వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.24 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk అలర చంచలమైన 0 2886 554061 398548 2026-04-22T09:29:51Z ~2026-24476-60 7278 554061 wikitext text/x-wiki <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #fd8; background:#fffcec;'> <!-- BOX HEAD --> <div style="background-color:#fd8; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">అలర చంచలమైన ఆత్మలందుండ (రాగం:మధ్యమావతి రాగం ) (తాళం : aadi ) </div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల|| ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచె వుయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల|| మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల|| కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల|| </poem> </div></div><!-- END of BOX --> <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #9fee9f; background:#f0fff0;'> <!-- BOX HEAD --> <div style="background-color:#9fee9f; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">alara caMcalamaina AtmalaMduMDa (Raagam: ) (Taalam: )</div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> alara caMcalamaina AtmalaMduMDa nI yalavATu cEse nIvuyyAla palumAru nucCvAsa pavanamaMduMDa nI BavaMbu delipe nI vuyyAla udAyAsta SailaMbu lonara kaMBamulaina vuDumaMDalamu mOce nuyyAla adana AkASapadamu aDDaudUlaMbaina aKilaMbu niMDe nI vuyyAla padilamuga vEdamulu baMgAru cErulai paTTa verapai tOce vuyyAla vadalakiTu dharmadEvata pIThamai migula varNiMpa narudAye vuyyAla mElu kaTlayi mIku mEGamaNDalamella merugunaku merugAye vuyyAla nIla SailamuvaMTi nI mEnikAMtiki nijamaina toDavAye vuyyAla pAliMDlu kadalagA payyadalu rApADa BAminulu vaDinUcu vuyyAla vOli brahmANDamulu voraguvO yani BIti noyya noyyanairi vUciruyyAla kamalakunu BUsatiki kadalu kadalaku mimmu kaugaliMpagajEse nuyyAla amarAMganalaku nI hAsa BAva vilAsa maMdaMda cUpe nI vuyyAla kamalAsanAdulaku kannula paMDugai gaNutiMpa narudAye vuyyAla kamanIya mUrti vEMkaTaSailapati nIku kaDuvEDukai vuMDe vuyyAla </poem> </div></div> <!-- END OF BOX --> ===బయటి లింకులు=== ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] 9n5y8oa5ezn2ahf87xjo9l3gd7z6ao9 554062 554061 2026-04-22T09:33:05Z ~2026-24476-60 7278 554062 wikitext text/x-wiki <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #fd8; background:#fffcec;'> <!-- BOX HEAD --> <div style="background-color:#fd8; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">అలర చంచలమైన ఆత్మలందుండ (రాగం: ) (తాళం : aadi ) </div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల|| ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచె వుయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల|| మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల|| కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల|| </poem> </div></div><!-- END of BOX --> <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #9fee9f; background:#f0fff0;'> <!-- BOX HEAD --> <div style="background-color:#9fee9f; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">alara caMcalamaina AtmalaMduMDa (Raagam: ) (Taalam: )</div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> alara caMcalamaina AtmalaMduMDa nI yalavATu cEse nIvuyyAla palumAru nucCvAsa pavanamaMduMDa nI BavaMbu delipe nI vuyyAla udAyAsta SailaMbu lonara kaMBamulaina vuDumaMDalamu mOce nuyyAla adana AkASapadamu aDDaudUlaMbaina aKilaMbu niMDe nI vuyyAla padilamuga vEdamulu baMgAru cErulai paTTa verapai tOce vuyyAla vadalakiTu dharmadEvata pIThamai migula varNiMpa narudAye vuyyAla mElu kaTlayi mIku mEGamaNDalamella merugunaku merugAye vuyyAla nIla SailamuvaMTi nI mEnikAMtiki nijamaina toDavAye vuyyAla pAliMDlu kadalagA payyadalu rApADa BAminulu vaDinUcu vuyyAla vOli brahmANDamulu voraguvO yani BIti noyya noyyanairi vUciruyyAla kamalakunu BUsatiki kadalu kadalaku mimmu kaugaliMpagajEse nuyyAla amarAMganalaku nI hAsa BAva vilAsa maMdaMda cUpe nI vuyyAla kamalAsanAdulaku kannula paMDugai gaNutiMpa narudAye vuyyAla kamanIya mUrti vEMkaTaSailapati nIku kaDuvEDukai vuMDe vuyyAla </poem> </div></div> <!-- END OF BOX --> ===బయటి లింకులు=== ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] kags381qfd6socnhk7hnjqsykzs2948 పుట:Sarada Lekhalu Vol 1.pdf/187 104 59344 554013 553678 2026-04-21T22:49:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554013 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|161}}</noinclude>{{c|'''సౌభాగ్యవతియగు కల్పలతకు: -'''}} '''నెచ్చెలీ !''' అవును నేనుగూడ నదియే విషయమై యోచింపుచున్నాను. విచారించిచూడ ఈ పెండ్లిండ్లరద్దుచట్టము నామోదించుటలో నామోదింపకుండుటలోగూడ ఇబ్బందులే కనుపడుచున్నవి. ఇది శారదాచట్టమువలె సులభముగా నామోదింప దగినదికాదు. దీని నామోదించితిమా భారతమహిళల నిరుపమానశీలముచే సముపార్జితమైన జగద్వందిత కీర్తికి కళంకమొదవెడు పరిస్థితు లేర్పడవచ్చును. మఱియు అవమానము, క్లేశము, చింత, మున్నగు కష్టములకు స్త్రీ గుఱికావలసి వచ్చును. కాదంటిమా? నిర్హేతుకముగా భర్తృపరిత్యాగినులైన స్త్రీల దుర్గతికి తరణోపాయము దోచుకున్నది. కాన ఈ విడాకులచట్ట మొకవంక స్త్రీలకు ఆత్మహత్యాకరముగను మరియొకవంక ప్రాణదానకరముగను కనుపించు చున్నది. దీని నింకను నిదానించి విచారించ నగును. ఒక రొక మంచి పనిని చేయుచున్నచో వారితో సరిదూగుటకు మనము యత్నించుట తప్పుగాదు. కాని చెడుగునకు గూడ పోటీబడుట యుక్తమనిపించుకొనునా? పురుషులు భార్యను పరిత్యజించుట యనుచితకృత్యమని మనమిప్పుడు భావింపుచున్నాము. భావనమేగాదు. అందులకు వారిని కఠిన<noinclude></noinclude> gcuu15w7s0xjbebcd2y4mcw1xarpeat పుట:Sarada Lekhalu Vol 1.pdf/188 104 59345 554014 553679 2026-04-21T22:55:54Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554014 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|162|శారదలేఖలు|}}</noinclude>ముగా నిందింపుచున్నాము. వారినట్లు మనము దూషింపుచు మనముగూడ నదియేపని కవకాశమును గోరుట సమంజస మగునా? కల్పలతా! దాంపత్యముయొక్క పరమార్థము మహోత్కృష్ఠమైనది. దానియొక్క లక్ష్యము కేవలము భోగలాలసతగాదు. కాన దాంపత్యధర్మమును కేవలము భౌతికదృష్టితోఁ జూచి విషయతృప్తియే పరమావధిగానెంచి పెండ్లిపై పెండ్లిగోరుట ప్రశస్తమగు యోచనకాదు. ఒక పార్శ్వమునకు వ్యాధిసోకినచో దానిని నివారించుటకు రెండవపార్శ్వమునకు గూడ నా వ్యాధిని ప్రాకించుట వ్యాధి నివారణకు మార్గముగాదు. ఒకవంక పురుషు డొనరింపుచున్న దారాపరిత్యాగము అనుచితము నక్రమము సంఘ విచ్ఛిత్తికి కారణము పాపభూయిష్టమునై హిందూసంఘసౌష్టనమునకెనలేని యపకృతిగావింపుచున్నది. నేడు స్త్రీలకు గూడ నట్టి యవకాశ మొసగినచో నాలోపము నివారణమగునని భావింపరాదు. బహుశః యిబ్బందియగును. మానవజస్మ మెప్పుడును లోపరహితముగాదు. ఎంత మంచివారియందును నేదియో యొక లోపముండితీరును. అట్టిచో నెంతయన్యోన్యానురాగముగల సతీపతులఁయందైనను నెప్పుడోయొకప్పు డేదియోయొకప్పు డభిప్రాయ భేదములు గలిగి తీరును. అంతమాత్రమునకే ఆడుది మగనిని, మగవాడు పెండ్లమును మార్చుకొనుచో నిక నాసంసారములో సారస్య<noinclude></noinclude> p55zel74spmk5z05pl68lozmpmtk4zt పుట:Sarada Lekhalu Vol 1.pdf/189 104 59346 554015 553680 2026-04-21T23:03:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554015 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|163}}</noinclude>మేమున్నది? ఒకవేళ వాదసౌకర్యార్థమై విడాకులు పుచ్చుకొందురేయనుకొందము. అటులైనను వీరి కష్టము నివారణ గాదు. ఏలనందువా మరల క్రొత్తగా కట్టుకొన్న ఆలుమగలలో మాత్రము పొరపొచ్చెములు పుట్టవని కంట్రాక్టేమున్నది? కాన కల్పలతా! ఇట్టి గంగాశంతనుల సమయములతో దాంపత్యజీవనము నిర్విఘ్నముగా చెల్లదు. తమదాంపత్య జీవితమును సుఖమయముగాను, ఒడిదుడుకులు లేకుండునట్లును జరుపుకొన దలంచుచో స్త్రీపురుషు లిరువురు పరస్పరవిశ్వాసప్రేమలు గలిగి సౌహార్దముతో నొకరిలోపముల నొకరు సైరణతో సవరించుకొని జీవితమును నడుపుకొనుటయే యుత్తమమార్గము. మఱియు విడాకులచట్టముచే మన సంఘము నెదుర్కొన బోవు మఱియొక కష్టముగూడ అపుడాలోచనీయము. మన దేశమున స్త్రీలకు సవతిబిడ్డల యెడగల ఈర్ష్య సామాన్యమైనదిగాదు. ఇందువలన బాలబాలికలు పడుచున్న యిడుమలును సామాన్యమైనవిగావు. సవతిబిడ్డలను చూచి సహింపలేక స్త్రీలు కొందఱు విషప్రయోగాది దుష్కృత్యములకుగూడ వెనుదీయకుండుట మన మనేక సమయములలో వినుచున్నాము. నేడు విడాకుల చట్టము నామోదించినచో బిడ్డలకు సవతితండ్రులుగూడ వచ్చెదరు. ఒక పురుషుని యదుపాజ్ఞలకు లోబడియున్న స్త్రీయొక్క మాత్సర్యమే సవతిబిడ్డలయెడ నధికతమమైయుండగా స్వతంత్రుఁడగు మగవాడు సవతిసంతానము నెడల నింతకంటె నిర్ష్యాళువగుటకు నవకాశము గలదు గదా. కావున విడాకులచట్టముచే బిడ్డల సుఖస్థితి కష్టభూయిష్ట<noinclude></noinclude> hxrp127j2uyt265osmrb2f3z2kki9xv పుట:Sarada Lekhalu Vol 1.pdf/190 104 59347 554016 553681 2026-04-21T23:10:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554016 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|164|శారదలేఖలు|}}</noinclude>మగును. మఱి ఆలుమగల సంసారమో నూతి ఒడ్డు బిడ్డ చందమున నెప్పటి ఒప్పుడు ప్రమాదకరమై యుండును. ఇక నట్టి సంసారములో స్థాయియెక్కడ? సుఖమేది? ప్రేమ కవకాశమెచ్చట? అన్నియు మృగ్యము. గట్టిగ మాట్లాడిన భార్య లేచిపోవునేమో ననెడిభయము మగవానికిని మగడులేచిపోవునేమో ననెడి భయమాడుదానికిని కలుగుచుండ నిట్టి పిఱికితనపు కాపురమెన్నాళ్లుసాగును. ఇట్టి దంపతులు ఏమాత్రపు సౌఖ్యమనుభవింతురు. కాన విడాకులచట్టముచే హైందవ సంసారములకు విపరీతపరిస్థితి యేర్పడుట ఒకవిధముగా యోచింప నిక్కువమనేతలంపు గలుగుచున్నది. కాని మిత్రమా! నేనిట్లు వ్రాయుటచేత తన కత్తి కెదురుకత్తిలేక భార్యయెడ నిరంకుశముగను నిర్దాక్షిణ్యముగను ప్రవర్తించెడి పురుషుల చెయిదములను నేను గుర్తింపలేదనిగాని, సమర్థింపుచున్నానని గాని భావింపకుము. తోటకూరలోని పురుగువలె స్త్రీ బహు నీచముగా పురుషులచే విసరివేయబడుచున్నదని నాకు తెలియకపోలేదు. ఇందువలన మన స్త్రీలలో పెక్కురు ఆజన్మదుఃఖముతో కుమిలిపోవుచున్నారనియు నేనెఱుగుదును. ఈ విషయము ప్రస్తావించునపుడు మన బంధుమిత్రులలోని స్త్రీలలో భర్తచే పరిత్యజింపఁబడినవారి నిర్వికారాకృతి నామనోవీధిని పొడకట్టుచున్నది. ఆ అభాగిను లెట్టి యపరాధముచేసినవారును కారు. వారి తలిదండ్రులు పుష్కలముగా ధన మీయజాలక పోవుటయో, వారు రూపవతులుకాకపోవుటయో, వారు విద్యాభిరతిగలవారగుటయో, వంధ్యలగుటయో, రోగగ్రస్త<noinclude></noinclude> hrikqowv0gw993i7nur2usjilxclotu పుట:Sarada Lekhalu Vol 1.pdf/191 104 59348 554017 553682 2026-04-21T23:17:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554017 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|165}}</noinclude>లగుటయో ఇవియే వారిని పరిత్యజించుటకు కారణములు. ఇందు వారు గావించిన నేరమేమియులేదు. అయినను వారు నిర్దాక్షిణ్యముగా భర్తలచే విడనాడబడి జీవచ్ఛవములవలె పుట్టినింట బడియున్నారు. నిజముగా నిట్టి క్రూరకర్మము తలంచినప్పుడు డైవోర్సుచట్టము నిప్పటి కిప్పుడు పుట్టిన బాగుండుననినంత మనస్సు భగ్గురుమనును. కాని మన ఆర్యసాంప్రదాయ ధర్మమునుబట్టియు, కుటుంబజీవితముయొక్క శాంతి నాశించియు, సంతానమునకు కలుగబోయెడి యుపద్రవము నాలోచించియు నించుక వెనుక ముందులరయుట యవసరమగుచున్నది. కాన ప్రత్యేక పరిస్థితులలో అనగా బాలిక గర్భాదానము కానట్టిదియు లేదా సంతానము లేనట్టిదియునై యుండి భర్త షండుడు, పిచ్చివాడు, కుష్ఠురోగి, దేశాంతరగతుడు నైనచో నట్టి బాలికకు పునర్వివాహ మొనర్పనగును. ఇదియే యాజ్ఞవల్క్యస్మృతియం దుదాహృతమైన ధర్మసూత్రము. ఇట్టి స్థితియందే స్త్రీకి పునర్వివాహార్హత నొసంగనగునని నాయభిప్రాయము. దీని కొప్పదేని జీవత్కళత్రునకు వివాహాధికారము శాసనరీత్యా నిషేధింపబడవలెను; కాని యెట్టి మినహాయింపులులేక విడాకులచట్టము నామోదించుట మాత్రము ఉచితమార్గము కాదు. నేనిట్లు వ్రాయుటచే విడాకులచట్టము వచ్చినంతమాత్రముననే దంపతులెల్లరు కుప్పలుతిప్పలుగా త్రెంపి ముడులు పెట్టుకొందురా, ఏమి నీ పిచ్చి యూహయని నీవు నవ్వెదవేమో: కాదు. కాదు! ಅಟ್ಟೆ విషమస్థితి భారతదేశమున కింతలోరాదు. కాని త్రికరణములయందు<noinclude></noinclude> 9uqaebh3ymkm91twrg9c059nd97699j పుట:Sarada Lekhalu Vol 1.pdf/192 104 59349 554018 553683 2026-04-21T23:21:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554018 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|166|శారదలేఖలు|}}</noinclude>వాక్క్రియలకంటె మనస్సునకే ప్రాధాన్య మెక్కువగదా. ఆమోదము మానసికకార్యము. ఇందే మన సదసద్వివేకము వెల్లడికావలెను. నేడు భారతస్త్రీలు డైవోర్సుచట్టము నామోదించినారనినచో ఆచరింపకపోయినను నామోదించినట్లే గదా? అందువలననే, భూతకాలమును పరిశీలించుము. భవిష్యము నాలోచించుము. వర్తమానము గుర్తింపుమని నిన్ను హెచ్చరించుట. {{rh|భావపురి||మిత్రురాలు}} {{rh|15 - 4 - 30||శారద.}} {{rule|2cm}}<noinclude></noinclude> knuukgm35dm4y0dcpn12neom2ym51o4 పుట:Sarada Lekhalu Vol 1.pdf/193 104 59350 554019 553684 2026-04-21T23:29:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554019 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|167}}</noinclude>{{c|'''సౌభాగ్యవతి కల్పలతకు: —'''}} '''నెచ్చెలీ!''' ఆసేతుశీతనగపర్యంతమైన మన భారతావనియం దంతట స్వరాజ్యోద్యమ మొక్కవిధముగా విజృంభింతమై దిగ్భ్రమ గలుగజేయుచున్నది. దేశనాయకు లెల్లరు బందీకృతులైనారు. తుదకు మహాత్ముఁడుగూడ ప్రభుత్వవశగతుడైనాఁడు. అయినను భయములేదు; విచారములేదు. తల్లి, బిడ్డ నాశీర్వదించి చెఱసాల కంపుచున్నది. భార్య, భర్తను బందీకృతుడవుగమ్మని బహూకరించి వీడ్కొలుపుచున్నది. అహో ! ఎంధుల కీయుత్సాహము? చెఱసాల దివ్యభవనమా ? చెఱసాలభోజనము దివ్యభోజనమా? కాదే! అయినను కష్టానుభవములకై వీరి కింత కుతూహలమేల? ఎందుల కీజనసముదాయముస కీయుద్యమముపై నింతప్రీతి ? సత్యము, త్యాగము, అహింస యనెడి సూత్రత్రయముచే నిర్మితమైన ఈమహోద్యమమునకు మహాపవిత్రుఁడును, సాధుమూర్తియునగు శ్రీ మహాత్మాగాంధి తండ్రియు నడుపువాడునగుటయే యీ యుద్యమమున కింతపూజ్యతయు, వ్యాప్తియు గల్గుటకు కారణము. లోక మెప్పుడును సంపదను లెక్కసేయదు. అధికారమును మన్నింపదు. బలమును గణింపదు. పాండిత్యప్రకర్షను చూడదు. సత్యమునే లక్షించును. త్యాగమునే హర్షించును. అహింసనే గౌరవించును. లోకైకపూజ్యుడగు మహాత్ముని<noinclude></noinclude> j9eg8h3h8647lpzxci3e0mah9zd5cx8 పుట:Sarada Lekhalu Vol 1.pdf/194 104 59351 554020 553685 2026-04-22T01:14:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554020 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|168|శారదలేఖలు|}}</noinclude>యం దీసుగుణములెల్ల విరాజిల్లుచుండుటచేతనే అఖిలప్రపంచ మాతని పూజించుచున్నది. ప్రేమించుచున్నది. ఆహా ! ఇట్టి మహనీయవ్యక్తి పరమపావనమైన మన భారతదేశమున నుదయించుటయు, ఈ పూజ్యచరితునకు మనము సమకాలికుల మగుటయు నాతని సత్యాగ్రహ అహింసాత్మికమగు ధార్మికోద్యమమును కన్నులార గాంచగల్గుటయు నిజముగా మన భాగ్యమే. <poem> {{left margin|5em}} శ్లో॥ పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ ధుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామియుగేయుగే యదాయదాహి ధర్మస్యగ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం నృజామ్యహం. </poem> 'ఏకాలమున ధర్మమునకు హానికలుగునో, అధర్మమునకు వృద్ధికలుగునో యప్పుడెల్ల నేను వచ్చుచున్నాను' అను శ్రీ గీతావచనప్రకారము శ్రీ మహాత్ముడు ఉదయించియున్నాడు. తల్లి, దుర్భరమగు గర్భక్లేశము ననుభవించుట వలననే పున్నమచంద్రునివంటి కుమారుని బడయగలిగినట్లు మన దేశము పరాధీనతాదిక్లేశము లనుభవించుటవలననే యిట్టి మహాపురుషుని గాంచగల్గెను. పేదల బ్రోచుట, దీనుల రక్షించుట, పరాధీనుల బంధవిముక్తులను గావించుట ఎప్పుడును సజ్జనుల కర్తవ్యము. నేడు లోకైకపూజ్యుడగు మహాత్ముఁడు గూడ నిజదేశపు దుస్థితిగని దుఃఖార్తుడై ఇట్టి మహత్కార్యమును పూనుకొనినాడు. ఈ మహాపర్వసమయమున నా మహాత్ముని యుద్యమములో జేరి కార్యపరతంత్రులైనవారు<noinclude></noinclude> 9nbg9rx5lep48wck7y3ej94bxwucuxl పుట:Sarada Lekhalu Vol 1.pdf/195 104 59352 554021 553686 2026-04-22T01:21:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554021 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|169}}</noinclude>ధన్యులు. వానరయూధములు రామకార్యమున పాల్గొని పావనమైనట్లు నేడు మహాత్ముని యుద్యమమున పాల్గొనినవారెల్లరు పునీతులగుదురు. నేటి యీ ధార్మికయుద్ధము బాహుబలమునకు సంబంధించినదిగాదు. శస్త్రాస్త్రములతో గూడినదికాదు. కేవలము ప్రభుత్వముతో పోరాడుటే దీని లక్ష్యముకాదు. దయాసత్యశౌచవిహీనమై విదేశవ్యామోహవల్లరులం దగిలి ఆత్మగౌరవమును గోల్పోయి కర్తవ్యములు మఱచి యున్న భారతజాతికి చిత్తసంస్కారముగావించి కర్తవ్యపరాయణులఁజేయుటయే నేటి మహాత్ముని శాంతిసమరముయొక్క పరమార్థము. ఈ ధార్మికసమరములో భారతదేశమునం దుదయించిన యేవ్యక్తియు చేరకయుండుటకు వీలులేదు. ఎవరు దీనికి దూరులగుదురో వారు ధర్మమునకు దూరులు; సత్యమునకు దూరులు; పరమాత్మునకే దూరులు!! కల్పలతా! ఇట్టి సత్సమయముసగూడ ఆత్మోపలబ్ధిని బడయజాలనివారు, నిజముగా సర్వదూరులగుట నిక్కముగదా! అయితే ఇందు మన స్త్రీల కర్తవ్యమేమి? అది యిపుడు మనము యోచింపవలసిన మాట. కాని దీని కింతగా యోచించవలసిన పని ఏమి? రాముని వెనువెంట తరలిన సీతాసాధ్వీమణి చందమున ననవరతము మహాత్ముని యడుగుజాడల నడచుచు పుత్రులును, భర్తయుగూడ బందీకృతులైనను నిరుత్సాహమనునది లేక చింతయనునది యెఱుగక దాదాపు అరువదేండ్లు సమీపించినను వ్యగ్రోత్సాహముతో కార్యరంగమున నిలిచి పని చేయుచున్న బాబుజీప్రియపత్ని కస్తూరిబాయియే, మన స్త్రీల<noinclude></noinclude> hzoq7jsq06z4n23zeh5brbupogyni0l పుట:Sarada Lekhalu Vol 1.pdf/196 104 59353 554022 553687 2026-04-22T01:28:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554022 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|170|శారదలేఖలు|}}</noinclude>కాదర్శము. మహాత్ముడు చెఱసాలకేగునపుడు భార్య కేమి చెప్పుదురని యడుగ "నే నేమియుచెప్ప నక్కఱలేదు. ఆమె చాల ధీరురాలు" అనెనట. నేడు భారతనారీమణులెల్ల రట్టి ధీరురాండ్రు కావలెను. జిలుగువస్త్రములందును, నాగరికపు పరికరములందును, భోగద్రవ్యములందును మోహమును విడనాడుకొనవలెను. ఆత్మసమర్పణమునకు భారతసాధ్వి, పేరుమోసినది. కష్టసహిష్ణుత నామెకు నేర్పవలసిన పనిలేదు. త్యాగశీలత నామె వల్లెవేసినపాఠమే. ఆమెకు కావలసినదెల్ల స్వాతంత్య్రము. భారతదేశము బ్రిటిషుప్రభుత్వవశగతమై యున్నట్లు భారతసాధ్వి పురుషహస్తగతయైయున్నది. ఆ పిడికిలి సడలెనా భారతమహిళ సామర్థ్యజ్యోతియొక్క యుజ్వలకాంతి దృగ్గోచరమగును. అదిగో! అప్పుడే కనుము. భర్తలయొక్క ఆజ్ఞచే స్వతంత్రతనుబడసి కార్యక్షేత్రమున ప్రవేశించిన భారతమహిళామతల్లుల యుజ్వలనామము లెట్లు పునఃపునఃపఠనీయములై తనరారుచున్నవో! ఆంధ్రదేశమున లక్ష్మీబాయమ్మ, మద్రాసు రాజధానీనగరమున దుర్గాబాయమ్మ, గుజరాతిరాజ్యమున కస్తూరిబాయి, బొంబాయియందు కమలాదేవి ఛటోపాధ్యాయినీసరోజనీదేవులు, సంయుక్తరాష్ట్రములలో నెహ్రూకుటుంబపు అత్తకోడండ్రు యెట్లు కార్యశూరురాండ్రై విరాజిల్లుచున్నారో! దుర్గాబాయమ్మగారిని - నేను గత నవంబరునెలలో జరిగిన ఆంధ్రమహిళాసభలో గాంచితిని. వయసు పాతికేండ్ల<noinclude></noinclude> 8m0icr2ytj055qovm5ocvzulz3whjmq పుట:Sarada Lekhalu Vol 1.pdf/197 104 59354 554023 553688 2026-04-22T01:34:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554023 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|171}}</noinclude>లోపు. మనిషి కొంచెము కుఱుచ. ఆకృతిలో ఇంచుక బొద్దు. మేఘగంభీరనినదమువంటి కంఠస్వరము. సుప్రసన్నానములోని యుజ్వలతను గాంచి రక్తరేఖాంచితమైన ఆమె నేత్రయుగళిలో యామె ధైర్యగాంభీర్యముల నేనప్పుడే చదివితిని. ఆమె రెండుపన్యాసములీయ వింటిని. రెండిఁటియందును నామె శౌర్యరస ముట్టిపడునట్టులే భాషించెను. అబ్బో! అపరఝాన్సీ రాజ్ఞి యనిపించుచున్నదే యనుకొంటిని. తదుపరి ఆంధ్రరాష్ట్రసభలో "భారతదేశ మెన్నడును నొరులయాచించి యెఱుగదు. స్వాతంత్ర్యమునుగూడ యాచించదు. నిజప్రజ్ఞచేతనే బడయు”నని యామె పల్కిన పల్కులు మా అన్నగారు నా కెఱిగించిరి. అప్పుడు నేనిచ్చిన నామధేయ మీమెకు తగును అనుకొంటిని. నేనిట్లు తలఁచిన కొలదిమాసములకే శ్రీ దుర్గాబాయమ్మసోదరి రాజధానీనగరనాయకత్వమువహించి ధార్మికసమరము నడుపుటజూడ ఆశ్చర్యమగుచున్నది. సోదరికి జయమగుగాక! ధీరురాలగు దుర్గాబాయమ్మ నాయకత్వము వహించినది. అవకాశముగల చేడియ లందు పాల్గొని యుద్యమము సాగించుచున్నారు. తదితర పల్లీపట్టణములందెల్ల యీ యుద్యమ మిట్లే సాగుచున్నది. దీనిని సాగించుచున్న సోదరీమణుల కార్యదీక్ష సంస్తవనీయమైనది. వారి కార్యపరతచే పేదలపెన్నిధియైన ఉప్పుగల్లు బంధవిమోచనమును బడయునేని, దుష్టమైన మద్యపాన మడుగంటునేని, ఉప్పుగల్లుకు కొఱయైన దరిద్రులును త్రాగుబోతులగు భర్తలవలన సంసార<noinclude></noinclude> 5k06sxyn8wz0vdhhekc24zeoe3z1vku పుట:Sarada Lekhalu Vol 1.pdf/198 104 59355 554025 553689 2026-04-22T01:40:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554025 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|172|శారదలేఖలు|}}</noinclude>ములు గుల్లయైపోవ తిన తిండి, కట్ట బట్ట లేకఅల్లాడు పేద కుటుంబినులును వారికి జే జే లర్పింతురు. ఇఁక నేకారణముచేనైన నీ ధార్మికోద్యమములోఁజేరి సేవచేయజాలని సాధ్వుల కర్తవ్యమేమియో విచారింతము. ఏధర్మమునకైనను నేసత్యమునకైనను మనము నిక్కువముగా నర్పించవలసినది అంతఃకరణము. అంతఃకరణమే దాని కీయబడదేని కన్నులు చూచుగాక ! చెవులు వినుగాక ! జిహ్వలు పలుకుగాక ! చేయి చేయునుగాక ! దానిలో సారస్యములేదు. నిర్మలాంతఃకరణమే దాని కర్పితమయ్యెనేని నివియన్నియు నిబద్ధమైనను నాధర్మమునకు హానిలేదు. ఆసత్యమునకు చెఱుపులేదు. కాన మహాత్ముని ధార్మికోద్యమమును మనము మనస్ఫూర్తిగా నంగీకరించితిమేని యెవ్విధముననైన తోడ్పడగల్గుదుము. చంద్రుని కొక నూలుపోగన్న సామ్య ముండనేయున్నది గదా. అది కేవలము సామెతయేగాదు. అఖిలభారతీయ హృదయాకాశము షోడశకలాపరిపూర్ణుడై వెలయుచున్న మహాత్మాగాంధీచంద్రుడుగూడ ఆ నూలుపోగునే కోరుచున్నాడు. రాట్నమువలననో తకిలీవలననో ఆ నూలుపోగునైన సాధించి మహాత్ముని కర్పించమేని, యానూలుచే నేయబడిన వస్త్రముల ధరించమేని మనజన్మమే వ్యర్థము. కల్పలతా! నీవు రాట్నముపెట్టితివా లేకతకిలీ నభ్యసించుచుంటివా? నా<noinclude></noinclude> ng9knxgc1ayr5k1x2uhcfiavetn1rgj పుట:Sarada Lekhalu Vol 1.pdf/199 104 59356 554026 553690 2026-04-22T01:44:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554026 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|173}}</noinclude>అభిప్రాయమైనచో రెంటిని నేర్చుకొనుటయే కర్తవ్యము. ఏది వీలైనపుడు దానిచే నూలునుదీయవచ్చును. నూలే మన ఆర్థికదాస్యవిమోచనమునకు పరమౌషధము. {{rh|భావపురి||మిత్రురాలు}} {{rh|15 - 5 - 30||శారద.}} {{Css image crop |Image = Sarada_Lekhalu_Vol_1.pdf |Page = 199 |bSize = 548 |cWidth = 110 |cHeight = 23 |oTop = 363 |oLeft = 218 |Location = center |Description = }}<noinclude></noinclude> ha69y5c6e4so6574yi0ge1y7kcf7w7w 554027 554026 2026-04-22T01:45:16Z శ్రీరామమూర్తి 1517 554027 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|173}}</noinclude>అభిప్రాయమైనచో రెంటిని నేర్చుకొనుటయే కర్తవ్యము. ఏది వీలైనపుడు దానిచే నూలునుదీయవచ్చును. నూలే మన ఆర్థికదాస్యవిమోచనమునకు పరమౌషధము. {{rh|భావపురి||మిత్రురాలు}} {{rh|15 - 5 - 30||శారద.}} {{rule|2cm}}<noinclude></noinclude> 1iowyyo2o7xfd7ang8hn6p9fmdyfl6u పుట:Sarada Lekhalu Vol 1.pdf/200 104 59357 554028 553691 2026-04-22T01:51:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554028 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|174|శారదలేఖలు|}}</noinclude>{{c|'''సౌభాగ్యవతియగు కల్పలతకు :-''' '''నెచ్చెలీ!''' నీవువ్రాసిన దీర్ఘలేఖ చేరినది. నీకు జాబు వ్రాయని కారణము నీపై కోపమువచ్చియుగాదు; నీపై ప్రేమ తొలగియుగాదు; నాకు సోమరితనము బలిసియుగాదు; నీవు నాజాబున కెదురుజూచుచుందువనియు, వ్రాయకున్న నిష్ఠురవాక్యబాణహతిచే నన్ను నొప్పింతువనియు నేను మాటి మాటికి తలంచుచునేయున్నాను. నేర మొప్పికొని శిక్షకు సిద్ధపడియున్న అపరాధనే గనుక నీమందలింపులు నాకు వింతగా నుండలేదు. కాన నీవు వేసిన ప్రశ్నాపరంపరలకిక సమాధాన మిచ్చుటకు యత్నింతును. "ప్రస్తుత ఉద్యమకారణమున సకలవ్యవహారములు కట్టుబడిపోయి మనుజులు సోమరులై పోవుచున్నారు. నీకు గూడ అదే వచ్చిన”దంటివి. నీ వీవిషయమున చాలపొరబడినావు. ఎందువల్లననగా నేను నీకు జాబువ్రాయుటకైన కాలమును వెచ్చింపక ఈమాసమంతయు తదేకదీక్షగా నూలువడికితిని ఈ గ్రీష్మఋతువంతయు నిదేవిధముగా సాగించినచో రెండు కడుచక్కని వడుకునూలుచీరలను నేయించుకొందును. వ్యర్థములైన లేఖారచనములను కట్టిపెట్టి యిట్టికార్యదీక్ష నవలంబించుట సోమరితనమా స్వధర్మానుష్ఠానమా? ఇది నా<noinclude></noinclude> 5we8rqbd030k3hcv86ofieizo57on12 554030 554028 2026-04-22T01:52:04Z శ్రీరామమూర్తి 1517 554030 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|174|శారదలేఖలు|}}</noinclude>{{c|'''సౌభాగ్యవతియగు కల్పలతకు :-'''}} '''నెచ్చెలీ!''' నీవువ్రాసిన దీర్ఘలేఖ చేరినది. నీకు జాబు వ్రాయని కారణము నీపై కోపమువచ్చియుగాదు; నీపై ప్రేమ తొలగియుగాదు; నాకు సోమరితనము బలిసియుగాదు; నీవు నాజాబున కెదురుజూచుచుందువనియు, వ్రాయకున్న నిష్ఠురవాక్యబాణహతిచే నన్ను నొప్పింతువనియు నేను మాటి మాటికి తలంచుచునేయున్నాను. నేర మొప్పికొని శిక్షకు సిద్ధపడియున్న అపరాధనే గనుక నీమందలింపులు నాకు వింతగా నుండలేదు. కాన నీవు వేసిన ప్రశ్నాపరంపరలకిక సమాధాన మిచ్చుటకు యత్నింతును. "ప్రస్తుత ఉద్యమకారణమున సకలవ్యవహారములు కట్టుబడిపోయి మనుజులు సోమరులై పోవుచున్నారు. నీకు గూడ అదే వచ్చిన”దంటివి. నీ వీవిషయమున చాలపొరబడినావు. ఎందువల్లననగా నేను నీకు జాబువ్రాయుటకైన కాలమును వెచ్చింపక ఈమాసమంతయు తదేకదీక్షగా నూలువడికితిని ఈ గ్రీష్మఋతువంతయు నిదేవిధముగా సాగించినచో రెండు కడుచక్కని వడుకునూలుచీరలను నేయించుకొందును. వ్యర్థములైన లేఖారచనములను కట్టిపెట్టి యిట్టికార్యదీక్ష నవలంబించుట సోమరితనమా స్వధర్మానుష్ఠానమా? ఇది నా<noinclude></noinclude> j6xwoizy9yn6ok8d5aji6lpmbcgq68t పుట:Sarada Lekhalu Vol 1.pdf/201 104 59358 554031 553692 2026-04-22T01:58:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554031 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|175}}</noinclude>యొక్క దానిమాటయేగాదు. దేశమంతట నిట్టులే వ్యర్థముగా కాలము బుచ్చువారిచే నూలు తీయబడుచున్నది. విద్యాధికులు, సామాన్యజనులు, ఉన్నతోద్యోగులు, పాటకపుజనులు వేయేల స్త్రీలు, పురుషులు, బాలబాలిక లిదేవిధముగా నూలు వడుకుచున్నారు. వ్యర్థప్రసంగములచేతను నిరుపయోగ సంచారములచేతను వ్యర్థమైయుండెడి మానవశక్తి నిజముగా నీఋతువులోనే కొంచెములో కొంచెమైన సద్వినియోగపడినదని చెప్పవచ్చును. ఈవిధముగా భారతీయుల సహజమగు సోమరితనమించుక విచ్చిపోయియుండ దీనినే సోమరితన మనుట నా కాశ్చర్యమగుచున్నది. “మనదేశమున ప్రతివత్సర మీవేసవిలో ఎన్ని రాచకీయసభలు, ఎన్ని సారస్వతసభలు, ఎన్ని కళాపరిషత్తులు, ఎన్ని సాంఘిక సమావేశములు, ఎన్ని వినోదప్రదర్శనములు. అబ్బా! లెక్కయున్నదా? అసంఖ్యాకముగా జరుగు చుండెడివి! అవియన్నియు నడుగంటినవి సరిగదా సాధారణముగా జరిగెడి సినిమాలు, సర్కసులు, నాటకములుగూడ లేకుండపోయినవి. తుట్టతుదకు మన యుష్ణమండలములనుండి యేటేట ఆరోగ్యమునకో, ఆనందమునకో, అధికారప్రాపకమునకో నీలగిరి, బెంగుళూరు ప్రాంతముల కేగెడి విద్యాధికులుయాత్రలు గూడ మానుకున్నారు. ఇట్లు సర్వముకట్టువడిపోయి దేశము నిర్జనారణ్యమువలె చూపట్టుచున్నది. కాబట్టి ఈ మహోద్యమము దేశమునకు శుభస్థితిని చేకూర్చలేదు సరిగదా విశేషించి ఉపద్రవస్థితికి గొనిపోయిన”దని వ్రాసితివి. కల్పలతా! దేశమంతయు నొకేశిక్షాస్థానమై దేశీయులెల్ల రొకే<noinclude></noinclude> imtsafg4m30k03zslxut7lvkgvsxxrs పుట:Sarada Lekhalu Vol 1.pdf/202 104 59359 554055 553693 2026-04-22T08:28:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554055 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|176|శారదలేఖలు|}}</noinclude>నేరస్థులై చెఱసాలలే స్వీయగృహంబులై యెల్లరొక్కవిధముగా గాసిలుచుండ నిపుడు వేడుకలకు, వినోదములకు, కథలకు, కబురులకు, వేసవియాత్రలకు అవకాశమెక్కడ? నేడు భారతదేశమందంతట నెచ్చటనైనకనుము. కద్దరుకపడా, చరఖా అవాజ్. ఒక్కటే దృశ్యము. దేశమునకు కావలసిన దది. మహాత్ముడు కోరుచున్నదది. ప్రజలు చేయవలసినదది. ఇది ప్రజల కనీసధర్మము, ఉడుతభక్తి. దేశహితైకపరాయణులగు మహనీయులు సల్పుచున్న మహాత్యాగముతోగూడిన కార్యవారాశియందిది బిందుమాత్రము; అయితే బ్రహ్మాండముయొక్క నిర్మాణము పరమాణువులయొక్క సంయోగము చేతనేగదా? "మనభారతదేశమునందు స్త్రీలలో త్రాగుడు లేదుగదా. కాన మద్యనిషేధప్రచారములందు స్త్రీ లేల జోక్యము గల్గించుకొనవలెను? ఇది మిక్కిలి యసమంజసముగా నున్నది.” యని నీవువేసినప్రశ్న నీవడిగిన పలువిధప్రశ్నలలోకెల్ల నద్భుతముగా నున్నది. మనదేశమునందు స్త్రీలలో త్రాగుడులేదను మాట వాస్తవమే. ఎక్కడైన నూటికి కోటికి ఒక్కస్త్రీ తాగుడు మఱగిన దున్నను అదినిషేధప్రచారము చేయతగినంత విశేష విషయముగాదు. కాని స్త్రీ పురుషుల చేరికచే కుటుంబమేర్పడుచున్నది. అందు సంపాదించుకొనివచ్చి కుటుంబమును పోషింపవలసిన పురుషుఁడు, తన సంపాదనయందు నిత్యము త్రాగుడుకొఱకు కొంతవ్యయపరచుచున్నచో ఆనష్టము స్త్రీది<noinclude></noinclude> ltehkq45wdwk08g0k8wuxeckiy2ker0 పుట:Sarada Lekhalu Vol 1.pdf/203 104 59360 554056 553694 2026-04-22T08:36:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554056 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|177}}</noinclude>కాదా? అట్లుగాక పురుషుడు తనసొమ్ము నెట్టిదుర్వ్యయము చేయక జాగ్రత్తపెట్టుచుండినచో దానిలాభము స్త్రీదిగాదా! స్త్రీ పురుషుల చేరికచే నేర్పడిన కుటుంబమునందు స్త్రీ చేసిన వ్యయము పురుషుని, పురుషుఁడుచేసినవ్యయము స్త్రీని బాధింపకుండుటెట్లు? అదియట్లుండ మద్యమువంటి దుష్పదార్థ సేవనముచేగల్గు హాని కేవల మార్థికమునకే సంబంధించినది గాదు. త్రాగుడు సర్వవిధభ్రష్టతకు కారణము. ఏస్త్రీయైనను భర్తచే నధికముగా బాధింపబడుచున్నదనుచో నామె త్రాగుబోతువానిభార్యయే యనుట నిక్కము. కావున స్త్రీ స్వయముగా త్రాగకపోయినను మద్యనిషేధయత్న మామెకు గాని పనియనుటకు-వీలులేదు. మిత్రమా! దుర్భరమగు ఎట్టి పన్నులకైన నోర్వవచ్చును. విదేశవస్త్రములనైన హర్షింపవచ్చును. కాని శరీరపోషణ కేమాత్ర మవసరములేనిదియు, నైతికముగా విశేష హానిని గల్గించునదియు, దుర్భరదారిద్ర్య కారణమును నగు త్రాగుడుమాత్రము వాంఛింపదగినదికాదు. విదేశవస్తువులవల్లగాని, పన్నులవల్లగాని మనుష్యునకు గల్గెడిహాని ధనలోపము మాత్రమే; కాని మధుపానరతిచే మానవుల మనుష్యత్వమే నశించిపోవును. మధుసేవకుల కుటుంబములు నరకసమములు. ఇట్లు వ్రాయుటచే విదేశవస్తువులనుగాని, అధికమగు పన్నులనుగాని హర్షించుచున్నానని భ్రమపడుచుంటివేమో? అదిగాదు. జలగలు రక్తమును పీల్చినచందమున నిరంతరము భారతీయుల ద్రవ్యమును పీల్చివేయుచున్న విదేశపుసరుకులును,<noinclude></noinclude> saigfx5qy0n5misa34xe00jydkbsbs7 పుట:Sarada Lekhalu Vol 1.pdf/204 104 59361 554057 553695 2026-04-22T08:47:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554057 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|178|శారదలేఖలు|}}</noinclude>పేదభారతీయుడు భరింపజాలని యధికపు పన్నులును నెంతతగ్గిన భారతదేశమునకంతశ్రేయము; కాని త్రాగుడుకును వీనికిని పోల్చినచో వీనికంటె త్రాగుడువలని నష్టమే యధికతమమని రూపించుటకే యట్లుపల్కితిని. త్రాగుబోతువానిభార్య కూలివాని పెండ్లామగుగాక, జమీందారునిఇల్లాలగుగాక ఆమెదుఃఖము వివరింపరానిది. ఇఁక నామె సంతానవతియేయగునేని నా దుస్థితి వర్ణించుటకే శక్యముగాదు. ఈసందర్భమున ఒకవృత్తాంతము జ్ఞాపకము వచ్చుచున్నది. అది యిప్పట్టున వివరించుట అప్రస్తుతప్రశంస కాదనుకొందును. ఇప్పటికి కొన్నియేండ్లయినది — ఒకనాడు నేనొక త్రాగుబోతుకథను నా ప్రియస్నేహితురాండ్రలో నొకామెకు చదివి వినిపించుట తటస్థించెను. ఆమె ఆకధను చదువుమని కోరుటచేతనే నేను చదువుటకు పూనుకొంటిని. నేను చదువుచుంటిని. ఆమె వినుచుండెను. ఆకథలో త్రాగుబోతు భర్తవలన నాతనిపత్ని పడెడిబాధలు, వినినకొలది నామిత్రురాలివదనము వివర్ణమై మ్లానమైపోవుచుండెను. ఆకథా సందర్భములు మిక్కిలి జాలికరముగానుండి నాకు చదువుటకుగూడ నోరాడకుండునంతటి దుఃఖమును గల్గించుచుండుటచే కథా నాయకియందలి కనికరముచేతనే నా మిత్రురాలట్లు విచారపడు చుండెననుకొంటిని. కథలో మితిమించిన పెనిమిటిత్రాగుడుచే నాకుటుంబిని నిర్ధనురాలగుటయు, అవ్యక్తులగు నామెబిడ్డ లదిగావలయు నిదిగావలయునని తల్లిని పీడించుటయు, ఆమె వారి<noinclude></noinclude> nwnu1ud2tayzeu9shzc6j5edcg4d56u పుట:Sarada Lekhalu Vol 1.pdf/205 104 59362 554059 553696 2026-04-22T08:55:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554059 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|179}}</noinclude>వాంఛితము నీడేర్పజాలక దుఃఖించుటయు గలభాగమువచ్చెను. మిక్కిలి జాలిగొలుపు నాపట్టును దుఃఖావరోధముచే వడివడిగా జదువజాలక ఆపి, ఆపి చదువుచున్న నేనొకమా ఱకస్మాత్తుగా తలయెత్తి నామిత్రురాలివంక చూచితిని. ఏమి చెప్పుదు నప్పటి దృశ్యము? నామిత్రురాలి కన్గవనుండి సంతతధారగా బాష్పములు స్రవించుచుండెను. ఆకన్నీటిధారలు చూడగనే నాగుండె లవిసిపోయెను. అంతనేను నామిత్రురాలితో “రుక్మిణీ! ఇదేమి ఇట్లాఏడుస్తున్నావు ? కల్పితగాథలు సత్యములని భావించుచున్నావా ఏమి ? ఎబ్బే ఏడ్పుమానూ; కథచదవడం మానివేస్తా” నంటిని "నిత్యము అనుభవములోనున్న కష్టములు, దుఃఖములు నీవు చదువుట మానివేస్తేమాత్రము తొలుగుతాయా? కథ ఆపవద్దు. శారదా ! చదువుము. చదువుము.” అని నామిత్రురాలు దుఃఖగద్గదికంబగు స్వరముతో బల్కెను. నాచే మిక్కిలి యదృష్టశాలినియని భావింపఁబడుచున్న నామిత్రురాలి జీవితమింత దుఃఖభాజనమైనదని యాకస్మికముగా దెలియుటచే నేను నివ్వెఱ జెందితిని. నేనెప్పుడును ఊహింపని యొక రహస్యము నాపుస్తకమట్లువిచిత్రముగా బయటపెట్టెను. నా కిక కథ చదువుటకు బుద్ధిపుట్టలేదు. చేతిలోని పొత్తమును క్రిందవేసి నామిత్రురాలి నోదార్చుచు "రుక్మిణీ ! నీపెనిమిటి కిట్టి దురభ్యాసమున్నదా? ఒకనాడును చెప్పకపోతివి!” అంటిని. “ఏ మొగముపెట్టుకొనిచెప్పను? బి. యే. చదువుచుండగానే సారాదేవత మాయిల్లు నాక్రమించినది. ఆనాటినుండి యీనాటివఱకు ఆసారాదేవతవలన నేను పడుచున్న<noinclude></noinclude> i8xnsnz8t7tfvj9p1atvjexzec3w409 పుట:Sarada Lekhalu Vol 1.pdf/206 104 59363 554060 553697 2026-04-22T09:04:15Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 554060 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|180|శారదలేఖలు|}}</noinclude>క్లేశములకు మితిలేదు. నేనొక్కదానినైతే ఎట్లాగో తినో, తినకో ఏడుస్తును. కడుపులో కాళ్లుముడిచిపెట్టుకొని పడుకోకుండా పిల్లలు నల్గురు; తెల్లవాఱిలేచినదిమొదలు యెన్నివిధముల తంటాలు! ఇంటికర్చునిమిత్తము నాచేతిలోకొక్కొక్క రూక రాలుటకెంతయో శ్రమ. కాని ఆసీమ సారాయములు సడీచప్పుడు లేకుండా వందలకొలది రూప్యములను కబళించి వేస్తుంటాయి. సొగసైన మాదిరులలో అందమైన బిరడాలతో మా బీరువల నలంకరించే ఆ నిర్జీవపు సీసాలలో తమ్ము కొన్న యజమానునేగాక కుటుంబాలు కుటుంబాలు కూల్చివేసే అద్భుతశక్తివున్నది. శారదా! నీవాకథ చదువుటచే నాకథయే నాకు జ్ఞాపకమువచ్చి యింత దుఃఖమువచ్చినది. ఏమిచేయను? ఆపుకోలేకపోయినాను” అని నామిత్రురాలు మరల నధికముగా విలపించెను. కల్పలతా ! నామిత్రురాలు పేదరాలుగాదు. గొప్పయింటిబిడ్డ; మంచివిద్యావతి. ఆమె యొడలిపై విలువగల నగలున్నవి. ఆమె కట్టుకున్నది బెంగళూరుపట్టుచీర. ఆమె పెనిమిటి విద్యాధికుఁడు. ఉన్నతోద్యోగి. పైకిచూచువారి కామె గొప్పయదృష్టశాలినివలెనే కాన్పించును. అయిననేమి ? భర్త యలవాటుపడియున్న సీమసారాయము లామె నెంతపరితప్తమానసనుగా జేయుచున్నవో కనుము. త్రాగుబోతుదనముచే శ్రీమంతులైనవారి స్థితియే యిట్లుండ ఇక పేదకుటుంబినుల నిది యెంతదుఃఖపెట్టు చున్నదో చెప్పవలసినదేమి? పేదవారల పూరిగుడిసెల నొకపరిచూడుము.<noinclude></noinclude> 543iqdf3pwsurc1zf7llb3hpg4qaug2 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/83 104 186346 553999 504569 2026-04-21T13:42:22Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 553999 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సేసిన గతిం ప్రాయశ్చిత్తంబయ్యె, నింక బయలు వెడలుం' డనుటయు; రాజపుత్రునితోడంగూడ నమ్మునులు బయలుదేఱి, ధౌతవస్త్రంబులు ధరియించి, హంసధ్వజునిచెంతకు వచ్చి యతనివృత్తాంతంబు వివరించుటయు, నతండు సంతోషభరితమానసుండై, 'తప్తతైలకటాహంబున నవగాహనంబు సేసిన నిన్ను శ్రీహరి రక్షించెం గావున నీవు ధన్యుండవు. నాయాజ్ఞ చెల్లించి సత్యంబు నిర్వహించి వచ్చితివి. కావునఁ గులోద్ధారకుండవు. సేనాధిపత్యం బొసంగెద' నని యాలింగనంబు సేసిన, దండ్రికిఁ జాగిలి మ్రొక్కి కరంబులు మోడ్చి, తొంటికరణి సముజ్జ్వలభూషణంబులు ధరియించి, నిజతేజంబున దశదిశాభాగంబులు ప్రకాశింపఁజేయుచుఁ దన్ను దండించిన శంఖలిఖితులుం దక్కినజనంబులు బహువిధంబులం గొనియాడ రథంబు నధిరోహించె. {{p|ac|fwb}}హంసధ్వజు డధ్వరాశ్వమును బట్టించుట</p> అవ్విధంబున సుధన్వుఁడు తండ్రిచే సేనాధిపత్యంబు గైకొని, రథచక్రసముద్భవంబులగు దువ్వలచే సప్తసాగరంబు లిఱింకు లింకంజేయుచు, భేరీపటహడిండిమశంఖకాహళాదివాద్యధ్వనులచే దిగ్గజంబుల చెవుడుపడంజేయుచు, గైదువులు సారించుటవలనం బొడము మిణుంగుఱులచే సూర్యునకు వేడిమిచేయుచు, బాలసూర్యకిరణప్రకాశంబులైన మణిమయధ్వజంబుల యౌన్నత్యంబుచే నాకాశంబు తూట్లుపడఁ జేయుచుఁ, చటులధాటీనిరాఘాటంబులైన చతురంగబలంబులు నలుదిక్కులం గ్రమ్మి చనుదేఱ విలునారి మ్రోయించుచు, నాహవోత్సాహంబున వెడలు నగ్గలిక గనుంగొని హంసధ్వజుండు సంతసంబున నయ్యధ్వరాశ్వంబుం బట్టి తెప్పించి, పద్మవ్యూహమధ్యంబున నుంచి తాను ముందుగాఁ గయ్యంబు వేడుక మొగంబునం జెంగలింపఁ గదలివచ్చి, ధ్వజంబు లనియెడి వృక్షంబులును, బతాక లనియెడి తీఁగెగుంపులును, వీరభటు లనియెడి సింహశార్దూలంబులునుం గలిగి ప్రవేశింపఁగూడని కతంబున, మహారణ్యంబునుంబోలె, రాజాధిరాజకిరీటంబులం దాపిన దివ్యరత్నంబు లనియెడి గ్రహంబులును, గజకదంబంబు లనియెడి మేఘంబులును, నర్జునురథం బనియెడి మార్తాండమండలంబును గలిగి, గగనంబునుంబలె నంటం దరంబు గాక, వెలిగొడుగు లనియెడు తెల్లదామరలును, జామరంబు లనియెడు రాజహంసంబులును, ఖడ్గకాంతు లనియెడు వారిపూరంబులును, యోధవీరు లనియెడి బలుమొసళ్ళునుం గలిగి, మహాతటాకంబుచందంబున, దురవగాహంబగుచుఁ, జతురంగంబు<noinclude><references/></noinclude> n1xv9v5v425ru5b2yjv8i02mdse6gni పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/84 104 186347 554006 504570 2026-04-21T19:33:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554006 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లనియెడి తరంగంబులును, గజంబులను పర్వతంబులును, రథంబులను ద్వీపంబులును, విజయజయభుజప్రతాపం బనియెడి బడబానలంబునుం గలిగి, సముద్రంబుకరణి నపారం బగుచు, వృషకేతనుండును, బ్రద్యుమ్నుండును, యౌవనాశ్వుండు, ననుసాళ్వుండును, నీలధ్వజుండును, సువేగుండును, మేఘవర్ణుండును మొదలైన మహారథులచే దుర్నిరీక్ష్యంబును నై వచ్చు వివ్వచ్చుసైన్యంబు నాలోకించె. అప్పుడు సవ్యసాచి ప్రద్యుమ్నునిం జూచి, 'కృష్ణనందనా, నాపరాక్రమంబు మీరలందఱుం గనుంగొనుఁడు. దురవగాహంబైన యీపద్మప్యూహంబు సొచ్చి, చెండాడి, తన్మధ్యంబున నున్న మఘాశ్వంబు గొనితెచ్చెద'ననినఁ, బ్రద్యుమ్నుండు పార్థునితో నిట్లను. 'మాతండ్రియగు వాసుదేవుండు సేనాసమేతంబుగా నన్నుఁ గూర్చి మీవెంట నంపుటకుఁ బ్రయోజనం బేమి? ఎదుటిదళంబులెల్ల నాపాలు సేసి మీరు కనుంగొనుచు నుండుండ'నుటయు, వృషకేతనుఁడు క్రీడి నవలోకించి, 'పుడిసెఁడునీళ్ళు చల్లిన నడింగిపోయెడి ధూళికిఁ గాలిమేఘంబులు వర్షింపవలెనే? ఱెప్పవేసినం బడిపోవు దోమలమీఁద గరుత్మంతుం డెత్తి రావలయునే? ఈరాజు మీకు సమానుండు గాడు. మీ రీతనిమీఁద జేయిచేసికొనం బనిలేదు. నేనే యీతని గెల్చి యధ్వరాశ్వంబు దెచ్చెద.' {{p|ac|fwb}}వృషకేతు సుధన్వుల యుద్ధము</p> అని పలికి యర్జునుని వీడ్కొని యరదంబు నధిరోహించి కిఱకిఱం దిరుగు రథచక్రంబువలనఁ బొడమిన మిుంగుఱు లంబరంబున కెగయ గుణంబు సారించుచు వచ్చు నావృషకేతనుం జాచి, సుధన్వుండు 'ఓయీ, నీకులగోత్రనామధేయంబు లెఱుంగక నీతోడం గదనంబు సేయనొల్ల' ననిన, వృషకేతనుండు, 'కశ్యపమహాముని మాకుం గూటస్థుండు. నాచే నిహతుండవై యెవ్వాని బింబంబు భేదింపగోరెద వాసూర్యుండు మాతాత. త్రిలోకాధిపతియైన దేవేంద్రుం డెవ్వానికడకు యాచకుండై వచ్చి యాచించె నట్టిదాతలు దాతయు, శౌర్యసముదీర్ణుండు నగు కర్ణుండు మా కండ్రి. నా పేరు వృషకేతుం' డనిన, విని సుధన్వుఁ డిట్లనియె. 'మధుచ్ఛందనుం డను మహాముని మాకుం గుల<noinclude><references/></noinclude> 4kac9rqefkmjfzdc0adp0vf0gvizuz4 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/85 104 186348 554007 504571 2026-04-21T19:45:34Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554007 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గురుఁడు; హంసధ్వజుండు మాకుఁ దండ్రి. నా పేరు సుధన్వుఁడు. మనయిరువురకు జోడు తగియున్నది'. అనిన విని రోషావేశంబులం గన్నులు జేవుఱింపఁ, గోదండంబు మండూకాకారంబుగాఁ దిగిచి సానలం దీఱిన మెఱుంగువాలమ్ముల వానలు గురియించి, చుట్టు నున్నసైన్యంబులఁ జెల్లాచెదరుగాఁ గొట్టి, యయిదువిశిఖంబులు బాపంబునం గూర్చి విల్లు ఖండించి, కేతనంబు దునిమి, సూతుని ప్రాణంబులు గొని, తురంగంబులం గూల్చి, రథంబు చక్కాడుటయు, సుధన్వుండు వేఱొండురథం బెక్కి, విల్లు గైకొని, యయిదుబాణంబులచే వృషకేతురథంబు దూరంబునం ద్రోచి, విల్లు తునియలు సేసి, సేనలకుం జేయి వీచుటయుఁ జుట్టుముట్టి, పరిఘంబులు, పట్టిసంబులు, గదలు, గుదియలు, ముసలంబులు, చంద్రహాసంబులు మొదలగు కైదువుల వానలు గురియుటయుఁ, జిక్కువడియునుం జేవ చెడక, సూర్యపౌత్రుఁడు మధుసూదనుని పాదారవిందంబులు డెందంబునం దలంచుచు, నొక్కరథికుని చేతివి ల్లొడిచి తీసికొని, దురం బొనరించుటయు, సుధన్వుఁ డతనిసాహసంబునకు సంతసించుచు, వజ్రాయుధంబు చందంబున జ్వాలామాలికాభీలంబయిన యొక్కబాణంబు శరాసనంబున సంధించి, యాకర్ణాంతంబుగాఁ దిగిచి యేయుటయు, నడుఱొమ్మునం దాకి, వెన్నున వెడలి భూతలంబున మునింగినం, గర్ణనందనుండు కీడెడలినజంత్రంపుబొమ్మచందంబున రథంబుమీఁదఁ బడి బలు మూర్ఛనొందె. {{p|ac|fwb}}ప్రద్యుమ్నుండు సుధన్వునిం దాఁకి మూర్ఛిల్లుట</p> అంతఁ బ్రద్యుమ్నుండు దుర్వారభుజాగర్వంబునం దేరు దోలించి, నిలు నిలుమని యదల్చి, యయిదునారసంబుల నొప్పించి, నాల్గుసాయకంబుల నాలుగశ్వంబుల నిరువదితునుకలు గావించి, మూఁడుబాణంబుల నొగలు ఖండంబులు చేసి, యొక్కకాండంబునఁ గోదండంబు రెండుఖండంబు లొనర్చి యార్చుటయు, సుధన్వుండు ప్రద్యుమ్నుని కరకౌశలంబునకు మెచ్చుచుఁ, బదాఱుబాణంబు లొక్కపిడికిటం బట్టి విల్లు దునిమి, సారథిం గూల్చి, ధ్వజంబు చక్కడిచి, కురంగంబులఁ గీటడఁగించి, బలుపిడుగులంబోని మూఁడుతూపులు గడబొమ్మను గ్రుచ్చి, యచ్యుతుని పట్టిని నొప్పించి, సింహనాదంబు<noinclude><references/></noinclude> lgfh9my7yn5uiary679bqzv16ppd8ao 554008 554007 2026-04-21T19:47:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 554008 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గురుఁడు; హంసధ్వజుండు మాకుఁ దండ్రి. నా పేరు సుధన్వుఁడు. మనయిరువురకు జోడు తగియున్నది'. అనిన విని రోషావేశంబులం గన్నులు జేవుఱింపఁ, గోదండంబు మండూకాకారంబుగాఁ దిగిచి సానలం దీఱిన మెఱుంగువాలమ్ముల వానలు గురియించి, చుట్టు నున్నసైన్యంబులఁ జెల్లాచెదరుగాఁ గొట్టి, యయిదువిశిఖంబులు బాపంబునం గూర్చి విల్లు ఖండించి, కేతనంబు దునిమి, సూతుని ప్రాణంబులు గొని, తురంగంబులం గూల్చి, రథంబు చక్కాడుటయు, సుధన్వుండు వేఱొండురథం బెక్కి, విల్లు గైకొని, యయిదుబాణంబులచే వృషకేతురథంబు దూరంబునం ద్రోచి, విల్లు తునియలు సేసి, సేనలకుం జేయి వీచుటయుఁ జుట్టుముట్టి, పరిఘంబులు, పట్టిసంబులు, గదలు, గుదియలు, ముసలంబులు, చంద్రహాసంబులు మొదలగు కైదువుల వానలు గురియుటయుఁ, జిక్కువడియునుం జేవ చెడక, సూర్యపౌత్రుఁడు మధుసూదనుని పాదారవిందంబులు డెందంబునం దలంచుచు, నొక్కరథికుని చేతివి ల్లొడిచి తీసికొని, దురం బొనరించుటయు, సుధన్వుఁ డతనిసాహసంబునకు సంతసించుచు, వజ్రాయుధంబు చందంబున జ్వాలామాలికాభీలంబయిన యొక్కబాణంబు శరాసనంబున సంధించి, యాకర్ణాంతంబుగాఁ దిగిచి యేయుటయు, నడుఱొమ్మునం దాకి, వెన్నున వెడలి భూతలంబున మునింగినం, గర్ణనందనుండు కీడెడలినజంత్రంపుబొమ్మచందంబున రథంబుమీఁదఁ బడి బలు మూర్ఛనొందె. {{p|ac|fwb}}ప్రద్యుమ్నుండు సుధన్వునిం దాఁకి మూర్ఛిల్లుట</p> అంతఁ బ్రద్యుమ్నుండు దుర్వారభుజాగర్వంబునం దేరు దోలించి, నిలు నిలుమని యదల్చి, యయిదునారసంబుల నొప్పించి, నాల్గుసాయకంబుల నాలుగశ్వంబుల నిరువదితునుకలు గావించి, మూఁడుబాణంబుల నొగలు ఖండంబులు చేసి, యొక్కకాండంబునఁ గోదండంబు రెండుఖండంబు లొనర్చి యార్చుటయు, సుధన్వుండు ప్రద్యుమ్నుని కరకౌశలంబునకు మెచ్చుచుఁ, బదాఱుబాణంబు లొక్కపిడికిటం బట్టి విల్లు దునిమి, సారథిం గూల్చి, ధ్వజంబు చక్కడిచి, కురంగంబులఁ గీటడఁగించి, బలుపిడుగులంబోని మూఁడుతూపులు నడఱొమ్మనం గ్రుచ్చి, యచ్యుతుని పట్టిని నొప్పించి, సింహనాదంబు<noinclude><references/></noinclude> 1nr3qeiq7t02bwe7dsnil7ac5sf35te పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/86 104 186349 554009 504572 2026-04-21T20:01:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554009 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సేసె. ఇవ్విధంబునఁ బక్షులగతి గగనంబున కెగయువు, సర్పంబులవలెం బెనఁగొనుచు, బొట్టేళ్లకైవడి గిట్టలతోడనే చండించుచు, నిరువురును నొక్కుమ్మడిగఁ గరలాఘవంబులును, లక్ష్యశుద్ధి దృఢచిత్తత్వంబులును మెఱయ, విలువిద్య నేర్పులు చూపుచుఁ బెద్దయుందడవు పోరిపోరి మూర్ఛాపరవశులై వ్రాలిరి. {{p|ac|fwb}}కృతవర్మాదులు సుధన్వునిం దాఁకుట</p> అంత సుధన్వుండు శీఘ్రంబున దెప్పిఱి, వేరొక్కయరదం బెక్కి, సేనం గనుపుగొట్టుచునున్నఁ గృతవర్మ యెడదాఁకి, తొమ్మిదితూపులు నిగిడించిన, సుధన్వుండు నడుమనే ఖండించిన, వెండియుఁ గృతవర్మ మూఁడువాఁడితూపులు మఱియు నైదుసాయకంబులు నించిన, హంసధ్వజనందనుం డది గణింపక, కృష్ణసర్పంబులంబోని తొమ్మిదివాలమ్ములం నిగిడించిన, సహింపఁజాలక తేరు డిగ్గి పలాయనంబు గావించె. అనంతరంబ, యనుసాళ్వుం డెదిరించి, యదరించి నిజబాహుబలంబు గాన్పించి, శరవర్షంబులు గురియించి, మఱియు నవ్వీరాగ్రేసరుం డుభయదళంబులు గొనియాడ, 'నేను బ్రయోగించు నీయస్త్రంబు సైరింతువేని నిన్ను మెచ్చెద' నని యెచ్చరించి, బడబానలజ్వాలికయుంబోలె, మృత్యుజిహ్వయుంబోలె, వాఁడి మిగులు వాలికతూపులు నడుఱొమ్మునఁ గ్రుచ్చుటయు, సుధన్వుఁడు ధైర్యంబు వదలక నిలిచిన, ననుసాళ్వుండు వెండియుఁ బ్రచండకాండంబు లొండొండ నిగిడించి, యట్టహాసంబు సేసి, మూఁడువాఁడితూపులు ఱొమ్మున నాటించుటయు, సుధన్వుండు మూర్ఛిల్లి, తోడనే తెప్పిఱి యయ్యనుసాళ్వునిపయి శరవర్షంబులు గురియించి మూర్ఛ నొందించి, సేనల విరియించి, యంతకుని చందంబునఁ గోటి సైన్యంబులం గనుపుగొట్టుచు నక్కజంబుగఁ బెక్కు నారసంబులు పఱపిన, దొర్లిన మావంతులును, ద్రెళ్ళిన మత్తవారణంబులును, జెక్కచెక్కలైన చక్రకూబరాదులును, విశ్లథంబులైన రథంబులును, విచారితంబులగు కేతనంబులును, విధ్వస్తంబులగు కార్ముకంబులును, గూలిన రథికులును, గొఱప్రాణంబులతోడం బొరలు మహారథులును, శిరంబులు దెగి పడిన రాహుత్తులు కబంధములు మోచుకొని నలుదిక్కులం బఱచుచు, దెగిన<noinclude><references/></noinclude> sbgemggdu03hwx8f8xnt77a0vdk45lb పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/87 104 186350 554010 504573 2026-04-21T21:06:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554010 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మోటలు, విఱిగిన ఱొమ్ములు, పగిలిన ప్రక్కలు, తెగిన తోఁకలు, ఖండితంబులైన పాదంబులు, శిథిలీకృతంబులగు సంధిబంధంబులుం గలిగి పొరలు సైంధవంబులును, శిరంబులు, నురంబులు, జానువులు, జంఘలు, కర్ణంబులు, కపోలంబులు, వెన్నులు, కన్నులు పచ్చడికిం దఱిగిన చందంబున శకలంబులై నెత్తురులు గురియ, వీరమార్గంబు గైకొని కాలుంగాలుం బెనచుకపడ్డ వీరభటులును, ఖండంబులైన కోదండంబులును, దుత్తుమురులైన కత్తళంబులును, జందంబు మారిన చిందంబులును, జూర్ణంబులైన శూలంబులును, భంగంబులైన ప్రాణంబులును, నింతింతలైన కుంతంబులును, జక్కులైన చక్రంబులునుం గలిగి, యాభీలంబైన సమరభూభాగంబునఁ దెట్టువలు గట్టునట్టలతోడం గూడ గట్టు పొరలినట్టు మట్టుమీఱిన నెత్తురులును, గైరికాదిధాతురంజితంబులగు హిమశైలకటకభాగంబుల బహువిధంబులుగాఁ బ్రవహించు భాగీరథీప్రవాహంబుల కరుణిం గనుపట్టె. ఆసమయంబున సాత్యకి సుధన్వునిం దాఁకి నిశితాస్త్రవర్షంబులు గురిసినవాఁడునుఁ దోడ్తోన మరలించిన, శైనేయుం డెనుబదినారసంబులు ప్రయోగించి యతని యరదంబట్ల కావించె. అవ్విధంబున విరథులై సాత్యకి సుధన్వులు వేఱునరదంబు లెక్కి చలంబు దింపక యొండొరుల మైమఱపు లఱవుళ్ళు సేసి నెత్తుటం జొత్తిల్లుచుఁ బూచిన మోదుగులచందంబునఁ బొలుపొందిరి. అంత సుధన్వుండు సాత్యకి నదల్చి మృత్యుదంష్ట్రాకరాళంబును, జ్వలత్పావకసంకాశంబును, గనకమాలికాలంకృతంబైన శక్తి కేలం గైకొని వేయుటయు, సాత్యకి చేష్ట లుడిగి వసుధాతలంబున వ్రాలె. అంతఁ గౌంతేయమధ్యముండు శత్రుభీకరంబైన యాకారంబునం గనుపట్టుచు సుధన్వునిం జూచి, 'నృపాలకుమారకా, ద్రోణ భీష్మ కర్ణాది మహాయోధవీరులతోడం బెనంగి, వారల బలపరాక్రమంబు లెఱింగియున్నవాఁడ. నీవిక్రమం బంతకంటె నతిశయించి యున్నయది' అనుటయు, నధిజ్యధన్వుం డగు సుధన్వుండు 'కిరిటీ! నీబోఁటి మేటివీరునకుఁ బెక్కుమాట లేమిటికి? తొల్లి కృష్ణసారథ్యంబున జయంబు చేకొంటివి. ఇప్పు డొంటిగా వచ్చినాఁడవు. చక్రంబు కేలం బూని చక్రి నీకు సహాయుం డయ్యెనేని హయంబు విడువంగలవారము గాము. శ్రీకృష్ణదేవునకుఁ బ్రియంబుగా మాతండ్రి హయమేధంబు సేయంగాక.'<noinclude><references/></noinclude> 4yoa7osepde82i0mtzv96tp0e9zeahg పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/88 104 186351 554011 504574 2026-04-21T22:14:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554011 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}అర్జున సుధన్వుల యుద్ధము</p> అనిన విని యర్జునుండు క్రోధారుణలోచనుండై, నూఱునారాచంబులు నిగిడించిన, నతండు నన్నియబాణంబులం వానిం ద్రుంచి, పదితూపులు మేనం గీలించి నవ్విన, నవ్వీరుండును గాలమేఘంబుచందంబున శరవర్షంబు లపారంబుగాఁ గురిసిన, సుధన్వుఁడు మండలీకృతశరాసనుండై, మిన్ను నేలయు, దిక్కులు విదిక్కులు శరపరంపరలచే ముంచె. అంతఁ గుంతీనందనుండును గాలకూటవిషాగ్నిజ్వాలలుంబోని కీలాజాలంబులం పొలుపొందు నాగ్నేయాస్త్రంబు ప్రయోగించిన, హంసధ్వజకుమారుండు సప్తకులమహామేఘంబులు పుట్టింపంజాలునట్టి పర్జన్యాస్త్రంబు ప్రయోగించుటయు, ధళధళాయమానంబు లైన మెఱుపులు, పెళపెళమని యుఱుము నుఱుములును, బెనుగుండ్లంబోని వడగండ్లును, మిక్కుటంబుగా దిక్కులు క్రిక్కిఱియంబాఱు మహాప్రవాహంబులును, నెడనెడం బడు పిడుగులునుం గలుగుటయుఁ, దురంగంబులు, మాతంగంబులు, శతాంగంబులు, పదాతిసంఘంబులు, బక్కెరలు, పల్లంబులు, జోళ్ళు, ఛత్రంబులు, చామరంబులు వెల్లింబడిపోవ, మిఱ్ఱుపల్లంబును నొక్కటిగా బహుప్రవాహంబులు పాఱందొడంగిన, నింద్రనందనుండు వాయవ్యాస్త్రంబుచే నయ్యస్త్రంబు మాయించిన, హంసధ్వజకుమారుం డర్ధచంద్రబాణంబున నర్జునుని సారథి శిరంబు ఖండించి, దీప్తపావకసదృశంబులైన నిశితవిశిఖంబుల నాపాదమస్తకము గ్రుచ్చి యార్చుటయు, రథవాహంబులు క్రుంగంబడి నలుదిక్కులు పఱచుచు జికాకుపడెను. {{p|ac|fwb}}శ్రీకృష్ణుఁ డర్జునునకుఁ బ్రత్యక్షమగుట</p> అప్పు డర్జునుఁడు దుస్తరంబైన యాసంకటంబు నిస్తరింపం జాలక 'ఆపదుద్ధారకా, ఆదిదేవా, అనంతా, అనంతశయనా, అంబుజనాభా, అచ్యుతా, హరీ, శ్రీకృష్ణా, నిన్ను నమ్మినవాఁడ. లక్కయింటం జిక్కుపడకుండఁ గౌరవసభాస్థలంబున ద్రౌపదికి మానభంగంబు గాకుండ, నడవుల నిడుమలం బడునపు డాపదలం బొరయకుండ, భీష్మ ద్రోణ కృపాశ్వత్థామ కర్ణాది యోధవీరుల యస్త్రాగ్నిజ్వాలలం గ్రాగకుండ, సైంధవవధంబునఁ బ్రతిజ్ఞాభంగంబు గాకుండ రక్షించి, సకలసంకటంబులు నెడఁబాపితివి. త్రిలోకాధ్యక్షా, పంకజాక్షా, ఇప్పు డీసంక<noinclude><references/></noinclude> nqcp06usx0nbmdrb9v5i64pcu3idqjw పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/89 104 186352 554012 504575 2026-04-21T22:28:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554012 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>టంబు తొలగించి రక్షింపవే! రక్షింపవే!' అని ప్రార్థించుటయు, భక్తరక్షణవిచక్షణుండగు కమలాక్షుండు తెలిదమ్మిరేకులం దెగడుచుఁ గరుణామృతంబు వెదజల్లు చల్లనిచూపులఁ జెన్ను మెఱయు కన్నులును, బున్నమచందురుం బురుడించు నెమ్మొగంబున నందంబు మీఱు మందహాసంబును, గలుములజవరాలికి నిజనివాసంబైన వెడందయురంబున బాలసూర్యబింబవిడుంబకంబైన కౌస్తుభంబును, నద్భుతంబులైన పరిమళంబులం గుప్పళించు వనమాలికయు, శార్ఙ్గకోదండమౌర్వీకిణాంకంబులును, ఆజానుదీర్ఘంబులు కంకణకేయూరకటకాంగుళీయకాది నానాభూషణభూషితంబులును, సర్వాభీష్టప్రదాయకంబులును, లోకరక్షాదీక్షితంబులును, శుభలక్షణలక్షితకరాంగుళివిలసితంబునైన చతుర్భుజంబులును, జిగురుటాకులం బోలి మౌనిమానసధ్యానయోగ్యంబులును, వేదాంతవీథీసంచారయోగ్యంబులు నగు మృదులపాదంబులును గనుపట్ట, నీలమేఘశ్యామలుండును, బీతాంబరధరుండును, గోటికందర్పలావణ్యనిధియును, బ్రసన్నముఖారవిందుండునైన గోవిందుండు తత్{{ZWNJ}}క్షణంబ ప్రత్యక్షంబయ్యె. అంత ఫల్గుణుండు సాష్టాంగవందనంబు గావించి, కరంబులు మొగిచి, కరణారసంబు వెదజల్లు చల్లనిచూపులం గటాక్షించి, యాదరంబున నిటలతటంబున ఘటియించిన (చేతులతో) ఆనందబాష్పంబులు ఱెప్పల నుప్పతిల్ల రోమాంచకంచుకితగాత్రుండై గద్గదకంఠంబున నేమియుఁ బలుకనేరక యూరకయున్న, యయ్యర్జునుని గాఢాలింగనంబు గావించి, సారథ్యంబునకుం బూని, యాముకుందుండు పగ్గంబులు బిగియంబట్టి, మునికోలం గేలం గైకొని, తురంగంబుల కందంబు లప్పళించి, తేరు మరలించి యర్జునిం జూచి, 'యవక్రపరాక్రమశాలియైన శత్రునిం జయింపుము. శీఘ్రంబు లెమ్ము. జయమ్ము చేకొనుము.' అనుటయు గాండీవి మ్రొక్కి, గాండీవంబు సజ్యంబు గావించి, జ్యానాదంబులచే రోదసీకుహరంబు పూరింపుచు దేవదత్తం బొత్తుటయుఁ, గమలాక్షుండును బ్రళయకాలజలధరగంభీరస్వనంబైన పాంచజన్యంబు పూరించె. {{p|ac|fwb}}అర్జున సుధన్వుల ద్వంద్వయుద్ధము</p> ఇవ్విధంబున యుద్ధసన్నద్ధులును, రథికసారథులునై వచ్చు నా కృష్ణుల నిరువుర నుపలక్షించి, సుధన్వుండు వదనారవిందంబున మందస్మితంబు తళు<noinclude><references/></noinclude> 0zbzw9h6u3exbdyg2iem2kx8mj6yqbe పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/90 104 186353 554024 504576 2026-04-22T01:37:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554024 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కొత్త, 'శక్రనందనా, చక్రపాణి నీకు సహాయుండై యుండఁ బరాక్రమించుట కేమి భయంబు? ఉభయబలంబులు వృధా సమయనేటికి? రిత్తయంపపోకడకయ్యం బెంత తడవు? 'ఇన్ని బాణంబులలో నిన్ను జయించెద'నని ప్రతిన గావింపు మనిన పురందరనందనుండు, 'రాజనందనా, మూఁడుబాణంబులచేత నీశిరంబు పడఁగెడపెద. అటు చేయంజాలనైతినేని, తండ్రియుం దాతయు మొదలైన మాపూర్వులు పుణ్యవిహీనులై నరకంబునఁ గూలుదురు గాక' యని ప్రతిన గావించుటయు, 'నీవేయుబాణంబులు నే నడుమ ఖండించెద. ఇట్లు సేయనైతినేని నేనును, మాపెద్దలును నాచరించిన సుకృతంబులు రాక్షసులపా లగుంగాక. పూజావిరహితుండైన దురాత్ముండును, వసిష్ఠసమానుండైన బ్రాహ్మణునిం జంపిన బ్రహ్మఘాతుకుండును బొందు దుర్గతిఁ బొందఁగలవాఁడ'నని త్రివాచకంబుగాఁ బ్రతినఁ గావించి సుధన్వుండు, సువర్ణపుంఖంబులును, గంకపత్రవిచిత్రంబులు నగు నూఱమ్ము లొక్కముద్దిం బట్టి వి ల్లాకర్ణాంతంబుగాఁ దిగిచి యదుకులాధ్యక్షుని వక్షస్థలం బుపలక్షించి యేయుటయు, నాబాణంబునకుం గట్టిన బలుఱెక్కలగాడ్పుల నయ్యరదంబు నన్నూఱుమూరలకొలఁది పిఱిందికిం జని భూనభోంతరాళంబు లేకంబుగా దువ్వ గ్రమ్ముటవలన రథరథ్యకపిధ్వజంబులతోడఁగూడఁ గృష్ణార్జునులు గానంబడరైరి. అప్పు డాసుడిగాలి బిసలోనం దగిలి యారథంబు బొంగరంబుచందంబునఁ, గుమ్మరిసారెతెఱంగునం దిరుగుచునుండెఁ గాని నిలువదయ్యె. అప్పుడు విశ్వంభరుండైన శ్రీకృష్ణదేవుండు తనయుదరంబునం దున్న బ్రహ్మాండకోటులబరువుతోడం గూడ నయ్యరదంబు చిక్కంద్రొక్కి, యెట్టకేలకుఁ గదలకుండ నిలిపి, 'అర్జునా, పెక్కుబవరంబులు గనియున్నారము. ఇంత కడింది వీరు నెక్కడం గానము. ఇతండు సత్యవ్రతుండు. అదియునుంగాక యేకపత్నీవ్రతుండు. అత్యంతకాముకులమై, బహుస్త్రీలోలురమైన నీకు నాకును వీనిం జయింపఁగూడునే? నీప్రతిన యెట్లు నెరవేఱం గలయది? చిత్తం బుత్తలం బగుచున్నయది!' అనిన విని, కిరీటి నవ్వుచు, 'శ్రీకృష్ణా, నీకటాక్షంబు గలిగెనేని యసాధ్యం బేమి యున్నయది?' అని పలికి గాండీవి జ్యానాదంబు దిక్కులు వ్రక్కతిలంజేయఁ గాంచనపుంఖంబును గాలదండోపమానంబును నైన సాయకంబొక్కటి వింట సంధించి, వానికంఠం బుపలక్షించి యేయు నవసరంబున, గోపాలదేవుండు మున్ను దాను గోవర్ధనాచలం బెత్తి, గోగోపసంఘంబులఁ గాచిన సుకృతఫలంబు<noinclude><references/></noinclude> htdb2b4o9yrn1uz3x6m0fpngwr9dwm2 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/91 104 186354 554029 504577 2026-04-22T01:51:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554029 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నయ్యస్త్రంబున కొసంగిన, నదియును గాండీవి నిర్ముక్తంబు ప్రళయకాలదండధరదండోపమానంబునై దిక్కులు విదిక్కులు ఘూర్ణిలంజేయుచు మెఱుంగు మొత్తంబులు నుమియుడు, గాలదండంబుకరణిఁ బఱతెంచిన, నయ్యేకపత్నీవ్రతుండు నంతకంటె మిన్నైనతూపొక్కటి వింట సంధించి ప్రయోగించిన, నదియును బక్షీంద్రుఁ డురగంబు ఖండించినతెఱంగున దాని ఖండించె. తోడనే సుధన్వుండు నిప్పులు గుప్పళించు శరంబు లపారంబుగాఁ గృష్ణార్జునులపయిం గప్పినఁ, గిరీటిహాటకపుంఖంబును, గోటిసూర్యప్రకాశంబు నగు వేరొక్కసాయకంబు గాండీవంబునం బూన్చి యేయుటయు, నచ్యుతుఁడు దాను మున్ను పరశురామావతారంబున సకలక్షత్రియులు జయించి చతుస్సముద్రముద్రితంబైన భూవలయంబు కశ్యపునకు ధారవోసినఫలం బయ్యంబకంబున కొసంగిన, నదియును బ్రళయకాలానలంబు చందంబున జ్వలింపుచు, దుర్వారవేగంబునం జనుదెంచుతఱి, హంసధ్వజకుమారుండు తాదృశంబైన బాణం బాకర్ణాలతంబుగాఁ దిగిచి యేసిన గాండీవికాండంబు రెండుఖండంబులై భూమండలంబునం బడియె. {{p|ac|fwb}}అర్జునుండు సుధన్వుని తల ద్రుంచుట</p> ఇవ్విధంబున శరద్వయమ్ము వమ్మగుటయుఁ బురుహూతనందనుండు డెందంబున గ్రందుకొను చలంబును, మచ్చరంబును, విచ్చలవిడిం బెచ్చుపెరుగఁ గల్పాంతమార్తాండమండలంబు వేడిమిం గ్రేణి సేయు మూఁడవబాణంబు ధనుర్గుణంబనం బూన్చుటయు, నప్పురుషోత్తముండు నక్కాండంబునకుఁ బుంఖదేశంబున హిరణ్యగర్భుని మధ్యప్రదేశంబున సమవర్తిసహితుండగు రుద్రుని బాణాగ్రంబునం దనతేజోవిశేషంబు నునిచి, తొల్లి శ్రీరామావతారంబునఁ బితృవాక్యపరిపాలనంబును, సత్యవ్రతంబును, నేకపత్నీవ్రతంబును, శరణాగతరక్షణంబును, నశ్వమేధాదియాగంబులును జేసిన ఫలంబు తత్సాయకంబునం దునిచె. అంతకమున్న రంభోర్వశీప్రముఖులైన యచ్చర మచ్చెకంటు లమ్మహావీరుఁడగు సుధన్వు నెదురుకొనుటకై కానుకలు గైకొని వచ్చిరి. ఇంద్రాది దిక్పాలకులు విమానారూఢులై యతివేగంబున వచ్చి, సుధన్వార్జునుల ప్రతినలు, నిరువుక జయసందేహసమరవిజృంభణంబును, హర్షాద్భుతభయంబులం బొరలు నంతరంగంబులం బొగడుచుఁ గనుంగొనుచుండిరి.<noinclude><references/></noinclude> lyx4s5o7ifgfmc780g83ttszop0fur2 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/92 104 186355 554032 504578 2026-04-22T02:09:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554032 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} ఆసమయంబున పార్థుండు లయకాలశిఖాసంకాశంబైన యాశిలీముఖంబు సంధానక్రియాచాతుర్యంబున సంధించి యేయుటయు, మంటికి మింటికి నేకంబుగా మంట లెగయ మిణుంగుఱుల కుప్పల గుప్పలగుప్పునం గప్పుచు ఛటచ్ఛటశబ్దంబుల భూనభోంతరాళంబులం గ్రక్కతిలం బఱతెంచు నయ్యస్త్రంబు నురవడిం గనుంగొని, సుధన్వుండు చండమార్తాండకిరణప్రకాశంబును, దంభోళిసంకాశంబు నగు బాణంబొక్కటి వింట సంధించి ప్రయోగించుటయు, నక్కాండం బతిరయంబునఁ బఱతెంచి యర్జునుం డేసినబాణంబు నడిమికి రెండుతుండంబులు సేసిన, నాశరంబు సగంబు తెగిపడియును, వేడిమియు వేగంబును జెడక, శ్రీ వాసుదేవుని సంకల్పంబువలన నతిత్వరితంబుగాఁ బఱతెంచి, చంద్రబింబోపమానంబును, గిరీటకుండలాభిరామంబును, వీరరసోన్నిత్రంబును, విజృంభితసింహనాదంబునైన సుధన్వుని శిరంబు ఖండించె. తదనంతరంబ, తత్కబంధంబు బిఱబిఱం డిరిగి, రథగజతురగపదాతిబృందంబులు చాఁపకట్టుపడం జేయుచు, ధరాతలంబునం బడియె. ఫల్గుణఖండింతంబగు నతనిశిరంబు గగనంబున కెగసి 'గజేంద్రవరదా, గరుడవాహనా, నీరజాక్షా, నిఖిలలోకాధ్యక్షా, దేవకీనందనా, దీనజనాభినందనా, నారాయణా, భక్తత్రాణపరాయణా, నమో, నమో' యని దివ్యనామసంకీర్తనంబు సేయుచు నతివేగంబున వచ్చి శ్రీ గోపాలదేవుని చరణపద్మంబునఁ దుమ్మెదకైవడి వ్రాలె. అప్పు డతనిదివ్యతేజంబు దిశదిశలు ప్రకాశింపఁజేయుచుఁ గేశవుని దివ్యదేహంబునం గలిసె. కంసమర్దనుండును దన్మస్తకంబు కేలం గైకొని హంసధ్వజునిమ్రోల వైచుటయు, నమ్మహీధవుండు పుత్రశోకార్తుండై పెద్దయుం బొద్దు వగచి, యాశిరంబు గ్రమ్మర రుక్మిణీవల్లభుని పాదాబ్జంబులం గడియవైచుటయు, నద్దేవుండు దాని నెత్తి గగనంబున కెగురవైచుటయుఁ, దోడనె యంతర్థానంబు నొందె. అంత సుధన్వునిపాటు గనుంగొని చింతావ్యాకులితమానసుండై 'హా కుమారకా, హా కులోద్ధారకా, హా గుణభూషణా, మాతాపితృసంతోషణా, మేరునగధీరా, వీరాధివీరా, హా కుసుమశరీరా, సుజనాధారా, బుధవిధేయా, దానరాధేయా, నందనందనచరణారవిందవందనా, దీనజనాభినందనా, అయ్యయ్యో! నన్నును నీతల్లిని నగతికులం జేసి వాసుదేవుని సాయుజ్యంబు<noinclude><references/></noinclude> d4xsuzrywifv8t3tw740yqvx83wl05j పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/93 104 186356 554033 504579 2026-04-22T02:41:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554033 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నొందితివే! నీ వుత్తమోతంబైన దివ్యపదంబున కేగితివి గావున నీకు వగవం బనిలేదు. నన్ను గన్నతండ్రీ! పరాక్రమోపార్జనుండగు నర్జునుని నిర్జించివత్తువని నీరాక కెదురుచూచుచునుండు నీతల్లితో నే నేమనంగలవాఁడ? నీరాణియగు ప్రభావతి ముఖం బేమని చూడఁగలవాఁడ? కుమారా! అనాథుల మగు మాజీవనంబునకు వగచెద' మని పలవించు హంసధ్వజునిచెంతకుఁ జనుదెంచి, సుధన్వున కగ్రుండైన సురథుండు తండ్రి నూరార్చుచు, 'రాజేంద్రా, శూరుల కాహవమరణంబు మోదకరంబుగాని ఖేదకరంబు గాదు. నీవంటి ధీరుం డిట్లు దైన్యంబు నొందనగునే? న న్ననికిఁ బంపుము. వైరిసేనలం జుట్టుముట్టి కనుపు గొట్టెద. మాధవునిప్రాపున సుధన్వుని వధించిన వాసవతనూజునిం బాఱఁదోలెద కాక యెదిరించెనేని, నా తమ్మునికి సహాయంబుగాఁ బనిచెద. దిక్కులఁ గీర్తి నించెద' అని అనేకవిధంబుల హంసధ్వజు నూరార్చి, సురథుండు కైదువులు మెఱుంగులీన జోదు లిరుగెలంకులం బలసి చనుదేర, నరదంబు నెక్కి, ద్విరదంబులు, తురంగంబులు, భటసంఘంబులు నసంఖ్యాతంబులుగాఁ జనుదేరఁ, గుహనానృసింహుని కహకహార్భటుల చందంబుగా నందంబు మీఱు చిందంబు పూరించుచు, సింహనాదమేదురరోదో౽౦తరాళుండై బయలుమెఱయు సురథునిరాకఁ జూచి, మధుసూదనుండు పార్థు నుద్దేశించి (యిట్లనియె:) {{p|ac|fwb}}సురథుఁ డర్జునునితో యుద్ధము సేయుట</p> 'అర్జునా, దుర్జయకాలభైరవుండునుం బలె మండుచు, సుధన్వాగ్రజుండైన సురథుండు సర్వసన్నాహంబగు సైన్యంబుల తోడంగూడ నిదె వచ్చె. వీని నీకె కాదు. బ్రహ్మవిష్ణురుద్రాదులకైన నెదుర్కొనంగూడదు. తమ్ముని యుమ్మలికమ్మున రోషమ్మునం జనుదెంచు వీనిధాటికిఁ బ్రథమకబళంబు గానేమిటికి? మన మీవేళం దొలంగి యుండుదము. పురుషరూపంబు గైకొన్న సత్యంబుకైవడి, నరాకృతి వహించిన ధర్మంబుకరణి, సాకారంబైన సదాచారంబుచందంబున, సద్గుణాభిరాముండైన యీ రాజకుమారుండు నీకు నసాధ్యుం డగుట కతనఁ బ్రద్యుమ్న వృషకేతన మేఘవర్ణ యౌవనాశ్వ నీలధ్వజాది యోధుల నిచ్చట నిలిపి, మనము కొంతతడవునకు మరలివత్త' మని పలుకుచుఁ, బరబలంబులమీఁదఁ దమబలంబుం బురికొల్పెడుచందంబున నరదంబు తఱిమికొని మూఁడుయోజనంబు లెడ గలుగం జనియె. {{left|}}<noinclude><references/></noinclude> 5zhplki51j7x5mrs9hrgnjgymlb35nd పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/94 104 186357 554034 504580 2026-04-22T04:14:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554034 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అప్పుడు సురథుండు రమణమెఱయ నేగుదెంచి, పిడుగులు పడువడువున బెడిదంబులైన శరంబు జడిగొనం గురియుచు, నర్జునుని సైన్యంబు సొచ్చి, మారి మసంగినభంగి, మంత్రించి పడవైచినగతి, లయకాలదండధరుండు తాండపించిన దారి, విజృంభించి, గంభీరగుణారావంబుచే నంభోనిధులు గలంగ, భద్రగజసమూహంబుల గుదులు గ్రుచ్చిన చందంబునం గూలనేయుచుఁ, దేరుల తిలమాత్రశకలంబులఁ జేయుచు, భటకదంబంబుల నంబకంబులం బడఁగెడపుచు, ఖండంబులైన శస్త్రాస్త్రకాండంబులును, బ్రోవులైన ప్రేవులును, బంకంబులైన మాంసమజమస్తిష్కంబులునుం గలిగి, రణాంగణంబు ఘోరంబుగాఁ గనుపట్టం బరాక్రమింపుచు, యోజనత్రయవిస్తారంబుగాఁ బన్నినసైన్యంబుల నెల్లఁ జించి చెండాడి, శ్రీకృష్ణునిఁ బార్థునిం గనుగొని సురథుం డిట్లనియె. 'కృష్ణా, నీవు మూఁడవతారంబులం జేసిన సుకృతంబు నీబలంబును బార్థున కొసంగి సుధన్వునిం జంపింప నగునె? పురాణపురుషుండవయ్యుఁ బడుచుదనంబు మానవైతివి. రేను(గు)పండ్లనిమిత్తంబుగా ముత్తియంబులు వేలములు వేయుచందంబున, గోవిందా, నీ విట్లు చేయందగునె? నిన్ను ధర్మదయాసాంద్రుండని మహామునులు గొనియాడ విందు. నీ విందు మఱిందిచేత సుధన్వునిఁ జంపించి పోవంజూచిన పోవనిత్తునే?' అని పలికి యలుక మొగంబునం దొలుక వేలకొలందులగు కడిందిబాణంబులు పురందరనందనునిపయి నిగిడించిన, నతఁడు వాని నన్నింటిని ఖండించి, క్రొవ్వాడిబాణంబులచేఁ గోదండంబు ఖండించి, గుఱ్ఱంబులఁ బడెగడపి, సారథిని వధించి, రథంబు వితథంబు గావించిన, వాడును బొలివోని బంటుతనంబున వేఱొండురథం బెక్కి, సముజ్జ్వలంబైన కార్ముకంబు సజ్యంబు గావించి, కమలాక్షపార్థుల రథాశ్వకేతనసమేతంబుగా బాణవారాశిలోనం జిక్కువడఁజేసినం, గ్రీడి వేడుక మెఱయ వానితూపులు రూపఱంజేసి, యొక్కమెఱుంగునారసంబు సభిమంత్రించి వేయుటయు, వానిరథంబు ఱెక్కలతోడి మేరుశిఖరంబుచందంబున సూర్యమండలంబుదాఁకం గొనిపోయె. అన్నరుని ధనుర్విద్యాకౌశలంబు వర్ణింపం దరంబే? సురథు నీతీరునం గొనిపోయి సురపథంబున నిల్చి వాఁడు భువనభయంకరంబుగా నట్టహాసంబు సేసి, భీకరంబయిన సాయకంబు వింట నరిఁబోసి పార్థునరదంబు గుఱి సేసి యేసిన, నది బిఱబిఱం దిరిగి భూమిలోనం బూడుకొనుటయు, మురజభంజనుండు ధనంజయుని తోడంగూడ దుమికి తనబాహుదండంబులు సాఁచి<noinclude><references/></noinclude> o9fxwinahidrch5gi9pphu38ti0jl0t 554037 554034 2026-04-22T04:43:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 554037 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అప్పుడు సురథుండు రమణమెఱయ నేగుదెంచి, పిడుగులు పడువడువున బెడిదంబులైన శరంబు జడిగొనం గురియుచు, నర్జునుని సైన్యంబు సొచ్చి, మారి మసంగినభంగి, మంత్రించి పడవైచినగతి, లయకాలదండధరుండు తాండపించిన దారి, విజృంభించి, గంభీరగుణారావంబుచే నంభోనిధులు గలంగ, భద్రగజసమూహంబుల గుదులు గ్రుచ్చిన చందంబునం గూలనేయుచుఁ, దేరుల తిలమాత్రశకలంబులఁ జేయుచు, భటకదంబంబుల నంబకంబులం బడఁగెడపుచు, ఖండంబులైన శస్త్రాస్త్రకాండంబులును, బ్రోవులైన ప్రేవులును, బంకంబులైన మాంసమజమస్తిష్కంబులునుం గలిగి, రణాంగణంబు ఘోరంబుగాఁ గనుపట్టం బరాక్రమింపుచు, యోజనత్రయవిస్తారంబుగాఁ బన్నినసైన్యంబుల నెల్లఁ జించి చెండాడి, శ్రీకృష్ణునిఁ బార్థునిం గనుగొని సురథుం డిట్లనియె. 'కృష్ణా, నీవు మూఁడవతారంబులం జేసిన సుకృతంబు నీబలంబును బార్థున కొసంగి సుధన్వునిం జంపింప నగునె? పురాణపురుషుండవయ్యుఁ బడుచుదనంబు మానవైతివి. రేను(గు)పండ్లనిమిత్తంబుగా ముత్తియంబులు వేలములు వేయుచందంబున, గోవిందా, నీ విట్లు చేయందగునె? నిన్ను ధర్మదయాసాంద్రుండని మహామునులు గొనియాడ విందు. నీ విందు మఱిందిచేత సుధన్వునిఁ జంపించి పోవంజూచిన పోవనిత్తునే?' అని పలికి యలుక మొగంబునం దొలుక వేలకొలందులగు కడిందిబాణంబులు పురందరనందనునిపయి నిగిడించిన, నతఁడు వాని నన్నింటిని ఖండించి, క్రొవ్వాడిబాణంబులచేఁ గోదండంబు ఖండించి, గుఱ్ఱంబులఁ బడెగడపి, సారథిని వధించి, రథంబు వితథంబు గావించిన, వాడును బొలివోని బంటుతనంబున వేఱొండురథం బెక్కి, సముజ్జ్వలంబైన కార్ముకంబు సజ్యంబు గావించి, కమలాక్షపార్థుల రథాశ్వకేతనసమేతంబుగా బాణవారాశిలోనం జిక్కువడఁజేసినం, గ్రీడి వేడుక మెఱయ వానితూపులు రూపఱంజేసి, యొక్కమెఱుంగునారసంబు సభిమంత్రించి వేయుటయు, వానిరథంబు ఱెక్కలతోడి మేరుశిఖరంబుచందంబున సూర్యమండలంబుదాఁకం గొనిపోయె. అన్నరుని ధనుర్విద్యాకౌశలంబు వర్ణింపం దరంబే? సురథు నీతీరునం గొనిపోయి సురపథంబున నిల్చి వాఁడు భువనభయంకరంబుగా నట్టహాసంబు సేసి, భీకరంబయిన సాయకంబు వింట నరిఁబోసి పార్థునరదంబు గుఱి సేసి యేసిన, నది బిఱబిఱం దిరిగి భూమిలోనం బూడుకొనుటయు, మురజభంజనుండు ధనంజయుని తోడంగూడ దుమికి తనబాహుదండంబులు సాఁచి<noinclude><references/></noinclude> 6jqgel3soy2zpcmtmp4vgi5rtbr7lp7 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/95 104 186358 554035 504581 2026-04-22T04:32:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554035 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యయ్యరడంబు నుబుక నెత్తంజాలక, 'తొల్లి వరాహావతారంబున శైలకాననసమేతంబైన వసుంధరావలయంబు దంష్ట్రాగ్రంబున నుద్ధరించితి, నప్పుడు నింతబరువు తోఁచలే 'దని పార్థునితోఁ బలుకు నవసరంబున, నాంజనేయుండు తత్కేతనంబున నుండి దిగ్గనుఱికి మహామేరుశైలసమానంబుగాఁ బెరిగి దీర్ఘతరంబైన వాలంబునం జుట్టిపట్టి యీడిగిలం బడనీడ్చియు నత్తేరు నెత్తంజాలడయ్యె. అంత సురథుండును గరుడవాహనశ్వేతవాహనులమీఁద నర్బుదన్యర్బుదఖర్వమహాఖర్వశంఖసంఖ్యాతంబులును, బుంఖానుపుంఖంబులైన మార్గణంబులం గుప్పుటయును, నాజనార్దనుండు దాని సైరింపఁజాలక యర్జునిం జూచి 'కిరీటీ, నీ మేటితనం బెక్కడికిఁ బోయె? అనిమొనలం గనుచెదరని వీరాధివీరుండవని కదా నిన్ను నమ్మి మా యన్న సమ్మతి లేకుండియు, నాచెలియలి నొసంగితి! ఇంకనైనఁ దెలివొంది కయ్యంబు సేయుము. అదియునుంగాక సాటిలేని మేటి పోటుబంటువని, సరిబావమఱందివని, లాఘవం బెన్నక నీరథంబు గడపనొడఁబడి పార్థుని సారథి యను నామధేయంబు జగద్విఖ్యాతంబుగా ధరించితి. అయిన నేమయ్యె? ఇప్పు డవక్రపరాక్రమంబగు చక్రంబు నొసంగుదునో? లేక నేను రథికుఁడనై శార్ఙ్గకోదండంబు మండలాకారంబుగా గుడుసువడం దిగిచి యాశీవిషోపమానంబులగు నిశితవిశిఖపరంపరల వెంపరలాడి వైరిసమూహంబులం గనుపు గొట్టెద. నీవు సారథ్యంబునకు నాయితంబు గమ్ము లెమ్ము. పగ్గంబులు గైకొమ్మ'నియె. అంత ఫల్గుణుండు రోషారుణలోచనుండై, బాణాసురమర్దనుఁ గనుంగొని, 'దేవా, నా పరాక్రమంబు చూడుము,' అని పలికి, సూఱులకొలందులు, వేలసంఖ్యలు, నయుతనియుతగణంబునైన యంబులం బ్రయోగించి, వాని తేరు తిలమాత్రంబులు, నణుమాత్రంబులు, బరమాణుకల్పంబులును, దుమ్ముధూళియుం జేసి భూతలస్థునిం జేయుటయు, సురథుండు విరథుండై మాధవాంజనేయులచేతఁ దెమలింపంగూడని పార్థుని రథంబు పెల్లగించి సంగడంబుచందంబునం బొడవుగా నెత్తి, కంస కర్ణభంజనులం జూచి, 'కృష్ణులారా, మీ యరదంబు భూమిం బడవైచి చూర్ణంబుగాఁ జేయుదునో, సప్తసాగరంబుల కవ్వలితీరంబునఁ బడవైతునో, హస్తినాపురంబున ధర్మజుని సన్నిధానంబునఁ బడఁజిమ్ముదునో' యని పలుకుచు ఘాత చేసిన, నాఖండలనందనుండు దంభోళిసంకాశంబులైన యయిదుబాణంబులు గాండీవంబునం దొడిగి సురథుని వక్షంబు భేదించిన, వాఁడును విసంజ్ఞుండై, చేవ దగ్గి ధరణీతలంబునం బడియె.<noinclude><references/></noinclude> brflg0r2f5r4ne1kfr1ulu1drhzj4ix పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/96 104 186359 554036 504582 2026-04-22T04:41:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554036 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}అర్జునుఁడు సురథునిం జంపుట</p> అంతలో రమాకాంతుం డెప్పటితెఱంగునఁ దే రాయత్తంబుసేసి, పార్థుండును దాను నెక్కి, దేవదత్తపాంచజన్యంబులు పూరించుటయు, సురథుండు సారథి తెచ్చిన వేఱొక్కతేరిమీఁదఁ దాను నవలీల నెక్కి, నిరర్గళమార్గణాసారంబులు గురియుఁ బోటుపంతంబు మాటలాడం దొడంగిన, ధనంజయుండు సురథునిం జూచి, 'యవశ్యంబును భవదీయమస్తకంబు ఖండింతు, నట్లు చేయనైతినేని నా పూర్వజులకు ద్రోహంబు సేసినవాఁడ నగుదుˈ ననిన, సురథుండు పార్థునిం గనుంగొని, 'నీశరీరం బవశ్యంబు ధరణీతలంబునం బడద్రోయుచు, నట్లు చేయనైతినేని నీ చెప్పిన శపథంబె నాకును సరి' యనుచుఁ, గిరీటిపై ననేకకోటిబాణంబులు నిగిడించిన, వానిం ద్రుంచి యతండు సురథునిపై శతసహస్రసంఖ్యాతంబులైన విశిఖంబులు సంధించె. అంత నా సురథుండు రోషారుణలోచనుండై వివ్వవచ్చు వింటినారిఁ ద్రెవ్వ నేయుటయుఁ బార్ధుఁడు వేరొక్కనారి సవరించి, రథంబు చెక్కలు గావించిన, నతండు వేఱొక్కశతాంగంబుపై నెక్కి, యుద్ధతి మోహరించుటయుఁ, బార్ఖుండు దానిని బహుశకలంబులు గావించె. క్రమ్మఱ నొక్కరథం బెక్కినం దునిమె. మఱియు నొక్కశతాంగంబు నధిరోహించిన ఖండించె. ఇవ్విధంబున నూటయెనిమిదిరథంబులు పొడిచేసిన, సురథుండు విరథుం డయ్యుఁ గార్ముకంబు సాధింపుచుఁ, దూణీరంబునకుం గేలు సాచి బాణంబు నందుకొనునంతలో నర్ధచంద్రాపగంబున నతనిబాహువు ఖండించె. అట్లు ఖండితబాహుఁ డయ్యు శౌర్యంబు వదలక సురథుండు కేలం గద యమర్చికొని, త్రిప్పుచుం బఱతెంచి కిరీటి తేరి గుఱ్ఱంబులం జదియమోఁది, రెండువేలయేనుంగులు బీనుంగులు గావించి, యన్నియరథంబుల మర్దనం బొనర్చి, పదివేలవీరయోధుల మడియించి, యన్నియతురంగంబులఁ గీటడంగించి, సింహనాదంబు సేసినం, గిరేటి కృష్ణసర్పోపమానం బైన క్రొవ్వాడిమెఱుంగుఁదూపు వింటం దొడిగి గదతోడంగూడ భుజంబు ఖండించిన, రెండుభుజంబులు లేకుండియు, గొమ్ములు లేని యేనుంగుకైవడి నౌద్ధత్యంబునఁ పాదఘాతంబులచే రథరథ్యసారథిమాతంగతురంగంబుల మర్దింపుచు వచ్చునెడ, బాండవమధ్యముండు రెండుబాణంబులచే రెండుపాదంబులు ఖండించిన, సురథుండు దొర్లివచ్చుట కనుగొని యింద్రనందనుండు<noinclude><references/></noinclude> l8i3nwfqmmh11tuj2m8urgvrd6choip పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/97 104 186360 554038 504583 2026-04-22T04:50:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554038 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కనకపుంఖవిభ్రాజితంబును, మయూరపత్రచిత్రితంబును, ననేకసూర్యప్రకాశంబునైన సాయకంబు సంధించి యభిమంత్రించి యేసిన, నది యతిరయంబునం బోయి సురథుని శిరంబు ఖండించిన, నా శిరంబు రాతిమీదం బడినచందంబుగా బెట్టుగా మిట్టిపడి పార్థునిమస్తకంబుమీఁదం బడుటయుఁ బిడుగు పడుచందంబున రిమ్మవట్టి, కిరీటి వివశుండై, భూతలంబునం బడియె. సురథుని మొండెంబు కరితురగరథ సమూహంబుల నుగ్గునూచము చేయుచుఁ జేగుఱుకొండచందంబునఁ గుంభినీతలంబునఁ గూలె. అంత, మూర్ఛనొంది పుడమిపయిం బడిన కౌంతేయునిం గనుగొని, దనుజాంతకుండు నిజపాణిపల్లవంబుచే మేను నిమిరి సేదదీర్చినం గిరిటి స్వస్థుండై నిలిచె. {{p|ac|fwb}}శ్రీకృష్ణుండు గురుత్మంతునిఁ దలంచుట</p> అంత సురథుని శిరంబు నెత్తామరమీఁద వాలు మధుకరంబుతెఱంగున శ్రీహరి చరణారవిందంబులమీదఁ వ్రాలె. అప్పురుషోత్తముండు నయ్యుత్తమాంగంబు కేలంగైకొని పార్జునకుం జూపి, 'యితండు ప్రాణావసానసమయంబు నందును సత్యంబు దప్పఁడు. శీలవంతుఁడును, దాంతుండును, సమరదురంతుఁడును నయిన యీ యుత్తమశ్లోకుండు నిఖిలలోకవందనీయు' డనుటయు, సంక్రందననందనుండు పరమానందంబున నందుకొని, తచ్చిరంబునకు వందనంబు గావించె. అంత మురాంతకుండును రాజతనూజుఁ గృతార్థుఁ జేయ నూహించి, వైనతేయుం దలంచిన, నిబ్బరంపుమబ్బులోనం గబ్బిమీఱు విద్యుల్లత తెఱంగున విద్యోతమానంబులైన ఱెక్కలవలన మిక్కుటంబుగాఁ బొడమిన ఝంఝామారుతంబుచేఁ గులపర్వతంబు లొడ్డగిల్లునట్లుగా నెగసి వచ్చి సన్నిధానంబున నిలిచి, 'దేవరదాసుండునగు నేను వచ్చితి; నేమి కార్యంబున నియమించెద?' వని పలుకుటయు, నుపేంద్రుండు ఖగేంద్రునిఁ జూచి, 'నీ వీశిరంబు గైకొని శీఘ్రంబుగా నరిగి ప్రయాగలోఁ ద్రివేణీమధ్యంబున వైవుము. సురథుం డుత్తమలోకంబు గాంచుఁ గాక!' అనిన నాగాంతకుండు నరకాంతకుని యానతి శిరసావహించి, 'దేవా, భవదీయదివ్యపాదారవిందంబు లొకసారి మదిం దలంచినంతనే యెట్టి మానవుండైనను గృతార్థుండై పరమపదంబు నొందు. అట్టి మీ భక్తునిం దలంచినవారికిఁ దీర్థయాత్రాఫలంబు సేకూరు ననునెడ భవదీయభక్తులకుఁ దీర్థయాత్ర లేమిటికి? అయినను మీ యానతి<noinclude><references/></noinclude> l9ozkedi3vqi2tbybch5suamqxdnf1b పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/98 104 186361 554039 504584 2026-04-22T04:58:17Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554039 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యనుల్లంఘనీయంబు గాన నట్లే గావించెద,' నని పలికి, యమ్మస్తకంబు గైకొని గురుత్మంతుండు నిజపక్షవిశేషంబులచేఁ గిరుల నూటాడం జేయుచు వచ్చునెడ సదాశివుండు పార్వతీసమేతంబుగా వృషభారూఢుండై యంబరంబునం జనువాఁడు, తనయొద్ది భృంగిటినిం జూచి, 'నీవు జవంబునం జని గరుడం డెత్తుకపోవు శిరంబుఁ దీసికొని రమ్మ'ని పంపుటయు, భృంగిటి వైనతేయుం జేరవచ్చి యతని ఱెక్కలగాడ్పులో సుడివడి సురగలిలోనం దగిలినచొక్కాకుచందంబునఁ బెద్దయుం బొద్దు తిరుగుడువడి యెట్టకేలకు విడివడి, యతిరయంబున బఱతెంచి, 'దేవా, మహాదేవా, ఇక్కార్యంబు నా కశక్యం' బనుటయుఁ, బార్వతీదేవి నాథుని విలోకించి నవ్వుచు నిట్లనియె. 'అత్యంతవికారంబులైన యంగంబులం గనుపట్టు భృంగి పరమభృత్యుండు. పిశాచంబులు సఖులు, మంచముకోడు కైదువు. ఇంటింటఁ బిచ్చంబే కూడు. పునుకలపేరు హారంబు. ముదియెద్దు పడివాగె తేజి. ఇన్ని యమంగళంబులు గలమీకు సంగరజయం బబ్బుట కేమి యాశ్చర్యంబు?' అని పరిహాసంబు లాడు శైలరాజకన్యకం గనుగొని నవ్వి, యవ్వృషభాంకుండు తారకాసురవైరి నవలోకించి, 'షణ్ముఖా, నీవు పోయి తచ్చిరంబు గొని రమ్మ' సుటయు, నతండు గరుడనివెనుకం బఱచి, కూడం జాలక, తదీయపక్షవిక్షేపజాతంబు లైన వాతూలంబులచేఁ ద్రిలోకంబులఁ దిరుగుచు నెట్టకేలకు గరుడునిం గూడె. అంతలో భాగ్యవశంబునఁ బ్రయాగ తోఁచుటయు వినతానందనుండు త్రివేణికామధ్యంబున సురథుని శిరంబు వైచిన, నీటిలోనం బడకమున్నె కుమారస్వామి తూఱి యెత్తుకొని వచ్చి మహాదేవుని సన్నిధి నునిచె. అతండుం దానిం గరాంబుజంబునఁ బట్టుకొని హిమశైలబాలికకుఁ జూపి, 'దానశూరులు, దయాపరులు, సత్యవ్రతపరాయణులు, జితక్రోధులు, మాతాపితృభక్తులు నైనవారల శిరఃకపాలంబులు నేను హారంబుగా ధరియింతు. ఈ యుత్తమశ్లోకుని యుత్తమాంగంటు తన్మధ్యంబున నాయకరత్నంబుగాఁ దాల్చెద,' నని ధరియించె. అంత నాగాంతకుండు సత్వరంబుగాఁ జని మురాంతకున కవ్వృత్తాంతం బెఱిగించి, తదనుమతంబున యథేచ్ఛంబుగాఁ జనియె. అనిన విని జనమేజయుండు జైమినిం గనుంగొని తరువాతివృత్తాంతంబు వినవలయుననియె.<noinclude><references/></noinclude> mniix44rcklj3ckbw1ne4c20ee84joe పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/99 104 186362 554040 504585 2026-04-22T05:01:43Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554040 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|<poem>గద్య ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగ చొక్కనాథ మహీనాథ కరుణాకటాక్షసంపాదిత గజతురంగమాందోళికా ప్రముఖ నిఖిలసంపత్పారంపరీ సమేధమాన సముఖ మీనాక్షీనాయకతనూభవ మీనాక్షీ దేవీకటాక్షలబ్ధకవితాసంప్రదాయ వేంకటకృష్ణప్పనాయకప్రణీ తం బైనజైమినిభారతం బున నశ్వమేధపర్వ మ్మను వచనకావ్యంబు నందు ద్వితీయాశ్వాసము.</poem>}}<noinclude><references/></noinclude> f1pvv55bfkpx57wq4ciuscgsa1g3ndn పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/100 104 186363 554045 504586 2026-04-22T06:03:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554045 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}} {{p|ac|fs150}}జైమినిభారతము</p> {{p|ac|fs125}}తృతీయాశ్వాసము</p> {{Telugu poem|type=క.|lines=<poem>శ్రీపాండ్యధరాభరణా, భూపాలకమకుటరత్నపూజితచరణా, రూపరతిస్మరనిర్వ్యా జోపకృతీ, విజయరంగ చొక్క నరపతీ!</poem>|ref=}} అవధరింపుము. జైమిని మునీంద్రుండు జనమేజయ నరేంద్రునిం గనుంగొని, తదనంతరంబు హంసధ్వజుండు బలపరాక్రమసంపన్నులయిన కొడుకు లిరువురు సమరంబునఁ గూలుటయు, సైన్యంబులు పరాజయంబు నొందుటయు, నాకర్ణించి కోపాటోపదీపితుఁడై చెదరిన బలంబులనెల్ల గలయం గూర్చి సమర, సముత్సాహదోహలంబులైన వీరకాహళంబులును, నిస్సాణంబులును, భూనభో౽౦తరంబులఁ బూరటిలంజేయ, నిజభుజపరాక్రమంబుచే మాధవు నారాధింపఁ దలంచి సింహనాదంబులు, నట్టహాసంబులు, నార్పులు, బెడబొబ్బలు, జంకెనలు, గజఘీంకారంబులు, శింజినీటంకారంబులు, వీరహుంకారంబులు, భుజాస్పాలనంబులు, ధ్వజపటపటాత్కారంబులు, రథచక్రఘోషంబులు, హయహేషారవంబులు, రత్నభూషణంబుల ధగధగలు, కైదువుల ధళధళలు, నీఁటెల నిగనిగలు నొక్కుమ్మడిం గ్రమ్మ, సాగరంబు పొరలినతెఱంగున నాహవయజ్ఞంబునఁ బ్రాణంబు లాహుతులు సేయందలంచి, సాహసంబున మోహరించి వచ్చు నా హంసధ్వజుం గనుంగొని, కంసవైరి కరుణాకలితమానసుండై, దిగ్గనం దేరు డిగ్గి, పీతాంబరంబు వలెవాటు జాఱ, వనమాలికాపరిమళంబు మీఱ, గంధసింధురగంభీరగమనంబున నెదురు వచ్చుటయు, నమ్మహీనాథుండును తోడనే యరదంబు దుమికి, భక్తివినయసంభ్రమంబులు మనంబునం బెనంగొనం జనుదెంచి, పాదారవిందంబుల వ్రాలిన, శ్రీవల్లభుండు శుభలక్షణలక్షితంబులును, శార్ఙ్గ<noinclude><references/></noinclude> au352bacqiozgzairjy3nasrkwphqre పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/101 104 186364 554048 504587 2026-04-22T06:59:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554048 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మౌర్వీకిణాంకితంబులును, లక్ష్మీవిరచితమకరికాపత్రాభిరామంబులును, గరికరోపమానంబులునైన తనభుజంబులం జాచి లేవనెత్తి, యా మండలేశ్వరుని నిండుకౌఁగిటం జేర్చి, భక్తవాత్సల్యంబునం గన్నుల బాష్పంబు లొలుక నూఱడించుచు, 'రాజచంద్రా, జననమరణాదిసుఖదుఃఖములు బ్రహ్మాదులకైనం దప్పవు. నీ కుమారు లిరువురు సమరయజ్ఞంబు సాంగంబుగా నెఱవేర్చి ప్రాణాహుతులు గావించి మమ్ముం దృప్తి నొందించి మాసాయుజ్యంబు నొందిరి. వారికై వగవం బనిలేదు.' అనిన విని, హంసధ్వజుండు, 'కంసాంతకా, దేవరపాదపద్మంబులు సేవింపంగోరి కయ్యంబునకుఁ బూనితి. నా మనోరథంబు ఫలియించె. ఇహపరసౌఖ్యంబులకు నిధానంబైన తావకదర్శనంబు లభించె. ఇఁక నాకు దుఃఖంబు గలుగదు.' అనిన, గోవిందుండు 'నరాధిపా, నీసఖ్యంబు మాకు దొరకె. నీ వాప్తబంధుండవు. పాండవులు నాకుం బ్రియులగుట నీకునుం దెలిసియుండుఁ గావున నిఖిలసేనాసమన్వితుండవై యశ్వంబు రక్షించుచు, నర్జునునితోఁ గూడవచ్చి, ధర్మనందనుని యాగంబు నిర్వహించి, యాతనిచేఁ బూజితుండవై వచ్చుట మాకుం బ్రియంబు'. అని సవ్యసాచిసమేతంబుగాఁ దత్పురంబునకుం జని, యతనిచేఁ బూజలు గాంచుచు, నయిదురాత్రులు వసియించి, యంబుజనాథుఁడు హస్తినాపురంబునకుం జనియె. తదనంతరంబు విజయుండు హంసకేతనునితోడంగూడఁ దురంగంబుఁ దరలించుకొని చనుటయు, నయ్యశ్వంబు పవనజవంబున నుత్తరాభిముఖంబుగాఁ జని చని, యెండతాఁకునం గొట్టువడి, యొకవనాంతరంబు జొచ్చి, నవరత్నఖచితసోపానంబులును, నమృతోపమానంబులైన తేటనీళ్లును, జెంగలువలు, తెలిగలువలు, తెలిదమ్ములు, జెందమ్ములు నందమ్ము మీఱ నొక్కసరోవరంబు సొచ్చె. {{p|ac|fwb}}సవనాశ్వము గోడిగయై పులి యగుట</p> (అప్పు డది) కంఠదఘ్నజలంబుల నిలిచి, సలిలంబు గ్రోలి, తనిసి వెలుపలికి వచ్చి, యందు నరుదంది కనుంగొన గోడిగ యయ్యె. క్రీడి యది కనుంగొని విచారంబు నొందునెడ, నయ్యశ్వాంగన వేఱొక్కకొలనికిం జని, జలంబులు గ్రోలి, తోడనే బెబ్బులి యయ్యె. అనిన విని, 'మునీంద్రా, అట్లగుటకుం గారణ మేమి?' అని యడిగిన జనమేజయునకు జైమిని యిట్లనియె.<noinclude><references/></noinclude> 5ehd2eq038uikimrzermdn0cgojlimc పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/102 104 186365 554049 504588 2026-04-22T07:08:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554049 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}స్త్రీమండలవృత్తాంతము</p> తొల్లి దాక్షాయణి శంభు నుద్దేశించి, వినయంబుతోఁ దపం బాచరించుచుండ, దుర్మదాంధుఁడైన యొక్కరక్కసుం డద్దేవిని జెనకంజూచిన, హుంకారంబుచే వాని భస్మంబు గావించి, 'యిదిమొద లేజంతువు లీజలజాకరంబు సొచ్చిన తోడనే యాఁడుజన్మంబుఁ జెందుగాక' యని శపియించెఁ, గావున నీగుఱ్ఱంబు గోడిగ యయ్యె. అది యట్లుండె, మున్ను కృతయుగంబున నకృతవర్ణుండను మునివరుండు తీర్థయాత్ర సేయుచుఁ బుణ్యస్థలంబులు, నదులు, నదంబులు, తటాకంబులు నవలోకించుచు, దత్సరోవరంబునకు వచ్చి యఘమర్షణస్నానంబు గావించునెడ, నొక్కమొసలి యతని పాదంబులు పట్టుకొని తివియుటయుఁ బెనంగి విడిపించుకొని, ‘నేడుమొద లేజంతువు లిందు జొచ్చిన వ్యాఘ్రంబు లగుంగాక' యని శాపం బొసంగె. అది కారణంబుగాఁ బెద్దపులి యయ్యె. అవ్విధంబు గనుంగొని పార్థుండు ముందు తోఁచక శ్రీకృష్ణదేవుని మనంబున ధ్యానంబు సేయుటయు, నా హరి కరుణాకటాక్షంబుచే వ్యాఘ్రం బెప్పటి ఘోటకం బయ్యె. అంత భేరీపటహాదివాద్యంబులు మ్రోయ రయంబున ననేకదేశంబులు క్రమించుచు, జని యాఁడుమండలంబునకుం జనియె. తద్దేశంబునకు రాణి నీలనిభవేణియు, రాకేందుబింబవదనయుఁ, గుందకోరకసమానరదనయుఁ, బల్లవాధరయుఁ, గంబుకంధరయుఁ, బర్వతోపమానవక్షోరుహయు, మల్లికామృదుబాహయు, నణుమధ్యయు, నతిపుణ్యసాధ్వియు, జలజనిభపాణియు, సైకతశ్రేణియు, రంభాసమోరుకాండయు, రాజీవరక్తచరణయు, రత్నమయసర్వాభరణయు నై, హావభావవిలాసవిభ్రమంబులు నింపు మీఱుచు, పురుషునిమనం బెఱింగి శృంగారవిలాసంబులం బ్రొద్దులు పుచ్చుచు, సరసవాగ్విలాసంబులు నెరపుచుఁ, బ్రమీల యనునామధేయంబు గాంచి, నరులకు, సురల, కసురులకు, సిద్ధులకు, సాధ్యులకు నసాధ్యమైన ధనుర్విద్యాకౌశలంబునం బొలుపొందుచు, ధైర్యవీరసాహసంబు లుగ్రశానంబు లుక్కు మెఱయ, లక్ష యేనుంగులు, నన్నియ గుఱ్ఱంబులు, నన్నియ రథంబులును, విషకన్యకలనం బరగిన పదిలక్షల కన్నెలు గదాముసలముద్గరభిండివాలతోమరశక్తిముసుండిశరశరాసనఖడ్గఖేటకాద్యాయుధంబులతో గరిడిసాధనల నెప్పుడుఁ జరించుచునుండ, నఖండితవైభవంబున రాజ్యం<noinclude><references/></noinclude> ce6omhyrdkpqur6qugo9j1l23883c65 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/103 104 186366 554053 504590 2026-04-22T08:06:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554053 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బేలుచునుండు. తద్దేశంబునకు మార్గవశంబున బోయిన పురుషులను జేరంబిలిచి యందలి యిందుముఖు లమృతమధురాలాపంబుల నాహ్లాదంబు పుట్టించి వశీకరించి యొక్కొక్కపురుషునితోఁ బెక్కండ్రువనితలు క్రీడించుచుండ, నొక్కమాసంబులో నాపురుషుండు పరలోకంబున కరుగు. వానితో రమించిన యక్కాంతలందఱు నగ్నిప్రవేశంబు సేయుదురు. అం దొక్కయువతికి గర్భంబు నిలుచు. అది కనియెనేని యాఁడుబడుచుం గాంచుఁగాని, పుత్రునిం గాంచదు. ఇది యాదేశంబునందలి నడవడి. జనమేజయ నరేంద్రా, విజయభుజవిక్రమరక్షితంబైన యశ్వరత్నం బవ్వీటిసమీపంబునకుం జని, పచ్చిక మేయుడు నుండునెడఁ గఱివంక కనుబొమ్మలవంకలకుఁ గొంకిన చందంబున గుడువడం దిగిచిన సింగాణివిండ్లును, గలికిచూపుల కలికి వెనుకదాఁగినవితంబున నంపపొదులలోనం బొదలుల కోరి కోలలును, వట్రువగబ్బిగుబ్బలు గనుంగొని భ్రమపడినచందంబున బిఱబిఱఁ దిరుగు చక్రంబులును, బెడంగుజడల యందంబునకు వణంకెడుచందంబునఁ దళతళమని కత్తులు మెఱయ వీరశృంగారరసంబు లంగనారూపంబు గైకొన్నకైవడి, వీఁక మీఱు రాకేందుముఖులు, తేజీలు దువాళింపుచుఁ గోకిల లొక్కుమ్మడిఁ గాకలీస్వనంబు లొనరించుకరణి వీరాలాపంబులు, నార్పులు, నట్టహాసంబులు, పంతంబులు మెఱయం బాఱుటయు, నం దొక్కకుందరదన గుఱ్ఱంబు మీటి యధ్వరహరిం బట్టుకొని వచ్చి తమ యేలికసాని సమ్ముఖంబున నిలిపి, 'రాజరాజేశ్వరీ! ఈ హయంబు ధర్మజునిచే విడువఁబడినది. హయరక్షణార్థంబుగాఁ బరాక్రమోపార్జనుండగు నర్జునుఁడు చనుదెంచియున్నవాఁ డ'ని పలుకరించిన, నయ్యంగనామణి బంగరురంగులం దురంగలించు తురంగశాలలోనఁ గట్టుటకు నియమించి, యంతరంగంబున నెంతయు సంతసం బెసంగ, 'నేటితో నా కోరికలు నెఱవేరె. సుఖంబు సమకూరె. సందియంబు లేదు. ఇందుకొఱ కాపురందరనందనుం డిచ్చటికి వచ్చు. ఇది మొద లనుదినంబును వానితోడం గూడెద. నాపాలి దైవంబులను వేడెద’నని, యెడవీడని కోరికలు పొడమ, నప్పడఁతుక పదివన్నియ బంగారునకు మెఱుంగు పెట్టిన హొరంగునఁ, బైగోవవ్వాదికిఁ బువ్వుఁదావి గట్టినరీతిఁ, జిన్నారిజాబిల్లిమీఁద సుధారసంబు చిలికించిన చందంబున, రంగైన యంగంబును, శృంగారింపఁ దొడంగి, యంగజుని, చక్రంబులంభోలెఁ దళుకు తళుక్కునఁ జెక్కులుఁ గుల్కు కళ్ళు రతనంబుల కమ్మలు<noinclude><references/></noinclude> e97jy872g9jh6f8xcpq8dmj9oli632n పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/104 104 186367 554054 504591 2026-04-22T08:17:37Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554054 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వెట్టి, చివురాకుఁ గెమ్మోవి కెంపులసొమ్ము మీఱు సుపాణి ముత్యపుముంగర ధరియించి, వింతవింతమణుల కంఠసరములు, కంటెయు, సేవళంబును, ముత్యాలదండలు, సందిటికడెంబులు, ప్రత్తికాయతాయెతులు, కంకణంబులు, రవలగాజులు, కడెంబులు, మొలనూలు, నొడ్డాణంబు, నందెలు, పాడగంబులు, పాద(రసములు)సరములు, మెట్టెలు, బిల్లాణులు, వీరముద్రికలు మొదలగు నానావిధభూషణంబులఁ గైసేసి, తన యనురాగరసంబు వెల్లువ గట్టెనో యన, నందంబగు చందురుకావిపావడపైఁ దన(మనో)మాలిన్యంబు వెలి కుఱికినతెఱుంగున, మవ్వంపుఁజువ్వ నివ్వటిల్లు రాయంచయంచుల మించు పైఠాణిదుప్పటంబు గట్టి, మట్టు మీఱిన మదనానలంబు తన్నుఁ బట్టుకొనినతెఱంగున నిండు తగటి ఱవిక కుంకుమపూఁత పొంకంపుసిబ్బెంపుగుబ్బల గబ్బు మీఱ నిండు ముస్తీబు చేసి, చిలుకతేజీవజీరుని తేజితెఱుంగునఁ గనుపట్టు మరకతంపుఁ బిడెంపుబాకు చేపట్టి, విరజాజిసరులతావియుఁ బైగోవజవ్వాజిపట్టెలవాసనయు, దిక్కుల గుమ్మని క్రమ్మ, గిలుకుపావలు మెట్టి, నెమ్మిమై మేఘమండలంబు వెలువడు క్రొక్కారు మెఱుంగుతీవియవోలె నంతిపురంబు వెలువడి, యాప్తలైన చెలికత్తెలు వెంటరా, బంగరుగుమ్మలం బోలు నండజయానలు దడలం జేరి కైదండ లొసంగ, నవరత్నఖచితంబగు బంగరుబెత్తంబుల మొత్తంబులు చెలంగఁ గటికవారలు 'రాజరాజేశ్వరీ, రాజపరమేశ్వరీ, కేరళదేశాధీశ్వరీ, స్వామినీ, పరాకు, హెచ్చరిక, జితను, సావధానత,' అని హెచ్చరికలు దెలుప, నల్లనల్లన వచ్చి, డాలుమీఱు పగడాలకంబంబులు, దారవజ్రంబుల బోదెలు, జీవదంతంపు దంతెలు, నీళంపు దూలంబులు, కెంపుటోడుబిళ్లల పైకప్పడంబును, నానారత్నవిచిత్రంబులు, బాలభానుప్రభాభాసమానంబులు, గగనలక్ష్మీనివాసంబులు నైన తమ్మిరేకులఁ బొలుపొందు, కనకకలశంబుల విలసిల్లు ద్వారంబులును, జంద్రకాంతమయంబులైన వజ్రమణిమయగజరాజశోభితంబులైన పార్శ్వంబులం గనుపట్టు సోపానంబులును, హెచ్చురతులు పచ్చరాతిన్నెయుఁ, గలశంబులు తుండంబులఁ గైకొని యభిషేకంబు లొనర్చు దారవజ్రంపుటేనుంగు లిరుగడలం గడలుకొన, మూర్తీభవించిన సామ్రాజ్యలక్ష్మివలె నొప్పుచు, లక్ష్మీవిగ్రహంబులం బొలుపొందు ద్వారదేశంబులం గలిగి, జాళువా సరిగకుట్టుపని హరువులప్రతిమలం బ్రతిలేని తెరలును, కొత్తముత్తెంబుల జల్లుల మేలు<noinclude><references/></noinclude> hfx8biycdf4590mnnh7gt9j2dv63tv4 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/105 104 186368 554067 504592 2026-04-22T10:01:42Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554067 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కట్లును, నెమలిఱెక్కలఛాయలం బ్రతిక్షణంబును వింతలైన కాంతులు మంతు మీఱ రత్నగర్భయైన పుడమి కన్నకరణి నున్న తివాసుల నొప్పుచు, సుధర్మాస్థానంబుకరణిఁ బ్రభాశోభితంబైన వాటంబును, ప్రభావిజితమేరుకూటంబును నగు కొలువుకూటంబున, భానుకిరణంబులతో వాదంబులు సేయుపాదంబులును, బసిఁడిగట్టుపై తట్టువలెఁ గనుపట్టు విస్తారంబును గలిగి, గోమేధికపుష్యరాగమరకతముక్తాప్రముఖనిఖిలరత్నవిరాజితం బైన గ్రహనక్షత్రతారకానికరకోరకితం బైన యాకసంబుతెఱంగున (రమ్యంబును), నఖిలసురాసురపూజితంబు నైన సింహాసనంబునం గూర్చుండి, సామదానభేదదండోపాయలగు మందయానలు సందడించి కొలువ, నొక్కచక్కిఁ జక్కెరబొమ్మలు చక్కెరయు చక్కెఱలకన్న మిక్కుటంబైన చొకాటంబులు నైనదండకతారావళీప్రముఖప్రబంధంబులు విన్నపంబు సేయ మఱియొక్కదిక్కున రాకేందువదనలు మీమాంసావ్యాకరణాదిశాస్త్రంబు లనర్గళప్రవాహంబులుగా నుపన్యసించ, వేఱొక్కచాయఁ బల్లవాధరలు బ్రహ్మాండపురాణంబు, విష్ణుపురాణంబు, పద్మపురాణంబు మొదలగు నష్టాదశపురాణంబులు, కథలు వినిపించి, మరొక్కదిక్కున నీలవేణులు చిత్తరుబొమ్మలవలె శిరఃకంపనము చేయుచు, జంత్రగాత్రంబులఠాయి గీతప్రబంధంబులు ఘననయదేశీయంబులు వినికిసేయ, నొకవంక మకరాంకవిజయపతాకలం బోలె రంభోర్వశీమేనకాదుల నెంత లేదను బిరుదపాత్రలు చర్చరి బారి మొదలగు పదిఁయారునాట్యంబులు నభినయంబులు గనుఁగొనిపింప, నొక్కప్రదేశంబునఁ గలకంఠకంఠులు పరిహాసంబులు వినోదంబులుగాఁ బ్రసంగంబులు సేయ, నిరువంకల రవలకంకణంబులు ఘల్లుఘల్లనఁ బంకజాక్షలు కనకదండమండితంబులైన ధవళచామరంబులు వీవఁ, గత్తి, కేడెంబు, సురె, చికటారి, సిడెము, వంకి, పట్టిస, బాణముసలముద్గరభిందిసాలములు, బరిచి, నేజా మొదలగు ముప్పదిరెండాయుధంబులు, గుండె కాళంజియు, జేమిపావడ యడపంబును, గిండి సురటియు, నిలువుటద్దంబులు మొదలగు మహారాజచిహ్నంబులఁ బూని యూడిగంపుజెలువ లూడిగంబులు సేయ, సాక్షాత్కరించిన వీరమోహిని చందంబునఁ నిండోలగంబున నుండె. అంతఁ గుంతీసుతమధ్యముండు కాంతాజనులు మఘవాజిం గొనిపోయి రని చారులు పలుకరించిన నవ్వి, తగిన రాయబారులం బనిచి 'గుఱ్ఱంబు విడువు'<noinclude><references/></noinclude> if22u0lzmd3xdtf954j3pimv9hyil0h పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/106 104 186369 554069 504593 2026-04-22T10:12:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554069 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మని మందలించినయెడ, నమ్మండలేశ్వరి ముఖచంద్రమండలంబున వెన్నలయునుంబోలె మందహాసంబు గందళింప 'గిరీటి మేటివీరుండని వింటిమి. అతని రణకౌశలంబు పరీక్షింపకయె కవ్వడిం గడవనీయము. నే నిదే సమరసన్నాహంబుగా నరుగు దెంచెద. పార్థుని రమ్మనుఁడు, పొండు.' అని బహుమానంబులు సేసి పంపిన, నియోగులు వేగంబె యరుగుదెంచి వివరించిరి. {{p|ac|fwb}}ప్రమీలా విజయుల యుద్ధము</p> యవ్విజయునకు అంతఁ దురంగ మాతంగ శతాంగ వీరభట మహార్భటీసమేతంబుగాఁ బ్రమీల మోహరించి, రథచక్రఘోషంబుసు, గేతనపటాత్కారంబును, గార్ముకజ్యానాదంబును, లలితమధురసింహనాదంబును, భూనభో౽౦తరంబు దీఁటుకొన, శతమఖతనయుం గాంచి, తనకులుకుజూపులంబోని వాలుతూపులు వింటం సంధించి రథరథ్యకేతనసమేతంబుగా నించుటయుఁ, బార్థుండును నంగనతోడి కయ్యంబునకు రోయుచుఁ, దీఱనికతంబున మూఁడువాఁడితూపులు సంధించి యేయుటయు, నది తోడనే ఖండించి తీవ్రముఖంబులైన శిలీముఖంబులచే దశదిశాముఖంబులు గప్పి, తక్కినబోటులు ఘోటకంబుల మీఱి, సామజంబులఁ బురికొల్పి, రథంబులం దోలి, చిలుకుటమ్ముచేఁ గ్రుచ్చియు, నీఁటెలం బొడిచియుఁ, బట్టిసంబుల నఱికియు, శూలమ్ములం గ్రుమ్మియు, వంకులఁ జిమ్మియు, జముదాళ్ళం బొడిచియు, గదల నడిచియు, ముసలంబుల మోదియు, ముద్గరంబులఁ జిదిమియు, గిరుసకత్తుల విదళించియుఁ, జిరుతకడ్డియలఁ గొట్టియుఁ, దారసిల్లిన నయ్యిరువాఁగును బూర్వపశ్చిమసముద్రంబులవలెం దాఁకి తుములంబుగా సమరంబు గావించునెడఁ, బ్రమీల యింద్రనందనుం జూచి, 'కిరీటీ, మమ్ము నీబోఁటికిం గెలువఁగూడదు. నీకే కాదు. అనిమిషసిద్ధసాధ్యగరుడోరగాదులేనియు నన్ను గెలువలేరు. {{p|ac|fwb}}ప్రమీల యర్జునుని మోహించుట</p> నీకు గుఱ్ఱంబు గావలయునేని దురాభిమానంబు మాని ప్రియంబున నన్ను వరియించిన హయంబు నిత్తుంగాక. లేకయున్న నిన్నుం బోనిత్తునే? నీ యగ్రజుండైన యుధిష్ఠిరుండు సోమపానంబు సేయి నిమ్ము. నీవు నా యధ<noinclude><references/></noinclude> 4fvo1bxqkw74enycvc73iu10ryulf82 పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/107 104 186370 554071 504594 2026-04-22T11:45:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 554071 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రామృతపానంబు సేయుము. అతఁడు కురుదేశం బేలనిమ్ము. నీవు నా(మనో)దేశం బేలుము. ఈదేశంబునకు నీవె యొడయుడ వయ్యెదవు.' అనిన ధనంజయుండు దరహాసంబు నెమ్మొగంబునఁ గనుపట్ట, 'జవ్వనీ, నిన్నుం గూడిన నరుండు మాసమాత్రంబునఁ బంచత్వంబు నొంది యధోగతికిం జను. అంతట యువతీమండలం బేలువాఁ డెవ్వఁడు? ధర్మజునకు మరల హయంబు సేర్చువారెవ్వరు?' అనినం బ్రమీల వాలారుమెఱుఁగుఁజూపులం జూచుచు, 'నీవు దైవయోగంబున మాదేశంబునకు వచ్చినవాఁడవు. ఇంక నెచ్చటికిఁ బోవంగలవు? ఎట్లయిన నీ ప్రాణంబు లపహరింపకమాన. నామహోగ్రబాణంబులచే నీమేను జల్లెడక్రంతలుగా గాయంబులం బడి వేదనం బొరలుచు వృధా ప్రాణంబు లప్పగింప నేల?' అనినఁ గన్నులఁ గెంపు నింపుచు నిలింప పతినందనుండు నారి నాఱమ్ములు సంధించి యేసిన, నవ్విలాసిని యన్నియ నారసమ్ముల దానిని రూపఱంజేసి, వెండియు నేడువాఁడిబాణంబులు మేనం గీలించి, మఱియు వేల కొలంది తూపులవాన గురిసిన, సురపతితనూభవుండు సమ్మోహనాస్త్రంబు వెంట సంధించిన, నవ్వాలుగంటి యయ్యస్త్రంబుతోడం గూడ గాండీవగుణంబు ఖండించిన, నరుండు కోదండంబున వేఱొండునారిం గూర్చి, 'యిన్నారిం బరిమార్పక మాన' నని కట్టలుకఁ గనుబొమ ముడిపాటు గదియించుటయు, నాకాశవాణి, 'అర్జునా, నిర్జరులకైనం దీనిఁ గెలువ శక్యంబు గాదు. నీవు పదివేలయేడులు పోరినం జయంబు చేకూరదు. రిత్తయాయాసం బేమిటికి? ఒకనాటిరాత్రి దీనిఁ దనియించి హయంబు గొని యథేచ్చంబుగా జనుము.' {{p|ac|fwb}}ప్రమీల యర్జును నంతిపురంబునకుఁ గొనిపోవుట</p> అనిన (విని) అర్జునుండు నమ్ములు విల్లు నరదంబున నునుచుటయు, నయ్యంగన యతిత్వరితంబుగా వచ్చి యారిఁలింగనంబు సేసి, పురంబునకుం దోడుకపోయి యంతిపురంబున బంగరుపడుకటింటం బువులపాన్పున లీలావినోదంబునం బ్రొద్దుగడపి, మరునాడు మత్తమాతంగమణిభూషణావశులతోడఁగూడ మఖవాజి నర్పించి మ్రొక్కుటయు, నయ్యర్జునుండు సాదరంబుగా వీడ్కొని చనియె. అని చెప్పి మఱియు జైమిని మునీంద్రుండు జనమేజయ నరేంద్రునిం గనుంగొని యిట్లనియె:<noinclude><references/></noinclude> nletox7obzbsate9gdjwvypg13mpr53 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/356 104 203703 553989 530167 2026-04-21T12:20:07Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553989 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>వింతయేమి టంటే? ఫిలిములు జాతిమొత్తంమీదే చాలా అపాయం కలిగిస్తున్నా యన్న సంగతి తెలిసినవారున్నారు మనలో, కాని ఆ అపాయం హిందీ ఫిలిములవల్లనే కలుగుతోందని వా రెరగరు. ఇదంతా మరొకప్పుడు మాట్లాడుకుందాం. అంచేత, ఆవేళ, వరదాచారి హోటలుకే వెళ్ళా న్నేను శివా అంటూ. నిజమే; కాని యెవరయినా చూస్తే యేమయినా వుందా? "కాస్మాపాలిటన్” భోజనాలే బాహాటంగా జరిగిపోతున్న యీ దివాల్లో, నావంటివాళ్ళ అప్పటి - ఆ జంకు చూడనే అక్కర్లేదు, వింటేనే నవ్వువస్తుం దెవరి కయినా; కాని నావంటివా ళ్ళప్పు డెంద రెంత రణసాహసం చేస్తే యిప్పటి పరిస్థితు లేర్పడ్డాయో యిప్పటి యువకులు గుర్తించలేరు. బ్రాహ్మడైనవాడు హోటల్లో కూడా పట్టుపంచో తడిబట్టో కట్టుకునే భోజనం చేసే దినా లవి. ఇంగ్లీషు చదివే విద్యార్థులకున్నూ తప్పేది కాదిది. లేకపోతే, హోటల్ వాళ్లే బంతిలో కూచోనిచ్చేవారు కారు. విశేషం యేమిటంటే? మనవాళ్ళు ధారాళంగా హోటళ్ళలో భోజనం చెయ్యడం ప్రారంభం అయింది, అరవలహోటళ్ళిక్కడ అల్లుకుపోయాయి. అరవల హోటళ్ళలో భోజనం చెయ్యవలసిన అగత్యం యేర్పడింది, ఆ బట్టతో భోజనం చెయ్యడం అలవాటయింది మనవాళ్ళకి. ఆ కారణంవల్ల కూడా హోటల్లో భోజనం చెయ్యడం నొక సాహసమే ఆ రోజుల్లో. అయితే, అసహాయశూరులు తప్ప అరవహోటళ్ళలో కూడా మడికట్టుకునే భోజనం చేసేవారు మనవాళ్ళు. ఈ పద్ధతి యిప్పటికీ వుంది, పూర్తిగా పోలేదు. ఈ రక్షణ వుంది కనక, నేనూ ఆంధ్రేతర్ల హోటలుకే వెళ్ళాను, హరిః ఓమ్మంటూ. వెళ్ళానంటే ఆకలి ప్రారంభం కాగానే కాదు, ఖరాగా పన్నెండయాక. పెందరాడే వెడితే చాలామంది భోజనం చేస్తూ వుంటారు కనక, వారి ద్వారా మావాళ్లకి తెలిసిపోతుందన్న భయం. అంచేత, యిక వొక్క క్షణం ఆలస్యంచేసినా అన్నం దొరకదన్నంతవరకూ ఆగి అప్పుడు ప్రవేశించాను, హోటల్లో. ప్రవేశించడం అంటే - వొక్క దూకు దూకి నడివీధిలో నుంచి హోటల్లో పడ్డం అన్నమాట. నేను హోటల్లోకి వెళ్లడం యెవరయినా చూసినా చిక్కేమరి. ఏమంటే? శిష్టుల దృష్టిలో హోటలూ కల్లుపాకా వొక్కరాశిలోవే, అప్పట్లో.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||332}}</noinclude> je4u0em2o4w9qc4hgaya3nyxzlubcci పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/357 104 203704 553990 530169 2026-04-21T12:25:16Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553990 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అయినా, తప్పనిసరిగా యీ సంఘసంస్కారం చేసి తీరాలనుకున్నాను కనక, పట్టుపంచె కట్టుకుని విస్తరిముందు కూచున్నాను. తెగబారెడు జుట్టు దువ్వుకుని, చక్కగా జారుముడిన్నీ వేసుకునివున్న తరుణ వితంతువు వడ్డన చేసి, నేతిగిన్నె పుచ్చుకుని యెదట నుంచుంది; కాని వోపట్టాన పరిషేచన చెయ్యలేకపోయా న్నేను. చేసిన్నీ ప్రాణాహుతులు పుచ్చుకోలేక పోయాను, ధైర్యంగా. చివరి కెలాగో భోజనం ప్రారంభించాను; కాని ముద్ద ముద్దకీ అదటే అభక్ష్యభక్షణం చేస్తున్నా మని. అంతా అయాక, ఒకమూల, నొక అకార్యకరణం చేశామన్న కించతోనూ, మరోమూల వాక ఘనకార్యం నిర్వహించా మన్న దిలాసాతోనూ బయలుదేరాను. బయలుదేరానంటే, తేమస్తూనూ బొజ్జ నిరుముకుంటూనూ కాదు, ప్రవేశించి నప్పటిలాగే నిష్క్రమించినప్పుడున్నూ అంగలే వేశాను. నాకు పదిహేడో సంవత్సరం నడుస్తోందప్పుడు. అంటే, అక్షరాలా నలభైయెనిమిది సంవత్సరాల కిందటి మాట అది. ఆ మొదటి భోజనం నా కిప్పటికీ కళ్ళక్కట్టిన ట్టుంది. ఆ చివరి సత్రం భోజనమున్నూ అలాగే వుంది, కళ్ళల్లో మెదుల్తూ. అయితే, నాకే కాదు, సత్రం భోజనం అంటే ఇప్పు డందరికీ వెగటే. హోటల్ భోజనం మాత్రం దర్జా, ఈ స్థితి కారోజుల్లో పడింది పునాది. అది వేసినవారు మాత్రం యెవరికి వారే, మినిష్టర్లు కారు. {{c|<big><big>46</big></big>}} రామకృష్ణ కవుల దగ్గిర ప్రవేశించిన ఆరుమాసాలకే నాలో యేదో కొత్తదనం జాగృతం అయిన ట్టనిపించింది. భాషలోనూ, భావనలోనూ, రచనలోనూ, కూడా కనపడిం దది. దాంతో, నా సాహిత్యజీవితం సుపరిష్కృతం అయి “ఇక నిరాఘాటంగా వీరవిహారం చెయ్యగల"మన్న ఆత్మప్రత్యయం బలపడింది. వీధిలోకి వెడితే "ఫలానా” అన్న వ్యక్తిత్వమున్నూ ప్రారంభం అయింది. "స్వతంత్రంగా బతగ్గలం" అన్న ధీమా యెక్కువయింది దీంతో. వెంటనే గుబగుబలాడించేసింది నన్నొక సరదా. కానయితే కొత్తది కాదు, చిన్నప్పణ్ణుంచీ వున్నదే. ఏదినాని కాదినం - వీక్షణాని కాక్షణమున్నూ బలపడిపోతూనూ వున్నదే అది. “మరి, యింకెప్పుడూ?” అని ఆత్రపడిపోయాను. మరేమీ కాదు - దర్జాగా క్రాపింగు పెట్టించుకుని, చక్కగా పక్కపాపిడి దిద్దుకోవాలన్న సరదా అది. పిఠాపురంలోనే వొక ప్రౌఢ డెకారించిం దొకనాడు “చక్కగా క్రాపింగు పెట్టించుకోక నీకా జుట్టేమి" టని.<noinclude><references/> {{rh|333||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> m3tcqez00gpwt53rwnhnase3vfomzck పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/358 104 203705 553991 530174 2026-04-21T12:29:47Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553991 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇది మరీ ఉద్రిక్తపరిచింది నన్ను. అయితే, సీమంతం ప్త్రైణమే వొప్పుకుంటాను. మరి, తెగబారెడు జుట్టుండడం మాట? అది మాత్రం శాస్త్రాతిక్రమణం కాదూ, యిదయితే? ఏమయినా, మా నాయనగారి ఆగ్రహం పరమావధి అందుకుంటుంది నే నీపని చేస్తే. విడిపోడం దాకా వెళ్ళిపోవచ్చు కూడా, వ్యవహారం. "అయితే యేం?” అంటే, మరి బువ్వ? ఈ భయం పోయింది నాటికి. డాబుగా వచ్చి తమమీద నాలుగు పద్యాలల్లి ఝమాయించి పాడితే అయిదులూ పదులూ రూపాయలిచ్చే సంపన్నులు వేలూ లక్షలూనూ, దేశంలో. ఇప్పటికీ యిదే అంతస్థు మనదేశంలో, మినిష్టర్లకున్నూ. గ్రంథ రచనకంటే ధనార్జనే ప్రధానం అనుకోగలిగితే, అంతవరకూ పిఠాపురంలో చేసివుండిన పద్యసాధన 'వోహో, సుబ్రహ్మణ్యశాస్త్రిగారు" అనిపించుకోడానికి చాలు, నాకు. నాయనగారి అనుగ్రహానికే గాని దానికడ్డురాదు క్రాపింగు. అయితే 'పంచాంగాలు పట్టుకుని బయలుదేరమా?" అనుకుని వున్నానే, మరి, నాలుగు డబ్బు లిచ్చేవారందరిమీదా పద్యాలు కడుతూ బయలుదేరనా? కవి అయివుండినవాడికి - కనీసం కవితాసాధన చేస్తున్నవాడి కింతకంటే పతనం యేమివుందీ? కాక, - కవిగానూ, గ్రంథకర్తగానూ చెలామణీ కావడానికి క్రాపింగు అగత్యం కాకపోవచ్చు, అభ్యంతరం మాత్రం కాదు. వెంటనే మంగలిని పిలిచా నీధైర్యంతో. వాడు వచ్చి కత్తి నూరసాగాడు క్షౌరం అనుకుని. "కాదు, కత్తెర తియ్య"మన్నాను. అన్నాను - వొక ఆలోచన తట్టింది. మార్పులన్నీ అంతవరకూ క్రమాంతరాలమీద నడిపించుకు వచ్చాను. ఇదీ అలాగే చేద్దాం అనిపించింది. జుట్టు తీయించేశాను, ముందీ వూహతో. మొదటిమాటు కనక గచ్చకాయ నునుపు తెచ్చాడు తలకి మంగలి. పిలకమాత్రం వుంచాడు, కండిబొట్టంత ముడివచ్చేటట్టు. ఒకమాటు ఝాడించా నది; కాని గుప్పెడు జుట్టు తగిలే చేతికది వున్నట్టే అనిపించలేదు. ముడితో కింద పడివున్నజుట్టు చూశాటప్పటికీ "అయ్యో" అనిపించింది. ఆశ్చర్యమేమీ, స్త్రీ లసూయపడే జుట్టు నాది. పాడుగుకు పొడుగు -- చిక్కనకు చిక్కన - మెత్తనకు మెత్తన - నలుపు చెప్పనే అక్కర్లేదు - వీటికి సాయం దీర్ఘానుబంధం.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||334}}</noinclude> 7rz1u9dddlyg41zp3d6rocahvhsvi9t పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/359 104 203706 553992 530175 2026-04-21T12:35:32Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553992 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>నిజాని కంత జుట్టున్నందుకు ముడివేసుకుంటే బాగానే వుండేది; కాని దువ్వుకోడం దగ్గిరికి వచ్చేటప్పటికి విసుగు. తలంటుకోడం ఆలస్యం అయితే పేలు బయలుదేరేవి కులకుల్లాడుతూ, అదొక పీడ. స్నానం చేస్తే, ఆరేదాకా నెమిలిపింఛంలాగ విప్పుకుని వేళ్ళతో చిక్కు తీసుకోవాలి, అదో బాధ. వేసవి వస్తే జుట్టంతా చెమటతో తడిసి ముద్దయిపోడమే కాదు, సూదులతో పొడుస్తున్నట్టు తల అంతా చిటచిట్టాడం - నిజంగా అది యమబాధే. అయితే, జుట్టే వుంచుకోవాలనుకునేవారి కివి స్వల్పాలే; కాని క్రాపింగు వ్యామోహం నాకివి అసహ్యా లనిపించింది. కాక, - కాలం పరుగెత్తుతుంది, స్థిరంగా వుండదు. దాంతో, కొత్తరుచులు కలుగుతాయి, కొత్త వూహలూ పుడతాయి, ప్రయత్నం అక్కరలేదు. ప్రభుత్వమే మారిపోయింది మనకి, తప్పనిసరి మార్పులు ముంచుకుని వచ్చాయి, పెద్ద యెత్తునా వచ్చాయి. దీనికి సాయం - మారినవాళ్ల కెందునా అభ్యంతరాలు లేకపోతున్నాయి, చేతకాని నిందలు తప్ప. ఇక పూర్వాచారపరాయణు లయినవా రేమంటే యేమి నిలిచిపోతుందీ? అయితే, షట్కర్మపరాయణమైన వంశాన పుట్టివుండడం వల్లా, ఎంతో కొంత వైదికవిద్యలే నేర్చుకుని వుండడంవల్లా చిన్నప్పణ్ణుంచీ అలవాటయి పూర్వాచార పరాయణత్వమే పాటించేవాణ్ణి నే నెక్కువగా. అప్పటి నా దృక్పథం అవగాహన కావడాని కొక చిన్న వుదంతం. ద్వారకాతిరుపతి వెళ్లాం మే మొకమాటు. కొండమీద మా మేనల్లుడికి వొడుగు. తొలినాటి సాయంత్రాని కావూరు చేరుకున్నాం. సత్రంలో బస. పిల్లా మేకా యాభయిమందికి మించివున్నాం. తెల్లవారితే ముహూర్తం. రాత్రివంట లయినాయి. మా నాయనగారూ, మా పింతల్లులు భర్తలూ పురోహితుడూ మొదలైన శిష్టులు స్నానాలు చేద్దామనుకుంటూ వుండగా పరివారంతో వచ్చి వొక నాయడుగారు బసచేశా రాసత్రంలోనే. వారి వంటవాడు పొయిలో నిప్పున్నూ వేశాడు. అది చూడగా ముందు నాకు పట్టుకుంది కంగారు, వంటలు మైలపడిపోయాయని. పెద్దలు మాట్టాడారు; కాని "సబ్ కలెక్టరుదొరగా రండీ, పొమ్మనడానికి వీలా?" అన్నాడు గుమాస్తా.<noinclude><references/> {{rh|335||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> nqewaxkokjuezup18nrezv6gl3exhvd పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/360 104 203707 553993 530176 2026-04-21T12:43:01Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553993 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మా అవస్థ చూసి వొక బ్రాహ్మణయింట ఆయనే మాకు బస కుదిర్చిపెట్టా డప్పటికప్పుడు. వెడితిమిగదా, మా నాయనగారికి పరోక్షభక్తు డాయింటి యజనూని. సొంత యిల్లయిపోయింది మా కది. కాని, అప్పటికే రాత్రి తొమ్మిది దాటివుండడంవల్ల కూర వగైరా సాధనాలు చెయ్యడానికి వీలులేక, పచ్చడీ చారుతోనే భోజనం చెయ్యవలసివచ్చింది పెద్దలకు. నేనూ వారితోపాటే భోజనం చేశాను, బ్రాహ్మణ్యం చెడిపోకుండా. అలాంటిదల్లా పోయి, యిప్పటికీ మా అన్నలకు లేనిది, రుచీ దృక్పథమూ చాలా మారాయి నాకు. దాని క్కారణం కవిత్వమున్నూ అయివుండాలి. అయితే మాత్రం కవులందరూ క్రాపింగులు పెట్టించుకుంటున్నారా? లేదు కాని, మొత్తానికి, కవిత్వానికీ వైదికాచారాలకూ చుక్కెదురు - ఇది మాత్రం ఢంకామీద దెబ్బకొట్టి చెప్పగల న్నేను. ఉదాహరణలూ చూపించగలను, వందలు. వైదిక విద్యావేత్తల కిది తెలుసు. ఇంచేతనే కవిత్వం అంటే వారు చులకనగా చూడ్డం. శాస్త్రకారులకీ తెలుసు, కవులయినవారు, రసలోలుపత వల్ల వైదికాచారాలకు కొంతయినా విముఖులవుతా రని. కనకనే కపులను వారు నటవిటగాయకవర్గంలో చేర్చడం. సరే, చేర్చారు, నష్టం యెవరికీ? దేశంలో - బ్రాహ్మల్లోనూ వేదమార్గానికి దూరంగా వుండినవారే యెక్కువ, వెనకటి రోజుల్లో కూడా. వారంతా పతితులే అయిపోతారా? తెలుసుకో గలిగితే, సంహితాబ్రాహ్మణాలతో పాటు ఉపనిషత్తులున్నూ యెప్పుడు బ్రహ్మముఖోద్గతా లయినాయో అప్పుడే వేదమార్గాని క్కొంత ప్రాతికూల్యం యేర్పడింది. కాక:- కవి ధర్మమే వేరు. తపోనిష్ఠ ప్రధానం అతనికి, వైదికకర్మలు కాదు. ఈ విశేషం గుర్తించుకోలేక కవులను చులకనగా చూడ్డం అవివేకం. ఎప్పటివారో కాళిదాసూ భవభూతినీ, వారంటే, దినదినమూ మన కాదరాభిమానాలు బలిసిపోతున్నాయి. వెతికి తెచ్చుకుని భాసుణ్ణి నెత్తిమీదే పెట్టుకుంటున్నాం, ఇవాళ. వాల్మీకినీ వ్యాసభగవానుణ్ణి అర్థంచేసుకోడాని కిప్పుడే సరి అయిన ప్రయత్నాలు ప్రారంభం అయినాయి, మనలో.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||336}}</noinclude> 3h40svor50pnumovaxpoxmbk60slj0u పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/361 104 203708 553994 530177 2026-04-21T12:46:41Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553994 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>శంకర భగవత్పాదులవారి రచనలకు పఠన పాఠనాలు ప్రచురం అయినకొద్దీ సమ్యగ్దృష్టి యేర్పడుతుంది మనకి. మనం అంటే, యిక్కడ, కవులు మాత్రమే కారు, అందరున్నూ. మరి, శాస్త్రకారుల సంగతి? ఎందరికో ఉద్వాసన చెప్పేశాం. మరెందరికో చెప్పేస్తూనే వున్నాం. కవులను పంక్తి బాహ్యులన్నంత హీనంగా చూపిన శాస్త్రకారులకే యిప్పుడు పంక్తిభాహ్యత, స్వయంకృతాపరాధంగా. మనమే కాదు, తమతమ శాస్త్రకారుల విషయమై, యేదేశంవారూ యింతే, యేఖండంవారూ యింతే, యేమతం వారూ యింతే. కాకపోతే యూరపియనుల కయినా మొదణ్ణుంచీ వుందా క్రాపింగు. వారుమాత్రం తమ శాస్త్రవిధు లుల్లంఘించడం లేదూ? మరెవరు మాత్రం వుల్లంఘించడం లేదూ? మనలో ప్రతీవాడూ భగవద్గీత చదవడం వొక ఫేష నిప్పుడు. మాట్టాడితే అందులో వెన్నో శ్లోకా లుదహరిస్తా రెందరో, సందర్భం అయినా కాకపోయినా. మరి "యశ్శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారత” అన్న శ్లోకం అర్థంచేసుకునే మాట్టాడుతున్నారా వారంతా? ఇలా యెందుకు జరుగుతోందీ మనలో? ఇది పరిశీలించుకోవాలి తెలివిగలవాడు. పశువుల కివ్వనిది, భగవంతుడు, బుద్ధి ప్రసాదించాడు. మనిషికి. అది పదునుపెట్టుకోడానిగ్గాని బండపారించుకోడానికి కాదు. అది కల్పనలమీద కల్పనలు చేస్తుంది; గాని నల్లరాతి లాగ స్తబ్ధంగా పడివుండలేదు. కన్ను, మాటిమాటికీ రేపెడుతూ వుంటుంది దాన్ని. మనసు, ఎప్పటికప్పుడు వూపేస్తూ వుంటుంది. దాంతో నిశితం అవుతుంది ప్రతిభ. చరిత్ర, కళలు, భౌతికశాస్త్రాలు, భిన్నభిన్న జాతులతో సంపర్క సహవాసాలు, వయఃపరిణామం - ఇవన్నీ దానికి నవ్యత ఆపాదిస్తాయి. మన పురాణాలున్నూ కొంతవర కీపనే చేస్తాయి, పరిశీలనగా చదివితే. అదే కొత్తరుచికి కారణం అవుతుంది. “వెనకటి పద్ధతులూ రుచులూ ఆ బుద్ధి తీర్చినవే కావా?" అంటే, వాటిలో లోపాలు కనపడతాయి, తరవా త్తరవాత, దానికే. మరి శాస్త్రకారులకు లేదూ యీ బుద్ధినైశిత్యం? అది మాత్రం మారదూ? మారకేం? అయితే, దాని నడక, శృంఖలాబద్ధం కావడంవల్ల యెప్పుడూ శతాబ్దులకు వెనకనే వుంచుతూ వుంటుంది, శాస్త్రకారులను.<noinclude><references/> {{rh|337||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> ln3turjasnf23xkila1vzps5fklwtcf పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/362 104 203709 553995 530178 2026-04-21T12:49:58Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553995 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ప్రాతిపదికలున్నూ జర్జరితా అయిపోయేదాకా మార్పుల ఆగత్యం గుర్తించలేరు వారు. అంచేతే, యేదేశంలోనూ యేఖండంలోనూ యేమతంలోనూ కూడా వారి కనుయాయులు తక్కువగా వుండడమూ "నీ లెక్కేమిటి?" అనేవారే యెక్కువగా వుండడమూనూ. మరి, సామాన్యుల బుద్ధే యిలాగ కొత్తరుచులు పుట్టిస్తూ వుంటే - మరుగుతూనూ వుంటే, క్రాంతదర్శు లయిన కవుల బుద్ధి యెలాంటి రుచులు పుట్టించనూ? అంటే, సత్యం - శివం - సుందరం - ఇంతే కవుల ధ్యేయం. మానవ జాతి సభ్యం కావడమూ, ఆనందానుభూతితో మహోదారం కావడమూ ఇంతే వారికి ప్రాప్యం. "అయితే, కవులం అనుకునేవా రందరూ కవులేనా?” అని కొందరి ప్రశ్న. సంశయాత్ముల ప్రశ్న యిది. ఇంకా చెప్పాలంటే, అపరిణతచిత్తుల ప్రశ్న యిది. అవునో కాదో నిర్ణయించడానికే కాదు, ఈ ప్రశ్న వెయ్యడానికిన్నీ అర్హులు కారు వారు. {{c|<big><big>47</big></big>}} జుట్టంతా తీయంచెయ్యడంవల్ల నా మొగం నాకే వికారంగా కనపడిం దద్దం చూసుకోగా. “ఇదేమి" టన్నారు గురువులు, చకితులయి. వారా లిచ్చినవారున్నూ వింతగా చూడసాగారు. వారం పద్దినాలదాకా, బసలో వున్నంతసేపూ, అద్దం చూసుకోడం వొక్కటే పనయిపోయింది నాకు. చాలా బాధపడిపోయా న్నేను రూపవ్యత్యయం భరించలేక. ఈ స్థితిలోనే మావూరు వెళ్ళాను, వారందరినా లుండవలసివచ్చి. తలుపు తీశారు; కాని యెవరో అనుకున్నారు, మా అమ్మగారు, మొదట. తుళ్ళిపడిపోయింది మా సీత. “యాక్కురారీ” అనేసించి మా చెల్లెలు. ఊరివారున్నూ "యేమిటీ వికారం?" అన్నారు కొందరు. భాషలోనూ భావనలోనూ పద్యబంధంలోనూ చేసింది కాక, పిఠాపురం వెళ్ళి నేను చేసిన సాధన ఇదే అన్నట్టు భావించారు మరికొందరు. మా నాయనగారు మాత్రం పొంగిపోయా రదే స్థిరం అనుకుని. గోష్పాదమాత్రం కంటే యెక్కువ జుట్టుంచుకోడమూ వారికిష్టం లేనిదే మరి. అయితే, నాలుగు మాసాలకే నిజస్థితి తెలిసివచ్చింది వారికి. పాపిడి చూసి వీరభద్రావతారమే తాల్చేశారు వారు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||338}}</noinclude> 2vatt8dzvehne92s5fi7m01v5d6j7qh పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/363 104 203710 553997 530194 2026-04-21T12:54:39Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 553997 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇది స్వల్పవిషయమూ, కనక, యిందుకోసం అంత బాధపడ్డం చాదస్తమూ కాదా అంటే, అన్ని మతాలవారిలోనూ వున్నా యిలాంటివి. క్రైస్తవులకు పుష్పశయ్య అమంగళకరం. నెత్తిమీదా మొగానా కత్తీ కత్తెరా పడితే, శిఖ్ఖులకు పౌరుషహానే కాక మతభ్రంశమున్నూ. గడ్డం పెంచుకోకపోడం ముస్లిములకు ధర్మాతిక్రమణం. తప్పూ లేదు, వింతా లేదు, సంప్రదాయగౌరవం గలవారి కెవరికయినా తప్పందే యిది. ఎవరిదాకానో అక్కర్లేదు, వైదికుల్లో, లుంగీకట్టుకునేవారినీ, చుట్టా బీడీ సిగరెట్టూ కాల్చేవారినీ చూస్తే నాకూ బాధగానే వుంటుం దిప్పటికీ. కాని, స్వధర్మనిష్ఠా, దానికిముందు, స్వధర్మబోధా లేని జాతిలో మనిషి కొకరకంగా తయారవుతా యిలాంటి వేషభాషలు. అయితే, ఇలాంటిది తటస్థిస్తే లౌక్యవృత్తిలో వున్నవారిలాగ వైదికవృత్తిలో వుండినవారు సద్దుకోలేరు, కాస్తా కూడా. నిజంగా, మా నాయనగారు, నట్టింట మతాంతరుడు సంచరిస్తున్నా డన్నంత బాధపడిపోయారు నన్ను చూసి అప్పుడు. కవి నయినందుకూ, నటు ణ్ణయినందుకూ, గాయకుణ్ణి కాబోయినందుకూ బాధపడిన్నీ అప్పటికి కొంచెం సద్దుకుని వుండినవారల్లా మొదటికి వచ్చేశారు దీంతో వారు. నన్నేం చేసినా తీరని ఆగ్రహం అయిపోయింది వారిది. పోనీ, చావగొట్టి చెవులుమూసి కూచోబెడదామంటే, ఆ వయస్సెప్పుడో దాటిపోయివుంది నాకు. దీనికి సాయం, మా అమ్మగారు "పోనిస్తురూ" అనడం వొకటి. దీంతో, మా నాయనగారి క్కలిగిన ఆవేదన అప్పుడూ అర్థం అయింది నాకు, ఇప్పటికీ జ్ఞాపకం వుందది. అయినా, వారి ఆజ్ఞ శిరసావహించలేకపోయా న్నేను. ఒక్కటి మాత్రం అందరూ గమనించవలసివుం దిక్కడ. వెయ్యేళ్ళ మహమ్మదీయపరిపాలన తెచ్చిపెట్టలేని మార్పులు తెచ్చి పెట్టింది, నూటయాభై సంవత్సరాల క్రైస్తవ పరిపాలన, మనలో. చాలామంది విద్యాధికులను తన వలయంలోకి తీసుకోలేకపోయినా, బ్రహ్మసమాజం, ఆర్యసమాజం వంటి కొత్త సంప్రదాయాలు ప్రారంభించే టట్టయినా చేసింది క్రైస్తవమతం. కళ్ళకు వెలుగిచ్చి కొత్తబాటలు కవపర్చి దృక్పథమే మార్చేసింది, ఇంగ్లీషు వాఙ్మయం, మనకు. వైదిక విద్యలు నేర్చి స్వధర్మనిష్ఠులయి వుండినవారిని కూడా తమ కుమాళ్ళను ఇంగ్లీషు చదువులో ప్రవేశపెట్టేటట్టు చేసింది ఉద్యోగ వ్యామోహం.<noinclude><references/> {{rh|339||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> r4yxglsq3n2pogd6bz8pb58jdpkqejx పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/364 104 203711 554000 530199 2026-04-21T13:43:10Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554000 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"వీరి కధికారం వుంది, వీరికి లేదు" అనకుండా అష్టాదశ వర్ణాలవారికీ పఠనపాఠనావకాశాలు కల్పించింది రాజ్యాంగం. దీంతో మన ధర్మసౌధం పునాదులకంటా కూలిపోయింది. అయితే, స్వాతంత్ర్యం వచ్చింది కనక, మళ్ళీ మన స్వధర్మం ప్రతిష్ఠించబడుతుందా మనగడ్డమీద? లేదు, లేదు, అందుకూ అవకాశం లేదు. ఇంగ్లీషు వాఙ్మయం జీర్ణించి, స్వధర్మ పరిజ్ఞానం మొదలంటా నశించి, పైపెచ్చు, బ్రిటీషువారి అడుగుజాడలు విడిచిపెడితే విలవలేనివారి చేతిలో యిరుక్కుపోయి వుంది, మన ప్రభుత్వయంత్రం యిప్పుడు. బ్రిటిషువారి చేతిలోకంటే వీరిచేతిలోనే యెక్కువ దెబ్బతింటుంది మన స్వధర్మం. మనజాతికి ముందే వుంది ముసళ్ళపండుగ. వెనకటివాటి స్మృతిచిహ్నాలే లేకుండాపోతా యనేకాలు. జనసామాన్యానికి, రాజకీయాలే తారకం అన్న అజ్ఞానం పోతే తప్ప మనకి మరి గతి లేదు. ప్రాతిపదికలకు భంగం రాకుండా స్వధర్మానికి కొత్తసంప్రదాయం సృష్టించగల సమర్థులు ముందుకి రావడం లేదు ఇప్పటికీ మరి. "అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్.” {{c|<big><big>48</big></big>}} తమకు శక్యం కాక, నన్ను మందలించవలసిందని మహేంద్రవాడ గ్రామకరణం ముంజులూరి వేంకటరామయ్యగారిని కోరారు మా నాయనగారు, చివరికి. వేంకటరామయ్యగారంటే గౌరవభావమే కాదు, నాకు భయభక్తులున్నూ. సంపన్న నియోగిగృహస్థులు వారు. గ్రామాధికారులు. విశేషించి, మా నాయనగారు పొలమూరిలో ప్రవేశించింది మొదలు, ఆ కుటుంబం మాకొక పెద్ద అండ. నిజంగా, సద్భాహ్మణులు చాలా తక్కువగా వుంటారు, ఉండినవారిలో మాత్రం వేంకటరామయ్యగా రొకరు. ఏడోయేట వొడుగయిందిట వారికి, అది మొదలు వారీ అనేదాకా సంధ్యావందనం చేసుకోని రోజు - పూట అయినా లేదు, వారి దీర్ఘజీవితంలో. వయసు పెరిగినకొద్దీ జపతపోనిష్ఠలు పెరిగిపోయాయి వారికి. నాకు బాగా జ్ఞానం వచ్చేటప్పటికి వైశ్వదేవం చేస్తూ వుండినారు వారు. మా నాయనగారు ఆ కుటుంబానికి గురువులూ మంత్రోపదేష్టలూనూ. శుభకార్యాలు వస్తే వారి పురోహితుడు మా నాయనగారి సలహాప్రకారమే తంతు నడిపేవాడు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||340}}</noinclude> p5isl6demgmtw66gcxwxztmhcyrxfsp పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/365 104 203712 554001 530214 2026-04-21T13:48:58Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554001 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కర్మశ్రద్ధకు తోడు వేంకట రామయ్యగారికి స్తవనీయమైన వితరశీలమున్నూ వుండేది. అతిథులూ అభ్యాగతులూ యెందరు వచ్చినా మహేంద్ర వాడలో, వారి యింటనే ఆదర గౌరవాలు. వారి వైశ్వవైదిక ప్రతిపత్థ్సా లీపాకానికి ఆధ్వర్యవం తరచు నాది. అంచేత వారి కర్మశ్రద్ధ నాకు బాగా అవగాహన అయింది. దాంతోటే నాకు, వారంటే ఆదర గౌరవాలూ భయభక్తులూ హెచ్చాయి. కనక, వారు మందలిస్తే నేను దారికి వస్తానని మా నాయనగారి నమ్మకం. అయితే, అప్పటికే కాదిప్పటికీ నా స్వభావం నా ఆత్మీయులున్నూ చాలామంది యెరగరు. అది మంచనండి చెడ్డనండి, మంచి కయినా చెడ్డ కయినా నా నిశ్చయమే నిశ్చయం నాకు. ఒక విధంగా నిశ్చయం చేసుకోనంతవరకే యెవరి సలహా అయినా నేను పాటించడం. ఏదీ కూడా రహస్యంగా చెయ్యడమున్నూ నా పద్ధతి కాదు. ఇది గుర్తించివుండనివారు కనక, వేంకటరామయ్యగారు, మెత్తమెత్తగా ప్రారంభించి మిక్కిలి నిష్ఠురంగా మందలించా రొకనాడు నన్ను. "వెంటనే క్రాపింగు తీయించెయ్య” మనిన్నీ ఆజ్ఞాపించారు. అది నాకు మిక్కిలీ అప్రియమైన సలహా. అయినా సవినయంగానే విన్నా న్నేను. "ఇది చిరవాంఛ. కనక మీ ఆజ్ఞ శిరసావహించ లే"ననిన్నీ సవినయంగానే మనవిచేసుకున్నాను వారికి. వారి నెదిరించడం నా కిష్టమూ కాదు, ఉద్దిష్టమూ కాదు; కాని అనివార్యం అయిపోయిం దావేళ. "క్రాపింగు పెట్టించుకోడం బ్రాహ్మణధర్మం కాదంటారే, మీరు చెంగావిపంచె కట్టుకున్నారు గదా, రంగుబట్ట కట్టడం బ్రాహ్మణధర్మమేనా?" అన్న వొక్క వాక్యంతో పూర్తయింది నా యెదురువాదం, ఆవేళ. {{c|<big><big>49</big></big>}} చెంగావి బట్టలూ, చుట్టు చెంగావిబట్టలూ ఇప్పటివారికి చాలా మందికి చారిత్రక వస్తువులు; కాని నా చిన్నతనందాకా అవే యేలాయి బజార్లు. ప్రభువులూ, జమీందార్లూ, రాజబంధువులూ, తత్తదనుయాయులూ అవే కట్టేవా రెప్పుడూ. ఎటొచ్చీ వైదీకులు మాత్రం దూరంగా వుంచేవా రవి, కన్నెంత చెదిరిపోతూవుండినా, మనసెంత వుబలాటపడుతూ వుండినాను. వైదికులంటే, యిక్కడ, అనూచానసంపత్తి గలవారికే గ్రహణం.<noinclude><references/> {{rh|341||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> jayaiwrbrej2fpnue7ttv1i5rsdfkoq పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/366 104 203713 554002 530215 2026-04-21T13:52:46Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554002 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అయితే, వైదికస్త్రీలలో, తరుచు, ఆ రకం చీరలే కట్టేవారు, రంగుచీరల్లోనూ ప్రత్యేకించి. రంగుచీరలు మడికి వాడకూడదనే ధర్మం అప్పు డప్పుడే వుల్లంఘించడం ప్రారంభిస్తున్నారు వారు. వితంతువులూ పుణ్యస్త్రీలూ వొక్కలాగే వుంటున్న ఈ రోజుల్లో విడ్డూరంగానే వుంటుం దీమాట; కాని దీనికి సంబంధించిన పట్టుదల చాలా యెక్కువగా వుండే దారోజుల్లో. నేను మరీ చిన్నవాణ్ణయివుండినప్పుడు, మడికోసం అని మా అమ్మగారికి ప్రత్యేకంగా తెల్లచీర లుండేవి కొన్ని, నాకు బాగా జ్ఞాపకం. ఒకమాటొక చుట్టపావిడ వచ్చింది మా యింటికి. పేరు బులుసు అంతమ్మగారని, మా నాయనగారికి పింతల్లి కూతురామె. అప్పటికామె వయస్సు అరవైకి పైని. మా నాయనగారికంటే పెద్ద. వితంతువు అయితేనే చాదస్తం పెరుగుతోంది వైదిక స్త్రీలలో, వయసు ముదిరితే దానికిక హద్దే వుండదు. దీనికి సాయం, ఆమెది కోనసీమ. ఆరాత్రి ఆమెకి ఉప్పుపిండి వడ్డించేటప్పుడు చెంగావిచీర మడికట్టుకుని వున్నారు మా అమ్మగారు. పీటమీదికి వచ్చేటప్పుడే మొగం చిట్లించుకుంటూ వచ్చా రామె. వడ్డన పూర్తయేటప్పటికిక వుండబట్టలేక “మహాలక్ష్మీ సోదెమ్మా, నువ్వే రంగుబట్ట మడికట్టుకుంటే యిక నేనేం చెప్పగలనూ?” అంటూ సాగతీసుకున్నారు. అన్నారు ఫలహారం ప్రారంభించారు, మానలేదు. ఆ మాటకి, మా నాయనగారు గతుక్కుమన్నారు, సిగ్గుపడి మా అమ్మగారు వెనక్కి వెళ్ళారు. నేను మాత్రం వూరుకోలేకపోయాను. ఆమె కొడుకు సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితులు. దానికితోడు వల్లమాలిన చాదస్తం. కాని, గూటాల అనే గ్రామంలో నెలజీతం పుచ్చుకుని సంస్కృతపాఠాలు చెబుతున్నా రప్పటికే ఆయన, అగ్రహారం కుర్రవాళ్ళకి. ఇప్పు డదేమి టనేవారు లేరనే చెప్పవచ్చు; కాని చాలా నింద్యమైన కార్యం అది, అప్పటికింకా. తన కొడుకే అలాంటి పని చేస్తూవున్నప్పుడు రంగుబట్ట మడి కట్టుకున్నందుకు మా అమ్మగారి నాక్షేపించడంలో యేమిటీ ఔచిత్యం? నేనిలా అడగ్గా చాలా రుసరుస లాడారామె. అది చూసి మా నాయనగారు నన్నే మందలించారనుకోండి, ఒక విషయంలో కులధర్మం తప్పినవారు మరో విషయంలో తప్పినవారి నాక్షేపించడమేనా? చెప్పవచ్చిం దేమి టంటే?'<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||342}}</noinclude> fpupi0gsoc72pmu0o5v4slpuzb62l4t పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/367 104 203714 554003 530216 2026-04-21T13:56:38Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554003 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>వైదికుల్లో ఆచారవ్యవహారాలకు దూరంగా వుండే కుర్రకారు యెక్కడయినా చుట్టుచెంగావి బట్టలూ చెంగావిబట్టలూ కట్టడం లేకపోలేదు. నే నెరిగినంతవరకూ మా పెద్దన్నగారి భావమరిది గొల్లకోట నారాయణమాత్రం ఆ బట్టలు కట్టేవాడు. అతణ్ణి చూసి అలాంటివి కట్టాలని నేనూ వూగిపోయేవాణ్ణి, కాని యిజార్లు తొడిగే మరీ చిన్నతనంలో తప్ప పంచెలు కట్టడం ప్రారంభించాక రంగుబట్ట కట్టనివ్వలేదు మా నాయనగారు మమ్మల్ని. అయితే, తరవాత్తరవాత, తక్కిన విషయాలతో పాటు వాటివిషయమయిన్నీ నేను లక్ష్యపెట్టకపోయే వుందును; కాని నాలో మార్పు ప్రారంభం అయ్యేటప్పటికే మోటు అనిపించుకుంటున్నాయవి. 1702 మల్లు కట్టడం గొప్ప అనే భావం అప్పుడే ముదురుతోంది. 1702 మీదా, గ్లాస్కోమల్లుమీద చెంగావీ చుట్టుచెంగావీ అద్దేవారప్పుడు. నియోగులు అవే కట్టేవారు పాయికంగా. చెంగావి అంటే యెర్రకలవపువ్వు రంగు, ముదరా లేతా భేదం మాత్రం వుండే దందులో. తామరపువ్వు చాలా చక్కనిదే; కాని మనోజ్ఞతలో చెంగలువకు బాగా లొచ్చు. ఆ విషయమై తక్కిన పువ్వులూ అంతే. కనకనే ఆ రంగుబట్టల కంతమన్నన. ఆ మన్నన, సర్వతంత్రస్వతంత్రులైన మన పూర్వప్రభువులతో ప్రారంభం అయి మొన్న మొన్నటిదాకా చెలామణీ అవుతూనే వుండేది. అంత వైదిక మార్గనిష్ఠులు ముంజులూరి వేంకట రామయ్యగారున్నూ అవే కట్టేవారు మడికిన్నీ. వారు తెల్లబట్టలు కట్టడం నే నెరగనే యెరగను. రాజులతోనూ, చివరికి జమీందార్లతోనూ నిరంతర సాహచర్యం తెచ్చి పెట్టివుంటుంది నియోగులకా సంప్రదాయం. మీసాలుంచుకోడం కూడా నియోగుల కలా వచ్చిన సంప్రదాయమే. అయితే, ఇవాళ చూస్తే వైదికుల్లో మీసాలుంచుకునేవారూ బయలుదేరారు, నియోగుల్లో మీసాలు తీయించేసేవారూ బయలుదేరారు, దేశంలో యింగ్లీషు ముదిరాక వచ్చిన మార్పిది. ఏమయినా ఎర్రపంచె కట్టుకునేవారు క్రాపింగు పెట్టించుకున్నందుకు నన్నాక్షేపించవచ్చా? ఇదీ నా పాయంటు. నే నీమాట అడిగేటప్పటికి వేంకటరామయ్యగారి క్కోపం వచ్చింది. {{c|<big><big>50</big></big>}} చదువు చాలించుకున్నా పిఠాపురం వెడుతూనే వుండేవాణ్ణి తరుచు నేను.<noinclude><references/> {{rh|343||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> hqzwzp2bldi9milkc63aertasue5ed4 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/368 104 203715 554004 530217 2026-04-21T14:03:50Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554004 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>రామకృష్ణకవులను విడిచివుండలేకపోడం కొంతా, ఇంటో కూచుని నిరంతరమూ, రచన సాగిస్తూ వుండడంలో యేమి టేమిటో సందేహాలు వచ్చి గతినిరోధం యేర్పడ్డం కొంతా అందుక్కారణాలు. అన్నాళ్ళు పిఠాపురంలో వుండడంవల్ల నాకు, పాండిత్యం వేరూ భావుకత వేరూ - పద్యం వేరూ కవిత్వం వేరూ అని నిష్కృష్టమైన జ్ఞానం కలిగింది. రచన అంతకంటే వేరనిన్నీ స్థిరనిశ్చయం కలిగింది. పిఠాపురంలో నేను గట్టిసాధన చేశాను, అయితే, అదంతా పద్యసాధన అయి, నడమంత్రపు సిరివంటి దయిపోయింది. ప్రాజ్ఞత వచ్చాక కూడా నా జీవితంలో మిక్కిలి విలవ అయిన కాలం కొంత యిలా గడిచిపోయింది, దురదృష్టవశాన. ఇంటికి వచ్చాక వచన రచన దీక్షగానే సాగించాను, కాని పద్యవ్యామోహం, పూర్వవాసన లాగ వులుకుతూనే వుండేది, అప్పడూ అప్పుడూను. కేవల పద్యమయంగా నేను రచించినది గీతమంజరి అన్న గ్రంథం. లేఖనీగీతం, ప్రబోధగీతం - ఇత్యాదిగా కొన్ని ఖండకృతుల గుచ్ఛం అది. దాన్ని పురస్కరించుకుని చెప్పవలసింది వుంది. అది ముందు ముందు. తరవాతి రచన పాణిగృహీతాశ్రవణానంద శృంఖల, అదొక కలవంటిది. అనుకోకుండా వచ్చింది, అవ్యాహతంగా జరిగిపోయింది. పరిస్థితులలా వచ్చా యనను, నే నందుకు లొంగిపోయాను, స్పష్టంగా. ఎప్పు డెందుకు ప్రారంభం అయిందో మరి, ఇప్పటికీ నాకిలాంటి వ్యగ్రోత్సాహం కలుగుతూనే వుంటోం దప్పుడప్పుడు. దానివల్ల కొన్ని అసందర్భాలు కలక్కపోలేదు, మంచి సందర్భాలూ వచ్చా యెన్నో. నా బహుగ్రంథరచన వాటిల్లో వొకటి. మరో గ్రంథం రచించాలి గదా? అది మానేసి ఇదే రచించాను. చెప్పవచ్చిం దేమిటంటే? ఆవేళ వినాయకుని చవితి. సాయంత్రం నాలుగయి వుంటుంది. గ్రామకరణం శ్రీ బుద్ధవరపు సూర్యనారాయణగారు, అందరికీ లాగే నాకూ వర్తమానించారు “ఒక్క మాటురమ్మని. తటవర్తి వేంకటరాజుగారి విషయం చాలామాట్లు చెప్పివున్నాను, వారి చెల్లెలి భర్త యీ సూర్యనారాయణగారు. “సూరీరావు" అని వారికి వ్యవహారం. పేరుకే ఆయన గ్రామకరణం, లౌక్యంలో ఆమాత్రం చెయ్యి బహూ అరుదుగా వుంటుం దేదేశంలో నయినా. మా ప్రాంతం గ్రామకరణాలందరూ నియోగులు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||344}}</noinclude> tucw8h5xkff3v7065xs5pskdjo34hev పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/369 104 203716 554005 530218 2026-04-21T14:08:39Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 554005 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>వారిలో నూటికి తొంభైతొమ్మండుగురు అరువేలవారు. వారిలో అసాధారణ ప్రజ్ఞావంతు లెందరో వున్నారు, వారందరిలోనూ సూరీరావుగారిది అగ్రపీఠం. వెనకటికి, నియోగులు, మహామంత్రిపదవులు జేగీయమానంగా నిర్వహించేవారంటే అబ్బురమా, గ్రామకరణాల్లోనే అంత ప్రతిభావంతు లుండినప్పుడు. సూరీరావుగారికి పెద్దబ్బాయి (మరింగంటి లక్ష్మణాచార్యులు) గారన్నా, మా నాయనగారన్నా ప్రత్యేకాభిమానం. మా కుటుంబంలో నేనంటే మరీ అభిమానం. నేను కులవిద్యలు విడిచిపెట్టినందుకు వారికీ అసంతృప్తిగానే వుండేది మొదట; కాని, కవి అని నాకు పేరువచ్చాక ప్రత్యేకాదరభావం కలిగింది నామీద: అంచేతనే అప్పుడున్నూ నా కాహ్వానం రావడం. నేను వెళ్ళేటప్పటికి బ్రాహ్మలు కొందరూ, తండ్రీకొడుకు లిద్దరు క్షత్రియులూ, రెడ్లు చాలామంది చేరివున్నా రక్కడ. విఘ్నేశ్వర చరిత్ర పురాణకాలక్షేపమున్నూ ప్రారంభం అయివుండిం దప్పటికే. పెద్దబ్బాయిగారు చెబుతున్నా రర్థం. మైలవరపు సూర్యనారాయణగారని ఆ వూళ్లో యింకో బ్రాహ్మణగృహస్థు. ఊళ్లో సూరీడు అని ఆయనకు వ్యవహారం. పెద్దబ్బాయిగారి యెడల గురుభావం ఆయనకు. నే నెప్పుడూ ప్రత్యక్షంగా యెరగను, కవి అనేవా రాయన్ని కొందరు. మే మంటే పడేదికా దాయనకు. మా నాయనగారూ మా అమ్మగారూ తమ యింట భోజనం చెయ్యరని ఆయనకు కోపం. తెలగాణ్యులు వారు. తెలగాణ్యుల యింటనే కాదు, మా నాయనగారూ మా అమ్మగారూ యే శాఖాంతరంలోనూ భోజనం చేసేవారు కారు. అన్నిశాఖల్లోనూ వున్నా రలాంటి స్వయంపాకనిష్ఠాపరులు వేనవేలు. తెలగాణ్యుల్లోనూ వున్నారెందరో. వారూ భోజనం చెయ్యరు శాఖాంతరాల్లో. ఇది అందరికీ తెలిసిందే. అందరికీ యిష్టమైనదిన్నీ. కాని సూరీడుగారికి "నాకంటే మీ యెక్కువేమిటి?" అని మా నాయనగారి యెడల ద్వేషం. "పోనీ, మీరూ నియమంగా వుండండి" అంటే, ఊహూ! ఏ శాఖలోనైనా భోజనం చేసేవా రాయన. వంటబ్రాహ్మడి వంటకూడా నిషిద్ధం కా దాయనకు. ఇలాంటి కారణాలవల్ల మాకూ మాకూ తరుచు సంభాషణ వుండేదికాదు. ఆయన చదువుతున్నా రావేళ పుస్తకం.<noinclude><references/> {{rh|345||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude> 0wpywkyij2ecdl79qto7ln7xtxr6r5c పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/235 104 211514 554041 553987 2026-04-22T05:21:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554041 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''61. జ్వాలాముఖి '''</p>}} {{right|- నిఖిలేశ్వర్}} ప్రజాస్వామిక విప్లవ సాంస్కృతికోధ్యమ మిత్రుడు, దిగంబర కవితా సహచరుడు జ్వాలాముఖి ఆయనలో అర్థ శతాబ్ది స్నేహమను బంధం నాదం. 1960కు పూర్వమే ఆకారం వీరవెల్లి రాఘవాచారిగా, ఆయన తొలిరచన 'మనిషి' కావ్యంతో నాకు తొలి పరిచయం. జ్వాలాముఖి హైదరాబాద్ లోని సీతారాంబాగ్ దేవాలయంలో 12-4-1938 (బహుధాన్య, చైత్ర పూర్ణిమ)నాడు జన్మించాడు. తల్లిదండ్రులు వెంకటలక్ష్మి నరసమ్మ, వీరవెల్లి నరసింహాచార్యులు. మెదక్ జిల్లాలోని ఆకారం గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. వారిది వైష్ణవ సంప్రదాయ కుటుంబం. కలంపేరు జ్వాలాముఖిగా ప్రసిద్ధుడైన రాఘవాచారికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. ఆయన సతీమణి సీతాదేవి. ముగ్గురు మగపిల్లలు సంపత్, శ్రీధర్, వాసు. ఈ ముగ్గురు కుమారులు కులాంతర వివాహాలు చేసుకున్నారు. జ్వాల తన బాల్యం గురించి ఇలా వర్ణించాడు. “నాన్న పౌరోహిత్యం, కంఠశోష, రామాయణ పారాయణం, పూటగడవని తండ్రి కోపంలో వణికిపోయిన బాల్యం. ఈతలు, ఆటలు, బలాదూరు తిరుగుళ్ళు, ఆట ఖ్యాళి చాపల్యం” జ్వాలాముఖి విద్యాభ్యాసం సీతారాంబాగ్ లోని సంస్కృత పాఠశాలలో 'అమరకోశం', శబ్ధమంజరితో మొదలై నాంపల్లి లోని మల్టీపర్పస్ హైస్కూల్లో 10వ తరగతి, ఆతర్వాత నిజాం కాలేజీలోని సాయంకాల కళాశాలలో బి.ఎ. పాసై, ప్రయివేటుగా ఎమ్.ఎ.(తెలుగు), ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు. విడిగా హిందీ భూషణ్ ఉత్తీర్ణత సాధించారు. ఉద్యోగరీత్యా ఆయన ఎ.ఒ.సి.లో సైనికులకు చదువు చెప్పే సివిలియన్ స్కూలు మాస్టారుగా కొంతకాలం పనిచేశారు. తర్వాత వరసగా జలహళ్ళి (బెంగళూరు) ఏర్ ఫొర్స్ లొ క్లర్కుగా, ప్రభుత్వ పౌరసరఫరాలశాల, ఆర్.టి.సి.లో క్లర్క్, ఆలియా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పన్నెండేళ్లు, ఎల్. ఎన్. గుప్తా సాయంకాల కళాశాలలో 24 సంవత్సరములు లెక్చరర్ గా పనిచేసి 1996లో రిటైరైయ్యారు. మరోవైపు సీతారాంబాగ్ దేవాలయ ట్రస్టీ గనేరీవాల్తో, దేవాదాయ శాఖతో, కోర్టు వ్యాజ్యాల మధ్య పోరాడి స్థానిక బాధితులకు సొంతఇళ్ళు సాధించగలిగాడు. '''తాత్విక భూమిక ''' సీతారాంబాగ్ జీవితం, జ్వాలను మొదట ఆస్తికుణ్ణి ఆతర్వాత నాస్తికునిగా మార్చింది. సంప్రదాయ వ్యతిరేకత, మానవతా ఆరాధన తొలి పాఠాలుగా హేతువాదంతో బలపడి "మంచి అనే విపంచి మీద మానవతా రాగాలు ఆలపిస్తూ అమరత్వానికి అభ్యుదయానికి" (మనిషీ) ప్రస్థానం చేయించింది.<noinclude><references/> {{rh|తెలంగాణ |214| తేజోమూర్తులు}}</noinclude> fefq06fhra564jouyuscjjt6uwa9pnp పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/236 104 211515 554042 551542 2026-04-22T05:35:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554042 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> "కట్టలు తెగిన కవితావేశంలో ఏదో చేయాలనే ఆరాటం”. ఎంతచెప్పినా వినని సమాజంపట్ల క్రోధావేశం. మనుషుల్ని మనసుల్ని దిగంబరంగా ఆవిష్కరించే ప్రయత్నం. తిరుగుబాటు వేదాంతంగా మారింది. <poem> {{left margin|5em}} జ్వాలా కవితా చరణాల్లోనే "భోదివృక్షం పిడికెడు నీడనీయలేదు గాంధీ పథం గరిటెడు గంజిపోయలేదు. ధర్మశాస్త్రాలు తలదాచుకోనీయలేదు. కర్మ సిద్ధాంతం బానిసను చేసి వదిలింది”</poem> ఆయనకు నిరంతర అధ్యయనం, అవగాహన, ఆలోచన, వివేచనలతో చివరికి మార్క్సిజం లెనినిజం-మావో ఆలోచనా విధానం పట్ల నమ్మకం కుదిరింది. ఎరుపు నిజం అశృత్ప భారతజాతికి విముక్తి మార్గం అని తెలిసింది. అయితే అతివాద దుస్సాహనిక వ్యక్తిగత హింసావాదాల ఫలితాలు గమనించి సరైన విప్లవ పంథా కోసం అన్వేషణ ప్రారంభించాడు. కా॥ దేవులపల్లి వెంకటేశ్వర రావు, తరిమెల నాగిరెడ్డి రూపొందించిన నూతన జనతా ప్రజాతంత్ర మార్గం దిక్సూచిగా కనపడింది. అప్పుడిక విప్లవ పంథా ప్రబోధానికి, తన కలం, గళం అంకితం చేశాడు. '''కవిత్వం సాహిత్యం ''' జ్వాలాముఖికి విద్యార్థి దశనుండే కవిత్వం ఒక దాహంగా, ఒక అభివ్యక్త మార్గంగా గోచరించింది. 1956-58 మధ్య రచించిన "మనిషి” అనే దీర్ఘకవిత -కరుణశ్రీ, దాశరథి ఆశీస్సులతోపాటు ప్రోత్సాహాన్ని పొందింది. గోర్క ప్రేంచంద్, టాల్ స్టాయ్, శరత్, గురజాడ, శ్రీశ్రీ రచనల అధ్యయనం ఆయన సాహిత్య మార్గాన్ని సుగమం చేసింది. ఇక 1965-70 మధ్యకాలంలో వెలువడిన మూడు "దిగంబరకవుల" కవితా సంపుటాలతో రాఘవాచారి జ్వాలాముఖిగా జ్వలించాడు. ఆరుగురు దిగంబర కవులలో ఒకడిగా ఆధునిక తెలుగు కవిత్వానికి ఉద్యమ స్ఫూర్తిని అందించాడు. నిస్తేజము, నిర్వీర్యమైన ఆనాటి సాహిత్య రంగాన దిక్కులు మార్మోగేలా గొంతు విప్పిన దిగంబర కవులు సంచలనం సృషించారు. 1970లో విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి సభల్లో జ్వాల ఆవేశపూరిత ఉపన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం, నక్సల్బరీ వసంత మేఘ గర్జనల నేపథ్యంలో విప్లవ రచయితల సంఘానికి సంస్థాపక సభ్యుడిగా, నిలిలేక్వర్ చెరబండ రాజులతో కలసి అగ్రేసర పాత్ర వహించాడు. మహాకవి శ్రీశ్రీతోపాటు ఆనాటి పౌరహక్కుల ఉద్యమంలో ముందు నిలిచాడు. ఒక మహావక్తగా సాహిత్యపరంగా విప్లవ సందేశాన్ని ప్రచారం చేసిన జ్వాల, భావాలు-రచనలు సహించలేని ఆనాటి ప్రభుత్వ నిర్బంధాన్ని, నిషేధాల్ని ప్రయోగించింది. 1971లో నిఖిల్, చెరబండరాజుతో పాటు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (పి.డి.చట్టం) క్రింద జైలులో బంధించింది. భావ ప్రకటనను అభివ్యక్తీకరించే స్వేచ్ఛకు సంకెళ్ళు వుండరాదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆతర్వాత 1975 దాకా విరసంలో కొనసాగిన సిద్ధాంత చర్చల పర్యవసానంగా చీలిక ఏర్పడింది. విరసం చారుమజుందారు ముఠా ప్రయోజనాలను కాపాడుతూ, వివిధ రూపాల వ్యక్తిగత హింసావాదాల్ని ప్రచారం చేసినందు వల్ల, ప్రజా సాంస్కృతికాధ్యమ లక్ష్యాలను సాధించలేదని భావించి, మిగతా మిత్రులతో ఆ సంస్థకు రాజీనామా చేశాడు. ఇక జనపథంలో సాంస్కృతిక విప్లవోద్యమం నిర్మించాలనే ఆశయంతో "జనసాహితి" సంస్థ ఏర్పాటులో ప్రముఖపాత్ర నిర్వహించాడు. 1978 నుంచి 1981 దాకా "జనసాహితి" కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా అప్రజాస్వామిక ముఠా పద్ధతులు ప్రవేశించినందువల్ల, జ్వాలాముఖి మరికొందరు మిత్రులతో కలసి ఆ సంస్థనుంచి బయటికి వచ్చేశాడు. ఆతర్వాత తన వ్యక్తిగత స్థాయిలో ప్రజాస్వామ్య భావనతో, భూస్వామ్య- సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా తన సైద్ధాంతిక పోరాటం కొనసాగించాడు. '''రచనలు ''' "మనిషి" కావ్యంతో రచనా వ్యాసంగం ప్రారంభించిన జ్వాల, తన జీవితకాలంలో వివిధ ప్రక్రియల్లో రచనలు<noinclude><references/> {{rh|తెలంగాణ |215| తేజోమూర్తులు}}</noinclude> 95wj0px1fcb928ag8kq1j0khwt44wz4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/237 104 211516 554043 551543 2026-04-22T05:49:05Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554043 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> చేశాడు. జీవితాంతం కలం యోధుడిగా విప్లవ మార్గంలో పయనిస్తూ కవిత్వం, కథలు, నవల, వ్యాసాలు రచించాడు. దిగంబర కవుల మూడు సంపుటాల తర్వాత ఆయన ప్రచురించిన కవితా సంపుటి "ఓటమి తిరుగుబాటు” మాత్రమే. “వేలాడిన మందారం నవలకు, కొన్ని కథలకు పత్రికల పురస్కారాలు పొందినా పుస్తకరూపం పొందలేదు. ఆర్ధిక ఇబ్బందుల మూలంగా ఆయన జీవించిన కాలంలో విడిగా సంపుటాలు వెలువడలేదు. ఆయన మరణానంతరం “జ్వాల ప్రచురణల” పేరిట రచనలన్నీ 2009 తర్వాత వరసగా వచ్చిన సంపుటాలు- కవితాజ్వాల, కథాజ్వాల, వ్యాసజ్వాల, వేలాడిన మందారం (నవల), భస్మ సింహాసనం (దీర్ఘకవిత), జ్వాల స్మృతిలో స్కృతిసంపుటి. జ్వాలాముఖి హిందీ, ఇంగ్లీషుల్లో కూడా ధారాళంగా ప్రసంగించడమే కాకుండా విరివిగా అనువాదాలు చేశాడు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం దేశదిమ్మరి ప్రవక్త శరత్ ('ఆవారా మసీహెూ' వియ ప్రభాకర్ అనువాదం), 'రాంగేయ రాఘవ్' (జీవిత చరిత్ర)లను హిందీ నుంచి అనువదించగా ప్రచురించారు. '''మహావక్తగా ''' విప్లవకవి, రచయితగానే కాకుండా ఆయన మహావక్తగా ఖ్యాతి చెందాడు. వందలాది గ్రామాల్లో పర్యటించి సాంస్కృతిక సాహిత్య అంశాలపై, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై ఉపన్యసించాడు. ఇటు రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఆయా సభల్లో, సదస్సుల్లో ప్రసంగించాడు. ఆయన ఉపన్యాసాలు, ప్రాచీన ఇతిహాసాల నుండి ఉదహరించే ఉపమానాలతో, స్థానిక కథలతో, అంతర్జాతీయ సాహిత్యంలోంచి ఏరి తెచ్చిన కథలతో రక్తి కటించేవాడు. ముఖ్యంగా రామాయణ, మహాభారతాలను సందర్భానుసారంగా ప్రజావరంగా అన్వయించి చెప్పేతీరు అందరిని ఆకట్టుకునేది. సామాన్యజనంలో విప్లవ భావాలను సూటిగానాలేవి. ఆయన ఉపన్యాసాలను కవితాత్మకత, కల్పనాశక్తితో శ్రోతల్ని ఆత్మీయంగా పలకరించి, ఆలోచనలను ప్రేరేపించేవి. '''సంస్థలతో ''' జ్వాల ఒక నిబద్ధ సామాజిక కవిగా "అక్షరం పదునెక్కితేనే కవిత్వం / రాజ్యాన్ని నిలదీస్తేనే రచన పరమార్ధం" అని విశ్వసించినవాడు. అక్షరాల్లోనే కాకుండా ఆచరణరీత్యా ఆయన ఒక క్రియాశీలకవిగా నిలిచిపోయాడు. ఆంధ్రదేశంలోని పౌరహక్కులు, ప్రజాస్వామ్య హక్కుల సంఘాలలో ఉద్యమకార్యకర్తగా తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు. ప్రజాతంత్ర విద్యార్ధి సంస్థ (డి.యస్.ఓ.) ఆవిర్భావ కాలం నుంచి అనుబంధం పెంచుకున్నాడు. ప్రజాతంత్ర విద్యావిధానం కోసం పోరాడుతూ విద్యార్థులను చైతన్యవంతులను చేశాడు. గ్రామీణ పేదల సంఘం ఉద్యమాలకు బాసటగా నిలిచి, భూమి, భుక్తి, విముక్తి పోరాటాల్లో పాల్గొన్నాడు. 1976లో ప్రారంభమైన “భారత-చైనా మిత్ర మండలి" లో జీవిత పర్యంతం క్రియాశీలంగా వున్నాడు. సంస్థ నిర్మాణం, ఉద్యమ కార్యకలాపాలలో నాయకత్వ పాత్ర వహించాడు. మిత్రమండలి ప్రతినిధిగా రెండుసార్లు చైనా సందర్శించి అక్కడి ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అంశాలను ఆకలింపు చేసుకొని, మన దేశ ప్రజలకు వివరించాడు. ఉపాధ్యాయ సంఘాల, హేతువాద నాస్తికవాద కార్యకలాపాల, కుల నిర్మూలనా సంఘం కార్యక్రమాల్లో ప్రజాతంత్ర వైఖరితో క్రియాశీలంగా పనిచేశాడు. వ్యక్తిగతంగా వందలాది కులాంతర, మతాంతర వివాహాలను జరిపించి ఈ దేశంలో రావలసిన కుల రహిత వ్యవస్థకోసం తపించాడు. స్త్రీవాదాలు, కులతత్వ సిద్ధాంతాలు, మత తత్వధోరణులు తప్పుడు అవగాహనతో ప్రజలను చీల్చి గ్రూపులుగా విడగొట్టి సంస్కరణవాద ఊబిలోకి దించుతాయని ఆయన విమర్శించేవాడు. మైనార్టీల రక్షణ కుల రహిత సమాజం, స్త్రీల విముక్తి కోసం తనదైన సామాజిక అవగాహనతో ఆయన ఉపన్యసించేవాడు. జ్వాలాముఖి ఎక్కువగా దీర్ఘకవితలే రచించాడు. తన రాజకీయ, సామాజిక తపన ప్రతి ఖండికలో సవివరంగా ప్రతిఫలించాలనే కోరిక వుండేది. “ఆకాశం ఎర్రబడుతుంది” అనే దీర్ఘ కవితలోని ఈ రణాలు ఆయన ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి.<noinclude><references/> {{rh|తెలంగాణ |216| తేజోమూర్తులు}}</noinclude> gkmyvrpb3ad82y7zbptov3lig1vqi3y పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/238 104 211518 554044 551545 2026-04-22T05:55:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554044 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> “రాత్రి / విచ్చుకున్న భయభీతావహం / క్రూరంగాకురుస్తున్న దోపిడి/ పామరులను చీకట్ల పోట్లతో / వేధిస్తున్న స్వతంత్రరాత్రి నావాళ్ళు / ఆకలిగొన్నవాళ్ళు / అన్యాయం వాతబడ్డవాళ్ళు / ....... కొందరు చీకటిని చీలుస్తున్నారు / లక్షనక్షత్రాలు రాలందే | ఉజ్వల ఉదయం ప్రవహించదు.....” ఇక ఆయనకు గౌరవ పురస్కరంగా లభించిన పురస్కారాలు - తొలి పురస్కారం గుంటూరు భారతీయ రచయితల పురస్కారం, ఝాన్సీ హేతువాద స్మారక అవార్డు, దాశరథి రంగాచార్య పురస్కారం, హిందీలో వేమూరి ఆంజనేయశర్మ అవార్డు, ఆవంత్స సోమసుందర్ పురస్కారం. జ్వాలను చాలాకాలంగా డయాబెటీస్ వ్యాధి పీడించింది. 1991లో ముంబైలో గుండె ఆపరేషన్ జరిగిన తర్వాత నియమబద్ధ జీవితం, వ్యాయామంతో ఉత్సాహంగా తిరిగేవాడు. వ్యక్తిగతంగా ఆర్ద్ర హృదయుడు, మంచి భోజనప్రియుడు. ఇతరులకు తినిపించి తాను తినేవాడు. కష్టాల్లో, సమస్యల్లో వున్నవారిని ఆదుకునే స్వభావం. చివరికి 70 సంవత్సరాలు దాటిన ఆయన, క్రిస్టోజనిక్ లివర్ సిరోసిస్ వ్యాధి మూలంగా 14-12-2008న కన్నుమూశాడు. తన జీవితకాలంలో నాలుగు దశాబ్దాలకు పైగా అలుపెరగని కృషితో ప్రజా ఉద్యమాల వెంట నడిచినవాడు. సమకాలీనులకు, కొత్తతరాలకు స్ఫూర్తినిచ్చి "తిరుగుబాటు వేదాంతం” కవిగా మిగిలిపోయాడు.<noinclude><references/> {{rh|తెలంగాణ |217| తేజోమూర్తులు}}</noinclude> 7y481xnz5c9jduzghyifbjrwmc19wyu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/239 104 211519 554046 551546 2026-04-22T06:07:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554046 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''62. కె.వి. రాఘవాచార్యులు'''</p>}} {{right|- డా|| సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి}} కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలుకా నారాయణపురంలో వేంకటమ్మ, కారంచేటి తిరుమల మనోహరాచార్య దంపతులకు కె.వి.రాఘవాచార్య 1929 విభవ నామ సంవత్సరం పుష్య శుద్ధ ద్వాదశి జన్మించారు. ఆయన 2016 ఆగస్టు 5న పరమపదించారు. చిన్నప్పుడు తండ్రినీడలోనే చదువు అంటే ఇదే అని తెలియని రోజులనుండి వారి విద్యావ్యాసంగం ప్రారంభమైంది. మాటలు వచ్చినప్పటి నుండే స్తోత్రాలు పద్యాలు ఎక్కాలు కంఠానికి పట్టించారు. తన 5వ ఏట శేషభట్టర్ శ్రీనివాసా చార్యుల దగ్గర కట్టెల పలకలమీద కా గుణింతం, పెద్ద బాల శిక్ష, ఎక్కాలు, బొట్టు, పరక, వీసం పుట్టి లెక్కలు వ్రాయడం, కార్డులను ఉత్తరాలను చదవడం నేర్చుకున్నారు. 'ఆంధ్రనామ సంగ్రహం, సాంబ నిఘంటువు, అమరకోశం వంటివి ఉదయం చెబితే మరుసటినాటి ఉదయం మళ్ళీ నోటికి చెప్పాలి. చెప్పిన పాఠాన్ని చెప్పగానే నాలుగుపూటలు పూటకు 25 ఆవృత్తులు వల్లె వేసి మరుసటిరోజు ఓప్పచెప్పే వాళ్ళం' అంటారు కె.వి.రాఘవాచార్య. అప్పుడే ఉపనయనం, తండ్రి దగ్గర పంచసంస్కారాలు పొందిన రాఘవాచార్యులు బ్రహ్మశ్రీ వేదమూర్తుల జోగా వెంకయ్య శర్మగారి దగ్గర వేదం, నమిలికొండ శ్రీరంగాచార్యుల వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. శర్మగారి దగ్గర పంచకర్మలు, దేవయాకం నేర్చుకున్నారు. వేణుగోపాలయంలో 5 సంవత్సరాలున్నా పంచకావ్యాలూ పూర్తి కాలేదు. ముందు చెప్పింది వస్తేనే తర్వాతది చెప్పేవారు. అక్కడ దోర్బల విశ్వనాథశర్మ, తిగుళ్ళ వేంకటేశ్వరశర్మ, రాచెర్ల వెంకటేశ్వర్లు, గుమ్లాపురం శ్రీనివాసా చార్యులు సహాధ్యాయులు. అప్పుడే చదువులకు సర్టిఫికెట్ అవసరం అనుకుంటున్న రోజులు. కరువు వచ్చింది. పిల్లలను వారాలకు కొందరి ఇండ్లలో ఏర్పాటు చేశారు. దోర్బలవారు, శిరిశనగళ్ళవారు ఒకరు తెనాలికి మరొకరు సీతారాంబాగ్ హైదరాబాద్ పాఠశాలలకు వెళ్ళారు. రాఘవాచార్యుల వారికీ వెళ్ళాలని ఉన్నా మరోచోటికి వెళ్ళి చదువుకోవాలనుకుంటే తిండి, బట్ట అన్నిటికీ లోటే. సహ విద్యార్థులు జగడాలతో దెబ్బలాడుతుంటారు అని శర్మగారి దగ్గరే చదువుకోమన్నారు తండ్రి గారు. ఊరు దాటనీయలేదు. ఈ సమయంలోనే సురవరం ప్రతాపరెడ్డి ఆ ఊరికి రావడం, అక్కడ చిన్న సమావేశం జరిగింది. తన గురువుల పద్యాలు గోలకొండ కవుల సంచికలో పడడం చూసి తానూ కవిత్వవిద్యలోకి అడుగుపెట్టారు. అలా వేదం, ద్రావిడవేదం, యజ్ఞ విధులు, సంస్కృతం నుండి నాటక ఛందోలంకార శాస్త్ర సాహిత్యంవైపు మరలారు రాఘవాచార్య. ఇంటి దగ్గరలోనే ఉన్న కృష్ణశాస్త్రి, నమిలికొండ శ్రీరంగాచార్యులవద్ద లఘు సిద్ధాంతకౌముది, మాఘకావ్యం గీతా భాష్యం, సంప్రదాయగ్రంథాలు, నైషధం, తర్కం,<noinclude><references/> {{rh|తెలంగాణ |218| తేజోమూర్తులు}}</noinclude> oe8fbb5bfoq9ahnhh6jlh9q67tl1g0m పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/240 104 211520 554047 551547 2026-04-22T06:21:55Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554047 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> శాకుంతలం, సాహిత్యదర్పణం, ఉత్తరరామచరిత్ర, వీర రాఘవీయ వ్యాఖ్యతో భాగవతంలోని నాలుగు స్కంధాలు చదివారు. ఊళ్ళో పండితులు లేనప్పుడు ఆరుమైళ్ళ దూరంలోని ఆవునూరుకు వెళ్ళి ఆచ్చి వేంకటాచార్యుల వద్ద పాఠాలు చదివేవారు. రాఘవాచార్యుల ఇంట్లో తాను పెద్ద తమ్ముడు స్కూలు చదువులకు పోలేదు. స్థిరమైన ఉద్యోగం కోసం తర్వాతి రోజుల్లో స్కూలు చదువులేక అనేక ఇబ్బందులు పడ్డారు రాఘవాచార్యులు. 1947 ఆగస్టు 15 స్వాతంత్య్రం రావడం, జాతిపిత గాంధీ హత్య జనవరి 30, 1948న జరగడం దేశమంతా విషాదఛాయలతో ఉండింది. నైజాం రాష్ట్రంలో రజాకార్లవల్ల అలజడులు రావడంతో ఊర్లో తెల్ల టోపీలు, జండాలు పట్టుకుని స్వతంత్ర భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూండేవారు. పోలీసులు వచ్చి తీసు కెళ్తుంటే ఊరి పెద్దలు వారికి నచ్చచెప్పి విడిపించడం జరిగేవి. ఊర్లో రోజూ సీతారామచంద్ర ఆలయంలో పూజలు జరపాలని నిర్ణయించారు. నిజాం బాధలు తొలగాలని ఊరివారంతా అన్ని కులాలవారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. "రాష్ట్రమంతా రజాకార్ల దౌర్జన్యంతో ఉన్నప్పుడు మా గ్రామం భగవత్ సేవలో ఉండి ఇదినారాయణపురం' అనిపించుకుందంటారు కె.వి. రాఘవాచార్య. సెప్టెంబర్ 17, 1948న పటేలు నిజాం ప్రభువు లొంగిపోయాడన్న వార్త రేడియోలో విని సంబరాలు చేశారు. అప్పటికి వారి వయసు సరిగ్గా రెండు పదులు. ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి గ్రామాన్ని ముంచెత్తింది. 85ఏళ్ళ గురువు మరణించారు. కృష్ణశాస్త్రిగారి మాటల ప్రోత్సాహంతో ఊర్లో మురళీధర శర్మ కార్యదర్శిగా చిన్న గ్రంథాలయం పెట్టారు. సుజాత, స్వతంత్ర, భారతి పత్రికలు పోస్టు ద్వారా తెప్పించేవారు. ఆ కాలంలోనే ఆంధ్రసారస్వత పరిషత్ వారి పరీక్షలను శ్రీమాన్ నేరెళ్ళ వేంకటాచార్యులు నిర్వహించేవారు. ఇది వ్రాస్తే చిన్న ఉద్యోగం పొందవచ్చన్న ఆశతో సారస్వత పరిషత్తుకు వచ్చి ప్రవేశ పరీక్ష అనుమతి పొందడానికి వచ్చానని చెబితే లోపలికి వెళ్ళమన్నారు. అక్కడున్న ఇద్దరు ఏం చదివావన్నారు చెప్పారు. ఏదైనా చెప్పమంటే భారవిశ్లోకం చెప్పారు. వారొక పద్యం చెప్పి అర్థం చెప్పమన్నారు. చెప్పారు. ప్రవేశ పరీక్షకు అనుమతిచ్చారు. ఆ అనుమతిచ్చినవారు పులిజాల హన్మంతరావు, దేవులపల్లి రామానుజ రావు. సిరిసిల్లకు మకాం మార్చి ప్రవేశపరీక్షకు చదివేవారికి చదువు చెబుతూ తానూ చదువుకున్నారు. తొలి వ్యాసం - తొలి బహుమతి, ఉద్యోగం 26 జనవరి 1950లో మహాత్మాగాంధీ జాతిపిత పేరుతో సంస్కృత భాషలో వ్యాస రచన పోటీ జరిగితే ముగ్గురు పాల్గొన్నారు. మొదటిబహుమతి వచ్చింది. పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఆయనకు పరిషత్తువారు పరీక్ష ప్యాసైన సర్టిఫికెట్ ఇచ్చారు. 1950 సెప్టంబర్ 22న ఉర్దూభాషలో ఉద్యోగ ఆర్డర్ వచ్చింది. 25 రూపాయల జీతం, మాసాయిపేటలో 25 సెప్టెంబర్ 1950 నాడు ఉద్యోగంలో చేరారు. అక్కడి కరణం రాజేశ్వరరావు దగ్గర ABCDలు ముస్లీం టీచర్ దగ్గర అటిఫ్, బె, పె,సెలు నేర్చుకుని మూడు నెలల్లోనే ఏడో తరగతి పుస్తకం వరకు చదవడం నేర్చారు. అప్పుడే 'హప్తుమ్' మిడిల్ పరీక్షకు అనుమతిపొంది ఆ పరీక్షలో ప్యాసై 16 జూలై 1951 'చక్రాల' (సంగారెడ్డి దగ్గరలో) ఏకోపాధ్యాయ పాఠశాలలో చేరారు . అక్కడ ఉ౦డగానే HSCలో తెలుగువాచక పరీక్షలో తప్పకుండా పాస్ కావాలన్న నియమం వచ్చింది. సలాం సాహెబు అన్న గణితోపాధ్యాయుడికి తెలుగు చెప్పి అతడి దగ్గర లెక్కలు నేర్చకున్నారు. HSC పాసయ్యారు. హిందీ ప్రచారసభ, సంస్కృత భాషాప్రచార సమితి వారి ప్రవేశిక. ప్రాథమిక, విశారద పరీక్షలు నిర్వహించారు. 1966లో సిద్ధిపేటకు బదిలీవల్ల చేరారు. '''సిద్ధిపేట సాహిత్య సాంగత్యాలు ''' సిద్ధిపేట చేరాక పండితసభలు, కవి సమ్మేళనాలు ఆధ్యాత్మిక ప్రవచనాలలో ఎక్కువగా తిరిగేవారు. వేముగంటి నరసంహాచార్యులు, కాపు రాజయ్య, A. రామరాజు, శ్రీవెంకట్రావు వంటివారితో సాహిత్య సాంస్కృతిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు ఎలిజర్ల సీతారామాచార్యులవద్ద భగద్విషయం సేవించారు. 1967లో MA సంస్కృతం, 1971లో తెలుగు MA పూర్తి చేశారు. 1972 సెప్టెంబర్ ఆదిలాబాద్ డిగ్రీ కాలేజీలో ట్యూటర్గా చేరారు. అక్కడ సదాశివ, వెంకటనారాయణశర్మ<noinclude><references/> {{rh|తెలంగాణ |219| తేజోమూర్తులు}}</noinclude> 0dpwromajad3mu13qj2uowtyz7c2m6d పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/241 104 211521 554063 551548 2026-04-22T09:33:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554063 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> వంటి వారితో పరిచయం ఏర్పడింది. మళ్ళీ సిద్దిపేటకు బదిలీ అయ్యారు. సిద్ధిపేటలో ఉండగానే ఇతిహాస, పురాణ ప్రవచనాలుచేస్తూండేవారు. యువభారతివారు 1983లో మాఘకావ్యవైభవంపై ప్రసగించమంటే ప్రసంగించారు. అలా మాఘకావ్యవైభవం పుస్తకం వచ్చింది. దానికి వచ్చిన పేరుతో వ్యాఖ్యానాలు చేయాలని నిర్ణయించుకున్నారు కెవి రాఘవాచార్య '''వేదాంత దేశికుల కావ్యాలకు దీపశిఖ ''' 13,14 శతాబ్దాలకు చెందిన వేదాంత దేశికుల రచనలను వెలుగులోకి తేవాలని భావించి ఆయన స్తోత్రవాఙ్మయాన్ని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. 1987లో 'గోదాస్తుతి అన్న స్త్రోత్రానికి పరిమళ వ్యాఖ్యను రచించారు. హైదరాబాదు సారస్వత పరిషత్తులో ఉభయవేదాంత సభలను శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద్ద జియ్యర్ స్వామివారు నిర్వహించారు. అక్కడ తిరువాయ్ మొళిలోని ఒకదశకంపై ప్రసంగించారు. అక్కడినుండి ప్రతిసంవత్సరం జరిగే సభలలో ప్రసంగావకాశం లభించింది. 1989 జనవరిలో సిద్ధిపేట కాలేజీ నుండి రిటైరయ్యాక హైదరాబాద్ చేరారు. 1990 భగవద్విషయం- ఈడు అవతారిక అన్న తమిళ రచనానువాదం, భగవద్ధ్యానసోపానం అన్న స్త్రోత్రానికి మనోరమా వ్యాఖ్యా రచించారు. శ్రీరామానుజకీర్తి కౌముది అన్న సంపుటాలలో శ్రీమద్రామానుజులు వర్ణాశ్రమధర్మాలు అన్న పుస్తకాన్ని 12వ భాగంలో ప్రచురించారు. '''వేదాంత దేశికుల పాదుకా సహస్రవ్యాఖ్య ''' కె.వి. రాఘవాచార్యుల వ్యాఖ్యానాలలో జీవిత సాఫల్య రచనగా చెప్పదగినది పాదుకా సహస్ర వ్యాఖ్య. 'పాదుకలను’ అంశంగా తీసుకుని వెయ్యి భావాలు చెప్పడం ఈ రచన విశిష్టత. వేదాంత దేశికులవంటి ప్రాఢకవి, విశిష్టాద్వైత రహస్య తత్త్వవేత్త వ్రాసిన మొత్తాన్ని వ్యాఖ్యానంలోకి తీసుకురావడంలో రాఘవాచార్యుల వారు చేసిన కృషి, ఎనలేనిది. 1996లో తొలిభాగం ముద్రణై 2003లో ఐదు భాగాలతో ఈ వ్యాఖ్య ముగిసింది. దీన్ని హైదరాబాదు లోని అహెూబిలమఠం మాలోల గ్రంథమాల వారు ప్రచురించారు. పాదుకా సహస్రం రచనను పద్ధతి పేరుతో 32 విభాగాలుగా రచనను వేదాంతదేశికులు వర్గీకరించారు. వాటి ప్రస్తావన, సమాఖ్య మొదలైన విధంగా 32 పేర్లు పెట్టడానికి గల కారణాలను కె.వి. రాఘవాచార్యులు తమ వ్యాఖ్యానంలో వివరించారు. వరదరాజ పంచాశత్, గరుడ దండకం, సుదర్శనాష్టకం, చతుఃశ్లోకీ, యతిరాజసప్తతి అభీతిస్తవం, క్రీస్తుతి, దయాశతకం, వ్యాస వింశతి, అచ్యుత శతకం వంటి రచనలు తెలుగులో వ్యాఖ్యానాల ద్వారా అందులోని రహస్యాలను సాధారణ జనాలకు అర్ధమయ్యేరీతిలో వెలువరించారు. శంకరాచార్యుల శ్రీవిష్ణుపాదాది కేశాంత స్తోత్రానికి వ్యాఖ్యానాన్నందించారు. దివ్యప్రబంధత్రయి పేరుతో ఆళ్వారుల ప్రబంధాల్లో మూడిటికి తెలుగు వివరణ, ద్రవిడొపషత్తత్వర్యరత్నావళికి అన్న మరో రచనకు వ్యాఖ్యానాలు రచించారు. ఆళ్వారులు ప్రదర్శించిన భక్తి ప్రవత్తి మార్గాల విశ్లేషణ చేశారు. పోతన భాగవతంలోని రుక్మిణీకల్యాణం, నారాయణ శతకాలకు వైష్ణబీ, రాఘవీయ పేరుతో వ్యాఖ్యానాలు రచించి పోతన పద్య రచనా హృదయాన్ని ఆవిష్కరించారు. 2010లో వేదాన్తదేశిక దర్శనమ్ పేరుతో రచించిన చిన్న గ్రంథంలో వేదాంత దేశికుల జీవన తాత్వికతను ఆయన రచించిన నూటొక్క రచనలను సంక్షిప్తంగా పరిచయం చేశారు. యాదవాభ్యుదయం అన్న 24 సర్గల మహాకావ్యానికి వ్యాఖ్యానం రచించడం ప్రారంభించారు. 2630 శ్లోకాలున్న ఈ కావ్య వ్యాఖ్యానంలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్న రాఘవాచార్యులవారు. మొదటిభాగంగా 4 వర్షలకు వ్యాఖ్య రచించి వెలువరించారు. ఇది మరో జీవిత సాఫల్య రచనగా చెప్పదగినది రాఘవాచార్యుల వ్యాఖ్యలో విషయాన్ని వివరించడంతోబాటు వేదం మొదలు లౌకిక కావ్యాల దాకా ఆళ్వారులు మొదలు అద్యతనుల వరకు ఉదాహరణలు అభిస్తాయి. జీవితమంతా చదువుకోసం, చదివిన దానికి గుర్తింపుకోసం పాటుపడ్డ తరంలోని వారు రాఘవాచార్యులు. అప్పటి చదువుల్లో ఎక్కువభాగం సర్టిఫికెట్లోని చదువులు. భృతికోసం సర్టిఫికెట్ చదువులు 16 ఏళ్ళ తర్వాతే కొనసాగించారు. వేద విద్యలు, వేదాంతవిద్యలు, వైష్ణవ<noinclude><references/></noinclude> qawu443l28klbdc8nahhaxkrqj60rsx 554064 554063 2026-04-22T09:34:47Z A.Murali 3019 554064 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> వంటి వారితో పరిచయం ఏర్పడింది. మళ్ళీ సిద్దిపేటకు బదిలీ అయ్యారు. సిద్ధిపేటలో ఉండగానే ఇతిహాస, పురాణ ప్రవచనాలుచేస్తూండేవారు. యువభారతివారు 1983లో మాఘకావ్యవైభవంపై ప్రసగించమంటే ప్రసంగించారు. అలా మాఘకావ్యవైభవం పుస్తకం వచ్చింది. దానికి వచ్చిన పేరుతో వ్యాఖ్యానాలు చేయాలని నిర్ణయించుకున్నారు కెవి రాఘవాచార్య '''వేదాంత దేశికుల కావ్యాలకు దీపశిఖ ''' 13,14 శతాబ్దాలకు చెందిన వేదాంత దేశికుల రచనలను వెలుగులోకి తేవాలని భావించి ఆయన స్తోత్రవాఙ్మయాన్ని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. 1987లో 'గోదాస్తుతి అన్న స్త్రోత్రానికి పరిమళ వ్యాఖ్యను రచించారు. హైదరాబాదు సారస్వత పరిషత్తులో ఉభయవేదాంత సభలను శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద్ద జియ్యర్ స్వామివారు నిర్వహించారు. అక్కడ తిరువాయ్ మొళిలోని ఒకదశకంపై ప్రసంగించారు. అక్కడినుండి ప్రతిసంవత్సరం జరిగే సభలలో ప్రసంగావకాశం లభించింది. 1989 జనవరిలో సిద్ధిపేట కాలేజీ నుండి రిటైరయ్యాక హైదరాబాద్ చేరారు. 1990 భగవద్విషయం- ఈడు అవతారిక అన్న తమిళ రచనానువాదం, భగవద్ధ్యానసోపానం అన్న స్త్రోత్రానికి మనోరమా వ్యాఖ్యా రచించారు. శ్రీరామానుజకీర్తి కౌముది అన్న సంపుటాలలో శ్రీమద్రామానుజులు వర్ణాశ్రమధర్మాలు అన్న పుస్తకాన్ని 12వ భాగంలో ప్రచురించారు. '''వేదాంత దేశికుల పాదుకా సహస్రవ్యాఖ్య ''' కె.వి. రాఘవాచార్యుల వ్యాఖ్యానాలలో జీవిత సాఫల్య రచనగా చెప్పదగినది పాదుకా సహస్ర వ్యాఖ్య. 'పాదుకలను’ అంశంగా తీసుకుని వెయ్యి భావాలు చెప్పడం ఈ రచన విశిష్టత. వేదాంత దేశికులవంటి ప్రాఢకవి, విశిష్టాద్వైత రహస్య తత్త్వవేత్త వ్రాసిన మొత్తాన్ని వ్యాఖ్యానంలోకి తీసుకురావడంలో రాఘవాచార్యుల వారు చేసిన కృషి, ఎనలేనిది. 1996లో తొలిభాగం ముద్రణై 2003లో ఐదు భాగాలతో ఈ వ్యాఖ్య ముగిసింది. దీన్ని హైదరాబాదు లోని అహెూబిలమఠం మాలోల గ్రంథమాల వారు ప్రచురించారు. పాదుకా సహస్రం రచనను పద్ధతి పేరుతో 32 విభాగాలుగా రచనను వేదాంతదేశికులు వర్గీకరించారు. వాటి ప్రస్తావన, సమాఖ్య మొదలైన విధంగా 32 పేర్లు పెట్టడానికి గల కారణాలను కె.వి. రాఘవాచార్యులు తమ వ్యాఖ్యానంలో వివరించారు. వరదరాజ పంచాశత్, గరుడ దండకం, సుదర్శనాష్టకం, చతుఃశ్లోకీ, యతిరాజసప్తతి అభీతిస్తవం, క్రీస్తుతి, దయాశతకం, వ్యాస వింశతి, అచ్యుత శతకం వంటి రచనలు తెలుగులో వ్యాఖ్యానాల ద్వారా అందులోని రహస్యాలను సాధారణ జనాలకు అర్ధమయ్యేరీతిలో వెలువరించారు. శంకరాచార్యుల శ్రీవిష్ణుపాదాది కేశాంత స్తోత్రానికి వ్యాఖ్యానాన్నందించారు. దివ్యప్రబంధత్రయి పేరుతో ఆళ్వారుల ప్రబంధాల్లో మూడిటికి తెలుగు వివరణ, ద్రవిడొపషత్తత్వర్యరత్నావళికి అన్న మరో రచనకు వ్యాఖ్యానాలు రచించారు. ఆళ్వారులు ప్రదర్శించిన భక్తి ప్రవత్తి మార్గాల విశ్లేషణ చేశారు. పోతన భాగవతంలోని రుక్మిణీకల్యాణం, నారాయణ శతకాలకు వైష్ణబీ, రాఘవీయ పేరుతో వ్యాఖ్యానాలు రచించి పోతన పద్య రచనా హృదయాన్ని ఆవిష్కరించారు. 2010లో వేదాన్తదేశిక దర్శనమ్ పేరుతో రచించిన చిన్న గ్రంథంలో వేదాంత దేశికుల జీవన తాత్వికతను ఆయన రచించిన నూటొక్క రచనలను సంక్షిప్తంగా పరిచయం చేశారు. యాదవాభ్యుదయం అన్న 24 సర్గల మహాకావ్యానికి వ్యాఖ్యానం రచించడం ప్రారంభించారు. 2630 శ్లోకాలున్న ఈ కావ్య వ్యాఖ్యానంలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్న రాఘవాచార్యులవారు. మొదటిభాగంగా 4 వర్షలకు వ్యాఖ్య రచించి వెలువరించారు. ఇది మరో జీవిత సాఫల్య రచనగా చెప్పదగినది రాఘవాచార్యుల వ్యాఖ్యలో విషయాన్ని వివరించడంతోబాటు వేదం మొదలు లౌకిక కావ్యాల దాకా ఆళ్వారులు మొదలు అద్యతనుల వరకు ఉదాహరణలు అభిస్తాయి. జీవితమంతా చదువుకోసం, చదివిన దానికి గుర్తింపుకోసం పాటుపడ్డ తరంలోని వారు రాఘవాచార్యులు. అప్పటి చదువుల్లో ఎక్కువభాగం సర్టిఫికెట్లోని చదువులు. భృతికోసం సర్టిఫికెట్ చదువులు 16 ఏళ్ళ తర్వాతే కొనసాగించారు. వేద విద్యలు, వేదాంతవిద్యలు, వైష్ణవ<noinclude><references/> {{rh|తెలంగాణ |220| తేజోమూర్తులు}}</noinclude> n34sd4c04b6gdne4txerco1dd8aqjd4 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/242 104 211522 554065 551549 2026-04-22T09:38:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554065 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> గ్రంథాలు సంస్కృతం నేర్చిన గొప్ప పండితుడు మూడో తరగతి పిల్లలకు పాఠం చెబుతూ విధి బలీయమైందికదా అనుకున్నారు. అయినా పట్టువదలక పాఠశాల ఉపాధ్యాయుడి మొదలు కళాశాల అధ్యాపకుడిదాకా ఎదిగారు. విశిష్టాద్వైత వేదాన్త విశారద, శాస్త్రవిద్వన్మణి, వాచస్పతి బిరుదులందుకున్నారు. మొదటిది గుంటూరువారు, 2వది వేద విశ్వవిద్యాలయం తిరుపతివారు, మూడవది రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారు ప్రదానం చేశారు. తెలుగు విశ్వవిద్యాలయ పండిత పురస్కారం, శివానంద సద్గురు ఎమినెంట్ అవార్డు, ఉభయవేదాన్త విద్యత్సమ్మానం, రఘునాథాచార్యుల వారిచ్చే ఉభయవేదాంత పురస్కారం, ఉగాది పురస్కారం, మహావ్యాఖ్యాత పురస్కారం వంటి వాటితో బాటు శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద జీయరుస్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామినుండి పురస్కారాలు పొందారు. తిరుమల చారిటబుల్ ట్రస్ట్ను తన సోదరులు, పుత్రులతో ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం పండిత సన్మానాలను చేస్తూ తాను సంస్కృత వాఙ్మయ సేవచేస్తూ, చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ జీవితం కొనసాగించారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |221| తేజోమూర్తులు}}</noinclude> 02q2t29lxhwws2wp4ltxa9v2xuv6fka పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/243 104 211523 554066 551550 2026-04-22T09:50:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554066 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''63. కాళోజీ నారాయణరావు '''</p>}} {{right|-నాగిళ్ళ రామశాస్త్రి}} 'నేనంటే, నువ్వు, నేను, వాడూ, నా గొడవ మనస్థితి వైనం. నేనంటే భారత పౌరుడు నా గొడవ ఆ పౌరుని మనఃస్థితి, నేనంటే ఒక ఓటరు. నా గొడవ ఓటరు మనఃస్థితి, నేనంటే ఒక తిరుగుబాటుదారు, నా గొడవ మన తిరుగుబాటు' అని 'కాళోజీ' తన నా గొడవలో చెప్పుకున్నట్లు, ఆ నేను, లేదా పౌరుని తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ పౌరుని ఆయా కాలాల్లోని మనఃస్థితిని ఆయా కాలాల్లో వివరిస్తూ తన జీవితకాలమంతా, పౌరుని గొడవను తన గొడవగా వివరించిన సామాన్య మానవుని లేదా పౌరుని తరఫున పోరాటం చేసిన ప్రజా వకీలు కాళోజీ నారాయణరావు. అందుకే ఆయన ప్రజాకవి ఐండు. ఆనాడు హైద్రాబాదు సంస్థానంలోపడి మహారాష్ట్ర ప్రాంతం నుంచి, చౌథ్ వసూలు చేయడం కోసం నిజాంచే నియమింపబడ్డ మహారాష్ట్ర కుటుంబాలు కొన్ని ఉద్యోగరీత్యా తెలంగాణాలో స్థిరపడ్డాయి. అట్లా స్థిరపడ్డవాళ్ళల్లో కాళోజీ కుటుంబం ఒకటి. అసలు వాళ్ళ ఇంటిపేరు కాలేజీ పోయి పోయి కాళోజీ అయింది. 1914. హైద్రాబాదు సరిహద్దులోని బీజాపూరు జిల్లాలోని రట్టహళ్ళలో అమ్మమ్మగారింట్లో కర్ణాటకలో సెప్టెంబర్ 9వ తేదీన కాళోజి పుట్టారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత శ్రీనివాస్ రాంరాజా కాళోజీ. మడికొండ, వరంగల్లు, హైద్రాబాదుల్లో విద్యాభ్యాసం చేసి, వకాలతు పాసై, సర్కారు కోర్టులో కంటే, ప్రజాకోర్టుల్లోనే ప్రజలతరఫున ప్రాక్టీసు చేసిండు. తండ్రి ద్వారా ఉర్దూ సాహిత్యంతోపాటు జీవితంలో క్రమశిక్షణ, తల్లి చిన్నపుడు చెప్పిన ప్రహ్లాద చరిత్ర ద్వారా, అధికార దుర్మదాంధతను ఎదుర్కోవడంలో ఆసక్తి ఏర్పడితే వానమామలై సోదరులు, అన్న రామేశ్వరరావు, పల్లాదుర్గయ్య బిరుదురాజు రామరాజు వంటి సాయితగాండ్ల ద్వారా తెలుగు సాహిత్యంపట్ల మక్కువ ఏర్పడ్డాయి. ఈ లక్షణమే తాను చదువుకునే రోజుల్లో ప్రతి ఏటా వచ్చే గణేశ ఉత్సవాలకు ఇచ్చే సెలవు ఇవ్వకపోవటంతో 1600 మంది విద్యార్థులతో తిరుగుబాటుకు నాయకత్వం వహించేటట్టు చేసింది. అధికారులు ఏకపక్ష చర్యలను, అదీ ప్రజలకు వ్యతిరేకమైతే తప్పనిసరిగా వ్యతిరేకించే, నిరసించే, ప్రశ్నించే తత్వం అలవాటైంది. ఇది ఆయన 2002 నవంబరు 13న ఆయన కాలం చేసే వరకు కూడ సాగింది. అవిచ్ఛన్నంగా, అదే ఆయనను ప్రజా కవిని చేసింది. తెలంగాణకు కోడిపుంజై వెలుగు జాడ జూపిన సురవరం ప్రతాపరెడ్డి పత్రిక గోల్కొండలో తొట్టతొలి కవిత్వం రాసిండు కాళోజీ. 'నాగొడవ' ప్రకటించి నాందియైన వాడు అని ఆయనను స్మరించిండు కాళోజీ. తండ్రిగారు ఉద్యోగరీత్యా స్థలాలు మార్చడంవల్ల చదువు వానకాలం చదువుగానే సాగింది. ఇంటర్మీడియట్తో<noinclude><references/> {{rh|తెలంగాణ |222| తేజోమూర్తులు}}</noinclude> cu3detg6jtnzrzrk87p8purvzgpuaig పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/244 104 211524 554068 551551 2026-04-22T10:11:29Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 554068 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> వరంగల్లో ఆయన చదువు ఆగిపోయింది. అప్పటికే ప్రజా ఉద్యమాలల్ల పాల్గొనడం మొదలైంది. ఇంటర్మీడియట్లో టి.బి. రావడంవల్ల అర్ధాంతరంగా చదువు ఆగిపోయింది. తర్వాత, ఆరోగ్యం చక్కగ ఐనంక పకాలత్ పాసైండు. కాళోజీ బతుకంతా తెలంగాణ లోపటి రాజకీయ సాహిత్య, సాంస్కృతిక సామాజిక ఉద్యమాలన్నిటితోటి ముడిపడి వున్నది. ఆయనను ఉదహరించకుండ తెలంగాణ సాహిత్య, రాజకీయ, సామాజిక చరిత్ర లేదంటే అతిశయోక్తికాదు. అయితే ఆయన ఏమంటాడంటే నేను ఏ ఉద్యమానికి నాయకుణ్ణికాదు. ఉద్యమాలవల్ల పాల్గొన్న ప్రజలతోపాటు నేను ఎవరికి నాయకుణ్ణి కాదు. నాకెవరు అనుయాయులు లేరు. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టముజూచి కరిగిపోయెను గుండె, పతితమానపు జూచి, చితికిపోవును మనసు, పరుల కష్టాలతో పనియేమి మాకనెడి అన్యులను జూచైన హాయిగా మనలేను అని, ఆయన చెప్పుకున్నాడు నా గొడవలో. ఓ తీరుగ జూస్తే అది ఆయన ఫిలాసఫీ. ఇట్లు చూసి ఊర్కునే వాండ్లనుచూసి ఆయన నేనట్ల దేవునివతు సాక్షీభూతున్ని కాదు. సాక్షాత్తూ మానవున్ని గనక అవకతవకలను చేసేవాండ్లను ప్రశ్నిస్త అన్నాడు. దేవుని కంటె ఉన్నతమైన స్థానం ఇచ్చిండు మనిషికి కాళోజీ. అన్యాయం జరుగుతుంటే అసమ్మతి తెల్పడం, తరువాత నిరసన తెలపడం ఇంకా అవసరమైతే వాండ్లను ధిక్కరించడం ఆయన లక్షణం. ఇదే ఆయన కవిత్వ లక్షణంగూడ. ఎందుకంటే కాళోజీ కవిత్వమూ, బతుకు వేరువేరు కావు. ఇక్కడ ఇంకోమాట తప్పనిసరిగా చెప్పాలే, మహారాష్ట్రలోని సంత్, ఇస్లాంలోని సూఫీ సాంప్రదాయాల ప్రభావం కాళోజీమీద ఉన్నది. సూరదాస్, కబీర్ వలే వేమనవలే ప్రపంచాన్ని చుట్టూ కనపడ్డ అసమానతలు, అవకతవకలను ప్రశ్నిస్తూ దానికి గురియైన వాండ్లను చైతన్యవంతులను చేసి వాండ్లను సమాజాన్ని ప్రశ్నించేటట్లు తయారు గమ్మన్నడు. 1946లోపటి నిజాం రాజ్యంలో జరిగిన దౌర్జన్యాలు, దమనకాండ, ఆనాటి అధికారాల లోపాయికారి వ్యవహారం విషయాల పట్ల ఎట్ల తీవ్రంగా స్పందించిండో, తర్వాత వచ్చిన దేశీయ ప్రభుత్వాల పాలన పట్ల కూడా అవకతవకలు జరిగెతే అట్లనే స్పందించిండు. రక్షణకు ఏర్పడ్డ బలగం రక్కసుల పక్షంబు చేరిన రాక్షసుల ఇష్టానుసారం రాజ్యమును నడిపించినట్లే, బూజుపట్టిన రాజ్యభారం మోయజాలక జానపదులు రోజుచుండే దేశమేలెడు రాజు రోజులు నిండినట్లే. దీన్ని ఆయన కాలదేవత గర్భవేదన. అరసి, కాళోజీ వచించుట అన్నడు. అట్లనే ఆయన అన్నట్లు 1948లో నిజాం ప్రభుత్వం పోయింది. 1946లోనే కాళోజీ రైతేరాజు అన్నడు. రైతుగనక లేకపోతె సమాజంలోని ఏ వర్గం ప్రజలుగూడ బతుకలేరు అని కర్షకుని కర్రు కదిలినన్నాళ్ళే అన్న గేయంలో. అంతకుముందట్నే, 1944ల జనగామ, నల్లగొండల ప్రాంతం జరిగే అన్యాయాల్ని చూసి నవయుగంబన నాజీ వృత్తుల నగ్న నృత్యమింకెన్నాళ్ళు. దమననీతిలో దౌర్జన్యాలు పోషణ పొందేదెన్నాళ్ళు. ప్రజాదరణ కోల్పోయి దేశమును పాలన చేసేది ఎన్నాళ్ళు. శాంతిభద్రతల పేర దుష్టతను సమర్ధించుట ఇంకెన్నాళ్ళు అని ప్రశ్నించిండు. తన కవిత్వాన్ని కాళోజీ సామాన్య ప్రజలనుద్దేశించి 'పది వుపన్యాసాలు చేయలేని పని ఒక వ్యాసం చేస్తది. పది వ్యాసాలు చేయలేని పని ఒక కథ చేస్తది. పది కథలు చేయలేని పని ఒక కవిత చేస్తది. పది కవితలు చేయలేని పని ఒక పాట చేస్తది. అందుకే నేను నా గొడవ రూపంలో కవిత్వాన్ని నా భావజాల వ్యాప్తికి ఎన్నుకున్న' అన్నడు. ఆయనకు కవిత్వం పరమావధి కాదు, మానవత్వం పరమావధి. ఇంట్ల మాట్లాడినట్లే ఆయన ఉపన్యాసాలు ఉండేవి. ఉపన్యాసం రీతుగనే ఆయన కవిత్వం ఉండేది. ప్రజలకు దగ్గర కావటానికి అది ఆయనకు కవిత్వం ఒక సామాజిక వాహిక. ఆయన ఏం చెప్పిన సూటిగనే చెప్పిండు. వేమన చెప్పినట్లు సామాజిక వ్యత్యాసాలను చాలా అలవోకగా కవిత్వంలో చెప్పిండు. ఒకడు తన అవసరాలకంటే ఎక్కువ సంపాదించి పెట్టుకుంటే సామాన్యునికి అందుబాటులోనికి రాక వాని అవసరాలు ఎట్ల తీరుతయి. 'అన్నపురాసులు ఒకచోట - ఆకలిమంటలు ఒకచోట, సంపదలన్ని ఒకచోట గంపెడు బలిగం ఒకచోట' అన్న ఈ సంగతిని ఎంత అల్కగా చెప్తాడంటే 'కమ్మని చకినాలొక చోట- గట్టి దవడలు ఇంకొక చోట' అని. ఈ వ్యత్యాసాలు తొలగకపోతే సామాన్యుడు ఎట్లు బాగుపడుతడు.<noinclude><references/> {{rh|తెలంగాణ |223| తేజోమూర్తులు}}</noinclude> 4w4y1b2gf3g27copt93zyn9qzlqwz91 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/245 104 211525 554070 551552 2026-04-22T10:18:05Z A.Murali 3019 554070 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> అల్పులగు మానవులనడిగేదెవడు' అని కండ్లేర్ర చేస్తడు. పండించు ప్రాణాలు వస్తువడ్డాక, పాడు రాజ్యాన్ని కాపాడకుంటే ఏమి? అన్నడు. 'బీదల సర్వస్వముతో ధనికులు చేసే బేరము చాలింక, మూతులు నాకుచు, ఆత్మవంచనతో కట్టిన మూటలు చాలింక. ఇట్లాటి వ్యత్యాసాలు తొలగకపోతే ఆయ్య బాంచెను అన్న పౌరుడే అయ్య గొంతుకను అట్నే అదుమున్' అన్నడు. అందుకే ఈ వ్యత్యాసాలు పోయి, మనిషి, సాటి మనిషిని మనిషిగా చూడాలి. జాతియని, రీతియని, దేశమని, వేసమని విసముగక్కే వింత బిసగ మారినది, ఆధునిక ఆర్భాట మందణిగి అవనియే ఆత్మజుచ్చీ జనుల అడవైంది అన్నాడు. ప్రభుత్వాలు ఏంచేసినా సామాన్య మానవునికి వాటి ఫలాలు అందాలనేది కాళోజీ మాట. కాళోజీ భాష, సామాన్యుని భాష. అదే తన కవిత్వానరించుకున్నాడు. మనం ఏం చెప్తున్నామో, ఎవనికోసం చెస్తున్నమో, దానికి తెల్వాలే గద, తెలిస్తేగద వాడు ఆచరణలో పెడ్డడు. వాని బాసల, యాసల చెప్తే వానికి తెలుస్తది అనేది కాళోజీ మాట. మనం సామాన్య మానవున్ని చైతన్యవంతున్ని చేసి వాన్ని ఆచరణ వైపు మరల్చకపోతే మన బ్రతుకు దండుగ అంటడు. కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక అన్నడు. పర్యటిస్తూ వేమన జనజీవితంల చూసిస సంఘటనలకు ప్రభావితుడై తేట తేట మాటలల్ల కవిత్వాలు చెప్పినట్లే అన్ని సంఘటనలకు స్పందించిండు కాళోజీ. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చానా కాళోజీకి కంటినిండా నీళ్ళే. అసలు మనిషిలో ఆర్ద్రత లేకపోతే వాడు మనిషే కాడంటడు కాళోజీ, 'ఆశ్రువులు లేనట్టి అసువులేలా నాకు, అని కన్నీళ్ళు నన్నెపుడు ఆదుకుని వుండాలె ననీ అన్నడు. కవిత్వం ప్రజల కోసం అన్న కాళోజీ కవిత్వం ఎట్లా ఎండాల్నో గూడ చెప్పిండు. నా గొడవ కాలానికి (ప్రతికూలంగా) పారేది ఎదురెక్కేది అన్నడు. అందరు పొయ్యే బాటల నీటివాటంగా పోలే కాళోజీ. నా గొడవ, ఏనాడూ ఎవ్వనికి తలవంచలేదు. కాలునకే కాదు మహాకాలునకును ఏనాడును జీ అనని కలేజాతో ఉండాలె. అండ్ల అన్ని, నీ, భావనలే మన భావనలే, సమరస భావనలే. అది ఎదచించుక పారాలే. సామాన్యుని దుఃఖం వతుగ ఎందరాగబట్టినా ఆగకుండ ఎక్కి ఎక్కి వచ్చేటిదే. ఆయన కవిత్వంల నిత్యసత్యాలు అనదగ్గ పంక్తులు చాన ఉంటాయి. వేమన, కబీర్ చెప్పినట్లు సామెతలవతు, మల్ల మల్ల చెప్పేటట్టుంటయి. సాగిపోవుటే బ్రతుడు, ఆగిపోవునిచావు. బ్రతుకుపోరాటము - పడకు ఆరాటము. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సామాన్యుని సంక్షేమం కోసం కోట్లు కోట్లు ఖర్చుపెట్టినా, వాటి ఫలాలు సామాన్యునికి చేరలేదు. మిరియాల పాటు ఖర్చు, పుచ్చిన జొన్నల సేద్యం అన్నడు. ప్రజాస్వామ్యంలోపల ప్రజలేగొప్ప, సామాన్య ప్రజలకు కావల్సిందల్లా లేదా తీరవలసిందల్లా కూటి సమస్య, గూటి సమస్య, గూటిలోపలి గువ్వల జంటి సమస్యః ఈ సమస్య తీరంటే కర్మయోగం, గీతా బోధలు దండుగ, గంటములెన్నో అరిగెను కంటకాలు మాత్రం తరగలేదు. లోకం తంటాలు తీరలేదు అని కాళోజీ బాధ పడ్తాడు. కాళోజీ రాజకీయాలను రోసిండు. ప్రజాకీయాలు కావాలన్నాడు. సామాన్యుని బ్రతుకు బాగుపడాలె అన్న కాళోజీకి మనిషి తర్వాత మనిషి బ్రతుకంటే గొప్ప విశ్వాసం. ఆయన అంటడు 'ఇతుకు తప్పదు బతక్కు తప్పదు. శాస్త్రం తప్పుతుంది. ధర్మం తప్పుతుంది. న్యాయం తప్పుతుంది గాని బతుకు తప్పదు, బ్రతక్క తప్పదు' అన్నది. ఆయన మాట. ఇంత విశ్వాసం ఉన్నది గనకనే అవగాహనకు ఉదాహరణ. చాలా గొప్ప కవిత. 'బతుకమ్మ బతుకు, అమ్మల మరవని సంతానము గని బతుకమ్మ బతుకు' కాళోజీకి ప్రజాస్వామ్యం మీద గొప్ప విశ్వాసం. గొప్ప ప్రజాస్వామ్య వాది కాళోజీ. గత చరిత్ర తెలిసిన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ప్రణాస్వామ్యం ఖూన్ చేయబడ్డప్పుడు ఆయన కొట్లాడిన విషయం గుర్తే ఉంటది. చరిత్రకారుడెప్పుడు జరిగిన చరిత్రను తరువాత కాలంల సేకరించి కొంత విని, చదివి, వ్రాస్తడు. కాళోజీ ప్రజల తానొక్కడై, ప్రజా ఉద్యమాలల్ల పాల్గొని సమకాలీనుడుగా, ప్రత్యక్షంగా పాల్గొని, తన అనుభవాలను కవిత్వీకరించి రాసిన కవిత్వం. అదొక రన్నింగ్ కామెంటరీ. ఉ తెలంగాణ (224) తేజోమూర్తులు ఉండడుండడువంద<noinclude><references/> {{rh|తెలంగాణ |224| తేజోమూర్తులు}}</noinclude> k9dmg3wb3553qpfzrxdh1zoxg0zbr4p పుట:Sangitarasataran022902mbp.pdf/45 104 212337 553996 2026-04-21T12:50:35Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 553996 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సిద్ధా — అబ్బబ్బా! యేమిఘోరము. యేమిఘోరము. విండ్రు మనుష్యులేదా జూడలేకయున్నాడనే. సరే యీ వైపుగాజూడుము. ఒక పల్లకిమీద ఒక ఆడు శిశువును బండుకొనబెట్టినాడు ఒక పురుషుఁడు కుచ్చుపెట్టుకొని కూర్చుండి యున్నాడు. ఇదియేమి. ఛన్ను — రాజకుమారా! ఒక యేడాదిబిడ్డను ఒక దరిద్రుఁడగు బ్రాహ్మణుడు నాలుగువేలు పుచ్చుకొని డెబ్బది యేండ్లు గల ఒక శ్రీమంతుఁడైన ముసలి బ్రాహ్మణునకిచ్చి వివాహముచేసేవారు. ఆవివాహమహోత్సవము. సిద్దా - ఏమి యనభవించుట కాబ్రాహ్మణుడు వివాహమాడుచున్నాడో. ఛన్ను - ఆ బ్రాహ్మఱుడిదివరకైదు వివాహములు చేసుకున్నాడు. అన్నియు గతించినవి. పౌండరీకమింకను చేయలేదట. ఆదిపూర్తి చేసుకొనవలెనవి అర్థమువేఛ్ఛముచేసి యేడాదిపిల్లను వివాహము చేసుకొనుచున్నాడు. ఏమాత్రమైన భార్యపేరుకు ఉన్నంజాలునట. యాగము చేయవచ్చునట. సర్వా — ఆహా! యేమివెఱ్ఱి, యేమివింత, ఎంతదుఃఖము. ఛీ!ఛీ! అదేమిటీ. ఆమొండిగోడదాపు పదియారేండ్ల యీడుగల యొకస్త్రీని తనయెంచుట గూర్చుండమనుచున్నాడేమి. చన్ను — ఆచిన్నది. అయ్యా బ్రాహ్మణ స్త్రీ. అయిదేండ్లకే పెండ్లి అయినది. యెనిమిడేఁడ్లు వైధవ్యమువచ్చినది. తలవెండ్రుకలుండ రాదట. అలాఉన్న యెడల పెనిమిటికి సరకమువచ్చునట ఇది శాస్త్రము. అందుకని, ఆచిన్నది నెలనెలకు మంగలిచేత క్షారము ము చేయించుకొనును. సర్వా — ఓహౌ యిదియన్నింటికంటెను విచిత్రము దఃఖకరముగాను ఉన్నదే. ఆహా! నేనిచ్చట నెయ్యదిచూచినను దఃఖకరఁబుగానే తోచుచున్నయది గదా. {{Center|{{p|fs125}}పాట. జంఝూటి ౼ ఆదితాళము</p>}} {{left margin|5em}}<poem>ఈపుర మెల్ల - హింసామయము ::ఎట్లుచూచినను నీచాలయము॥ ఈ॥ కాపురములు మానుటపరసుఖము ::కానలందు దిరుగుటేనయము॥ ఈ॥ గోవుతల - బగులగొట్టెడివారు</poem> </div><noinclude><references/></noinclude> 9kemeuke9f8h8e3snr50cu6a2ac5i1p పుట:Sangitarasataran022902mbp.pdf/46 104 212338 553998 2026-04-21T13:02:18Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 553998 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>తావులగల్లు దాగెడివారూ॥ ॥ ఈ॥ మూడేండ్ల - యాడుబడుచునుబట్టి ::ముసలివానికంటఁ గట్టెడివారూ॥ ॥ ఈ॥ వాఁడుబోవదాని - తలకొరిగించి ::మోడుచేసి ముండాయసువారు॥ ॥ఈ॥</poem> </div> ఛీ! ఛీ! ఛీ! యింకనేమిచింత లీపట్టణమునఁజూడఁగలమో పత్త నానాసమున కంటే నరణ్యావాసము ఆనందదాయకమని తలంచెద. ఎందుజూచినను హింస నిర్ణయ కాగిర్యము మూఢత్వము లోభము మదము మోహము స్సూర్యము కామము కోసము అసత్యము అశౌచము అజ్ఞానము యే కానవచ్చుచు న్నవి కాని లేశమైనను పరోపకారాది సద్గుణములు ఎత్తదర్యవంతు నియం దును గానరానే. ద్రవ్య మెచ్చినకొలది లోభ మెచ్చుచున్నది కోభ మెచ్చు చున్న మదమాత్సర్యములెచ్చుచున్నవి. మాధ్యమెచ్చిన కొలఁది నా నావిధ ములగు అపరాధంబులు హెచ్చుచున్న యని వేదశాస్త్రంబుల కపొగంబులు సేయు పండితులును అపార్ధంబులను నమ్మి ప్రవర్తించు రాజన్య వైశ్యనూ ద4నంబులును నెల్లయెడల తండోపతండంబులుగా నిండియుండి దీనిని నిభ ర్తింపఁజేయు మాలోచించువాఁడెర్వడు. ఎప్పుడు స్వార్ధపరాయణత్వ మరు ఢాకినీచే మెడలెరుంగని యీమనుజులలో నెవ్వడు పరోపకార పయ ల్నీ ముచేయును. (ఇంతలో వంగివంగి నడతుడు మెకజోడిముసలి విధవవచ్చును). నన్నా ! ఆవచ్చుచున్న బోడియాడుదానింజూచితినా, ఎవ్వరో, ముసలమ్మయినా, నా, నాయనా (అని చతికిలబడి కఱ్ఱక్ర్దబడ వైవి), సిద్ధా—అవ్వగారూ యేమో చెప్పదలచినట్లున్నాడు. చెప్పుడు, పాట ఒళ్లంతం డెను నాపళ్లుజారిపోయె ఓర్పుతగ్గి పోయెనూ, ఓ రామ, ఓస్సీ వెన్ను వంగిపోయె వేసటలు మెండాయె కన్ను లూగనరావు గా ॥ ఓ రామి|| వివరావు మాటలూ తినలేను పెనగలూ వింత గాతల నెక సెనూ॥ ఓరామి। పాట మరియొకటి. ఆశలేఘనమాయె గోవిందా కామ ఆశలే మైండాయె గోవిందా రామ<noinclude><references/></noinclude> 3xl73f3i376pfxs58feuxzszgpxuam6 554050 553998 2026-04-22T07:19:14Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 554050 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>తావులగల్లు దాగెడివారూ॥ ॥ ఈ॥ మూడేండ్ల - యాడుబడుచునుబట్టి ::ముసలివానికంటఁ గట్టెడివారూ॥ ॥ ఈ॥ వాఁడుబోవదాని - తలకొరిగించి ::మోడుచేసి ముండాయసువారు॥ ॥ఈ॥</poem> </div> ఛీ! ఛీ! ఛీ! యింకనేమివింత లీపట్టణమునఁజూడఁగలమో పత్త నానానమున కంటే నరణ్యావాసము ఆనందదాయకమని తలంచెద. ఎందుజూచినను హింస నిర్ణయ కాఠిన్యము మూఢత్వము లోభము మదము మోహము మాత్సర్యము కామము క్రొధము అసత్యము అశౌచము అజ్ఞానము నీవియే కానవచ్చుచున్నవి కాని లేశమైనను పరోపకారాది సద్గుణములు ఎత్తద్రవ్యవంతు నియందును గానరానే. ద్రవ్య మెచ్చినకొలది లోభ మెచ్చుచున్నది కోభ మెచ్చుచున్న మదమాత్సర్యములెచ్చుచున్నవి. మాధ్యమెచ్చిన కొలఁది నానావిధములుగు అపరాధంబులు హెచ్చుచున్నయవి. వేదశాస్త్రంబుల కస్వార్థంబులు సేయు పండితులను అపార్ధంబులను నమ్మి ప్రవర్తించు రాజస్య వైశ్యసూద్రజనంబులును నెల్లయెడల తండోపతండంబులుగా నిండియుండి దీనిని నివర్తింభపఁజేయు మార్గమాలోచించువాఁడెవ్యడు. ఎప్పుడు స్వార్ధపరాయణత్వమను ఢాకినీచే మెడలెరుంగని యీమనుజులలో నెవ్వడు పరోపకార ప్రయత్నము చేయును. {{Center|'''(ఇంతలో వంగివంగి నడచుచు నొకొబోడి ముసలి విధవవచ్చును).'''}} ఛన్నా! ఆవచ్చుచున్న బోడియాడుదానింజూచితినా. ఎవ్వరో, ముసలమ్మా - నా.నా.నా యన (అని చతికిలబడి కఱ్ఱక్రీందబడవైచి). సిద్ధా — అవ్వగారూ యేమోచెప్పదలచినట్లున్నారు. చెప్పుడు. {{Center|{{p|fs125}}పాట</p>}} {{left margin|5em}}<poem>ఒళ్లంతంయెండెను నాపళ్లుజారిపోయె ఓర్పుతగ్గిపోయెనూ, ఓ రామ, ఓర్పు వెన్ను వంగిపోయె వేసటలుమెండాయె కన్నులూగనరావుగా ॥ ఓ రామ॥ వినరావు మాటలూ తినలేను పెనగలూ వింతగాతలనెరసెనూ ॥ ఓ రామ॥</poem> </div> {{Center|{{p|fs125}}పాట మరియొకటి</p>}} {{left margin|5em}}<poem>ఆశలేఘనమాయె గోవిందా రామ ఆశలేమొండాయె గోవిందా రామ</poem> </div><noinclude><references/></noinclude> pvzrxvwq6row1lo2ne77uues2aijoc7 554051 554050 2026-04-22T07:21:40Z Brjswiki 6801 554051 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>తావులగల్లు దాగెడివారూ॥ ॥ ఈ॥ మూడేండ్ల - యాడుబడుచునుబట్టి ::ముసలివానికంటఁ గట్టెడివారూ॥ ॥ ఈ॥ వాఁడుబోవదాని - తలకొరిగించి ::మోడుచేసి ముండాయసువారు॥ ॥ఈ॥</poem> </div> ఛీ! ఛీ! ఛీ! యింకనేమివింత లీపట్టణమునఁజూడఁగలమో పత్తనానానమున కంటే నరణ్యావాసము ఆనందదాయకమని తలంచెద. ఎందుజూచినను హింస నిర్ణయ కాఠిన్యము మూఢత్వము లోభము మదము మోహము మాత్సర్యము కామము క్రొధము అసత్యము అశౌచము అజ్ఞానము నీవియే కానవచ్చుచున్నవి కాని లేశమైనను పరోపకారాది సద్గుణములు ఎత్తద్రవ్యవంతు నియందును గానరానే. ద్రవ్య మెచ్చినకొలది లోభ మెచ్చుచున్నది కోభ మెచ్చుచున్న మదమాత్సర్యములెచ్చుచున్నవి. మాధ్యమెచ్చిన కొలఁది నానావిధములుగు అపరాధంబులు హెచ్చుచున్నయవి. వేదశాస్త్రంబుల కస్వార్థంబులు సేయు పండితులను అపార్ధంబులను నమ్మి ప్రవర్తించు రాజస్య వైశ్యసూద్రజనంబులును నెల్లయెడల తండోపతండంబులుగా నిండియుండి దీనిని నివర్తింభపఁజేయు మార్గమాలోచించువాఁడెవ్యడు. ఎప్పుడు స్వార్ధపరాయణత్వమను ఢాకినీచే మెడలెరుంగని యీమనుజులలో నెవ్వడు పరోపకార ప్రయత్నము చేయును. {{Center|'''(ఇంతలో వంగివంగి నడచుచు నొకొబోడి ముసలి విధవవచ్చును).'''}} ఛన్నా! ఆవచ్చుచున్న బోడియాడుదానింజూచితినా. ఎవ్వరో, ముసలమ్మా - నా.నా.నా యన (అని చతికిలబడి కఱ్ఱక్రీందబడవైచి). సిద్ధా — అవ్వగారూ యేమోచెప్పదలచినట్లున్నారు. చెప్పుడు. {{Center|{{p|fs125}}పాట</p>}} {{left margin|5em}}<poem>ఒళ్లంతంయెండెను నాపళ్లుజారిపోయె ఓర్పుతగ్గిపోయెనూ, ఓ రామ, ఓర్పు వెన్ను వంగిపోయె వేసటలుమెండాయె కన్నులూగనరావుగా ॥ ఓ రామ॥ వినరావు మాటలూ తినలేను పెనగలూ వింతగాతలనెరసెనూ ॥ ఓ రామ॥</poem> </div> {{Center|{{p|fs125}}పాట మరియొకటి</p>}} {{left margin|5em}}<poem>ఆశలేఘనమాయె గోవిందా రామ ఆశలేమొండాయె గోవిందా రామ</poem> </div><noinclude><references/></noinclude> k0xud35wchwx95c3pw4pwrvtddyev3b పుట:Sangitarasataran022902mbp.pdf/47 104 212339 554052 2026-04-22T07:51:31Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 554052 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>కట్టెలోనూమెదుకు గోవిందా రామ పెట్టదుకోడలు గోవిందా రామ పొద్దుబొడవగానె గోవిందా రామ పొట్టకేచింతాయె గోవిందా రామ కుడిచికూర్పుంటేరు గోవిందా రామ కోడలుకొట్టునూ గోవిందా రామ తిరిగీతిరిగీనేను గోవిందారామ తిరిపెమెత్తాలేను గోవిందా రామ ఎన్నాళ్లుబ్రతికినా గోవిందా రామ ఏమి సామ్రాజ్యము గోవిందా రామ॥</poem></div> ఛన్ను - రాజకుమారా! చ॥ ముసలితనంబు నెమ్మొగముమొత్తి రదంబులనూడగొట్టిబల్ కసినిజభాగ్యముల్గొనగ గబ్బితసంబికచాలునంచు నీ రసమునగందరస్థితి పరాయణతంజనుమాడ్కిపొక్కిట౯ మెసలుచనుల్ దగు౯ పథమునెట్టెడి నిమ్ముదిబోడి నేమన౯॥ సిద్దా - (కొంచెమునవ్వి ఆలోచించి తలయూచి). {{left margin|5em}}<poem>ఉ॥ ఎన్ని దినంబులీజగము నేలినమేరువు వెండికొండలోఁ గొన్న సమస్త దేశ జనకోటులదానముచేతఁదన్పిన౯ మన్న నఁబోఁదిన౯ ముదిమిమానరు చావును మానదయ్యయో వన్నెయువాసియుంబలిమి వ్యర్ధముతానుశరీరమేల ఛీ॥</poem> </div> '''(అని ఆముసలిబోడికొక వరహాయిచ్చును).''' ముస — (అదిపుచ్చుకొని నిష్క్రమణము) సిద్ధా — ఛన్నా! ఆదిక్కున కంకగృథాదులాడుచున్నయవి దుర్గంధధూమంబు లెగయుచున్నయవి. అవియేమైయుండును. ఛన్ను — {{left margin|5em}}<poem>సీ॥ మృతులైనమనుజుల మెడవిడికొనివల్లకాటికిఁగొంపోయి కాల్తురచట॥ అది మృతశరీరంబుల దహనంబుసేయువల్లకాడు ఆశవంబులు దహీంపఁబడి బూ డిదగుచున్నది. అచ్చటనే గ్రద్దలు మొదలగునవి యాడుచుండును.</poem> </div> {{Center|{{p|fs125}}పాట. ముఖారి</p>}} సిద్ధా — అయ్యోయీదేహ మేలను అగ్ని గాలను<noinclude><references/></noinclude> 2famd0ll1vl2tftlyeuz95jrqaqqimx పుట:Sangitarasataran022902mbp.pdf/48 104 212340 554058 2026-04-22T08:54:34Z Brjswiki 6801 /* అచ్చుదిద్దబడని */ 554058 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>నుయ్యోయ్యో పొయ్యో చచ్చు॥ అయ్యె॥ తెగులు నెగులో పెగలో చచ్చు! ॥ అయ్యె॥ త్రాడో కోడో కాడో చచ్చు! ॥ అయ్యె॥ అపుడో ఇపుడో యెపుడో చచ్చు॥ అయ్యె॥ ఛన్నా! పొద్దుగ్రుంకవచ్చినది యికమనము గృహముప్రవేశింతమా. ఛన్నా - గీ॥ చూడఁజూడంగ డెందానశోక మొదవు యంచియివియెల్ల తలపునమంచబోకు పరమకారుణ్య రసపూరభగభీర మేదినీవల్లభ కుమారమేరుధీర॥ రాజకుమారా! చిత్తము గృహమునకు బ్రవేశింతము. {{rule |6em }} {{Center|{{p|fs125}}చతుర్థరంగము — అరణ్యము</p>}} {{Center|'''(సిద్ధార్థుడును, ఛన్నుఁడును ప్రవేశము)'''}} ఛన్ను - రాజకుమారా! పురంబుపరీక్షించితిరి నేడరణ్యంబునంగల వినోదంబులు జూడంగోరితిరి గావున ఇచ్చటికిం గొనివచ్చితి. ఇది తుహినాచలమహారణ్యము చూడుండు. అల్లిబిల్లిగ నల్లుకొనిన మొల్లంవులతోబంధంబులచే గట్టుబడిన యీపొన్నమావి మద్దిపనస గన్నలును మద్దిపనస గున్నలును ల నిండు నీడంబ దిలంబుగా బెరిగి పచ్చనియాకులచే గ్రమ్ముకో నంబడి రేలుబకళ్లు దెలియక యంధ కార బంధుగంబులై దుష్ప్రవేశ్యంబులగు పొదరిండ్లును పొదరిండ్లజుట్టు కొని యందంబుగా మిగులు సన్నంబులగు పోగులతో సహజవిద్యా నైపుణ్యం బున గూండ్లు సాలెపురుగులును సాలెపురుగులంబట్టంగమకించుచు పాదంబు ల నెగదిన నిడుచు నిక్కిచూచుతొఁడలుకు తొండలు బెదర సలఘుజవంబులం బారుకుండేళ్లును కుందేళ్లను వెంబడించుచు పరువిడివచ్చు వేసిజాగిలంబులు వేవి జాగిలంబుల జాడలయుచు మరులు వలలు చిక్కంబులు భుజంబులందగిలిం చుకుని మిత్రేమిట్లిచూచుచువచ్చు వేఁటకాండను వేఁటకాండ్ర వలలంద గిలి కాళ్లాడక గొట్టుకొను మృగ శాబంబులును శాబంబులవిడనాడ మోపక సంతంత దూరంబున బెదరి బెదరి చూచుచు మేనులు ముడుచుదు మెల్లకరచుపొడి లేడి<noinclude><references/></noinclude> cd2m2ax60ze2j3dhx0oh6qhedjxy45d