రామాల్లో దొరల దాష్టికాన్ని బట్టబయలు చేసింది. రైతులకు అప్పులిచ్చి పంటలు జప్తు చేసే దొరల దుర్మార్గాలకు బలై, ఊరిడిసి వలసపోయే ఓ పేదరైతు బాధను పాటీకరించాడు అంజయ్య ఈపాటలో రైతు బాధను ఉన్నది ఉన్నట్లుగా, తనను పలకరిస్తే వలపోసే తీరును సరిగా పట్టుకున్నాడు రచయిత. అందుకే అప్పుతెచ్చిన మాట నిజమే. అది వడ్డీకి తెచ్చింది నిజమే అంటాడు. ఈ పాటతో మొదలైన అంజయ్య ప్రస్థానం విప్లవోద్యమం మీదుగా దళిత, తెలంగాణ ఉద్యమాలను చేసి మరింత పదునెక్కింది. గూడా అంజయ్య పాటల్లో బాణీలు కఠినంగా ఉండవు. సామాన్యుడు సైతం, కోరస్ గా గొంతుకలిపే విధంగా ఉంటాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజల బాణీలను తీసుకొని, ప్రణా సమస్యలను వస్తువుగా జతచేసిన బండి యాదగిరి, సుద్దాల హనుమంతులకు వారసుడు గూడ అంజయ్య. అందుకే వారి బాటలోనే వారిలాగే ప్రాణమున్న పాటలను రచించాడు. పాటకు తగిన బాణి, భావానికి తగిన పదాల పొందిక, అందులో అంజయ్య జాగ్రత్తగా ఇమిడ్చే ప్రజల నుడికారాలు, సామెతలు పాటను శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి. తొంబైయవ దశకంలో తెలుగునేల మీద దళితోద్యమం పుట్టింది. ఉవ్వెత్తున లేచిన దళిత చైతన్యంతో మమేక మయ్యాడు అంజన్న. ముందు నడిచాడు. 1992 జూన్లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బి.ఎస్. రాములు వంటి సామాజికవేత్తలను పిలిపించి చారిత్రాత్మకంగా "దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక' 'దరకమే' ఏర్పాటుకు పునాది వేసిందు అంజన్న కంచికచర్లలో దళితుడైన కోటేశును సజీవదహనం చేసినపుడు అంజయ్య ఆ దారుణం మీద పాట రాశాడు. అప్పటిదాకా పాటలు మాత్రమే రాసిన అంజయ్య, దళితోద్యమంలో పనిచేసే క్రమంలోనే సాహిత్యంలోనే మిగిలిన ప్రక్రియల వైపు మరలాడు. అంబేద్కరిజం పరిచయమయ్యాక అంజన్నకు సాహిత్య ప్రక్రియలతో మరింత పరిచయం ఏర్పడ్డది. దళిత కథలు రాసి పుస్తకం వెలువరించాడు. అలాగే "పొలిమేరలు” అనే నవల రాసి, తెలుగు విశ్వవిద్యాలయం చేత, ఆ యేటి ఉత్తమ నవలగా అవార్డు కూడా అందుకున్నాడు. ఇది అంజయ్యలో మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం. వాగ్గేయ కారులంతా పాటల రచనవరకే పరిమితమవుతారు. అంజయ్య మాత్రం ఉద్యమ అవసరాల్లో భాగంగా, దరకమే సాన్నిహిత్యంతో కథకునిగా, నవలాకారునిగా మారాడు. విప్లవోద్యమంలో పనిచేసిన వాగ్గేయకారులంతా కొంత వెనుకపట్టు పట్టినప్పటికీ, అంజన్న మాత్రం మరో ఉద్యమానికి సిద్ధమయ్యాడు. దళిత, బహుజన రాజ్యాధికారం కోసం తాను కవి, రచయితగా, నవలాకారునిగా మారాడు. అలా ఒక పాటగాడు, ఉద్యమకారుడై, ఆతరువాత పలు సాహిత్య ప్రక్రియల్లో తన ముద్రను అనతికాలంలోనే వేయగలిగాడు. దళిత కథలు, నవలలు రచించాడు. ఇది మరో వాగ్గేయకారునిలో మనం చూడలేము. అందరూ పాట వద్దే ఆగిపోతారు. అయిన్న మాత్రం తన జాతి ప్రజలను మేల్కొలపడానికి సాహిత్యాన్ని ఆయుధంగా భావించి పలు రచనలు చేశాడు. అలా వాగ్గేయకారుడు అంజన్న కాస్త, కథకునిగా, నవలాకారునిగా దళిత సాహిత్యానికి మరింత సేవ చేశాడు. ఈ సేవను ప్రధాన స్రవంతి సమాజం సరిగా పట్టించుకోలేదనే చెప్పాలి. అందువల్లనే గూడా అంజయ్య అంటే కేవలం వాగ్గేయకారుడనే మాటే తెలుగు సమాజంలో స్థిరపడిపోయింది. అయినా అంజన్న ఏనాడూ నారాజు కాలేదు. ఆ తరువాత కాలంలో ముందుకొచ్చిన తెలంగాణ ఉద్యమంలో కాలు కదిపి ముందుకు సాగాడు. మరోసారి తనలో ఉన్న వాగ్గేయకారునికి పని కల్పించాడు. తెలంగాణా ఉద్యమానికి పాటే ప్రాణం పోసింది. కనిపించని శత్రువును, కాటేసే కుట్రలను కండ్లముందుంచింది పాటే. తెలంగాణ ఉద్యమం అరవైతొమ్మిదిలో పాలకుల చేతిలో దగాకాబడి మళ్ళీ 90ల తర్వాత పుంజుకోవడానికి పాటే ఆయుధంగా నిలిచింది. అలాంటి సమయంలో గూడా అంజయ్య రచించిన అనేక పాటలు తెలంగాణ ఉద్యమాన్ని పల్లెపల్లెకు చేర్చాయి. "నా తెలంగాణ... ననుగన్న నాతల్లి నా తెలంగాణ...” అంటూ పాటరాశాడు. అది మొదలుగా తెలంగాణ ఉద్యమం కోసం అంజన్న రాసిన పాటల్లో "పుడితె<noinclude><references/> {{rh|తెలంగాణ |170| తేజోమూర్తులు}}</noinclude> 39zs31u9pdjkgxpamw51v7ip9uxknp3 పుట:పటం కతలు.pdf/161 104 212057 553791 552579 2026-04-19T10:03:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 553791 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|144||పటం కతలు}}</noinclude> కృష్ణుని చేష్టలన్నీ నాటకీయంగా కనిపిస్తాయి. కథకుని గానంలో ఆ దృశ్యాన్ని నిందుగాపండిస్తాయి. <poem> {{left margin|5em}} 'ఒకరి చాటుననొకరు వయ్యన జోక చాటుగా నొకచెయ్యి చాటు బెట్టుకొక బట్ట బయటకి రారే ఓ భామలారా'</poem> అంటూ తాత్వికతను కనబరుస్తాడు కృష్ణుడు. ఇదే తాత్వికతను ఆధునిక కవి సి.నారాయణరెడ్డి... <poem> <left margin|5em}} 'చీరలు గావు తొలిగింది కనులు పొరలు ఎక్కింది చెట్టుగాదే అందని తొలిమెట్టు' లాంటి</poem> కృష్ణతత్వంలో ఇమిడించి నూతనత్వాన్ని కలిగించాడు. తెరచీరల కళాకారులు చేసే కథాగానంలో దేశీ దరువులు వైవిధ్యంగా కనిపిస్తాయి. చిరుతల రామాయణంలో ఉండే కృష్ణలీలలు దరువుల వలనే ఇవి కనబడతాయి. ఈ సాహిత్యంలో శ్రామిక పదజాలం, నుడికారాలు, వ్యంగ్యార్థాలు ప్రేక్షకుల్ని రసానందంలో తేలి ఆడిస్తాయి. తెలంగాణలోనే కనిపించే ఈ తెరచీరల కళారూపం ఇప్పటికీ సజీవంగా సాగుతూ వస్తోంది. ఆశ్రిత కళాకారులు వారి కథాగానం లో కళాభినివేశం తప్ప ఎక్కడా కూడా తమ మిరాశి హక్కులను కానీ, పోషిత కులాల ఆధిపత్యం కానీ కనిపించ నివ్వరు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ప్రాచీన కళారూపాల్ని ప్రోత్సహిస్తూ విశ్వవిద్యాలయాల వేదికల మీద, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని 'పీపుల్స్ ప్లాజా' వంటి వేదిక మీద ప్రదర్శనలు ఇప్పిస్తున్నది. కళాకారుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఈ తెరచీరల ప్రదర్శనలకు ప్రజల నుంచి తరగని ఆదరణ లభిస్తోంది. {{right|- నేతి మాధవి}}<noinclude><references/></noinclude> mng2hf28nqaeo93c6157vvhbpguaf0a పుట:పటం కతలు.pdf/162 104 212058 553792 552580 2026-04-19T10:08:53Z A.Murali 3019 553792 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 162 |bSize = 450 |cWidth = 425 |cHeight = 417 |oTop = 3 |oLeft = 17 |Location = center |Description = }} పటం కతలు - వ్యాసకర్తలు డా॥ అన్నావఝుల మల్లికార్జున్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ - 506002, ఫోన్: 9441454573 కట్టా ప్రతిభాగౌడ్ పరిశోధకురాలు ఇంటి నెం. 12-10-682/2, టి.ఆర్.టి. 188 ప్రక్కన, సీతాఫలండి, సికిందరాబాద్-61. ఫోన్: 8019771000 డా॥ బాసని సురేష్ ప్రాజెక్టు అసిస్టెంట్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్, ఫోన్: 9989417299 డా॥ గూడూరు మనోజ పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్నగర్, ఫోన్: 9704643240 డా॥ గడ్డం వెంకన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జానపద విజ్ఞాన అధ్యయన శాఖ, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్. ఫోన్: 9441305070 అబ్బు గోపాల్ రెడ్డి ప్రాజెక్టు అసిస్టెంట్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్. ఫోన్: 9948270796 ఆచార్య భట్టు రమేష్ పీఠాధిపతి జానపద గిరిజన విజ్ఞాన పీఠం, తెలుగు విశ్వవిద్యాలయం, వరంగల్. ఫోన్: 9440356386<noinclude><references/></noinclude> sytht81nxn1u4mr5mm8o100oibz390q పుట:పటం కతలు.pdf/164 104 212060 553794 552582 2026-04-19T10:12:11Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 553794 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 164 |bSize = 450 |cWidth = 446 |cHeight = 423 |oTop = -4 |oLeft = -3 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> sakoq2e66qufl54762pudo87ajqbywd పుట:Sangitarasataran022902mbp.pdf/31 104 212316 553744 553740 2026-04-18T12:36:21Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553744 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ఉ॥ పాలముజూడుడల్లదెలి కాలముమూలముదీనినెవ్వరే వాలుననొక్క వ్రేటునన వారితభంగిఁగడంగి రెండుగా లీలవెత్రుంపఁగావలయు లేశముఖండమునట్టునిట్టుగా దూలగరాదుశౌర్యగుణ ధూర్వహులారబలంబుచూపుఁడీ॥</poem> </div> భుక్కం - భళీ! ఇడేటివింతపరీక్ష. {{left margin|5em}}<poem>క॥ చెట్టులుకొట్టెడువానికిఁ బట్టిమెసంగెదవటంచుఁ బల్కితినిదియే పట్టునమెత్తురుళూరులు వట్టిదియాఘవతమాకు వద్దునృపాలా॥</poem> </div> రాజా మాకీస్వయంవరమక్కర లేదు. కాంతి — {{left margin|5em}}<poem>గీ॥ ఆడలేకయున్న నోడుమద్దెలగాదె చేతఁగాకయున్న రోతగాదె పండులందకున్న బండ్లుబులియుగాదె మాటలేలధీరమాన్యులార!</poem></div> అర్జు - పరీక్షులకుంగల ఫలమివరకేమాకుఁదెలిసియున్నది. ఈవరకునడచిన ఆశ్వారోహణము ధనుస్సంధానము గదాచాలనము మొదలుగాగల పనులఁదీరాజన్యులెల్లరు ఎంతటి న్యాయబుద్ధిగనపరచిరో. ఇందును అంతేఅగును కానిండు. ఈ వృక్షము నిప్పుడేతెగనేదెదంగాక (కత్తి యెత్తి చెట్టును గొట్టి చేయినొచ్చి కూలఁబడి) {{left margin|5em}}<poem>గీ॥ కేలుదద్దరిల్లె వ్రేలునుచ్చెను గాని చెట్టువీసమైనఁ జెదదయే</poem> </div> భుక్కం —— (కత్తి యెత్తి చూచి) {{left margin|5em}}<poem>గీ। మొక్కువోయెఁగత్తి మొనయుఁధునిగిపోయె నిలువ నేలనిచట నేలఁగూలి</poem> </div> అర్జు - (దిగ్గునలేచి నిష్క్రమణము) అందరును—(చప్పటులు) సిందు.—జయాపజయంబు లొక్కరిసొమ్ములుగావు. ఓడిపోయినవారు పారిపోవలనా. ఈయశోధరమాత్రము రాజకవ్యయై, ఇతరులు కాకపోయిరా! భుక్కం - {{left margin|5em}}<poem>గీ॥ పరుగు బెట్టలేక పైబలా దూరని పట్టుకువిధముగాదె ప్రబలులార</poem> </div><noinclude><references/></noinclude> 16chqmi9o3304q9oqf12ndfp9ier7lm పుట:Sangitarasataran022902mbp.pdf/32 104 212317 553779 2026-04-19T06:48:26Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 553779 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>నుందు - (తలయూచి) అట్లనా. గీ॥ మేలమాడవలెను మెప్పులీవలయు మో కార్యసాధనమున గానుపించు॥ (కత్తియెత్తి కొట్టనేరక) ఔరా! ఆయఃపిండముకంటెను గాఢతరమైనచేవ గలిగిన యీ వృక్షమొక్కండును ఖండింపఁజాలఁడు రాజన్యులారా! మానవబలంబున కసాధ్యంబయిన ఈ కార్యమింకొకరు నెరవేర్చినఁగదా మమ్ముదిరస్కరింపవలయును. చూచెదఁగాక (కూర్చుండును). భుక్కం — అవురు నేజెప్పియుండలేదా. ఈ పనిమానవులకు సాధ్యమని. ఆయాసపడితిరి. విశ్వయింపుడు. దేవ - సుబుద్ధమహీపాలా! ఆలకింపుము. {{left margin|5em}}<poem>క॥ ళూరులసేకులుగలరీ ధారుణినీయట్టిప్రబల ధర్మఁనిధిజ్ఞల్ పౌరుషమునెంతురంతీయ నారీమణియిచ్చఁగొనరు న్యాయముగలదే॥</poem> </div> కావున నీపుత్త్రికమనంబున నన్యునిఁదలపోయుచుండెనని యూహించి యావెన్కనీశపధంబునకు వెసుకదీసెదవేమో. యశో — చెలీ! నామానసమిప్పుడెంత భీతిల్లుచున్నది. ఈ దేవదత్తుఁడి కార్యము నిర్వహించెవా నాకింకేమిశరణము. దైవమునేనమ్మియున్న దానగదా. కాంతి — యశోధరా! భీతినొందకుము. క॥ మాటలుకోటలు దాటును పాటవమాసున్న యిట్టి బంటుల కెల్ల బోటికొనీ వాంఛలకే నాటికి భంగంబురాదు నమ్ము సుశీలా (ముందుకువచ్చి దేవదత్తునితో) అయ్యా నీకే మిసంశయము, నిక్కముగా నీయశోధర యశోధరుడైన శూరవ రు సేవరించుఁగాని యన్యులదలంపదు. సుÚ — దేవదత్తా ! కాంతీమతి యదార్థమువచించింది. దేప—(తనలో) ఔరా! లంక నీమాటపసం దేహ మువలదు, ఈకాంతిమతి తక్కుగల రాజన్యుల నెల్ల నేమో యా క్షేపించుచువచ్చె 'నాయెడల మిగుల గౌరముగా<noinclude><references/></noinclude> lk555miab3g0aeajq5a930888lhaxlp 553790 553779 2026-04-19T09:57:31Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553790 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>నుందు - (తలయూచి) అట్లనా. గీ॥ మేలమాడవలెను మెప్పులీవలయు మో కార్యసాధనమున గానుపించు॥ (కత్తియెత్తి కొట్టనేరక) ఔరా! ఆయఃపిండముకంటెను గాఢతరమైనచేవ గలిగిన యీ వృక్షమొక్కండును ఖండింపఁజాలఁడు రాజన్యులారా! మానవబలంబున కసాధ్యంబయిన ఈ కార్యమింకొకరు నెరవేర్చినఁగదా మమ్ముదిరస్కరింపవలయును. చూచెదఁగాక (కూర్చుండును). భుక్కం — అవురు నేజెప్పియుండలేదా. ఈ పనిమానవులకు సాధ్యమని. ఆయాసపడితిరి. విశ్వమింపుడు. దేవ - సుబుద్ధమహీపాలా! ఆలకింపుము. {{left margin|5em}}<poem>క॥ ళూరులసేకులుగలరీ ధారుణినీయట్టిప్రబల ధర్మఁనిధిజ్ఞల్ పౌరుషమునెంతురంతీయ నారీమణియిచ్చఁగొనరు న్యాయముగలదే॥</poem></div> కావున నీపుత్త్రికమనంబున నన్యునిఁదలపోయుచుండెనని యూహించి యావెన్కనీశపధంబునకు వెసుకదీసెదవేమో. యశో — చెలీ! నామానసమిప్పుడెంత భీతిల్లుచున్నది. ఈ దేవదత్తుఁడి కార్యము నిర్వహించెవా నాకింకేమిశరణము. దైవమునేనమ్మియున్న దానగదా. కాంతి — యశోధరా! భీతినొందకుము. {{left margin|5em}}<poem>క॥ మాటలుకోటలు దాటును పాటవమాసున్న యిట్టి బంటుల కెల్ల బోటికొనీ వాంఛలకే నాటికి భంగంబురాదు నమ్ముసుశీలా॥</poem> </div> {{right|(ముందుకువచ్చి దేవదత్తునితో)}} అయ్యా నీకేమిసంశయము, నిక్కముగా నీయశోధర యశోధరుడైన శూరవరు సేవరించుఁగాని యన్యులదలంపదు. సుప్ర — దేవదత్తా ! కాంతీమతి యదార్థమువచించింది. దేవ — (తనలో) ఔరా! యింక నీమాటకుసందేహమువలదు, ఈకాంతిమతి తక్కుగల రాజన్యులనెల్లనేమో యాక్షేపించుచువచ్చె నాయెడలనొ మిగులగౌరముగా<noinclude><references/></noinclude> 8h3gj0e44fa9euwdro1ohlx62pi26om పుట:Sangitarasataran022902mbp.pdf/33 104 212318 553793 2026-04-19T10:10:59Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 553793 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>బ్రత్య్రత్తరమిచ్చె. అదిగాక 'నీయశోధకయన్నది' నాయశోధరే అగునని కాఁబోలు. నాకేదక్కునని యర్థముతో నిన్నదిసుమా, అయిన నీ కాంతిమతి యింకేమిచింతించుచున్నదో చూచెదఁగాక (కాంతిమతినిజూచును కాంతిమతియుఁ దిరిగిచూచును) చిఱునవ్వుజూడ నాయెడవభిమానమునే సూచించు చున్నది. ఇదిగో రాజన్య భ్యులారా! వృక్ష కాండంబు ఖండించువాఁడను (కత్తి నెత్తి కొట్టబోవుచు కాంతిమతి సేమాచును చేయివదలికత్తి పడును). ఛుక్కం — భళీ సభ్యులారా ! రెండు ఖండములయ్యె నింకేమికావలయును. కాంతి—(ఆశ్చర్యముతో) ఏదీ రెండు ఖండములు. భుక్కం — దేవదత్తుని మనకాండము ముక్కలై తునియలై కకలములై భగ్న మైపో యినను భగ్నముకానినీతి సే కనిపించుచున్నది. -సబు—(నవ్వి) చాలు. చాలు. దేవదత్తా. నీ భుజబలము తెలిసినది. విచ్చేయుము. దేవ ——(కోపముతో) ఏమి యీపరిహాసము. గీ కత్తి నెత్తి ప్పకు కాండ మేయు. 'లేదు' కేలంగడలి నేలగూ లెగత్తి పరువు లెక్క కొనక పరిహసించితియ మొక్కు వాఁడి వెడలిపోవువాఁడ (నిష్క్రమణము) సర్వా (మెల్లన లేచి మిశ్రా చార్యుని(జూచి) గురుదేవా. ॥ పిన్న తనంబునం ఆచి విద్యఆఁ బెద్దలయొద్ద నాడు నే కన్ని గాల్చియుంటి భవదఁ రోజడ జో జవంబు తో జొన్న రభూజము బలభూపతిముఖ్యులు మెచ్చరెండు గా గన్న నదు.పమద్భుజ బలంబుద్ధిృశంబు మెసంగ వేగురూ! (నమస్కరించును) మిత్రా—(చేయెత్తి) సిద్ధార్ధసార్ధక నామకోయుఁడవుగమ్ము. సర్వా---(కత్తియెత్తి వృక్ష మును జూచి) చ|| జలజభవాండభాండమున సర్వవరా వరభూతకోటిలో వెలసి సమస్త లోకములఁ బెంపధరింపహరింప నేమహా బలము మొదల్తుదల్ కనక కౌగిలునట్టి మహాబలంబుని శ్చలిత మనస్క రణదలకు సారభుజద్వయశక్తి యుక్తి కై॥<noinclude><references/></noinclude> 1jraufg2osl57ynsgwrxh8u5wyhlqhz 553806 553793 2026-04-19T11:44:52Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553806 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>బ్రత్య్రత్తరమిచ్చె. అదిగాక 'నీయశోధకయన్నది' నాయశోధరే అగునని కాఁబోలు. నాకేదక్కునని యర్థముతో నిన్నదిసుమా. అయిన నీ కాంతిమతి యింకేమిచింతించుచున్నదో చూచెదఁగాక (కాంతిమతినిజూచును కాంతిమతియుఁ దిరిగిచూచును) చిఱునవ్వుజూడ నాయెడవభిమానమునే సూచించు చున్నది. ఇదిగో రాజన్యలారా! వృక్షకాండంబు ఖండించువాఁడను (కత్తినెత్తి కొట్టబోవుచు కాంతిమతినే చూచును చేయివదలికత్తిపడును). భుక్కం — భళీ సభ్యులారా! రెండు ఖండములయ్యె నింకేమికావలయును. కాంతి — (ఆశ్చర్యముతో) ఏదీ రెండుఖండములు. భుక్కం — దేవదత్తుని మన:కాండము ముక్కలైతునియలై కకలములై భగ్నమైపోయినను భగ్నముకానిరీతినే కనిపించుచున్నది. అందఱు - (నవ్వి) చాలు. చాలు. దేవదత్తా. నీభుజబలము తెలిసినది. విచ్చేయుము. దేవ —— (కోపముతో) ఏమి యీపరిహాసము. <{{left margin|5em}}poem>గీ॥ కత్తినెత్తివృక్షకాండమేయగలేదు కేలుసడలినేలగూలెగత్తి పరువులెక్క గొనక పరిహసించితిరీరు మొక్కువాఁడివెడలిపోవువాఁడ॥</poem></div> {{right|(నిష్క్రమణము)}} సర్వా - (మెల్లనలేచి మిత్రాచార్యునిఁజూచి) గురుదేవా. {{left margin|5em}}<poem>ఉ॥ పిన్న తనంబునంగఱచి విద్యలఁబెద్దలయొద్ద నాడు నే డన్నిటఁగెల్చియుంటి భవదంఘీ సరోజరారోజరజోజవంబున౯ బ్రోన్న రభూజము౯ బ్రబలభూపతిముఖ్యులుమెచ్చరెండు గా గ్రన్న నద్రుంపమద్భుజ బలంబుభృశంబుమెసంగవేగురూ॥</poem> </div> {{right|(నమస్కరించును)}} మిత్రా — (చేయెత్తి) సిద్ధార్ధసార్ధక నామదేయుఁడవుగమ్ము. సర్వా - (కత్తియెత్తి వృక్షను జూచి) {{left margin|5em}}<poem>చ॥ జలజభవాండభాండమున సర్వచవరాభూతకోటిలో వెలసిసమస్తలోకములఁ బెంపభరింపహరింపనేమహా బలము మొదల్తుదల్కనక భాసిలునట్టిమహాబలంబుని శ్చలితమనస్కత౯దలకు సారభుజద్వయశక్తి యుక్తి కై॥</poem> </div><noinclude><references/></noinclude> 1gdx41bsb6hf6qxprdamwjbk0gte8gc 553809 553806 2026-04-19T11:48:20Z Brjswiki 6801 553809 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>బ్రత్య్రత్తరమిచ్చె. అదిగాక 'నీయశోధకయన్నది' నాయశోధరే అగునని కాఁబోలు. నాకేదక్కునని యర్థముతో నిన్నదిసుమా. అయిన నీ కాంతిమతి యింకేమిచింతించుచున్నదో చూచెదఁగాక (కాంతిమతినిజూచును కాంతిమతియుఁ దిరిగిచూచును) చిఱునవ్వుజూడ నాయెడవభిమానమునే సూచించు చున్నది. ఇదిగో రాజన్యలారా! వృక్షకాండంబు ఖండించువాఁడను (కత్తినెత్తి కొట్టబోవుచు కాంతిమతినే చూచును చేయివదలికత్తిపడును). భుక్కం — భళీ సభ్యులారా! రెండు ఖండములయ్యె నింకేమికావలయును. కాంతి — (ఆశ్చర్యముతో) ఏదీ రెండుఖండములు. భుక్కం — దేవదత్తుని మన:కాండము ముక్కలైతునియలై కకలములై భగ్నమైపోయినను భగ్నముకానిరీతినే కనిపించుచున్నది. అందఱు - (నవ్వి) చాలు. చాలు. దేవదత్తా. నీభుజబలము తెలిసినది. విచ్చేయుము. దేవ —— (కోపముతో) ఏమి యీపరిహాసము. <{{left margin|5em}}poem>గీ॥ కత్తినెత్తివృక్షకాండమేయగలేదు కేలుసడలినేలగూలెగత్తి పరువులెక్క గొనక పరిహసించితిరీరు మొక్కువాఁడివెడలిపోవువాఁడ॥</poem></div> {{right|(నిష్క్రమణము)}} సర్వా - (మెల్లనలేచి మిత్రాచార్యునిఁజూచి) గురుదేవా. {{left margin|5em}}<poem>ఉ॥ పిన్న తనంబునంగఱచి విద్యలఁబెద్దలయొద్ద నాడు నే డన్నిటఁగెల్చియుంటి భవదంఘీ సరోజరారోజరజోజవంబున౯ బ్రోన్న రభూజము౯ బ్రబలభూపతిముఖ్యులుమెచ్చరెండు గా గ్రన్న నద్రుంపమద్భుజ బలంబుభృశంబుమెసంగవేగురూ॥</poem> </div> {{right|(నమస్కరించును)}} మిత్రా — (చేయెత్తి) సిద్ధార్ధసార్ధక నామదేయుఁడవుగమ్ము. సర్వా - (కత్తియెత్తి వృక్షమునుజూచి) {{left margin|5em}}<poem>చ॥ జలజభవాండభాండమున సర్వచవరాభూతకోటిలో వెలసిసమస్తలోకములఁ బెంపభరింపహరింపనేమహా బలము మొదల్తుదల్కనక భాసిలునట్టిమహాబలంబుని శ్చలితమనస్కత౯దలకు సారభుజద్వయశక్తి యుక్తి కై॥</poem> </div><noinclude><references/></noinclude> 7vk48a7ujsupm7w785sw0etksj3wnyl పుట:పటం కతలు.pdf/8 104 212319 553795 2026-04-19T10:15:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కృతజ్ఞతలు శ్రీ అజ్మీరా చందూలాల్ గారు మంత్రివర్యులు డా|| కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్. (6) ప్రభుత్వ సలహాదారు శ్రీ రసమయి బాలకిషన్ అధ్యక్షులు, సాంస్కృతిక సారథి డా|| నందిని సిధారెడ్డి చ...' 553795 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కృతజ్ఞతలు శ్రీ అజ్మీరా చందూలాల్ గారు మంత్రివర్యులు డా|| కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్. (6) ప్రభుత్వ సలహాదారు శ్రీ రసమయి బాలకిషన్ అధ్యక్షులు, సాంస్కృతిక సారథి డా|| నందిని సిధారెడ్డి చైర్మన్, సాహిత్య అకాడమి బి.ఎ.యస్. శ్రీ బుర్రా వెంకటేశం, బి. ప్రభుత్వ కార్యదర్శి శ్రీ దేశపతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి - మామిడి హరికృష్ణ<noinclude><references/></noinclude> fn6zajyewckqccjvw0aacl68pjedctp పుట:పటం కతలు.pdf/9 104 212320 553796 2026-04-19T10:21:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 553796 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{center|{{p|fs150}}'''ధన్యవాదాలు '''</p>}} 'పటంకతలు' పేరుతో వస్తున్న ఈ 15 వ్యాసాల సంకలనం ఓ అరుదైన, అపురూప ప్రయత్నం. దీనిని సాకారం చేసి చూపించిన తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ప్రసారం చేసిన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారికి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ నిరంతరం చేస్తున్న సాహితీ సేద్యానికి నిత్యస్ఫూర్తి ప్రదాతగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు! సాహితీ, సాంస్కృతిక, కళారంగాలలో తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడంలో మా శాఖ చేస్తున్న కృషికి నిరంతర ప్రోత్సాహాన్ని అందిస్తూన్న మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారికి, ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి ఐ.ఎ.యస్.(రి) గారికి, సాంస్కృతిక సారథి అధ్యక్షులు శ్రీ రసమయి బాలకిషన్ గారికి, సాహిత్య అకాడమి చైర్మన్ శ్రీ నందిని సిధారెడ్డి గారికి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం ఐ.ఎ.యస్. గారికి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. ఈ సంపుటిలోని పరిశోధనా వ్యాసాలను రచించడమే కాకుండా అవసరమైన సమాచారాన్ని కూడా అందించిన తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన కళాపీఠం, పీఠాధిపతి ఆచార్య భట్టు రమేష్ గారికి, డా. గడ్డం వెంకన్నగారికి, డా. బాసని సురేష్ గారికి, గంప సతీష్ గారికి, మిగతా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కళాయజ్ఞంలో తమవంతు పాత్రను విజయవంతంగా పోషించిన ఆకాశవాణి సిబ్బందికి ముఖ్యంగా చావలి దేవదాసు గారు, రాంబాబు గారు, విజయ రాఘవ రెడ్డి గారు, వి. గోపిచంద్ గారు, వై. శ్రీనివాసులు గారు, సుధాకర్ రెడ్డి గారు, నక్కా సుధాకర్ గారు, కె.నరేందర్రెడ్డి గారికి ధన్యవాదాలు. పుస్తక కూర్పులోను, నిర్వహణలోను అంతా తానై నిలబడ్డ శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు సహకారం అందించిన జమ్ముల శ్రీహర్ష, ధాత్రిక సాయి రఘునాథచరణ్, తమనం నాగేశ్వరావు, గోపిశెట్టి కార్యవర్ధి, కె. సందీప్, కె. నీలిమ, టి. శాంతిశ్రీ లకు ధన్యవాదాలు. ఈ పుస్తకంలోని వ్యాసాలను రచించిన పరిశోధకులు, రచయిత (త్రు) లకీ, ప్రూఫ్ చూసిన మధుకర్ వైద్యుల, సౌమ్య, శ్రీధర్ కు, ప్రచురించిన సంహిత గ్రాఫిక్స్ పద్మ గారికి, భాషా సాంస్కృతిక శాఖ సిబ్బంది రఘునందన్, నాగరాజు, ప్రసాద్, స్రవంతికి, ఇతరులకి ధన్యవాదాలు.... {{right|- మామిడి హరికృష్ణ}} {{right|విష్ణుభట్ల ఉదయశంకర్}} {{right|(సంపాదకులు)}}<noinclude><references/></noinclude> s6cznrehl9srwjv1tf7w3n60c9ar7bh పుట:పటం కతలు.pdf/10 104 212321 553797 2026-04-19T10:27:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 553797 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = పటం_కతలు.pdf |Page = 10 |bSize = 450 |cWidth = 90 |cHeight = 80 |oTop = 23 |oLeft = 63 |Location = center |Description = }} {{center|{{p|fs150}}'''ముందు మాట '''</p>}} {{c|'''ఆశ్రిత వర్గాల సృజనరూపాలు - పటం కతలు '''}} మానవవరిణామ క్రమంలో ఉత్పత్తివరంగా వ్యవసాయం ఎంత గొప్ప మేలుమలుపో, సాంస్కృతికంగా భాషను నేర్చుకోవడం అలాంటిదే! మనిషి మొదట్లో ఏకాంతజీవే కానీ కాలక్రమంగా సంఘజీవితాన్ని ఆరంభించిన తర్వాత తనతోటి మనుషులతో తన భావాలను పంచుకోవడానికి ఆధారంగా నిలిచింది భాష! ఆయా ప్రాకృతిక పరిసరాలు, అవసరాలు, వృత్తులను అనుసరించి ధ్వని సంకేతాలుగా మొదలైన భాష ఆ తర్వాత మానవ భావోద్వేగాలను అన్నిటినీ ధ్వనుల నుంచి సంకేతాత్మకంగా కూడిన పదాలు, వాక్యాలుగా మారింది. భావ ప్రసారానికి, హృదయస్పందనల వినిమయానికి, ఉద్వేగాల వ్యక్తీకరణకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదిగింది. అలా మొదలైన భాష వందలాది ఏళ్ళ పరిణామంలో ఎన్నెన్నో రూపాలను, ప్రక్రియలను, సాధించింది. ఈ ప్రస్థానంలో స్థూలంగా మనకు రెండు దశలు కనిపిస్తాయి. ఒకటి మౌఖిక భాష! రెండోది లిఖిత భాష తొలిదశ అంతటా, పూర్వ చారిత్రక యుగం అంతటా విస్తారంగా కనిపించేది ఆచరించేది మౌఖికభాషనే! అయితే మౌఖిక భాషాదశ వేలాది సంవత్సరాలు కొనసాగింది. కానీ లిఖిత రూపంలో మౌఖికభాషకు సంకేతాలు, అక్షరాలు కనుగొనబడి 'నమోదు చేయబడటం' (రికార్డు కావడం) అనేది మొదలై కేవలం 5 వేల సంవత్సరాల క్రితం నుండే అనేది చరిత్రకారులు నిర్ధారించిన విషయం. అందుకే మౌఖిక భాషకు సంకేతాత్మక కొనసాగింపుగానూ, రూపాంతరంగానూ లిఖిత భాషను చెపుతారు భాషాశాస్త్రవేత్తలు! దీని లోతులను ప్రస్తుతానికి పక్కనపెడితే, తొలిదశనాటి మౌఖిక భాష పరిణామంలో ఓ గొప్ప మలుపు 'కథనాలు చెప్పడం' అని Noam Chomsky వంటి భాషావేత్తలు చెప్తారు. పరిణామంలో మౌళిక భాష కేవలం సమాచార, భావప్రసార వినిమయ సాధనంగానేకాక, అంతకుమించిన 'సృజనాత్మకత' ను తోడుచేసుకోవడం ప్రారంభించినప్పటినుండి మౌఖిక సంప్రదాయం కొత్తపుంతలు తొక్కింది. మౌఖిక భాష మరింత విస్తరణకు గురైంది. కేవలం భావప్రసార స్థాయిని దాటి జనరంజక స్థాయిని, జనాలను ఆకట్టుకునే స్థాయిని చేరుకుంది. అలా భాషా ప్రాతిపదికగా మానవ సృజనాత్మకతకు ఒనగూడిన తొలితరం ప్రక్రియ 'కథ', 'కథ చెప్పడం'! లిఖిత రూపంలో, శాసనాలు, గ్రంథాలరూపంలో భాష 'రికార్డు' చేయని దశకన్నా ముందు కాలంలోని మౌఖిక భాషాదశలో కథలు చెప్పే 'మౌఖిక - శ్రవణరీతి' (చెప్పేవారికి మౌళికం, వినేవారికి శ్రవణం) అత్యంత ప్రముఖంగా జనాలను ఆకట్టుకునేదని చెప్పడానికి<noinclude><references/></noinclude> 70ecrr4xgselu51w9agj79sfsaznmug పుట:పటం కతలు.pdf/11 104 212322 553798 2026-04-19T10:28:45Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '' 553798 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude><noinclude><references/></noinclude> 6blhqhrde5y33c05h64eiyhk5018kgr పుట:పటం కతలు.pdf/12 104 212323 553799 2026-04-19T10:30:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '' 553799 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude><noinclude><references/></noinclude> 6blhqhrde5y33c05h64eiyhk5018kgr పుట:పటం కతలు.pdf/13 104 212324 553800 2026-04-19T10:30:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '' 553800 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude><noinclude><references/></noinclude> 6blhqhrde5y33c05h64eiyhk5018kgr