వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.46.0-wmf.24
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
పుట:Sarada Lekhalu Vol 1.pdf/167
104
59324
553926
553658
2026-04-20T23:12:24Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553926
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|141}}</noinclude>{{c|'''సౌభాగ్యవతియగు కల్పలతకు: -'''}}
'''నెచ్చెలీ!'''
ధర్మవరము లక్ష్మీదేవమ్మగారికి జబాబీయవైతివేమని నీవు వ్రాసిన ఉత్తరమును చూచితిని. నే నామె కీదినమే జాబు వ్రాసితిని. ఆజబా బిందుతో పంపుచున్నాను. కనుము.
సోదరీ! స్త్రీల నాటకరంగనిషేధమునుగూర్చి నేను వ్రాసిన లేఖకు నీవు వ్రాసిన ప్రత్యుత్తరము రెండు మూడు
మారులు జాగ్రత్తగా జదివితిని. అందలి తత్వమును గ్రహించుటకు వివేకసాధనమూ, అలిప్తబుద్ధియు, నవసరమని నీవు వ్రాసితివిగాని యీ రెండిటికంటె ముఖ్యావసరముగా గన్పడినది విసుగెరుగని యోపిక. పై శీర్షిక చూచి నాకేగదా యీ ప్రత్యుత్తరమని చదివితినిగాని దాదాపు నాల్గుపుటలు చదివిన గాని నాటకరంగప్రస్తావన రాకపోవుటచే యిది నాకుగాదేమో నని పలుమారులు తలంచిన సమయములుగూడ కలవు. కాని కడవఱకు జదువ నాకేనని నిశ్చయమైనది. దయచేసి నీ వా శీర్షికయందు నాపేరు తగిలించకపోయినచో విషయముకంటె యుపోద్ఘాతమే పెద్దదిగానున్న యావ్యాసమును చదువకనే
విడిచియుందును. చదివినతరువాతగూడ జబాబీయదగిన విశేషాంశములేమియు నందు గానరాకపోయినను, యావద్భారతీయులచేతను, నాదర్శకుడగు మానవోత్తముఁడుగను,<noinclude></noinclude>
jq7fbmqyn7aldrxytxejlvxq3955umt
పుట:Sarada Lekhalu Vol 1.pdf/168
104
59325
553927
553659
2026-04-20T23:19:29Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553927
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|142|శారదలేఖలు|}}</noinclude>పూజ్యునీయుడగు ప్రభువుగను, సతతస్మరణీయుడగు దైవముగను సంభావింపబడుచున్న శ్రీరామచంద్రుని గుణశీలములు నిందింపబడుటచేతను, భారతగాథ దూష్యమనుటచేతను, మనదేశమునం దిప్పు డమలునందున్న వైవాహికపద్ధతిచే మన స్త్రీలందఱు పరపురుషసంపర్కము చేయుచున్నవారే అనుట చేతను, నేను నీకు జబాబిచ్చు నవసరముగల్గినది. సోదరీ! నేను నీవంటి తత్వజ్ఞానము గలదానను గాకపోయినను నా సామాన్యబుద్ధికిఁదోచిన చందమున జబాబొసంగిన నా సాహసమునకు క్షమించి చదువగోరెదను.
ప్రపంచమునందలి ప్రతి మనుజుఁడును నేదియో మతమునకు జెందియుండుటయు, నా మతమునుగూర్చి తనకు తెలిసినను తెలియకపోయినను దానియం దభిమానగౌరవములు గలిగియుండుటయు లోకసాధారణము. అయితే మా మతగ్రంథమైన భగవద్గీతయందు మా కధికగౌరవమనిన యన్యమత గ్రంథములైన కొరాను, బైబిలులను నిరసించుటగాదు. ప్రతిమతమును సత్యధర్మాశ్రయమైయేయున్నది. నిజమైన హిందువులకు పరమతసహనము ఉత్తమలక్షణము. అట్టి వారికి ప్రతిమతమును పూజ్యమేయగును. మతమననేమి? స్వేచ్ఛాసహజమైన మానవుల వర్తనమును ఒకనీతికి ఒకధర్మమునకు ఒకసత్యమునకు ఒకసాంప్రదాయమునకు బద్దపఱచునదే మతము. విధినియమములులేని మత మెందును
లేదు. ఏమతము నవలంబించినను నామతనియమములు మాన<noinclude></noinclude>
mcrnyovrh6wntn81kaghsr4k2bc81b0
పుట:Sarada Lekhalu Vol 1.pdf/169
104
59326
553928
553660
2026-04-20T23:26:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553928
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|143}}</noinclude>వుని స్వేచ్ఛ నరికట్టకమానవు. ప్రతిమనుష్యుడును నేదేని మతమునకు జెందియుండుట విధినిషేధములులేని తన వృత్తిని యొక కట్టుబాటునకు బద్ధపఱచుకొనుటకే. “యోగ్యమూ, సాధ్యమూ, ఆవశ్యకమూ, హితకరమూ అయినటువంటి నూతనరీతిని నడచుట కేమతముగాని మార్గమునివ్వదు.”
తాత్కాలికానందమునుగూర్చెడి ప్రతివిషయమును మనుష్యులకు హితకరముగనే యుండవచ్చును. కాని జీవితముయొక్క యంగాంగమందునూ హితకరమునకు ద్రోవయొసంగుట కే మతముగాని యంగీకరింపదు.
జ్ఞానము జగన్మాన్యమగుట వాస్తవమే. అయినను నదియు నీతిసత్యములకు నిబద్ధమైనప్పుడే జగన్మాన్యతబడయును. మనుజుని జీవితవికాసమునకు దోడ్పడి యుచ్ఛస్థితికి గొనిపోవునది మాత్రమే నిష్కళంకజ్ఞానము. కాని మనుష్యుని విపరీత స్వేచ్ఛజ్ఞానముయొక్క నిదర్శనము కాజాలదు.
జ్ఞానులు తత్వజ్ఞులునైనవారు శ్రీరాముని జీవితమును దోషకలితమనుట కిదియే మొదలు. మన హైందవపురాణేతిహాసములలో నుత్తమము, నాదర్శమునునుగు నితిహాసమేదైనగలదనినచో నది శ్రీరాముని చరిత్రమే యని చెప్పక తప్పదు.
'రాముఁడు దుష్టుడు. ఆయన జీవితములో మోసము, కౌర్యము కానబడునేకాని విశేషసద్గుణము కనుపించుటలే'దని, నీవు వ్రాసితివి. రాముడు ధర్మజీవి. సత్యము, ధర్మము, నీతి<noinclude></noinclude>
t2g7ouuhiv8o2pcmkgw7rlywaqc4b96
పుట:Sarada Lekhalu Vol 1.pdf/170
104
59327
553929
553661
2026-04-20T23:33:31Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553929
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|144|శారదలేఖలు|}}</noinclude>త్యాగము ఈ నాల్గుసూత్రములయొక్క సారమే రాముడు. రాముఁడు సీతను పరిత్యజించుట స్థూలదృష్టితో గనిన నింద్యముగనే గోచరించును. కాని రాముని జీవితవిశేషముల నామూలాగ్రముగా గమనించినవారి కందు క్రౌర్యమేమియులేదు. ఆతఁడు తన జీవితమంతటను నిట్టిత్యాగము లెన్నియో గావించెను. పట్టాభిషేకము వనవాసముగా మారినపుడును, భరతుఁడేవచ్చి పాదాక్రాంతుఁడై రాజ్యమును స్వీకరింపుమని
కోరినప్పుడును, రాముడు చూపిన త్యాగము నిరుపమానమైనది. తండ్రిని సత్యవాక్యనిరతునిగా జేయుటయు, తాను పితృవాక్యపరిపాలనాధర్మము సకలంకముగా నెఱపుకొనుటయు ఆనాటి యాతని త్యాగమునకు కారణములు. రాముఁడే క్రౌర్యచిత్తుఁడు, మోసగాఁడునైనచో నట్టిత్యాగము గావించి యుండునా? అప్పటికి రాముని పలుకుబడి యెట్లున్నది? రాజు, ప్రజలు, మంత్రులు, బంధులు, మిత్రులు, అందఱు ఆయన పట్టు. రాముడే క్రూరుడైనచో ఆనా డెట్టి బీభత్సము జరిగి యుండవలెను. ఔరంగజేబువలె తండ్రిని చెఱలోనిడి తమ్ముల వధించి గద్దెయెక్కెడివాఁడు కాఁడా? కాని సాధులోకగణ్యుఁడగు శ్రీరామచంద్రు డెట్టి నిగ్రహము చూపెను! పరమాశ్చర్యముగదా! ఇఁక సీతాపరిత్యాగవిషయమున విచారింతము. రాముఁడు
<poem>
{{left margin|5em}}
యద్యదాచరితిశ్రేష్ఠః తత్తదేవేతరోజునః
సయత్ప్రమాణంకురుతే లోకస్తచనువర్తతే.
</poem><noinclude></noinclude>
ednzk36ii3onoc8zetbykdoygja3c4x
పుట:Sarada Lekhalu Vol 1.pdf/171
104
59328
553930
553662
2026-04-21T01:11:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553930
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|145}}</noinclude>అనగా శ్రేష్ఠుడు దేనినాచరించునో దానినే ప్రమాణముగా గొని లోకము వారి ననుకరించునని దాని తాత్పర్యము. కాన శ్రేష్ఠుఁడైనవాడు, లోకమున కాదర్శపురుషుఁడైనవాడు లోపరహితుడుగా నుండవలెను. కాన స్వార్థమును చంపుకొని లోకహితము గమనింపవలెనని రాముని ఆదర్శము. ప్రజల కోర్కెలదీర్చుట, ప్రజల యభిప్రాయము ప్రకారము నడుచుకొనుట, ప్రజలను కన్నబిడ్డలవలె బ్రోచుట యివి తన
పరిపాలనాధర్మములుగా బెట్టుకొనినాఁడు రాముఁడు. ఆ ధర్మమును నిలుపుకొనుటకే ప్రజల యిచ్చాను సారముగా సీతను పరిత్యజించెను. ఈవిషయమున నాతడు పరతంత్రుఁడు, ప్రజాభీష్టానువర్తి. కాన నీసందర్భమున మనము గుర్తింపవలసినది సూక్ష్మతరమైన యాతని ధర్మలక్ష్యముగాని బాహ్యక్రియ గాదు. అంతమాత్రముచే రాముఁడు క్రౌర్యవృత్తిగలవాడనుట పాడిగాదు. రామునకు సీతయం దపారమైన ప్రేమ
గలదు. గౌరవముగలదు. విశ్వాసముగలదు. ఇందులకు నిదర్శన మాత డేకపత్నీవ్రతుఁడై యుండి యశ్వమేధాదియాగ సమయంబులలోగూడ స్వర్ణసీతతో యజ్ఞతంతును నడుపుకొనుటవలననే. తెల్లమగుచున్నది. రాముఁడు గావించిన యిట్టి కృత్యమునకు సీత కాతనిపై యభియోగము నడుపగల
హక్కుగలదనియంటివి. నిజమే కావచ్చును. ఇక్కాలపు సీత యనగా మీ నాటకపు సీతయైనచో నట్టిపనిని తప్పక చేసెడిదే! కాని కృతయుగపు సీత యట్టిదికాదు. పెనిమిటి ధర్మ<noinclude></noinclude>
9a7cmn8pu2218wtrho6j3od2gttcrrv
పుట:Sarada Lekhalu Vol 1.pdf/172
104
59329
553931
553663
2026-04-21T01:16:48Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553931
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|146|శారదలేఖలు|}}</noinclude>తత్పరత యామెకును దెలియును. సత్యముకొఱకు, ధర్మముకొఱకు, ప్రజాహితముకొఱకు నా సర్వస్వము నర్పించెదనని యాతఁ డెన్నిమారులో పలికియుండెను కాన ఆతని ధర్మాచరణము నెఱిగియుండిన ధార్మికురాలగు సీత పెనిమిటిపై ఏమని వ్యాజ్యము నడపును? కావుననే యామె పెనిమిటిని పల్లెత్తి యొక్కమా టనలేదు. నిరపరాధయయ్యు, పామరజనుల సంతుష్టికొఱకును, పెనిమిటి ధర్మమును నిలుపుటకొఱకును దుర్భరమైన యాకష్టములను సహనముతో భరించెను.
రాముడు సీతనే గాదు, ఆబాల్యమునుండియు దన్ననవరతము సేవించిన లక్ష్మణునిగూడ నట్టులే త్యజించెను. ఆ నాడుగాదు, ఈనాడు మహాత్మాగాంధి తన జీవితచరిత్రలో నేమివ్రాసెనో కనుము.
"ఈ శోధనమున నేను నా ప్రియతమవస్తువులగూడ విడనాడగలను. మఱియు నే నీ శోధనయజ్ఞమున నా శరీరమునుగూడ హోమముచేయ సంసిద్ధుఁడను.”
సోదరీ! మహాత్ముల ధర్మలక్ష్యమట్టిది. అందుకు వారిని దుర్మార్గులని నిందించుట తగదు. ఇఁక మహాభారతమునుగూర్చి, ప్రద్వేషిణి పెనిమిటియగు దీర్ఘతముఁడు పుట్టంధుఁడు, వృద్ధు. అట్టివానిని నేను భరింపజాలననియు, నెక్కడకైన పొమ్మనియు ప్రద్వేషిణి చెప్పినది. ప్రద్వేషిణి చిన్నదిగాదు. గౌతమాదులైన పుత్రులను బడసిన యిల్లాలు. అట్టిది అంధత్వముచేతను, వార్ధక్యముచేతను ససమర్థుడై యున్న<noinclude></noinclude>
4ma9tiziheglaswo09v7fcxwtmuoch4
పుట:Sarada Lekhalu Vol 1.pdf/173
104
59330
553932
553664
2026-04-21T01:22:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553932
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|147}}</noinclude>భర్తను లేచిపొమ్మనెను. నిస్సహాయుడగు నా చీ కేమి చేయును? పాపము! కోపముపట్టలేక శపించెను. అందులకు కోపించి ప్రద్వేషిణి యాతనిని కట్టెలతో కట్టగట్టించి కొమారులచే గంగలో త్రోయించినది. ఇం దధికాపరాధ మెవరిది? దీర్ఘతమునిదా? ప్రద్వేషిణిదా? సోదరీ! ఇట్టి నారీరత్నమును సమర్థింపబూనుట నీ వాదమునకు బలము కాజాలదు. మహాభారతములోని యీ చిన్నయుపకథ భారతమంతయు దూష్యమని దూషించుటకు జాలినంత బలవత్ప్రమాణమును కాదు.
ద్రౌపదిని పందెమిడుట యక్రమమే. కాని యందును ధర్మసూక్ష్మత లేకపోలేదు. అందు కొంత యొప్పిదమేలేకున్న భీమార్జును లప్పుడే తిరుగబడియుందురు. ఇంతకును వారి యపూర్వత్యాగము, కష్టసహిష్ణుత, ధర్మబద్ధత, వినీతవర్తనమే లేకున్న వారు మనకు స్మరణీయులే కాకపోవుదురుగదా!
అయినను గుణదోషవిచారణలేక అందలి కథయంతయు సత్యమనియు అనుకరణీయమనియు నేను చెప్పలేదు. చెప్పను. ప్రస్తుత సాంఘికజీవనమున దూష్యములని నిందింపబడెడి యధర్మములెన్నియో అందు ధర్మములుగా నిరూపింపబడి యున్నవి. అవియెల్ల మన మాచరింపదగునని వాదించెడి వెఱ్ఱి నాకులేదు. మహాభారతమున నుత్తమపాత్ర లెన్నియో గలవు. వారి చరిత్రములు మనము పఠించి మన నిత్యజీవితమునకు సాధనములుగాగొని ధర్మమును సత్యమును నీతిని వికాసపఱచుకొనుటలో దోషమేమి? అభిమన్యునివంటి వీర<noinclude></noinclude>
3prxmz4zpurrs71lu7ju2wjbxv3jepn
పుట:Sarada Lekhalu Vol 1.pdf/174
104
59331
553933
553665
2026-04-21T01:28:55Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553933
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|148|శారదలేఖలు|}}</noinclude>కుమారుని చరిత, కర్ణునివంటి దానశూరుని గాథ, గాంధారివంటి మహాసాధ్వి చరిత్రము, భీష్మునివంటి సత్యవ్రతుని వృత్తాంతము, ద్రౌపదివంటి స్త్రీరత్నముయొక్క ధర్మపరిజ్ఞానము, బుద్ధికౌశలము, గృహనిర్వాహకత్వచాతుర్యము దెల్పెడి వృత్తములు మన కాదర్శపాత్రములు కాకేలపోవును? మఱియు
మన కాదర్శపాత్రములగు సావిత్రివంటి మహాసాధ్వీమణుల చరిత్రము లెన్నియో యందుపకథలుగా చేరియున్నవి. సోదరీ! భారతభాగవత రామాయణాది పురాణేతిహాసములు నింద్యములని నిషేధించినచో మీ నాటకకళాపోషణకైన కథలేవి? బహు సాంఘికములు, చారిత్రకములునని మీ యుద్దేశమేమో! ఆ విధముగా చూచినను రామదాసు నాటకమాడినచో నాతని యుపాస్యదైవము రాముడు. మీరాబాయియాడినచో నామె
దేవుఁడు కృష్ణుడు. మరల అక్కడగూడ పురాణపురుషులే ప్రత్యక్షము. ఎంత నింద్యములని దూషించినను ఆ పురాణేతిహాసములు విడనాడినచో మనకాడుటకు, పాడుటకు, చెప్పుకొనుటకు వేఱు తెన్నే లేదు. తొలుత యెంత తీవ్రముగ నిరసించినను పురాణగ్రంథముల సహాయమును, జ్ఞానముచే తగినంతమాత్రము అవశ్యముగ తీసుకొనుటకు అభ్యంతరము లేదని, నీవును ఒప్పుకొనక తప్పినదికాదు. ఇఁక నిదియే తగునని చెప్పిన నాపై నిశితవిమర్శన లెందుకు?
శివాజీవంటి మహాశూరుని తయారుజేయుటకు జిజీబాయి పురాణగ్రంథములనే ఆశ్రయించినమాట వాస్తవము.<noinclude></noinclude>
gcp2qlh711efc13rt418tdnrrd8h1i6
పుట:Sarada Lekhalu Vol 1.pdf/175
104
59332
553934
553666
2026-04-21T01:35:19Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553934
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|149}}</noinclude>ఆమాట శివాజీ చరిత్రమునందే గలదు. కాని ఆధునిక శివాజీల యుత్పత్తికి నీవు చూపెడి నవరీతులేమో ఆధునిక స్త్రీల వలన నికయెఱుగవలసియున్నది.
కళావంతులనియు, వేశ్యలనియు పిలువబడెడి యొకతెగ వారాంధ్రదేశమున గలరు. నృత్యగీతాభినయాదులు వారి కులవృత్తి. అవివాహితలగు నాస్త్రీలు పురుషులసన్నిధిని నృత్యగీతాదుల ప్రవర్తింప జేయుటచేత వారిలో నీతిభంగదోష మేర్పడినది. నీపోటీవ్యాసమునందిదియు నీవంగీకరించితివి. దీనికాసంఘీయు లిప్పుడు పొందుచున్న విచార మింతయంతగాదు. నృత్యగీతాదులు మానివైచి వివాహములు చేసికొని తొల్లిటి నైచ్యమును తొలగించుకొని సాటిస్త్రీలోకములో సమానత్వమును బడయుటకై వారిప్పుడు మహాకృషి చేయుచున్నారు. తొల్లి నాట్యాభినయములలో పాల్గొనిన వారిస్థితి కన్నులార గాంచుచు మరల కులస్త్రీల నీయగాధకూపమున బడద్రోయ నెంచుటయు, దానికి నీవంటి విదుషీమణులు చేయూతనిచ్చుటయు శ్రేయస్కరముగాదు.
శ్రీరవీంద్రనాధటాగోరుగారును, హరీంద్రనాధచటోపాధ్యాయులును తమ స్త్రీలను రంగభూమికి తెచ్చిరని వ్రాసితివి. అందుల కాప్రాంతీయులెంతకుందుచున్నదియు ఈమధ్య చెన్నపురిలో జరిగిన సనాతనధర్మసభ కేతెంచిన యొక బెంగాలీబాబు స్త్రీలను రంగభూమికితెచ్చి పాడుచేయుచున్నారని చెప్పి విచారించెను. కంటివా? కాన ఈయుద్యమమున కారాష్ట్రీయు<noinclude></noinclude>
hzr7eej1q14nfyk0wy5v122b150qn42
పుట:Sarada Lekhalu Vol 1.pdf/176
104
59333
553935
553667
2026-04-21T01:41:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553935
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|150|శారదలేఖలు|}}</noinclude>లైన యెక్కువ ఆమోదమును తెలుపుటలేదు. హిందూప్రేమ సంఘమువారాడిన నాటకమును చూచి మహాత్ముడు మోదించెనని వ్రాసితివి? సరియే. కాని ఇన్ని పాశ్చాత్యసాంప్రదాయములతో ఇన్ని అంగరంగవైభవములతో స్త్రీపురుషులు రంగభూమిని అభినయించుటను గూర్చి వారి ప్రత్యేకాభిప్రాయము
నడిగితెలిసికొంటిరా? గట్టిగా ఆయన అభిప్రాయము కోరినచో మహాత్ముడెప్పుడును అనుకూలాభిప్రాయ మియ్యడనియే నా యభిప్రాయము. అయినను మహాత్ము డంగీకరించినను యెల్లరంగీకరింపవలెనని సిద్ధాంతమా!
నాటకమనిన కేవలము శృంగారమనియే నా భావనకాదు. అందు నవరసము లొలికింపబడునని నేనెఱుఁగుదును. ఏరసమైనను నేవిలాసమైనను నాటకమనిన కపటసంసారము వంటిదనియు, అందొకచో శయ్యాగృహము, ఒకచో కొలువుకూటము, ఒకచో ఉద్యానవనము, ఒకచో యుద్ధము, ఒకచో శ్మశానము రంగస్థలములుగా నుండుననియు నాకు దెలియును. ఇట్టి భిన్నసమావేశముల కాస్పదమగు రంగస్థలమునందు స్త్రీపురుషుల కలయిక కులాంగనలకు సమంజసమును గౌరవాస్పదమును గాదు. ఈసందర్భమున సోదరీ, నీవు గావించిన హిందూవైవాహికప్రస్తావన మిక్కిలి యసమంజసముగా నున్నది.
ఎప్పుడు బాలిక కొక పురుషునితో వివాహము చేయబడునో అతడే తనవాడనియు తదన్యులు పరులనియు, విశేషించి సోదరతుల్యులనియు భావించి యాతని యందే లగ్నచిత్తలగుట<noinclude></noinclude>
bg0xxvp8byb0x1a4j1n06ix756vcjt4
పుట:Sarada Lekhalu Vol 1.pdf/177
104
59334
553936
553668
2026-04-21T01:48:27Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553936
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|151}}</noinclude>మన హిందూకుటుంబములయందు సాంప్రదాయముగానున్నది. పెనిమిటి యెంత దుర్మార్గుడైనను నేనతని దానినే యనుకొనును గాని ఆతడయోగ్యుడని పరపురుషవాంఛ కలిగియుండు టనునది దుర్జాతిలక్షణము. ఉత్తమురాలగు నేహైందవకుటుంబినియు నట్టి తలంపుకలిగియుండదు. మన హిందూకుటుంబములలో అందును బ్రాహ్మణకుటుంబములలో పతినివరించి పెండ్లాడెడి పద్ధతియింతవఱకు లేదుగదా. తలిదండ్రులు పరిణయము చేసిన వరునియందే యనురక్తులగుట వధువుల ధర్మముగా నున్నది. శారదాచట్టమువలన మునుముందీ వైవాహికపద్దతి మార్పునొందునేమోకాని యిప్పటిపద్ధతి స్వయంవరము కాదు. అట్టిచో అట్టి వివాహము లన్నియు సక్రమము లనియు నట్టివారు పరపురుష సంపర్కము చేసినవారనియు నిర్ధారించుట
సాహసము. తలిదండ్రు లెవనికొసంగిన వానినే పరదైవముగా నెంచి ప్రేమించి గౌరవించెడి హిందూస్త్రీలయెడ చిత్తమొకనికి శరీరమొకనికి యొసగుచున్నారని నీవు వ్రాసినవ్రాత మిక్కిలి యనుచితముగా నున్నది. ఇట్టి యూహ హైందవకుటుంబినుల యెడ తలపరాని విషయము. అటుల భావించినచో మన
బ్రాహ్మణ స్త్రీలలో వరించి వివాహమాడిన వారెవరు? అందఱము మన జననీజనకులచే నొకరికి దానము చేయబడిన వారమే. కాన నీమతమే నిజమగుచో మనము, మనతల్లులు, సోదరీమణులు, పుత్రికలు, వేయేల మన భారతమహిళ లెల్లరు చెడ్డవారే యనవలసివచ్చును, సోదరీ! మన వివాహసంస్కారమునందు లోపములున్నచో సంస్కరింప<noinclude></noinclude>
ix1kgara4iihs2s0a6gyvopd7gdtq2q
పుట:Sarada Lekhalu Vol 1.pdf/178
104
59335
553937
553669
2026-04-21T01:55:19Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553937
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|152|శారదలేఖలు|}}</noinclude>నగునుగాని నీనాటకరంగ ప్రవేశోద్యమసమర్థనముకొఱకు స్త్రీలనెల్లర కట్టగట్టి యిట్టి హేయమగు నిందకు గుఱిసేయుట కడుంగడు సాహసమే గాక యక్రమమనియు బల్క సాహసించినందుకు క్షమింపకోరెదను.
నాటకరంగమున స్త్రీలుచేరుటచే చెడిపోవుదురని నందులకు ఇప్పుడు బాగుగా నున్నవారెవ్వరు? వరించిపెండ్లాడని వానియందు ప్రేమ యెట్లుకుదురును? కాన యిప్పుడు మన స్త్రీలు చేయునది యంతయు పరపురుషసహవాసమేయని వాదింప దగునా? పతిచే పలుబాములు పడుచున్నను ఆతనినే దేవునిగా
భావించి బూజించుచున్న వారును, పతి విగతజీవుడుగా సర్వము వర్జించి వీరవైరాగ్యము సలుపుచున్నవారును నైన మన భారత మహిళల హృదయమెఱుగక నీవు వ్రాసిన వాక్యములు వారి మానసము నెంత నొవ్వచేయునోగదా?
జ్ఞానముచే మనస్సును పరిపక్వము చేసికొనిన వారికి పరపురుష సాన్నిధ్యభీతి లేదని వ్రాసితివి. మంచిది. నీవు సుశిక్షితలనుగా జేసిన కులీనస్త్రీ లట్టివారే గావచ్చును. కాని వారితో నభినయింపవచ్చిన పురుషులుగూడ నట్టివారు కావలెనుగదా. సరి. యత్నముమీద వారినిగూడ మంచివారినే సంపాదించెద రనుకొందము. కాని చూడవచ్చిన వారుగూడ బ్రహ్మజ్ఞానులు కావలెనుగదా. లేకున్న వారిచే నైన హేళనలు తప్పవుగదా. సోదరీ! ఏవేషభాషలు లేక బడికివెళ్ళి చదువుకొనివచ్చు కన్యలకే యిక్కాలమున మగ<noinclude></noinclude>
5j8km2blma19v1fj7px8kgapjslt4rm
పుట:Sarada Lekhalu Vol 1.pdf/179
104
59336
553939
553670
2026-04-21T03:21:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553939
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|153}}</noinclude>వారిచే మాటలు తప్పకున్నపుడు నాటకము లాడెడి కులీనస్త్రీలెత్తెఱగున మాటలు పడకుందురో నాకు దోఁచలేదు. హిందీప్రేమసంఘమువారాడిన నాటకములకు ఇష్టములేనివారు గూడ వచ్చిరని సంతసముతో దెల్పితివి. అవును ఇష్టములేనివారే యధికముగా వచ్చెదరు. కాని ఆవచ్చుట ఆక్షేపించుటకేగాని ఆమోదించుటకు గాదుసుమా! సోదరీ! మన దేశమున పురుషులింకను స్త్రీలవ్యక్తిత్వమును స్వాతంత్ర్యమును
ఆమోదించుట కలవాటుపడలేదు. స్త్రీలయందుగల నీరసభావము తొలగలేదు. వారి యాటపాటలను గౌరవముతో సమానముతో చూచుట నేర్చుకొనలేదు. కాన వారి చిత్తవృత్తులు మార్పు నొందనిది స్త్రీలు రంగభూములెక్కుట యుక్తముకాదు. కాన నీవును కళాభివృద్ధిచింత నటుంచి మన స్త్రీల పురోభివృద్ధినే చిత్తమునందధికమగా నెంచి స్త్రీల యశోహానికరములగు నిట్టి యుద్యమములకు చేయూతనీయవలదని ప్రార్థన. ఇది నాయొక్కతె ప్రార్థనయేగాదు. మన స్త్రీలలో అధికసంఖ్యాకు లిటులనే కోరుచున్నారు. ఇటీవల బెజవాడకు వెళ్లినప్పుడు నేను చాలమంది విద్యావతులతో ఈవిషయమై మాట్లాడితిని. మహాసభలో ప్రస్తావించితిని. అత్యధికసంఖ్యాకు లీయుద్యమమునకెట్టులు ప్రతికూలమున నుండిరో నీవుగూడ వచ్చినచో చక్కగా చూచియుందువు.
ఒక గొప్పస్త్రీవిద్యాసంస్థనడుపుచున్న యొక నారీమణి స్త్రీల నాటకరంగ ప్రవేశమునుగూర్చి ప్రసంగింపుచు ఇట్టు లనెను. "రామదాసు వేషమును రాఘవాచార్యులుగారు<noinclude></noinclude>
fmgzngivi4tob67x5r9tsdbmue3ov4r
పుట:Sarada Lekhalu Vol 1.pdf/180
104
59337
553940
553671
2026-04-21T03:28:50Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553940
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|154|శారదలేఖలు|}}</noinclude>వేస్తేబాగుంటుంది. వారివేషధారణమనిన జనులు అధికసంఖ్యాకులు వస్తురు. డబ్బుబాగావచ్చును. కానవారిని మావిద్యాసంస్థసహాయార్థం మొక్కప్రదర్శనమును కోరితె బాగుండు ననుకొంటిని. కాని వారి యిప్పటి స్త్రీల నాటకరంగప్రవేశయత్నమును జూచి సాయము చేయమంటే ఏఆడదాన్నైనా తనతో ఆడజాతికి పట్టుకరమ్మంటారేమో! అట్లా తీసుకురమ్మంటే ఎవతెను తీసుకవచ్చేది? ఏఅమ్మనైనా నీవు వస్తావా? అని అడిగితే నీవే ఆడరాదా? అంటుందేమోనని భయం. మఱిన్నీ రాఘవాచార్యులుగారు రామదాసుపాత్రను ధరించినచో రామచంద్రారెడ్డిగారు కబీరు పాత్రమును ధరించినగాని బాగుండదు. స్త్రీ లెక్కిన రంగభూమి నెక్కనని యీయన వ్రతము. స్త్రీలు స్త్రీపాత్రము ధరించినగాని నాటకమాడనని ఆయనపట్టు. ఈ సంగతి సందర్భములు చూచి వారిసహాయమును కోరుట మానుకున్నాను.”
సోదరీ! స్త్రీల భీతి యిట్టులున్నది. మఱియు నొక మనవి. నీప్రత్యుత్తరము దెల్లెడలను నేను జ్ఞానిని, తత్వజ్ఞురాలను, నాబుద్ధి యసాధారణమైనది యను నాత్మస్తుతియు విూరు వివేకరహితులు, అజ్ఞానులు, దురభిమానులు, అల్పబుద్ధు లనుపరనిందయు గోచరించుచున్నది. జ్ఞానులును విశేషించి తత్వజ్ఞులునునైన వారిట్టివిముందుగా త్రుంచివేసికొనదగినది యని తెలిసికొనగోరెదను.
{{rh|భావపురి||మిత్రురాలు}}
{{rh|జనవరి 1930||శారద.}}<noinclude></noinclude>
rhsm207ull07r2zvgj8qicdy7zhriup
పుట:Sarada Lekhalu Vol 1.pdf/181
104
59338
553941
553672
2026-04-21T03:34:52Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553941
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|155}}</noinclude>{{c|'''సౌభాగ్యవతియగు కల్పలతకు:-'''}}
'''నెచ్చెలీ !'''
ఏమిపెండ్లిండ్లు ! ఏమి ఊరేగింపులు ! ఏమి కోలాహలము ! అన్నివస్తువులకు ధరలు లేచిపోయినవి. గుడ్డల దుకాణములలో సరకు ఝాడాఅయినది. మార్కెటులో కూరలు శూన్యము. మాసినగుడ్డలతో మాగిపోతూన్నామని మొత్తుకొనుచున్నా చాకలివాండ్రు లగ్గసరి అని గుడ్డలుతుకుట మానుకొని పల్లకీమోతలతో పరువులెత్తుచున్నారు. ఇక భజంత్రీల గడబిడ సరేసరి. చంకనుండెడి పొదులు వంకెనువేసి తాళములతో మునిగితేలుచున్నారు. వంటలవారి, పురోహితబ్రాహ్మణులవారి ఆర్జన, అడావిడి చెప్పనక్కరలేదు. కానిమ్ము
ఎన్నాళ్లీరొద. దీనితర్వాత వీరందఱికి సుఖసుప్తియే గదా! మేళతాళము లింకా కొంతకాలము జీవించియున్నను పల్లకీలకు మాత్రము పూర్తిగా సెలవే. ఇఁక పెండ్లిండ్లకు వెళ్లివచ్చెడి పేరంటాండ్రకు బొత్తిగా తీరుబడిలేదు. ఇల్లుమఱచిపోయినారంటే సందేహములేదు. పెండ్లి, జోడుపెండ్లిండ్లు, పెండ్లిపైపెండ్లి, పెండ్లిలోపెండ్లి, కార్తిక మార్గశిర మాసములలో రైలువారికి రాబడి ముక్కాలు మువ్వీసము ఈ పెండ్లివారి
నుండియే! మదరాసు దక్షిణ మహరటారైల్వే కంపెనీవారు క్రిష్టమసుదినములలో కన్న యీ లగ్గసరిలో ఈపెండ్లి ప్రయాణికులకు తక్కువచార్జీలు యేర్పాటుచేసిన ప్రజలకు చాల ఉప<noinclude></noinclude>
penks8883ya9njgcvzsowlcvu7gt6pi
పుట:Sarada Lekhalu Vol 1.pdf/182
104
59339
553974
553673
2026-04-21T08:28:32Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553974
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|156|శారదలేఖలు|}}</noinclude>కారముచేసిరని కీర్తింపబడెడి వారే; కాని వారాపుణ్యమునకు పాలుపడలేదు.
అయితే యీ పెండ్లిండ్లప్రళయములో నాకు తగిలిన పేరంట మొకపెండ్లిదేకాని యీ పెండ్లిండ్లసందడివలన నేను పొందినంత శ్రమ, నిద్రనష్టము మఱియొకరు పొందియుండరు. ఏమందురా? గొప్పరాజవీధిలో మాయిల్లు; మఱియు రాజుబాటనానుకొనియే మాయింటి గోడ. చలికి వెఱచి, చూచుటకు విసిగి ఇంటిలో దట్టమైన దుప్పటి ముసుగుపెట్టుకొని పడుకొనినను ఆ యెడతెగని యూరేగింపుల మంగళతూర్యరవములు
చెవులలో దూరకుండ నేమి చేయగలను? కాన పెండ్లిండ్లు విరివిగా జరిగిన మార్గశీర్ష మాసమంతయు సుఖదమైన సుప్తి నెఱుగను. క్రిందటి వారములో ఒకనాటిరాత్రి ఓపిక పట్టుకొని వచ్చిన యూరేగింపు నెల్ల చూడవలెనని సంకల్పించుకొంటిని. నా పంతము చెల్లలేదు. అఱగంటలో అయిదూరేగింపులు వచ్చెను. ఒక ఊరేగింపుచూచి లోనికివచ్చి మంచముపై మేనువాల్చితినో లేదో మరల నింకొక పెండ్లివారి యూరేగింపులోని పెద్దబూరగల బూరటింపు చెవులు చిల్లులు పడజేసెడిది. మరల దానిని చూచివచ్చునప్పటికి కింకొకదాని బం, భం, బూ, బూ, అను ధ్వనులు వినవచ్చెడివి. ఎంతచూడగల వేడుకలైనను ఒకటి రెండయిన ముచ్చటగాని రే యెల్ల నదియే రొదయైద విసుగే కాకుండ అసహ్యముగూడ గలుగుట ఆశ్చర్యమా! ఇఁక చూడజాలనని పంతము నిడిచి పడుకొం<noinclude></noinclude>
km90u7h643243c0r3jlsndndxelfhl7
పుట:Sarada Lekhalu Vol 1.pdf/183
104
59340
553975
553674
2026-04-21T08:36:47Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553975
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|157}}</noinclude>టిని. కాని విరామ మెఱుగని మేళతాళములవలన నిద్రకుమాత్రమవకాశము లేకపోయినది. ఆ ఒక్కనాడేగాదు. మార్గశీర్ష మంతయు నిట్టి జాగారముల తోడనే గడచినది. అమావాస్య వచ్చినది. “నే డమావాస్య. రాబోవునది శూన్యమాసము. ఇక మేళతాళముల గొడవ యుండదు; ఈనాడైన సుఖముగా
నిద్రింత”మని పడుకొంటిని; కాని ఆ రాత్రి కూడా నాగాలేదు. ఒక వూరేగింపురానే వచ్చినది. ఆ పిల్ల మూడేండ్లు నిండియు నిండని పసికూన. కట్టుకొనిన క్రొత్తపరికిణి యెత్తియెత్తి దులుపుకొనుచు, తొడుగుకొనిన పట్టుచొక్కాను పట్టిపట్టి చూచుకొనుచు బొమ్మల పెండ్లిండ్లలోని బొమ్మవలె కూర్చున్నది. పెండ్లికొడుకో పదేండ్లవాడు. నిద్రచే తూగుచున్నాడు. మతిమాలిన తలిదండ్రులు తమపై వైచిన సంసారభారము నా
బాలదంపతులెఱుగరుగా! బహుశః యీ వైవాహికోత్సవము గూడ వారికి జ్ఞాపకముండదు. కాని యీ తంతులవలన కలుగబోయెడి కష్టనష్టములకు మాత్రము వారు బాధ్యులు. అకటా! ఎట్టి ఘోరతరాన్యాయము. తలచిన మసస్సు క్షోభజెందుచున్నది. దానితరువాత మఱినాలుగుదినముల కొకయూరేగింపు వచ్చుచున్నది. ఆ వధూవరు లిరువురు సరిగా యెనిమిదేండ్లవారు. పిల్లవాడు నల్లమొఖమల్లాగు, కోటు, వేసికొని యున్నాడు. పిల్లకొక పెద్దచీర చుట్టబెట్టి పొదలకమ్మవలె కూర్చుండ బెట్టినారు. ఆ బాలిక యా చీరలోబడి చిక్కములో పిట్టవలె కొట్టుకొనుచున్నది. రానున్న శాసనమువలని భయముచే సనాతనధర్మపరులలో కొంతసంస్కారము కలిగినది.<noinclude></noinclude>
540d5xv01i07ywkujnet7p0d60lm1lb
పుట:Sarada Lekhalu Vol 1.pdf/184
104
59341
553976
553675
2026-04-21T08:42:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553976
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|158|శారదలేఖలు|}}</noinclude>ఏమన తిథిదోషములు, వారపు పట్టింపులు, శూన్యము, మౌఢ్యమాదిగాగల నిషేధములు ఈయేటి పెండ్లిండ్లలో కానరావు. ఆపద్ధర్మముగా ఈసంస్కారమునకు శాస్త్ర మొప్పినదట. పాపము మన శాస్త్రములు చాలమంచివి. ఎవరికేవీలుగావలెననినను దాని కనుగుణ్యమగు నుదాహరణశ్లోకమును జూపి పూర్వాచారపరాయణుల రక్షించును. ఆ కల్పవృక్షము ప్రాపున వారుచేయని సాహసములేదు. పసిబాలలకు
పరిణయములు చేసిరి. కసుగందులను గూర్చుండబెట్టి గర్భాధానమంత్రములను వల్లెవేయించిరి. పానుపు వేయించిరి. మిథున విడియము లిప్పించిరి. బొమ్మ నప్పగింపజేసిరి. ఇట్టివివాహము లొకటియా? రెండా ? మాసములలో నుత్తమమైన యీ శుక్లసంవత్సర మార్గశిరమాస మంతయు నిట్టి శిశువివాహములతో
కళంకితమై పోయినది. మన మంగళాద్రి నృసింహుడేమి, తిరుపతి వేంకటేశ్వరుడేమి, సింహాద్రియప్పన్న యేమి యీ మాసములో తమ సన్నిధానమున నెన్ని శిశుకల్యాణములు జరిపించిరో లెక్కలేదు. రాళ్లుదేవుళ్లయిన రాసులు మ్రింగవాయని వేమనయోగీంద్రుడు సందేహించినట్టుగనే యీ శిశువివాహములలో దేవుళ్లు రాళ్లయినారు. లేకున్న ఆయాస్వాములవారల సన్నిధానమున తల్లిదండ్రు లిట్టి యక్రమ వివాహ
జరుప గలిగియుందురా?
కల్పలతా ! నాకీపెండ్లిండ్ల గడబిడచూచిన మనవారి మౌఢ్యమునకు మహాశ్చర్యమగుచున్నది. చేజిక్కిన పసిబిడ్డలకు<noinclude></noinclude>
6h7rx3o82dzqp90kbtrpcznpwg6exw6
పుట:Sarada Lekhalu Vol 1.pdf/185
104
59342
553977
553676
2026-04-21T08:49:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553977
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|159}}</noinclude>వివాహములు చేసినంత మాత్రమున శారదాచట్టమునుండి వీరెట్లు రక్షింపబడిరి ? ఇక సృష్టి ఆగిపోవునా? ఆడుపిల్లలు పుట్టరా ? పెండ్లిండ్లుకావా? అయ్యో? ఎంత చేదస్తులు. 'మన మీపిల్లలకు వివాహము చేసినమాత్రమున నేమైనది? ఎట్లు కావలసిన దట్లగు' నని వీరేల స్థిమితహృదయులు కాగూడదు?
పాపము ! తమ తమ ఆతురతకొలది పసిబిడ్డలగొంతులు కోయుచున్నారుగదా! కల్పలతా! ఏస్త్రీల యభ్యుదయము కొఱకై యీ శారదాచట్టము సృష్టింపబడినదో ఆస్త్రీల నీ రెండుమూడు మాసములలో జరిగిన యక్రమపు వివాహముల క్లేశ మర్ధశకాబ్దము పీడించును. ఇప్పు డవిమర్శకముగా పెండ్లి చేయబడిన యీ బాలదంపతులు పెద్దవారైన వెనుక అప్పుడు జరుగుచున్న ప్రౌఢవివాహముల గని కుతూహలమతులై తమ దాంపత్యములను చిందఱవందఱ చేసికొనినచో నప్పు డీ పరమశ్రోత్రియులగు తలిదండ్రులేమి చేయుదురో ?
నేడు నవనాగరికులు సైతము 'కూడునా, కూడదా' యని శంకింపుచున్న 'డై వోర్సుచట్టము'ను ఆనా డీశ్రోత్రియసంఘమువారే ఆడుబిడ్డల ఘోషచూడలేక ఆహ్వానింపవలసి వచ్చునేమో గదా? దేశకాలపాత్రములను గుర్తింపక తొందరపడుట యెందును లాభకారిగాదు. నేడు శిశువివాహములకు
సహాయభూతులై శారదా చట్టమునకు వ్యతిరేకప్రచారము గావించుచున్న శ్రోత్రియంమన్యు లీవిషయమును గమనింపకుండుట విచారకరమే గాదు ముందున కపాయకరముగూడ నగును సుమా.<noinclude></noinclude>
p89ccktr9u8bblj4v66ktu7558uvdc0
పుట:Sarada Lekhalu Vol 1.pdf/186
104
59343
553978
553677
2026-04-21T08:52:20Z
శ్రీరామమూర్తి
1517
553978
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|160|శారదలేఖలు|}}</noinclude>కాని విశ్వరక్షకుడైన పరమేశ్వరుని ఈ శిశువధూవరుల కెట్టి బాలారిష్టములు కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుట కంటె మనమిక నిప్పుడేమిచేయగలము ?
{{rh|భావపురి||మిత్రురాలు}}
{{rh|5 - 2 - 30||శారద.}}
{{rule|2cm}}<noinclude></noinclude>
hmmje9y5vxv3yiwxrvok246tew2wfiu
553979
553978
2026-04-21T08:52:40Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553979
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|160|శారదలేఖలు|}}</noinclude>కాని విశ్వరక్షకుడైన పరమేశ్వరుని ఈ శిశువధూవరుల కెట్టి బాలారిష్టములు కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుట కంటె మనమిక నిప్పుడేమిచేయగలము ?
{{rh|భావపురి||మిత్రురాలు}}
{{rh|5 - 2 - 30||శారద.}}
{{rule|2cm}}<noinclude></noinclude>
hym9hhsdfm090zwvrrgpqfigglhve34
పుట:Sarada Lekhalu Vol 1.pdf/228
104
59385
553965
186477
2026-04-21T07:46:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
553965
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{| class="wikitable" style="margin:auto;"
|-
| పుట || పంక్తి || తప్పు || ఒప్పు
|-
| 156 || 22 || రొదయైద || రొదయైన
|-
| 158 || 20 || వివాహ || వివాహములు
|-
| 159 || 11 || మర్ధశకాబ్దము || మర్ధశతాబ్దము
|-
| 161 || 10 || స్త్రి || స్త్రీ
|-
| 161 || 20 || భావనమే || భావనయే
|-
| 164 || 3 || ఒప్పుడు || కప్పుడు
|-
| 165 || 4 || నిరాక్షిణ్యము || నిర్దాక్షిణ్యము
|-
| 168 || 12 || నృజామ్యహ్యం || సృజామ్యహమ్
|-
| 169 || 11 || దార్మికసమరము || ధార్మికసమరము
|-
| 169 || 24 || బాబుజీ || బాపూజీ
|-
| 171 || 3 || కంఠస్వఠము || కంఠస్వరము
|-
| 172 || 16 || హృదయాకాశము || హృదయాకాశమునందు
|-
| 175 || 19 || యాత్రలుగూడ || గూడయాత్రలు
|-
| 176 || 2 || చెఱసాలలే స్వీయగృహంబులై || స్వీయగృహంబులే చెఱసాలలై
|-
| 178 || 8 || నాదుస్థితి || యాదుస్థితి
|-
| 180 || 16 || బెంగళూరు || బెంగుళూరు
|-
| 182 || 7 || వాళ్ల || వారి
|-
| 184 || 6 || అందిటున్నది || అందిట్లున్నది ||
|-
| 186 || 15 || కొననిరి || కొనిరి
|-
| 187 || 4 || ప్రజాపతినిధులు || ప్రజాప్రతినిధులు
|-
| 187 || 5 || మిల్కిలి || మిక్కిలి
|-
| 194 || 9 || ఆపుపేద || ఆవుపేడ
|-
| 194 || 20 || ఆవును || అవును
|-
| 200 || 9 || ఇళ్లువాకిండ్లు || ఇండ్లువాకిండ్లు
|}
64 - వ పుట 22 - వ పంక్తిలో (విూనాక్షి సుందరేశ్వరుని భార్య యనరు) అనుచోట (మీనాక్షి పెనిమిటి సుందరేశ్వరుడందురు గాని సుందరేశ్వరుని భార్య విూనాక్షి యనరు). అని యుండవలయును.<noinclude></noinclude>
b5488txxwyujpzhgsz10qz94nbp3n6w
553981
553965
2026-04-21T08:59:20Z
శ్రీరామమూర్తి
1517
553981
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{| class="wikitable" style="margin:auto;"
|-
| పుట || పంక్తి || తప్పు || ఒప్పు
|-
| 156 || 22 || రొదయైద || రొదయైన
|-
| 158 || 20 || వివాహ || వివాహములు
|-
| 159 || 11 || మర్ధశకాబ్దము || మర్ధశతాబ్దము
|-
| 161 || 10 || స్త్రి || స్త్రీ
|-
| 161 || 20 || భావనమే || భావనయే
|-
| 164 || 3 || ఒప్పుడు || కప్పుడు
|-
| 165 || 4 || నిరాక్షిణ్యము || నిర్దాక్షిణ్యము
|-
| 168 || 12 || నృజామ్యహ్యం || సృజామ్యహమ్
|-
| 169 || 11 || దార్మికసమరము || ధార్మికసమరము
|-
| 169 || 24 || బాబుజీ || బాపూజీ
|-
| 171 || 3 || కంఠస్వఠము || కంఠస్వరము
|-
| 172 || 16 || హృదయాకాశము || హృదయాకాశమునందు
|-
| 175 || 19 || యాత్రలుగూడ || గూడయాత్రలు
|-
| 176 || 2 || చెఱసాలలే స్వీయగృహంబులై || స్వీయగృహంబులే చెఱసాలలై
|-
| 178 || 8 || నాదుస్థితి || యాదుస్థితి
|-
| 180 || 16 || బెంగళూరు || బెంగుళూరు
|-
| 182 || 7 || వాళ్ల || వారి
|-
| 184 || 6 || అందిటున్నది || అందిట్లున్నది
|-
| 186 || 15 || కొననిరి || కొనిరి
|-
| 187 || 4 || ప్రజాపతినిధులు || ప్రజాప్రతినిధులు
|-
| 187 || 5 || మిల్కిలి || మిక్కిలి
|-
| 194 || 9 || ఆపుపేద || ఆవుపేడ
|-
| 194 || 20 || ఆవును || అవును
|-
| 200 || 9 || ఇళ్లువాకిండ్లు || ఇండ్లువాకిండ్లు
|}
64 - వ పుట 22 - వ పంక్తిలో (విూనాక్షి సుందరేశ్వరుని భార్య యనరు) అనుచోట (మీనాక్షి పెనిమిటి సుందరేశ్వరుడందురు గాని సుందరేశ్వరుని భార్య విూనాక్షి యనరు). అని యుండవలయును.<noinclude></noinclude>
cb7dmudxecpkpd32a8op3j8pevh939x
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/68
104
186331
553916
504554
2026-04-20T14:22:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553916
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>జంబులు మ్రొగ్గె. పంచభూతంబులు హాహాకారంబు లొనర్చె. వేరంబు మఱచి మోదంబు మాని చతుర్ముఖుఁడు తమ్మి గద్దెయు విడిచి దిగ్గనలేదె. సప్తసముద్రంబులు కలంగె. కులపర్వతంబులు వణంకె. భూమి పెటపెటం బగిలె. బ్రహ్మాండభాండంబు దిగఁబడియె. ఇంద్రాదిదిక్పాలకులు, సిద్ధసాధ్యకిన్నరకింపురుషగరుడోరగాదులు దిక్కొకమొగంబులై పాఱం జొచ్చిరి. అపుడు హవ్యవాహనుండు భయం బొంది, వేండ్రంబు మాని, యింద్రనందనునిచెంతకు బ్రాహ్మణరూపంబునం జనుదెంచి వినయంబున నిట్లనియె. 'మహాత్మా, నాయెడం దయ సేయుము, ఏ దేవునిం దలంచినంతమాత్రననె నూఱువేల యశ్వమేధంబులు, పదిలక్షల షోడశమహాదానంబులు, కోటితీర్థయాత్రలు ననేకకోటివ్రతంబులుం జేసినఫలంబు లభించు, నట్టి శ్రీవత్సాంకుండును, రమాకళత్రుండును, బరమపవిత్రుండును, బరంజ్యోతియుఁ బరబ్రహ్మంబును, వేదాంతవేద్యంబు నైన పరతత్త్వంబు నీయింట నుండి కంటికి రెప్పగాచినచందంబున నిన్నుం గాచుచునుండి నాబోటులకుఁ దేఱి చూడందగునే? శ్రీహరిని విసర్జించి, దేవతాంతరంబు లపేక్షించునతండు, పాలసముద్రంబు దొరకినను బాలకై మేకను బితుకువానిచందంబున, సూర్యకిరణంబులఁ గాదని మిణుంగుఱుఁబురువుల కాసపడు నపస్మారి వితంబునఁ, బరిహాసయోగ్యుం డగుం గావున, నంబుజోదరదివ్యపాదారవిందవందనానందంబునం బొదలునీకు నశ్వమేధాదియాగంబులు సిద్ధించుట యెంత వింత? నాకు మామయైన మాహిష్మతీపురాధినాథునిం దోడ్కొని వచ్చి నీకు సేవకునిం జేసెద. ఇమ్మహానారాయణాస్త్రం బుపసంహరింపు' మని ప్రియవాక్యంబుల వేడుకొనుటయుఁ, గ్రీడి పావకుని యెడఁ బ్రసన్నచిత్తుండై యమ్మహాస్త్రంబు నుపసంహారంబు గావించిన, నగ్నిదేవుండు భండనంబునం బడినసేనలనెల్ల నైంద్రజాలికునిపగిది మగుడన్ బ్రదికించి, యర్జునునకుం బ్రదక్షిణంబు గావించి, పురంబునకుం జనియె. అనిన విని జనమేజయ నరేంద్రుండు జైమిని మునీంద్రుం గనుంగొని పావకుండు నీలకేతున కెవ్విధంబున నల్లుం డయ్యెనని యడిగిన నతఁ డిట్లనియె.
{{p|ac|fwb}}అగ్నిదేవుని వృత్తాంతము</p>
రాజేంద్రా, నీలధ్వజుని పట్టంపురాణి జ్వాలయను వధూటి కలదు. అప్పురంధ్రీమణికి నీరేడులోకంబుల నీడుజోడుకాని చక్కదనంబుల నుతికెక్కిన స్వాహా నామధేయయగు కన్యకారత్నంబు గలిగిన, నాతరుణి జవ్వనంబును,
సౌందర్యంబు, గుణంబు, లీలావిలాసంబు, త్రిభువనమోహనంబులు గావున<noinclude><references/></noinclude>
4mu044vlps0dasvu30rj2nu2nlihtve
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/69
104
186332
553925
504555
2026-04-20T20:41:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553925
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దానికిం బెండ్లి సేయందలంచి, నీలధ్వజుండు రూపలావణ్యవంతులు, కీర్తిమంతులు నైన రాజకుమారులఁ, బెక్కండ్ర వ్రాసి తెచ్చిన చిత్రపటంబులు సూపి, యందొక్కని వరియింపుమనిన, నగ్గజగమున సిగ్గునం దలవొంచి, 'మదాంధులు గర్వగ్రంథులు వసుంధరాధిపతులు. తక్కిన మానవులెల్ల దీనులు. వారల శరీరంబులు నిత్యంబులు గావు. కావున మర్త్యుల వరియించుట నాకు సమ్మతంబు గాదు. అమర్త్యులందు నొక్కరుని వెదకు' మనిన, నీలకేతుండు కూఁతుంజూచి 'మంచిది వాసవుని రప్పించెద వరియింపు' మనిన, నమ్మదిరాక్షి మదిలోన విచారించి, 'సురపతి నాకుం దగినపతి యగుంగాని, యతండు జారుండు. తపోవిఘ్నకరుండు. కులగోత్రవిదారుండు. సవికారుండు. అదియుంగాక, దేవాదిదేవుండైన శ్రీవిష్ణుదేవునిం దనకుఁ దమ్మునిగా నెంచి భక్తి గావింపఁడు. కావున దేవేంద్రుండు సమ్మతుండుగాఁ'డన, నతండు 'మఱి యెవ్వరిం గోరుదు?' వనిన, 'యగ్నిదేవుండు జగత్పూజ్యుండు. దేవతలకెల్ల నగ్నిముఖంబని వేదవచనము గలదు' కావున నతనియెడ నాభావము నిలిచి యున్నయది. పతితోడం గూడి ననుగమనంబు సేయం దలంచిన సతి తనశరీరం బాహుతి గావించెనని దాని దురితంబుల నడంచి కైవల్యంబు నొసంగం జాలునట్టి దైవం బగ్నిదేవుండు దక్క వేఱొక్కరుండు లేడు. సురగరుడోరగవిద్యాధరసిద్ధసాధ్యచారణగంధర్వాదులలో నొక్కరుండును నామనంబునకు సమ్మతుండు గాఁడు. వైశ్వానరునియందు నాడెందంబు లగ్నం బయ్యె' ననినఁ, జెలులు నవ్వుచు నప్పువ్వుబోఁడిం జూచి, 'యేమని కోరితివమ్మా! రాజుచుండెడు మొగం బేమి! నిప్పులు కుప్పళించు నడక లేమి? సర్వభక్షకత్వ మేమి? ఎచ్చటకు వచ్చినం గాల్చుట యేమి? పోయినమార్గం బెల్ల మలినంబగుట యేమి? ఇట్టివానిం బెండ్లియాడు నాఁడువారుం గలరె? అదియునుంగాక, రెండుతలలతోడి మూఁడుకాళ్ళముదుసలిని వరియింపందగునే?' అనిన సఖీజనంబుల వాక్యంబులు నిరాకరించి, తండ్రిచే ననుజ్ఞఁ గైకొని, తపోవనంబునకుం బోయి, నియమవ్రతంబు సంకల్పించి, సమంత్రకంబుగా
వైశ్వానరు నావాహనంబు సేసి, కర్పూరంబు, కుంకుమంబు, కస్తూరియు నగరుచందనంబు, మలయజంబును, లవంగశరక్కరామృతపాయసంబులు, తేనెయు, బిల్వఫలంబులు, తెల్లచెఱకులు, కదళీఫలంబులు, తాంబూలంబులు, మొదలైన పూజాద్రవ్యంబులు దెచ్చి హోమంబు నర్చనంబునుం జేయుచు, బహుకాలంబు భజించుటయుఁ, జిచ్చుదొర మెచ్చి, నృపాలుని పురంబునకు వచ్చి, విప్రరూపంబున రాజ<noinclude><references/></noinclude>
hoe3y800wf4eldmozrwhyojxqop21mq
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/70
104
186333
553938
504556
2026-04-21T02:49:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553938
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మందిరంబు సొచ్చి, సముచితోపచారంబులఁ బూజితుండై, 'మహీశ్వరా, నీకన్యయగు స్వాహావధూరత్నంబు నాకుం గన్యాదానంబు సేయు' మనిన, నీలధ్వజుండు ధూమధ్వజునిం జూచి, 'నాకన్యక యగ్నిదేవునిం దక్క నితరుల నొల్లదు గావున, వేఱొక్కకన్నియ నొసంగెద వివాహంబు గ' మ్మనిన, ననలుండు నిజరూపంబుఁ జూపిన, రాజు ప్రమోదభరితుండై, స్వాహాకన్యకను జిత్రభానునకుఁ గన్యాదానంబు సేసె. అది మొదలుగా వీతిహోత్రుండు వారియింట నిల్లంట్రపుటల్లుండై తత్పురంబు రక్షించుచు, వైరులుమీఁదం దార్కొనుచు నతనికి నస్త్రంబైయుండె. ఇది జాతవేదుండు నీలధ్వజునకు నల్లుఁడైన తెఱం" గని వివరింప జనమేజయుం డవ్వలికథ సెప్పుమనుటయు, జైమిని యిట్లు సెప్పందొడంగె.
అవ్విధంబున ధూమకేతనుండు నీలకేతనుని సమ్ముఖంబునకుం బోయిన నతఁడు నల్లునిం జూచి 'శత్రుసైన్యంబు నిశ్శేషంబుగా దహించి వచ్చితివే?' యని యడిగిన ననలుం డతనిం జూచి, 'నరేంద్రా, అర్జునుండు నారాయణపరాయణుండు కావున నావ్యుహంబు నాకు దురవగాహంబు. దాహంబు నొందింపఁగూడదు. అదియునుంగాక, తొల్లి దేవేంద్రుఁడు ప్రయోగించిన వజ్రాయుధంబు స్తంభింపజేసి ఖాండవవనంబు నా కాహుతి సేసె, నయ్యుపకారంబు దలంపక యతనితో నాచేత నైనయంతఁ బోరితి, నింక నాకు నసాధ్యంబు. నీవు నిరర్థకవిరోధంబు పాటింపక యాగహయంబు రయంబునఁ గొనిపోయి పార్థున కొసంగి కృతార్థుఁడవు గమ్ము.' అనిన రాజపుంగవుండు తన కులాంగనయగు జ్వాలాసతిం గనుంగొని 'యల్లుండైన యగ్నిదేవుఁడు మనకు హితంబు సెప్పెఁ గావునఁ గ్రతుఘోటకంబుఁ గొనిపోయి కిరీటికి నప్పగించి స్నేహంబు గావించుకొనియెద ననిన, దంటయగు నావాలుగంటి తననాథునితో, 'ముక్కంటివాఁడు పెనంగె నేనియుఁ జలపట్టి తన పట్టినకార్యంబు విడువక కీర్తిఁ జేపట్టుట రాజధర్మంబు. సాహసంబు సేయక శ్రీయును కీర్తియుఁ గలుగనేరవు. పట్టినగుఱ్ఱంబు మగుడనిచ్చి యతని వేడుకొనంబోయితివేని, సరిరాజులు నవ్వరే! గెలిచితివేని నరలోకరాజ్యంబును, మృతుండ వైతివేని సురలోకరాజ్యంబును ననుభవించెదవు. పరునకుం బ్రియంబు సెప్పి బ్రతుకుటకంటె క్షత్రియునకు మరణంబు మేలు.' అనిన విని, యమ్మనుజనాథుఁ డట్లే కావించెద' నని యమ్మించుఁబోఁడితోఁ బంతంబులు పలికి రణభేరిభాంకారంబులును, గజఘీంకారంబులును, శింజినీటంకారంబులును సెలంగ, నహంకారంబున సేన<noinclude><references/></noinclude>
o95022tr8e6ylaboh5cq957u4gillqi
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/71
104
186334
553942
504557
2026-04-21T03:57:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553942
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లం బురికొల్పికొని, పురంబు వెడలి, పురందరనందనునితోడం దలపడుటయు, గాండీవి గాండీవగుణధ్వని దిక్కులు గ్రక్కదలంజేయు ప్రళయకాలనీలజలధరంబు వర్షించినతెఱంగున నంపరలపరంపరల వెంపరలాడుటయుఁ, బడిన యేనుంగులును, మడిసిన గుణంబులును, బొడియగు రథంబులును, జడిసిన వీరభటులును, దునుకలైన కేతనంబులును, దుమురులైన గొడుగులును, ద్రుంగిన సేనాంగంబులును, విరిగిన కైదువులును, విటతాటనంబులైన మైమఱువులును, విశకలితంబులైన కిరీటకేయూరహారాదిభూషణంబులును, వ్రేలెడు ప్రేవులును, దుమ్ములైన యమ్ములును, గ్రమ్మిన రుధిరమ్ములును, నాడెడు నట్టలును, నందంద విహరించు భూతభేతాళులును, నానందంబు నొందు కంకకాకగృధ్రజంబుకంబులును గలిగి సంగరాంగణం బతిఘోరం బయ్యె. అంత నీలధ్వజుండు కపిధ్వజునిం దాకి నిశితవిశిఖంబుల నొప్పించిన, గాండివి మండలీకృతకోదండుండై, చండకాండంబులు తండోపతండంబుగాఁ గురిసిన, నొక్కతీక్ష్ణభల్లంబున భుజమధ్యంబు పగులనేయుటయు, నెత్తురులు గ్రక్కుచు మరణసమానంబైన మూర్చనొందిన, సారథి యన్నీలధ్వజుని దుర్దశయును, సైన్యంబులు సమయుటయును, గాలు కాలుం బెనచుకొని పడిన సుతభ్రాతృబంధుయోధజాలంబునుం గాంచి, యరదంబు కదనరంగంబునకుం దొలగించి, పట్టణంబునకుం దెచ్చుటయు, నెట్టకేలకు మూర్ఛఁ దెప్పిఱి, యప్పుడమిఱేడు సారథిం జూచి, 'మేలు సేసితి' వని కొనియాడి, మంత్రులం బిలిపించి, మంతనంబు గావించి, 'కృష్ణసహాయుండైన జిష్ణుని మార్కొనుటకు నెవ్వరికిఁ దరంబు? పర్వతంబుపై సన్నపడినఁ దగరుశిరంబు నొచ్చుటయే కాని, పర్వతంబునకుఁ గొఱంత యేమి? బలవద్విరోధంబు తగద'ని యాలోచన నిశ్చయించి, తనపట్టపురాణికిం దెలుపుటయు, నియ్యకొనక యయ్యతివ ప్రల్లదంబులు పేలినఁ గినిసి 'నీ దుర్నయంపుబోధనచే యుద్ధంబునకుఁ బోయిన నాకుఁ గలవారలెల్లరు సమసిపోయిరి. స్త్రీబుద్ధిః ప్రళయాంతకి యనెడు పలుకె యథార్ధంబయ్యె' నని యాగ్రహంబున 'నిస్సీ! ఇటువంటి దంటతోడం గాపురంబు సేసిన గుణంబు సెడి మానప్రాణంబులకు హాని సంభవించు'నని యప్పుడె దానికి బట్టణంబు వెడలనడచి, చీనాంబరంబులును, జిరత్నరత్నభూషణంబులును, జిత్రంబులైన కానుకలును, జిన్నారి నారీమణులునుంగూడ, నయ్యధ్వరాశ్వంబుఁ దెచ్చి, విజయున కొప్పగించి, వినయపూర్వకంబుగా మ్రొక్కుటయు, నర్జునుండు నతని నాలింగనంబు సేసికొని, 'నీవు<noinclude><references/></noinclude>
779wy5u16atfw45i5slhhk4jlzco0tw
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/72
104
186335
553943
504558
2026-04-21T04:08:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553943
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సహోదరసమానుండవు. ఈ సంవత్సరంబులు నాతోడంగూడ నశ్వరక్షణంబు సేసి యాగంబుం గనుంగొని, ధర్మనందన వసుదేవనందనులకు వందనంబు సేసి వత్తువు గాక' యని ప్రార్ధించి, యమ్మహీధవునిం దోడ్కొని, యధ్వరాశ్వంబునుం దరలించిన, నదియును దక్షిణదిశాభాగంబునకై యతివేగంబునం జనియె.
{{p|ac|fwb}}జ్వాలాదేవి సోదరునికడ కేగుట</p>
అంత నీలధ్వజుని భార్యయైన జ్వాలాపతి మగనిచే నవమానంబు నొంది, డెందంబునం బట్టరానిరోషవిషాదంబులం బొగులుచుఁ, గాశీనగరంబునకుం జని, యాదేశంబున కధీశ్వరుండు నవక్రపరాక్రమాటోపదీపితుండు, నాత్మీయసహోదరుండునైన యుల్ముఖునియొద్దకుం బోయి, విషాదవేదనాదోదూయమానమానసయై, పాదంబులపయిం బడి రోదనంబు గావించుటయు, నతండును గరుణాయతచిత్తుండై యూరడించి, 'నీ వొంటిగా వచ్చుటకుఁ గారణం బేమి! ఇంత వంత యేమిటికిం జెందెదవు? ఎంతకార్యం బయిన నిర్వహించెద,' నని యడుగుటయు, నామె, యశ్వమేధాశ్వంబు వచ్చుటయు, బహుజనక్షయమును, దన మగని పరాజయమును, దాను మగుడ సమరంబునకుఁ బురికొల్పుటయు, నతండు మంత్రులతో యోచన చేసి కయ్యంబున కియకొనక తన్ను నవమానించి పురంబు వెడల నడుచుటయు, నాద్యంతంబును బూస గ్రుచ్చిన వితంబునఁ దెలియఁ బలికి, మఱియునుం దద్విరోధంబు రూఢమూలంబు సేయందలంచి యిట్లనియె: 'అన్నా, నాబన్నంబు లెన్నని వివరించెద! నీ మఱంది, తానును,
పుత్రుండును, దండనాయకులును దళసమేతంబుగా ధనంజయునిం దాకి, దావాగ్నిజ్వాలలం బడిన శలభంబులకైవడిఁ నొచ్చియు, జచ్చియు, వెన్నిచ్చియుఁ, బార్థునికోలలకుం జాలక, కలహకారిణియగు నన్నుం బురంబు వెడల నడిచి,
యతనిశరణంబు నొందె. ఈ యవమానంబు సహింపఁగూడక యే నిందు వచ్చితి. నీవు దక్క నాకు రక్షకులు లేరు. ఎవ్విధంబుననైన నీయవమానంబు దీఱునట్లుగాఁ బార్డుని తోడం బోరి సంహరింపుము'. అనుటయు నతండు సహోదరిం జూచి, 'యట్ల కానిమ్ము రేపటికి హయం బిచటికి వచ్చు. నేను బట్టి కట్టెద, నతనికి నాకును సమరం బయ్యెడు, నపు డర్జునుని నిర్జించెద, నీవు వంతం బొందవల' దనుటయు, నాజగజంత సహోదరుం జూచి, 'యింద్రనందనుండు గుఱ్ఱంబు పోయినత్రోవనే పోవుఁగాని, యిచ్చట కేల వచ్చు? గుఱ్ఱంబు వెంబడి నతండు<noinclude><references/></noinclude>
mmv8cenlmayrk7wz5own2s3lrsztgn4
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/73
104
186336
553948
504559
2026-04-21T04:43:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553948
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పోయిన నీ వెవ్వరితోడఁ గదనంబు సేసెదవు?' అని తీవరించుటయు, 'సహోదరీ! ఇంతలోన నేమి కార్యంబు దప్పె? ఎన్నటికేనియు నతనికి, మనకు విరోధంబు పుట్టకపోవునే? నాఁటికి నీకొఱతఁ దీర్చెడు. ఈవేళ మారకుండు' మనుటయు, నాదంట యతనిం జూచి, 'యన్నా, పుట్టిన జగడంబుతోడుత నడుపవలయుం గాని, యేండ్లు పూండ్లు చెల్లిన నేమి ప్రయోజనం?' బనిన, నుల్ముఖుండు నాగ్రహోదగ్రుఁడై 'పాపాత్మురాలా, చొచ్చినయిల్లు చెఱచినయదిగాక, పుట్టినయిల్లునుఁ జెఱుపవచ్చితివే? నీవంటి చెఱపనచేట మాయింట నుండఁదగదు. పాఱెడు బండ్లకుఁ పాదంబులు చాఁచు మనియెదు. నీవలసినయెడకుం బొమ్ము' అని విడనాడుటయుఁ, బిడుగు వడినదానిం
గొఱవి జూఁడినతెఱంగున నయ్యంగన కెరలి, మనంబులో మిడుకుచు గంగాసమీపంబునకుం జనిఁ(యె).
{{p|ac|fwb}}గంగ యర్జును శపించుట</p>
(అచట) నోడ యెక్క యవ్వలిగట్టునకుఁ బోవువారలతోడఁగూడఁ బోవునెడఁ, దన యెడమకాలిమీఁద గంగాజలంబు తుంపర పడుటయు, 'శివ శివా, యెంత పాపాత్మురాలి నంటితిని! ఇందు కింక నేమి ప్రాయశ్చిత్తంబు సేసికొందు?' నని పలికినఁ, కీరవాసులయిన జనులందఱు గువ్వకరిగొని 'త్రిలోకపావనియగు పుణ్యవాహినిం దూషించిన నీనోరు పుచ్చవలదా! కర్మచండాలీ, నీవు మాతోడం గూడ నుండ దగ’వని యేకవాక్యంబుగాఁ దిట్టిన, నా గంగానది నవ్వుచు నంగనారూపంబునఁ బ్రత్యక్షంబై, 'సీమాటి! నాయం దేమి యన్యాయంబు గంటివి? నీ విట్లు దూషించుటకుఁ గారణం బేమి? ఎఱింగింపుము' అనినఁ, 'బుట్టినబిడ్డల నేడ్వురం దొట్టితొట్టిన మెడలు నులిపి వేసిన పాతకివి! నీకుఁ గడపట నుప్పురాయివలె నొక్కండు నిలిచె సత్యవ్రతుండగు నమ్మహానుభావుని, శిఖండిని మున్నిడికొని యర్జునుండు వధించె. ఆసూడు దీర్చుకొనకయున్నదానవు. పుత్రహీనవు. నీమొగంబు సూడరాదు.' అనిన, నాదివ్యనది కోపశోకంబులు మనంబునఁ బెనంగొన, 'నేటి కాఱవనెలనాఁటికి నర్జునునిశిరంబు వానికుమారునిచేఁ ద్రెళ్ళుంగాక' యని శపియించి యంతర్ధానంబు నొందుటయు, నాజ్వాలయు సంతసంబు నొంది, యాదివిజనదీతీరంబున దారువులచేతం జితి యమర్చికొని, శివు నుద్దేశించి తనశరీరం బాహుతిఁ<noinclude><references/></noinclude>
rk8wq1mimcagbk0y1jhfidsvzzlfyq9
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/74
104
186337
553950
504560
2026-04-21T04:51:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553950
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గావించి, మృత్యుదంష్ట్రాకరాళంబును, జ్వాలామాలికాభీలంబును, నర్జునుప్రాణాపహారకంబును నగు శరంబై జనియించి బభ్రువాహనుతూణీరంబునం దుండె.
{{p|ac|fwb}}అధ్వరాశ్వము ఱాతి నంటుకొనుట</p>
అంత నాసైంధవంబు జవంబున నయ్యైదేశంబులు దాఁటి, వింధ్యపర్వతసమీపంబునకు వచ్చి, యచ్చటఁ దిలకంబులు, క్రముకంబులు, కదంబంబులు, కరవీరంబులు, నర్జునంబులు, నామంబులు, కుటజంబులు, కరంటకంబు, లామకంబు, లగురులు, సాలంబులు, రసాలంబులు, పాటలంబులు, వటంబులు, లవంగంబులు, నారంగంబులు, నీపంబులు, ధూపవృక్షంబులు మొదలగు తరువులచే బహుళంబులైన గహనంబులు సొచ్చి, పోవునెడ, మార్గమధ్యంబున యోజనంబు నిడివియు, నరయోజనంబు వెడల్పును, నంతియ పొడవుం గల యొక్కశిలం జూచి, దేహంబు తీఁట దీరుటకై యాశిలతో నొరసికొనుమాత్రంబునఁ, జిగురుఁగండెలోనం దగిలిన పక్షికైవడి, నాగుంటితో నంటికొని, యవ్వలివ్వలం గదలనేరకఁ, గనకంబునం జెక్కిన రత్నంబుకైవడి నిశ్చలంబై యుండుటయు, నా సాహిణు లాసహేనినాదంబుల నదల్చి, కళాఘాతంబున వైచి, వాగె పట్టి సాగఁదీసిన, రాక యూరకుండుటయు, నయ్యశ్వరక్షకులు భయభ్రాంతమానసులై, వడిగాఁ గవ్వడికడకు వచ్చి యావృత్తాంతంబు విన్నవించుటయు, నరుదంది పురందరనందనుం డశ్వంబు దురవస్థఁ దప్పించునుపాయంబు గానక, తత్సమీపంబున నున్న సౌబరి యాశ్రమంబునకుం జనియె.
{{p|ac|fwb}}అర్జునుండు సౌబరి యాశ్రమంబునకుఁ బోవుట</p>
అందు శరభంబు పిల్లలం బ్రక్కలో నుంచుకొని చన్నుబా లిచ్చి పాలించు గండభేరుండంబులునుఁ, బొదుగులం బాలు దాఁచి సింహకిశోరంబుల కొసంగి నిదురపుచ్చు శరభంబులును, నేనుఁగుగున్నల కటంబుల తీటతీఱ మెలమెల్లన గోరులం గీఱు సింగంబులును, లేడిపిల్లలం జూచి చన్నులు చేఁపి వానిమేనులు నాకు సివంగులును, బాముపిల్లలకు నెండ సోకకుండ ఱెక్కలం గప్పు నెమిళ్ళును, నెలుకపిల్లల మెల్లనం గలుగు జేర్చు మార్జాలంబులుం గలిగి, జాతివైరంబులు లేని జంతునివహంబులచే సకలభువనసంతోషకరంబైన<noinclude><references/></noinclude>
7mj3oxjz1h3a6t3sgqfb42ih4b2pawy
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/75
104
186338
553952
504561
2026-04-21T05:12:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553952
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యాశ్రమంబునకు ననతిదూరంబున సైన్యంబును నిలువ నియమించి, ప్రద్యుమ్న వృషకేత నానుసాళ్వ యౌవనాశ్వ నీలధ్వజులం గూర్చుకొని, యాశ్రమప్రదేశంబున కరిగి, వేదాంతవిద్యావిశారదుండును, దయారసవర్షనీరదుండును, శ్రీమదష్టాక్షరీమంత్రలబ్ధమహత్త్వుండును, రుద్రాక్షమాలికావిభూతిజటావల్కలధారియు, శమదమాదిగుణహారియు నగు సౌబరిం గాంచి, సాష్టాంగంబుగా మ్రొక్కి సేవించి, సవ్యసాచి నిటలంబునఁ గరకమలంబులు మొగిచి, 'మౌనికులచంద్రాఁ ధర్మనందనుండు జ్ఞాతివధం బొనరించిన పశ్చాత్తాపంబునఁ గృష్ణద్వైపాయను ననుజ్ఞచే నశ్వమేధాధ్వరంబు సేయంబూని, చైత్రశుద్ధపౌర్ణమాసి దినంబున దీక్ష గైకొని, బ్రాహ్మణులకు మణికనకాదిదానంబు
లొసంగి, మఘవాజిం బయనంబు సేసి, పూజించి పంపుటయు, నేను శ్రీకృష్ణయుధిష్ఠిరులకు నమస్కరించి, వారల యనుమతిఁ గైకొని, యీ యౌవనాశ్వాదులు వెంబడిం గదలిరా, దేశంబులన్నియుఁ గడచివచ్చి, వింధ్యవాటిఁ జొచ్చి, యయ్యశ్వంబు యోజనవిస్తారంబైన ప్రస్తరంబుతో నొక్కటిగా నంటికొనియె. శిలానిబద్ధఁజైన యీ హయం బేవితంబున విడివడు నావితం బెఱిగింపవే దయానిధీ, నీకు నమస్కారంబ'ని ప్రార్థనంబు సేసె.
{{p|ac|fwb}}ఉద్దాలకమహర్షి కథ</p>
అంత సౌబరి యింద్రతనూభవుం జూచి, 'తొల్లి యుద్ధాలకుండను (మహర్షి) మహామునీంద్రుండు యథోక్తంబుగా బ్రహ్మచర్యవ్రతంబు నెఱవేర్చి కర్కశభాషిణియుఁ గలహకారిణియుఁ బ్రతికూలాచారయు, ననుదినకృతాపచారయునైన చండిక యనుదానిం బెండ్లియాడి, బాల్యంబున నుండి యౌవనకాలపర్యంతంబు నానావిధంబులుగా మనోరంజకంబు సేసియు, దానివలన యేగుణంబు గానక' చింతించుచుండు. వేపచెట్టునకుఁ బాలు పోసి చక్కెర యెరువు వేసి పెంచిన నేనియుఁ జేదుగాక మాధుర్యంబు గలుగనేర్చునే! అతండు సంధ్య వార్వఁ బాత్రంబు దెమ్మనిన నది రాతిమీఁదం బగులఁగొట్టు. దాని నతికించుకొనుట యతిప్రయాసం బగు. తడిదోవతి యెత్తి యిమ్మనిన, నడిమికి రెండుగాఁ జింపు, నది బ్రహ్మకమ్మి వైచి కట్టుకోవలయు. జపమాలికం దెమ్మనిన, సూత్రంబు త్రెంచి పూసలు వెదజల్లు, నవి వెదకి యేఱి తెచ్చుకోవలయు. సమిధలు దెమ్మనినఁ గుండం బార్చివైచు, నది యూఁది రగులుకొల్పు<noinclude><references/></noinclude>
dacp7e4s3mvuvvzio9c85zh7yxqbyff
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/76
104
186339
553962
504562
2026-04-21T07:18:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553962
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ప్రయాసంబు దైవం బెఱుంగు. వంట వేగంబె కావలెననినఁ, గడవలు పగులఁగొట్టు. కోపంబు వలదే యనిన రోకలిచేఁ బ్రహరించు. ఇవ్విధంబునఁ బ్రతిదినంబుం బ్రతికూలవర్తనయగు భార్యచేతం బడరానిపాట్లు పడుచు, బ్రహ్మచారియు గృహస్థుండును గాక, రెంటికిఁ జెడ్డ రేవఁడై వంతం బొందుచున్నయెడ, నతనికి గురుండగు కౌండిన్యుండను మునివర్యుండు, శిష్యులు గొలువం దీర్థయాత్ర పోవుచును ద్రోవ వచ్చి, యుద్ధాలకుని యాశ్రమంబునకుం జనుదెంచుటయు, నతం డర్ఘ్యపాద్యాదివిధానంబులం బూజించి కుశలం బడిగి, కౌండిన్యునితోఁ దనభార్య ప్రతికూలవర్తనంబు లెల్ల సవిస్తరంబుగాఁ బలుకరించి, దుఃఖించుటయుఁ, గౌండిన్యుం డుద్దాలకునిం జూచి, 'యయినపనికి నేమి సేయంగలవారము? అగ్నిసాక్షికంబుగా వివాహంబైన సతు లెటువంటివా రైనను విడచుట యెట్టు? దీని కొకయుక్తిఁ బలుకరించెద; చేయవలసినకార్యంబు చేయవలదనుము. చేయనొల్లనికార్యంబు చేయుమనుము. ఇట్లు చెప్పితివేని యకృత్యంబులు మాని కృత్యంబులు సేయుచునుండు. నీయభీష్టంబు సిద్ధించు'నని యానతిచ్చిన నయ్యుద్ధాలకుండు తనపత్ని జూచి, 'మన యింటినడవలో నెవ్వరో కొందఱు వచ్చియున్నారు. వారల నవ్వలికిం బొమ్మని తీర్థంబు మొదలుగ నీయక దుర్భాషలం దిట్టు' మనిన, నా చండిక 'యక్కటా! యిట్లు చేయుదురె?' అని వారలకు నమస్కరించి, తోడ్కొని వచ్చి షడ్రసోపేతముగా నన్నపానంబు లొసంగి పూజించె. వారలు చనిన యనంతరంబ యుద్ధాలకుండు మఱునాడు భార్యనుం గనుంగొని 'రేపటికిఁ బైతృకంబు నేను జేయంగలవాఁడనుగాను, కాదని చేసితి నేనియుఁ గుండగోళకుల దురాచారుల వేశ్యాపతుల, బధిరుల, నంధుల, విష్ణుభక్తివర్జితులఁ, బరదారాద్రవ్యనిరతుల, బ్రాహ్మణార్థంబునకు నియమింతు; నింతియకాని నిన్న మనయింటికి వచ్చినవారు మగుడ వచ్చిరేని వారల నియమించువాఁడంగాను. పైతృకంబు సేసితినేని యులువలు, చామలు, నారుగలు, కందులు, నలసందెలు, నరువులు, తమిదలు, జొన్నలు, కంబులుల్లి పుచ్చకాయ ముల్లంగి, సొరకాయ, పిండికూర మొదలైన యభక్షద్రవ్యంబులు దెచ్చి వడ్డింతు, నదియునుంగాక, తెల్లవాఱినజాముమీఁద బ్రాహ్మణులం జెప్పుదును గాని, తొలినాటిరాత్రియే విజ్ఞాపనంబు సేయువాఁడనుగాను, సాయంకాలసమయంబున, రాత్రియేనియు నర్చనంబు సేయుదుఁ గాని, కుతపకాలంబున నిద్ర పోవంగలవాఁడ, నట్టింటఁ జిట్టముకయు, దవుడు మట్టిడి పెంటలు నెఱపుదు, నింతియకాని<noinclude><references/></noinclude>
bdjnk8tacyescidn3pr43defmlk7nah
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/77
104
186340
553968
504563
2026-04-21T08:00:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553968
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గృహంబు నలంకరింప. బ్రాహ్మణుల వస్త్రంబులు దోఁచుకొని, దక్షిణ లేదు పొమ్మని, యవిశ్వాసంబుగా నాచరింతును.' అనిన చండి విని, మండిపడి 'సదాచారసంపన్నులు, వేదవేదాంగపారగులు నైన బ్రాహ్మణోత్తము నాఁటిరాత్రియే నియమించి, గృహంబు ముంగిలియు నడవయు గోమయానులేపనంబు, రంగవల్లికలచే శృంగారంబు గావించి, తానును నరుణోదయంబుననే స్నానంబు సేసి, మినుములు, పెసలు, యవలు, గోధుమలు మొదలగు ధాన్యంబులును, దోసకాయ, పనసకాయ, కాకరకాయ, యూరుదొండకాయ, బలుసుకూర మొదలైన శాకంబులు, నతిరసంబులు, వడలు, దోసెలిడ్డనలు మొదలగు ప్రేక్ష్యంబులైన భక్ష్యంబులును, గమనీయంబులైన నూతనకాండంబులం కలవరించి, దక్షిణలు, హెచ్చు వస్త్రంబులు, మంచిగంధంబులు సంపాదించి, యుక్తకాలంబున యథావిధిగా శ్రాద్ధంబుఁ జేయించి, మగనికి, నిష్టబాంధవులకు షడ్రసోపేతముగా భోజనంబులు పెట్టి, తాంబూలాదు లొసంగి, సంతోషంబు నొందించు సమయంబున, సూర్యమండలంబు బింబిఫలడంబరవిడంబనంబై కాంతికదంబకంబులం గనుపట్ట, నస్తగిరిశిఖరంబునఁ గనకకలశంబుకరణిం బ్రకాశించె. అప్పు డుద్దాలకుండు భార్య చేసిన యుపచారంబులకు సంతుష్టుండై, మేనుమఱచి, తద్విపతంబుగాఁ బలుకక 'పార్వణంబు గొనిపోయి గంగాజలంబులో వైవు' మనినఁ గోపించి, యాపాతకి యింటిసమీపంబున నున్నపెంటమీద వైచుటయు, నుద్దాలకుం తాడాగ్రహవ్యగ్రుఁడై, కనుఁగొలకుల నిప్పు లుప్పతిలం జూచుచు, 'నిర్భాగ్యురాలా, పవిత్రంబులైన పార్వణంబులు పెంటమీఁద వైచి శ్రాద్ధంబు వ్యర్థంబు గావించితివి. ఈ యకృత్యంబు లెన్నాళ్లు సహించఁగలవాఁడ? గొండారణ్యంబున గుండురాయిపై పెద్దకాలంబు పడియుండు' మని శపియించి, గడగడ వణంకు పడంతుకం జూచి, కరుణాకలితమానసుండై, 'కొంతకాలంబునకు ధర్మనందనుని యశ్వమేధాశ్వసంరక్షణార్థముగా నర్జునుండు వచ్చు; నతనికరంబు సోకినం గృతార్థవయ్యెద' వని శాపమోక్షణంబు ననుగ్రహించెం గావున, నీకరంబుచే నిప్పాషాణంబు నంటుము. అశ్వమేధహయంబు వీడివచ్చు. చండికయును శాపమోక్షణంబు గాంచు' ననిన, నక్కిరీటి సౌబరిమహామునికి సాష్టాంగనమస్కారంబు సేసి, వాజి సమీపంబునకుం జని, నిజకరారవిందంబుచే (రాతి) నంటుటయు, (హయంబు దానితోడ నంటు వాసె.) శ్రీరాముని చరణారవిందరేణువులు సోఁకిన యహల్యకైవడి<noinclude><references/></noinclude>
jpma0itojsbv2h681xlr2szd1jd8otm
553969
553968
2026-04-21T08:00:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
553969
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గృహంబు నలంకరింప. బ్రాహ్మణుల వస్త్రంబులు దోఁచుకొని, దక్షిణ లేదు పొమ్మని, యవిశ్వాసంబుగా నాచరింతును.' అనిన చండి విని, మండిపడి 'సదాచారసంపన్నులు, వేదవేదాంగపారగులు నైన బ్రాహ్మణోత్తము నాఁటిరాత్రియే నియమించి, గృహంబు ముంగిలియు నడవయు గోమయానులేపనంబు, రంగవల్లికలచే శృంగారంబు గావించి, తానును నరుణోదయంబుననే స్నానంబు సేసి, మినుములు, పెసలు, యవలు, గోధుమలు మొదలగు ధాన్యంబులును, దోసకాయ, పనసకాయ, కాకరకాయ, యూరుదొండకాయ, బలుసుకూర మొదలైన శాకంబులు, నతిరసంబులు, వడలు, దోసెలిడ్డనలు మొదలగు ప్రేక్ష్యంబులైన భక్ష్యంబులును, గమనీయంబులైన నూతనకాండంబులం కలవరించి, దక్షిణలు, హెచ్చు వస్త్రంబులు, మంచిగంధంబులు సంపాదించి, యుక్తకాలంబున యథావిధిగా శ్రాద్ధంబుఁ జేయించి, మగనికి, నిష్టబాంధవులకు షడ్రసోపేతముగా భోజనంబులు పెట్టి, తాంబూలాదు లొసంగి, సంతోషంబు నొందించు సమయంబున, సూర్యమండలంబు బింబిఫలడంబరవిడంబనంబై కాంతికదంబకంబులం గనుపట్ట, నస్తగిరిశిఖరంబునఁ గనకకలశంబుకరణిం బ్రకాశించె. అప్పు డుద్దాలకుండు భార్య చేసిన యుపచారంబులకు సంతుష్టుండై, మేనుమఱచి, తద్విపరీతంబుగాఁ బలుకక 'పార్వణంబు గొనిపోయి గంగాజలంబులో వైవు' మనినఁ గోపించి, యాపాతకి యింటిసమీపంబున నున్నపెంటమీద వైచుటయు, నుద్దాలకుం తాడాగ్రహవ్యగ్రుఁడై, కనుఁగొలకుల నిప్పు లుప్పతిలం జూచుచు, 'నిర్భాగ్యురాలా, పవిత్రంబులైన పార్వణంబులు పెంటమీఁద వైచి శ్రాద్ధంబు వ్యర్థంబు గావించితివి. ఈ యకృత్యంబు లెన్నాళ్లు సహించఁగలవాఁడ? గొండారణ్యంబున గుండురాయిపై పెద్దకాలంబు పడియుండు' మని శపియించి, గడగడ వణంకు పడంతుకం జూచి, కరుణాకలితమానసుండై, 'కొంతకాలంబునకు ధర్మనందనుని యశ్వమేధాశ్వసంరక్షణార్థముగా నర్జునుండు వచ్చు; నతనికరంబు సోకినం గృతార్థవయ్యెద' వని శాపమోక్షణంబు ననుగ్రహించెం గావున, నీకరంబుచే నిప్పాషాణంబు నంటుము. అశ్వమేధహయంబు వీడివచ్చు. చండికయును శాపమోక్షణంబు గాంచు' ననిన, నక్కిరీటి సౌబరిమహామునికి సాష్టాంగనమస్కారంబు సేసి, వాజి సమీపంబునకుం జని, నిజకరారవిందంబుచే (రాతి) నంటుటయు, (హయంబు దానితోడ నంటు వాసె.) శ్రీరాముని చరణారవిందరేణువులు సోఁకిన యహల్యకైవడి<noinclude><references/></noinclude>
iydg3rwfa7gt6qjg153rn1fmfajeult
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/78
104
186341
553970
504564
2026-04-21T08:08:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553970
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చండికయు శాపమోక్షంబు నొందె. ఉద్దాలకుండును గ్రమ్మఱ దానితోడం గాఁపురంబు సేయనొల్లక సన్న్యసించె.
అంత నయ్యశ్వంబు వింధ్యకాననంబు దాఁటి, యాదిభుజంగపుంగవుని ఫణాశృంగంబులు బరువుచేత గ్రుంగబడునట్లుగాఁ జతురంగంబులు నడువ, హంసధ్వజ మహారాజ ప్రతాపసంరక్షితంబును, గోపురాగ్రపరిచుంబితగగనం బైన చంపకాపురంబు చేరంజనిన, నాహవప్రవీణులును, మహాసాహసికులును, బాహుబలభరితులు నైన యోధవీరులతో నింద్రనందనుండు తోడనె వచ్చె. అప్పు డధ్వరఘోటకంబు వచ్చుటయు, నానాధ్వజినీసమేతంబుగా ధనంజయుఁడు కూడం జనుదెంచుటయు, నుపలక్షించిన వేగరులు వేగంబ జని హంసధ్వజుని కెఱిగించుటయు, (నాతఁడు) మంత్రులం బిలిపించి యాలోచనంబు సేసి, ‘ధర్మజుని యశ్వమేధాశ్వంబు వచ్చెనట! వివ్వచ్చుండు తోడనే వచ్చుచున్నవాఁడట! నే నత్తురంగంబుఁ బట్టి బెట్టుగా సమరంబు గావించెద. అపుడు భక్తసంకటమోచనుఁడును, బద్మలోచనుఁడును, గరుణావర్ధిష్ణుండును నైన శ్రీకృష్ణుం డతనికి బ్రాపై వేంచేయఁగలఁడు. నే నద్దేవుని దివ్యపాదారవిందంబులు సందర్శించి కృతార్థుండ నయ్యెద.'
{{p|ac|fwb}}హంసధ్వజుఁ డశ్వమును బట్టవచ్చుట</p>
అని నిశ్చయించి, సన్నాహసముచింతబైన రణభేరి మ్రోయించుటయుఁ, గోలఁగొట్టినభంగిఁ జతురంగబలంబులు వెలువడియె. బలపరాక్రమధురీణులును రణకలాపప్రవీణులును, బరమాప్తులు నైన డెబ్బదుండ్రు సేనాపతులు, నొక్కొక్కనికి డెబ్బదియొక్కవేయి భద్రగజంబులును, నవరత్నమయంబులునైన యన్ని యరదంబులును, నందఱు వీరభటులునుం గలరు. ధనబలుండును, సురథుండును, సుధన్వుండును, సుబలుండును, ధర్మబాహుండు ననంబరఁగిన కుమారు లేవురు గలరు. వారలందు ధర్మపరాయణులును, శ్రీవిష్ణుభక్తినిష్ణాగరిష్ఠులును, నేకపత్నీవ్రతులును, సత్యభాషణులును, దాతలును, శూరులును, సంగరప్రియులునై యొప్పుదురు. అట్టి సేనలతో హంసధ్వజుండు కయ్యంబునకు వెడలునపుడు నిజపురోహితులైన శంఖ<noinclude><references/></noinclude>
ldfarj08de0p5e3i2pophq9s6emt9sj
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/79
104
186342
553972
504565
2026-04-21T08:20:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553972
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లిఖితులం బిలిచి, 'నాయాజ్ఞ నుల్లంఘించి రణంబునకు రాక వెనుకఁజిక్కినవారిని కాగిన చమురుకొప్పెరలో వైవుం' డని యాజ్ఞాపించి, భద్రగజంబుమీఁద నెక్కి శ్వేతచ్ఛత్రచామరంబులు మెఱయ వెడలునపుడు, మేడ, లుప్పరిగలు,
చంద్రశాలలు నెక్కి పౌరసతులు మహీపాలునిమీదం జల్లు కమలదళంబులు, తత్కటాక్షంబులతోడంగూడ
మేనంబడిన, నమ్మేదినీనాథుం డర్జునునితోఁ దాఁకఁ దలంచినంత మాత్రంబున దేవేంద్రుఁ డయ్యెనో యనం జూపట్టె,
{{p|ac|fwb}}సుధన్వుఁడు సంగరమునకు రాక జాగు చేయుట</p>
అయ్యవసరమున సుధన్వుఁ డనం బరఁగిన యతని మూఁడవకుమారుం డాహవంబునకుం గట్టాయితంబై, తల్లియొద్దకు వచ్చి వందనంబు చేసిన, నయ్యంబ నెయ్యంబునఁ గౌగిఁటం జేర్చి, 'కులంబునకుం గీర్తి తెమ్మ'ని పంపినం, దనకు నగ్రజయగు కువలాదేవికి మ్రొక్కిన, నాయమ్మయు నట్ల దీవించి 'తామసింపక తండ్రివెంటం జను' మని పంచుటయు, సంతసంబుతో దనమోహంపుటింతి యగు ప్రభావతిచెంగటకు వచ్చి, 'సంగరంబునకుం బోయివచ్చెద' ననిన, నయ్యంగన కర్పూరనీరాజనంబుల నివాళి దీసి, చెట్టఁ బట్టుకొని, కేళీగృహంబునకుం దోడ్కొని పోయి, వలపు దెలుపు కలికివాలుఁజూపులు జూచుచు జాఱుపయ్యెద సవరించుచు, జెదరిన ముంగురులు కొనగోట దిద్దుచు, రతికేళీకౌతుకంబు తెలియంబడఁజేసిన, నారాకుమారుండు 'బోటి! కిరీటం గెలువక నిన్నుం బొందునది లేద’నిన నమ్మగువ చిఱునగవు మొగంబునకు వింతసొగసు సంపాదింప, 'నీవు సకలధర్మంబులు దెలిసినవాఁడవు. నే విన్నవింపఁదగిన దేమున్నయది? ఋతుధర్మంబు దాఁటవు గావున విన్నపంబు గావించితిని. నాకోర్కి నెఱవేర్చిపోవుట యుక్తం బని కౌఁగిలించికొనిన, సుధన్వుండు నిజసతిం జూచి, 'దివాసురతంబు ధర్మంబు గాదు. రాజు మహోగ్రశాసనుండు. రణభేరీనినాదంబు వినివినకమున్న పురంబు నందలి సైన్యపతులెల్లఁ గరితురగస్యందనవీరభటులతోడం గూడఁ గదనంబునకుం జనిరి. నేను వెనుకఁ జిక్కిపోయితినేని, చండశాసనుం డైన మండలేశ్వరుండు పురోహితులకు నొప్పగించు. వారలు నిర్దయాత్మకులై తప్తతైలకటాహంబునం బడవైచెదరు. రమణీమణీ, నీ ఋతువాసరంబులు పెక్కు గలవు గాన, నేటికిఁ గిరీటిం జయించి వచ్చెద. నేఁడు చక్కదినంబు<noinclude><references/></noinclude>
4ernvp669v54sygwe38ad4w55g1mq0d
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/80
104
186343
553982
504566
2026-04-21T09:30:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553982
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లేకయున్నయదియే?' అనిన నయ్యిందువదన కందర్పబాణబాధితయై 'నేటితోడం బదియాఱుదినంబులు నిండె నింక ముందర ఋతుదినంబులు లేవు. తండ్రి తిథియైనను, భార్యయెడ ఋతుకాలగమనంబు సేసిన దోషంబు లేదని శాస్త్రవచనంబులు గలవు. అదియునుంగాక, తెల్లవారుజాముగాని, సూర్యోదయంబు గాలేదు. కావున దివాసంగమదోషంబును లేదు. కయ్యంబునకుం బోక వెనుకఁ జిక్కిన, శంఖలిఖితులు కాగిన నూనెతొట్టిలోనం బట్టివైవుదురని భయపడియెదవేని, ఋతుకాలంబు తప్పిన భ్రూణహత్యాదోషంబు వచ్చు, నందుచే యమలోకంబునఁ దప్తతైలకటాహంబునఁ దూలవలయు కాకున్న నిప్పుడే మదనవేదనచే శరీరంబు నిలువదు. నామాట జవదాటి పోయితివేనియు స్త్రీహత్యయు, భ్రూణహత్యయు, రెండు దోషంబులును బ్రాపించుచున్నయవి' అని పలుకుచుఁ గులుకుబెళుకుఁజూపులు జంకింపుచుఁ గర్ణకంకణంబులు మొరయఁ జనుగుబ్బలందు హారంబులు మెరయ, నెఱికురులు విరియ, రయంబున బింకంబు జనుగుబ్బ లురంబునం జేర్చి కౌఁగిటఁ బొదివి, గందంపుఁజెట్టునం జుట్టిన చిలువ చెలువ చందంబునఁ దల్పంబునం బడ గెడపుటయు రాజనందనుం డాకుందరదన మాట జవదాటఁజాలక రతికేళిం దనియించె.
తదనంతరంబ, సుధన్వుండు సత్వరంబుగా వెలువడి వచ్చుటయు నంతలో హంసధ్వజుండు తన కుమారుండైన సుధన్వుండు తోడరాకుండుటవలన మండిపడుచు, దండధరకింకరులంలోని లంకె నాయకులు వంకఁ గనుఁగొని, 'నాయాజ్ఞ నుల్లంఘించిన సుధన్వునిం బట్టుకపోయి, మత్పురోహితులైన శంఖలిఖితుల కొప్పగింపుఁడు. ఇంచుకయు శంకింపవలదని, నిరుత్తరంబుగా నాజ్ఞాపించుటయు, వారలు చంపకాపురంబున కరుగుదెంచుచు, ముందట సఫలీకృతమనోరథుండు నాహవోత్సవసమున్నతుండునై, కవచకార్ముకంబులు ధరియించి, కవదొనలు బిగియించి, కరత్రాణంబు నంగుళిత్రాణంబును బూని సింగంపుఁగొదమకైవడిం జనుదెంచు రాజకుమారునిం గాంచి, మ్రొక్కి, 'సుధన్వా, నీవు రాజశాసనంబు మీఱి వెనుకం జిక్కితివి గావున నీయెడ మిగులం గోపించి భూనాయకుండు నిన్నుం గట్టుకపోయి ధర్మశాస్త్రగురువులైన శంఖలిఖితుల కొప్పగించిరండన్,' ననవుడు సుధన్వుండు 'తండ్రి యాజ్ఞ దాటిన కుమారు, నేలినవాని యానతి మీఱిన బంటు నేమి చేసినఁ జెల్లు.<noinclude><references/></noinclude>
bwh5bsbfeirvo3edslgbp9c0736sdvx
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/81
104
186344
553983
504567
2026-04-21T10:03:34Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553983
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తండ్రియు ధరణీవల్లభుండునైన యమ్మహారాజు నానతిఁ జేయుటయే జన్మఫలం'బని రథంబు డిగ్గుటయు, నధిజ్యకార్ముకుండు, నాబద్దకవచతూణీరుండు, నఖిలభూషణభూషితుండు, నంగజాకారుండు నైన యక్కుమారునిం బెడకేలు గట్టి పట్టి కొనిపోయి, బ్రాహ్మణోత్తములైన శంఖలిఖితుల ముందరఁబెట్టి, 'యితండు రాజాజ్ఞ మీఱి, వలరాజు నాజ్ఞకు లోఁబడి. కృష్ణపాదకమలంబులఁ జూడవలయునను వేడుకలేక తనచేడియతోఁ గ్రీడారతుండై వెనుకఁ జిక్కెం గావున, నితని దప్తతైలకటాహంబున వైవుం'డని పలుకుటయు, లిఖితుం డగ్రజుండైన శంఖునిం జూచి, 'భూమిలోన నేమనుజుండు తను పలికిన పలుకు నిజంబు సేయక తప్పించు, నమ్మనుజునకు రౌరవాదినరకంబులు సిద్ధించు. తొల్లి సత్యంబు నిర్వహించుటకునై తనరాజ్యం బంతయు విశ్వామిత్రున కొసంగి, కుమారుని, భార్యను గాశిలో విక్రయించి, తానును జండాలునిచే విడువఁబడి, సత్యంబు ప్రతిష్ఠించిన హరిశ్చంద్ర నరేంద్రుని వినలేదా? అట్లే రామచంద్రుండును సత్యపరిపాలనంబునకై రాజ్యంబు త్యజించి వనంబునకుం జనియె. దశరథుండు కైక కిచ్చిన వరంబులు దప్పక సత్యంబు నిమిత్తంబుగాఁ దనువు దొఱంగె. సత్యంబు దప్పిన రాజసేవ వలనఁ గోటివేలు వచ్చినం గాదు. సజ్జననిందితంబైన యసత్యంబున గొగ్గునట్టి రాజు చేసిన పాతకంబులు పురోహితుం జెందు. పతియాజ్ఞ మీఱినయెడ మిత్రుండైనను, దల్లియైనను, దండ్రియైనను, బాంధవులైనను దండనార్హు లగుదురు.
{{p|ac|fwb}}సుధన్వుఁడు తప్తతైలకటాహమున దిగుట</p>
అని చెప్పిన, శంఖుండు విని 'యట్ల చేయదగినయది. రాజకుమారకా, నీమనంబున కెట్లు తోఁచుచున్నది?' యనిన సుధన్వుండు చిఱునగ వంకురింప ధనుర్బాణంబులు క్రింద వైచి, కవచంబు సడలించి, కవదొనలు వదలించి, తొల్లి పరవీరుల జయించి తెచ్చిన రత్నభూషణంబు లుజ్జగించి, శ్రీకృష్ణపాదారవిందసమర్పితంబులైన తులసిమాలికలు, పద్మాక్షమాలికలు కంఠంబునం గదియించి, శ్రీహరి పాదతీర్థంబు గ్రోలి, కమలాక్షుండును, ద్రిలోకాధ్యక్షుండును, గనకాంబరధారియు, యోగిజనహృదయపద్మవిహారియు నగు శౌరినిం బేర్కొని, యుపనిషద్వచనంబులచే నద్దేవునిం బ్రస్తుతింపుచు,<noinclude><references/></noinclude>
26brc42nckq1oejhuwmqwz4bkzq5pb3
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/82
104
186345
553984
504568
2026-04-21T10:12:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
553984
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నీలమేఘశ్యామలంబును, గోటిమన్మథోపమానంబును, బూర్జచంద్రవచనంబును, నాశ్చర్యకరంబును నైన శ్రీమన్నారాయణమూర్తిని హృదయపంకజంబునం గుదురుకొలిపి, సోపానంబులు గట్టినయట్టి నూనియతొట్టియొద్దకుం బోయి, సెగలచే నలుదిక్కులఁ గప్పుడుఁ బొగలెగయ నుడుకునట్టి తైలంబు కేలం ద్రోయుచు, మగదజంబు సరోవరంబు సొచ్చు చందంబున, మొదటమెట్టునకుం దిగి, రెండవమెట్టునకు నడుగుపెట్టి, మూడవమెట్టునకుం
బోయి, నాల్గవమెట్టు నిలుచుటయు, నగ్నిమయంబైన నత్తైలంబు కుత్తుకబంటి యయ్యె. అప్పు డతనివదనంబు యమునాజలంబునం గనుపట్టు కమలంబుకరణి నతిమనోహరంబై యొప్పె. వ్రేలెత్తి చూపగూడని యాస్నేహంబును,
శ్రీవిష్ణుభక్తుండగు రాజకుమారునితో స్నేహంబు చేసిన చందంబును జంద్రకిరణంబులకైవడిఁ, బన్నీటిధారతెఱంగునఁ, జందనరసంబుచందంబున నతిశీతలంబై యుండె. జనమేజయ నరేంద్రా! హరిదాసులు కసాధ్యం బేదియుం గలదె?
{{p|ac|fwb}}దేవతలు సుధన్వునిపైఁ బూలవాన గురియుట</p>
అవ్విధంబు గాంచి శంఖలిఖితు లాశ్చర్యంబు నొంది, యిక్కుమారుం డిట్లుండుట యింద్రజాలంబుగాఁ దోఁచుచున్నయది. లెస్సగాఁ బకిక్షింపవలయునని, నారికేళఫలంబు లత్తైలంబులోన వైచుటయుఁ బెటాలుం బెటిలియించించుక చిద్రుపలై యెగసి చుట్టునున్న జనులపయిం బడిన బొబ్బ లెగసి బొబ్బరించుచుఁ బరువెత్తిరి. అంతయుం గాంచి యమ్మహామునులు, 'హరిభక్తియుక్తుండైన రాకుమారునిమహత్త్వం బెఱుంగక యవమానించిన మహాపాపం బేమిటం దీఱు? జ్వాలామాలికాభీలంబైన యాతైలంబులోనం బడుటయే ప్రాయశ్చిత్తం'బని, యయ్యిరువురుఁ దోడనె యాతైలకటాహంబునం దుమికిరి. అపు డమ్మువ్వురిమీఁద దేవతలు పుష్పవర్షంబులు గురియించిరి. ఆ సమయంబున నింద్రాది దిక్పాలకులు సుధన్వునిం జూచి, 'కుమారకా, నీవు ప్రహ్లాదు నంతటివాఁడవు. నీ స్వరూపం బెఱుంగక యవమానంబు సేసిన యిమ్మునులకు 'నీ పాదారవిందంబులు సోఁకిన తైలంబులో మునుంగుటయే గంగాస్నానంబు<noinclude><references/></noinclude>
dm4uu4t1p9p9nd4ilytllpjz85kfqxl
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/343
104
203690
553899
553816
2026-04-20T12:14:02Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553899
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>లేకపోతే నిశ్చతదివాన పోష్టు చెయ్యడం పడదు, పడకపోతే అదో పేచీ పోస్టల్ డిపార్టుమెంటుతో.
కనక, వెళ్ళి తీరాలి.
కొత్తగా పోసిన కంకరరోడ్డు, కళ్లు మూసుకుని తొస్సిపూడి వెళ్ళవచ్చు; కాని దారి కనపడలేదు.
నాకు డబ్బువిలవ తెలియపరిచే ఘట్టాలిలాంటి వెన్నో వచ్చాయి జీవితంలో, కాని వొక్కటీ నిలిచిపోలేదు, కాగా, డబ్బంటే యెప్పుడూ శ్రద్ధలేదు.
కాని, అప్పటి మాట యేమిటీ?
ఆందోళన బయలుదేరింది.
బుర్ర చించుకున్నాను.
ఏమయినా; రాత్రంతా పడవ ప్రయాణం కనక శంకానివృత్తి చేసుకుంటే మంచిదని పుంతికి బయలుదేరాను.
ఒక అడ్డబోది దాటాను, యథాపూర్వంగా.
రెండోబోది దాటబోయేటప్పటికి, రెండు రెండున్నరనోట్లు కనపడ్డాయి, నీటివార పిల్లగాలికి వూగీసలాడుతూ.
తీశాను, అటూ యిటూ చూశాను, పిట్ట కూడా కనపడలేదు, చూపుమేరలో.
తిరిగివస్తూ రోడ్డుమీద అరగంట నుంచున్నాను " మావి" అన్నవారు కనపడలే దెందరి నడిగినా.
“కాకినాడ వెడుతున్నాను. ఎల్లుండి వస్తాను. ఎవరివో నా దగ్గిర అయిదు రూపాయలున్నాయి, వూళ్ళో చెప్పండి" అంటూ అక్కడ - రోడ్డుమీద నడిచే రాయవరం మహేంద్రవాడ రైతులతో చెప్పాను, వెళ్ళిపోయాను.
కాకినాడ నుంచి వచ్చాక టముకువేయించినంత పని చేశాను, నేటికీ "మావి” అన్నవారు కనపడలేదు.
ఏం, దేవుడే పడేశాడా నాకోసం అవి అక్కడ?
ఎంతమాత్రమూ కాదు, నిజమే, మరి యిదేమిటి?
రాజమహేంద్రవరంలో ప్రవేశించాక నెలకు మూడువేల వ్యాపృతి వచ్చింది ప్రబుద్ధాంధ్రకు.
కాకినాడలో స్కేపు అండుకోవారిలాగే రాజమహేంద్రవరంలో సరస్వతీ పవరు ప్రెస్సువారున్నూ వొక సంచిక అచ్చువేసి యివ్వడానికి పెట్టుకున్నా, రరువుగా.
కాని నలభైఆరురూపాయలు కావాలి కానిబిళ్ళలు నెలకి పోస్టుచెయ్యాలంటే.
ముప్పయ్యెనిమిది రూపాయల పై చిలుకు చేతిలో వుండగా తొలినాడే కొన్నాను బిళ్ళలు.
తెల్లవారడం తడువుగా పాకింగుపనిలో కూచున్నాను "స్వయం రాజా, స్వయం మంత్రీ" కనక.
పది అయింది, వున్న బిళ్ళ లంటించడమున్నూ అయిపోయింది.
పదకొండయింది, భోజనం చేశాను.<noinclude><references/>
{{rh|319||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
grhq6zk71x88t3aasv7qp5t0fuvo0ey
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/344
104
203691
553900
530033
2026-04-20T12:18:15Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553900
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పన్నెండు కొడితే పోస్టాఫీసు తెరుస్తారు, వొంటిగంట లోపున పోస్టు చెయ్యాలి.
కాని, అక్షరాలా యెనిమిది రూపాయలు కావాలి, మరి.
చేసేది లేక డస్కు బల్ల దగ్గిర చతికిలబడ్డాను.
అయితే, రాద్దామంటే కలమూ నడవదు, చదువుదామంటే బంతీ గడవదు, మనస్సు మనస్సులో లేక.
ఉసూరు మనిపోయింది ప్రాణం.
డబ్బు విలవ మళ్లీ తెలిసివచ్చింది, కొట్టవచ్చినట్టు.
కాని, యేమిటీ చెయ్యడం ఆ క్షణాన?
మార్గా లాలోచించాను.
బల్లమీదికి మోచేతు లానుకుని, కళ్లున్నూ బాగా గుచ్చేసుకుని మరీ తీవ్రంగా ఆలోచించాను, మళ్లీ.
ఉండగా వుండగా బల్లమీద యేదో చప్పుడయింది.
చూడగా ఎదట పోస్టుమేనూ, బల్లమీద పత్రికలూ ఉత్తరాలూ దొంతిన్నీ.
తియ్యగా అందులో వొక మణియార్డరు.
చదవగా "ఎనిమిది రూపాయలు మాత్రమే" అని వుంది, అక్షరాలా అంకెలా కూడాను.
సంతకం చేశాను, తెలిసికాదు.
రూపాయలు పుచ్చుకున్నాను, లెక్క చూసి కాదు.
బండి పిలిచాను, పోస్టాఫీసుకు వెళ్ళాను, బిళ్లలు కొన్నాను, అంటించాను, పోస్టుమాస్టరు కప్పగించిన్నీ వేశాను, పాకెట్లు.
నెత్తిమీది కొండ దింపుకున్నంత తేలిగ్గా వచ్చా నింటికి.
ఇప్పుడు విప్పా నుత్తరాలు.
"తెనుగు పత్రికల్లో ప్రబుద్ధాంధ్ర వొకటే నాకు నచ్చింది; కాని వొక్కరూపాయి చందాతో మీరెలా నడుపుతున్నారో నా కర్థం కావడంలేదు. ఏమయినా విరాళం పంపుదామంటే, నావల్ల కాదు, శుద్ధబీదవాణ్ణి నేను. అంచేత, పత్రిక ఆగిపోతుందేమో అన్న భయంతో ప్రయత్నించి యేడుగురు చందాదారులను చేర్చి నా చందా కూడా కలిపి, కమీషను నేనే భరించి అది మీ కివాళ మనియార్డరు చేశాను. సంవత్సరం పొడుగునా మాకు పత్రిక పంపం" డని వొక జాబు.
అందుతోబాటు వొక జాపితా.
తెనాలినుంచి వచ్చిం దది.
ఇది యేమనుకోవాలీ?
లోకంలో యేదీ ఆగదు, గడిచిపోతూనే వుంటుంది.
అంచేత, ప్రతీ మనిషి జీవితంలోనూ సంభవిస్తూనే వుంటాయి, విచారణ కందని వెన్నో.
దొరక్క దొరక్క నాకు పిఠాపురంలో యేడోవారం దొరకడమున్నూ యిలాంటిదే, అచ్చంగా.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||320}}</noinclude>
g8bive3imf522rte7xr002izhokhlto
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/345
104
203692
553901
530034
2026-04-20T12:22:31Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553901
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>{{c|<big><big>41</big></big>}}
"పద్యాలు కట్టాలని వుంది నాకు, ఛందస్సు నేర్పండి" అంటూ గురువుల నాశ్రయించా డొక యెస్టేటు గుమస్తా.
తమకు తీరిక లేక నా కప్పగించారు గురువులు, వెంటనే సులక్షణసారం ప్రారంభించా న్నేను.
ఆ మర్నాడే శనివారం.
భోజనం చేసి నేను హోటల్గుమ్మం దిగుతూ వుండగా, భోజనం చేసి కోటకి వెడుతూ శిష్యుడు తారసిల్లాడు.
“ఇదేమి" టనడిగా డతను.
శనివారం సంగతే తెలియదు; గాని నేను వారాలు చేసుకుంటూ వుండడం తెలుసు నతనికీ.
సంగతి విని “ఇక ప్రతీ శనివారమూ మా యింటికి రండి, హోటల్లో భోజనం చెయ్యడానికి వల్లకా" దన్నాడతను ప్రీతిగా.
"ఈ రాత్రే మొద” లనిన్నీ చెప్పి కోటకి వెళ్ళిపోయాడు.
చాలా వింతపడ్డాను.
ఎంత ప్రయత్నించినా వారం దొరక్కపోడం - కోరి వొక గృహస్థు వారం యివ్వడం - ఇప్పటికీ నా కిది అవగాహన కావడం లేదు.
మనకర్థం కావు, జరుగుతూనే వుంటా యెన్నో.
శనివారంనాడు పిఠాపురంలో గొప్ప పశువుల సంత.
ఆవులూ యెడ్లూ - గేదెలూ దున్నపోతులూ - ఎక్క డెక్కణ్ణుంచో వస్తాయి వందలూ వేలూను, శుక్రవారం రాత్రికి - శనివారం తెల్లవారేటప్పటికీని.
ఆదివారం తెల్లవారాక చూద్దామన్నా వొక్కటీ కనపడదు, మళ్ళీ.
ఉదయం వెలుగు వచ్చింది మొదలు పశువుల వ్యాపారం అయితే, సాయంత్రం పొద్దుగూకింది మొదలు పాలవ్యాపారం, అక్కడే ఆవేళ.
పాలేమో పొదుగు దగ్గిరివి.
ఒక్క చుక్క అయినా నీరు కలియనివి.
ధర చూస్తామా బహూ కొద్ది.
ఏమంటే?
పశువులు తెచ్చినవాళ్లకవి అనవసరం.
శేరు కర్దణా వచ్చినా రాబడే.
జాగ్రత్త చేసుకోరాదా అంటే అప్పుడే ప్రయాణం, నాలుగు మెతుకులు తిని.
అంచేత, అప్పటిదాకా పూనగట్టిన పాలా సాయంత్రం పితికేసి అయినకాడి కమ్ముకుంటారు.
సోమవారం ద్రాక్షారామలో అలాంటిదే పశువుల సంత.
మళ్ళీ పూనగట్టి పిఠాపురంలో అమ్మకం కాని పశువులను ఆదివారం రాత్రి కక్కడికి తోలుకుపోతారు వర్తకులు.<noinclude><references/>
{{rh|321||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
h91def10jp0lmg2jrv2oan3mx975jr2
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/346
104
203693
553902
530035
2026-04-20T12:26:41Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553902
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>గుమ్మపాలతో పాటు, కావలసినవారికి, ఈనమోపై వున్న పశువులు ఆ సంతసావళ్లలోనే యీనేస్తాయి కనక, జున్ను పాలున్నూ దొరుకుతాయి, పీఠాపురంలో.
ఆ పాలు తెచ్చుకోడమూ ఆరాత్రి పరమాన్నం చేయించుకోడమూ శిష్యుడి కలవాటు.
దొరక్క దొరక్క నాకు దొరికినవారం యిలాంటిదయింది.
ఇంటోవున్నవారు - శిష్యుడూ, అతని భార్యా, తల్లీని.
ఆ రాత్రి నేను చారూ అన్నమూ పుచ్చుకుంటున్నాను, అట్నుంచి మొదలు కనక, భర్తకు పరమాన్నం వడ్డిస్తోందా అమ్మాయి.
జీడిపలుకులూ, కిసిమిసిపళ్ళూ, పచ్చకర్పూరమూ, కుంకమవువ్వూ - వీటితో తయారయిందేమో, ఘమఘుమలాడిపోతోంది పరమాన్నం.
ఆ పరిమళానికి ముగ్ధుణ్ణయి "చారు తక్కువగా వడ్డించుకుని వుండవలసిం"దనుకుంటున్నాను, మనసులో నేను.
శిష్యుడున్నూ తనకి చాలుచా లంటున్నాడు.
ఇక నాకు వడ్డించాలి ఆ అమ్మాయి.
అలాంటప్పుడు - ద్వారంలో గడపమీద కూచునివున్న శిష్యుడి తల్లి, పేరుపెట్టి కోడల్ని పిలిచి "పరమాన్నం సయించదేమో పాపం, బలవంతపెట్ట కా అబ్బాయిని” అంది తర్జనితో నన్ను నిర్దేశిస్తూ.
తెల్లబోయా న్నేను.
శిష్యుడున్నూ స్తబ్ధుడయిపోయాడు.
నుంచున్నపాళంగా శిలాప్రతిమే అయిపోయిందా అమ్మాయి.
వారా లిచ్చినచోట, బంతిలో బాలపక్షం చేస్తారు కొంద రిల్లాళ్ళు, నా కనుభవమే. కాని యింత బరితెగేవారిని చూడలేదు నే నప్పటికి.
“ముఖే ముఖే సరస్వతీ" అన్నారు పెద్దలు, దానికిది నిదర్శనం కామోసు.
మామూలు మనుష్యులమాట యేమయినా, రచయిత అయినవాడిలాంటి సందర్భాలు గుర్తించుకోడం చాలా అగత్యం.
శబ్దసిద్ధి వొక్కటే కాదు, ఇలాంటిదిన్నీ లోకజ్ఞానంలోనే చేరుతుంది, మరి.
అయితే, శిష్యు డేమయినా కలగజేసుకోడమా వూరుకోడమా?
ఆ పిల్లకూడా అత్తగారి మాట వినడమా వినకపోడమా?
నేను మాత్రం వూరుకోలేకపోయాను.
బంతికి తెచ్చాక, తెచ్చినవి వున్నవారి కందరికీ సమంగా వడ్డించకపోడం యింటివారి దోషం.
ధారాళంగా వడ్డన జరుగుతున్నప్పుడు, మొగమాటపడి కడుపునిండా తినకపోతే ఆ దోషం అతిథులది.
ఇవి రెండూ వొకరాశిలోవే ఘోరపాపాలు.
అప్పుడే కాదిప్పటికీ వుంది నాకీ నమ్మకం.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||322}}</noinclude>
5lgq53dir24vavmhbn0kylit5nuj838
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/347
104
203694
553905
530039
2026-04-20T12:31:25Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553905
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>దీనికి తోడు, పోతూపోతూ వుండిన బాల్య చాపలమూ, ముమ్మరంగానే వుండిన జిహ్వాచాపలమూను నాకు.
నిగ్రహించుకోలేకపోయా న్నేనవి.
వెంటనే "పరమాన్నం నాకు చాలా యిష్టమండీ” అనేశాను, ముసలమ్మతో.
అనేశాను, వెంటనే సిగ్గుపడిపోయాను.
చూడగా, కత్తివేస్తే నెత్తురుచుక్క లేకుండా స్తబ్ధులయిపోయి వున్నారు, భార్యాభర్త లిద్దరూ.
పుండుమీద కారం చల్లినట్టయింది నా మాటతో వారికి.
అలా అనడం ముసలమ్మ తప్పే, మరి యిలా అనడం ?
ఈ ఝడితిస్ఫురణతో చాలా బాధపడిపోయా న్నేను.
ఈ స్థితిలో, ఎప్పుడు తేరుకుందో, పదిగరిటెల పరమాన్నం నా విస్తరిలో గుమ్మరించి పొయ్యి దగ్గిరికి వెళ్లిపోయిందా అమ్మాయి.
అది చూసి రుసరుసలాడుకుంటూ చివాలున లేచి చక్కాపోయింది, ముసలమ్మ.
{{c|<big><big>42</big></big>}}
వారాల భోజనంలో నాకిలాంటి అవస్థలే కలుగుతూ వచ్చాయని కాదు చెప్పడం.
ఒక్కొక్క తల్లి యెంతో మమత కనపరిచేది.
విరియాల రామయ్య పంతులుగారని వేట్లపాలెంలో వొక సంపన్న గృహస్థు.
గోల్కొండ వ్యాపారులు వారు.
స్థితిపరు లాయన, మంచి భోగిన్నీ.
అప్పటికి షష్టిపూర్తి కటో యిటో వున్నా రాయన, భార్య చనిపోయింది పాపం.
ఇద్దరు కూతు ళ్లాయనకు, కొడుకు ల్లేరు.
పెద్దల్లుడు లక్ష్మీపతిగా రిల్లరికం వుండేవారు.
వంటా వడ్డనా, యింటి యాజమాన్యమూ పంతులుగారి చెల్లెలు సీతమ్మగారు నిర్వహించేవారు.
ఆమె జ్ఞాపకంవస్తే నాకు భక్త్యావేశం కలుగుతుందిప్పటికీ.
శుచీ శుభ్రమూ ఆమె సొమ్ములు.
దయా దాక్షిణ్యమూ ఆమె ఆభరణాలు.
పంతులుగారిని నేను వారం అడగ్గా రమ్మన్నవా రామే.
మొదటిపూట భోజనాని క్కూచున్నాం.
వడ్డన పూర్తి కాగా పరిషేచన చేశాం.
వంటింటి గుమ్మాన నుంచుని వుండిపోయా రామె.
"నెయ్యి పట్టుకురారేం?” అనుకున్నా న్నేను.
చూడగా, మామా అల్లుడూ స్వయంగా వడ్డించుకుంటున్నారు నెయ్యి.
చిత్రం యేమిటంటే?<noinclude><references/>
{{rh|323||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
eny04b5nqrm9l78ooiihgxsf60uas1c
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/348
104
203695
553906
530041
2026-04-20T12:38:47Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553906
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>బంతిలో యెందరుంటే అందరి దగ్గిరా నేతిగిన్నెలుంచేవా రామె.
ప్రతీ గిన్నెలోనూ గరిటె కూడా వుండేది.
పప్పు, కూర, పచ్చడి, పులుసు - ఇన్నిటికీ సరిపోయే నెయ్యి అది.
ఓరకంట చూశాను, నాదగ్గిరా వుందొక గిన్నె; కాని స్వయంగా వడ్డించుకోడానికి ముక్కటపడిపోయాను.
అంచేత, పప్పు కలిపి వొట్టి అన్నమే తినసాగాను.
అది చూశారామె. "అయ్యో, నాయనా, వొట్టి అన్నం తింటున్నావా?" అంటూ వూచలా వచ్చి గిన్నే నా విస్తరిలో
వంచేశారు.
పప్పూ అన్నంలో పులుసు కలుపుకున్నట్టయింది నాకు.
అప్పుడు చెప్పారు పంతులుగారు “ఇది మాయింటి పద్ధతి" అన్నీ "నెయ్యి అయిపోతే అడక్కుండానే మళ్ళీ వడ్డిస్తా”రనీ "మొగమాటపడవ”ద్దనీని.
దాంతో పుత్రవాత్సల్యం కలిగిపోయింది సీతమ్మగారికి నేనంటే.
“నాయనా" అనేగాని నన్నెప్పుడూ పేరుపెట్టి పిలిచి యెరగ రామె.
అప్పుడప్పుడు నాకు ఫలహారమున్నూ పెట్టేవారామె.
లక్ష్మీపతిగారి కంటించినప్పుడల్లా సాధారణంగా నాకూ తల అంటించేవారు.
నిజంగా, రాజర్షి రామయ్యపంతులుగారు, నాతో యెప్పుడు మాట్లాడినా విద్యాభ్యాసం విషయమే మాట్లాడేవారు.
ఎందుకు చెప్పానంటే?
వారాల భోజనం కష్టసుఖాలతో పెనవేసుకుని వుంటుం దిలాగ.
పాలపొంగు తగ్గించి, విద్యార్థిని మంచిదారికి మళ్ళిస్తుందది.
{{c|<big><big>43</big></big>}}
గురుకులవాసమూ వారాలభోజనమూ పిఠాపురంతోనే ఆఖరు నాకు.
అయితే, చదువెంత తృప్తికరంగా సాగిందో వారాల పద్దతి అంత తృప్తికరంగా సాగలేదు నాకక్కడ.
అది, అటు పల్లెటూరూ యిటు పట్నమూ కూడా కాకపోడమే అందుక్కారణం.
గొప్ప పండితులున్న పల్లెటూళ్ళలో, ఆ పండితుల ఘనతా, ఆ పండితులుండడంవల్ల తమ గ్రామాలకు వచ్చే ఘనతా గుర్తించుకుని, వారి శిష్యులకు తామే తల్లిదండ్రులయి సాదరంగా భోజనం పెడతా రావూళ్లవారు.
పట్నాల్లో అలాంటి భావాలుండవు సాధారణంగా.
ఇంతకీ, - పట్నాల్లో చలవమడతలు పట్టుకుని తిరిగేవా రందరూ సంపన్నులనీ - అధవా - లోటులేనివా రనీ అనుకోడానికి వీల్లేదు.
మదరాసువంటి నగరాల్లో యిది మరీ స్పష్టంగా తెలుస్తుంది.
నాగరక జీవితానికీ జానపద జీవితానికీ దృక్పథమే వేరు.
దాని కనుగుణమే యీ వ్యత్యయం.
పల్లెటూళ్లల్లో వొకరి సంగతి నొకరికి తెలియం దుండదు.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||324}}</noinclude>
rovr4lqoft02vyzmp9bnby0bnq2ppb4
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/349
104
203696
553907
530042
2026-04-20T12:43:32Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553907
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అడిగితే, అక్కడ, యెవరి వర్గత్రయమైనా చెప్పగల రెవరయినా.
కనక, అక్కడి పరిశీలన యెంతసేపూ మానసిక వ్యవస్థకు.
పట్నాల్లో వొకరి సంగతి వొకరికి తెలియదు.
ఒక్కయింటో - పక్కవాటాలో వున్నవాళ్ల సంగతే అక్కర్లే దెవరికీ.
కనక, వేష భాషలను బట్టే మనుష్యుల కిక్కడ పరిగణన.
వేషం హుందాగా లేకపోతే - కనీసం పరిశుభ్రంగా నయినా లేకపోతే, యెంత సజ్జనుడి కయినా లోపల అడుగు పెట్టడానికే అవకాశం వుండదు, పట్నాల్లో.
అంచేత, పట్నాల్లో అలా తిరక్కపోతే చిక్కూ, పల్లెల్లో అలా తిరిగితేనే చిక్కున్ను.
పోతే, వేషానికి సంపన్నతే అక్కర్లేదు, చాకళ్లు చల్లగా వుంటే చాలు, చాలామందికి.
పిఠాపురంలో నీటుగా తిరిగేవారిలో చాలామంది చాలీ చాలని జీతాలతో నానా అవస్థలూ అనుభవిస్తూ వుండే ఎస్టేటు గుమాస్తాలు.
అంచేత, ఎంతో వాకబుచేసుకుని గాని అక్కడ నే నెవరినీ వారా లడగలేకపోతూ వచ్చాను.
నెలకు ఏడెనిమిది రూపాయలిస్తే, హోటల్లో, అప్పుడు రెండుపూట్లా పెరుగుతో భోజనం.
ఆమాత్రం ఖర్చుపెట్టలేక కాదు, హోటలుభోజనం అంటే అప్పుడే కా దిప్పటికీ నాకు వెగటే.
ఇక మావాళ్ల నమ్మకమా, హోటల్లో భోజనం చెయ్యడం అంటే కులం చెడ్డమే.
ఈ భావం రక్తగతమూ శల్యగతమూ కావడంవల్ల నేమో నాకీ వైముఖ్యం.
కాక, - హోటల్ భోజనం అంటే ఆచారానికే కాదు, శుచికీ రుచికీ గూడా ఆశవొదులుకోవలసిందే.
హోటల్ నిర్వహణం మనకొక వృత్తి కాకపోడం యిందు క్కారణం.
పొట్టగడిచిపోతే చాలు హోటల్ యజమానికి.
ఆ పూట గడిచిపోతే చాలు హోటల్లో తినేవాడికి.
ఇక వొక అంతస్థు యేర్పడ్డాని కవకాశం యేదీ అక్కడ?
అయినా వొక దారే అయివుండును, అనుకోని ఆశనిపాతం వచ్చిపడిం దొకటి మనకి.
అది హోటల్ నిర్వహణంలో మన తెనుగువాళ్ళకి నైచ్యం కనపడితే, అరవలకు మంచి వ్యాపారసరళి కనపడ్డం.
మనవాళ్ల యీ రాజసం అరవలకు కొంగుబంగారం అయింది.
తెనుగువాడికి తెనుగుదేశంలోనే అరవభోజనం గతి కావడానికి దారితీసిం దిది.
లక్షలకొద్దీ అరవయువకులకు వడ్డనవాళ్లుగానూ, వేలకొద్దీ అరవయువకులకు వంట బ్రాహ్మలుగానూ, వందలకొద్దీ అరవ యువకులకు హోటల్ యజమానులుగానూ జీవనసరణి సుగమం కావడమే కాదు, అరవలు నాన్ కో ఆపరేటు చేస్తే, తెనుగుదేశంలో, తెనుగువాడికే యివాళ అన్నం దొరకని స్థితి యేర్పడింది. దీనివల్ల.
ఏతావతా:-<noinclude><references/>
{{rh|325||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
0ighikiro8fmcvpj90ltho8ap4iri3b
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/350
104
203697
553908
530050
2026-04-20T12:47:21Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553908
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఈ విషయమై నేను చెప్పవలసింది, మనవాళ్లు ఎవరికివారు సొంతంగానే ఆలోచించుకోవలసిందీ చాలా వుంది.
అది ప్రత్యేక వ్యాఖ్యానం కావలసిన విషయం.
ఏమయినా, అది తెనుగు హోట లయినా అరవ హోటలయినా, అక్కడ భోజనం చెయ్యడం తప్పనిసరయిపోయింది, తరవా త్తరవాత నాకు.
పట్నం వెడితే, యెక్క డెక్కడి చుట్టరికాలూ సన్నిహితపరుచుకుంటూ బంధువుల యింటికి వెళ్లి భోజనం చెయ్యడమూ, అది సాధ్యం కానిచోట సత్రాల్లో భోజనం చెయ్యడమూ ఆ కాలంలో శిష్టకుటుంబాల సంప్రదాయం.
మా నాయనగారూ మా అమ్మగారూ - ఇలాంటివారు మాత్రం ఎక్కడికి వెళ్ళినా స్వయంపాక నియమమే.
చిన్నవాళ్ళూ, నియమనిష్ఠలు లేని పెద్దవాళ్ళూ మాత్రమే సత్రాల భోజనం చెయ్యడం అప్పుడు.
ఆ రోజుల్లో, సత్రాలు వేసేవారిలో వర్ణాశ్రమాచార నిష్ఠ యెక్కువగా వుండేది కనకనూ, అన్నదానమే వారి ముఖ్యోద్దేశం కనకనూనే, నావంటివాళ్ళ కయినా సత్రాల్లో భోజనం చెయ్యడాని కప్పు డనుజ్ఞ.
హోటలు భోజనమే నిషిద్ధం.
క్రీతాన్నానికే నింద.
నిజం చెప్పవలసివస్తే, అన్నం అమ్ముకుని బతకడంకంటే దౌర్భాగ్యం మరి లేదు.
ఇది మన దృక్పథం.
పాశ్చాత్యుల దయినా, మరొకళ్ళ దయినా సర్వాత్మనా యిందుకు భిన్నంగా వుంది దృక్పథం.
అన్నదానం చాలా పుణ్యప్రదం కాకపోడమే కాదు, ఒకరి అన్నం ఉచితంగా తినడం ఆత్మగౌరవానికి భంగకరం అన్న భావన అందుకు హేతువు.
సంప్రదాయాలు మారుతూ, జాతికి జాతి అంతా కొత్తదారులు తొక్కుతున్న యీ దినాల్లో కొంతవరకయినా మన దృక్పథంలో కొన్ని సవరణలు చేసుకోవలసేవుంది.
కాని, నేనేకా దప్పుడు మరెవరైనా యీ మాట అనగలిగారా?
వాదం దాకా అక్కర్లేదు, అప్పుడు మాటా మంతీ లేకుండా - గప్పిప్పుగా - హోటల్లో భోజనం చెయ్యడానికే యెందరో సాహసించవలసి వచ్చింది.
సత్రాలు విడిచి హోటల్' భోజనం చెయ్యవలసిన అగత్యమున్నూ యేర్పడిందా రోజుల్లో.
అయితే, అది వొక్కొక్కరి కొక్కొక్క విధం.
నా సంగతే చూసుకుందాం.
{{c|<big><big>44</big></big>}}
రాజమహేంద్రవరంలో వెతుక్కుంటూ మేము భోజనానికి వెళ్ళే బంధువులయిళ్లు రెండు.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||326}}</noinclude>
o42tkzlh01q0x7yrb0935j6oln8as5k
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/351
104
203698
553909
530053
2026-04-20T12:51:09Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553909
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇంకా వున్నారు బంధువులు చాలామంది; కాని ఆ రెండిళ్ళవారూ మిక్కిలీ సన్నిహితులు.
శిష్టు లయినవా రెవరు వచ్చినా ఆదరించి భోజనం పెట్టడం ఆ రెండిళ్ళవారికీ వ్రతం కూడానూ.
ఒకమా టీయింటికి వెడితే, మరోమా టాయింటికి వెళ్ళడం మా పద్ధతి.
అందులో వొక యింటి యజమానురాలు మా పెత్తండ్రి గారి కూతురు.
రెండో యింటి యజమానులు మా సన్నిహితజ్ఞాతుల యింటి ఆడబడుచు.
మేనకోడలే ఆ యింటి యజమానురాలి క్కోడలు.
ఆవేళ కోడలు వడ్డిస్తోంది, నేను భోజనం చేస్తున్నాను.
చుట్టరికాని కేవిధంగానూ ప్రాతికూల్యాలు కనపడ్డంలేదు, వాతావరణం మిక్కిలీ ఆత్మీయంగానే వుంది.
ఇంతలో ఆమె అన్న వచ్చాడు.
"లే, మడికట్టుకో” అంది చెల్లెలు.
"భోజనం చేసే వచ్చా”నన్నా డన్న.
ఎవరికయినా యెక్కడయినా సంభవిస్తూనే వుంటుం దిలాంటి వింతలేదు.
కాని, బంధువులు అగౌరవంగా భావించుకునేవారప్పు డది.
"ఏం, మా యింటో భోజనం చెయ్యడం తప్పా?.... మా తాహ తెక్కడ మీ తాహ తెక్కడ, నిజమే; గానీ -" అంటూ నిష్ఠురాలున్నూ మొదలు పెడతారు కనపడ్డప్పుడు.
సంసారం సాగరం అయితే, అందులో మిక్కిలీ సొగసైన దీవి వంటి దాసన్నివేశం.
మమతా, అభిమానమూ, ప్రేమా, ఆప్యాయతా, నిరీక్షా, ఉత్తేజవమూ - ఇలాంటి వెన్నో సురిస్తా యామాటల్లో.
పేరికే నిష్ఠురాలు, నిజానికి యిష్టాలాపా లవి.
అయితే, అలాంటి రాజమార్గం విడిచిపెట్టి "అదేమిటన్నయ్యా అలా చేశావూ? అయినవాళ్ళూ కానివాళ్ళూ వచ్చి
తినిపోతూనే వున్నారు గదా, నువ్వు బరువా మాకు?" అనడిగిందన్నగారి నామె.
గతుక్కుమని నాలుక కరుచుకుంటూ మొగం పక్కకి తిప్పుకుంది, అది విని అత్తగారు.
కొయ్యయిపోయా న్నేను.
ఆమె వుద్దేశం అది కాకేపోవచ్చు. కాని నన్ను మనసులో వుంచుకునే ఆమె అలా అందని గట్టి నమ్మకం కలిగిపోయింది నాకు.
మరి, ముద్ద నోటికి పోలేదు నాకు.
అప్పటికి చారూ అన్నమూ పుచ్చుకోడం అయింది.
వెంటనే ఉత్తరాపోశనం పట్టేసి "మజ్జిగ అక్కరలే"దంటూ లేచి చక్కా పోయాన్నేను.
అందుకామెమీద కోపం రాలేదు నాకు.<noinclude><references/>
{{rh|327||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
7h8l9o7qer381vqrv0jhb9qzljjpw6a
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/352
104
203699
553910
530058
2026-04-20T13:02:10Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553910
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఏమంటే?
భోజనాలకోసం మాత్రమే వచ్చి బొల్లికబుర్లు చెబుతూ తిష్ఠవేసేవారిని చూస్తే యెప్పటికయినా బరువు తోచక
మానదెవరి కయినా.
ఒక యుగం గడిచి మరో యుగం ప్రారంభం అయిన దినా లవి మరి.
తిట్టేవారు తిడుతూనే వుండినా, తినేవారు వందలకొద్దీ హోటళ్లలో స్వేచ్ఛగా తింటూనే వున్నదినా లవి.
ధరలు "మండిపోడమున్నూ" ప్రారంభం అవుతున్న దినా లవి.
కనక, నాదే తప్పని నిర్ధారణ చేసుకున్నా న్నేను.
నియమ నిష్ఠ లవలంబించి వుండలేదు కనక “యిక భోజనం కోసం చుట్టాల యింటికి వెళ్ళకూడ" దనిన్నీ స్థిరపరుచుకున్నానప్పటి కప్పుడు.
సత్రాలకు వెళ్ళడం ప్రారంభించేశాను, వెంటనే.
అన్నదానం చెయ్యడానికే కంకణం కట్టుకున్న గొప్ప సంస్థలవి.
మన భాషలో "అన్నపూర్ణ" అనే మాట పుట్టడానికి, దేశం సుభిక్షంగా వుంటూవుండడమూ, అన్నసత్రా లెక్కడ పడితే అక్కడ అనేకా లేర్పడి వుండడమున్నే కారణం అనుకుంటా న్నేను.
ఈ నిశ్చయం వల్ల "యెవరి యింటికీ వెళ్ళడం? మాట కలపడం యెలాగా?” అన్న బెంగ పోయింది నాకు.
మమత నటించక్కరలేదు. "ఏమనుకుంటున్నారో?" అంటూ పిసుక్కోనక్కరలేదు, వేళకి వెడితే గుమాస్తా పద్దు రాసుకుంటాడు, మడి కట్టుక్కూచుంటే కడుపునిండా భోజనం పెట్టేస్తాడు వంటబ్రాహ్మడు.
బద్ధకంగా వుంటే అక్కడే కాస్సేపు నడుం వాల్చుకోవచ్చు, ఎవరితోనూ చెప్పనక్కర లేకుండా.
నిజమే; కాని కాలం మారుతోంది, భావాలు మారుతున్నాయి, సత్రాల్లోనూ వైపరీత్యాలు ప్రారంభం అవుతున్నా యప్పటికి.
ఇవాళ చూస్తే, సత్రాల్లో భోజనం చేస్తున్నవారిలో, అన్నదానం పరిగ్రహించడానికి లేశమూ అర్హత లేనివారే చాలామంది.
ఒకనాడు ఏలూరిదరి కన్నాపురంనుంచి వస్తూ సాయంత్రం యెనిమిది కావచ్చే సమయాన రెయిలు దిగాను, రాజమహేంద్రవరంలో అప్పుడు.
నాళంవారి సత్రానికిన్నీ వెళ్ళిపోయాను, వాయువేగమనో వేగాలతో.
పద్దులు రాసి అన్నార్థుల సంఖ్య తేల్చుకోడమూ, కావలసిన సామగ్రి వంటబ్రాహ్మడి కిచ్చెయ్యడమూ అప్పటికే అయిపోయి వుంటుంది కనక, గుమాస్తా భోజనం పెట్టడాని కంగీకరిస్తాడా అంగీకరించడా అన్న ఆత్రంతో వెళ్ళాను, గబాగబా.
అడగ్గా, "గుమాస్తాగారు భోజనాల హాల్లో వున్నా" రన్నాడు నౌకరు, అక్కడికే వెళ్ళాను.
విస్తళ్ళు పరిచివున్నాయి, వడ్డన ప్రారంభమే కా లేదప్పటి కింకా.
పట్టుపంచెలు కట్టుకుని కొందరూ, తడి అంగాస్త్రాలు కట్టుకుని కొందరూ సంధ్యావందనాలు చేసుకుంటున్నా రన్నార్థులు విస్తళ్ళముందే కూచుని.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||328}}</noinclude>
r1dnezg92g5lld34zylauq9ee7vgw0f
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/353
104
203700
553911
530061
2026-04-20T13:07:05Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553911
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>గుమాస్తా యెవరో నాకు తెలియదు, పోనీ అంటే, మడి కట్టుకుని విస్తళ్ళ దగ్గిర కూచున్నవారు తప్ప మరెవరూ లేరక్కడ.
ఈ స్థితిలో “యెందుకు వచ్చావ్?” అనడిగాడు బంతిలో మొదట కూచునివుండిన వొక బ్రాహ్మడు.
అతణ్ణి నే నెరుగుదును, పేరు రామయ్య కామోసు బాగా జ్ఞాపకం లేదు - ఇంటిపేరు మాత్రం వాజపేయయాజులవారు.
వాజపేయయాజులువారంటే ఋగ్వేదులూ, వెలనాటి శాఖలో మంచి శిష్ట కుటుంబీకుల్లో వొకరూను; కాని ఆ సంప్రదాయాలూ, ఆ లక్షణాలూ కూడా వొక్కటీ లేపతని దగ్గిర.
రాజమహేంద్రవరంలో సంభావనలకు తిరిగే అంశువారీల్లో వొక డతను, నప్రతిగ్రహీత నన్నట్టు మాత్రం నటించేవాడు.
పొట్టచింపితే అక్షరంముక్క లేదు, సంస్కారి నంటూ డాబులు కొట్టేవాడు.
నోరువిప్పితే “వైదికి” అనడానికే వీలులేని ధోరణి అతనిది.
అత నంటే యెప్పుడూ వెగటే నాకు, అతనే నన్నలా అడగడంవల్లా చిరాకే వచ్చింది నాకు.
"మీరంతా యెందుకు వచ్చారో అందుకే వచ్చా న్నే"నన్నాను విసుగ్గా దాంతో.
కోపం వచ్చిం దతనికి.
అందుకు నాకూ వచ్చింది కోపం.
గందరగోళం పెరగడం యెందు కనుకున్నాడు కామోసు 'అబ్బాయీ, ఆయనే యిప్పు డిక్కడ గుమాస్తా. నువ్వు భోజనానికి వచ్చా వాసంగతి ఆయనతో చెప్పు” అన్నాడు బంతిలో వున్న వృద్ధుడొకడు.
చకితుణ్ణయిపోయా న్నేను.
ఎంతో మంచిపేరుంది నాళంవారి సత్రానికి.
“ఇక ఇది నిలుస్తుందా?” అనిపించింది నాకు.
"గుమాస్తా అయినవాడు సత్రంలోనే భోజనం చెయ్యడమా?" అని వింతా పట్టుకుంది నాకు.
వెనకటికి, అన్నసత్రాలు వేసేవారు, తా మేవర్ణానికి చెందినవారయినా, తమ సత్రాల్లో బ్రాహ్మలనే గుమాస్తాలుగా వేసుకునేవారు.
అయితే “యిలాంటి బ్రాహ్మడా దొరికాడు నాళంవారికి?" అనిపించింది నాకు.
కాని, నా కప్పుడక్కడ భోజనం కావాలంటే అతనే అనుగ్రహించా లది.
"అడగడమేనా?" అనుకున్నాను.
కడుపు నకనకలాడిపోతోంది.
పొద్దున్న తొమ్మిదింటికి ఆదరా బాదరాగా తిన్న మెతుకులు మరి, కన్నాపురంలో.
రెయిల్లో ఏదిపడితే అది కొనుక్కుని తినే అలవాటు కూడా లేదు.
తప్పనిసరి అయి "నాకు భోజనం కావాలి. ఇప్పుడే రెయిలు దిగాను. ఆలస్యంగా రావడాని క్కారణం అదీ” అన్నా నతనికేసి తిరిగి.<noinclude><references/>
{{rh|329||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
dnztnx2wzi0i5488bxhzhqj8jz9t1e8
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/354
104
203701
553913
530063
2026-04-20T13:11:40Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553913
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>చేతికి అంగాస్త్రం ముసుగు వేసుకుని గాయత్రీ జపం నటిస్తున్నాడు గుమాస్తా, మాట్టాడలేదు.
అది గుర్తించి "భోజనా లయాక ఆయన పద్దు రాసుకుంటారు, ముందు మీరు మడికట్టుకోం" డన్నాడు వంట బ్రాహ్మడు, నాకోసం మరో విస్తరి పరుస్తూ.
కాళ్ళూ చేతులూ మొగమూ కడుక్కుని పట్టుపంచె కట్టుక్కూచున్నాను. "నాకో గ్లాసు కావా" లని వంట బ్రాహ్మణ్ణ డుగుతూ.
వంట బ్రాహ్మ డివ్వనూ యిచ్చాడు మంచినీళ్లతో; గాని గాయత్రీ జపం నిలుపుచేసి, గభీమని "ఉద్యోగ”దర్పం వొడిసి తెచ్చుకుని "శ్రీపాదవారి కుర్రవాడి వయ్యుండిన్నీ చెంబు తెచ్చుకోకుండా 'చేతు'లూపుకుంటూ వచ్చావా?" అనడిగాడు గుమాస్తా, చేతులన్నమాట స్థానంలో - బూతుమాట వాడుతూ.
నాకు మండుకుపోయింది.
“వాజపేయయాజులవారి కుర్రవాడి వయ్యుండి గాయత్రి జపిస్తున్న నోటికి బూతెందుకు తెచ్చుకుంటావూ?" అంటూ టొకాయించా న్నేను, అంతకంటే దర్పం తెచ్చుకుని.
పాకం ముదరబోయింది; కాని బంతిలో వున్న నలుగురూ గుమాస్తాని దిగ్గుంజేశారు "విస్తరి ముందు సంధ్యావందనం చేసుకుంటూ బ్రాహ్మ డనవలసిన మాటేనా అది?" అని నిలవతీస్తూ.
గుమాస్తా మరి నోరెత్తలేదు; కాని చాలా వెగటు పుట్టేసింది నాకు.
ప్రతీ సత్రంలోనూ ప్రతీ గుమాస్తా యిలాగే వుంటాడని కాదు; గాని మొత్తానికి సత్రం గుమాస్తాల్లో సంస్కారం వున్నవాళ్లు బహూ అరుదుగా వుంటారు.
వచ్చినవారిని ఆదరించి అన్నం పెట్టమని సత్రాలు వేసిన వారి ఆజ్ఞ అయితే, ఎవరూ రాకుండా వుండా లన్నట్టుంటుంది. చాలామంది గుమాస్తాల నడవడి.
ఇలాంటివన్నీ చూసి వైదికుల్లో చాందసులైనవారు తప్ప తక్కినవా రందరూ హోటల్లోనే భోజనాలు ప్రారంభించి వున్నా రప్పటికే.
అంచేత, అక్కడే - అప్పుడే - ఆ భోజనం ముగిసే లోపునే అనుకున్నా నేను “ఏమయినా, యిక స్వేచ్ఛగా హోటల్
భోజనమే చెయ్యా"లని.
అనుకోడంతో వూరుకోలేదు, మళ్లీ రాజమహేంద్రవరం వెళ్ళినప్పుడే చేశానా పని.
మన జీవనసరణి అప్పటికే కొత్తదారులు తొక్కసాగిం దిలాగ.
పోనీ అంటే, సత్రాలు శిధిలాలయిపోలేదు, కొత్తసత్రాలున్నూ వెలుస్తూనే వున్నాయి, సత్రాల్లో భోజనం చేసేవారున్నూ యెక్కువగానే వుంటున్నారు.
కాని, ఆత్మగౌరవం యెరిగివుండినవాడు మాత్రం సత్రం గుమ్మం తొక్కి చూడ్డం లే దివాళ.
{{c|<big><big>45</big></big>}}
రాజమహేంద్రవరంలో వరదాచారి హోట లొక్కటే పేరుపొందివుం దప్పట్లో.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||330}}</noinclude>
prwcwokmbhn3hhdn5g5mqgv43kncrld
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/355
104
203702
553914
530166
2026-04-20T13:15:20Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
553914
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కాస్త మంచిభోజనం కావాలనుకునేవా రందరూ అక్కడే భోజనం చేసేవారు, వెతుక్కుంటూ వెళ్ళి.
నేను చూశాటప్పటికే వరదాచారి వయస్సు యాభై పైని; కాని రంగడికుచ్చులా వుండేవాడు, బెండకాయ ముద్రలతో అతను.
అతని విలాసాలు వర్ణించేవా రెందరో వున్నా రిప్పటికీ రాజమహేంద్రవరంలో.
అతని హోటలుకే వెళ్ళాను మొదటిమాటు నేను, వాకబు చేసుకుని.
"ఏం, తెనుగు హోటళ్లు లేవా?" అంటే లేకేం?
వొక్కటీ కూడా అడుగు పెట్టడానికి వీలుండదు, అంతే.
అయినాసరే అని వెడితే, సరిగా మాటే ఆడడు యజమాని.
రావలసినవాళ్లని ఆకర్షించలేకపోడమే గాదు, వచ్చినవాళ్ళ నయినా ఆదరించలేడు తెనుగు యజమాని.
సాధారణంగా యజమాని కనపడనే కనపడడు తెనుగు హోటల్లో.
ఇప్పటికీ యిదే పద్ధతి మనవాళ్లది.
లేకపోతే, తెనుగుదేశం అంతా అరవ కన్నడహోటళ్లతో నిండిపోవలసిన కర్మం యేమీ?
ఎవరెంత నీచంగా చూసినా, హోటల్ వృత్తి యివాళ పెద్దవృత్తుల్లో వొకటి.
జాతి మనుగడకు అత్యవసర మయిం దది, సామాన్యం కాదు.
వ్యక్తికే ఐచ్ఛికం గాని జాతికి అత్యావశ్యకం అది.
కాని తెలుగువాడికి దాని విలవ తెలిసిరాలే దింకా.
ఏ నాయకుడూ ఆలోచించ డిది.
ఏ పత్రికా సూచనచెయ్య దీవిషయమై.
జాతికి అంగాలూ, తద్వికాసానికి ఆవశ్యకాలూ అనేకాలన్న సమ్యగ్బోధ లేకపోడమే యిందుక్కారణం.
ఇలాంటిదే తెనుగుదేశం కొల్లగొడుతున్న మరోటి హిందీ ఫిల్ముల దండయాత్ర.
తెనుగులో మాత్రం ఫిలిముల్లేవా అంటే, మరి ఉత్తరాది వాళ్లవి చూడరేం?
బట్టలకోసం ఖండాంతరాలకు ప్రవహించిన ధనప్రవాహంకంటే పెద్దదీ అపాయకరమూ కాదూ హిందీ ఫిలిములు కారణంగా ఉత్తరాదికి ప్రవహిస్తున్న ధనప్రవాహం?
ఖండాంతరాలు పత్తికొనడం రూపంగా అయినా కొంత డబ్బిచ్చేవారు మనకి, హిందీ ఫిలిములు దమ్మిడీ కూడా ఇవ్వడంలేదు.
ఈ విపత్తు గుర్తించిన నాయకుడూ కనపడ్డంలేదు మనలో.
కొన్నా ళ్ళింగ్లీషు ఫీలిములూ కొట్టుకుపోయాయి మన డబ్బు, ఇప్పటికీ కాస్తో కూస్తో కొట్టుకుపోతూనే వున్నాయి, నాకు బాగా తెలుసు.
అయితే, ఆ ఫిలిములు చూస్తే అపారమైన ప్రపంచ జ్ఞానమూ, ఫిలిముల నిర్దోషితకు కావలసిన పరిజ్ఞానమూ అయినా కలుగుతాయి బాగా.
హిందీ ఫిలిములు డబ్బు నొల్లుకుపోడమే కాదు, యువయువతుల జీవితాలున్నూ తప్పుదారికి మళ్లిస్తున్నాయి.<noinclude><references/>
{{rh|331||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
8gn09lzm45fkrcjadjs87o53tk8d8rl
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/212
104
211490
553918
551510
2026-04-20T15:42:39Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553918
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''55. జమలాపురం కేశవరావు '''</p>}]
{{right|- డా॥ చవ్వా వెంకటరెడ్డి}}
కోటి రతనాల వీణగా ప్రఖ్యాతమైన తెలంగాణ మాగాణం ఎందరో మహానుభావులకు, దేశభక్తులకు, సంఘసంస్కర్తలకు పోరాటయోధులకు ప్రాణ ప్రతిష్ట చేసింది. ఎన్నో మహాజ్వల ఘట్టాలకు ఊపిరిలూదింది. అది నిజాం రాచరికపు నిరంకుశ పాలనాకాలం, స్వేచ్ఛకోసం, ప్రజా స్వామిక హక్కుల కోసం ప్రజలు మాట్లాడుతున్న సమయం. దొర పట్టేళ్ల దాష్టీకానికి బడుగుల బతుకులు బలౌతున్న రోజులు. ఆకలితో అలమటించే అభాగ్యులకు అండగా ఉంటూ, ఆధిపత్యాలను అంతమొందించే యోధుడి కోసం తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్న తరుణం.
ఆ సమయంలో కటిక చీకటిలో కాంతిరేఖలా, పీడితుల గుండెల్లో ఎగిసిన పిడికిళ్లకు తెగింపై నినదించిన సింహ కంఠనాదం, పోరు రణన్నినాదం సర్దార్ జమలాపురం కేశవరావు, హైదరాబాద్ సంస్థానంలో విముక్తి ఉద్యమాలను
అత్యంత ధైర్య సాహసాలతో, గాంధేయమార్గంలో నడిపించిన ధీశాలి జమలాపురం కేశవరావు.
నల్లబంగారం సిరుల పంటగా పేరుగాంచిన నాటి వరంగల్ (నేటి ఖమ్మం) జిల్లాలోని ఎర్రుపాలెం గ్రామంలో వెంకట రామారావు, వెంకట నరసమ్మ పుణ్య దంపతులకు 1908 సెప్టెంబర్ 3న కేశవరావు జన్మించారు. కేశవరావు చిన్ననాటి విద్యాభ్యాసం స్వగ్రామంలోనే కొనసాగింది. ఆ పై చదువులు ఖమ్మం పట్టణంలో పూర్తి చేశారు. సంపన్న కుటుంబంలో జన్మించినా ఇతరుల కష్టాలు తనవిగా భావించి పరిష్కరించే నైజం కేశవరావుది. బాల్యం నుండే కేశవరావు అన్ని కులాలు, మతాల వారితో కలివిడిగా ఉండేవారు. గ్రామీణ వ్యవస్థలోని మూఢనమ్మకాల పట్ల అతనికి తీవ్ర వ్యతిరేకత ఉండేది. పుట్టగానే పూవు పరిమళించినట్లు బాల్యం నుండే ప్రశ్నించడం, స్పందించడం, కలుపుకుపోవడం అనే సద్గుణాలు కేశవరావును నాయకుడిగా నిలబెట్టాయి.
ఒకసారి వారి గ్రామంలో ఒక నిండు గర్భిణి చనిపోతే, ఆ సంఘటనను అరిష్టంగా భావించి కుటుంబ సభ్యులతో
సహా ఎవ్వరూ ఆ శవ దహన సంస్కారాలకు ముందుకు రాలేదు. ఆ సన్నివేశాన్ని చూసి చలించిన కేశవరావు గారు
తానే స్వయంగా ఆ యువతి శవాన్ని భూజాన మోసుకొని స్మశానవాటికకు తీసుకెళ్లి దహనసంస్కారాలు చేయించి
గ్రామస్తుల మూఢనమ్మకాన్ని పటాపంచలు చేశారు.
ఊర్లో ఉంటే చెడిపోతున్నాడని భావించిన తండ్రి కేశవరావును హైదరాబాద్ నిజాం కాలేజీలో బి.ఎ.లో చేర్పించారు. నిజాం కాలేజీ విద్యాభ్యాసం కేశవరావు ఆలోచనా పరిధిని మరింత పదునెక్కించింది. ప్రగతిశీల భావజాలం, అభ్యుదయ ప్రాపంచిక దృక్పథం, ఉద్యమించే మనస్తత్వం స్థిరపడటానికి నిజాం కాలేజీ మార్గదర్శనం చేసిందని చెప్పవచ్చు. అవి వందేమాతర ఉద్యమం జరుగుతున్న రోజులు, నిజాం ప్రభుత్వం వందేమాతర గీతాన్ని పాడకూడదని నిషేదించింది. అయినా<noinclude><references/>
{{rh|తెలంగాణ |191| తేజోమూర్తులు}}</noinclude>
7gl54mouxe58dmjl9pg5usnirp3g8t0
553919
553918
2026-04-20T15:43:49Z
A.Murali
3019
553919
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''55. జమలాపురం కేశవరావు '''</p>}}
{{right|- డా॥ చవ్వా వెంకటరెడ్డి}}
కోటి రతనాల వీణగా ప్రఖ్యాతమైన తెలంగాణ మాగాణం ఎందరో మహానుభావులకు, దేశభక్తులకు, సంఘసంస్కర్తలకు పోరాటయోధులకు ప్రాణ ప్రతిష్ట చేసింది. ఎన్నో మహాజ్వల ఘట్టాలకు ఊపిరిలూదింది. అది నిజాం రాచరికపు నిరంకుశ పాలనాకాలం, స్వేచ్ఛకోసం, ప్రజా స్వామిక హక్కుల కోసం ప్రజలు మాట్లాడుతున్న సమయం. దొర పట్టేళ్ల దాష్టీకానికి బడుగుల బతుకులు బలౌతున్న రోజులు. ఆకలితో అలమటించే అభాగ్యులకు అండగా ఉంటూ, ఆధిపత్యాలను అంతమొందించే యోధుడి కోసం తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్న తరుణం.
ఆ సమయంలో కటిక చీకటిలో కాంతిరేఖలా, పీడితుల గుండెల్లో ఎగిసిన పిడికిళ్లకు తెగింపై నినదించిన సింహ కంఠనాదం, పోరు రణన్నినాదం సర్దార్ జమలాపురం కేశవరావు, హైదరాబాద్ సంస్థానంలో విముక్తి ఉద్యమాలను
అత్యంత ధైర్య సాహసాలతో, గాంధేయమార్గంలో నడిపించిన ధీశాలి జమలాపురం కేశవరావు.
నల్లబంగారం సిరుల పంటగా పేరుగాంచిన నాటి వరంగల్ (నేటి ఖమ్మం) జిల్లాలోని ఎర్రుపాలెం గ్రామంలో వెంకట రామారావు, వెంకట నరసమ్మ పుణ్య దంపతులకు 1908 సెప్టెంబర్ 3న కేశవరావు జన్మించారు. కేశవరావు చిన్ననాటి విద్యాభ్యాసం స్వగ్రామంలోనే కొనసాగింది. ఆ పై చదువులు ఖమ్మం పట్టణంలో పూర్తి చేశారు. సంపన్న కుటుంబంలో జన్మించినా ఇతరుల కష్టాలు తనవిగా భావించి పరిష్కరించే నైజం కేశవరావుది. బాల్యం నుండే కేశవరావు అన్ని కులాలు, మతాల వారితో కలివిడిగా ఉండేవారు. గ్రామీణ వ్యవస్థలోని మూఢనమ్మకాల పట్ల అతనికి తీవ్ర వ్యతిరేకత ఉండేది. పుట్టగానే పూవు పరిమళించినట్లు బాల్యం నుండే ప్రశ్నించడం, స్పందించడం, కలుపుకుపోవడం అనే సద్గుణాలు కేశవరావును నాయకుడిగా నిలబెట్టాయి.
ఒకసారి వారి గ్రామంలో ఒక నిండు గర్భిణి చనిపోతే, ఆ సంఘటనను అరిష్టంగా భావించి కుటుంబ సభ్యులతో
సహా ఎవ్వరూ ఆ శవ దహన సంస్కారాలకు ముందుకు రాలేదు. ఆ సన్నివేశాన్ని చూసి చలించిన కేశవరావు గారు
తానే స్వయంగా ఆ యువతి శవాన్ని భూజాన మోసుకొని స్మశానవాటికకు తీసుకెళ్లి దహనసంస్కారాలు చేయించి
గ్రామస్తుల మూఢనమ్మకాన్ని పటాపంచలు చేశారు.
ఊర్లో ఉంటే చెడిపోతున్నాడని భావించిన తండ్రి కేశవరావును హైదరాబాద్ నిజాం కాలేజీలో బి.ఎ.లో చేర్పించారు. నిజాం కాలేజీ విద్యాభ్యాసం కేశవరావు ఆలోచనా పరిధిని మరింత పదునెక్కించింది. ప్రగతిశీల భావజాలం, అభ్యుదయ ప్రాపంచిక దృక్పథం, ఉద్యమించే మనస్తత్వం స్థిరపడటానికి నిజాం కాలేజీ మార్గదర్శనం చేసిందని చెప్పవచ్చు. అవి వందేమాతర ఉద్యమం జరుగుతున్న రోజులు, నిజాం ప్రభుత్వం వందేమాతర గీతాన్ని పాడకూడదని నిషేదించింది. అయినా<noinclude><references/>
{{rh|తెలంగాణ |191| తేజోమూర్తులు}}</noinclude>
m53nypv6vrakwgp5tf3h3xg0fuzq36y
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/213
104
211491
553920
551511
2026-04-20T15:56:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553920
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
లెక్కచేయకుండా కేశవరావు మిత్రులతో కలిసి వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నారు. కేశవరావే ముందుండి తరగతి
గదులను బహిష్కరింపజేసి కళాశాల మైదానంలో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. కేశవరావు నాయకత్వంలో విద్యార్థులు వందేమాతర గీతంపై నిషేధాన్ని ఎత్తివేయాలని గర్జిస్తూ ఉద్యమాన్ని మరింత ప్రజ్వరిల్లజేశారు.
కారణాంతరాల వల్ల బి.ఎ. చదువును మద్యలోనే ఆపేసి మరఠ్యాడలోని కడకత్లో ఉన్న కరోడ్గిరీ శాఖలో ఉద్యోగంలో
చేరారు. కొంతకాలం తరువాత ఆ ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ జిల్లా అవ్వల్ లూలూక్టార్ కార్యాలయంలో
చేరారు. 1986లో ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి సంస్థాన స్వాతంత్య్ర ఉద్యమంలోకి కొదమసింహంలో
దూకారు. అప్పటి నుండి తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేసిన త్యాగధనుడు కేశవరావు.
కేశవరావు విద్యార్థి దశలోనే మాడపాటి హనుమంతరావుతో కలిసి గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. 1923లో విద్యార్థి నాయకునిగా 1934లో ఉద్యమకారునిగా గాంధీజీని కలుసుకున్నారు. ఆ చొరవతోనే 1946లో గాంధీజీ ఖమ్మం పర్యటన కేశవరావు సారధ్యంలోనే జరిగింది. నాడు ఖమ్మంలో గాంధీ గారి ప్రసంగం వినడానికి 80 వేల మంది ప్రజలను సమాయుక్త పరిచిన ఘనత కేశవరావు అంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు కేశవరావు ముఖ్య భూమిక పోషించారు. స్వామి రామానంద తీర్థ, గోవిందరావు నానక్ రామ్ కిషన్ ధూత్, రావినారాయణరెడ్డి జనార్ధనరావు దేశాయ్, శ్రీనివాసరావు బోరేకర్లతో కలిసి తెలంగాణలో స్టేట్ కాంగ్రెస్ పార్టీని ఉన్నతంగా నడిపించారు. నిజాం ప్రభుత్వం స్టేట్ కాంగ్రెస్ను నిషేధించింది.
1938 అక్టోబర్ 24న మధిరలో సత్యాగ్రహదీక్షలో కేశవరావు పాల్గొన్నారు. దీక్షకు అనుమతిలేదు కాబట్టి పోలీసులకు చిక్కకుండా నాటకీయ ఫక్కీలో ఒక రైతు వేషంలో జనంలోకి వెళ్ళి ప్రసంగించారు కేశవరావు, మహాత్మాగాంధీకి జై, భారత్ మాతాకీ జై అని నినదించారు. దీంతో నిజాం ప్రభుత్వం కేశవరావును 14 నెలలు జైలులో బంధించింది.
జైలు నుండి తిరిగి వచ్చిన కేశవరావు తెలంగాణలోని ప్రతి పల్లెపల్లెలో పర్యటించి స్వతంత్ర ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అంతేగాకుండా 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు.
కేశవరావు ప్రజానాయకుడిగా ఎన్నోసార్లు పోలీసులను ఎదిరించారు. ఒకసారి ఇల్లెందులలో యువజన కాంగ్రెస్
సమావేశాలకు పోలీసులు అనుమతించకపోతే, వారి ప్రవర్తనను నిరసిస్తూ జెండా కర్రతో పోలీసులకు ఎదురొడ్డి సవాలు విసిరాడు కేశవరావు. “సభకు అనుమతి ఇవ్వాలని, ఇవ్వకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, దానికి పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీంతో ఒక పోలీసు అధికారి తన తుపాకీని కేశవరావుకు గురిపెట్టి కాలుస్తానని బెదిరించాడు. ఆ అధికారి దౌర్జన్యాన్ని లెక్కచేయకుండా చావుకైనా సిద్ధమంటూ తుపాకిగుండు కెదురుగా తన గుండెను నిలిపిన ధీశాలి కేశవరావు. వారి ధైర్యం అక్కడి ప్రజల్లో చైతన్య స్పూర్తిని రగిలించింది. 'సర్దార్
కేశవరావు జిందాబాద్" అన్న నినాదానికి అక్కడే ప్రాణ ప్రతిష్ట జరిగింది. వారి తెగింపుకు ప్రజలు అభిమానంతో
ఇచ్చిన బిరుదు “సర్దార్' అప్పటి నుండి మన కేశవరావు సర్దార్ జమలాపురం కేశవరావు అయ్యారు.
1946 మే నెలలో నాటి మెదక్ జిల్లా కంది గ్రామంలో కేశవరావు అధ్యక్షతన నిజామాంధ్ర 13వ మహాసభలు జరిగాయి. ఆ సభలో నిజాం ప్రభుత్వం చేపట్టిన బూటకపు సంస్కరణలను తీవ్ర పదజాలంతో ఖండించారు సర్దార్ కేశవరావు. స్వామి రామానంద తీర్థ సహాయం, కేశవరావు అవిశ్రాంత కృషి వల్ల ఆ బూటకపు సంస్కరణలను వెనక్కు తీసుకుంది నిజాం ప్రభుత్వం.
సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షతన స్వాతంత్య్రొద్యమం ఒక స్పష్టమైన స్వరూపం పొందగలిగింది. వేలాదిగా యువకులు, విద్యావంతులు వీరి నాయకత్వంలో స్వాతంత్య్ర సమరంలో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. గ్రామ సంఘాలు, తాలుకా సంఘాలు ఏర్పాటు చేశారు. సర్దార్ కేశవరావు ప్రజలలో జాగృతి కలిగించడానికి బుర్రకథలు, హరికథలు, నాటకాలు దళాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేశారు. గ్రామాలలో గ్రంథాలయాలు నెలకొల్పారు. వయోజన విద్యా పాఠశాలలు ప్రారంభించారు.
గాంధీ మహాత్ముని సిద్ధాంతాలకు అనుగుణంగా సత్యం, అహింసల ద్వారానే స్వాతంత్ర్యం సాధించాలని కేశవరావు ప్రజలకు ఉద్బోధించేవారు. ఆనాటి ప్రభుత్వ దమననీతిని, తన అనర్గళ ఉపన్యాసాలలో నిశితంగా<noinclude><references/>
{{rh|తెలంగాణ |192| తేజోమూర్తులు}}</noinclude>
k7komyjw4ov9a4shk8oqlnky624oo4j
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/214
104
211492
553921
551512
2026-04-20T16:08:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553921
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
విమర్శించేవారు. సభలో కేశవరావు ఉపన్యసిస్తున్నాడని తెలిస్తే ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు.
ఆర్య సమాజంతో కూడా కేశవరావుకు సన్నిహిత సంబంధాలుండేవి. దళితులు, ఆదివాసీల అభ్యున్నతికి కూడా
కృషిచేశాడు. వడ్డీ వ్యాపారులు, షావుకార్ల దోపిడీపై సభలో సమరశంఖం పూరించారు సర్దార్ జమలాపురం కేశవరావు.
కేశవరావు స్వాతంత్య్ర కాంక్షతో సరిపెట్టక హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని నిజాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1947 ఆగస్ట్ 7న సత్యాగ్రహం చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం 18 నెలలు జైలులో పెట్టింది. జైలులో తోటి ఖైదీలకు సమాజంలోని విషయాలు పట్ల అవగాహన కలిగించి చైతన్యపరిచారు. జైలులో పోలీసు
అధికారులకు, ఖైదీలకు మధ్య జరిగిన గొడవలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేవారు. సర్దార్ కేశవరావును
వరంగల్ నుండి నిజామాబాద్ జైలుకు తరలించే సందర్భంలో ప్రజలు వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు చేశారు. ఆ ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దడం పోలీసులకు ఎంతకూ సాధ్యంకాకపోతే కేశవరావే స్వయంగా
ప్రజలను శాంతపరిచారు.
సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లొ మూర్తీభవించిన నిరాడంబరత, సహనం, సత్యసంధత కేశవరావులో ఉండటం వల్ల ప్రజలు కేశవరావును అవరసరిహద్దు గాంధీగా పిలుచుకునేవారు.
కేశవరావు సంస్కర్త, మానవతావాది, నిష్కామయోగిగా బహుముఖీనమైన పాత్రలు పోషించారు. మతమనేది సర్వ సమాన హితానికి మూలం కావాలని అనేక సందర్భాలలో తెలియజేశారు. తను ఆచరణలో నిరూపించుకున్నారు. ఓ సారి తమపెద్దల సమావేశం జరుగుతున్నది. సాయంత్రం అయింది. ఒక ముస్లిం సోదరుడు దేనికోసమో వెదుకుతూ విచారంగా కనిపించాడు. అతని అవస్థను గమనించిన కేశవరావు తన భుజంపై కండువాను ఇచ్చి నమాజు చేసుకొమ్మని, కండువా మాసిపోతుందని ఆలోచించవద్దని భుజం తట్టి ఉత్సాహపరిచారు. ఈ ఘటన వారి పరమత సహనానికి ప్రతీక.
తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ సాయుధపోరాటం కొనసాగించిన రోజులలో సైతం కేశవరావు గ్రామాల్లో నిర్భయంగా తిరిగేవారు. ప్రత్యర్థులు సైతం ఆయనను గౌరవించేవారు. అధికార పదువుల కోసం కేశవరావు ఎన్నడూ అర్రులు చాచలేదు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూకు కేశవరావుపై గాఢమైన అభిమానం ఉండేది. అందుకే హైదరాబాద్ సంస్థానం నుండి భారత పార్లమెంట్కు నామినేట్ చేయబడ్డారు కేశవరావు.
జమీందారీ వ్యవస్థలో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్ర పేరుతో ఆంధ్రలో కలిపితే తీవ్రనష్టం జరుగుతుందని ఆనాడే హెచ్చరించారు కేశవరావు.. స్వాతంత్రోద్యమంలో ఏ భూస్వామ్య శక్తులనైతే వ్యతిరేకించాడో వారే కాంగ్రెస్లో చేరి 1952 ఎన్నికలలో కేశవరావును ఓడించారు. అయినా గెలుపు ఓటములను సమదృష్టితోనే చూసేవారు కేశవరావు.
ఉద్యమ సమయంలో సరైన ఆహారనియమాలు పాటించక పోవడం, జైలు జీవితం, నమ్మిన వారు ద్రోహం చేయడం వంటి దుష్పరిణామాలు కేశవరావును క్రుంగదీశాయి. అందుకే అర్ధాంతరంగా 1953 మార్చి 29న తన 46వ ఏట మనల్ని వీడి శాశ్వతంగా వెళ్ళిపోయారు.
తెలంగాణ ఒక నిస్వార్ధ ప్రజాసేవకుడిని, నిష్కల్మష హృదయుడిని, జననేతను, జాతీయనాయకున్ని కోల్పోయింది. మచ్చలేని వ్యక్తిగా, మానవత్వానికి ప్రతీకగా ప్రజలతో మమేకమైన ఉద్యమస్పూర్తి, చైతన్య దీప్తి సర్దార్ జమలాపురం కేశవరావు, మన భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే దక్కన్ సర్దార్ మన తెలంగాణ కేసరి జమలాపురం కేశవరావు, ఈ సందర్భంలో కాళోజీ జమలాపురం కేశవరావును ప్రజల మనిషిగా అభివర్ణిస్తూ చెప్పిన కవితాపంక్తులను కొసమెరుపుగా అందిస్తున్నాను.
<poem>
{{left margin|5em}}
"మొండి చేతుల అంగి మోకాళ్లు దాటిన
మొలగుడ్డతో తిరుగు కేశన్న
పల్లెబాటలు బాధ ప్రజలతో బాటు
నీ బరి కాళ్లకే బాగ గురుతున్న
మచ్చలేని మనసు జబ్బులోని ఒళ్లు
డబ్బులేని కలు సిదన్న
సర్దారు నామంబు సహజనామంబుగా
సరిపోయినది నీకు కేశన్న”</poem><noinclude><references/>
{{rh|తెలంగాణ |193| తేజోమూర్తులు}}</noinclude>
3s55nzgqz0wiprck9sedv7au9r685vo
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/215
104
211493
553922
551513
2026-04-20T16:18:10Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553922
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''56. జమాలుద్దీన్ '''</p>}}
{{right|- డా౹౹ దేవరాజు మహారాజు}}
1970-80 దశకం వరకు మన హైదరాబాదు నగరంలో సయీద్ జమాలుద్దీన్ పేరు బాగా వినిపిస్తూ ఉండేది. ఆయన చెప్పిన హాస్యోక్తులు ఆయన ఆశువుగా చెప్పిన షాయరీలు, చురకల్లాంటి చెళుకులూ తరచూ వినిపిస్తూ ఉండేవి. నిజానికి ఈయన ఎవరు? నిజాం రాజు ఆస్థానంలో విదూషకుడా? కాదు. ఆయన ఆస్థానంలో అలాంటివారు ఎవరూలేరు. కానీ జమాలుద్దీన్ అనధికారంగా అంతటివాడే.
అక్బర్ ఆస్థానంలో బీర్బల్లాగా, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగ కవిలాగా, మన హైదరాబాద్
సంస్థానాధీశుడు లేడు. కానీ, ఆయన దగ్గరే చిరు ఉద్యోగిగా చేరి, క్రమక్రమంగా 'బాగే-ఎ-ఆమ్' పబ్లిక్ గార్డెన్స్కు
సూపరింటెండెంట్గా పదోన్నతి సాధించాడు.
తెనాలి రామలింగడి గురించి, బీర్ బల్ గురించి ఎలాగైతే కథలు, పిట్టకథలు వ్యాప్తిలోకి వచ్చాయో జమాలుద్దీన్ పేరు అలాంటివే ఎన్నో వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ తరంవారికి అవి అభూత కల్పనలని అనిపిస్తాయి. 'జమాలుద్దీన్' అనేది ఎవరో సృష్టించిన ఒక పాత్ర అని కూడా అనుకున్నారు. కానీ, జమాలుద్దీన్ నిజాం కాలంలో రంగ ప్రవేశం చేసి, తనదైన తరహాలో పాత్రపోషణ చేసి ఈ జీవిత నాటకరంగం నుంచి నిష్క్రమించిన ఒక సజీవ విదూషకుడు! నిజాంరాజు ఆయనను ఆస్థాన విదూషకుడిగా నియమించకపోయినా, ప్రజల దృష్టిలో ఆయన హైదరాబాదు
సంస్థానానికి విదూషకుడయ్యాడు.
దక్కను పీఠభూమిలో హైదరాబాదుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. భాషా సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, ప్రత్యేకమైన వంటకాలవలె జమాలుద్దీన్. సర్వర్ దండా లాంటి వాళ్ళు కూడా హైదరాబాదు సంస్కృతిలో భాగమై పోయారు. నిజాం కుటుంబానికి అతి సన్నిహితుడైన జమాలుద్దీన్ టిప్పు సుల్తాన్ వంశంలోనివాడు.
1881లో మద్రాసులో అంటే చెన్నైలో పుట్టాడు. విద్యాభ్యాసం కోసం విద్యార్థిగా హైదరాబాదు చేరాడు. నాటి ప్రముఖ విద్యావేత్త, సరోజినీ నాయుడి తండ్రిగారైన అఘోరనాథ చటోపాధ్యాయ సంరక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు. మెట్రుక్యులేషన్ పాసయ్యేవరకు సరోజినీ నాయుడి కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి తిరిగాడు. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ నిజాం కళాశాలకు ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆబీడ్స్ రోడ్డులోని 'గోల్డెన్ త్రెషోల్డ్' భవనం వారి నివాసంగా ఉండేది. కవులకు కళాకారులకు, సామాజిక కార్యకర్తలకు అది కేంద్రంగా విలసిల్లింది. సరోజినీ నాయుడితో
పాటు ఆమె సోదరుడు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ వీరి వయసువాడే! ఇక్కడ - అనుకోకుండా ఇంటా బయటా
లభించిన సాహిత్య కళారంగాల వాతావరణం జమాలుద్దీన్ ఎదుగుదలకు దోహదం చేసింది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |194| తేజోమూర్తులు}}</noinclude>
lodebrmcjxh3fjaa8ulx2e1nxu7cijd
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/216
104
211494
553923
551514
2026-04-20T16:30:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553923
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అలాగే, ఒక మంచి అవకాశం కూడా అనుకోకుండానే చేజిక్కింది. జమాలుద్దీన్క నవాబ్ కాజిమర్ జంగ్ సోదరి
గౌసియా బేగంతో 'నిఖా జరిగింది. నవాబ్ కాజిమ్యర్ జంగ్ అంటే మాటలా? నిజాం ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన శాఖ నిర్వహిస్తున్న 'వజీర్! నవాబుల కుటుంబం. అందులో మంత్రిగారి చెల్లెలుతో పెళ్ళి. ఇంకేముంది? జమాలుద్దీన్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇకనేం నిజాం ప్రభువుతోనూ, అతని కుటుంబ సభ్యులతోనూ పరిచయం కావడం, సాన్నిహిత్యం పెరగడం ఇక సహజమేకదా? ఆ విధంగా జమాలుద్దీన్కు సన్నిహితు డయ్యాడు. ఉద్యానవన శాఖలో నిన్న ఉద్యోగిగా చేరి, అనతి
కాలంలో త్వరితగతిని పబ్లిక్ గార్డెన్స్కు అంటే 'బాగ్ ఎ- ఆమ్'కు సూపరింటెండెంట్ అయ్యాడు. పబ్లిక్ గార్డెన్స్లో
'జపనీస్ గార్డెన్' అభివృద్ధి చేయడానికి నిజాం, జమాలుద్దీన్ ను జపాన్ పంపించాడు.
-
జమాలుద్దీన్ జపాన్ వెళ్ళి అక్కడి తోటల పెంపకం, నిర్వహణ అధ్యయనం చేశాడు. హైదరాబాదుకు తిరిగొచ్చాక వెంటనే కార్యరంగంలోకి దూకకుండా కాల యాపన చేశాడు. ఈయన బద్ధకాన్ని గమనించి నిజాం ప్రభువే వెంటపడి 'ఎంత డబ్బు కావాలో తీసుకో. జపాన్ గార్డెన్ అభివృద్ధి చెయ్యి' అని ఒత్తిడి చేయసాగాడు. లక్షరూపాయలు, సంవత్సరం గడువు కావాలన్నాడు. జమాలుద్దీన్. నిజాం మంజూర్ చేశాడు.
కాలం గడిచింది. లక్ష ఖర్చయ్యింది. కానీ, “జపాన్ గార్డెన్'లో ఒక్క మొక్క పెంచలేదు. జపనీస్ పద్ధతిలో
ఉద్యానవనం తయారై ఉంటుందనుకుని ఎంతో ఉబలాటంతో నిజాం రాజు తనిఖీకి వచ్చాడు. 'వని 'ఎంతవరకు వచ్చింది' అని అడిగాడు.
" జపాన్ గార్డెన్ అంతా సిద్ధమైంది ప్రభూ! కానీ, ఒక్కటే తక్కువ! జపాన్ నుండి అగ్ని పర్వతాలు దిగుమతి
చేసుకోవాల్సి ఉంది" అని నివేదించుకున్నాడు. జమాలుద్దీన్, విసినిగొట్టు, కోపిష్టి అయిన నిజాం ప్రభువు మరి
ఆ సమయంలో ఏ గుణాన ఉన్నాడో గానీ... చిరునవ్వు నవి వెళ్ళిపోయాడు. గార్డెన్ కు మరికొంత డబ్బు మంజూరు
చేశాడు. ఆ తర్వాత జమాలుద్దీన్ తన బద్ధకం వదిలించుకుని, రాత్రింబవళ్ళు జపనీయ తోట పెంపకం మీద మనసు
పెట్టాడు. చివరకు జపనీస్ శైలిలో అద్భుతమైన గార్డెన్ అభివృద్ధి చేశాడు. ఇటీవలి కాలం వరకు పబ్లిక్ గార్డెన్లో
జపనీస్ విభాగం ప్రపంచ విహారయాత్రికులను ఎంతగానో అలరించేది.
తర్వాత కాలంలో పబ్లిక్ గార్డెన్స్ లో లలిత కళాతోరణం, తెలుగు విశ్వవిద్యాలయ భవన సముదాయం రావడంతో
జమాలుద్దీన్ అభివృద్ధి పరిచిన జపనీస్ గార్డెన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. బెరార్ యువరాజు, నిజాం
యువరాజు మొజంజా మొదలైనవారంతా జమాలుద్దీన్తో స్నేహంగా ఉండేవారు. అప్పటికి మోటారు వాహనాలు చాలా
తక్కువగా ఉండేవి. గుర్రాలు వాడుకలో ఉండేవి. గుర్రాలమీద స్వారి చేస్తూ ఈ మిత్రులంతా 'బాగె-ఎ-ఆమ్' కు వచ్చి జమాలుద్దీన్తో బాతాఖానీ వేసి, గరమ్ గరమ్ చాయ్ తాగి సరదాగా గడుపుతూ ఉండేవారు.
1940లో జమాలుద్దీన్ రెడ్ హిల్స్లో ఒక చిన్న భవనం కట్టుకున్నాడు. అది కూడా జపనీస్ శైలిలో ఎంతో అందంగా తయారైంది. దాని పేరు 'ఫెర్నోవిల్లా'. అయితే జమాలుద్దీన్ ఆ భవనంలో ఎక్కువకాలం గడపలేకపోయాడు.
కారణం, 1942లో ఆయన అకాల మరణం పొందాడు. కుటుంబంలోని వారంతా అనాథలయ్యారు.
జమాలుద్దీన్ కొడుకు ఇంటిలోని వస్తువులన్నీ అమ్ముతున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చాడు. అది తెలిసి నిజాం ప్రభువు హుటా హుటిన 'ఫెర్డ్ విల్లాకు వెళ్ళాడు. అక్కడి ఆస్థి విలువ ఎంతుందో అధికారులను లెక్కగట్ట మన్నాడు. వాళ్ళు అటూ ఇటూ కూడీ, తీసివేసి చివరకు ఆ ఆస్థి విలువ రెండు లక్షలని తేల్చారు. నిజాం భృకుటి ముడిచాడు. భవనం, ఫర్నీచర్, ఇతర వస్తువులు అన్నీ కలిపి లక్షకు బేరమాడాడు. ప్రభువే ఆ మాట అంటే కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చి కొంటామని ఎవరుమాత్రం ముందుకొస్తారు?ఎంతటి ప్రభువైనా నిజాం పిసినారితనం జగద్విఖ్యాతమైంది. 'ద టీల్స్ ఆఫ్ ఇండియన్ ప్రినెస్' అనే ప్రసిద్ధ గ్రంథంలో కూడా నిజాం పిసినారితనం నమోదై ఉంది.
జమాలుద్దీన్ బతికి ఉన్నంతకాలం నిజాంను అపహాస్యం చేస్తుండేవాడు. జమాలుద్దీన్ 'ఫెర్న్ విల్లా''<noinclude><references/>
{{rh|తెలంగాణ |195| తేజోమూర్తులు}}</noinclude>
ay56w71d8iammy509w3n7knfxluke0p
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/217
104
211495
553924
551515
2026-04-20T16:39:16Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553924
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
కట్టుకున్న తొలి రోజుల్లో యువరాజు మొఖండా ఫెర్నావిల్లాడు.వచ్చి 'ఇదేమిటి పావురాల గూళ్ళలాగ ఇంత ఇరుకుగా
ఉందీ ఇల్లూ - ఇందులో ఎట్లా ఉంటారూ?' అని హేళన చేశాడు. 'తన స్థాయికి, తన సంపాదనకు తగినట్టుగా తను
కట్టుకున్నానని జమాలుద్దీన్ సవినయంగా మనవి చేసుకున్నాడు. విచిత్రమేమంటే పోలీస్ యాక్షన్ తర్వాత యువరాజు తన అధికారం నివాసం 'హిల్ ఫోర్ట్ ప్యాలెస్' వదిలి, తన తండ్రి నిజాం బేరమాడి కొన్న ఈ ఫెర్న్ విల్లాలోనే ఇరవైయేళ్ళు నివసించాడు. అలా జమాలుద్దీన్ కట్టిన పావురాల గూడులో యువరాజుకు జీవితం వెళ్ళబోయక తప్పిందికాదు.
జమాలుద్దీన్ పేర ప్రచారంలో ఉన్న కొన్ని హాస్యోక్తులు చూద్దాం. జమాలుద్దీన్ టోపీ ముందు భాగాన్ని వెనక్కి
పెట్టుకుని తిరిగేవాడట. అదేమంటే 'ఏమో నిజాం ప్రభువు గబుక్కున వెనకనుండి వస్తే ఎట్లా? అందుకే ఈ ఏర్పాటు'
అని అనేవాడట. తెలివి తక్కువ నౌకరు ఇంట్లో మేకు కొడుతున్నాడట. మేకు తలభాగం గోడకు పెట్టి, మొనతేలిన
భాగాన్ని బాదుతున్నాడట. అది గమనించిన జమాలుద్దీన్ 'ఆ మేకు ఆ గోడది కాదురా! అదిగో ఎదురుగా ఉన్న గోడది! కదిలించకుండా అలాగే తీసుకెళ్ళి ఎదురుగా కొట్టు దిగుతుంది' అని చెప్పాడట. ఒక్కో గోడకు ఒక్కోరకం
మేకులుంటాయా అని నౌకరు ఆశ్చర్యపోయ్యాడట. ఒకసారి కారు డ్రైవర్ సడన్ గా బ్రేకు వేశాడట. ఏమిటి? ఏమైంది? అని అడిగాడు జమాలుద్దీన్, 'ఎదురుగా గొయ్యి ఉందిసార్. చూస్కోలే. మాఫ్ కర్నా' అన్నాడట డ్రైవర్.
"గొయ్యి ఉన్నా నుయ్యి ఉన్నా హారన్ మోగిస్తూ వెళ్ళిపోవాలేగాని, బ్రేకులు కొట్టి కార్లో ఉన్నవాళ్ళ ప్రాణాలు తీస్తావా?” అని సీరియస్గా జోక్ చేశాడట జమాలుద్దీన్.
చదువుకోసం కూతురిని జమాలుద్దీన్ ఢిల్లీ పంపించాడు. అక్కడ ఆమె 'పింగ్ పాంగ్' ఆట నేర్చుకుని,
తల్లిదండ్రులకు “నేను వింగ్ పాంగ్ ను వదిలి ఉండలేకపోతున్నా"నని ఉత్తరం రాసింది.
దానికి జమాలుద్దీన్ 'అదిగో చూశావా నీ కూతురు ఎవడో చైనా వాడి వలలో పడింది' అని భార్యను బెదిరించాడట. జమాలుద్దీన్ భార్య గౌసియా బేగం తెలివి తక్కువదికాదు. 'పింగ్ పాంగ్- అంటే టేబుల్ టెన్నిస్ అని భర్తకు తెలియ జెప్పింది. నవాబుల కుటుంబంలోంచి విచ్చిన గౌసియా బేగం, స్త్రీవిద్యకు ముఖ్యంగా హైదరాబాదు సంస్థానంలో మాంటిస్సోరి విద్యావిధానానికి నాంది పలికిన నారీమణి! ఇక్కడి నుండి పట్టభద్రులైన తొలితరం మహిళల్లో ఆమె ఒకరు. ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్ వెళ్ళి, మాంటిస్సోరి విద్యావిధానాన్ని అధ్యయనం చేసాచ్చి ఇక్కడ ప్రవేశపెట్టిన
ఘనత ఆమెదే! భర్త జమాలుద్దీన్ అటు ఉద్యానవన శాఖను పరిపుష్టి గావిస్తే, ఇటు ఈమె విద్యారంగాన్ని సుసంపన్నం చేశారు. హైదరాబాదు చరిత్ర పుటల్లో ఈ దంపతుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |196| తేజోమూర్తులు}}</noinclude>
lc5db40zg7m954kk1xtogi2ynmesre9
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/218
104
211496
553944
551516
2026-04-21T04:14:45Z
A.Murali
3019
553944
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''57. జయశంకర్ సర్ '''</p>}}
{{right|-దేశపతి శ్రీనివాస్}}
<poem>ప్రతీదీ సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుండవుట దుష్కరమ్ము సుమ్ము</poem>
దుష్కరమైన దానిని సుసాధ్యం చేసి చూపిన మనీషి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. కలలో కనిపించినా నిద్రలోనే
చేతులెత్తి నమస్కరించేంతగా తెలంగాణ ప్రజాజీవితం మీద ఆయన తన జీవిత కార్యాచరణతో ముద్రవేశారు. తెలంగాణ మట్టిలోని ఉదాత్త విలువలకు మానవ రూపం ఆచార్య జయశంకర్.
1934 ఆగష్టు 6న తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మ అయిన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో
ఆయన జన్మించారు. కాళోజీ, సురవరంలలో ప్రతిఫలించిన హైదరాబాద్ సంస్థాన సంస్కృతికి జయశంకర్ కూడా
అచ్చమైన వారసుడు. జయశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు నిజాం కాలం నాటి హైదరాబాద్ సంస్థానంలోని
ప్రజాజీవితానికి సంబంధించిన జ్ఞావకాల వెలుగునీడలు ఆయనలో ప్రతిఫలించేవి. నిఖార్సైన తెలంగాణీయుడు.
అందుకే తన తెలంగాణతనం మీద ఎవరూ ఆక్షేపణ చేసినా అవమానించినా ఆయన సహించలేదు. రోషంతో
తిరగబడ్డాడు. జీవితమంతా ఒకే ఎజెండాతో జీవించారు. తెలంగాణ జీవితాన్ని విధ్వంసం చేస్తున్న ఆంధ్ర వలస
వాదానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పక్షాన ఆయన వకాల్తా తీసుకున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే తెలంగాణ
తల్లి తనకోసం తాను నియమించుకున్న న్యాయవాది ఆయన. తన క్లైంట్ తరఫున వాదనలను ఆయన ఎంతో కఠోర దీక్షతో పదును పెట్టుకున్నాడు. జీవిత పర్యంతం ఎంతో శ్రద్ధగా వాదించిండు. తెలంగాణ ఉద్యమానికి ఒక తాత్విక
భూమికను ఏర్పరచిండు.
తెలంగాణ ఉద్యమం అన్ని దశలలోను జయశంకర్ ఉద్విగ్న భాగస్వామి. పోలీస్ యాక్షన్ తరువాత తెలంగాణలో
సివిల్ రూల్ అమలులో ఉన్న కాలంలో అప్పటి పాలకులు ఇక్కడి ఉద్యోగాల్లో ఇతర ప్రాంతాల వారిని నియమించారు. ఈదశలో తామరతంపరగా వలన వచ్చిన ఆంధ్ర ప్రాంతీయులు ఇక్కడి ప్రజల జీవనంతో సంలీనం కాలేదు. ఈ ప్రాంతాన్ని జయించిన విజేతల వలె వారు ప్రవర్తించారు. ఇక్కడి వారికి సభ్యత, సంస్కారం, నాగరికత భాష నేర్పేందుకు వచ్చిన ఉద్దాన కర్తలవలె తమనుతాము భావించారు.
ఆంధ్ర ఉద్యమంలో పొందిన అభిజాత్యాన్ని తెలంగాణ ప్రజల మీద ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో 1952లో ముల్కీ
ఉద్యమం చెలరేగింది. 1952 సెప్టెంబర్ 3న హైదరాబాద్ సిటీ కాలేజీలో జరిగే విద్యార్థుల సమావేశానికి బయల్దేరిన
జయశంకర్ బస్సు ఫెయిల్ అయి మార్గమధ్యంలో జనగామ దగ్గర ఆగిపోయిండు. ఆరోజు సిటీ కాలేజీ సమా వేశంపై
పోలీసులు చేసిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు అమరులయ్యారు. నిజాంకాలం నాటి సంక్లిష్ట సందర్భంలో<noinclude><references/></noinclude>
4q8cboq8fn0hlg9y1nwyqdud8z1uizv
553945
553944
2026-04-21T04:15:54Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553945
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''57. జయశంకర్ సర్ '''</p>}}
{{right|-దేశపతి శ్రీనివాస్}}
<poem>ప్రతీదీ సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుండవుట దుష్కరమ్ము సుమ్ము</poem>
దుష్కరమైన దానిని సుసాధ్యం చేసి చూపిన మనీషి ఆచార్య కొత్తపల్లి జయశంకర్. కలలో కనిపించినా నిద్రలోనే
చేతులెత్తి నమస్కరించేంతగా తెలంగాణ ప్రజాజీవితం మీద ఆయన తన జీవిత కార్యాచరణతో ముద్రవేశారు. తెలంగాణ మట్టిలోని ఉదాత్త విలువలకు మానవ రూపం ఆచార్య జయశంకర్.
1934 ఆగష్టు 6న తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మ అయిన వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో
ఆయన జన్మించారు. కాళోజీ, సురవరంలలో ప్రతిఫలించిన హైదరాబాద్ సంస్థాన సంస్కృతికి జయశంకర్ కూడా
అచ్చమైన వారసుడు. జయశంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు నిజాం కాలం నాటి హైదరాబాద్ సంస్థానంలోని
ప్రజాజీవితానికి సంబంధించిన జ్ఞావకాల వెలుగునీడలు ఆయనలో ప్రతిఫలించేవి. నిఖార్సైన తెలంగాణీయుడు.
అందుకే తన తెలంగాణతనం మీద ఎవరూ ఆక్షేపణ చేసినా అవమానించినా ఆయన సహించలేదు. రోషంతో
తిరగబడ్డాడు. జీవితమంతా ఒకే ఎజెండాతో జీవించారు. తెలంగాణ జీవితాన్ని విధ్వంసం చేస్తున్న ఆంధ్ర వలస
వాదానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పక్షాన ఆయన వకాల్తా తీసుకున్నాడు. ఒకమాటలో చెప్పాలంటే తెలంగాణ
తల్లి తనకోసం తాను నియమించుకున్న న్యాయవాది ఆయన. తన క్లైంట్ తరఫున వాదనలను ఆయన ఎంతో కఠోర దీక్షతో పదును పెట్టుకున్నాడు. జీవిత పర్యంతం ఎంతో శ్రద్ధగా వాదించిండు. తెలంగాణ ఉద్యమానికి ఒక తాత్విక
భూమికను ఏర్పరచిండు.
తెలంగాణ ఉద్యమం అన్ని దశలలోను జయశంకర్ ఉద్విగ్న భాగస్వామి. పోలీస్ యాక్షన్ తరువాత తెలంగాణలో
సివిల్ రూల్ అమలులో ఉన్న కాలంలో అప్పటి పాలకులు ఇక్కడి ఉద్యోగాల్లో ఇతర ప్రాంతాల వారిని నియమించారు. ఈదశలో తామరతంపరగా వలన వచ్చిన ఆంధ్ర ప్రాంతీయులు ఇక్కడి ప్రజల జీవనంతో సంలీనం కాలేదు. ఈ ప్రాంతాన్ని జయించిన విజేతల వలె వారు ప్రవర్తించారు. ఇక్కడి వారికి సభ్యత, సంస్కారం, నాగరికత భాష నేర్పేందుకు వచ్చిన ఉద్దాన కర్తలవలె తమనుతాము భావించారు.
ఆంధ్ర ఉద్యమంలో పొందిన అభిజాత్యాన్ని తెలంగాణ ప్రజల మీద ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో 1952లో ముల్కీ
ఉద్యమం చెలరేగింది. 1952 సెప్టెంబర్ 3న హైదరాబాద్ సిటీ కాలేజీలో జరిగే విద్యార్థుల సమావేశానికి బయల్దేరిన
జయశంకర్ బస్సు ఫెయిల్ అయి మార్గమధ్యంలో జనగామ దగ్గర ఆగిపోయిండు. ఆరోజు సిటీ కాలేజీ సమా వేశంపై
పోలీసులు చేసిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు అమరులయ్యారు. నిజాంకాలం నాటి సంక్లిష్ట సందర్భంలో<noinclude><references/>
{{rh|తెలంగాణ |197| తేజోమూర్తులు}}</noinclude>
051jqdewx5wqkz3rorxdwh6l80usxhr
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/219
104
211497
553946
551517
2026-04-21T04:28:03Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553946
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఎదిగిన వాడు జయశంకర్. ఉర్దూ మీడియంలోనే చదువు అందుబాటులో ఉన్న రోజులవి. హన్మకొండలోని మర్కజి
హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఉస్మానియాలో బి.ఏ. బెనారస్ అలీఘడ్ విశ్వవిద్యాలయాలనించి పోస్ట్
గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందాడు.
ఉమ్మడి రాష్ట్ర ప్రతిపాదనలో ఉమ్మడితనం లేదని జయశంకర్ మొదటినుంచి వాదించాడు. అది కేవలం ఆంధ్ర
రాష్ట్ర సమస్యలను గట్టెక్కించు కోవడం కోసం తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం కోసం ఆంధ్ర నాయకత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనగానే ఆయన భావించారు. భిన్న చారిత్రక దశలు, సామాజిక పరిణామాలు గడిచివచ్చిన రెండు సమాజాలను ఒకటి చేస్తే అసమానతలు చోటుచేసుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను నిర్ద్వందంగా
వ్యతిరేకించాడు. భావ సమైక్యత లేకుండా భాష ఒక్కటే ప్రజలను కలిపి ఉంచలేదని “ఫజల్ అలీ కమీషన్ ముందు
తన వాదనలు వినిపించాడు.
కాని తెలంగాణ ప్రజల అభిప్రాయాలను విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయింది. ఏర్పాటు సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, రక్షణలు, చేసుకున్న ఒప్పందాలు ఏవీ అమలు కాలేదు సరికదా దారుణమైన
ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామం తెలంగాణ ప్రజల జీవితంలో కల్లోలం రేపింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 13 సంవత్సరాలలోనే అది ఒక విఫల ప్రయోగమని తేలిపోయింది.
1969లో తెలంగాణ ప్రజాక్షేత్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. 35ఏళ్ళ జయశంకర్ ఉద్యమ
సమరాంగణంలో సాహసోపేతంగా దూకిండు. ఒక సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయశంకర్ వాదనలోని తీవ్రతను చూసి "నిన్నిప్పుడే ఉద్యోగంలోంచి తీసేయగలను' అని బెదిరింపు ధోరణలో మాట్లాడితే 'మీ టేబుల్ మీద కాగితం ఉంది మీ జేబులో పెన్నుంది ఈ క్షణం నన్ను ఉద్యోగంలోంచి తీసేయండి' అని జవాబిచ్చిన ధీశాలి జయశంకర్.
ఏడాది కాలం కాలాన్ని కళపెళ ఉడికించి అనేక మంది యువకులు తమ రుధిర ధారలతో నేలను తడిపి ప్రాణార్పణ తో ప్రతిఘటనను నిర్మించి నిలబెట్టిన ఉద్యమం విద్రోహానికి గురయ్యింది. నాయకత్వం లొంగి పోయింది. తీవ్రమైన నిరాశా నిస్పృహలు తెలంగాణ ఎల్లెడలా అలుముకున్నాయి. ఆ నీరవ నిశ్శబ్ద సందర్భంలోనూ నిస్పృహకు గురి కాకుండా కర్తవ్యదీక్షతో ముందుకు కదిలిన గుండె ధైర్యం పేరు జయశంకర్.
చిత్రగుప్తుడు పాపాల చిట్టా రాసినట్టు పాలకుల వివక్షను పుస్తకాల్లో సాక్షాధారాలతో రికార్డు చేస్తూ పోయిండు. మొక్కవోని దీక్షతో భవిష్యత్తు మీద ఎనలేని నమ్మకంతో చేసిన ఆయన ప్రయత్నం మలిదశ తెలంగాణ ఉద్యమానికి
సైద్ధాంతిక భూమికను సమకూర్చింది. ఆనాటి నుంచి నిధులు, నీళ్ళు, నియామకాలలో తెలంగాణకు జరుగుతున్న
అన్యాయాన్ని అనవరతం లిఖిస్తూ పోయిండు.
ఆర్ధిక శాస్త్ర ఆచార్యుడైన జయశండర్ ఇంజనీర్లకన్నా లోతుగా ప్రాజెక్టుల గురించి నీటి పంపకాల గురించి జరిగిన
అన్యాయం గురించి బలంగా రాసిండు. నిధుల తరలింపు, నియామకాల్లో జరిగిన అన్యాయాలు ఏది రాసినా
సాధికారికంగా రాసిండు. అందుకోసం ఆయన అనేక అంశాలను అధ్యయనం చేసారు. సమాచారాన్ని సేకరించారు.
తెలంగాణ దృక్పథంతో విశ్లేషించిందు. మాటలను కాయినైజ్ చేయడంలో జయశంకర్ తనదైన ముద్ర వేసిండు. నిధులు, నీళ్ళు, నియామకాల అనటంకాని యాచించి కాదు శాసించి సాధించాలి అనటస్త్రం కాని స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అనటం కాని RSS నించి RSU దాకా అందరూ ఒకే ఎజెండాలా కదలాలని చెప్పడం కాని తెలంగాణ వాదులు వీలైన సమైక్యంగా లేదా సమాంతరంగా పోరాడాలి తప్ప సంఘర్షణలకు దిగకూడదని చెప్పడం కాని ఆయనలోని సృజనాత్మకతకు అనుభవ సామర్ధ్యానికి నిదర్శనం.
జయశంకర్ సారుది మేఘ గంభీర స్వరం. ఆయన ఉపన్యాసం గంభీర నదీ ప్రవాహం. సప్రమాణమైన చర్చ,
ఖచ్చితమైన తర్కమే తప్ప సభారంజకత్వం కోసం చేసే ఉపన్యాసం కాదు. ఆలోచనా బలంతో విశ్లేషణ వైదుష్యంతో
వాదంలో స్పష్టతతో సభమీద ఒక గంభీరమైన ముద్రవేస్తడు. భావన ఎంత స్పష్టంగా వుంటుందో వ్యక్తీకరణ అంత
స్పుటంగా ఉంటుంది. రాసినప్పుడు వాక్యం ఎంత బిగువుగా వుంటుందో మాట్లాడినప్పుడు అంతే పకడ్బందీగా ఉంటుంది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |198| తేజోమూర్తులు}}</noinclude>
1gah8y0ebq0rrbv6mslvba46lir036v
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/220
104
211499
553947
551526
2026-04-21T04:39:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553947
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
శిధిల వాక్యాలకు ఆయన ఉపన్యాసంలో చోటు లేదు. మాటల మధ్య పాజ్ తొ కూడా ఒక వ్యక్తీకరణను సాధ్యం
చేయడం ఆయనకు తెలిసిన ఒక అద్భుత విద్య. ఎంతటి సంక్లిష్ట విషయాన్నైనా అనుగుణమైన పదాలతో సులభంగా
సుగమంగా భోదించడం జయశంకర్ ప్రత్యేకత. మీకీ బిధంగా పదాలను అప్రొపియేట్ గా ప్రయోగించడం ఎట్లా
సాధ్యం అని అడిగినప్పుడు జయశంకర్ 'నేను ముందు ఉర్దూలో అలోచిస్తా ఉర్దూ పదాలకు సమానార్ధణాలైన తెలుగు
'పదాలను ఉపయోగిస్తా' అనే ఆశ్యర్యకరమైన సమాధానం చెప్పిండు. ఉర్దూ అంటే ఆయనకు అమితమైన ప్రేమ.
ఉర్దూ కేవలం మహమ్మదీయుల భాష అనుకునే వారి సంకుచితత్వం పట్ల సారుకు చానా అసహనం. ఒక మతానికి
భాష ఉండవచ్చు కాని, ఒక భాషకు మతం ఉండదు అనేది సారు అభిమతం. జయశంకర్ ఉర్దూ ప్రసంగాన్ని వినేందుకు మహమ్మదీయులు పండితులు కూడా చెవికోసుకునేది. ఫసీ ఉర్దూలో ఆయన ప్రసంగిస్తుంటే అత్తరు వాసనల వలె సాహిత్య పరిమళం సభను అలుముకునేది.
మిర్జాగాలిబ్ సాహిర్ లూథియాన్వి, ఇక్బాల్ షాద్ కాళోజీ రామేశ్వరరావుల షాయరీలు అలవోకగా ఉటంకిస్తూ చేసిన ఆయన ప్రసంగాలు నేటి తరానికి గొప్ప సిలబస్ నిలుస్తాయి. తెలంగాణ ప్రజలు మాట్లాడే తెలుగును ఉర్దూ కలిసిన తెలుగు కనుక తారక్యార్ధం అని అన్న ఆంధ్రా పండితులకు ఆయన మూతోడ్ జవాబ్ యిచ్చిండు. ఉర్దూ భారతీయ భాష. దాని ప్రభావం దేశంలోని అన్ని భాషల మీదా ఉంది. తమదే అసలైన తెలుగుగా భావించే ఆంధ్రా ప్రాంతీయులు ఎన్ని ఉర్దూ పదాలను అవి ఉర్దూ పదాలని తెలియకుండానే ఎటా ఉపయోగిస్తున్నారో సార్ వివరించి
చెప్పిండు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలంగాణను దక్షిణ పాకిస్తాన్ అన్నందుకు ఆగ్రహించి ఆయన ఇంటికి
పోయి ఆయన పద్యాలలో ఉన్న ఉర్దూ పదాలను చూపించి ఆయనను ఆశ్చర్య పరిచిండు. అట్లే శ్రీశ్రీ తదితర కవుల
కవితలలో ఉర్దూ ఎట్లా మిళితమయిందో సోదాహరణంగా వివరించిండు.
జయశంకర్ సారుకు చదువు చెప్పిన గురువు విద్వాన్ టి.వి. సుబ్బారావు. ఆయన తన 80వ యేట ఉర్దూ నేర్చుకుని
ఉర్దూ కవితా మాధురి అనే పుస్తకం రాసిండు. విచిత్రమేమిటంటే తన గురువు పుస్తకానికి శిష్యుడైన జయశంకర్ గొప్ప ముందుమాట రాసిండు. ఆ ముందుమాట తెలుగు భాష మీద ఉర్దూ భాషా ప్రభావాన్ని విశదీకరించిన ఒక మాస్టర్ పీస్.
ఇజాలలో ఇమడని వ్యక్తిత్వం జయశంకర్. నానా ఇజాలలో చూడ నాఞజమే కనిపించును అన్న కాళోజీ మార్గం
ఆయనది. బ్రతుకు పూజ్యనీయమైనదని దానిని స్వార్ధంతో సంకుచితత్వంతో నింపేయొద్దని ఆయన నమ్మిక. చట్టబద్ధ
పాలన ఆయన నమ్మిన సూత్రం.
తన వ్యక్తిగత జీవితంకన్నా వృత్తి గత జీవితానికి సామాజిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. వామపక్ష విద్యార్థి ఉద్యమాలు తీవ్రంగా ఎగిసి పడుతున్న సమయంలో వరంగల్లోని CKM కాలేజీ ప్రిన్సిపాల్గా కాకతీయ యూనివర్సిటీ వైన్ ఛాన్సులర్గా ఎంతో పరిణతితో సమన్వయ దృక్పథంతో పరిపాలనా భాద్యతను నిర్వహించారు. కాకతీయ యూనివర్సిటీ లో విద్యా ప్రమాణాల్ని నెలకొల్పడంలో యూనివర్సిటీని ప్రాంతీయ అసమానతల అధ్యయనం చేయడం కోసం తెలంగాణ స్టడీ సెంటర్ను ఆయన నెలకొల్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక దీపస్తంభం వలె దారి చూపారు. ఆటుపోట్లు ఎదురైనప్పుడు ధైర్యం చెప్పిండు.
నేటి ముఖ్యమంత్రి నాటి తెలంగాణ ఉద్యమ రథసారధి KCR అండగా నిలిచిండు. తెలంగాణ నలుచెరగులా కలియ దిరుగుతూ భావణాల ప్రచారం చేసిండు. స్వపక్షమైనా విపక్షమైనా తెలంగాణ గురించి మాట్లాడాలంటే జయశంకరే
రెఫరెన్స్, ఆయన ఒక నడిచే తెలంగాణ ఉద్యమ సర్వస్వం జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను తెలంగాణకు
అనుకూలంగా ఒప్పించడంలో KCR గారితో పాటు జయశంకర్ గారిది కీలకపాత్ర.
ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంతో గౌరవించే ఆత్మీయమిత్రుడు జయశంకర్. చారిత్రికమైన డిసెంబర్ 9 ప్రకటనను రాసింది జయశంకరే. కాన్సర్ దేహాన్ని కబళిస్తున్నా లెక్కచేయకుండా శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ
రాష్ట్ర సమితి పక్షాన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను<noinclude><references/>
{{rh|తెలంగాణ |199| తేజోమూర్తులు}}</noinclude>
r4ur5fd3r5wcxsqzdiwud1u5uwu00gq
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/221
104
211500
553949
551527
2026-04-21T04:46:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553949
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
గురించి నివేదిక రాసి ఇచ్చింది జయశంకరే. కాన్సర్తో బాధపడుతూ ఢిల్లీలో నివేదిక పనిలో ఉన్న జయశంకర్కు
'ఎందుకు సార్ ఈ సమయంలో ఈ పరిస్థితిలో మీకింత కష్టం' అని నేను మెసేజ్ పెట్టిన. ఎవరు మెసేజ్ పెట్టినా
వెంటనే జవాబివ్వటం ఆయన పద్ధతి. నాకు సార్ ఫోన్ నించి ఈ విధంగా మెసేజ్ వచ్చింది Thanks for the
fine sentiments. In all modesty I would like to say that at this stage in my life, I am living only
for Telangana and if I loose my life for the sake of Telangana, it would be my good fortune.
సార్ స్వప్నం సాకారమైంది. ఆయన లేకున్నా ఆయన ఆశయాలు దీపాల్లా వెలుగుతున్నాయ్. రేవు తెలంగాణ
పొలాలకు పారే నీటి గలగలలో ఆయన చిరునవ్వులే వినపడతాయి. ఆత్మగౌరవంతో బ్రతికే ప్రతి పౌరుని కళ్ళలో
కనిపించే సంతృప్తిలో ఆయన ఆనవాళ్ళే మెరుస్తాయి. ఆయన స్మృతుల్ని అజరామరం చేసేందుకు ఆయన చరిత్రను భవిష్యత్ తరాలను పాఠాలుగా భోదించేందుకు ప్రజలకు తమ కష్టాలకు సంబంధించిన అనుభవాలు మాత్రమే ఉంటాయి. వాటి మూలాలను వివరించడం విద్యావంతుల పని అని చెప్పి ఆయన అందించిన కార్యాచరణను మునుముందుకు కొనసాగించడమే మన ముందున్న కర్తవ్యం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |200| తేజోమూర్తులు}}</noinclude>
icu2vbfw7d3hxb427izddenth89at9n
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/222
104
211501
553951
551528
2026-04-21T04:56:35Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553951
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''58.జొన్నవాడ రాఘవమ్మ '''</p>}}
{{right|- డా॥ భీంపల్లి శ్రీకాంత్}}
పాలమూరు జిల్లా గేయ కవయిత్రిగా, రచయిత్రిగా జొన్నవాడ రాఘవమ్మ సుప్రసిద్ధురాలు. రాధికా గీతాల సృష్టికర్తగా జొన్నవాడ రాఘవమ్మ లబ్ద ప్రతిష్టురాలు. నాలుగు దశాబ్దాలకు పైగా సాహితీ సృజన చేసిన రాఘవమ్మ గీతాలు ఆకాశవాణిలో వరుసగా ప్రసారమై ఆబాలగోపాలాన్ని అలరించాయి. అప్పట్లో రాఘవమ్మ గేయాల కోసం శ్రోతలు
అమితాసక్తిగా ఎదురుచూశారంటే ఆమె గేయమార్దవం ఎలాంటిదో చెప్పవచ్చు. ఆమె బతికున్నపుడు తన ఇంటికి
ఎవరు వచ్చినా తన గేయాలను వినిపించడమనేది ఆమెకున్న సాహిత్యాభిలాషను తెలియజేస్తుంది.
జొన్నవాడ రాఘవమ్మ పాలమూరు జిల్లా నవాబుపేట మండలం కేశవరావు పల్లెలో అక్టోబర్ 14, 1928న శ్రీ జినకుంట శ్రీనివాసాచార్యులు, శ్రీమతి రాగమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. చిన్ననాటనే తన తండ్రి, పినతండ్రి దగ్గర భాగవతం, రామాయణం, భారతం మొదలైన పురాణాలను పారాయణం చేసేవారు.
అప్పటి నుండి రాఘవమ్మకు దైవభక్తి ఎక్కువ కావడంతో భాగవత ప్రవచనాలను జీర్ణించుకొని శ్రీకృష్ణుడిపై భక్తి గేయాలకు శ్రీకారం చుట్టారు. తాను జీర్ణించుకొన్న విషయాలను భక్తి పారవశ్యంతో మధురగీతాలను రచించారు.
బహుగ్రంథ పఠనం వల్ల నిరంతరం అభ్యాసంవల్ల రాఘవమ్మ ప్రతిభ మొగ్గ తొడిగింది. ప్రతిభ పరిమళించింది. జన్మతః సిద్ధించిన జానపదాది లలిత గీతికా రచనలతో తన గేయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలా లలితగేయాలను రచించి ఆబాలగోపాలాన్ని అలరించారు. ఆధ్యాత్మిక జీవన చింతనతో భగవద్గీత మకరందాన్ని పంచారు.
జొన్నవాడ రాఘవమ్మ రచించిన గేయాలెన్నో ఆకాశవాణి శ్రోతలను రసావర్ణవంలో ఓలలాడించాయి.మృదుమధురమైన కర్ణపేయంగా రచించిన రాధికాగీతాలు మకరందం వలె ఆస్వాదింపజేశాయి. రాఘవమ్మ రాసిన గేయాల్లో దేశభక్తి, మాతృభక్తి, మాతృభాష, పండుగలు, పల్లె రైతులు, దైవభక్తి, దేవతలు మొదలైనవి ప్రసిద్ధాలు. సరళమైన భాషలో, చెవులకు ఇంపుగా అలతిఅలతి పదాలతో రాసిన గేయాలు అందరినీ అలవోకగా చదివిస్తాయి, హాయిగా పాడిస్తాయి, మనసును పులకింపజేస్తాయి.
జొన్నవాడ రాఘవమ్మ రాసిన రాధికా గీతాలు 1972లో, 2006లో ముద్రితం కాగా ఆమె రచనలన్నింటిని కలిపి 2014లో 'భావ తరంగాలు'గా వెలువరించారు. మొదటి రాధికాగీతాలులో మొత్తం 48 గేయాలుండగా, రెండవసారి ముద్రించిన రాధికాగీతాలులో 131 గేయాలున్నాయి. భావతరంగాలులో 105 గేయాలు 4 రూపకాలున్నాయి.
రాఘవమ్మ భక్తి గేయాలతోపాటు దేశభక్తి, జానపద గేయాలను, భజన కీర్తనలను, రూపకాలును గేయనాటికలను<noinclude><references/>
{{rh|తెలంగాణ |201| తేజోమూర్తులు}}</noinclude>
elbfhnw2yv94ozd1244ix7faqw8bqia
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/223
104
211502
553953
551529
2026-04-21T05:14:23Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553953
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
రచించారు. జిల్లాలో జరిగిన పలు కవి సమ్మేళనాలలో తన గేయాలను వినిపించి శభాష్ అనిపించుకున్నారు. రాఘవమ్మ రాసిన ప్రతి గేయంలో మధురమైన పదాల కూర్పుతో ఉదాత్త భావనలుంటాయి. మృదుమధురంగా శ్రోతలను ఆకట్టుకుంటాయి. భక్తి పారవశ్యంతో రాసిన గేయాలు కోమలంగా ఉండి శ్రోతల్ని అలరింపజేస్తాయి. రాఘవమ్మకు కృష్ణుడంటే అభిమానం. అందుకే కృష్ణుడిపై అనేక గీతాలను రచించారు. ఈ కృష్ణుడి గీతాలను రాఘవమ్మ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో దాదాపు పదేళ్ళపాటు పాడించి అందరి అభిమానాన్ని చూరగొన్నది. ముద్దుకృష్ణునిపై మురిపించు భక్తిగీతాలను రచించి కృష్ణుని భక్తితత్వాన్ని తన గేయంలో ప్రచారం చేసింది. జొన్నవాడ రాఘవమ్మ గురించి చెప్పాలంటే .....
<poem>
{{left margin|5em}}
ఆమె కవిత్వం కోమలం
ఆమె గాత్రం సమధురం
ఆమె జీవితం నిరాడంబరం
ఆమె పలుకు ఆబాలగోపాలం
లలితా సంగీత రచనలో మేటి
రాధికా గేయాల ఘనాపాటి
మృదుమధుర కవితాసుధలను
కురిపించే శ్రీకృష్ణపద సుధానిధి
కర్ణపేయ కవితా రచనలను
సృజించిన విశిష్ట 'విదుషీమణి’
ఆకాశవాణి శ్రోతలను అలరించిన
భక్తిగీతాల 'సుగుణామణి’
అత్యద్భుత రసావిష్కరణ చేసిన
సుమధురగీతాల చింతామణి
దేశభక్తి, దైవభక్తి మెండు
ఆమె భారతీయతకు దర్పణం
జానపదం, సాంఘికం
ఆమె కవితా ప్రతిభకు నిదర్శనం
ఆమె కవిత్వం సహజ పాండిత్యం
ఆమె గానం సుమధుర కావ్యం
ఆమె తత్వం ప్రేమమయం
ఆమె సౌజన్యం వినయశీలం
ఆమె సుగుణానికి మకరందం
ఆమె వినయానికి భూషణం
పాలమూరు పరిమళించిన
లలిత గీతాల శిరోమణి
భావతరంగాలను మీటిన
సహజ పాండితీ శిఖామణి</poem>
జొన్నవాడ రాఘవమ్మ నిరాడంబర జీవితాన్ని గడిపిన భక్త శిఖామణి.
రాఘవమ్మ ఆకాశవాణిలో రాసిన లలిత గేయాలు భక్తిరంజని, ఈ మాసపు పాట, ఈ పాటను నేర్చుకుందాం,
మహిళా కార్యక్రమంలో విరివిగా వచ్చి బహుళ ప్రజాదరణ పొందాయి.
ఈ గేయాలే కాక తుమ్మెద గోపికలు, తులసీమహాత్యం, శ్రీవనదుర్గ, గోపికల గేయాలు వంటి గేయరూపకాలు కూడా
ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఇందులో అత్యధికంగా శ్రీ నవదుర్గ గేయరూపకం ప్రసారమై ఆబాలగోపాలాన్ని
అలరించింది.
జొన్నవాడ రాఘవమ్మకు విశేష కీర్తి నార్జించిన గేయాలు రాధికా గీతాలు. ఇందులోని ప్రతి గేయాన్ని రాఘవమ్మ అనుభూతి చెందుతూ రచించారు.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇవి దాదాపు పదేళ్ళపాటు పాడించి అందరినీ ఆకట్టుకున్నారు.
<poem>
{{left margin|5em}}
'పిల్లనగోలి మెల్లన ఊది పుల్లము దోచిన దేవరో
నా పూలను దోచిన దెవరో
కనివిని ఎరుగని కమ్మని పిలుపుతో,
రమ్మని పిలిచినదెవరో
నను రమ్మని పిలిచినదెవరో,
అనురాగము చిలికిన దెవరో</poem>
అంటూ ఆ నందగోపాలుడిని, మనసుదోచిన మురళీధరుడిని ఆత్మీయంగా ఆనందానుభూతితో స్మరిస్తుంది. అంతేకాదు అలసిపోయిన శ్రీకృష్ణుడిని సేదతీరమంటూ చెబుతూ...
<poem>
{{left margin|5em}}
నాలోన నిమిషము నిదురించర స్వామి
ఆలమందల తొలి అలసి పోయితివేమో
చిగురుటాకుల బోలు చిన్ని నీ పాదాలు
కరుకు నేలను తగిలి కందితే కనలేను.</poem><noinclude><references/>
{{rh|తెలంగాణ |202| తేజోమూర్తులు}}</noinclude>
1nccpggv63pxapy6dbr2ooavyknolfg
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/224
104
211503
553954
551530
2026-04-21T05:27:58Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553954
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అంటుంది. కృష్ణుడంటే రాఘవమ్మకు అమితమైన ప్రేమ, శ్రీకృష్ణుడి బాల్యలీలను కళ్ళకు కట్టినట్లుగా రాసిన అనేక గేయాలు ప్రతి హృదయాలను ఆనందపరవశుల్ని చేస్తుందనడంలో అతిశయము లేదు. కనిపించకుండా పోయిన శ్రీకృష్ణుడి కోసం నిరీక్షిస్తూ రాసిన గేయం ప్రేమ విరహాన్ని తెలియజేస్తుంది.
<poem>
{{left margin|5em}}
తలుపులు తెరచితీరాస్వామి నీకై
నా వలపుల తలుపులు తెరచితీరా స్వామి
రమ్మని పిలిచి యమునా తటికి
కెమ్మని సుధలిమ్మని పలికి
పొన్నల మాటన దాగెద వేల
వేగరాగ గోపాల బాల</poem>
అంటూ శ్రీకృష్ణుడిని రమ్మని పిలుస్తోంది. వేగంగా రమ్మని తలుస్తోంది. మరో గేయంలో కూడా రాఘవమ్మ శ్రీకృష్ణుడి రాకకై ఎదురుచూస్తూ......
<<poem>
{{left margin|5em}}
కనుపించెనా మురళి వినిపించెనా
కమనీయమైన ఓ మల్లె మాలికలారా
కంజాతములబోలు కనదోయి కలవాడు
మంజుమంజులమైన మందహాసమువాడు.
సంజ వెలుగుల ఛాయ మందహాసమువాడు</poem>
అంటుంది. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో వర్ణిస్తూ చెలికత్తెలకు చెబుతుంది. ఆ రూపు కలవాడిని పిలుచుకు రండ్రని పురమాయిస్తోంది. శ్రీకృష్ణుడంటే అంత అభిమానం గల రాఘవమ్మ తనే ఒక ప్రియురాలై ప్రియుడికోసం వేచి
చూస్తున్నట్లు రాసిన గేయాలు అమలిన శృంగారానికి పరాకాష్టగా ఉన్నాయనడంలో అత్యుక్తి కాదు. శ్రీకృష్ణుడిపై రాసిన ప్రతి గేయం వేటికవే భిన్నంగా ఉండి చదివించేలా చేయడము రాఘవమ్మ రచనా కౌశలానికి నిదర్శనం.
రాఘవమ్మ శ్రీకృష్ణుడిపై రాసిన గేయాలే గాక వివిధ అంశాలపై రాసిన గేయాలు కూడా ప్రాచుర్యం పొందాయి. శ్రీరాముడు, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీహరి, పాండురంగడు, ఈశ్వరుడు, పార్వతీదేవి, వరలక్ష్మీదేవి, అలవేలుమంగ వంటి దేవతామూర్తులపైన భక్తి గేయాలను రచించి శ్రోతలు ఆకట్టుకుంది. శ్రీరాముని గురించి వర్ణిస్తూ ...
<poem>
</left margin|5em}}
'రామనామ మధురరసం రమ్యమైన తారకం
వేగవాని చరణసేవ పదవి దొరికె పావనం
దధి నవనీతములకన్న మధురమైన నామం.
ధరణి నేలు రమనామ పదవి దొరికె పావనం
కదళీ ద్రాక్ష మధువు కన్న మధురమైన నామం
కొదవ లేదు క్షీరపురీ దాస హృది నివాసం'</poem>
అని చెప్పిన గేయం తారకరాముని నామనామాన్ని వేనోళ్ళ కీర్తిస్తుంది.
తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ చెప్పిన గేయం అందరినీ ఆలోచింపజేస్తుంది.
<poem>
{{left margin|5em}}
'పదుగురు నను పొగడాలని
పాటలెపుడు పాడలేను
విధి కెదురుగ నడవాలని
హృదయమెపుడు కోరలేదు</poem>
అంటూ పదిమంది కోసం గేయాలను రాయలేదనీ, తనలోని జిజ్ఞానను బయట పెట్టుకోవడానికి రాసావనీ వినమ్రంగా చెబుతుంది రాఘవమ్మ.
రాఘవమ్మ రచించిన మూడవ గేయాల సంపుటి 'భావ తరంగాలు'. ఇందులో 115 గేయాలు, 4 గేయరూపకాలు
ప్రజాదరణ పొందినవే. ఈ భావతరంగాలు లోని గేయాలు కూడా ఆకాశవాణిలో ప్రసారమై బహుళ ఆదరణ పొందాయి.
ఇందులో భక్తి పారవశ్య గీతాలే కాదు సామాజిక స్పృహ కలిగిన గేయాలను రాఘవమ్మ అద్భుతంగా రచించి అన్నీ
రాయగలనన్న రచయిత్రి ననిపించుకున్నది. వైవిధ్య భరితమైన అంశాలను తీసుకొని రాసిన గేయాలు రాఘవమ్మ ప్రతిభకు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఎంతోమంది స్వరకర్తలు రాఘవమ్మ గేయాలకు కూర్చిన బాణీలు పేరొందిన గాయని గాయకుల గళాలలో గుభాళించాయి.
రాఘవమ్మ రాసిన దేశభక్తి గేయాలు భారతీయ సంస్కృతిని చాటి చెబుతాయి. కార్మిక, కర్షక గేయాలు, పండుగల గేయాలు, సామాజిక గేయాలు, కుటుంబ గేయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. దేశ సౌభాగ్యం, తెలుగు తల్లి,
తెలుగు కీర్తి నడవరా ఓ భారతీయుడా, నవభారతవీరుడా వంటి దేశభక్తి గేయాలు, రైతన్నలు, కర్షకుడు, కార్మికులు
వంటి కార్మిక గేయాలు, సంక్రాంతి శ్రీలక్ష్మీ, ఉగాది,<noinclude><references/>
{{rh|తెలంగాణ |203| తేజోమూర్తులు}}</noinclude>
jzw51ctkx525fqnpm9lwugppnho2dfy
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/225
104
211504
553955
551531
2026-04-21T05:41:44Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553955
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
జన్మాష్టమి వంటి పండుగ గేయాలు, చాచానెహ్రూ, బాపూజీ, బుద్ధుడు వంటి మహాత్ముల గేయాలు, మూఢాచారం,
బీదపూజ, ఓటుహక్కు, ఇద్దరు వంటి సామాజిక గేయాలు రాయడం రాఘవమ్మ బహుముఖ ప్రజ్ఞాశీలతకు నిదర్శనం.
పండుగలోని ఆంతర్యాలను, భారతీయ సంస్కృతి మూలాలను, జాతిని మేల్కొలుపుతూ రాసిన గేయాలు ఆమెకు
దేశం పట్ల ఉన్న భక్తి తత్పరతను తెలియ జేస్తున్నాయి.
విశ్వశ్రేయస్సుకై అవతరించిన భగవద్గీతను చిన్నగేయంలో ఇమిడ్చి గీతాసారాన్ని సరళ పదాలతో రాసిన గేయం రాఘవమ్మ ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది.
రాఘవమ్మ ప్రకృతి గేయాలు కూడా చాలా రాసింది. ఉదాహరణకు ...
<poem>
{{left margin|5em}}
ఎవరు పెంచిన కల్పతరులివి.
ఎవరు తీర్చిన సోయగములివి
ఎచట చూచిన ఊహకందని
అందమే కనువిందు చేసెను</poem>
అంటూ ప్రకృతి సౌందర్యాన్ని ఎంతో వైవిధ్య భరితంగా రసాప్లవితం చేసింది. ప్రకృతిని బహుసుందరంగా వర్ణించింది. ఈ గేయం 'లలిత సంగీతం డిప్లొమోకొర్సు 'పాఠ్యప్రణాళికలో 'ప్రకృతి గీతాలు శీర్షికలో చేర్చబడటం
దీనికున్న వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ఇంకా 'పండుగల పాటలు' శీర్షికలో సంక్రాంతి శ్రీలక్ష్మీ వచ్చిందోయ్ సస్యముల సంపదలు తెచ్చిందోయ్ అనే గేయం కూడా చేర్చబడింది. రాఘవమ్మ రాసిన 'ఆడపడుచు' గేయం నిజంగా అందరిని ఆలోచింపచేసే గేయం.
<poem>
{{left margin|5em}}
"నిప్పు వంటి సీతమ్మకు నిందయున్నవాళ్లు యుగం
నిండుసభలో ఒక్కసతిని - పరాభవించె ద్వాపరం
వరకట్నపు దురాచార దురంతాలు చెలరేగెను కలియుగం
ఆనాటికి ఈనాటికి మారలేదు స్వార్థం
ఆడవారి గుండెలలో రగిలే ఈ అవమానం
ఈనాటిది కాదమ్మ ఆడబ్రతుకు జీవితం
యుగయుగాల శాపమిది ఆరని అవమానం'</poem>
అంటూ సమాజంలోని వరకట్న దురాచారమనే రుగ్మత ఎలా బలంతా ప్రబలిపోయిందో కళ్ళకు కట్టినట్లు రాఘవమ్మ
రచించడం సాంఘిక దురాచారాన్ని తేటతెల్లం చేసింది.
రాఘవమ్మ తాను సామాన్యురాలిగా భావించుకుంటూ రాసిన గేయం 'నిరాడంబరం'. ప్రశంసలకు, పొగడ్తలకు,
సన్మానాలకు దూరంగా ఉండే రాఘవమ్మ రాసిన గేయమిది..
<poem>
{{left margin|5em}}
కవిగాను సాహిత్య గనిగాను నేను
కారుచీకటిలోన దారిగానగలేక
అలమటించే ఒక్క బాటసారిని నేను
నా కవితకే భాష నియమాలు లేవు.
నా లోన చెలరేగే ఆవేదనే తప్ప</poem>
అంటూ కవిని గాను అంటూనే తనలోని ఆవేదనలకు అక్షర రూపం ఇస్తూ రాసిన గేయం రాఘవమ్మ పాండిత్యానికి,
సౌశీల్యానికి, ఆమె జీవితానికి దర్శణమని చెప్పవచ్చు. కవిత గురించి చెబుతూ ...
:'కదలి వలె పొంగింది జలజలా పారింది.
:వెలలేని నా కవిత నాలోన వొదిగింది'
అంటూ కవితా స్వరూపాన్ని గేయాత్మకంగా రచించింది. రాఘవమ్మ రాసిన ప్రతి గేయాన్ని స్పర్శించడ మంటే
చంద్రున్ని అద్దంలో చూపడమే అవుతుంది. రాఘవమ్మ కలానికి ఉన్న గొప్ప శక్తి గేయాలను సరళమైన పదాలలో
రాయడం.
శ్రీకృష్ణుడికి తన జీవితాన్ని అంకితమిచ్చి, ఆయననే తన సర్వస్వంగా భావించి తనను రాధగా చేసుకొని తన
జీవితాన్ని సార్ధకం చేసుకున్న భక్తశిఖామణి జొన్నవాడ రాఘవమ్మ. భగవంతునిపై ఉన్న అచంచలమైన భక్తితో తన
అంతరాత్మలోని అక్షరాలను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా అభిషేకించిన తీరు రాఘవమ్మ భక్తి ప్రపత్తులకు నిదర్శనం.
రాఘవమ్మ కేవలం భక్తురాలే కాదు, నాయకత్వ శిరోమణి కూడా. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రముఖ మహిళా నాయకురాళ్ళతో 15 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు.
జొన్నవాడ రాఘవమ్మ సాహితీ సృజనకు హైద్రాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు శ్రీకృష్ణ పదసుధానిధి అనే బిరుదుతో సన్మానించడం విశేషం. ఇంకా అనేక సంస్థలు సన్మానించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2014లో పాలమూరు<noinclude><references/>
{{rh|తెలంగాణ |204| తేజోమూర్తులు}}</noinclude>
i5sbw7nzw4dccc66u7toyppe9oso6wy
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/226
104
211505
553956
551532
2026-04-21T05:44:51Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553956
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
జిల్లా స్థాయి సాహిత్య పురస్కారాన్ని అందుకున్నది. ఇంకా పాలమూరు సాహితి ఉగాది పురస్కారం, విశాలాంధ్ర
స్వర్ణోత్సవ పురస్కారం, తదితర పురస్కారాలను అందుకున్నది.
అంతేకాదు రాఘవమ్మ గేయ కవితా వైశిష్ట్యాన్ని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం వారు ఎం. ఎ. సంగీతంలో
పలు లలిత గీతాలను చేర్చడం రాఘవమ్మ పాండితీ వైభవాన్ని చాటి చెబుతున్నది.
జొన్నవాడ రాఘవమ్మ యావత్ తెలుగు ప్రజల మన్నన పొందిన విదూషిమణి. బోయి భీమన్న, సి. నారాయణరెడ్డి,
పాలగుమ్మ విశ్వనాథం, చౌడూరి గోపాలరావు, ముకురాల రామారెడ్డి, వెంకటగోపాలం, శశాంక, యం. చిత్తరంజన్
వంటి ప్రముఖులు మెచ్చుకున్న సౌజన్యమూర్తి. లలిత గీతాలు మనకు అనగా ఆకాశవాణి గుర్తుకొస్తుంది. జొన్నవాడ
రాఘవమ్మ అనగానే లలిత గీతాలు గుర్తుకొస్తాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |205| తేజోమూర్తులు}}</noinclude>
kw3ocz43izd4aheiehamomy9y35axqd
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/227
104
211506
553957
551533
2026-04-21T05:55:02Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553957
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''59. జుల్ఫీకరుద్దీన్ '''</P>}}
{{right|- పి.వి. రామమోహన్ నాయుడు}}
పంతొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల్లో బ్రిటిష్ సైనికుల ద్వార హైదరాబాద్ లొకి ఫుట్ బాల్ ప్రవేశించింది. 1930 ప్రాంతంలో తార్బండ్ నవాబ్ ప్రోత్సాహంతో నగరంలో ఫుట్బాల్ క్రీడ వేళ్ళూనుకోవడం ఆరంభమయ్యింది. నవాబుకు తోడుగా కాకినాడ, రాజమండ్రి మహారాజులు కూడా ముందుకు వచ్చి పోషకులుగా నిలవడంతో ఫుట్బాల్ క్రీడ హైదరాబాద్లో పటిష్టపడటం ప్రారంభమయ్యింది.
18 మంది ఒలింపిక్ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారులను అందించిన అప్పటి కోచ్ ఎస్.ఏ. రహీం హైదరాబాద్ జట్టు
ప్రాభవానికి కర్త, కర్మ, క్రియ.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన రహీం, ఏ మూల మంచి ఆటగాడు ఉన్నాడని తెలిసినా వెదుక్కొంటూ వెళ్లి తెచ్చి
ప్రోత్సహించిన క్రీడా స్పూర్తే ఆయన.
1951 భారత్లో జరిగిన ఆసియా క్రీడల్లో 1962లో జకార్తా ఆసియా క్రీడల్లో బంగారు పథకాలు సాధించే జట్టుగా
భారత్ ను రహీం సాబ్ రూపొందించారు. రహీంసాబ్ హయాంలో హైదరాబాద్ యువకులు ఫుట్బాల్ అంటే
విపరీతమైన అభిమానం చూపేవారు.
ఆ రోజుల్లో విక్టరీ మైదానమే హైదరాబాద్ ఫుట్బాల్కు ముఖ్య కార్యస్థానం. 1950 నుంచి 1965 వరకు హైదరాబాద్లో ఫుట్బాల్ క్రీడకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు.
1952 హెల్సింకీ ఒలింపిక్స్లో సయ్యద్ ఖ్వాజ, అజీజుద్దీన్. నూర్ మహమ్మద్, ఎస్.కె. మొయినుద్దీన్ పాల్గొన్నారు. 1956లో మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్ లో ఏకంగా 8 మంది హైదరాబాదీ ఆటగాళ్ళు పాల్గొనగా, 1960లో ఇటలి రాజధాని రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో ఆరుగురు మన రాష్ట్ర ఆటగాళ్ళు పాల్గొన్నారు.
"ఫుట్ బాల్ ఒలింపిక్స్లో మూడు వరుస గోల్స్తో హ్యాట్రిక్ సాధించిన భారత క్రీడాకారుని పేరేమిటి" ఆ మధ్య
కౌన్ బనేగా కరోర్ పతి అనే టి.వి కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ గంభీర స్వరం విసిరిన ప్రశ్న. హైదరాబాద్లోని
మధ్య తరగతి నివసించే కాలనీలో ఆ కార్యక్రమం చూస్తున్న యువకులు తమతో ఫుట్ బాల్ కబుర్లు చెప్పే వృద్ధుడి కేసి జవాబు కోసం చూశారు. ఆయన తడుముకోకుండా సమాధానం చెప్పాడు. అది సరైన సమాధానం. ఆ పెద్దాయన
జ్ఞాపకశక్తికి యువకులు అచ్చెరువు పొందారు.
అయితే హాట్రిక్ కోసం వ్యూహ రచన చేసిందీ, మూడుసార్లు బంతిని గోల్లోకి తన్నిన నోయెల్క బంతిని పాస్ గా ఇచ్చింది ఇప్పుడు తమకు సమాధానం చెప్పిన జుల్ఫీకరుద్దీన్ అనే కొస మెరుపు ఆ యువకుల తోపాటు
చాలమందికి తెలియదు.
ఒకనాటి హైదరాబాద్, భారత దేశ ఫుట్ బాల్ ఘన చరిత్రకు మనిస్తంభం వంటి ఉద్దండుడు జుల్ఫీకరుద్దీన్. నగర<noinclude><references/>
{{rh|తెలంగాణ |206| తేజోమూర్తులు}}</noinclude>
sz5pgzsyinfah8srh6oroo1n0xppd6i
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/228
104
211507
553958
551534
2026-04-21T06:05:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553958
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
గల్లీల నుంచి ఒలింపిక్ మైదానం వరకు మన క్రీడా పతాకం పట్టుకొని పరుగులు తీసిన అజేయుడు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ జట్టుకు మన రాష్ట్ర జట్టుకు పదేళ్ళపాటు విజయవంతంగా నాయకత్వం వహించిన దిగ్గజం జుల్ఫీకర్.
హైదరాబాద్, మెహదీపట్నం సమీపంలోని మరద్ నగర్ 1936, ఫిబ్రవరి 7వ తేదీన జుల్ఫీకర్ జన్మించారు. తండ్రి ఇమాముద్దీన్ రెవెన్యు శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసేవారు. ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళతో
వారిది పెద్ద కుటుంబం. క్రికెట్, సినిమా వ్యామోహాలు ఇంకా నగరానికి ప్రబలని ఆ రోజుల్లో ఫుట్బాల్ క్రీడంటే
హైదరాబాద్ యువకులకు వల్లమానిన ప్రేమ, అభిమానం. చిన్నా పెద్ద మైదానాలన్ని ఫుట్బాల్ మ్యాచ్లతో, ప్రాక్టీసులతో కళకళ లాడుతుండేవి. చుట్టూ వున్న వాతావరణంవల్ల జుల్ఫీకర్ కూడా అప్రయత్నంగానే ఆ క్రీడపట్ల
ఆకర్షితులయ్యారు.
ఇంటి చుట్టూ పక్కల స్నేహితులతో కలసి దొరికిన టెన్నిస్ బంతినొ, రబ్బర్ బాల్నో తన్నుతూ పరవశించి పోయేవాడు. దినా రాత్రులు ఫుట్బాల్ అభ్యసించే వాడు. అసలు ఫుట్బాలు కొనడానికి మిత్రులెవ్వరి వద్ద డబ్బులు ఉండేవి కావు. అందుకని పాత గుడ్డ పీలికల మధ్య బరువైన వస్తువులు పెట్టి గుండ్రంగా బంతిలా నాయనమ్మ
చేత కుట్టించుకొని పట్టుకెళ్ళి వీధుల్లో తమ పిక్కబలం చూపేవారు.
ఫుట్బాల్ ఆడటం తండ్రికి ఇష్టం ఉండేది కాదు. అందుకే మొదట బంతిని గోడ అవతలకి తరలించి, ఆనక
ఏదో పనిపైన వెళ్తున్నట్లు జుల్ఫీకర్ జారుకునేవాడు. అలా తండ్రి కళ్ళు కప్పి ఫుట్బాల్ తో ప్రేమాయాణం సాగించాడు. కఠోరమైన సాధనతో అలవడ్డ అచంచలమైన ఆత్మవిశ్వాసం ఆయనను చక్కని ఆటగాడిగా తీర్చిదిద్దింది. క్లబ్ మ్యాచ్లలో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ రోజు రోజుకు అగ్రశ్రేణి ఆటగాడిగా జుల్ఫీకర్ ఎదిగిపోయాడు. క్రీడాభిమానుల్లో జుల్ఫీకరుద్దీన్ పెద్ద పేరయ్యింది.
1954లో హైదరాబాద్ స్పోర్టింగ్ క్లబ్ తరపున అంబర్ పేట్ సిటీ పోలీసు జట్టుతో ఆడిన మ్యాచ్ జుల్ఫీకరుద్దీన్ క్రీడా జీవితాన్ని మలుపు తిప్పింది.
ఆ మ్యాచ్లో ఆయన కనబరచిన అద్భుతమైన ఆటతీరుకు ముగ్ధుడైన సి.పి.ఎల్ కమాండెంట్ జుల్ఫీకర్ను పోలీసు ఉద్యోగంలో చేరి తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించమని కోరారు. ఎంప్లాయ్మెంట్ కార్డ్ కూడా లేని జుల్ఫీకర్కు అన్నీ సమకూర్చి పోలీసు కానిస్టేబుల్గా నియమించారు. అప్పటి నుంచి సి.పి.ఎల్ జట్టుకు, ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం మొదలు పెట్టారు. 1956లో జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ “సంతోష్ ట్రోఫి” ఫైనల్స్లో రెండు అద్భుతమైన గోల్స్ సాధించి హీరోగా వార్తల్లోకి ఎక్కారు. అదే ఏడాది మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ఒలింపిక్స్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించారు.
విదేశీ మైదానంలో విభిన్నమైన వాతావరణంలో ఆడి రాణించడం సామాన్యమైన విషయంకాదు. సెమి ఫైనల్స్లో
యుగోస్లేవియా చేతిలో పరాజయంపాలై నాలుగో స్థానంలో నిలబడ్డారు. తొలుత ఒక్క గోల్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ
చివరికి వచ్చేసరికి మనజట్టు పట్టు సడలించేసింది. 1958లో టోక్యో ఆసియా క్రీడల్లోనూ, 1959లో కౌలాలంపూర్లో
జరిగిన మెర్ధిక టోర్నమెంట్లోను భారత కీర్తి ప్రతిష్టల కోసం జుల్ఫీకరుద్దీన్ శ్రమించారు. 1956 మెల్బోర్న్లో జరిగిన
ఒలింపిక్స్లో జుల్ఫీకరుద్దీన్ తన ప్రతిభ చాటారు.
మన దేశంలో జరిగే పెంటాగ్యులర్ ట్రోఫీ, సంతోష్ ట్రోఫీ, రోవర్స్, ఐ.ఎఫ్.ఎ.డి.సి.ఎం వంటి అన్ని టోర్నమెంటు
ల్లోనూ జుల్ఫీకర్ తన గోల్స్ తో, తానందించిన అద్భుతమైన సమయోచిత పాస్లతో రాష్ట్ర జట్టును గెలిపించారు.
జుల్ఫీకరుద్దీన్ క్రీడా జీవితంలో అద్భుతమైన ఎన్నో సంఘటనలు తళుక్కుమంటాయి. 1956లో బొంబాయి రోవర్స్ ట్రోఫీ ఫైనల్స్లో అతి శక్తివంతమైన మహమ్మడన్ క్లబ్ తో మన జట్టు తలపడింది. ఆంధ్రప్రదేశ్కు ఓటమి ఖాయమని అంతా అంచనాలు కట్టారు. రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో బొంబాయిలోని గ్రౌండ్ జనంతో
కిటకిటలాడింది.
ఆట మొదలైన రెండో నిముషంలో దాదాపు మధ్య కోర్ట్ నుంచి బంతిని లాఘవంగా తన్ని అద్భుతమైన గోల్ చేశారు.
కనీ వినీ ఎరుగని పరిణామానికి ప్రేక్షకులంతా<noinclude><references/></noinclude>
a92e733c6twn68hsk9fcwm8zgjrofve
553959
553958
2026-04-21T06:06:57Z
A.Murali
3019
553959
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
గల్లీల నుంచి ఒలింపిక్ మైదానం వరకు మన క్రీడా పతాకం పట్టుకొని పరుగులు తీసిన అజేయుడు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ జట్టుకు మన రాష్ట్ర జట్టుకు పదేళ్ళపాటు విజయవంతంగా నాయకత్వం వహించిన దిగ్గజం జుల్ఫీకర్.
హైదరాబాద్, మెహదీపట్నం సమీపంలోని మరద్ నగర్ 1936, ఫిబ్రవరి 7వ తేదీన జుల్ఫీకర్ జన్మించారు. తండ్రి ఇమాముద్దీన్ రెవెన్యు శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసేవారు. ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళతో
వారిది పెద్ద కుటుంబం. క్రికెట్, సినిమా వ్యామోహాలు ఇంకా నగరానికి ప్రబలని ఆ రోజుల్లో ఫుట్బాల్ క్రీడంటే
హైదరాబాద్ యువకులకు వల్లమానిన ప్రేమ, అభిమానం. చిన్నా పెద్ద మైదానాలన్ని ఫుట్బాల్ మ్యాచ్లతో, ప్రాక్టీసులతో కళకళ లాడుతుండేవి. చుట్టూ వున్న వాతావరణంవల్ల జుల్ఫీకర్ కూడా అప్రయత్నంగానే ఆ క్రీడపట్ల
ఆకర్షితులయ్యారు.
ఇంటి చుట్టూ పక్కల స్నేహితులతో కలసి దొరికిన టెన్నిస్ బంతినొ, రబ్బర్ బాల్నో తన్నుతూ పరవశించి పోయేవాడు. దినా రాత్రులు ఫుట్బాల్ అభ్యసించే వాడు. అసలు ఫుట్బాలు కొనడానికి మిత్రులెవ్వరి వద్ద డబ్బులు ఉండేవి కావు. అందుకని పాత గుడ్డ పీలికల మధ్య బరువైన వస్తువులు పెట్టి గుండ్రంగా బంతిలా నాయనమ్మ
చేత కుట్టించుకొని పట్టుకెళ్ళి వీధుల్లో తమ పిక్కబలం చూపేవారు.
ఫుట్బాల్ ఆడటం తండ్రికి ఇష్టం ఉండేది కాదు. అందుకే మొదట బంతిని గోడ అవతలకి తరలించి, ఆనక
ఏదో పనిపైన వెళ్తున్నట్లు జుల్ఫీకర్ జారుకునేవాడు. అలా తండ్రి కళ్ళు కప్పి ఫుట్బాల్ తో ప్రేమాయాణం సాగించాడు. కఠోరమైన సాధనతో అలవడ్డ అచంచలమైన ఆత్మవిశ్వాసం ఆయనను చక్కని ఆటగాడిగా తీర్చిదిద్దింది. క్లబ్ మ్యాచ్లలో అత్యుత్తమ ప్రతిభ చూపుతూ రోజు రోజుకు అగ్రశ్రేణి ఆటగాడిగా జుల్ఫీకర్ ఎదిగిపోయాడు. క్రీడాభిమానుల్లో జుల్ఫీకరుద్దీన్ పెద్ద పేరయ్యింది.
1954లో హైదరాబాద్ స్పోర్టింగ్ క్లబ్ తరపున అంబర్ పేట్ సిటీ పోలీసు జట్టుతో ఆడిన మ్యాచ్ జుల్ఫీకరుద్దీన్ క్రీడా జీవితాన్ని మలుపు తిప్పింది.
ఆ మ్యాచ్లో ఆయన కనబరచిన అద్భుతమైన ఆటతీరుకు ముగ్ధుడైన సి.పి.ఎల్ కమాండెంట్ జుల్ఫీకర్ను పోలీసు ఉద్యోగంలో చేరి తమ జట్టుకు ప్రాతినిధ్యం వహించమని కోరారు. ఎంప్లాయ్మెంట్ కార్డ్ కూడా లేని జుల్ఫీకర్కు అన్నీ సమకూర్చి పోలీసు కానిస్టేబుల్గా నియమించారు. అప్పటి నుంచి సి.పి.ఎల్ జట్టుకు, ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం మొదలు పెట్టారు. 1956లో జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ “సంతోష్ ట్రోఫి” ఫైనల్స్లో రెండు అద్భుతమైన గోల్స్ సాధించి హీరోగా వార్తల్లోకి ఎక్కారు. అదే ఏడాది మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ఒలింపిక్స్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించారు.
విదేశీ మైదానంలో విభిన్నమైన వాతావరణంలో ఆడి రాణించడం సామాన్యమైన విషయంకాదు. సెమి ఫైనల్స్లో
యుగోస్లేవియా చేతిలో పరాజయంపాలై నాలుగో స్థానంలో నిలబడ్డారు. తొలుత ఒక్క గోల్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ
చివరికి వచ్చేసరికి మనజట్టు పట్టు సడలించేసింది. 1958లో టోక్యో ఆసియా క్రీడల్లోనూ, 1959లో కౌలాలంపూర్లో
జరిగిన మెర్ధిక టోర్నమెంట్లోను భారత కీర్తి ప్రతిష్టల కోసం జుల్ఫీకరుద్దీన్ శ్రమించారు. 1956 మెల్బోర్న్లో జరిగిన
ఒలింపిక్స్లో జుల్ఫీకరుద్దీన్ తన ప్రతిభ చాటారు.
మన దేశంలో జరిగే పెంటాగ్యులర్ ట్రోఫీ, సంతోష్ ట్రోఫీ, రోవర్స్, ఐ.ఎఫ్.ఎ.డి.సి.ఎం వంటి అన్ని టోర్నమెంటు
ల్లోనూ జుల్ఫీకర్ తన గోల్స్ తో, తానందించిన అద్భుతమైన సమయోచిత పాస్లతో రాష్ట్ర జట్టును గెలిపించారు.
జుల్ఫీకరుద్దీన్ క్రీడా జీవితంలో అద్భుతమైన ఎన్నో సంఘటనలు తళుక్కుమంటాయి. 1956లో బొంబాయి రోవర్స్ ట్రోఫీ ఫైనల్స్లో అతి శక్తివంతమైన మహమ్మడన్ క్లబ్ తో మన జట్టు తలపడింది. ఆంధ్రప్రదేశ్కు ఓటమి ఖాయమని అంతా అంచనాలు కట్టారు. రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో బొంబాయిలోని గ్రౌండ్ జనంతో
కిటకిటలాడింది.
ఆట మొదలైన రెండో నిముషంలో దాదాపు మధ్య కోర్ట్ నుంచి బంతిని లాఘవంగా తన్ని అద్భుతమైన గోల్ చేశారు.
కనీ వినీ ఎరుగని పరిణామానికి ప్రేక్షకులంతా<noinclude><references/>
{{rh|తెలంగాణ |207| తేజోమూర్తులు}}</noinclude>
p7kalpirjnxh9i4wt5b7d468se5k0yq
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/229
104
211508
553960
551535
2026-04-21T06:14:17Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553960
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
నిశ్చేష్టులయ్యారు. మైదానం మౌన ముద్ర దాల్చింది. బంతి ఎక్కడో దూరాన ఉంది లెమ్మని గోల్ కీపర్ గోల్ పోస్ట్ నుంచి బాగా ఇవతలికి వచ్చి నిర్లక్ష్యంగా నిలుచున్న వైనాన్ని పసిగట్టిన జుల్ఫీకర్ కేవలం సెకన్లలో నిర్ణయం తీసుకొని నేరుగా గోల్లోకి బంతిని తన్నారు. దీంతో గుండె బలం చెదరిన ప్రత్యర్థి జట్టు మహమ్మడన్ క్లబ్ 3-0 తేడాతో ఓడిపోయింది.
కెప్టెన్గా జుల్ఫీకర్ అసాధ్యుడు. వ్యూహ రచనలోను, జట్టును సమిష్టిగా నడపడంలో ఆయన పెట్టింది పేరు. క్రమ శిక్షణకు ఆయన మారుపేరు. మొయిన్, యూసుఫ్, నూర్, అజీజ్ వంటి మేటి క్రీడాకారులున్న జట్టుకు ఆయన
కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించి ఎన్నో విజయాలు సునాయాసంగా దక్కించుకున్నారు. జట్టు సభ్యులను పేకాట,
మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంచేవారు.
విదేశీ పర్యటనల్లో, అధికార విందుల్లోసైతం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చేవారు కాదు. జుల్ఫీకర్ ఇస్లాం సంప్రదాయాలను ఆచరిస్తారు. కాలికట్లో టోర్నమెంట్ ఆడుతుండగా రంజాన్ మాసం వచ్చింది. జుల్ఫీకర్తోపాటు యూసుఫ్, ఖలీం కూడా ఉపవాస దీక్ష పాటిస్తూనే మ్యాచ్ ఆడారు.
ఆ ఉదయాన వ్యాయామం చేయడం వెంటనే మ్యాచ్ ఆడటంవల్ల తీవ్ర అలసటకు గురయ్యారు. ఇది గమనించిన
కోచ్ పెంటయ్య దీక్ష రోజుల్లో ముస్లిం క్రీడాకారులకు వ్యాయామం నుంచి మినహాయింపు ఇవ్వబోయాడు అయితే
జుల్ఫీకర్ అందుకు అంగీకరించలేదు. ఈ చర్యవల్ల జట్టులో ఏకత్వానికి విఘాతం కలుగుతుంది కాబట్టి అందరు ఒకే
పద్ధతులు పాటించాలని అభిప్రాయపడ్డారు. ఉపవాస దీక్ష పాటిస్తూనే, వ్యాయామంకు హాజరయ్యేవారు. అలాగే
మ్యాచ్ లు ఆడేవారు.
దక్షిణ భారత ఫుట్ బాల్ జట్టుకు నాయకత్వం వహిస్తూ రష్యా, హంగేరి, డెన్మార్క్, జర్మనీ, ఇతర యురేపియన్ జట్లతో తలపడ్డారు. పెంటాగ్యులర్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో కెప్టెన్, కోచ్గా మద్రాస్, హైదరాబాద్, కేరళ, బెంగళూరు,
శ్రీలంకలలో జరిగిన అన్ని ఫైనల్స్లో గెలుపొంది 1963లో ఎఫ్.ఐ.ఎఫ్.ఏ. అధ్యక్షుడు సర్ స్టాన్సీ రోజ్ చేతులపై ట్రోఫీ అందుకున్నారు. అవకాశాలు వెతుక్కుంటూ జుల్ఫీకర్ స్నేహితులు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. కొందరు పాకిస్తాన్
కూడా వెళ్ళారు. కానీ ఆడే రోజుల్లో దేశంలోని అన్ని ప్రధాన జట్ల నుంచి ఆయనకు ఆహ్వానం ఉన్నప్పటికీ తన పంచ
ప్రాణాలైన హైదరాబాదన్ను వదిలి వెళ్ళేది లేదనే వాడు. గెలిచినా ఓడినా ఈ గడ్డ పైనే అనేవారు. అదే మాటపై
జుల్ఫీకర్ జీవితాంతం హైదరాబాద్ కోసమే నిలబడ్డారు. ఆ రోజుల్లో మ్యాచ్కి 50 రూపాయలు మాత్రమే తమకు
ఇచ్చేవారని, అయితే తాము డబ్బు కోసం కాకుండా ఆట మీద మక్కువ, దేశం, రాష్ట్రంపట్ల భక్తితో మాత్రమే ఫుట్
బాల్ ఆడేవారమని జుల్ఫీకర్ చెబుతుండేవారు.
పోలీసు శాఖలో అంచలంచలుగా ఎదిగి 1963లో నల్లగొండలో రిటైర్ అయ్యారు. ఉద్యోగరీత్యా ఎక్కడ పని చేసినా ఆ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి ఇతోదికంగా పాటుపడ్డారు. కరీంనగర్లో పని చేస్తున్నప్పుడు పోలీసు క్రీడలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న ఫోర్ట్ వాల్ ఆయన హయాంలో నిర్మించిందే.
పోలీసు శాఖలో ఆయన చూపిన కర్తవ్య దీక్షను గుర్తిస్తూ ప్రభుత్వం సేవాపతకంతో గౌరవించింది.
హైదరాబాద్ క్రీడా ప్రాభవానికి వెలుగు రవ్వల సంతకంలా నిలబడ్డ జుల్ఫీకరుద్దీన్ కు జేజేలు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |208| తేజోమూర్తులు}}</noinclude>
047j1hwus43ivmtasezldh66hvmqext
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/230
104
211509
553961
551536
2026-04-21T06:18:56Z
A.Murali
3019
553961
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''60. జువ్వాడి గౌతమరావు '''</p>}}
{{right|- డా॥ గండ్ర లక్ష్మణరావు}}
కరీంనగర్ సమీపాన గల ఇరుకుల్ల గ్రామంలో ఇద్దరు మహానుభావులు జన్మించారు. ఒకరు మచ్చలేని రాజకీయ నాయకుడు. మరొకరు మధుర హృదయులు సాహితీ మూర్తి. ఎన్ని రాజకీయ పదవులు నిర్వహించినా తన బ్రతుకుదెరువు తనకే కష్టంగా కరీంనగర్లో కనీసం ఒక చిన్న ఇల్లు కూడా లేని నిరాడంబరత, నీతి నిజాయితీలకు మారుపేరుగా బ్రతికిన రాజర్షి సజువ్వాడి చొక్కారావు. మరొకరు సాహితీవేత్తగా, సోషలిస్టు నాయకుడుగా యావదాంధ్ర దేశం ఆత్మీయ మిత్రునిగా మహోన్నత వ్యక్తిగా బ్రతికిన బ్రహ్మర్షి జువ్వాడి గౌతమరావు.
జువ్వాడి వంశంలో చొక్కారావు (ఈయన ఎం.పి
కాదు) - రాధమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా ఫిబ్రవరి
1929లో గౌతమరావు జన్మించారు. గౌతమరావు గారి
తరువాత రామేశ్వర్ రావు, రఘునాథరావు ఇద్దరు
తమ్ముళ్ళు, చొక్కారావుగారి కుటుంబం సంస్కారవంతమైన
కుటుంబం. ఆ రోజుల్లో సంస్కృతం తెలుగు చదివిన వారు
గౌతమరావుగారి తండ్రిగారు చొక్కారావు గారు,
కుటుంబంలోని స్త్రీలు కూడా కొంత చదువుకున్నవారు.
అప్పుడు కొంత చదువుకోవడమంటే పోతన్న భాగవతంలోని
పద్యాలు, నరసింహ శతకం, సుమతీ శకతం, కృష్ణ శతకం
వంటి వాటితో పాటుగా కొన్ని మంగళ హారతులు స్వయంగా
జువ్వాడి గౌతమరావు
- డా॥ గండ్ర లక్ష్మణరావు
పాడగలిగినంత చదువుకున్నారు. చొక్కారావు గారు పద్యాన్ని
చాలా భావస్పోరకంగా చదివేవారని, మా తండ్రి గారే నాకు
పద్యాన్ని ఎట్లా చదవాలో నేర్పించారని ఎన్నో సందర్భాల్లో
గౌతమరావుగారు చెప్పుకున్నారు.
గౌతమరావుగారు ప్రాథమిక విద్య ఊరి బడిలో
చదువుకున్నారు. కొంచె పెద్ద తరగతికి రాగానే కరీంనగర్లో
ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. సంస్కృ
తంలో కూడా కొన్ని శబ్దాలు నేర్చుకున్నారు. ధాతువుల జోలికి
పోకుండానే ఆ సంస్కృతం నేర్చుకోవడం ఆగిపోయిందని,
అయినా వాల్మీకి మొదలు మరికొన్ని కావ్యాలు చదువుకుంటే
అర్ధమయిపోయేవని తరువాతి కాలంలో చెప్పుకున్నారు.
అప్పుడు దూపాటి రమణాచార్యులు తెలుగు
అధ్యాపకులు. దూపాటి రమణాచార్యులు గారు చదువు
తుండగా చూసిన ఒక పుస్తకం తాను కూడా చదవాలని
ఒకరోజు ఆయన ఇంటిలోనుంచి ఆ పుస్తకం అడగకుండా
చెప్పుకుండా తెచ్చుకొన్నాడు. ఆ రోజు రాత్రంతా లాంతరు
ముందు కూర్చొని చదివాడు. పుస్తకం అయిపోయేదాకా
నిద్రపోలేదు. అది విశ్వనాథ సత్యనారాయణగారి నవల
'చెలియలికట్ట'. అప్పటి వరకు డిటెక్టివ్ నవలలు చదివే
గౌతమరావుగారికి ఇది తొలి అనుభవం. పసి మనసు.
గంభీరమైన విషయం. అందులోని వర్ణనలు, ఆయా పాత్రలు,
ఆ సంఘటనలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి.
తెలంగాణ (209 తేజోమూర్తులు<noinclude><references/>
{{rh|తెలంగాణ |209| తేజోమూర్తులు}}</noinclude>
huqwfbcku7krh8i5r6uyyxlhkvf2o6i
553963
553961
2026-04-21T07:32:03Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553963
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''60. జువ్వాడి గౌతమరావు '''</p>}}
{{right|- డా॥ గండ్ర లక్ష్మణరావు}}
కరీంనగర్ సమీపాన గల ఇరుకుల్ల గ్రామంలో ఇద్దరు మహానుభావులు జన్మించారు. ఒకరు మచ్చలేని రాజకీయ నాయకుడు. మరొకరు మధుర హృదయులు సాహితీ మూర్తి. ఎన్ని రాజకీయ పదవులు నిర్వహించినా తన బ్రతుకుదెరువు తనకే కష్టంగా కరీంనగర్లో కనీసం ఒక చిన్న ఇల్లు కూడా లేని నిరాడంబరత, నీతి నిజాయితీలకు మారుపేరుగా బ్రతికిన రాజర్షి సజువ్వాడి చొక్కారావు. మరొకరు సాహితీవేత్తగా, సోషలిస్టు నాయకుడుగా యావదాంధ్ర దేశం ఆత్మీయ మిత్రునిగా మహోన్నత వ్యక్తిగా బ్రతికిన బ్రహ్మర్షి జువ్వాడి గౌతమరావు.
జువ్వాడి వంశంలో చొక్కారావు (ఈయన ఎం.పి కాదు) - రాధమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా ఫిబ్రవరి
1929లో గౌతమరావు జన్మించారు. గౌతమరావు గారి తరువాత రామేశ్వర్ రావు, రఘునాథరావు ఇద్దరు తమ్ముళ్ళు, చొక్కారావుగారి కుటుంబం సంస్కారవంతమైన కుటుంబం. ఆ రోజుల్లో సంస్కృతం తెలుగు చదివిన వారు
గౌతమరావుగారి తండ్రిగారు చొక్కారావు గారు,
కుటుంబంలోని స్త్రీలు కూడా కొంత చదువుకున్నవారు. అప్పుడు కొంత చదువుకోవడమంటే పోతన్న భాగవతంలోని
పద్యాలు, నరసింహ శతకం, సుమతీ శకతం, కృష్ణ శతకం వంటి వాటితో పాటుగా కొన్ని మంగళ హారతులు స్వయంగా పాడగలిగినంత చదువుకున్నారు. చొక్కారావు గారు పద్యాన్ని చాలా భావస్పోరకంగా చదివేవారని, మా తండ్రి గారే నాకు పద్యాన్ని ఎట్లా చదవాలో నేర్పించారని ఎన్నో సందర్భాల్లో గౌతమరావుగారు చెప్పుకున్నారు.
గౌతమరావుగారు ప్రాథమిక విద్య ఊరి బడిలో చదువుకున్నారు. కొంచె పెద్ద తరగతికి రాగానే కరీంనగర్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. సంస్కృతంలో కూడా కొన్ని శబ్దాలు నేర్చుకున్నారు. ధాతువుల జోలికి
పోకుండానే ఆ సంస్కృతం నేర్చుకోవడం ఆగిపోయిందని, అయినా వాల్మీకి మొదలు మరికొన్ని కావ్యాలు చదువుకుంటే అర్ధమయిపోయేవని తరువాతి కాలంలో చెప్పుకున్నారు.
అప్పుడు దూపాటి రమణాచార్యులు తెలుగు అధ్యాపకులు. దూపాటి రమణాచార్యులు గారు చదువుతుండగా చూసిన ఒక పుస్తకం తాను కూడా చదవాలని ఒకరోజు ఆయన ఇంటిలోనుంచి ఆ పుస్తకం అడగకుండా చెప్పుకుండా తెచ్చుకొన్నాడు. ఆ రోజు రాత్రంతా లాంతరు ముందు కూర్చొని చదివాడు. పుస్తకం అయిపోయేదాకా నిద్రపోలేదు. అది విశ్వనాథ సత్యనారాయణగారి నవల 'చెలియలికట్ట'. అప్పటి వరకు డిటెక్టివ్ నవలలు చదివే గౌతమరావుగారికి ఇది తొలి అనుభవం. పసి మనసు. గంభీరమైన విషయం. అందులోని వర్ణనలు, ఆయా పాత్రలు, ఆ సంఘటనలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |209| తేజోమూర్తులు}}</noinclude>
8v8rcrzw0nc3046k77vfoftll35yxvu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/231
104
211510
553964
551537
2026-04-21T07:45:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553964
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అది మొదలు సాహిత్య పఠనం, సాగంత్యం నా జీవితంలో అంతర్భాంగం అయిపోయాయని తరువాత ఆయనే
స్వయంగా చెప్పుకున్నారు. గౌతమరావుగారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సంస్కృతం డిగ్రీలో చేరారు.
కాని వారి తండ్రిగారిని ఎవరో తెలుగు చదవడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పడం వల్ల అప్పుడే కొత్తగా
ప్రారంభించిన కామర్సులోకి వీరిని మార్చించారట.
'''ఉన్నత విద్య- ఉస్మానియా విశ్వవిద్యాలయం '''
నిజాం వ్యతిరేక ఉద్యమంలో ఔరంగాబాదు జైలుకు వెళ్ళారు. రెండు సంవత్సరాలలో పారిపోయి వచ్చారు. ఉద్యమం లో పాల్గొన్న ఈ అనుభవం తరువాత రాజకీయాలలో పాల్గొనేటట్లు చేసింది. అప్పుడు హాస్టల్లో ఉండేవారు. అప్పుడే కొత్తగా విశ్వనాథ వారి వేయిపడగలు. సీరియల్ నవల అయిపోయి పుస్తకం రూపంలో వెలువడిందని విన్నారు. దాని కొరకు గ్రంథాలయాలన్నీ వెదకె చివరికి ఒక మిత్రుని ఇంటిలో కనపడితే చెప్పకుండా తెచ్చుకొని ఒక దినము, రాత్రి ఏకబిగిన చదివి తిరిగి వారి పుస్తకం వారికే ఇచ్చేశారు. చిన్నప్పుడు చదివిన చెలియలి కట్ట తరువాత చదివిన వేయి పడగలు విశ్వనాథ సాహిత్య సుడిగుండంలో పడవేశాయి. ఆయన అందులో అనేక మునకలు వేసి వారి ఆంతర్యాన్ని శోధించి పట్టుకోగలిగాడు. అంతగా మరే పాఠకుడు విశ్వనాథను పట్టుకోలేక పోయారు.
గౌతమరావుగారు గొప్ప దేశస్థాయి సోషలిస్టు నాయకులు. కాని వారి సాహిత్య జీవనాన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తాను.
'''సాహిత్యం '''
గౌతమరావుగారికి చిన్నతనం నుండి పద్యాలు చదవడంతో పాటు క్రమంగా విశ్వనాథ సాహిత్య పరిచయం చదవడం అందులో తన్మయులు కావడం జీవితంలో అది ఒక భాగమైపోవడం జరిగినాయి.
కావడం ఆయన
అప్పుడప్పుడు పత్రికలలో వచ్చిన విశ్వనాథ పద్యాలు కొన్ని సేకరించి అవి ఒక పుస్తకంగా అచ్చువేయాలని స్వయంగా విజయవాడకు వెళ్ళి విశ్వనాథకు చెపితే ఇవే కాదు ఇంకా ఉన్నాయి. అన్నీ కలిపి వేస్తానని అన్నారట. అదే 'విశ్వనాథ పంచశతి' అయింది. ఆ తరువాత ప్రతి రచనను గౌతమరావుగారు చదవడం అప్పుడప్పుడు విజయవాడ కు, వరంగల్లుకు వెళ్ళి విశ్వనాథను కలువడం వారికి పరిచయం పెరగడం జరిగినాయి.
1956లో విశ్వనాథ షష్టిపూర్తి సందర్భంగా కరీంనగర్లో సన్మానం చేయాలని గౌతమరావుగారు, మరో న్యాయవాది తుక్కారావుగారు మొదలైన వారు పిలిచారు. అప్పుడే మొదటి సారి విశ్వనాథ కరీంనగర్ కు వచ్చారు. తెలతెల వారుతుండగా కరీంనగర్కు ముందు మానకొండూరు ఊరి చెరువు మీద సూర్యకిరణాలు పడుతుండగా చూసిన
విశ్వనాథ కొన్ని పద్యాలు రాసి సభలో చిదివి వినిపించారు.
<poem>
{{left margin|5em}}
తనలోతు నెఱుగని జనుల పూజకు తిర
స్మృతి జూపు మత్సరస్వతి సుభద్ర
తన లోతు నెఱిగిన జనుల పూజకు నవా
దృతి జూపు మత్సరస్వతి సమార
మానకొండూర్తటాకాని గట్టున గుమ్ము
లాడు సాలీండ్ల గూండ్లవి శతములు
రవిసుషమా సమాక్రాంత కాంతుల చేత
మాణిక్య కాంతులు మలసి యాడి
వెండి నీరాజనములెత్తుచుండ కదలి
వచ్చె మీ కరీంనగరము భసల వేణి
మత్సరస్వతి భావ సామ్రాజ్య లక్ష్మి
భక్తి యున్నట్టిచో మెత్త బడెడు దేవి </poem>
అప్పటి నుండి కరీంనగర్ ఒక విడదీయరాని బంధం ఏర్పడింది. విశ్వనాథరు 1959లో కరీంనగర్లో శ్రీరాజరాజేశ్వర స్వామి నిధులతో ఏర్పాటు చేసిన కళాశాలకు సభ్యులుగా ఉన్న గౌతమరావుగారు మిగతా సభ్యులను ఒప్పించి విశ్వనాథను కళాశాల ప్రిన్సిపాల్గా రప్పించారు.
విశ్వనాథ సత్యనారాయణగారు శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్గా 1961 వరకు పనిచేశారు. ఆ రెండేళ్ళలో విశ్వనాథ అనేక పుస్తకాలు రచించారు. అక్కడ న్యాయవాది హిందూస్థానీ సంగీత విద్వాంసుడు పి. నారాయణ్ రావుగారితో పరిచయం ఏర్పడింది. జువ్వాడి గౌతమరావుగారు, విశ్వనాథ, నారాయణరావుగారలు రోజు కలుసుకునే వారు. పి. నారాయణరావుగారి సంగీతం విన్న సత్యనారాయణగారు ఆయన జీవితాన్ని ఒక నవలగా<noinclude><references/>
{{rh|తెలంగాణ |210| తేజోమూర్తులు}}</noinclude>
4b9dzqsa4j9fdvdfj2oicrf56zyxzvv
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/232
104
211511
553966
551538
2026-04-21T07:59:14Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553966
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
"మ్రోయు తుమ్మెద" పేరుతో రచించారు. అందులో గౌతమరావు, నేదునూరి బాబురావు, చీటి ముత్యం మొదలైన
వారంతా పాత్రధారులు, పి. నారాయణరావుగారు కథానాయకులు.
విశ్వనాథ వారు చెపుతుండగా (డిక్టేట్ చేస్తుండగా) గౌతమరావుగారు దాదాపు 10 నవలలు రాశారు. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువుచూ మ్రోయు తుమ్మెద, సముద్రపు దిబ్బ, దమయంతీ స్వయంవరం, నీలపెండ్లి, నందోరాజా భవిష్యతి,
పులిమ్రుగ్గు, వేదవతి మొదలైన వాటికి లేఖకుడు శ్రీ గౌతమరావుగారు. కేవలం చెప్పినది రాయడమే కాదు, అందులోని విషయాలను సున్నితంగా ఎత్తి చూపేవాడు. కొన్ని నవలలు స్త్రీ పాత్రలు మాత్రమే ఆధిక్యాన్ని
చూపిస్తున్నాయని చెబితే తరువాతి నవల అట్లా కాకుండా జాగ్రత్త పడ్డారు విశ్వనాథ, అంతేకాని ఎత్తి చూపిన
గౌతమరావును తప్పుపట్టలేదు. దానికి కారణం గౌతమరావు నిశిత పరిశీలకుడు, పండితుడు, సహృదయుడు అనే సంగతి. విశ్వనాథకు తెలుసు. 'నా వేగానికి తట్టుకొని రాసినవారు ఇద్దరు మాతమ్ముడొకరు, వీరొకరు వేరొకరు లేరు.' అని విశ్వనాథ స్వయంగా కితాబిచ్చారు.
'''గౌతమరావుగారి పద్యపఠనం '''
'పద్యపఠనం అనేది ఒక కళ. అది ఒక అల్కెమీ. అది తెలిసినవారు చాలా అరుదు. అట్లాంటి పద్యపఠనా కళాశీలి గౌతమరావు.' అని సంపత్కుమార గౌతమరావుగారి పద్య పఠనాన్ని గురించి ఒకచోట అన్నారు. బందరులో రామాయణ కల్పవృక్ష కావ్యగానం మల్లంపల్లి శరభయ్యగారు చేస్తుండగా విశ్వనాథ వారు అవి గౌతమరావుగారిని చదువుచున్నారట. గౌతమరావుగారు శివధనుర్భంగం ఘట్టం చదువుతూ 'అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని శక్తికి శివధనుస్సాగ లేదు, అని పద్యం ఇంకా రెండు పాదాలుండగానే జనం ఆగలేక చప్పట్లు కొట్టారట. సామాన్య కోతులను కూడా కథతో రసజగత్తులో ముంచి వేసే కంఠమాధుర్యం, పద్యపఠనం ఆయనది. ఆ తరువాత ఆయన విశాఖపట్నంలో, విజయవాడ లో, హైదరాబాదులో అనేక చోట్ల రామాయణాన్ని చదివారు. రాయప్రోలు, జాషువా, కృష్ణశాస్త్రి మొదలైన వారి పద్యాలు కూడా ఎంతో అద్భుతంగా చదివేవారు. ఆయన పద్యం చదువుతుంటే ఎంత కఠిన సమానమైన పువ్వు విచ్చుకున్నంత సుకుమారంగా విచ్చుకునేవి పదాలు. అర్థం తెలియకపోయినా అర్థమవుతున్నట్లే భావం ప్రకటిత మయ్యేది.
విశ్వనాథ రామాయణాన్ని వినడానికి శ్రీశ్రీశ్రీ లక్ష్మణ యతీంద్రులు కరీంనగర్కు పచ్చి ఆయన ఇంట్లోనే ఉండి పది పదిహేను రోజులు ఉదయ సాయంత్రాలు రామాయణం వినేవారు. ఆ రోజుల్లో ఆయనతో పాటు సుప్రసన్న, సంప
త్కుమార, లక్ష్మణమూర్తి, ఏలూరి పాటి అనంతరామయ్య, బేతవోలు రామబ్రహ్మం, చేకూరి రామారావు అనుమాండ్ల
భూమయ్య, విశ్వనాథ పావని శాస్త్రి, వాకాటి పాండు రంగారావు, ఇంకా ఎందరో మొదలైన వారు కూడా వచ్చి వారికి వీలయినన్ని రోజులుండి రామాయణం వినేవారు. స్థానికులు నేదునూరి బాబురావు, జి.వి. కృష్ణమూర్తి, నేను,
నూకల మర్రియాచారి, డింగరి నరహరి చారి ఇంకా ఎందరో రామాయణం వినడానికి వెళ్ళేవారము.
హైదరాబాదులో అబ్బూరి ఛాయాదేవి ప్రత్యేకంగా రామాయణ కావ్యపఠనం ఏర్పాటు చేసినపుడు రావిశాస్త్రి, కాశీపట్నం రామారావు ద్వాలాముఖి వంటివారు వచ్చి విని తన్మయులై రామాయణం ఇంత రసవత్తరంగా రాశారా? అని ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విశ్వనాథ రామాయణానికి ప్రశస్తి రావడానికి గౌతమరావుగారి పఠనం కూడా ఒక కారణం అని ప్రశంసించారు. అయితే గౌతమరావుగారు మాత్రం రచనలో బలం లేకుంటే ఎంత చదివినా రసానందం కలుగదు అని రచనలోని గొప్పదనాన్నే చెప్పేవారు.
'''జయంతి '''
గౌతమరావుగారు సృజన సాహిత్యాన్ని ఎక్కువగా చేపట్టకపోయినప్పటికీ జయంతి పత్రిక ద్వారా సాహిత్య ధారను ప్రవహింపచేశారు. ఎప్పుడో విశ్వనాథ ప్రారంభించి ఆపివేసిన జయంతి సాహిత్య పత్రికను తాను చేపట్టి ఒక ఇరవై సంచికలు నిరాఘాటంగా ఏ సంచికా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా వెలువరించారు. అంతేకాదు మునిశితమైన సాహిత్య విమర్శ ఆ పత్రిక ద్వారా పాఠకలోకానికందించారు. సాహితీవేత్తలు ఆ సంచికకోసం ఎదురు చూసేవారు. విశ్వనాథ శాకుంతలము యొక్క అభిజ్ఞానత అందులోనే సీరియల్గా రచించారు. గురజాడ కవికాదు, వ్యావహారిక భాష అంటే ఏమిటి? సామాజిక<noinclude><references/>
{{rh|తెలంగాణ |211| తేజోమూర్తులు}}</noinclude>
biod2durla9s08c0pkttyvpzvq5dkrc
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/233
104
211512
553971
551539
2026-04-21T08:16:37Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553971
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
స్పృహ అంటే ఏమిటి? విమర్శకుని అజ్ఞానం వంటి ఎన్నో వ్యాసాలు సాహిత్యలోకంలో పెద్ద చర్చలకు దారితీశాయి.
మౌలికమైన విమర్శనాంశాలను గౌతమరావుగారు అపూర్వంగా చర్చించారు. సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లోని రచనల విశేషాలను కూడా ఆ సంచికల్లో ఆయా సందర్భాల్లో చర్చించారు.
గొప్ప రచనల గురించి సాహిత్య ధారలో ఒక వ్యాసంలో ఈ విధంగా రాశారు.
“ఎవని ప్రతిభ జగత్తు యొక్క విశాల భాగాల నాక్రమించుకొనగలదో, మానవసృష్టిలోని అనంతములైన రహస్యాలకు వ్యాఖ్యానం చేయటానికి ఎవని బుద్ధి సమర్థమై ఉంటుందో వానిది మహాప్రతిభ. సతాంహి సందేహపదేషు వస్తువు ప్రమాణమంతః కరణ ప్రవృత్తయః, అన్న దుష్యంతునొక రహస్యమునకు వ్యాఖ్యాసము. సీతావ్పర్శచేత చైతన్యవంతు డైన శ్రీరామచంద్రుదొక రహస్యానికి వ్యాఖ్యానము. ప్రతిభ అట్లా ఉంటుంది. అందుచేతనే వాల్మీకి వ్యాసులు, కాళిదాస భవభూతులు, షేక్స్పియరు మిల్టనులు, విక్టర్యూగో, రోమేరోలా, డోస్టోవిస్కీలు మహా ప్రతిభాశాలురు. వారి తుల్యులును మహారచయితలు. వారు తమ ప్రతిభానేత్రమును విస్తరించి చూస్తే జగద్రహస్య సిద్ధాంతాలు నేను ముందునగా నేను ముందని పరుగెత్తుకొని వస్తవి. అంతేకాని ఉబుసుపోకకై నాలుగు పద్యాలు, పాటలు గిలికిన ప్రతిమినిషి, కొన్ని విచిత్రంగా ఉన్న మాటలను ఒకచోట సమకూర్చి నవ్వుపుట్టించే ప్రతి మాస్యకాడూ మహాకవి కాలేడు.”
మరోచోట తనకిష్టమైన ప్రబంధకవులు అముక్త మాల్యద రచించిన శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు అని చెప్పుకున్నాడు. 'రాయలలో ఎంత రాజసం యుద్ధవిద్య ఉందో, అంతకన్నా ఎక్కువ ఆర్ద్రత ఉన్నవాడని లేకపోతే
మాలదాసరి వంటి కథగాని, పల్లెజీవితాన్ని గాని అంత గొప్పగా చిత్రించేవాడు కాదు' అని గౌతమరావుగారి అభిప్రాయము.
సామాజిక ప్రయోజనం, రసానందం రెండింటి మధ్య ఆనాడు జరుగుతున్న చర్చకు గౌతమరావుగారు గొప్ప
సమన్వయాన్ని వ్యాఖ్యానించారు. విశ్వనాథ నవలలను, కావ్యాలను గురించి సమీక్షిస్తూ జీవుని వేదన, ఆర్ద్రత అయిన
అన్ని రచనల్లో మౌలికమైన అంశంగా ప్రతిపాదించారు. ప్రపంచ మహారచయితలైన విక్టర్ హ్యూగో, రోమారోలాండ్
మొదలైన వారి సరసన కూర్చోదగినవాడు విశ్వనాథ అని. ఆయన సవిమర్శకంగా నిరూపించారు. జయంతి పత్రిక
1958 నవంబరు నుండి 1960 జూలై వరకు నిర్వహించారు. తదుపరి ఆర్థికపరమైన ఇతర కారణాల వలన ఆగిపోయింది.
యువభారతి పక్షాన ఇరివెంటి కృష్ణమూర్తిగారి కోరిక మేరకు విశ్వనాథ కవితావైభవాన్ని గురించి ఒక ఇరవై పేజీల
పుస్తకాన్ని రచించారు. కల్పవృక్షంలో కైకేయి పాత్ర అనేది వారి విశిష్టమైన వ్యాసం,
కరీంనగర్లో కొందరు సాహితీ మిత్రులతో కలిసి 'సాహితీ మేఖల' అనే పత్రికను నిర్వహించి కొన్ని సంచికలు
వెలువరించారు.
సంస్కృత మృచ్ఛకటికం తెలుగు అనువాదం చేశారు. రష్యా, చైనా, భాషల్లోని ప్రముఖ కథారచయితల రచనలు
కాన్ని, హిందీ, బెంగాల్ భాషల్లోని మరికొన్ని రచనలకు అనువాదాలు చేశారు. విరోధులు, సఫేద్ కాలర్్వలా,
పావజీవి, పశువు మొదలైనవి వాటిలో ముఖ్యమైనవి.
అబ్బూరి ఛాయాదేవి గారు అబ్బూరి గీతావళి పేరుతో అబ్బూరి వారి పద్యాలను గౌతమరావుగారు గానం చేసినవి,
తరువాత రామాయణంలోని కొన్ని ఘట్టాలను పి.డి.ల రూపంలో తయారు చేసి 1992లో విడుదల చేశారు. వేయి
పడగలు, కల్పవృక్షము ఇతర రచనల గురించి మిత్రులకు వ్రాసిన ఉత్తరాలు ఎంతో సాహిత్య విలువలు కలిగి ఉన్నాయి.
సాహిత్యం గురించి భాష గురించి తనకు ఖచ్చితమైన స్పష్టమైన అభిప్రాయాలుండేవి.
తెలుగు భాష తెలంగాణ ప్రాంతంలో నైజాము కాలంలో ఏ మాత్రం చెడలేదు. పల్లెటూళ్ళలో కొద్దిమంది చదువుకున్న వారే కాక చాలా మంది చదువురానివారు కూడా శతకాలు అప్పగించేవారు. వారి ఉచ్ఛారణలో దోషాలుండేవి కావు. పాటలు పాడినా, మాట్లాడినా, తప్పులుండేవి కావు, కాని అప్పుడు కావ్యాలలోని పద్యాలు<noinclude><references/>
{{rh|తెలంగాణ |212| తేజోమూర్తులు}}</noinclude>
qd5v3q1jovz7l7n0gzc4qbyi6qo4hgi
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/234
104
211513
553973
551540
2026-04-21T08:21:35Z
A.Murali
3019
553973
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
అందరికీ అర్ధమై చదువుకున్న వారి సంఖ్య పెరిగిన ఈ కాలంలో పద్యాలు అర్థం కాకపోవడం కేవలం పాఠ్యప్రణాళిక
ల్లోని లోపమే.
తెలుగు భాష స్వాతంత్య్రానంతరం చెడినంత బాగా నైజాం కాలంలో చెడలేదు. కవిత్వంలో బలం ఉండాలే గానీ
పద్యమా, వచనమా అన్నది ప్రధానం కాదు.
కవిసమ్మేళనం ఉర్దూ భాషలో ఉన్నంత బాగా తెలుగులో ఉండదు. అసలు కవిసమ్మేళనం అనేసంప్రదాయం ఉర్దూ భాషకే సరిపోతుంది. ఉర్దూభాషలో కవిత చివరన ఒక చమత్కారం వినేవారికి వెంటనే ఓహో అనిపిస్తుంది. తెలుగు కవిత్వం అట్లాకాదు. దానికి భాషలో ఉండే లక్షణమే కారణం.
ఎంత కచ్చితంగా ఉంటారో అది కరిగిపోయేవారుగా
ఉండే లక్షణం ఆయనది. వానమామలై జగన్నాథాచార్యలతో
కలసి వేదాలపై ఉద్యమ గీతాలు పాడారు. ఆ జీవితాంతం
సాహిత్యం, సంగీతం ప్రపంచంగా మిగతా కుటుంబ జీవితం
కర్మయోగిగా గడిపిన మహావ్యక్తి జువ్వాడి గౌతమరావుగారు.
తన ఇల్లు ఒక సాహిత్యాశ్రమంగా ఎందరో
సాహీతీవేత్తలకు కావ్యరస ప్రపంచాలను చూపించారు.
నిజమునకు భావుకుండని
సృజనన్ పదివేల మంది నెవ్వడా యొక్కం
డు జనించు, మెఱయు వానికి
రజనీపతి కాంతి భ్రూభరమ్మపుడపుడై
వారిలో నొక్కరుండు జువ్వాడి వంశ
రజని కాంతుండు గౌతమరావనంగ
కవికి నట్టిడు నొక చెలికాడు దొరకు
తొలతటి జనుస్సులందరి చెలిమికాడు.
అని విశ్వనాథ చేత ఆత్మీయంగా ప్రశంసింపబడి,
భ్రష్టయోగి కావ్యమంకితంగా పొందినారు. ఆ ఇద్దరి సాహిత్య
జీవనానుబంధం సాహితీ జగత్తులో మరొకరికిలేదు.
రాజకీయాలలో సోషలిస్టు నాయకునిగా
జయప్రకాశ నారాయణ్, రామమనోహర్ లోహియా వంటి
వారితో అత్యంత సన్నిహింతంగా ఉండి బాధ్యతలు
నిర్వర్తించారు. యువ విద్యార్థిగా నైజాం వ్యతిరేకపోరాటంలో
జైలుకు వెళ్ళాడు. తన సమకాలికుడైన సి. హెచ్.
రాజేశ్వరరావు, పి.వి. నరసింహారావు, జే.వి. నర్సింగరావు
మొదలైన వారెందరితోనే సిద్ధాంతం వేరయినా తన వ్యక్తిత్వ
ముద్రను నిలుపుకున్నారు.
సాహిత్యంలో మహారచయితలు, కవులు, విమర్శకులు
అవుననే విధంగా మాట్లాడి, పద్యం చదివి, సాహితీలోకంలో
ఒక చిరస్థానం పొందారు.
ఎప్పుడూ ఆయన కంఠం కంచులా వినిపిస్తూనే కళ్ళలో
ఒక తడి తిరుగుతుండే మనిషి పైకి ఒక శ్యామల వర్ణంలో
చెట్టంత మనిషిగా కన్పిస్తూ లోపల ఒక సముద్రం వలె
గంభీరంగా యోగి వంటి జీవితం గడిపిన జువ్వాడి
గౌతమరావుగారు 24 ఆగస్టు 2012 తేదీన చివరి శ్వాస
విడిచారు. అంతిమ మరియల్లో ఆయనను నేలపై
పడుకోబెట్టిన చివరి క్షణాలలో ఆయన పక్కన కూర్చొని
భాగవతం పద్యాలు నేను (డా. గండ్ర లక్ష్మణరావు)
వినిపించాను. అప్పుడు ఆయన కళ్ళు చివరి సారి కదిలి
ఆగిపోయాయి. విశ్వనాథ సాహిత్యాన్ని మరో వందేళ్ళ
ఆయుష్షును పెంచిన అత్యంత అభిమాని, అసలు
సాహిత్యాన్ని కావ్యాన్ని ఎట్లా చదవాలి అని స్పష్టంగా
చెప్పగలిగిన గొప్ప పండితుడు, సామాజిక న్యాయం
జరగాలనే సోషలిస్టు సిద్ధాంతాన్ని నమ్మినవారు.
ఆచరించినవారు, అన్నిటికి మించి ఎవరైన ఎంతో మర్యాదగా
అప్యాయంగా పలకరించే మెత్తదనం గల మనిషి జువ్వాడి
గౌతమరావు నిజంగానే విశ్వనాథ అన్నట్లుగా కనుబొమ్మల
మధ్య ఏదో ఒక తెలియని వెలుగుతో ప్రకాశవంతమైన
జీవితాన్ని గడిపిన ధన్యజీవి.
సజువ్వాడి కదలి వేలువు
జువ్వా చదువరుల మొత్తములకున్ దలపై
పువ్వా! మవ్వపు మొవ్వా
కవ్విన కబ్బముల ప్రోవ గౌతమ రావా!
అని మల్లంపల్లి శరభయ్యగారు సన్మానింపబడినవారు.
తెలంగాణ (213) తేజోమూర్తులు ban<noinclude><references/>
{{rh|తెలంగాణ |213| తేజోమూర్తులు}}</noinclude>
n5kmifeyra608fmax2k4xhf3qh9izhx
553985
553973
2026-04-21T10:57:29Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
553985
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అందరికీ అర్ధమై చదువుకున్న వారి సంఖ్య పెరిగిన ఈ కాలంలో పద్యాలు అర్థం కాకపోవడం కేవలం పాఠ్యప్రణాళిక
ల్లోని లోపమే.
తెలుగు భాష స్వాతంత్య్రానంతరం చెడినంత బాగా నైజాం కాలంలో చెడలేదు. కవిత్వంలో బలం ఉండాలే గానీ
పద్యమా, వచనమా అన్నది ప్రధానం కాదు.
కవిసమ్మేళనం ఉర్దూ భాషలో ఉన్నంత బాగా తెలుగులో ఉండదు. అసలు కవిసమ్మేళనం అనేసంప్రదాయం ఉర్దూ భాషకే సరిపోతుంది. ఉర్దూభాషలో కవిత చివరన ఒక చమత్కారం వినేవారికి వెంటనే ఓహో అనిపిస్తుంది. తెలుగు కవిత్వం అట్లాకాదు. దానికి భాషలో ఉండే లక్షణమే కారణం.
ఎంత కచ్చితంగా ఉంటారో అది కరిగిపోయేవారుగా ఉండే లక్షణం ఆయనది. వానమామలై జగన్నాథాచార్యలతో
కలసి వేదాలపై ఉద్యమ గీతాలు పాడారు. ఆ జీవితాంతం సాహిత్యం, సంగీతం ప్రపంచంగా మిగతా కుటుంబ జీవితం కర్మయోగిగా గడిపిన మహావ్యక్తి జువ్వాడి గౌతమరావుగారు.
తన ఇల్లు ఒక సాహిత్యాశ్రమంగా ఎందరో సాహీతీవేత్తలకు కావ్యరస ప్రపంచాలను చూపించారు.
<poem>
{{left margin|5em}}
నిజమునకు భావుకుండని
సృజనన్ పదివేల మంది నెవ్వడొ యొక్కం
డు జనించు, మెఱయు వానికి
రజనీపతి కాంతి భ్రూభరమ్మపుడపుడై
వారిలో నొక్కరుండు జువ్వాడి వంశ
రజని కాంతుండు గౌతమరావనంగ
కవికి నట్టిడు నొక చెలికాడు దొరకు
తొలతటి జనుస్సులందరి చెలిమికాడు.</poem>
అని విశ్వనాథ చేత ఆత్మీయంగా ప్రశంసింపబడి, భ్రష్టయోగి కావ్యమంకితంగా పొందినారు. ఆ ఇద్దరి సాహిత్య
జీవనానుబంధం సాహితీ జగత్తులో మరొకరికిలేదు.
రాజకీయాలలో సోషలిస్టు నాయకునిగా జయప్రకాశ నారాయణ్, రామమనోహర్ లోహియా వంటి వారితో అత్యంత సన్నిహింతంగా ఉండి బాధ్యతలు నిర్వర్తించారు. యువ విద్యార్థిగా నైజాం వ్యతిరేకపోరాటంలో జైలుకు వెళ్ళాడు. తన సమకాలికుడైన సి. హెచ్. రాజేశ్వరరావు, పి.వి. నరసింహారావు, జే.వి. నర్సింగరావు మొదలైన వారెందరితోనే సిద్ధాంతం వేరయినా తన వ్యక్తిత్వ ముద్రను నిలుపుకున్నారు.
సాహిత్యంలో మహారచయితలు, కవులు, విమర్శకులు అవుననే విధంగా మాట్లాడి, పద్యం చదివి, సాహితీలోకంలో
ఒక చిరస్థానం పొందారు.
ఎప్పుడూ ఆయన కంఠం కంచులా వినిపిస్తూనే కళ్ళలో ఒక తడి తిరుగుతుండే మనిషి పైకి ఒక శ్యామల వర్ణంలో
చెట్టంత మనిషిగా కన్పిస్తూ లోపల ఒక సముద్రం వలె గంభీరంగా యోగి వంటి జీవితం గడిపిన జువ్వాడి
గౌతమరావుగారు 24 ఆగస్టు 2012 తేదీన చివరి శ్వాస విడిచారు. అంతిమ ఘడియల్లో ఆయనను నేలపై పడుకోబెట్టిన చివరి క్షణాలలో ఆయన పక్కన కూర్చొని భాగవతం పద్యాలు నేను (డా. గండ్ర లక్ష్మణరావు) వినిపించాను. అప్పుడు ఆయన కళ్ళు చివరి సారి కదిలి ఆగిపోయాయి. విశ్వనాథ సాహిత్యాన్ని మరో వందేళ్ళ ఆయుష్షును పెంచిన అత్యంత అభిమాని, అసలు సాహిత్యాన్ని కావ్యాన్ని ఎట్లా చదవాలి అని స్పష్టంగా చెప్పగలిగిన గొప్ప పండితుడు, సామాజిక న్యాయం జరగాలనే సోషలిస్టు సిద్ధాంతాన్ని నమ్మినవారు. ఆచరించినవారు, అన్నిటికి మించి ఎవరైన ఎంతో మర్యాదగా అప్యాయంగా పలకరించే మెత్తదనం గల మనిషి జువ్వాడి గౌతమరావు నిజంగానే విశ్వనాథ అన్నట్లుగా కనుబొమ్మల మధ్య ఏదో ఒక తెలియని వెలుగుతో ప్రకాశవంతమైన జీవితాన్ని గడిపిన ధన్యజీవి.
<poem>
{{left margin|5em}}
జువ్వాడి కదలి వేలువు
జువ్వా! చదువరుల మొత్తములకున్ దలపై
పువ్వా! మవ్వపు మొవ్వా!
కవ్విన కబ్బముల ప్రోవ! గౌతమ రావా!</poem>
అని మల్లంపల్లి శరభయ్యగారు సన్మానింపబడినవారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |213| తేజోమూర్తులు}}</noinclude>
hfub72ikdq2o5df1qf8lggpn3lny6vw
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/235
104
211514
553987
551541
2026-04-21T11:08:59Z
A.Murali
3019
553987
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''61. జ్వాలాముఖి '''</p>}}
{{right|- నిఖిలేశ్వర్}}
ప్రజాస్వామిక విప్లవ సాంస్కృతికోధ్యమ మిత్రుడు, దిగంబర కవితా సహచరుడు జ్వాలాముఖి ఆయనలో అర్థ శతాబ్ది స్నేహమను బంధం నాదం. 1960కు పూర్వమే ఆకారం వీరవెల్లి రాఘవాచారిగా, ఆయన తొలిరచన 'మనిషి' కావ్యంతో నాకు తొలి పరిచయం.
జ్వాలాముఖి హైదరాబాద్ లోని సీతారాంబాగ్ దేవాలయంలో 12-4-1938 (బహుధాన్య, చైత్ర పూర్ణిమ)నాడు జన్మించాడు. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి నరసమ్మ, వీరవెల్లి నరసింహాచార్యులు. మెదక్ జిల్లాలోని ఆకారం గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. వారిది వైష్ణవ సంప్రదాయ కుటుంబం.
కలంపేరు జ్వాలాముఖిగా ప్రసిద్ధుడైన రాఘవాచారికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. ఆయన సతీమణి సీతాదేవి.
ముగ్గురు మగపిల్లలు సంపత్, శ్రీధర్, వాసు. ఈ ముగ్గురు కుమారులు కులాంతర వివాహాలు చేసుకున్నారు. జ్వాల
తన బాల్యం గురించి ఇలా వర్ణించాడు. “నాన్న పౌరోహిత్యం, కంఠశోష, రామాయణ పారాయణం, పూటగడవని తండ్రి కోపంలో వణికిపోయిన బాల్యం. ఈతలు, ఆటలు, బలాదూరు తిరుగుళ్ళు, ఆట ఖ్యాళి చాపల్యం”
జ్వాలాముఖి విద్యాభ్యాసం సీతారాంబాగ్ లోని సంస్కృత పాఠశాలలో 'అమరకోశం', శబ్ధమంజరితో మొదలై నాంపల్లి లోని మల్టీపర్పస్ హైస్కూల్లో 10వ తరగతి, ఆతర్వాత నిజాం కాలేజీలోని సాయంకాల కళాశాలలో బి.ఎ. పాసై,
ప్రయివేటుగా ఎమ్.ఎ.(తెలుగు), ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు. విడిగా హిందీ భూషణ్ ఉత్తీర్ణత సాధించారు.
ఉద్యోగరీత్యా ఆయన ఎ.ఒ.సి.లో సైనికులకు చదువు చెప్పే సివిలియన్ స్కూలు మాస్టారుగా కొంతకాలం పనిచేశారు. తర్వాత వరసగా జలహళ్ళి (బెంగళూరు)
ఏర్ఫోర్స్లో క్లర్కుగా, ప్రభుత్వ పౌరసరఫరాలశాల,
ఆర్.టి.సి.లో క్లర్క్, ఆలియా ప్రభుత్వ పాఠశాలలో
ఉపాధ్యాయుడిగా పన్నెండేళ్లు, ఎల్. ఎన్. గుప్తా సాయంకాల
కళాశాలలో 24 సంవత్సరములు లెక్చరర్ గా పనిచేసి
1996లో రిటైరైయ్యారు.
మరోవైపు సీతారాంబాగ్ దేవాలయ ట్రస్టీ గనేరీవాల్తో,
దేవాదాయ శాఖతో, కోర్టు వ్యాజ్యాల మధ్య పోరాడి స్థానిక
బాధితులకు సొంతఇళ్ళు సాధించగలిగాడు.
తాత్విక భూమిక
సీతారాంబాగ్ జీవితం, జ్వాలను మొదట ఆస్తికుణ్ణి
ఆతర్వాత నాస్తికునిగా మార్చింది. సంప్రదాయ వ్యతిరేకత,
మానవతా ఆరాధన తొలి పాఠాలుగా హేతువాదంతో బలపడి
"మంచి అనే విపంచి మీద మానవతా రాగాలు ఆలపిస్తూ
అమరత్వానికి అభ్యుదయానికి" (మనిషీ) ప్రస్థానం
చేయించింది.
తెలంగాణ (214) తేజోమూర్తులు ఉ<noinclude><references/>
{{rh|తెలంగాణ |214| తేజోమూర్తులు}}</noinclude>
n8os77q2y3q0db1aqyx902kvkyhogas
పుట:పటం కతలు.pdf/1
104
212063
553896
552586
2026-04-20T11:59:21Z
Arjunaraoc
364
మానవీయంగా cHeight పరామితి పెంచాను. మార్చు బొమ్మ పూర్తిగా వచ్చుటకు
553896
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = %E0%B0%AA%E0%B0%9F%E0%B0%82_%E0%B0%95%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81.pdf
|Page = 1
|bSize = 450
|cWidth = 447
|cHeight = 802
|oTop = 0
|oLeft = 0
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
kxtej0io0hp3pjxuzugpibpnosh730j
సూచిక చర్చ:పటం కతలు.pdf
107
212093
553898
553891
2026-04-20T12:02:21Z
Arjunaraoc
364
/* బొమ్మల సమస్య */ సమాధానం
553898
wikitext
text/x-wiki
== బొమ్మల సమస్య ==
{{ping|Arjunaraoc}} బొమ్మలను క్రాపింగ్ చేస్తుంటే కొంతభాగం మాత్రమే వస్తుంది. ఒకసారి పరిశీలించి సహాయం చేయగలరా. ధన్యవాదాలు. [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:30, 14 ఏప్రిల్ 2026 (UTC)
:@[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారు, సమస్య నిర్ధారించాను. విశ్లేషించాలి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:41, 20 ఏప్రిల్ 2026 (UTC)
::@[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారు, బొమ్మ చూపుటలో కుదించబడుతున్నందున సరిగా రాలేదని గమనించాను. మానవీయంగా cHeight పరామితి పెంచి, మునుజూపులో ధృవికరించి, భద్రపరచండి. ఉదాహరణకు [https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:%E0%B0%AA%E0%B0%9F%E0%B0%82_%E0%B0%95%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81.pdf/1&diff=prev&oldid=553896 తొలిపేజీ సవరణ] చూడండి.-- [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 12:02, 20 ఏప్రిల్ 2026 (UTC)
jsx8m8ewuzjpqbrl16jortvl7vw1hb5
పుట:Sangitarasataran022902mbp.pdf/37
104
212329
553897
553895
2026-04-20T12:00:34Z
Brjswiki
6801
553897
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సిద్ధా - <poem>కులసతిలోపముల దలపగఁదగు నే॥ ॥కుల॥
కూడునె బాలా!॥ ॥కుల॥</poem>
యశో— <poem>పరిజనులెవ్వరే పనుపులవినరో ॥కలి॥
పనుపులవినరో ॥కలి॥</poem>
సిద్దా - పురుషతగల్గిన పరిజనులేలా॥ పరిజనులేలా॥
యశో - ఎవ్యరివెతల సేదఁదలచితివో॥ ఎదఁదలచితివో॥
సిద్దా - పరులగుబాధల బాపుదురెవరూ॥ బాపుదురెవరూ॥ ప్రాణేశ్వరి! నీవును నాతోడనే యీయాయాసపడనేటికి పానీయమొక్కింతయొసంగి నిడురింపుము.
యశో — కాంతిమతీ! చలువపందిటిలో నిసుకతిన్నియపై శితలపాత్రములోనున్న పానీయమిటుగొనిరమ్ము.
కమల — కాంతిమతి (ప్రవేశింతురు).
యశో - కమలా! యీ చల్లనివేళ వల్లకేమిటుచు పాటఁబాడరాదా.
కమల - అట్లేకావించెదను.
కాంతి - (ఉదకము తెచ్చి యిచ్చిపోవును).
యశో - (పవ్వళించును).
సిద్దా - (కూర్చుండును).
కాంతి - (వీణగైకొని).
{{Center|{{p|fs125}}పాట. తోడి.</p>}}
{{left margin|5em}}<poem>గండుగోయలకూతలకు పండువెన్నెలపూతలకు
నిండుతుమ్మెదమ్రోతలకు నిలువజాలా పలుక వేలా
జాలమేలా తాళజాలా సఖీమణీ॥</poem> </div>
యశోధర విదిరించియుండును. నేనునుబోయి నిదురింతుగాక.
{{right|(నిష్క్రమణము)}}
సిద్ధా - ఔరా! నాకీరాతిరి యెట్లునిదురవచ్చును. నిరర్ధకుఁడనై, నిర్వ్యాపారుఁడనై తుచ్ఛహీఐమానవుండును౦బోలె, యువతీ
జనలోలుఁడనై మందురలో బంధింపంబడిన సైంధపంబువలె నీమందిరంబునఁ జిక్కువడియుండనేల. ఈభూతలంబున జన్మంబునొంది భూతలంబెల్ల నేయేరీతినడచుచున్నదో జీవకోటికి సుఖ సంఖ దుఃఖానుభవంబు లెట్లుగానున్నవోతిలకించు భాగ్యమైనను లేకయుండెఁగ<noinclude><references/></noinclude>
2zgez2xgpyor5nqc17l435fm97mvwov
పుట:Sangitarasataran022902mbp.pdf/38
104
212330
553903
2026-04-20T12:26:57Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553903
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సిద్దా - ఆహా ప్రపంచస్వభావంబును సృష్టివిలాసంబును గణియించుట యెంతటి భాగ్యము.
{{Center|{{p|fs125}}పాట. మాయామాళవగౌళ</p>}}
{{left margin|5em}}<poem>ఎంతనితలఁతు నీవింతప్రపంచము ఇంతనితెలుపఁగ నెవ్వనికరము
భ్రాంతమనస్కులై బంధనసంసక్తులై శాంతరహితులై చింతనసలుపరు
స్థూలములెన్నియొ, సూక్ష్మములెన్నియొ, కాలములెన్నియొ గోళములె
న్నియొ ॥ఎంత॥ ఔరా! చాలిచాలని యీమనుష్యశరీరంబుతో
ఎంతదూరము చరింపఁగలను॥</poem> </div>
ఈదేహమునకు ఱెక్కలుండిన నొక్కసారిగా హిమవచ్ఛిఖరంబు నధిరోహించి యోజనసహస్రపర్యంతంబు నవలోకించి యుందునుగదా! సూచీమంఖంబులవంటి చూపులైనగలిగియుండెనా సెందేమి యిమిడియున్నదియు బరీక్షించుదునే. ఇచ్ఛామాత్య్రంబువనెందెందుఁ బోవలయునన్న, అందందుఁబోవుటకే మనుజకోటికేల స్వాతంత్య్రములేకయుండె. కానిమ్ము శక్తికిమీరిన కోరికలుకోరిన ప్రయోజనమేమి.
రేపు నామిత్రుఁడగు ఛన్నునివెంటంగొని చేతనైనంతవరకు పట్టణంబంతట మోకసారివిహరించివచ్చెదఁగాక (ముందుకు వచ్చి)
తెల్లవారవచ్చె యశోధరను మేలుకొల్పెదగాక.
యశోధరా! వెడలుచున్న వాఁడ లెమ్ము.
యశో — (హశాత్తులేచి) నాధా! యెచ్చటికి వెడలెదవు.
సిద్ధా — ఎచ్చటికినిలేదు. సూర్యోదయంబాయెగావున మేలుకొల్పితిని.
యశో - అప్పుడే సూర్యోదయమాయెనా-
సిద్ధా — అల్లదిగో దిక్కులువీక్షింపుము.
{{left margin|5em}}<poem>సీ॥ అజ్ఞానిమానసా హంకారమట్లుగా నాక సంబునదమంబణఁగిపోయె
స్వల్పవిద్యాకలా చాతుర్యమట్లుగా దారకాకాంతులుతరగిపోయె
ప్రాకృతజనమనో భావంబుతెఱఁగున దిఙ్మండలంబెల్లతెల్లవోయె
సాధుసజ్జనమనః సంరంభమునుబోలె శుకపికరావంబుప్రకటమయ్యె॥</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ జ్ఞానతేజో మహోదయంబైనయట్లు
భానుడుదయించెఁబూర్వ దిగ్భాగమందు
లోకములనెర్లరక్షింపలోలనేత్ర
మేలుకొనుమింకయేకంక మేలుగనుము॥</poem> </div><noinclude><references/></noinclude>
89abbzn07t4nuultf087suznu0anuxk
పుట:Sangitarasataran022902mbp.pdf/39
104
212331
553904
2026-04-20T12:28:00Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553904
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>
-నాధా! యిదే వచ్చుచున్నాను.
(ఇద్దలు నిస్క మణము)
ద్వితీయరంగము—పురవీధి.
(ఇద్దఱు మాదిగ వాండ్రు డప్పులతో ప్రవేశింతురు).
పాట
కొజ్ఝున్న మెడతా, సజ్జన్న మెడ్తా, కోరినసొమ్ములెడ్తా
కోరిససొమ్ము లెడ్తా - మేలైనజల్లారు. రెలెడ్తా॥
సుట్టిల్లుగడ్తా, సున్నాలు పెడ్తా, సుట్టాలనెల్లకొడా
కొ
37
నాసామి, పుట్టాల నెల్లకొడ్తా, నా సామీ సొమ్మంతాఁగూడ మెడ్తా కొ॥
పచోటికొంటా, పొడి సేయుమఁటా, పాలన్నీ తొగుమంళా నే
యేప్రొద్దు, పాటుబడవద్దంఠా"నే॥
భటు—(ప్రవేశించును),
51
ఏమిరా ! వళ్లూ సైదెలియకుండా, పొగరుబోతు కూతలు పాడుకుంటూ మరీ
వెళ్లుకున్నావు.
మాది—(తనలో) ఈడబ్బసిగధరగ, అప్పుడే వత్తావుండాడా (ప్రకాళము) ఏమి
య్యా నిన్న సాయంత్రం పేలగ లేకూ కేసి చక్కా మోతినే, మళ్లి లెల్లారి నాకనీ
కోసంగూకుండి కూకుండి కాల్లడిపోయినాయి, మరదేం చాటింపో నా కర్త
మేకాలేదుగందా, ఎట్టా అనుకున్నా వయ్యామరి.
భటు _ నీకు చెప్పి చాటింపు
వేయించడానికే కాదు వచ్చింది.
మాది ౧అచలు చంగ తేంటయ్యా మరి తలతోక లేకుండా మాత్తిరం చెప్పక య్యా.
ఛటు__మనరాజు గారి కుమారుడు గారు పట్టణంలో లేవుషీ, కారు తిరుగుతారు అయితే
అందరూ యిళ్లు పరిశుభ్రంచేసుకుని తోరణాలు కట్టుకొని అందముగావుండేట
ట్టుచేసుకోవలెననిన్నీ, కుంటివాండ్రు గుడ్డివాండ్లు ళుష్టురోగులు ముసలివాం
డ్రు ముతక వాండ్రు ముష్టివాండ్రు అంగహీనులు కురూపులు, వీధులలో.
నడవకూడదనిన్నీ అట్లా వెళ్లితే శిక్షింపబడుదురో అనిన్నీ చాటింపు చెయ్యవలెను<noinclude><references/></noinclude>
2u76ubucbyp29kt01jd42p9ssljoc17
553912
553904
2026-04-20T13:09:30Z
Brjswiki
6801
553912
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యశో - నాధా! యిదేవచ్చుచున్నాను.
{{right|(ఇద్దఱు నిస్కమణము)}}
{{rule |6em }}
{{Center|{{p|fs125}}ద్వితీయరంగము — పురవీధి</p>}}
{{rule |6em }}
{{Center|'''(ఇద్దఱు మాదిగవాండ్రు డప్పులతో ప్రవేశింతురు)'''}}
{{Center|{{p|fs125}}పాట</p>}}
{{left margin|5em}}<poem>కొఱ్ఱన్న మెడతా, సజ్జన్న మెడ్తా, కోరినసొమ్ము లెడ్తా
కోరిససొమ్ము లెడ్తా - మేలైనజల్త సిరెలెడ్తా ॥కొ॥
సుట్టిల్లుగడ్తా, సున్నాలు మెడ్తా, సుట్టాలనెల్లకొలెడ్తా
నాసామి, సుట్టాల నెల్లకొడ్తా, నాసామీ సొమ్మంతాఁగూడ మెడ్తా ॥కొ॥
పడ్డోటిగొంటా, పొడిసేయుమంటా, పాలన్నీ తాగు తాగుమంటనే
యేప్రొద్దు, పాటుబడవద్దంఠానే ॥కొ॥</poem> </div>
భటు — (ప్రవేశించును),
ఏమిరా! వళ్లూ పైదెలియకుండా, పొగరుబోతు కూతలుపాడుకుంటూ మరీ వెళ్లుతున్నావు.
మాది — (తనలో) ఈడబ్బసిగధరగ, అప్పుడే వత్తావుండాడ్రా (ప్రకాశము) ఏమియ్యా నిన్న సాయంత్రంపేలగల్తేకూకేసి చక్కామోతినే,
మళ్లితెల్లారి నాకనీ కోసంగూకుండి కూకుండి కాల్లడిపోయినాయి, మరదేం చాటింపో నాకర్త మేకాలేదుగందా. ఎట్టా అనుకున్నావయ్యామరి.
భటు - నీకు చెప్పి చాటింపువేయించడానికే కాదు వచ్చింది.
మాది ౧ - అచలు చంగతేంటయ్యా మరి తలతోక లేకుండా మాత్తిరం చెప్పకయ్యా.
భటు - మనరాజు గారి కుమారుడు గారు పట్టణంలో రేపుషీకారుతిరుగుతారు అయితే అందరూ యిళ్లు పరిశుభ్రంచేసుకుని తోరణాలుకట్టుకొని అందముగావుండేటట్టుచేసుకోవలెననిన్నీ, కుంటివాండ్రు గుడ్డివాండ్లు కుష్ఠురోగులు ముసలివాండ్రు ముతకవాండ్రు ముష్టివాండ్రు అంగ హీనులు కురూపులు, వీధులలో నడవకూడదనిన్నీ. అట్లా వెళ్లితే శిక్షింపబడుదురు అనిన్నీ చాటింపుచెయ్యవలెను.<noinclude><references/></noinclude>
2m9jbykcpa9b0mdb7f0vbac2k67sfgy
పుట:Sangitarasataran022902mbp.pdf/40
104
212332
553915
2026-04-20T14:10:46Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553915
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మాది ౧ - చరే నువ్వాన్నా మాటలన్నీ చాలాసేపు మణుగులో గునించుకోంది యెయ్యడాన్కి యీలులేదుగాని యీచాటింపు
కర్తబు యేంటయ్యా అంటే చెప్పవేమి?
భటు - అర్థమేమిటిరా కుంటివాడు గుడ్డివాడు ముసలివాడూ అంటే నీకు తెలియదా.
మాది ౧ — ఓయి నాయనా అదిగాదయ్యా అచలు యీచాటింపుయెయ్యడానికి యే మేతువో శప్పవయ్యా.
భటు - మరేమియునులేదు. పరిశుభ్రముగా పట్టం కనపడవలయునని, అంతేయుశ్చంగారము గానుండవలయువని.
మాది ౧ — నిచింగా రందగలడా చింగారాలు మొంగారాలు అట్టామెట్టయ్యా, అదిగో నేనోటడుగుతాను, మరిదొరోరితో సెప్పవుగంద.
భటు - చెప్పను చెప్పరా.
మాది ౧ — మరిగల్తే, రాజు గారి కుమారుడికి మతిశలనం. మరి అదేఁటో యెర్రి యే దాంతంవుండదంట అందుకోసంగానే పెళ్లిజేసి
తోట్లోనేసేవుంచుతావుండా రంట, కుంటోడూ గడ్డాడు కనపడితే మల్లీ రేచిక్కెక్కుతుందంటారు నిజమేనా.
భటు — అదియేమో మనపదెలియదు. అయినా చాలా తెలిసినవాడనుకుంటారు. అవన్నీ నీకెందుకు చాటిం పెయ్యరా.
మాది ౧ - అయ్యా యియ్యేల యిప్పుడేమద్యాన్నం అయ్యింది నేనొక్కణ్ణి యెక్కడేసివత్తామావోణ్ని కూడామెట్టి యియ్యేల జోడుటమ్మాలు యెల్లితే గాని పూరంతా చాటింపు అవుద్దంటయ్యా.
భటు - అట్లే కానియ్యి.
మాది ౧ — వోల్లోళ్లు యీదులెంటెల్లగూడదో చెప్పనయ్య భాభూ.
భటు - కుంటివాండ్రు, గుడ్డివాండ్రు, చెష్టుకోగులు, అంగహీనులు, కురూపులు, ముష్టివాళ్లు.
మాది ౧ - అయితే యిక పేదసాదాబతికే యెత్తులేదు. యీళ్లందరికీ బుర్రలైతాయన్నమాటే. కానీలే. ఆవూసునాకెందుకు గాని ఆశివరిమాటలు రెండు మాతిరంనొట దిరగవయ్యా.
భటు — అంగహీనులు, కురూఫులు పోనీలే. తక్కినవి చెప్పు.
మాది ౧ - డప్పుగొట్టి). అదిగో మల్లీ అడగవద్దు. తెలద నెద్దు. రేపటిరోజున రాజు<noinclude><references/></noinclude>
hwjxxobmpju9atzy7h2psc6v7wxx2bn
పుట:Sangitarasataran022902mbp.pdf/41
104
212333
553917
2026-04-20T14:49:25Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553917
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>గారి కుమారుకు యీడులెంట మరితిరుగుతాడు గన్న కుఁటోళ్లు గుడ్జోళ్లు కుట్టోళ్లు, ఆపైనేంటి బాబూ మరసిపోయాను.
భటు — ముసలివాండ్రు (చెప్పబోవును).
మాది — ఆఁ! తెల్సులే యిదొకదండకంలా గొత్తదిమరిగళ్తే. కుంటోళ్లు గుడోళ్లు కుంటోళ్లు ముసలోళ్లు ముదకోళ్లు ముష్టినోళ్లు యీదులెంట నడవగూడదు. అగపడాగూడదు. అట్టాయెల్తే, బంట్రోతుల్ని యీపులుబద్దలేసి బుర్రాలుదీయుమంటారు హో.
భటు — ఛీ వెదవా! యేమికూస్తావురా.
మాది ౧ — సరీగానే యేదార్త రావయ్యా.
{{right|(నిష్క్రమణము)}}
{{Center|{{p|fs125}}తృతీయరంగము — రాజవీధి</p>}}
{{rule |6em }}
{{Center|'''(సిద్ధార్థుడు, ఛన్నుడు, ప్రవేశము)'''}}
సిద్ధా - ఛన్నా! సుందరవస్తు సందర్శనమునగల్గు నానందమనుభవనీయమేకదా. యీపురరామణీయకమును గనుగొన్న నెన్ని ధర్మముల నెఱుంగవచ్చును. మనుష్యశక్తిసేకదా యీవిశాలంబైన సాలంబును గ్రహమార్గనిరోధకంబులగు నీప్రాసాదంబులును అనల్పశిల్పకలాకల్పనా విలాసనినిర్మిత ధర్మహర్మ్యఁబులును కల్పింపబడియున్నవి: పట్టిచూడ మానవశక్తి కసాధ్యమైన దేమైనయుండునా యనిపించుచున్నవికదా. లౌకికబంధంబులంజిక్కియున్న సామాన్య మానవులే తమప్రాకృతశక్తిచే నిట్టికార్యములు నెరవేర్చుచుండ, జీవికిసహజమైన స్వాతంత్య్రం
బునకు నిరోధంబులేకున్న యోగవిద్యాబలంబుచే నెట్టికార్యంబులు సాధింపరాదు. యోగమహిమచే విశ్వామిత్రుడు బ్రహ్మసృష్టికి మారుసృష్టి చేయగలిగె (ఛన్నా ఆదెసకుఁబోదమురమ్ము ముందుకునడిచి) ఈ భాగంబుననున్న మార్గంబు లెంతచక్కఁగానున్నవి.
ఛన్ను — రాజకుమారా! యీ దెసనంతట నెచ్చోటజూచినఁ దోటలను గోటలనట్టనడుమఁ గట్టబడి చుట్టునున్న చెట్టుకొమ్మల బచ్చనిపచ్చియాకులనుండి సగము సగముకన్పించు సంచితభవనసంజ్ఞలును భవనపఁజ్ఞుల ముంగిళ్లనుండి<noinclude><references/></noinclude>
okw37tm9ty628umeamm57sgs3gh8jph
పుట:Sangitarasataran022902mbp.pdf/42
104
212334
553967
2026-04-21T07:59:47Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553967
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>బయలు వెడలి సంజసి కారునగేగు అరబ్బీ పారసీ గుజ్జంబులబూన్చిన మేలై శకటసముదయంబుకు శకటసముదయ సంఘట్టనలచేతను పధిక జనకోలాహ!బులచేతను నిండియున్న ఘంటాపథంబులును నేత్రానందకరములైయున్న కదా. ఈఘంటాపథములెంతటి నేర్పరి
తనమును వెల్లడించుచున్నావొ కనగొనుము. నట్టనడుమశకటంబుపోవుటకై తాఁబేటీవీపుచందంబున మృచ్చిమోగంబుగల మార్గం
బేర్పగ్పబడియె. ఇఱుప్రక్కలలో నొకానొక్కరే క్కింతయున్నతంబుగా పాదచారులకు పధిసలకుపయోగకరంబుగా క్రాలితో వ్యవరింపఁబడి యుండె. అరెండపదెసనో, అశ్వారూఢులై స్వారివేడులునా! కులతురంగంబులు జరుగులెత్త మెత్తనిచెత్తచిదుకులతో గ్రప్పియున్న
పల్ల బాటయును గన్పించుచున్నవి చూచితినే.
సిద్ధా — ఛన్నా! యెంతవైచిత్య్రమిందు గన్పించుచున్నదో యంతటి వైపరీత్యము గొన్నట్టుచున్నది కదా.
{{left margin|5em}}<poem>సీ॥ స్వర్ణసౌధములందు సంచరించెడువారు పేదసాదకునుముష్టిబెట్టరారు
గూర్ప హియయూధములఁబూన్చి యరదమెకైడువారు కుంటిగ్రడ్డికి మేలుగూర్పఁబో
రమ్యోపవనవిహారములుసల్పెడువారు కష్టనిష్ఠురములఁగాంచలేరు
భోగభాగ్యములందు ప్రొద్దుబుచ్చెడువారు నుంచిచెడుగులగుర్తించ లేరు॥</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ కాలగతియెట్టికుటిలతఁ గాంచెనకట
కలిమితావు:ధర్మంబు గలుగ దయ్యె
బలిమిగలవారియెదజాలి గలుగదయ్య
స్వప్రయోజనపరులయో సర్వజనులు॥</poem> </div>
{{Center|'''(వేశ్యలమేళముతో, అలంకృతులగు కొందరు పురజనులు ప్రవేశము)'''}}
{{Center|{{p|fs125}}పాట. యదుకుల కాంభోజి —త్రిపుట</p>}}
{{left margin|5em}}<poem>సయ్యాటలేయాడ—సమయమిదేచూడ వయ్యారివగకండ కాండా
చెయ్యనబంగారూమేడా జాణలువీణబాడ
ఉయ్యాలయూగియాడ ఓరోరీనితోఁ గూడ॥ ॥సయ్య॥
ఉదుటిగుబ్బలరొమ్ము ఒత్తినీయధరమ్ము॥
బడపెదపానకమ్ము, ఓరోరీరారమ్ము॥ ॥సయ్య॥
కలువరేకులరెమ్ము, కన్నులదానజుమ్ము
చలమేలావీదుమోము, చందమామందులెమ్ము ॥సయ్య॥</poem> </div><noinclude><references/></noinclude>
66pk4yduad41uae83qd2gqevt54xaw7
553980
553967
2026-04-21T08:52:52Z
Brjswiki
6801
553980
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>బయలు వెడలి సంజసి కారునగేగు అరబ్బీ పారసీ గుజ్జంబులబూన్చిన మేలై శకటసముదయంబుకు శకటసముదయ సంఘట్టనలచేతను పధిక జనకోలాహ!బులచేతను నిండియున్న ఘంటాపథంబులును నేత్రానందకరములైయున్న కదా. ఈఘంటాపథములెంతటి నేర్పరి
తనమును వెల్లడించుచున్నావొ కనగొనుము. నట్టనడుమశకటంబుపోవుటకై తాఁబేటీవీపుచందంబున మృచ్చిమోగంబుగల మార్గం
బేర్పగ్పబడియె. ఇఱుప్రక్కలలో నొకానొక్కరే క్కింతయున్నతంబుగా పాదచారులకు పధిసలకుపయోగకరంబుగా క్రాలితో వ్యవరింపఁబడి యుండె. అరెండపదెసనో, అశ్వారూఢులై స్వారివేడులునా! కులతురంగంబులు జరుగులెత్త మెత్తనిచెత్తచిదుకులతో గ్రప్పియున్న
పల్ల బాటయును గన్పించుచున్నవి చూచితినే.
సిద్ధా — ఛన్నా! యెంతవైచిత్య్రమిందు గన్పించుచున్నదో యంతటి వైపరీత్యము గొన్నట్టుచున్నది కదా.
{{left margin|5em}}<poem>సీ॥ స్వర్ణసౌధములందు సంచరించెడువారు పేదసాదకునుముష్టిబెట్టరారు
గూర్ప హియయూధములఁబూన్చి యరదమెకైడువారు కుంటిగ్రడ్డికి మేలుగూర్పఁబో
రమ్యోపవనవిహారములుసల్పెడువారు కష్టనిష్ఠురములఁగాంచలేరు
భోగభాగ్యములందు ప్రొద్దుబుచ్చెడువారు నుంచిచెడుగులగుర్తించ లేరు॥</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ కాలగతియెట్టికుటిలతఁ గాంచెనకట
కలిమితావు:ధర్మంబు గలుగ దయ్యె
బలిమిగలవారియెదజాలి గలుగదయ్య
స్వప్రయోజనపరులయో సర్వజనులు॥</poem> </div>
{{Center|'''(వేశ్యలమేళముతో, అలంకృతులగు కొందరు పురజనులు ప్రవేశము)'''}}
{{Center|{{p|fs125}}పాట. యదుకుల కాంభోజి —త్రిపుట</p>}}
{{left margin|5em}}<poem>సయ్యాటలేయాడ—సమయమిదేచూడ వయ్యారివగకండ కాండా
చెయ్యనబంగారూమేడా జాణలువీణబాడ
ఉయ్యాలయూగియాడ ఓరోరీనితోఁ గూడ॥ ॥సయ్య॥
ఉదుటిగుబ్బలరొమ్ము ఒత్తినీయధరమ్ము॥
బడపెదపానకమ్ము, ఓరోరీరారమ్ము॥ ॥సయ్య॥
కలువరేకులరెమ్ము, కన్నులదానజుమ్ము
చలమేలావీదుమోము, చందమామందులెమ్ము ॥సయ్య॥</poem> </div><noinclude><references/></noinclude>
dgsyteerpze0rr5gh24vvbin3inau7r
పుట:Sangitarasataran022902mbp.pdf/43
104
212335
553986
2026-04-21T11:06:03Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553986
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఛన్ను - రాజకుమారా! యీచోటు మిక్కిలి రమ్యముగానున్నది. కొంచెము నిలచెదమా సరసవాక్కులు వినవచ్చుచున్నవి.
సర్వా — అదియేమో, యీకోలాహలము బొత్తిగా నామనస్సు నాకర్షించుటలేదు. అదెస నందుగొందుల నేముండుమో పరికించెదము గాక రమ్ము.
ఛిన్ను - రాజకుమారా! సందుగొందులలోఁ గనువిందుచేయునదేమున్నది. కొంచెముసేపు ఇచ్చటనే నిల్చిన బాగుగానుండును.
సర్వా — అట్లుకాదు. ఈసందుదారినే పోదము.
ఛన్ను — ఆజ్ఞప్రకారమే జరిగిందెద, దయచేయండు.
సిద్దా - (ముందుకునడిచి)
{{left margin|5em}}చ॥ ఇఱుకుగృహంబులు౯ మలినహేయనివాసము లెండుగాంచిన౯
ముఱికితనంబువాకిళుల మూర్కోనరాని జలప్రవాహముల్
(దుఃఖము, నారాయణరావు కవిత్వమిచ్చటికి సరి).
నుఱిమఱికొక్కుకన్నముల మన్ను నుమిన్ను నమూగుదోమలు౯
బొఱిపాపోఱిబారుపుర్వులును పుంజులఱెట్టలుగల్గుచోటులఁ౯ </div>
ఆహా! యెంత చీదరగానున్నవి యీచోటులు.
(జాతరకు బోవు ఘటధరుఁడుగు పంటకాపువచ్చును).
సర్వా — కుంభధరుఁడై పాట బాడుకొనుచుం బోవుచున్న వీఁడెవ్వఁడో.
ఛన్ను — {{left margin|5em}}<poem>సీ॥ చల్ది పెరుగుబువ్వ చట్టిలోనిడి
గాముగంగగొల్చెడి పంటకాపువాఁడు॥</poem> </div>
{{Center|{{p|fs125}}పాట</p>}}
{{left margin|5em}}<poem>పంటకాపు౼గంగానమ్మా - మంగాళామమ్మా
వంగోలుబాలమ్మా - శింగారామమ్మా॥ గం॥
బెజవాడలోనున్న - పేరైనదురగమ్మ
వుజనీమాంకాళమ్మా - ఓ అంకాలమ్మా॥ గం॥
పొదిలెముత్యాలమ్మా - పొట్టురిసోమమ్మా
ఈతముక్కలజాలా - ఓ యింద్రజాలా! గం॥
అల్లూరలుగులమ్మా - నెల్లూరిశింగమ్మా
శెల్లింతూనీ మొక్కూ - శివమాడవమ్మా॥ గం॥</poem> </div>
{{right|(నిష్క్రమణము)}}<noinclude><references/></noinclude>
n4enpq53tuk9x53bw5y2qey6ens293h
పుట:Sangitarasataran022902mbp.pdf/44
104
212336
553988
2026-04-21T11:52:12Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
553988
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సిద్ధా — ఛన్నా! అదియేమో ఆవంకం జూడుము.
ఛన్ను — రాజకుమారా! అదేకొఱ్ఱంకమ్మ యను గ్రామదేవతకు జాతర జరుగుచూన్నది.
{{left margin|5em}}<poem>సీ॥ కొఱ్ఱంకశక్తికి గొఱ్ఱవేఁటనుబట్టి
కొత్తినిల్పిరిసుమ్ము గొల్లలెల్ల॥</poem> </div>
సర్వా - ఆహా! ఆజంతువు వచ్చునా?
ఛన్ను — అంతపనిజరిగింది. రాజకుమారా.
సర్వా — (కన్నులుమూసికొని బట్ట ముఖమునకడ్డము వైచికొని);
{{Center|'''(జాతీరవాండ్రువత్తుకు గొల్లలు యిద్దఱు)'''}}
{{Center|{{p|fs125}}పాట</p>}}
గొల్ల ౧ - కొఱ్ఱంకనుగొల్చుదామ్ - గొఱేపోతునుదెచ్చుదామ్
కొఱ్ఱంబండీమీదమెట్టి - గుచ్చుడాండీ, మనము గుచ్చుదాండీ॥ కొ ॥
గొల్లలంతాగూడుదామ్ - కోలాటమేసుదామ్
గొల్లుగొల్లుమందామ్ – కల్లుదాగుదాండీ, మనము కల్లు దాగుదాండీ॥ కొ॥
సారాయీదాగుదామ్ - సాకలోణ్ని గొడ్డామ్
జోరూగాకాటన్న - సుద్దులాడ్డాండీ, మనము సుద్దులాడాండీ॥ కొ॥
{{Center|{{p|fs125}}పాట</p>}}
గొల్ల ౨ — పంబలోడా ఔగావాసరా, మేమాడ్తామ్॥ పం॥
ముత్యాలమ్మా పాటబాడరా, మేమాడ్తామ్॥ పం॥
{{right|(గొల్లలు నిష్కమణము)}}
సిద్ధా — (పరితపించుచు) ఆహా! ఎంతపాపము, వీరల విహృదయములా, నల్లఖిలలా, ఛీ యీ ప్రపంచమెంత దురితభూయిష్ఠము.
సరిగాని దూరముగా మాంసఖండంబులు వేలాడుచున్నట్లు కానవచ్చుచున్న దదియేమి.
ఛన్ను — రాజకుమారా ! అది మాంసవిక్రయార్ధ మేర్పడిన యంగళ్లు.
సిద్ధా - అబ్బా! ఘోరము, ఎన్ని జంతువులు నిష్కరణము, వధింపఁబడినవో, అయ్యో. కాని, ఆకత్తిపైకెత్తి యిరుకుగోడలసందున
నొకడు దెబ్బకొట్టుచున్నాడే అదియేమి.
ఛన్ను — రాజకుమారా! బాగుగా కొవ్వుబట్టబెంచిన యావుపెయ్యరు; కదలమెదలలేని యిరుకుసందునకుందోలి తనగుండా గత్తిచే మెడనరుకుచున్నాడు.<noinclude><references/></noinclude>
t470suqeg1zj55mncm01ui4s726uabo