వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.46.0-wmf.24
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
అలర చంచలమైన
0
2886
554142
554062
2026-04-23T07:43:05Z
~2026-24476-60
7278
554142
wikitext
text/x-wiki
<!-- BOX -->
<div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #fd8; background:#fffcec;'>
<!-- BOX HEAD -->
<div style="background-color:#fd8; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">అలర చంచలమైన ఆత్మలందుండ (రాగం: మధ్యమావతి) (తాళం : aadi ) </div>
<!-- BOX CONTENT -->
<div style='padding-left:0.5em;'>
<poem>
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల||
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచె వుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల||
మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల||
కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల||
</poem>
</div></div><!-- END of BOX -->
<!-- BOX -->
<div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #9fee9f; background:#f0fff0;'>
<!-- BOX HEAD -->
<div style="background-color:#9fee9f; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">alara caMcalamaina AtmalaMduMDa (Raagam: ) (Taalam: )</div>
<!-- BOX CONTENT -->
<div style='padding-left:0.5em;'>
<poem>
alara caMcalamaina AtmalaMduMDa nI yalavATu cEse nIvuyyAla
palumAru nucCvAsa pavanamaMduMDa nI BavaMbu delipe nI vuyyAla
udAyAsta SailaMbu lonara kaMBamulaina vuDumaMDalamu mOce nuyyAla
adana AkASapadamu aDDaudUlaMbaina aKilaMbu niMDe nI vuyyAla
padilamuga vEdamulu baMgAru cErulai paTTa verapai tOce vuyyAla
vadalakiTu dharmadEvata pIThamai migula varNiMpa narudAye vuyyAla
mElu kaTlayi mIku mEGamaNDalamella merugunaku merugAye vuyyAla
nIla SailamuvaMTi nI mEnikAMtiki nijamaina toDavAye vuyyAla
pAliMDlu kadalagA payyadalu rApADa BAminulu vaDinUcu vuyyAla
vOli brahmANDamulu voraguvO yani BIti noyya noyyanairi vUciruyyAla
kamalakunu BUsatiki kadalu kadalaku mimmu kaugaliMpagajEse nuyyAla
amarAMganalaku nI hAsa BAva vilAsa maMdaMda cUpe nI vuyyAla
kamalAsanAdulaku kannula paMDugai gaNutiMpa narudAye vuyyAla
kamanIya mUrti vEMkaTaSailapati nIku kaDuvEDukai vuMDe vuyyAla
</poem>
</div></div> <!-- END OF BOX -->
===బయటి లింకులు===
----
{{అన్నమయ్య పాటలు}}
[[Category:అన్నమయ్య పాటలు ]]
h5pvzos68l0o8dqlir49227vt6tp9u4
పుట:Sarada Lekhalu Vol 1.pdf/20
104
59174
554080
553862
2026-04-22T12:55:51Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
554080
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/7-వ లేఖ|7-వ లేఖ 58—74.]]}}
|}}
{{smaller|దక్షిణ దేశ యాత్రావివరములు; కాంచీపురవర్ణనము; దైవదర్శన లాభప్రకటనము; దేవాలయ వర్ణనము; దేశచరిత్రాలాపన; చిదంబర క్షేత్రము; నటరాజవర్ణన; క్షేత్రవిశేషములు; కుంభకోణము; ఆ క్షేత్ర దేవతాదిక వర్ణన; తంజావూరు; దేవాలయ ప్రశంస; రాజభవన ప్రస్తుతి; సరస్వతీమహల్ పుస్తకభాండాగార దర్శనము; మధుర:-మీనాక్షి దేవాలయ వర్ణనము; మధురాపురవర్ణనము; పూర్వ రాజమందిర ప్రశంస; రామేశ్వరము:-తీర్థవివరణ: సముద్రవర్ణన;
ధనుష్కోటి; అర్చకుల యత్యాచారములు; దేవాలయమర్యాదానాస్తికత; ముసలి భక్తురాలి మొర్ర; యాత్రావిధులు; గంధమాదన పర్వతదర్శనము; హిందూమత ప్రశంస.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/8-వ లేఖ|8-వ లేఖ 75—99.]]}}
|}}
{{smaller|కుర్తాళం: స్థలవర్ణనము; జలవర్ణనము; తత్ప్రదేళ సౌభాగ్యవివరణ; మళయాళదేశ పవేశము; పడమటికనుమల వర్ణనము; ప్రకృతి సౌందర్య విశేషవర్ణనము: దేశ్య ప్రజలవృత్తి విచారణ: తిరువాన్కూరు రాజ్యము; జనార్ధన తీర్థము; సముద్ర స్నానము; పురాణ విచారణ; జనార్ధనస్వామి సందర్శన వివరములు; మళయాళ మహిళా జనాభివర్ణనము; (తిరుఅనన్తపురము;) అనన్తపద్మనాభదేవదర్శన వివరణము; రాజులపూర్వగాధ; విపరీతపూర్వభ్రాన్షినివారణము; రాజ్యాధికార శాసనవివేచనము (కన్యాకుమారి;) దైవదర్శనము; సముద్ర స్నానాదివివరణ; (శుచీంద్ర క్షేత్రము) వర్ణనాదిము;
పోస్టేజినిగూర్చి ప్రజలు పడుచున్నయిబ్బందులు; నాగర్కోయిల్ తిరునెల్వేలి బస్సుప్రయాణికుల కష్టములు; పోలీసుల యక్రమము; (తిరునెల్వేలి) తామ్రాపర్ణీ స్నానము; (శ్రీరంగ క్షేత్రము) వైష్ణవ<noinclude></noinclude>
s3bcofyong47nuyt90iagc7i5e4zokl
పుట:Sarada Lekhalu Vol 1.pdf/21
104
59175
554081
188553
2026-04-22T12:56:58Z
Rajasekhar1961
50
554081
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>స్వాముల దురాచారములు; యాత్రికుల యిబ్బందులు; ఏజంట్లు చేయునట్టి ప్రజా పీడనము; యాత్రాపరిసమాప్తి;}}
9-వ లేఖ 100-111.
.నాటకరంగమునఁ బ్రవేశించుటను గూర్చిన సమగ్ర విచారణ.
10-వ లేఖ 112-116.
సమదర్శినీ సంవత్త్సరాది సంచికా ప్రశంస; అందు దుష్కధా
నిరసనము
11-వ లేఖ 117-124
స్త్రీపురుషులు పట్టుకొని ప్రాకులాడుచున్న గౌరవ బిరుదములం గూర్చిన వి ముఖత,
12-వ లేఖ 126_129.
సాంఘికోద్యమ ప్రవక్తృప్రచారకుల ధర్మాధర్మ వివేచనము; "సాంసారిక రంగస్థలమున కెక్కరాదు" ఆని సిద్ధాన్తీ కరణము.
13-వ లేఖ 130--140
సం 1929 రం నవంబరులో బెజవాడయందు జరిగిన (ఆంధ్ర
మహిళా సభలు) మన స్త్రీలలోనున్న లోపములు వివిధప్రసంగములు.
14-వ లేఖ 141-154.
ఆడువారి నాటకరంగ ప్రవేశముంగూర్చి సమ్మతిపడిన శ్రీమతి
ధర్మవరం లక్మీదేవమ్మ గారి కిచ్చిన పత్యుత్తరము.
15-వ లేఖ 155-160.
'శారదా ' పెళ్లిళ్ల గడబిడ.<noinclude></noinclude>
fok8r132twlaal0snq7pyzj5bvufzd1
554162
554081
2026-04-23T10:25:57Z
Rajasekhar1961
50
554162
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>స్వాముల దురాచారములు; యాత్రికుల యిబ్బందులు; ఏజంట్లు చేయునట్టి ప్రజా పీడనము; యాత్రాపరిసమాప్తి;}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/9-వ లేఖ|9-వ లేఖ 100—111.]]}}
|}}
{{smaller|స్త్రీలు నాటకరంగమునఁ బ్రవేశించుటను గూర్చిన సమగ్ర విచారణ.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/10-వ లేఖ|10-వ లేఖ 112—116.]]}}
|}}
{{smaller|సమదర్శినీ సంవత్త్సరాది సంచికా ప్రశంస; అందు దుష్కథా నిరసనము,}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/11-వ లేఖ|11-వ లేఖ 117—124.]]}}
|}}
{{smaller|స్త్రీపురుషులు పట్టుకొని ప్రాకులాడుచున్న గౌరవ బిరుదములం గూర్చిన విముఖత,}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/12-వ లేఖ|12-వ లేఖ 125—129.]]}}
|}}
{{smaller|సాంఘికోద్యమ ప్రవక్తృప్రచారకుల ధర్మాధర్మ వివేచనము; "సాంసారిక రంగస్థలమున కెక్కరాదు" ఆని సిద్ధాన్తీ కరణము.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/13-వ లేఖ|13-వ లేఖ 130—140.]]}}
|}}
{{smaller|సం॥ 1929 రం నవంబరులో బెజవాడయందు జరిగిన (ఆంధ్ర
మహిళా సభలు) మన స్త్రీలలోనున్న లోపములు వివిధప్రసంగములు.
14-వ లేఖ 141-154.
ఆడువారి నాటకరంగ ప్రవేశముంగూర్చి సమ్మతిపడిన శ్రీమతి
ధర్మవరం లక్మీదేవమ్మ గారి కిచ్చిన పత్యుత్తరము.
15-వ లేఖ 155-160.
'శారదా ' పెళ్లిళ్ల గడబిడ.<noinclude></noinclude>
mdz27yvtuao63xj5zbyiv0894qkqury
554163
554162
2026-04-23T10:35:20Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
554163
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>స్వాముల దురాచారములు; యాత్రికుల యిబ్బందులు; ఏజంట్లు చేయునట్టి ప్రజా పీడనము; యాత్రాపరిసమాప్తి;}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/9-వ లేఖ|9-వ లేఖ 100—111.]]}}
|}}
{{smaller|స్త్రీలు నాటకరంగమునఁ బ్రవేశించుటను గూర్చిన సమగ్ర విచారణ.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/10-వ లేఖ|10-వ లేఖ 112—116.]]}}
|}}
{{smaller|సమదర్శినీ సంవత్త్సరాది సంచికా ప్రశంస; అందు దుష్కథా నిరసనము,}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/11-వ లేఖ|11-వ లేఖ 117—124.]]}}
|}}
{{smaller|స్త్రీపురుషులు పట్టుకొని ప్రాకులాడుచున్న గౌరవ బిరుదములం గూర్చిన విముఖత,}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/12-వ లేఖ|12-వ లేఖ 125—129.]]}}
|}}
{{smaller|సాంఘికోద్యమ ప్రవక్తృప్రచారకుల ధర్మాధర్మ వివేచనము; "సాంసారిక రంగస్థలమున కెక్కరాదు" ఆని సిద్ధాన్తీ కరణము.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/13-వ లేఖ|13-వ లేఖ 130—140.]]}}
|}}
{{smaller|సం॥ 1929 రం నవంబరులో బెజవాడయందు జరిగిన (ఆంధ్ర మహిళా సభలు) మన స్త్రీలలోనున్న లోపములు వివిధప్రసంగములు.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/14-వ లేఖ|14-వ లేఖ 141—154.]]}}
|}}
{{smaller|ఆడువారి నాటకరంగ ప్రవేశముంగూర్చి సమ్మతిపడిన శ్రీమతి ధర్మవరం లక్మీదేవమ్మ గారి కిచ్చిన పత్యుత్తరము.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/15-వ లేఖ|15-వ లేఖ 155—160.]]}}
|}}
{{smaller|'శారదా' పెళ్లిళ్ల గడబిడ.}}<noinclude></noinclude>
4sq13gbl0thhnur5pasdxrm5sqb3r23
పుట:Sarada Lekhalu Vol 1.pdf/207
104
59364
554109
553698
2026-04-22T22:59:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554109
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|181}}</noinclude>ఎప్పుడును ఆడుదానికంటె మగవానికి కూలియెక్కువ. అయితే ఆడుదానికూలి యింటికి జేరినట్టు మగవానికూలి చేరదు. అది ముక్కాలు మువ్వీసము కల్లంగడికే. ఒక్క ఆడుదాని కూలి కుటుంబపోషణకు చాలదు. మగవానికూలి కల్లుపాలవును. అట్టిచో ప్రొద్దున ప్రాచిమొగాన పాటుకువెళ్లి చేతిబిడ్డను చెట్టు
కొమ్మకుగట్టిన గుడ్డఉయ్యాలలో పడవేసి యెడపిల్లలను కంచెల వెంబడి కఱ్ఱలవెంబడి తిరుగవిడిచి పగలెల్ల కష్టపడిన ఆపేదరాలి క్షోభ యెట్లుండునో చెప్పవలెనా? అది యటుండ ఆ చాలియు చాలని గంజియైన త్రాగుదుమని నమ్మకములేదు. తప్పతాగిన ఆధూర్తుడు అకస్మాత్తుగావచ్చి యింటిమీదపడి ఆగమునకు
దొరకొనును. పెండ్లామును చావమోదును. బిడ్డలను జావమోదును. కూటికుండలు బోర్లదోయును. ఇఁక ఆనోటి కడ్డదిడ్డములు లేవు. వినరానిబూతులు. అట్లు ఇంటికిరాకపోయినా? కంచెలోనో కంపలోనో పడినాడనియో, రోడ్డుమీద దొర్లుచుండగా కానిస్టేబులు స్టేషనుకు యీడ్చుకొనిపోయినాడనియో కబురు. వానికొఱకు మరల పెండ్లాముపరుగు. ఏఱాయియైన నేమి పండ్లూడగొట్టుకొనుట కన్నట్టుగా సంసారములోని
శాంతిని చెఱచుట కేయల్లరియైనను నొక్కటేగదా ?
మిత్రమా! సాయంత్రపువేళ పేదవారి గిడిసెల దెసకేగి చూచితిమా ఇప్పగిది మద్యదేవతకు బలియై క్షోభిల్లెడి సంసారములెన్నియో హృదయవిదారకముగా గననగును.<noinclude></noinclude>
65l7idok23nh5iafnfexob22k81mpg8
పుట:Sarada Lekhalu Vol 1.pdf/208
104
59365
554110
553699
2026-04-22T23:06:21Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554110
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|182|శారదలేఖలు|}}</noinclude>అంతదూరముపోనేల? మాపనిమనిషిమగఁడును, దొడ్డినూడ్చుదాని మగడును ఇద్దఱు త్రాగుబోతులే. తమభర్తల దుర్వృత్తినిగూర్చి దినదినము వారు పెట్టెడిఘోష విన శక్యముగాదు. వాళ్లు చెప్పి చెప్పి, యేడ్చి యేడ్చి తుదకు తమనెలజీతము తమమగమనిషికి మాత్రమీయవద్దని చెప్పుచుందురు. అటులనేయని నేనెన్నడును వాళ్లభర్తల పరముగా జీతమీయను. కల్పలతా ! త్రాగుడు పేదస్త్రీలను, ధనికస్త్రీలనుగూడ నిన్నివిధములు హింసించుచుండ నిషేధప్రచారము స్త్రీల కావశ్యకములేదని యెట్టుచెప్పనగుసు? మిత్రమా! నిజముగా త్రాగుబోతులు త్రాగుచున్నది భార్య, బిడ్డల రక్తముగాని మద్యముగాదు. దొరతనమువారి మహౌదార్యమువలన గాని మహాత్ములైనవారి నిరంతరకృషివలనగాని మద్యమును నిషేధించుభాగ్యము మన భారతదేశమునకు గల్గెనేని మన స్త్రీల పుణ్యము ఫలించినదనియే చెప్పవలయును.
గతవత్సరము దొరతనమువారు మన చెన్నరాజధాని యందు కొన్నిలక్ష (నాల్గులక్షలని జ్ఞాపకము) లొసగి మద్య నిషేధక ప్రచారకసంఘములు నెలకొల్పినపుడు త్రాగుబోతు పతులచే వెతలబడుసతుల యాపదలు తీఱెడిభాగ్యము లభించెనని యెంతయోసంతసించితిని. అయితే ఆ టెంపరెన్సుకమిటీ లింకను జీవించియుండగనే అదేప్రచారమునకు పూనుకొనిన అసంఖ్యాక భారతీయ నరనారీమణులు చెఱసాలలలో ముఱుగుచున్నారు. పరస్పర విరుద్ధమైన యీకార్యమునకు హేతు<noinclude></noinclude>
a9vxg91v5y03tc3g0pr1pogv9c1m3r3
పుట:Sarada Lekhalu Vol 1.pdf/209
104
59366
554111
553700
2026-04-22T23:15:17Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554111
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|183}}</noinclude>వగమ్యముగానున్నది. దొరతనమువారికి మద్యపాన మిష్టమా? అయితే ఆ టెంపరెన్సుకమిటీల కర్థమేమి? మద్యనిషేధ మిష్టమా? అయితే ఇంతమంది దేశభక్తులు కారాగృహ నిబద్దులు కానేల? మద్యనిషేధమును బోధించినందులకై యింతమంది దేశభక్తులు నిబద్ధులగుటజూడ “మద్యనిషేధమున కేర్పఱచిన టెంపరెన్సుకమిటీలు మీ కండ్లనీరుదుడుచుటకై యేర్పడినవేగాని నిజమైనప్రచారమునకుగాదు. మీ
నైతికవిచ్ఛిత్తితో మాకుపనిలేదు. మీ సంఘక్షీణతను మేము పరికింపము. మీ దారిద్య్రస్థితితో మాకు సంబంధములేదు. మీదేహారోగ్యముతో మాకు నిమిత్తములేదు. మీ పెండ్లాముబిడ్డల ఘోషతో మా కగత్యములేదు. మాకుకావలసినది డబ్బు. డబ్బు డబ్బు. మద్యనిషేధమున కంగీకరించి మా కోట్ల
కొలదిధనమును కోల్పోవజాలము." అని ప్రభుత్వము ఖండితముగా చెప్పుచున్నట్లున్నది. ప్రజల నింతబలవంతపఱచి త్రాగించినను యీ మద్యపానమువలన మనుష్యున కే కొంచెమైన ప్రయోజనము గలదా ? ఆకలితీరునా? ఆరోగ్యవర్ధకమా ? తుదకు జిహ్వకైన ని పుగూర్చునా? ఏదియులేదు. త్రాగుబోతుకు మనస్సు నిలుకడలేదు. మాట నిలుకడలేదు. శరీరములో సత్వములేదు. నైతికముగా, సాంఘికముగా, ఆర్థికముగా, శారీరకముగా వాడు భ్రష్టుఁడై పోవును. వానితోబాటు వానిభార్యయు బిడ్డలునుగూడ వివిధకష్టములకుగుఱియై దురపిల్లుదురు. సారాదేవత ప్రవేశించినయింట ఆనందమునకు తావులేదు. సుఖమునకు తావులేదు. పెద్దమ్మయొక్క ప్రభా<noinclude></noinclude>
4g4poawwfwwt3c0xv4jmw7thfwufbz5
పుట:Sarada Lekhalu Vol 1.pdf/210
104
59367
554112
553701
2026-04-22T23:20:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554112
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|184|శారదలేఖలు|}}</noinclude>వము శల్యావశిష్టులగు నాయింటివారి ముఖములమీదను, సర్వశూన్యమైన యాయింటియందలి నలుమూలలను పొడకట్టుచుండును. కల్పలతా! ఈసందర్భమున 'ఆరోగ్యప్రకాశిక'లో సారాదేవత పలికినపలుకులు ఎంతయు వినదగినవిగానున్నవి. అంటున్నది:-
"ప్రపంచమున మనుష్యులను చంపుటలో అనగా హత్యనేరముచేయుటలో నన్నుమించినవారు మరెవ్వరును లేరు.
ప్రపంచమున నిదివరకుజరిగిన యుద్ధము లన్నిటిలోను చంపబడినవారిమొత్తము సంఖ్యకంటె నాచే చంపబడినవారి మొత్తము సంఖ్యయే మిక్కిలి హెచ్చుగానుండును.
నేను మనుష్యులను పశువులక్రింద మార్చితిని. నేను కోట్లకొలదికుటుంబముల సౌఖ్యమును రూపుమాపి కష్టములనే అనుభవించునటుల చేసితిని. కోట్లకొలదిమనుష్యుల అధోగతికి కొనిపోవునట్టి దారిని సరిచేయుచుందును.
నేను బలవంతులను బలహీనులనుగా చేయుదును. బలహీనులను అంతమొందించెదను. నేనిదివరకు ఎన్నికోట్ల మందినో పాడుచేసితిని. ఇంకను ఎన్నికోట్లమందినో పాడుచేయుటకు ప్రయత్నించెదను. నాపేరే సారాదేవత.”
మిత్రమా ! 'ఆరోగ్యప్రకాశిక'లో ప్రచురింపబడిన గిబ్బనుదొరగారి యీమహావాక్యములను చదివినప్పుడు
"ప్రపంచములో నాచే దుఃఖింపబడినంతమంది పతివ్రతలు, మరి<noinclude></noinclude>
4jo2s88q97mqhuth8zw1iyz5eqw0o0z
పుట:Sarada Lekhalu Vol 1.pdf/211
104
59368
554113
553702
2026-04-22T23:24:54Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554113
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|185}}</noinclude>దేనిచేతను దుఃఖపడలేదు.” అనువాక్యమునుగూడ చేర్చిన బాగుండుననుకొంటిని. కల్పలతా! అది సత్యముగదా ? పరమేశ్వరానుగ్రహమువలన మద్యనిషేధప్రచారము మనదేశమున శీఘ్రకాలములో ఫలించుగాక! మనస్త్రీల దుఃఖములు నివారణమగుగాక! యని వాంఛించెదను. కల్పలతా! ఇప్పటికిని
మద్యనిషేధప్రచారముతో స్త్రీలకు సంబంధము లేదనియే తెలంతువా ?
{{rh|భావపురి||మిత్రురాలు,}}
{{rh|ఆగస్టు 1930||శారద.}}
{{Css image crop
|Image = Sarada_Lekhalu_Vol_1.pdf
|Page = 211
|bSize = 548
|cWidth = 110
|cHeight = 36
|oTop = 389
|oLeft = 210
|Location = center
|Description =
}}<noinclude></noinclude>
t6yndf4l1dma3dj0e8hxwdr9yii9gou
554114
554113
2026-04-22T23:26:00Z
శ్రీరామమూర్తి
1517
554114
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|185}}</noinclude>దేనిచేతను దుఃఖపడలేదు.” అనువాక్యమునుగూడ చేర్చిన బాగుండుననుకొంటిని. కల్పలతా! అది సత్యముగదా ? పరమేశ్వరానుగ్రహమువలన మద్యనిషేధప్రచారము మనదేశమున శీఘ్రకాలములో ఫలించుగాక! మనస్త్రీల దుఃఖములు నివారణమగుగాక! యని వాంఛించెదను. కల్పలతా! ఇప్పటికిని
మద్యనిషేధప్రచారముతో స్త్రీలకు సంబంధము లేదనియే తెలంతువా ?
{{rh|భావపురి||మిత్రురాలు,}}
{{rh|ఆగస్టు 1930||శారద.}}
̺{{rule|2cm}}<noinclude></noinclude>
63z7rnle50w0yqev1h4dwavhbtr16oc
పుట:Sarada Lekhalu Vol 1.pdf/212
104
59369
554148
553703
2026-04-23T08:38:29Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554148
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|186|శారదలేఖలు|}}</noinclude>{{c|'''సౌభాగ్యవతియగు కల్పలతకు :-'''}}
'''నెచ్చెలీ!'''
నీవు వ్రాసినట్లు శారదాచట్టమునకు సవరణనుపపాదించుట యనుచిత కార్యమనుటకు సందియములేదు. శారదాచట్టము త్వరపడి చేయబడినది కాదు. దాదాపు రెండువత్సరముల దీర్ఘకాలము దేశీయులచే చక్కగా యోచింపబడినది. ప్రజాభిప్రాయమును కనుగొనుటకై యేర్పడిన ఉపసంఘమువారు దేశమంతటను పర్యటనమొనర్చి నానావిధముల విచారణ యొనర్చిరి. పెక్కుమందికడ సాక్ష్యములను గైకొనిరి. డాక్టరుల యభిప్రాయములను తెలిసికొనిరి. పండితుల యభిప్రాయములను తెలిసికొనిరి. స్త్రీల యభిప్రాయములను తెలిసికొనిరి. న్యాయమూర్తుల యభిప్రాయములను తెలిసికొనిరి. ఈవిధముగా ప్రత్యేకవ్యక్తుల యభిప్రాయములనేగాక వేఱ్వేరు సంఘములపక్షమునను సంస్థలపక్షముననుగూడ విచారణయొనర్చి తెలిసికొననిరి. ఇన్నివిధముల విచారించినవెనుకనే యుపసంఘమువారు బాలికల వివాహవయస్సు పదునాలుగేండ్లుగా నుండుట యుక్తమని నిర్ణయించిరి. తదుపరి యుచితమైన ఈతీర్మానము సామ్రాజ్యశాసనసభవారిచే ఆమోదింపబడెను. దానికి ప్రభుత్వమువారును తోడ్పడిరి. రాజకీయకారణములచే ప్రసిద్ధ ప్రజాప్రతినిధులెల్లరు రాజీనామాలు పెట్టుటవలన ప్రస్తుత సామ్రాజ్యసభ యీకలుతీసిన కోడివలెనున్నది; కాని శారదా<noinclude></noinclude>
bmfstye8dynylrksqxzgobcbq29t9g9
పుట:Sarada Lekhalu Vol 1.pdf/213
104
59370
554149
553704
2026-04-23T08:45:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554149
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|187}}</noinclude>బిల్లు శాసనముచేయబడునా డిట్లు లేదు. పటేలు మహాశయు డధ్యక్షుడుగను, నెహ్రూ మాళవ్యా వంటి నాయకమణులు సభ్యులుగనునుండ ప్రభుత్వమువారును ప్రజాపతినిధులును మిల్కిలి సఖ్యతతోచేసిన శాసనము శారదాశాసనము. ఆశాసన మైన అప్పటికప్పుడే ప్రజల నెత్తిపై పెట్టలేదు. దాదాపైదు
మాసములకు తరువాత నమలులోనికి వచ్చునట్లు నిశ్చయింపబడెను. ఆ అయిదుమాసముల గడువులో శాసనము రద్దుచేయ నెంచుచో సభ్యుల కవకాశము లేకపోలేదు. కాని ఆ అయిదు మాసములు శాసన ప్రతికూలు రెక్కడైన కునికిపాట్లు పడుచుండిరో లేక విపరీతముగాజరిగిన వివాహములలో విందులే
గుడుచుచుఁడిరో తెలియదు. శారదాచట్ట మమలులోనికి వచ్చులోపల పూర్వాచారపరాయణులప్రేరణచే దేశీయులు గావించిన యనుచితవివాహములకు లెక్కలేదు. ఒక్క మచిలీపట్టణమునందే 900 వివాహములు జరిగినట్లు లెక్కింపబడెను. ఇక యావద్భారతదేశమునందును ఎన్నిలక్షల వివాహములు జరిగెనో వివరింపఁ దరముగాదు. దేశీయులెల్ల రా విధముగా కన్నులు తెఱువనివారును, పిడికిళ్లు విప్పనివారును, మాటలు
రానివారును, నడకలు నేరనివారును అయిన కసుగందులకు గంగవెఱ్ఱులెత్తినట్లు పెండ్లిండ్లుచేయుచుండ నేడు సవరణ నామోదింప సాహసించిన శాసనసభ్యులలో నొక్కరైన 'దేశీయులారా ! భయములేదు. శారదాచట్టము రూపుమాపెద'మని చెప్పకపోయిరి. నాడుతోడ్పడి నేడు తాటస్థ్యమువహించిన
ప్రభుత్వమువారైన సవరణ కవకాశముగలదని సూచింపరైరి.<noinclude></noinclude>
23958l24lq4bvkloyrz0g0nw31332e2
పుట:Sarada Lekhalu Vol 1.pdf/214
104
59371
554150
553705
2026-04-23T08:51:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554150
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|188|శారదలేఖలు|}}</noinclude>అతిబాల్యవివాహము లా విధముగా ననిరోధకముగా నసంఖ్యాకముగా జరిగిపోయిన పిమ్మట, అభము శుభము నెఱుగని పసిపాపల కంఠములకు పూర్తిగా నురులు వేయబడిన పిమ్మట, ప్రజానురాగము బడసిన ప్రజాప్రతినిధులెల్లరు శాసనసభలు వీడివచ్చిన పిమ్మట, గడువుకాలము గడచిపోయి శారదాచట్ట
మములులోనికివచ్చి మూడుమాసములైన పిమ్మట యిప్పుడా సవరణ? ఆ సవరణయైన యెట్టిది? సివిలు కోర్టుద్వారా సర్టిఫికెట్టు పొందినవారికి చట్టములో పొందుపరుపబడిన వయస్సులకు లోపుగనే తమ బిడ్డలకు వివాహము చేయుటకు సురపత్ సింగుగారి సవరణ అవకాశ మొసంగుచున్నది. అయితే ఇక శారదాచట్ట మెందులకు? బాల్యవివాహములను చేయ నెంచువారెల్ల కోర్టులో దరఖాస్తుపెట్టి సర్టిఫికెట్టును పొంది తమ
పిల్లల కెప్పటియట్లు వివాహముజేయుదురు. ఆక్షేపణలేనివా రొకరి సలహా లేకయే తమ కొమార్తెలకు ప్రౌఢవివాహములను చేయుచున్నారు. ఇకనేమున్నది? శారదాచట్టము బ్రతికియుండియు చచ్చిన చందమగును. సర్టిఫికెట్టును బడయుట కేదైన కొంచెము ఫీజుగూడ నున్నచో కోర్టువారి కదిగూడ నొక ఆదాయకారణము గావచ్చును. వానిలో నేదైన తకరరు వచ్చినచో లాయరులకుగూడ నొకింత సంపాదనాహేతువు కావచ్చును. కల్పలతా! శారదాచట్టము జీవచ్ఛవముగా నుండి చేయుపని యింతియేగాదు; మఱియొక ముఖ్యమైన నష్టమును గలదు. దేశములో శారదాచట్టమునకు ప్రతికూలురుగానున్నవారు రెండు విధములుగానుండిరి. వారిలో నొకరు పదునాలు<noinclude></noinclude>
pf0q3p5vb78qqt8t5auxogwlnwiy8rg
పుట:Sarada Lekhalu Vol 1.pdf/215
104
59372
554152
553706
2026-04-23T09:00:14Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554152
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|189}}</noinclude>గేండ్ల వివాహములు శాస్త్రవిరుద్ధములని వాదించు పూర్వాచారపరాయణులు ; వేఱొకరు యుక్తవయస్సు వచ్చిన బాలికలకు వివాహముచేయుటకు మనస్ఫూర్తిగా నిష్టముండియు మన వైవాహిక హక్కును ప్రభుత్వపరముచేయుట గూడదను లౌక్యులు. చట్టమున కనుకూలురగు సంస్కర్తల చిత్తములందు గూడ నీ వివాహాధికారమును గోల్పోవుటనునది గొప్ప సమస్యగానే యుండెను. కాని దేశములో బాల్యవివాహములవలని యనర్థకములు నానాటికి మెండుగుటయు, ఎన్నివిధముల ప్రబోధించినను ప్రజాసామాన్యము తమపూర్వాచారమును వీడజాలకుండుటయు గని స్త్రీల పురోభివృద్ధి నాశించు కొందఱు మహాశయులు ప్రభుత్వమువారి వలననైన నీ బాల్యవివాహములు నిరోధింపబడిన జాలునని తమ హక్కును కోల్పోవుట కొడబడిరి. అయితే యీ సవరణయే నెగ్గినేని దేశమును కింతకంటె అనర్థకమును దేశీయుల కింతకంటె యవమానమును వేఱొండు లేదు. ఏలననగా ఎప్పుడు మన బాలికల వివాహమును చేసికొనులకు కోర్టువారి సర్టిఫికెట్టును బడయు టగత్యమైనదో అప్పుడే మన వివాహముల హక్కును ప్రభుత్వమువారి పరము చేసినట్టులైనది. అయితే శారదాచట్టమును సృష్టించుటయొక్క యుద్దేశము బాల్యవివాహములను నిషేధించుటకే గదా. బాల్యవివాహములను చేసికొనువారికి ప్రభుత్వమువా రుత్తరువు
నొసంగినచో శారదాచట్టముయొక్క ప్రయోజన మేమున్నది? కాన కలిగియున్న అధికారమును కోల్పోవుటయు, కలుగవల<noinclude></noinclude>
k2g6ewu9uy2ld7l0dy79z6vigbha251
పుట:Sarada Lekhalu Vol 1.pdf/216
104
59373
554153
553707
2026-04-23T09:05:50Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554153
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|190|శారదలేఖలు|}}</noinclude>సిన ప్రయోజనము కలుగకపోవుటయు సురపత్సింగుగారి సవరణయొక్క ఫలితములుగా నేర్పడగలవు. కావున మిత్రమా! స్త్రీ జనాభ్యుదయచింతతోఁ జేయబడిన శారదాచట్టము యథారూపమున నమలులోనికైన రావలెను. లేదా అసలే రూపుమాసిపోవనైన పోవలెను; కాని సురపత్ సింగుగారి సవరణను మాత్రము దేశీయు లెంతమాత్ర మామోదింపగూడదు. అప్పటికప్పుడే శారదాచట్టమును రూపుచెడజేయ నెంచిన
సింగుగారి సవరణకు ప్రజాభిప్రాయమును కనుగొనుటయను మఱియొక సవరణతో యమర్సనుదొరగా రించుక యడ్డుపడిరి. కాన ప్రజాభిప్రాయమునకై విడువఁబడిన ఈ సవరణను అనర్థక హేతువని పూర్తిగా నిరసించి దేశీయులు శారదాచట్టము యెడల తమకుగల సమ్మతిని తమ నిశ్చితాభిప్రాయము ద్వారా మరల నొకపరి దృఢపఱుపవలెను. ముఖ్యముగా నిది స్త్రీలకు సంబంధించినది గావున స్త్రీలెల్ల రీ సవరణవిషయమై తీవ్రప్రాతికూల్యమును జూపదగును. గృహలక్ష్మియు నిందులకు దోడ్పడవలెనని నా కోరిక.
మన చెన్ననగర మహిళాసంఘమువా రప్పుడే యీ సవరణవలని ప్రమాదమును గుర్తించి నిరసనసభ జరిపినట్లు పత్రికలలో జదివితిని. ఇది యెంతయు శుభావహము. ఇటులనే భారతదేశమంతట నీ సవరణకు తీవ్రప్రాతికూల్యమెదుర్కొను గాకయని యాశించెదను.<noinclude></noinclude>
n1zpodzkbr27bcm7kjzh7nxw3vac3cl
పుట:Sarada Lekhalu Vol 1.pdf/217
104
59374
554155
553708
2026-04-23T09:08:37Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554155
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శారదలేఖలు|191}}</noinclude>కల్పలతా ! ఈసమయమున దేశీయు లుపేక్షించిన దేశమునకు మేలుగాక కీడునే చేసినవారగుదురనుట నిక్కము. భవిష్య మెట్లున్నదో ?
{{rh|భావపురి||మిత్రురాలు,}}
{{rh|సెప్టంబరు 1930||శారద.}}
{{rule|2cm}}<noinclude></noinclude>
4cgnfemhrvqg65ur55i0e9gwpbs3c14
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/38
104
163339
554090
467866
2026-04-22T14:04:11Z
శ్రీరామమూర్తి
1517
554090
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Saiphani02" /></noinclude>{{p|fs200|ac}}'''2. ఆరుగురు గురువుల వరస'''</p>
{{Largeinitial|పా}}శ్చాత్య నాగరికత భాషలో పుల్లికూరి లక్ష్మయ్యని ' ఎ
ఫాస్ట్ యంగ్మాన్' అని ఉండేవారు. చెవిపోగులు, కంకణాలు,
నడుముకు పట్టీలతో వాటి విలువ కన్న మెరుగులతో అందరినీ
ఆకట్టుకునే వాటితో, అలంకరించుకునేవాడు. ఎర్ర తలపాగ, తెల్లటి
అంగీలు పెట్లో వాడకానికి సిద్ధంగా ఉండేవి. ఎక్కడ ఆట, పాట
పండగ ఉన్నా అక్కడకి తిరుగుతుండేవాడు. పాపమూ కామమూ
పెరిగిపోయాయి. అతని ఆత్మలో ఈ మొత్తం పరిస్థితి మీద విరక్తి
కలిగేవరకూ అవి కొనసాగేయి. వీటితో విసుగెత్తిపోయాడు.
ఎప్పుడు వచ్చిందో ఒక ఆలోచన ఒక రోజు అతనికి కలిగింది.
నేను చనిపోతే?
ఆ సమయంలో యోగి వీరబ్రహ్మం సంచార శిష్యులలో ఒకరు
ఆ ఊరికి వచ్చాడు. లక్ష్మయ్య దృష్టి అతని మీదపడింది. అతని
సంపాదన అంతా ఆ గురువుకి దక్షిణలు దానాలు యివ్వటంతో
ఖర్చుపెట్టాడు. అతనికి ముక్తిమార్గాన్ని చూపించేది ఏదైనా
కనుక్కోవాలనిపించింది. మరణానంతరం ఆత్మకి ఆనందమిచ్చే
స్థితిని కోరుకున్నాడు. రోజులు గడిచాయి. అతనికి నిశ్చయమైనదేదీ
కనబడలేదు. ఓ రోజు పొద్దుటే గురువు తన శిష్య బృందంతో
మరోచోటకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి యింకొకరు వచ్చారు.
లక్ష్మయ్య అతని చుట్టూ తిరిగాడు. గురువుకి తినబెట్టడంలో
తనవంతు తను యిచ్చాడు. యిద్దరూ కలిసి తాగారు. దొర్లారు.
కొన్ని నెలల తర్వాత అతనూ తన దోవన వెళ్ళిపోయాడు. తన
జ్ఞానం ఏ మాత్రమూ పెరగలేదని లక్ష్మయ్యకి తెలిసింది.
ఆ విధంగా ఆరుగురు గురువులని లక్ష్మయ్య కొందరిని
వారాలు, కొందరిని నెలలూ పోషించాడు. మాదిగ సమాజంలో
వదంతులు వ్యాపించాయి. శుభ్రమైన బట్టలు, అలంకారాల మీద
ఆసక్తి పోయి రాజయోగి గురువుల పాదాల ముందు
కూర్చుంటున్నాడని చెప్పుకోసాగారు. ఈ పరిస్థితిని వాడుకోటానికి
చుట్టాలమని చెప్పుకుంటూ ఒకరితర్వాత ఒకరు రాసాగారు. అతను
దీక్ష తీసుకున్నప్పుడు నేర్చుకున్న మంత్రాలు, శ్లోకాలు గురించి
అడుగుతూ అతనికి అతిథులయారు. అప్పటికి ఉన్న గురువుకి
పరిచయం చేయటం, వాళ్ళు అవీయివీ అడగటం తెలుసుకోవటం,
అందరిలోనూ ఆసక్తి పెరగటం జరిగాయి. కొందరు స్నేహితులు
మాటిమాటికి వచ్చేవారు. బంగారపు తాతయ్య కూడా ఒక్కోసారి
వాళ్ళ మధ్య ఉండేవాడు. ముఖ్యంగా బండికట్ల వీరమ్మ
వెళ్ళిపోయాక వీళ్ళదగ్గరకి వచ్చేవారు. వారందరి మధ్య ఓ
సంఘీభావం ఏర్పడి కొన్నేళ్ళు నిలబడింది. ఈ బృందంలోని
దాదాపు ప్రతి సభ్యుడూ తరువాత సంవత్సరాలలో క్రైస్తవ
ప్రచారంలో బలమైన శక్తులుగా మారారు.
ఏదైనా చిత్తశుద్ది గల సత్యాన్వేషణ వృధా అవదు. సామాన్య
మాదిగల మూఢనమ్మకాల నుంచి లక్ష్మయ్య అతని స్నేహితులూ
పైకి ఎదిగారు. అంతకన్నా మెరుగైనదానిని ఆశించారు. అంటే
చిన్నతనపు విశ్వాసాల నుంచి బయటపడ్డారు. ఆత్మకి కలిగే ఆకలిని
తృప్తిపరుచుకోటానికి ప్రతీ ఒక్కడూ యోగి చెప్పినవన్నీ
ప్రయత్నించాడు. ఎవరెవరు ఏం సాధించారో తెలుసుకోటానికి
వారి మధ్య స్నేహమూ, ఏకఫలాపేక్షా వారిని కలుపుతూండేవి.
ప్రతి ఒక్కడూ ఎవరి దోవలో వారు నిరాశచెందారు.
ఒకరూ ఒకరూ తోలు వ్యాపారం కోసం ఉత్తరాదికి వెళ్ళారు.
రెండు సంవత్సరాల పాటు గురువుగా ఉన్న బల్లి సోమయ్య దగ్గర
లక్ష్మయ్య ఉండిపోయాడు. సోమయ్య శూద్రులతో కలిసి ఊళ్ళో
ఉన్నప్పటికీ అతని ప్రధాన పోషకుడు లక్ష్మయ్య. దాంతో అతని
దగ్గర ఉన్నదంతా కరిగిపోసాగింది. అప్పుల్లో పూర్తిగా
మునిగిపోయాడు. అతనికి అప్పు యిస్తుండే కోమటి చక్రవడ్డీలు
వసూలు చేసేవాడు. అతని స్నేహితులకీ సహ అన్వేషకులకీ
యిచ్చిన ఉచిత ఆతిథ్యం ఖర్చు అతని ఆస్తిని మించిపోయింది.
వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఓ వదంతి వచ్చింది. వాళ్ళంతా
ఉత్తరాదిని మళ్ళీ కూడారుట. ఇంగ్లీషు వాళ్ళ దేశం నుంచి వచ్చిన
ఏదో మతం గురించి తెలుసుకుంటున్నారుట.
లక్ష్మయ్య ఉత్తరాదికి వెళ్ళి నాలుగు పైసలు కనిపిస్తున్న తోలు
వర్తకం చేసి అప్పులు తీర్చాలని నిశ్చయించుకున్నాడు. అయితే
వదిలి వెళ్ళాలనుకొన్నా గురువు బల్లి సోమయ్యని ఏం చెయ్యాలి?
నేనింక నిన్ను పోషించలేనంటే ప్రమాదం వస్తుందేమో చెప్పకుండా
అతని కర్మకి అతనిని వదిలేసి వెళితే శపిస్తాడేమో? అన్న ప్రశ్నలు.
రోజురోజుకి గురువు సోమయ్య ఉండటం ఇబ్బందికరంగా
తయారయింది. చిట్టచివరికి అతన్ని వదిలించుకోవటానికి ఓ దారి
దొరికింది. గురువు తాలుకు అన్నదమ్ములు ఉత్తరాది జిల్లాల్లో
ఉంటున్నారని లక్ష్మయ్యకి తెలుసు. "నీ శిష్యులంతా ఉత్తరాదిన
ఉన్నారు. బోల్డంత సంపాదిస్తున్నారు. నా అప్పులు
పెరిగిపోయాయి. నేనూ వెళ్ళాలి. నువ్వూ నాతో వస్తే అక్కడ
ఏదో ఆధారం నీకు దొరుకుతుంది." అని చెప్పాడు. అలా వారి
ప్రయాణం మొదలయింది.
పాత శిష్యులు ఉంటున్న చిన్ని నివాసానికి వెళ్ళేసరికి,
సోమయ్యకి నిరాశ ఎదురయింది. వాళ్ళకి యింక అతను
అక్కరలేదు. పాత సంబంధం కోసం తిండిపెట్టారు కాని సారాయిని
వదిలేశారు. మామూలుగా యిచ్చే సారాయి యివ్వనందుకు అతడు
కోప్పడ్డాడు. స్నేహితులంతా మాట్లాడుకున్నారు. ఈ బరువు
వదిలించుకోటానికి లక్ష్మయ్యకి సహాయం చేయాలనుకున్నారు.
ఓ పది రూపాయలు అందరూ పోగేసి గురువుని అతని
అన్నదమ్ముడి దగ్గరకి పంపారు. బంగారపు తాతయ్య ఒక్కడూ<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ కుడుతూ తెలుగు మాదిగల గాథలు|37|}}</noinclude>
013tfx6ign6n5vnlu2on4kput5bbwkj
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/39
104
163340
554089
467867
2026-04-22T14:03:18Z
శ్రీరామమూర్తి
1517
554089
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Saiphani02" /></noinclude>వేరేగా ఉండిపోయాడు. "నేనేమీ యివ్వను. వచ్చినపుడు ఎలా
వచ్చాడో అలాగే వట్టి చేతుల్తో పంపెయ్యండి. అన్నాడు. అయితే
పులుకూరి లక్ష్మయ్య చాలా సంతోషించాడు. కొత్త మతాన్ని
తెలుసుకోటానికి గురువు ఉండటం అతనికి అడ్డంకిగా ఉంది.
ఆ తర్వాత కాలంలో లక్ష్మయ్యకి పాత గురువుల ప్రసక్తి
విషంలా అనిపించేది. వాళ్ళు చెప్పేదానిలో ఏదయినా కొంచెం
సత్యం దాగున్నా వారి ఏ విలువలూ లేని నడత ఆ సత్యాన్ని ధ్వంసం
చేసేది. ఆ రోజుల గురించి లక్ష్మయ్య అనేవాడు. “పోతులూరి
వీరబ్రహ్మం శిష్యుల కాళ్ళు పట్టుకున్నాను. ఏదయినా ముక్తిమార్గం
దొరుకుతుందా అని ఆశలు పెట్టుకున్నాను. అంతా వృధా
అయిపోయింది. గాలి మూట మీద నమ్మకం పెట్టుకుంటే ఏం
లాభం? పోతులూరి జనాలతో కలిసి సారాయి తాగాను. ఏదో
పుణ్యకార్యం చేస్తున్నాననుకున్నాను. నాలో పవిత్రత అన్నది మచ్చుకి
కూడా లేకపోయింది. ఎంత గడ్డి తింటే మాత్రం ఆకలి పోతుంది?”
రాజయోగి మతం ద్వారా ముక్తి మార్గం దొరుకుతుందని
స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. ఏమీ ఫలించలేదు. గురువుల
మీద ఉన్నదంతా ఖర్చుపెట్టాడు. కొత్త మతం గురించి
తెలుసుకోటంలో ఇతరులు ముందున్నట్టు అర్ధమయింది. తనూ
అనుసరించాలి. ఒకరి తర్వాత ఒకరు మాదిగ వర్తకులు గోదావరి
జిల్లాలోని ఆ నివాసం నుంచి ఇళ్ళకి బయలుదేరారు. అతని చుట్టం
రామవయ్య వెనక్కి ఉండిపోయాడు. నాలుగు డబ్బులు
మిగుల్తాయని ఊహించుకున్నారు.
ఒంగోలుకి ఒక మిషనరీ వచ్చాడని వదంతి. అందరూ ఆ
కొత్త మతం గురించే చెప్పుకుంటున్నారు. కొందరు క్రైస్తవంలో
చేరుతామని అంటున్నారు. వాళ్ళు ఖచ్చితమైన సమాచారం కోసం
ఆరాటపడుతున్నారు. వ్యాపారం మీద పాత ఇంటి చుట్టుపక్కల
ఉండే ఓ స్నేహితుడు వచ్చాడు. ఏం జరిగిందో చెప్పటానికి వాళ్ళని
కలిశాడు. ఒంగోలు మిషనరీ తలకొండపాడు వచ్చాడు. 28
మందికి బాప్టిజం ఇచ్చాడు. వాళ్ళలో లక్ష్మయ్య అన్నదమ్ముడూ,
అతని కొడుకూ, రాఘవయ్య కొడుకూ వారిచుట్టాలూ స్నేహితులూ
ఉన్నారు.
వచ్చినతను వెళ్ళిపోయాక ఇద్దరూ కూర్చున్నారు. మనసంతా
బాధగా ఉంది. కళ్ళమ్మట నీళ్ళు రావటం తరువాయి.
తరువాత పుట్టాడు తమ్ముడు. నా సొంత కొడుకు కూడా
స్వర్గమార్గంలో నాకన్న ముందున్నారు. నేనిక్కడ ఎక్కువకాలం
ఉండలేను" అన్నాడు లక్ష్మయ్య. మర్నాడు పదహారు బళ్ళు
బేరమాడుకున్నారు. ఒక్కో దానిమీద వంద తోళ్ళు వేశారు. ఇంటికి
బయలుదేరారు. ఎనిమిది బళ్ళ బరువు దోవలో అమ్ముడుపోయింది.
మిగిలిన ఎనిమిది బళ్ళతోనూ యిల్లు చేరారు. వాళ్ళ కొడుకులు
ఒంగోలులో బడిలో ఉన్నాడు. వాళ్ళకి దొరకనిది వాళ్ళ బిడ్డలకి
దొరికినందుకు పొంగిపోయారు. వాళ్ళు యింటికి వచ్చారని
మిషనరీకి కబురు వెళ్ళింది. ఒక బోధకుడిని వాళ్ళకి కొత్తదైన
క్రైస్తవం గురించి చెప్పటానికి పంపారు.
రాజయోగి గురువులలో ఆఖరు అతను వదిలేసరికి లక్ష్మయ్య
అప్పులలో మునిగి ఉన్నాడు. అతని పాత సహచరులంతా
బోధకులు అయ్యారు. వాళ్ళ హోదాకు ఉన్న గౌరవంతో
సంతోషంగా ఉన్నారు. లక్ష్మయ్య ఒక్కడైపోయాడు. అడిగితే అప్పు
గురించి చెప్పాడు. వాస్తవానికి ఆ అప్పు కారణం కాదు. కొంచెం
తప్ప దాదాపు అంతా తీర్చేశాడు. లక్ష్మయ్య తన కాళ్ళమీద తను
నిలబడాలనుకునే మనిషి. అతను యీ బోధకుల వృత్తిలో ఓ చిన్న
భాగమవటానికి యిష్టపడలేదు. వ్యాపారం మీద వెళ్ళి డబ్బు
చేసుకుంటూ అతనికి యిష్టమైనచోట యిష్టమైనపుడు బోధించాలని
ఎవరికీ జవాబు చెప్పనవసరం లేకుండా జీవించాలనుకున్నాడు.
అలా ఆరేళ్ళు గడిచాయి. నెలవారీ సమావేశాలకు ఒంగోలు
వచ్చినపుడు మిషనరీ అడుగుతుండేవాడు. వ్యాపారం వదిలేసి
ఇక్కడే ఉండి దైవకార్యంలో నిమగ్నమయ్యే రోజు యింకా రాలేదా
అని అడిగేవాడు. అతను వస్తాననేవాడు కాని ఎన్నడూ రాలేదు.
చివరికి కాలం మారింది. మిషనరీ నుంచి వచ్చిన ఓ కబురు అతన్ని
బలవంతం చేసింది. లక్ష్మయ్య కొడుకు బడి వదిలి సెలవులకి
యింటికి వస్తున్నాడు. దొర నమస్కారాలు చెప్పమన్నాడని మీ
నాన్నకి చెప్పు అన్నాడు దొర కుర్రాడితో. “నేను మీ నాన్నని పనికి
పిలిస్తే అతను రాలేదు. దేశమంతటా యజమాని లేని కుక్కలా
తిరుగుతున్నాడు." అని చెప్పమన్నాడు. ఆ మాట అందరి
చెవుల్లోనూ పడింది. లక్ష్మయ్య అప్పుడు నవ్వాడు. ఈ కథ
చెప్పినపుడల్లా ఈ నాటికీ నవ్వుతూనే ఉంటాడు. బోధకులంతా
నవ్వారు. లక్ష్మయ్య సందిగ్ధస్థితిని దొర అలా చెప్పడం వారికి
నచ్చింది "నువ్వు వెళ్ళి తీరాలి" అన్నాడు కొడుకు. తండ్రి నవ్వుతూనే
వెళ్ళటానికి ఒప్పుకున్నాడు కాని ఇప్పుడే కాదన్నాడు. మిషనరీకి
తన విలువ తెలిసింది. ఆ ధర్మ యుద్ధంలో తనే జయించాడు అని
లక్ష్మయ్యకి సంతోషం కలిగింది. తన దోవలో తనుండటంలో
లక్ష్మయ్యకి ఎంత బలముందో అతన్ని దోవలో పెట్టడానికి
మిషనరీకి అంతకన్నా బలం ఉంది. అతని నిజమైన స్థితి ఏమిటో
ఎదుట పెట్టాడు.
ఇదంతా అయిన కొన్నాళ్ళకి మిషనరీ కనిగిరి తాలూకాలో
విశేషంగా పర్యటించాడు. అప్పుడు మిషనరీ లక్ష్మయ్యను
చూశాడు. తోటి బోధకులతో కలిసి తనను అనుసరించటమే కాదు
అతని గ్రామం చుట్టుపట్ల ప్రాంతాలలో అనేకమంది క్రైస్తవులకి
మత నాయకుడుగా పాస్టర్ గా ఉన్నాడు లక్ష్మయ్య. అక్కడి నుంచి
వెళ్ళిపోయేటపుడు లక్ష్మయ్యతో అతని భార్యతో మాట్లాడాడు.
"నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు లక్ష్మయ్యా?" అని అడిగాడు.
నాకు దేవుడి సేవలో చేరాలనే ఉంది కాని నాకొక అప్పు ఉంది.”
జవాబిచ్చాడు. ఇది నెపం అని మిషనరీకి తెలుసు. బల్లమీదున్న
ఓ కాగితంముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి ఓ గుప్పెడు
లక్ష్మయ్య మీద విసిరాడు. ఆ గుడారంలో అన్ని మూలాలూ<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ కుడుతూ తెలుగు మాదిగల గాథలు|38|}}</noinclude>
2nt87llv7gihgr8g2apv1whw7g9c4zc
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/40
104
163341
554087
467868
2026-04-22T13:59:34Z
శ్రీరామమూర్తి
1517
/* మూల్యాంకన చేసారు */
554087
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>పడ్డాయి. "ఇలా నీ అప్పు తీరిపోయింది" అన్నాడు. అతని భుజం మీద మెల్లగా తట్టి ఇంటికి పంపేశాడు.
ఊరికి తిరిగి వస్తూండగా లక్ష్మయ్యను ఒక విషపు పురుగు కుట్టింది. వాపూ నొప్పి మొదలయాయి. “తప్పకుండా చచ్చిపోతాడు. ఓ కోమటాయన ఇలా కుడితేనే చనిపోయాడు అన్నారు. లక్ష్మయ్య గాబరా పడిపోయాడు. మరుసటి రోజు బైబిలు తీసుకుని ఈ అకాల మరణం రాబోతున్న సమయంలో తనకు
ఓదార్పునిచ్చేది ఏదైనా దొరుకుతుందా అని వెదికాడు. ప్రాఫెట్ జోనా అనుభవం ఉన్న పేజీలు తిరగెయ్యటం జరిగింది. దాంతో తనకు దేవుడి పంపించిన విధంగా భోదకుడవటానికి నిరాకరించటమే తను కూడా ఈ ఆపదలో పడటానికి కారణం అనిపించింది. దొరకి ఓ ఉత్తరం రాయించాడు. "నేనొస్తున్నాను. పనికి వెళతాను. "రెండ్రోజులకి వాపు తగ్గిపోయింది. లేచాడు. అనేక గ్రామాలు తిరిగాడు. అన్నిచోట్లా బోధించాడు. నెలవారీ సమావేశానికి ఒంగోలు వచ్చాడు.
ఇతర బోధకుల మధ్య అతన్ని చూచి నవ్వాడు దొర. “వచ్చావా లక్ష్మయ్యా!"
“వచ్చాను”<noinclude><references/>
చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు
39</noinclude>
dv8azg9auiozjjrk3jicdzecsgbajzd
554088
554087
2026-04-22T14:02:25Z
శ్రీరామమూర్తి
1517
554088
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>పడ్డాయి. "ఇలా నీ అప్పు తీరిపోయింది" అన్నాడు. అతని భుజం మీద మెల్లగా తట్టి ఇంటికి పంపేశాడు.
ఊరికి తిరిగి వస్తూండగా లక్ష్మయ్యను ఒక విషపు పురుగు కుట్టింది. వాపూ నొప్పి మొదలయాయి. “తప్పకుండా చచ్చిపోతాడు. ఓ కోమటాయన ఇలా కుడితేనే చనిపోయాడు అన్నారు. లక్ష్మయ్య గాబరా పడిపోయాడు. మరుసటి రోజు బైబిలు తీసుకుని ఈ అకాల మరణం రాబోతున్న సమయంలో తనకు
ఓదార్పునిచ్చేది ఏదైనా దొరుకుతుందా అని వెదికాడు. ప్రాఫెట్ జోనా అనుభవం ఉన్న పేజీలు తిరగెయ్యటం జరిగింది. దాంతో తనకు దేవుడి పంపించిన విధంగా భోదకుడవటానికి నిరాకరించటమే తను కూడా ఈ ఆపదలో పడటానికి కారణం అనిపించింది. దొరకి ఓ ఉత్తరం రాయించాడు. "నేనొస్తున్నాను. పనికి వెళతాను. "రెండ్రోజులకి వాపు తగ్గిపోయింది. లేచాడు. అనేక గ్రామాలు తిరిగాడు. అన్నిచోట్లా బోధించాడు. నెలవారీ సమావేశానికి ఒంగోలు వచ్చాడు.
ఇతర బోధకుల మధ్య అతన్ని చూచి నవ్వాడు దొర. “వచ్చావా లక్ష్మయ్యా!"
“వచ్చాను”<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ కుడుతూ తెలుగు మాదిగల గాథలు|39|}}</noinclude>
ne9s2a622m3fasviwkfyyktnec2g4rc
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/108
104
186371
554072
504595
2026-04-22T12:12:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554072
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}వృక్షదేశవృత్తాంతము</p>
తదనంతరంబ యత్తురంగంబు వృక్షదేశంబునకుం జనియె. అందలివిశేషంబులు వినుము. అచ్చటి మానవపశుపక్షివృక్షసంఘంబులు ప్రాతఃకాలంబునం బుట్టి, తోడనే యౌవనంబు నొంది, మధ్యాహ్నకాలంబునం గాపురంబు సేసి, సాయంకాలంబున మరణంబు నొందు. అనుదినంబు నివ్విధంబున జననమరణంబు లొందుచుండు. ఇది యద్దేశాచారంబు. పార్థుం డవ్విశేషంబులు గని యచ్చెరువొందుచుఁ బోవునెడ, స్వకర్మానురూపంబుగాఁ బుట్టిన యేకపాదులు, ద్విపాదులు, త్రిపాదులు, ననేకపాదులు, వికటపాదులు నైన జనులును, గుందేలు, ఎద్దు, ఎలుఁగు, వానరంబు, ఏనుఁగు, జింక, గుఱ్ఱంబు, పంది, పశువు, పులి, మార్జాలము మొదలగు జంతువులవలె కనుపట్టు ముఖంబులు గలిగిన మానవులు, గూబ, కోకిల, ఎండ్రకాయ మొదలగు వానివలె వికృతంబులు, కపిలవర్ణంబులు, విషమంబులు నైన కన్నులం గనుపట్టు జనులునుం గలిగి, వింతవింతలైన దేశంబు లతిక్రమించి పోవుచు, నత్తురంగం బగ్రభాగంబునఁ బిశాచనిశాచరశాకినీఢాకినీభేతాళాదుల కాలయంబును, సింహశరభశార్దూలగండభేరుండవేదండగండకశశవరాహాదినానామృగసమూహంబులకు శరణ్యంబైన యరణ్యంబు ప్రవేశించె. అందుఁ బాపంబులు కాపురంబు సేయుతావును, నశుభంబుల కాలయంబును, జనలోకభయంకరంబునగు దనుజపురం బొక్కటి కలదు. అప్పట్టణంబున మూఁడుకోట్లదానవులు పార్శ్వంబులం గొలువ, నిర్దయచిత్తుండును, దంష్ట్రాకరాళవదనుండును, గ్రూరకర్ముండును, శీలునకుఁ బదివేలదిగ్గజంబుల సత్తువ గలవాఁడును, భీషణాకారుండును నైన బకాసురతనయుండు భీషణుం డను నామధేయంబు గలవాఁడు రాజై యుండు. తత్సమీపంబునం దొక్కపర్వతగుహలోఁ బ్రాణిహింసాదీక్షితుండును భీషణాసురునకుఁ బురోహితుఁడును నైన బ్రహ్మరాక్షసుఁ డుండు. వాఁడు నిడుదలైన ప్రేవులజందెంబులును, నెత్తుటిపట్టెవర్ధనంబులును, గపాలజపమాలికయుఁ, బచ్చిచర్మంబనియెడి
కాషాయవస్త్రంబును, నేనుఁగుతల కమండలువును, గర్ణపవిత్రంబులును, వెన్నెముక యూతకోలయుం గలిగి, మేదోహోత యను నామధేయంబున వర్తించు. వాఁడు నర్జునుని యశ్వమేధాశ్వంబు వచ్చుటం జూచి, భీషణాసురుని చెంగటికి వచ్చి<noinclude><references/></noinclude>
t1lw9pcnj5z1tbsi1cugtph2kec1zv7
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/109
104
186372
554074
504596
2026-04-22T12:20:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554074
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దీవించి యిట్లని విన్నవించె. 'దానవేంద్రా, మీతండ్రియగు బకాసురుని బలాతిశయంబున భీముఁడు చంపె. వాని తమ్ముండగు నర్జునుఁ డశ్వమేధాశ్వంబువెంబడి మనవీటిచెంగటికి వచ్చె. తండ్రిని జంపినపగ దీర్చుకొనుట కిదియే సమయంబు. నీవు నరమేధం బను యాగంబు సేయుము. నే నౌద్గాత్రంబు సవరించెద. నేఁ జేయువ్రతంబులు వినుము. ఆషాడమాసంబునఁ బౌర్ణమాసియందు సన్న్యాసులరక్తంబు లను జలంబులే యాహారంబుగాఁ దపంబు సేసితి. శ్రావణమాసంబున విధవలను దలదీయకయే పండుటాకులకరణి మ్రింగి వ్రతంబు సలిపితి. భాద్రపదమాసంబునఁ బాశుపతదీక్షాపరుల గుండెకాయలు కందమూలఫలంబులంబోలె నశనంబు సేయుచు నియమంబు నెఱవేర్చితి. ఆశ్వయుజమాసంబున బ్రహ్మచారులు ఫలాహారంబు సేయుచు నిష్ఠాసమన్వితుఁడనై యుంటిని. ఇవ్విధంబునఁ జాతుర్మాస్యవ్రతంబు సలిపి, కార్తికమాసంబునఁ గన్నియలు భక్షించి పారణ చేసితి. ఈపురంబునఁ బెక్కండ్రు బ్రహ్మరాక్షసులు గలరు. వార లిత్తెఱంగున నియమంబు నడుపంజాలరు. పుణ్యకాలంబు
వీటిఁ బుత్తురు. అది యట్లుండె. ఇప్పుడు బ్రహ్మరాక్షససహస్రభోజనంబు సేయ సంకల్పించి నరుని బలంబులనెల్ల ధారవోయుము. అనిన విని భీషణుండు కొద్దిగా నవ్వుచు, 'నీకుం గావలసిన భోజనం బెద్ది? ఏమాత్రంబు భక్షింపఁజాలుదువు? తెలియంబలుకు' మనియె.
తదనంతరంబ యాబ్రహ్మరాక్షసుండు, 'బలపరాక్రమవంతు లున్నతాకారు లాజానుబాహులును మూర్ధాభిషిక్తులైన రాజకుమారుల వేయిమందిని, గజతురగవీరయోధుల తుద మొదళ్ళు కూరలుగా మెసవం గలవాఁడ, నింతమాత్రంబు దయచేయవలయు ననిన, దనుజనాయకుఁడు నవ్వి, చేతంజే యప్పళించి, 'బ్రహ్మరాక్షసోత్తమా, ప్రాణిహింసాయజ్ఞంబు నేఁ జేయంబూనితి. తగినయాగోపకరణంబులు సంపాదింపుము. పొ' మ్మని యనిపి, భూమి గ్రక్కదల, దిక్కులు పిక్కటిల్ల, రణభేరి చఱవం పనిచి, హుంకారాట్టహాస సింహనాద భుజాస్ఫాలన భేరీభాంకార భయంకరంబుగా నాప్తబలంబులతోఁ బురంబు వెలువడి, శాత్రవశోషణుండైన భీషణుండు భండనంబునకుం గడంగు నప్పుడు, జగడంబు సూచు వేడుక మీఱ, పొలదిండి పడంతులు బంతులుగా వెడలి, రెండు యోజనంబులు, మూఁడు యోజనంబులు, నాల్గు యోజనంబులు, నిడివియైన చన్నులును, దావాగ్నిదగ్ధంబులైన కొండచఱులం బోలె భీకరంబులగు<noinclude><references/></noinclude>
199vr0pisdfpj06c0lqy5tjy9sy4i80
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/110
104
186373
554077
504597
2026-04-22T12:29:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554077
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మొగంబులును, బ్రళయకాలమేఘమాలికలంబోని యాకారంబులునుం గలిగి, భువనభయంకరంబుగా ముచ్చటలాడుచు వచ్చి పర్వతశిఖరంబు లెక్కి, పాండవసైన్యంబుఁ జూచి, యర్జునురథధ్వజంబున మంతు మెఱయు హనుమంతునిం జూచి, 'వీఁడుగదా, తోఁకచిచ్చున లంక నివుఱు సేసిన మర్కటంబు! సప్తమంత్రికుమారులఁ బంచసేనాగ్రముల, జంబుమాలి నక్షయకుమారుని మ్రింగిన క్రోఁతి! వీఁ డేమిటి కీడ వచ్చినాఁడు? వీఁడు దానవుల వేరువిత్తు.' అని కలంగంబడు సమయంబున నొక్కబలురక్కసి వారల నోడకుండని భయంబు దీర్చి, తా నొక్కతెయే నాకసంబున కెగసి, నల్లమబ్బుకరణి మై పెంచి, హుంకరింపుచు, వేదెంబులు వాఱుటయు, మూడు యోజనంబులు నిడివియైన దాని చన్నులచేతం గొట్టుపడి యర్జును సైన్యంబులు దైన్యంబు నొందె; నింత దక్కిన రాక్షసవనితలు నవ్విధంబుననె కుచతాడకంబులఁ జతురంగబలంబులం గీటడంగించుటయుఁ, గేతనస్థితుండైన వాయుపుత్రుండు మహోగ్రకోపంబున గర్జించి, వాలంబు పెంచి, వారలకంఠంబులు బిగించి, పర్వతశిఖరంబులం గొట్టియుఁ, బయోరాశిలోన వైచియుఁ, బదిదిక్కులం ద్రిప్పి వైచియు, ముష్టిఘాతంబులు, మోకాటిపోటుల, మోఁచేతికుమ్ముల, నఱచేతిపెట్టులఁ బెడచేతిదెబ్బలఁ జెంపకొట్టులఁ బాదఘాతంబులం గెడపి, యద్ధానవభామలం దెగటార్చుచుండె.
{{p|ac|fwb}}అర్జునుఁడు భీషణుం జంపుట</p>
అంత భీషణాసురుండు రథచక్రఘోషంబును, ధనుర్గుణారావంబును, దుందుభి ధణంధణాత్కారంబులు రోదసీగహ్వరంబునం బ్రతిధ్వనులు సంపాదింప బిరుదకేతనప్రథలు రవిమండలంబుఁ గబళింప, నమరేంద్రనందనుం
దాకుటయు, నుభయరభసంబునఁ దారసం బయ్యె. అప్పుడు దానవేంద్రుం డింద్రనందనుమీఁద నైదుశరంబు లేయుటయుఁ గిరీటి మూడుబాణంబులు నాటించె. అసుర యాఱుతోమరంబు లడరించుటయు, సురేంద్రసూనుం డయిదునారసంబులు గ్రుచ్చి, యొక్కకర్ధచంద్రబాణంబునఁ గోదండంబు ఖండించిన, దైతేయుండు వేఱకకార్ముకంబు సజ్యంబు గావించిన, సవ్యసాచి దానిని గుణంబుతో ద్రుంచె. రాత్రించరుండు చక్రంబుం ప్రయోగించిన, నరుండు నడుమన దునుమాడె. ఒకతనూభవుఁడు ఖడ్గంబు<noinclude><references/></noinclude>
75fj99cyknlf6jw6g18i7ky5zikqhh2
554078
554077
2026-04-22T12:29:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554078
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మొగంబులును, బ్రళయకాలమేఘమాలికలంబోని యాకారంబులునుం గలిగి, భువనభయంకరంబుగా ముచ్చటలాడుచు వచ్చి పర్వతశిఖరంబు లెక్కి, పాండవసైన్యంబుఁ జూచి, యర్జునురథధ్వజంబున మంతు మెఱయు హనుమంతునిం జూచి, 'వీఁడుగదా, తోఁకచిచ్చున లంక నివుఱు సేసిన మర్కటంబు! సప్తమంత్రికుమారులఁ బంచసేనాగ్రముల, జంబుమాలి నక్షయకుమారుని మ్రింగిన క్రోఁతి! వీఁ డేమిటి కీడ వచ్చినాఁడు? వీఁడు దానవుల వేరువిత్తు.' అని కలంగంబడు సమయంబున నొక్కబలురక్కసి వారల నోడకుండని భయంబు దీర్చి, తా నొక్కతెయే నాకసంబున కెగసి, నల్లమబ్బుకరణి మై పెంచి, హుంకరింపుచు, వేదెంబులు వాఱుటయు, మూడు యోజనంబులు నిడివియైన దాని చన్నులచేతం గొట్టుపడి యర్జును సైన్యంబులు దైన్యంబు నొందె; నింత దక్కిన రాక్షసవనితలు నవ్విధంబుననె కుచతాడకంబులఁ జతురంగబలంబులం గీటడంగించుటయుఁ, గేతనస్థితుండైన వాయుపుత్రుండు మహోగ్రకోపంబున గర్జించి, వాలంబు పెంచి, వారలకంఠంబులు బిగించి, పర్వతశిఖరంబులం గొట్టియుఁ, బయోరాశిలోన వైచియుఁ, బదిదిక్కులం ద్రిప్పి వైచియు, ముష్టిఘాతంబులు, మోకాటిపోటుల, మోఁచేతికుమ్ముల, నఱచేతిపెట్టులఁ బెడచేతిదెబ్బలఁ జెంపకొట్టులఁ బాదఘాతంబులం గెడపి, యద్ధానవభామలం దెగటార్చుచుండె.
{{p|ac|fwb}}అర్జునుఁడు భీషణుం జంపుట</p>
అంత భీషణాసురుండు రథచక్రఘోషంబును, ధనుర్గుణారావంబును, దుందుభి ధణంధణాత్కారంబులు రోదసీగహ్వరంబునం బ్రతిధ్వనులు సంపాదింప బిరుదకేతనప్రథలు రవిమండలంబుఁ గబళింప, నమరేంద్రనందనుం
దాకుటయు, నుభయరభసంబునఁ దారసం బయ్యె. అప్పుడు దానవేంద్రుం డింద్రనందనుమీఁద నైదుశరంబు లేయుటయుఁ గిరీటి మూడుబాణంబులు నాటించె. అసుర యాఱుతోమరంబు లడరించుటయు, సురేంద్రసూనుం డయిదునారసంబులు గ్రుచ్చి, యొక్కకర్ధచంద్రబాణంబునఁ గోదండంబు ఖండించిన, దైతేయుండు వేఱొకకార్ముకంబు సజ్యంబు గావించిన, సవ్యసాచి దానిని గుణంబుతో ద్రుంచె. రాత్రించరుండు చక్రంబుం ప్రయోగించిన, నరుండు నడుమన దునుమాడె. ఒకతనూభవుఁడు ఖడ్గంబు<noinclude><references/></noinclude>
90uyn1kct6b9fwezvh7psb93kdjjctx
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/111
104
186374
554079
504598
2026-04-22T12:41:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554079
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>జడిపించిన, ఒకవైరితమ్ముండు మొసలి వాకొలందికి ఖండించె. భీషణుండు భీకరశక్తి వైచుటయు, ఫల్గునుండు దానిం బదితునియలు గావించె. రాక్షసేశ్వరుండు పర్వతంబై చనుదెంచిన, నరుఁడు వజ్రాస్త్రం బేసె. పుణ్యజనుండు మహారణ్యంబై క్రమ్మిన, వివ్వచ్చుండు చిచ్చుబాణం బేసె. క్రవ్యాదుండు నీలజీమూతం బగుటయు, భీమానుజుండు వాయవ్యాస్త్రం బేసె. మఱియు నసుర సింహ శార్దూల మృగ వృశ్చికాది రూపంబులం జనుదెంచిన, ధనంజయుండు నయ్యైబాణంబులం జదిపె. అవ్వేళ నొక్కమునీంద్రుండు పార్థుకడకుం జేరి, బహువిధంబులను కథాప్రసంగంబులు గార్యకలాపంబులుం బలుకుచు మోసంబు సేయఁ జూచిన, దానిని దానవమాయగాఁ దెలిసి విజయుండు గపటమౌనిం
బరిమార్చె. అంత నప్పొలదిండి గదాదండంబు కేలం గైకొని కదియ వచ్చుటయుఁ, బాండుతనూభవుండు గల్పాగ్ని కీలాకల్పంబును, గనకపుంఖవిరాజితంబును, గంకపత్రవిచిత్రంబును నగు బాణంబొక్కటి యేర్పఱిచి, గాండీవంబు గుడుసువడం దిగిచి యేయుటయు, వజ్రాయుధంబున ఖండితంబైన శైలశృంగంబుకరణి దైత్యునిశిరంబు పుడమిం గూలె. అవ్విధంబున దనుజుని వధియించి, తత్పురంబునం గల సమస్తవస్తువులుఁ జేకొని యవ్వలం బోవునెడ, నయ్యశ్వంబు మణిపురంబు చాయలకుం జనియె.
అంతఁ బద్మరాగమణిమయాకారంబు లైన ప్రాకారంబులును, బాతాళంబు నంటిన యగడ్తలును, నమరావతీపురంబున కంతటంతటం గనుపట్టు గోపురంబులును, నింద్రసౌధంబైన వైజయంతంబుతోఁ బంతంబులాడు సౌధంబులును, నిజధర్మంబు దప్పని చాతుర్వర్ణ్యజనంబులును, శత్రుచమూభయంకరంబులగు చతురంగబలంబులును, వివిధవస్తుసమ్మర్దంబులైన యంగడివీథులును, బల్లవకుసుమఫలభరితంబులైన యారామంబులును, నానావాద్యఘోషితంబులైన దేవాలయంబులును గలిగి, యలకాపురంబు నదలించుచు, నమరావతి నెదిరించుచు, నతులితైశ్వర్య ధుర్యంబును, నాశ్చర్యకరంబును, బభ్రువాహనభుజాపరిపాలితంబును నైన మణిపురంబు గనుపట్టిన, నింద్రుని ముద్దుపట్టి హంసధ్వజునిం జూచి, 'ముందఱి పట్టణం బెవ్వరిద?' నుటయు, నతండు 'భవదీయకుమారుండును, బాలభానుసమానతేజుండును నగు బభ్రువాహనుం డేలుపట్టణం బిది. వైరివీర నరపాలకుల కంఠంబు లనియెడు కదళీకాండంబులకు ఱంపం బనం బ్రసిద్ధిగాంచి, బలపరాక్రమసంపన్నుడైన కుమారునికి మావంటి రాజులు<noinclude><references/></noinclude>
foiyc09pe74x9n34laigzzu6p0kdqrv
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/112
104
186375
554106
504599
2026-04-22T20:33:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554106
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వేవురు, సహస్రహాటకభరితంబులైన శకటంబును గానుక గానిచ్చి పొగడ వత్తురు. నీవు తండ్రివని, తాను కుమారుండనియు మేర దప్పక యితం డూరకున్న లెస్స గాక, యెదిరించి తురంగంబు పట్టించెనేని యెటువంటివారికేనియు నెదిరింప శక్యంబుగాదు. అని పలుకు నవసరంబున, సుబుద్ధియనం బరగిన బభ్రువాహనుని సేనాపతి వేడుకగా సరాళంబుగా వచ్చిమగుడు నప్పు డత్తురంగంబుం గాంచి పట్టుకొని వచ్చె. అప్పుడు సామవేదమయంబైన బింబంబునం గనుపట్టుచు నాదిత్యుండు పశ్చిమసముద్రంబునం గ్రుంకె. పక్షు లంతరిక్షంబున వివిధనాదంబులు సేయుచు గూండ్ల చేరం జనియె. తారకానికరంబు లింతంతటం దోఁచె దిగంతంబు లంతంతకుం గొంచెంబులయ్యె. చీఁకటులు వేఁకటులయిన కరణిం బెరిగె, ఇవ్విధంబున నర్కుం డస్తమించు సమయంబున సుబుద్ధి పురంబునకు వచ్చె. కెంపుగోడలు, మగఱాలనెలకట్లు, పగడాలకంబంబులు, దంతపుఁదలుపులు, బంగారుసోపానంబులు, ముత్యాలచూరుమొగ్గలు, కుందనంపుబొమ్మలు, చీనాంబరబుల మేలుకట్లు, నగరు సాంబ్రాణి ధూపంబులు గలిగి, పెంపొందు కొలువుకూటంబున, మూర్దాభిషిక్తులైన మండలాధీశ్వరులు కొలువునకై సందడింప, రెండవ యాఖండలుండునుం బలె బభ్రువాహనుండు కనకరత్నమయంబులైన కరదీపికాసహస్రంబులు పగలు వత్తులు వియత్తలంబు పట్టపగలింటికరణిం జేయ నిండోలగంబున నుండె.
ఆసమయంబున బంగరుపల్లంబులు పక్కెరలు మోముట్టులు సింహపుఁదలాటంలు, చామరంబులు, నకమయంబులైన కళ్లెంబులుం గలిగి, నశకసింధ్వారట్టకాంభోజాదిహయంబులం దెప్పించి కనుగొనుచుండు నవసరంబున, సుబుద్ధి భూజానికి మ్రొక్కి యత్తురంగమశ్రేష్టంబు కానుకగా నర్పించె. అవ్విభుండు దానియాకారరేఖాలక్షణంబుల కాశ్చర్యంబు నొంది, సమీపంబునకుఁ దెప్పించి, మొగంబు నిమిరి, లలాటంబునం గనుపట్టు కనకపట్టికఁ దీసి, 'రాజాధిరాజ రాజపరమేశ్వరాష్టదిగ్రాజమనోభయంకర రాజమార్తాండుండైన యుధిష్ఠిరుచే విసృష్టంబయ్యె, నిటలాక్షు నెక్కటికయ్యంబున గెలిచిన కిరీటి యిత్తురంగంబున కంగరక్షగాఁ జనుదెంచె, ధారుణి శూరులు గలరేని పట్టుదురుగాక!' అనియెడు బిరుదు గద్యంబు చదువుకొని, సుబుద్ధినిం జూచి, సాదరంబుగా, 'మా పెద్దతండ్రియు, నమానుషపరాక్రముండు నైన యుధిష్ఠిరుం డశ్వమేధంబు సేయ దీక్షించి, విడువం జనుదెంచిన దీహయంబు. దీనికి మాతండ్రి<noinclude><references/></noinclude>
an3hmhpcofm51vpvex35m96l5tlzc56
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/113
104
186376
554107
504600
2026-04-22T21:07:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554107
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సహాయంబుగా వచ్చె. ముక్కంటి నొంటిపోట్లాటం గెలిచిన నెఱజోదు. ఇంద్రుని యర్ధాసనం బెక్కిన మహానుభావుండు. కాలకేయాదిదానవులం గీటడంగించిన త్రైలోక్యమల్లుండు. చిత్రాంగదానాయకుం డిచ్చటికి విజయంబు సేసె. ఇంక నాభాగ్యం బేమని వర్ణింతు! ప్రభాతకాలంబున మాతండ్రిసమ్ముఖంబునకుం బోవలయు. వలయు వస్తువ్రాతంబులు సమకూర్పుము.' అని యానతిచ్చి, మంత్రుల నిజనివాసంబుల కనిచి, బభ్రువాహన మహీకాంతుం డంతిపురంబునకుం జనియె. అంతఁ బ్రభాతం బగుటయు, మణిపురాధీశ్వరుండు నిదుర మేల్కాంచి, కాలకరణీయంబులు నిర్వర్తించి, మణిభూషణాంబరగంధమాల్యాలంకృతుండై, సామంత మంత్రి పురోహిత దండనాయకులు గొలువ, శుభలక్షణవిరాజియైన తేజి నెక్కి, కంచుకులు సాహోనినాదంబుల హెచ్చరికలు దెలుపఁ, బౌరపురంధ్రీనివహంబులు గుసుమాక్షతలు సల్ల, వందిమాగధవైతాళికులు పాఠకులు బిరుదుగద్యంబులు గైవారంబులు సేయ, శంఖభేరీమృదంగబిరుదకాహళంబు లురియఁ, జతురంగవాహినీపరివృతుండై, మేరుశైలంబు కైలాసగిరియు, బెల్లగించితేని మాత్రంబెకాని, యంతకంటె తక్కువ కాని బంగరువెండిరాసులును, మలయశైలంబు తేని దోషంబకాని, యంతకంటె గణనకు మించిన గంధసారంబులును, గంధమాదనగిరి తేలేదనినమాత్రంబె కాని, యంతకుఁ గడమ లేని కర్పూరంపుబెఱికలును, దండ్రికిం గానుకలు దెచ్చె, మేలు మేలని సకలరాజులు కొనియాడ బభ్రువాహనుఁ డధ్వరాశ్వంబు గొనుచు వచ్చి, యెక్కిన గుఱ్ఱంబు డిగ్గి వివ్వచ్చుచెంతకుం జేరి, క్రొత్తముత్తియంబులు పాదంబులపయిం బోసి, సాష్టాంగదండప్రణామంబు సేసి, 'నిన్నఁ దప్పిదంబుగా మావాఁడు హయంబుఁ బట్టి తెచ్చె; నీ యపరాధంబు సహింపుము. బిడ్డ లెంతనేరక నడిచినను దండ్రికి సహించు టుచితంబె కదా!' అని వెండియుఁ బాదంబులపయిం బడియె.
అంతఁ బాండవమధ్యముండు గంగానదీశాపంబు వలన విపరీతకాలం బగుటంజేసి, బుద్ధి భ్రంశంబు నొంది, యాగ్రహం బుడుపలేక రత్నమయంబగు నతనికిరీటంబు వీడివడం దన్నుటయు, నందలి రాజులందఱును హాహాకారంబులు చేసిరి. అప్పుడు బభ్రువాహనుండు మొగంబున వికారంబు నొందక చేతులు గట్టుక యూరకున్న, సాత్యకి 'తనయునిం గృపఁ జూడు' మనియె. కర్ణనందనుం 'డింతకోపం బేమిటి' కనియె. నీలధ్వజుం 'డింకనైన మన్నింపు' మనియె. ప్రద్యు<noinclude><references/></noinclude>
ldnsz51xxw11kfzbq3ge5rjt81it4t2
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/114
104
186377
554108
504601
2026-04-22T21:22:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554108
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మ్నుం 'డిది యేమిరిత్త గొడవ!' యనియె. కృతవర్మ 'యిది తగవుగా దపకీర్తి' యనియె. అనుసాళ్వుం 'డయుక్తం' బనియె. యౌవనాశ్వుం 'డీచందంబు నీవంటివాని కర్హంబగా' దనియె. తక్కినరాజులందఱు వేనవేలభంగుల విన్నవించిన; బార్థుం డంతకంతకు నగ్గలంబగు కోపంబునఁ జుఱచుఱఁ జూచుచు, 'ఓరిపందా, ముందఱఁ బఱతెంచు గుఱ్ఱంబు పట్టికొని యాపిఱుందన వచ్చు నీదళంబులం గనుంగొని, ప్రాణభీతిచేఁ గదనంబునకు బ్రాలుమాలి కాళ్లమీఁదం బడియెదవు. నీవు నాకు జనియించుటకల్ల. చిత్రాంగదావధూటికిం గోమటివానికి బుట్టినవాఁడవు, నా కెదురుగా నుండక సొమ్మ'నిన, నారాచకొమరుండు పొక్కిపడుచు, 'నన్ను నేమన్న నేమి? ఏమి చేసినం గొఱంతలేదు. పరమపతివ్రతాతిలకంబును, సీతాసమానచారిత్రయు, నుభయకులపవిత్రయునైన మా తల్లిని
దూషించితివి గావున నే వినంజాల. నీ వేమి చేతువు? నావినయం బింతకుఁ దెచ్చె. పెక్కుమాట లేమిటికి? ఎక్కటి పోరునం జయించెదో, దళంబులు సహాయంబుగాఁ గొనిపోరెదో? ఆయత్తము గమ్ము లెమ్ము. నేను క్షత్రియకుమారుండ నగుటయు, వైశ్యపుత్రుండ నగుటయుఁ జూచెదవు' అని తెచ్చిన కానుకలు పురంబునకు మగుడ ననిచి, యశ్వంబు లాయంబునకుఁ గొనిపొమ్మని, మొగంబున గంటు పెట్టుకొని గిఱుక్కున మరలి, రెండుగడియలదూరం బవ్వలికిఁ జని సుబుద్ధి యను సేనాపతిఁ జూచి, 'సైన్యంబుల నొక్కముఖంబుగా మోహరింపంజేయు' మనుటయు, సైన్యపతియుఁ, గనకకింకిణీఘంటికాకేతనపతాకాలంకృతంబులైన యేడుకోటులరథంబులును, గీలుమదంబునం బొదలు భద్రగజంబు లర్బుదంబులును, జటులధాటీనిరాఘాటంబులును, మనోహరంబులు నైన తెల్లగుఱ్ఱంబులు రెండర్బుదంబులును, సమరకర్కశులు బాహుబలధురీణులు నైన వీరభటులు మూఁడర్బుదంబులును, గ్రందుకొనఁ గాలచక్రాకారంబును, నాహవభయంకరంబును, నగుమోహరంబు సంఘటించె. అప్పుడు కపికేతనునిపాలికిం దోఁచు ధూమకేతుచందంబునను, నీలమణిదండమండితంబైన మయూరధ్వజంబును, గనకమయనిర్వక్రంబులైన చక్రంబును, దిరస్కృతవజ్రాయుధంబు లైన యాయుధంబులును, మరకతమణివిభాంగంబులైన తురంగంబులును గలిగి, సఫలితమనోరథంబైన రథం బెక్కి, బభ్రువాహనుండు బాణ బాణాసన తూణిక కరవాల ఖేటక కవచ తనుత్రాణ శిరస్త్రా<noinclude><references/></noinclude>
k1dlmiochazen78k6ytrk1xwkqp3wpe
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/115
104
186378
554115
504602
2026-04-23T01:19:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554115
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ణంబులు మెఱయ, భద్రగజంబు మీఁదం గమకించుసింగంపుఁగొదమతెఱంగున నెదురుగా మోహరించి నిలిచె.
తదనంతరంబ యుభయబలంబు లొండొరులం దార్కొని, పూర్వపశ్చిమసముద్రంబులతెఱంగున, నేనుఁగు లేనుంగు, లశ్వంబు లశ్వంబులును, రథంబులు రథంబులును, గాల్బంట్లు గాల్బంట్లును, సేనాపతులు సేనాపతులును, దొరలు దొరలుగాఁ దలపడి నెత్తుఱుటేరులు, మాంసపర్వతంబులు, మేదోమస్తిష్కపంకంబునం గలుగునట్లుగా ఖడ్గాఖడ్గి, దండాదండి, బాహాబాహి, కచాకచియుంగా బెనంగునెడ బభ్రువాహనుండు, తేరు కదియందోలించి, క్రీడి నుద్దేశించి, 'తండ్రివిగావున వందనంబు సేసెద. నేను వచ్చినయెడ మేరమీఱిన మాట లాడితివి. నాపరాక్రమంబుఁ జూడంగోరి యవ్విధంబునఁ బలికిన నేమి? నీతలపు నెఱవేర్చెద. ఇంక శంకింపంబనిలేదు. కార్ముకంబు గైకొనుము. నీవు గురుండవు గావున మున్నుగా బాణంబులు నాపై ప్రయోగింపుము.' అని పలుకు నవసరమ్మున ననుసాళ్వుం డక్కుమారు నెదిరించి, కార్ముకంబు గుడుసుపడం దిగి, తొమ్మిదియమ్ములు నిగుడించుటయు, నది సరకుఁ గొనక, చిత్రాంగదానందనుండు చిలుకఱెక్కలు గీలు కొలిపిన వాలికల కోరి కోలలు నూఱు ప్రయోగించిన, వాఁ డవి నడిత్రోవనే తునియలు గావించి, శతసహస్రసంఖ్యాతంబులగు కంకపత్రంబు లేసె. ఈ చందంబున సింహవిక్రముడైన యయ్యిరువురు శిలీముఖంబుల మేనులఁ గ్రుచ్చుచుఁ బూచిన మోదుగులతెఱంగునఁ దురంబు సేయు నవసరంబునఁ, బాండుపౌత్రుండు నాలుగునారాచంబుల నశ్వంబులను, నయిదుప్రదరంబుల సారథి శిరోధియు, నేడువాడితూపులఁ గార్ముకంబును, నెనిమిదివిశిఖంబుల రథంబునుం దుత్తునియలు గావించిన ననుసాళ్వుండు, నూతనశతాంగారూఢుండును, సజ్జీకృతకార్ముకుండునునై, చండకాండంబుల పాండుపౌత్రునిఁ దూలించుటయు నతండు రోషావేశంబున శస్త్రవర్షంబులు గురిసి క్రమ్మఱ విరథునిం గావించిన, ననుసాళ్వుండు గద కరంబునం గైకొని యెదురుగా నడిచిన, దొమ్మిదిచిలుకుటమ్ము లురంబున నాటించిన, నతండు రిమ్మ వట్టి భూతలమ్మున వ్రాలె. అంతఁ బ్రద్యుమ్నుండు విద్యుల్లతాసంకాశంబైన బాణాసనంబు మండలాకారంబుగా దిగిచి, ప్రదరవర్షంబులు గురియుచు ననుసాళ్వునకుఁ బ్రాపై యెదిరించిన, బభ్రువాహనుండు బాహువిజృంభణంబున లక్షలకొలందులగు తీక్ష్ణ<noinclude><references/></noinclude>
cflvogvdbmhi49k7dllo2vf7q8sbzek
554116
554115
2026-04-23T01:20:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554116
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ణంబులు మెఱయ, భద్రగజంబుమీఁదం గమకించుసింగంపుఁగొదమతెఱంగున నెదురుగా మోహరించి నిలిచె.
తదనంతరంబ యుభయబలంబు లొండొరులం దార్కొని, పూర్వపశ్చిమసముద్రంబులతెఱంగున, నేనుఁగు లేనుంగు, లశ్వంబు లశ్వంబులును, రథంబులు రథంబులును, గాల్బంట్లు గాల్బంట్లును, సేనాపతులు సేనాపతులును, దొరలు దొరలుగాఁ దలపడి నెత్తుఱుటేరులు, మాంసపర్వతంబులు, మేదోమస్తిష్కపంకంబునం గలుగునట్లుగా ఖడ్గాఖడ్గి, దండాదండి, బాహాబాహి, కచాకచియుంగా బెనంగునెడ బభ్రువాహనుండు, తేరు కదియందోలించి, క్రీడి నుద్దేశించి, 'తండ్రివిగావున వందనంబు సేసెద. నేను వచ్చినయెడ మేరమీఱిన మాట లాడితివి. నాపరాక్రమంబుఁ జూడంగోరి యవ్విధంబునఁ బలికిన నేమి? నీతలపు నెఱవేర్చెద. ఇంక శంకింపంబనిలేదు. కార్ముకంబు గైకొనుము. నీవు గురుండవు గావున మున్నుగా బాణంబులు నాపై ప్రయోగింపుము.' అని పలుకు నవసరమ్మున ననుసాళ్వుం డక్కుమారు నెదిరించి, కార్ముకంబు గుడుసుపడం దిగి, తొమ్మిదియమ్ములు నిగుడించుటయు, నది సరకుఁ గొనక, చిత్రాంగదానందనుండు చిలుకఱెక్కలు గీలు కొలిపిన వాలికల కోరి కోలలు నూఱు ప్రయోగించిన, వాఁ డవి నడిత్రోవనే తునియలు గావించి, శతసహస్రసంఖ్యాతంబులగు కంకపత్రంబు లేసె. ఈ చందంబున సింహవిక్రముడైన యయ్యిరువురు శిలీముఖంబుల మేనులఁ గ్రుచ్చుచుఁ బూచిన మోదుగులతెఱంగునఁ దురంబు సేయు నవసరంబునఁ, బాండుపౌత్రుండు నాలుగునారాచంబుల నశ్వంబులను, నయిదుప్రదరంబుల సారథి శిరోధియు, నేడువాడితూపులఁ గార్ముకంబును, నెనిమిదివిశిఖంబుల రథంబునుం దుత్తునియలు గావించిన ననుసాళ్వుండు, నూతనశతాంగారూఢుండును, సజ్జీకృతకార్ముకుండునునై, చండకాండంబుల పాండుపౌత్రునిఁ దూలించుటయు నతండు రోషావేశంబున శస్త్రవర్షంబులు గురిసి క్రమ్మఱ విరథునిం గావించిన, ననుసాళ్వుండు గద కరంబునం గైకొని యెదురుగా నడిచిన, దొమ్మిదిచిలుకుటమ్ము లురంబున నాటించిన, నతండు రిమ్మ వట్టి భూతలమ్మున వ్రాలె. అంతఁ బ్రద్యుమ్నుండు విద్యుల్లతాసంకాశంబైన బాణాసనంబు మండలాకారంబుగా దిగిచి, ప్రదరవర్షంబులు గురియుచు ననుసాళ్వునకుఁ బ్రాపై యెదిరించిన, బభ్రువాహనుండు బాహువిజృంభణంబున లక్షలకొలందులగు తీక్ష్ణ<noinclude><references/></noinclude>
7pshih0y0x469oadimnrpnio9vf9v2g
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/116
104
186379
554117
504603
2026-04-23T01:29:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554117
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బాణంబులు ప్రయోగించిన, శ్రీకృష్ణకుమారుం డనంగుం డనుపేరు యథార్థంబుగా నావరింపంబడి యేదు వెరిఁగిన చందంబునం గనపట్టి సమరవ్యాపారంబులు మఱచి, ముందువెనుక దోఁచక తిరుగుడుపడుచు నుండుసమయంబున
బార్థుకుమారుఁడు చతురంగబలంబులఁ గసి మసంగుటయు, బ్రద్యుమ్నుండు గొంతతడవునకుఁ దెలివిం జెంది, బభ్రువాహనుదేహంబును దనయట్లు శరమయంబు గావించి, యతనిసైన్యంబులోనం జొచ్చి, కఠోరంబులును, కాలదండోపమానంబులును, గనకపుంఖపుంఖితంబులును నై కాండంబు లకాండప్రళయజలధరంబుగతిం గురిసిన, మ్రగ్గు మదావళంబులును, బడుమావంతులును, గెడయురౌతులును, దన్నుకొనుగుఱ్ఱంబులును, నఱవఱలైన యరదంబులును, జచ్చిన రథికసారథులును, బొలిసిన వీరయోధులును, డుబుకులైన చక్రగదాకుంతతోమరముసలముద్గరపట్టిసాదిసాధనంబులును, జినిగిన మైమఱువులును, ఛిద్రంబులైన శిరస్త్రాణంబులును, బొడియైన చిందంబులును, గాలికింబోవు చామరంబులును, జూర్ణంబులైన భూషణంబులునుం
గలిగి, మృత్యువిహారస్థానంబునుం బోలె రణాంగణంబు దుర్నిరీక్ష్యంబయ్యె. అప్పుడు శాకినీఢాకినీ భూతబేతాళ కూషాండ బ్రహ్మరాక్షస ప్రేతసంఘంబులు చొరబడి గజకళేబరంబుల, హయకంకాళంబుల, వీరభటశరీరంబుల,
మంచిదిగా నేర్పఱిచి, చర్మములం దిత్తులుగా నొలిచి, జానుఘనపార్శ్వకంఠాదిస్థానంబులం గల వపలంబు కపాలపాత్రంబుల వడ్డించి, పునుకగిన్నియలఁ గ్రొత్తనెత్తురులు నించి, చుట్టంబులుం దామును, బంతులు దీఱి
యాకంఠపూర్తిగా మెసవి, చిట్టెముకలు చప్పరించి, లోనున్న మెదడు పీల్చి, రక్తపూరంబులు గళంగళం గ్రోలి, తృప్తిఁజెంది యాడందొడంగె. అం దొక్కఢాకిని కిరీటకుండలాభిరామంబులైన రాజులశిరంబులు పదియుఁ బదియు నైదు మింట కెగుర వైచి యచ్చనగండ్లాడె. ఒక్కశాకిని యేనుఁగుదంతంబు బిఱబిఱఁ ద్రిప్పుచుఁ జౌపదంబుల నటింపం దొడంగె. వేఱొక్కప్రేతం బేనుఁగుచర్మంబు ముసుంగు చెఱఁగుగా నీడి యభినయింపుచు దేశీయనాట్యంబు సేసె. ఒక్కబేతాళుండు భుజంబుల మేని చట్టంబులు దగిలించికొని సరిచేసి యాటలాడం దొడంగె. భూతగణంబులు కరతాళంబులు ఘటియింపఁ బూతనాగ్రహంబులు కపాలకుండలంబులు వదల శల్యహారంబులు పొదలఁ జకచక ఝుంకృతులతోఁ జిందులు ద్రొక్కం దొడంగె. ఒక్కభైరవుండు గండుమిగిలి దశదిశలు గగ్గోలుగా నార్చుచు దువాళింపం దొడంగె. ఇవ్విధంబున నతి<noinclude><references/></noinclude>
kco8b9uvkhjv1a3l7iw1vfg364k2rnc
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/117
104
186380
554118
504604
2026-04-23T01:40:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554118
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>భయంకరంబగు రణాంగణంబున నవక్రపరాక్రముండగు చక్రికుమారుఁడు విజృంభించె.
అయ్యవసరంబున బభ్రువాహనుండు తెప్పిఱి, రుక్మిణీనందనునకు నడ్డంబుగా రథంబు దఱిమించి, లెక్కకు మిక్కుటంబులైన యుక్కుటలుగులు చెక్కుటయు, గూఁటిలో నొదిఁగిన గువ్వలచందంబునఁ గొంతతడవు రౌక్మిణేయుండు తన్నుం గప్పినయట్ల తీవ్రవిశఖంబులఁ జిత్రాంగదాసుతునిం గప్పిన, నతండు గమకించి కృష్ణతనూభవురథంబుఁ బెక్కుశకలంబులుగా ఖండించిన, జనార్దనతనూజుండు వేఱొక్కరథం బధిరోహించిన నదియు ఖండించె.ఇవ్విధంబున నరగడియలో నిరువది యరదంబులు ద్రుంచిన, మీనకేతనుండు కపికేతనకుమారకుని కరలాఘవంబు గొనియాడుచు నతం డెక్కిన రథంబు తునుకలు సేసినఁ, బాండ్యపతి వేఱొక్కరథం బెక్కె, నదియుం ద్రుంచిన మఱియొక్కస్యందనం బధిరోహించె ఇత్తెఱంగున యాదవకుమారుండు త్రుంచిన యరదంబులు లెక్కపెట్టం దరంబు గాదయ్యె. అంత నయ్యిరువురు దివ్యాస్త్రయుద్ధంబు సేసి తనివి సనక, చక్రంబు, గదయుఁ, గత్తి, కేడెంబు, గండ్రగొడ్డలియుఁ, బ్రాసంబు, ముసలంబునుం, యురవళ్ళు మీరు పరవళ్ళు మెఱయ, సాదన మెలకువలు చూపఱకు నయనానందంబు సేయఁ, ద్రాసునం దూచినచందంబున నెక్కువతక్కువలు లేక పెనంగుచు, మనోగతంబులైన క్రోధాగ్నిజ్వాలలు వెలికుఱికెనో యను తెఱంగున గాయమ్ములం గ్రమ్ము రుధిరమ్ములు కుంకుమరసంబులకరణి నెమ్మేను నలంకరింపఁ, గోదండంబు లూఁదికొని, వింటికోటులం దమ మోములు చేర్చికొని, సొమ్మసిలియుండిరి. అపుడు బభ్రువాహనుండు గాండీవధ్వని చెవులం బడుటయు, మూర్ఛతెప్పిరి శరశరాసనంబులు గైకొని, తొల్లి కుశుండు శ్రీరామచంద్రునితో నెదిరింపం గడంగిన చందంబున గాండీవితో భండనంబు సేయఁ జనుదెంచె.
{{p|ac|fwb}}కుశలవోపాఖ్యానము</p>
అనిన విని, జనమేజయుండు జైమినిం గనుగొని, 'సీతాకుమారుండైన కుశునితో శ్రీరామచంద్రుం డేమిటికి యుద్ధంబు సేసె?' ననిన, మునీంద్రుండు<noinclude><references/></noinclude>
kxv9o9e0yg04zgr8u2pt01jl5sc73c0
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/118
104
186381
554119
504605
2026-04-23T03:35:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554119
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నరేంద్రునిం జూచి, దురితహరంబు శుభకరంబును, మనోరథప్రదంబును విఖ్యాతంబునైన కుశలవోపాఖ్యానంబు వినిపించెద. సావధానచిత్తుండవై విను (మనెను).
శ్రీరామభద్రుండు తండ్రిపంపునఁ బదునాలుగువత్సరంబు లరణ్యంబునం దపంబు గావించి, రావణ కుంభకర్ణ మేఘనాద ప్రముఖ రాక్షసుల సమయించి, తన ప్రవేశంబువలన ననలునిం బావనంబు జేసిన జానకీదేవిం జేపట్టి, సౌమిత్రి విభీషణ సుగ్రీవ జాంబవత్ప్రముఖులైన యోధవీరులు గొలువ, నయోధ్యానగరంబునకు వచ్చి, పురజను లెదుర్కొనఁ బుష్పకంబు డిగ్గి, వశిష్ఠమహాముని కభివాదనం బొనర్చి, తల్లులకు మ్రొక్కి, తనకు వందనంబు సేసిన భరత శత్రుఘ్నులఁ గౌగిటంఁ జేర్చి, సుమంత్రుండు మొదలగు మంత్రులసంతాపంబు దీఱ వారి వారి నాదరించి, పతివియోగదుఃఖితయు, నిజవియోగక్లేశితయు, నైన కౌసల్యకడకుం జని దండప్రణామం బొనర్చుటయు, దనయునిఁ గౌగిటం జేర్చి, గద్గదస్వరంబున, 'అన్నా, రాఘవా, మున్ను వశిష్ఠాదిమునులు నన్నుఁ జూచి నీకుమారుం డక్షయకుమారుం డాద్యుండు నప్రమేయుండు నచ్చేద్యుండు నభేద్యుండు నఖిలలోకాధీశ్వరుండు నని పలుకరించిన దబ్బఱగా నెంచి యుండితి. ఇప్పుడు జలధిబంధనంబును, దశముఖసంహారంబును జేసి, బ్రహ్మరుద్రాది దేవతాపూజితుండవై యేతెంచుట కతనఁ, దద్వాక్యంబులు నిజంబులని తోఁచె' నని పలుకు నంబ పలుకులకు శ్రీరఘువీరుండు సంతసించుచుఁ, బురందరవైభవంబున నయోధ్య వేంచేసి పట్టాభిషిక్తుండై రాజ్యపరిపాలనంబు సేయుచుండె. (అప్పుడు) వృక్షంబులు సర్వకాలంబులందును గిసలయకుసుమఫలభరితంబు లయ్యె. ధేనువు లపారంబుగా క్షీరంబు లీయం దొడంగె. తన పతి దొరకుటవలన ధరణీతరుణి నిశ్చలత్వంబు నొందె. తస్కరభయంబులు సున్నయయ్యె. పుత్రశోకంబులు లేవయ్యె. వైధవ్యంబులు రావయ్యె. ప్రాణులు రోగంబు లెఱుంగరైరి. నెల మూడు వానలు గురియసాగె. ధాత్రీతలంబు దున్నకయె పండె. ధారణ పోఁకకుఁ బుట్టెడయ్యె. ఈతిబాధ లొక్కటి లేవయ్యె. ఇవ్విధంబున శ్రీరామచంద్రుండు గుణత్రయంబుతోడంగూడిన పరతత్త్వంబు చందంబున, ననుజత్రితయంబుతోఁ గూడ జలధివలయవేల్లితంబైన జగతీతలంబు నేలుదు, సీతాసమేతంబుగా నిష్టోపభోగంబు లనుభవించుచుఁ, దొమ్మిదివేలసంవత్సరంబులు ధాత్రిపాలనంబు సేసి, 'యపుత్రులకు లోకంబు లేదుకదా' యని యూహించి, మనుజమాత్రుని<noinclude><references/></noinclude>
2cwsikspzcjer9dalru5af6a1guk3xq
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/119
104
186382
554120
504606
2026-04-23T03:44:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554120
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చందంబునఁ, బితౄణంబు దీఱు నుపాయంబు యోజన సేయుచుఁ బుత్రార్థియై, సంతాపంబునం గుందుచుండ, జానకి శ్రవణానక్షత్రచతుర్ధపాదంబునఁ జరమలగ్నంబున నజనిం బట్టణంబు వెడలింపం జాణుముహూర్తంబునఁ ప్రథమగర్భంబు దాల్చె. అంత నాలవమాసంబునఁ గడపటిదినంబు ప్రభాతకాలంబున లక్ష్మణుండు సీతాదేవిం గొనిపోయి యడవిలో విడిచివచ్చునట్లుగాఁ గలగని, దిగ్గనలేచి, మనంబునఁ గలంగుచు, సంధ్యాదివిధులు నిర్వర్తించి, గురుండైన వశిష్ఠమహామునితో నిశాచతుర్ధయామంబునం గన్న కలతెఱం గెఱింగించిన, నమ్మునీంద్రుండు రఘూద్వహుం జూచి, 'భావికార్యంబు గాక మానదు. శీఘ్రంబుగా జనకపుత్రికి బుంసవనాదికర్మంబు లాచరించి గర్భసంరక్షణంబు సేయందగు. తమ్మునిం బంపి సత్వరంబుగా జనకుని రప్పింపుము. ఐదవమాసంబునందు శుక్లపక్ష సప్తమీదివసంబున నిరువురకుఁ జంద్రతారాబలంబులు పొసంగియున్నయవి. నాఁటికి ధనుర్లగ్నంబున సీమంతపుంసవనంబులు సేయందగినయవి,' అని ముహూర్తనిర్ణయంబు సేసిన, రఘువీరుండు జనకునిం దోడ్కొని వచ్చుటకు సౌమిత్రిం బనిచి, వశిష్ఠవామదేవాదు లునిచిన లగ్నంబునఁ బండ్రెండుఘడియలదూరము చౌకంబుగా నింద్రనీల(మణి)మయంబులును, వజ్రఖచితంబులును, వైడూర్యనిర్మితంబులును, దీప్తకాంచినఘటితంబునైన స్థంభంబులు నిలిపి, పెండ్లిచవికె వేయించె.
తదనంతరంబ జనకమహీపతియు యుధాజిత్తు మొదలయిన బంధువులు వచ్చుటంజేసి, సప్తమీదినంబున వశిష్ఠమహాముని వామదేవాదులతోడంగూడ నాజ్యతిలచరుహోమంబులు గావించి, సీతాదేవికొప్పున ములుపంది ముండ్లతో సూత్రవేష్టంబు వేసి, గోధుమపూసలపేరు, పత్తికాయల పూసలపోరు, నాగమోక్తవిధానంబున నా జగదంబగళంబున నిలిపి, శంఖభేరీమృదంగఝల్లడిమురజగంభీరధ్వనులు దిశామండలంబు నిండ, బ్రాహ్మణులకుఁ గనక రత్నాంబర గజ తురగాది దానంబులు గావించి, మహీసురులతోడంగూడ, బాంధవులం బంతులు తీర్చి, బంగరు పళ్లెరంబుల బహువిధాన్నంబులు భుజియింపంజేసి, భూసురాశీర్వాదంబులు గైకొని, మహోత్సవంబు సేయుటయు, జనకమహారాజు తన కోరిక నెరవేఱుటవలన నానందభరితమానసుండై యమ్మహోత్సవంబు చూచి, తనయేలు రాజ్యంబునెల్ల నల్లున కొసంగి, విశ్వామిత్రునితోఁ గూడఁ దపోవనంబునకుం జనియె. కాకుత్స్థుండు సర్వ సర్వం<noinclude><references/></noinclude>
9qfehujq37ivud8q81qfmlwffr6kw0m
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/120
104
186383
554121
504607
2026-04-23T04:13:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554121
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సహావలయంబు నేకాతపత్రంబుగా నేలుచున్నయెడ, నొక్కనాఁ డేకాంతంబున జానకీకాంత కాంతునితో నిట్లనియె. 'వల్లభా! నా యుల్లంబున నొక్కకాంక్ష యున్నది. నీవు నెరవేర్పవలయు. గంగాతీరంబునం దపంబు సేయు తపసియిల్లాండ్రతోడంగూడ వనంబుల విహరింపుచు నుండఁ గోరెద,' అనిన, రావణాంతకుండు గుండె జల్లన 'నీ యొప్పులకుప్ప యింత యొప్పని కోరిక గోరునే? అని వగలం బొగులుచుఁ దొల్లి పదునాల్గుసంవత్సరంబు లడవులలో నిడుమలు పడినదియుం జాలక యిప్పుడు నదియ కోరె. నేను దొలుతఁ గన్నదుస్స్వప్నంబను లతిక కిది ఫలం బయ్యె'నని నిశ్చయించి, 'కొమ్మా, యటుల కానిమ్ము. రేపటికి నిన్ను వనంబులకుం బనిచెద నని యభ్యంతరమందిరంబున కయ్యింతి ననిచి యున్నసమయంబునఁ బ్రతీహారి యరుగుదెంచి, 'పౌరవృత్తాంతంబులు దెలుపుటకుఁ జారులు వచ్చియున్నా' రనిన, రఘువీరుండు వారలం బిలిపించిన నందఱు వందనంబులు సేసి, కేలుమోడ్చి వరుసగా నిలుచుటయు, 'నేఁటి కెవ్వియేని వింతలు గలవేని దెలుపుఁడు. నన్ను, నా తోఁబుట్టుగుల, జనకనందన నుద్దేశించి జను లేమనియెదరు? వెఱవక పలుకుం' డనినఁ, జారులు భయకంపితులయి, 'దేవా, తారకమంత్రంబునకు నీ వర్థము. పంచమహాపాతకంబు లనియెడు చీఁకట్లకు దేవర నామాక్షరంబులు చండభానుకిరణంబులు, త్రిలోకపావనుండవైన నిన్నుం దలంచిన యంతఁ బాపంబులె పుణ్యంబులగు. అట్టి దేవరతోడ దుష్టచిత్తులైన పౌరుల మాటలు పలుక నలికెదము. అయినను స్వామివార లడుగుటం జేసి వినిన మాట దాఁపక తెలిపెదము. ఈపురంబున నొక్కచాకిత మగండు తిరస్కారంబు సేసెనని యలిగి పుట్టినింటికిఁ బోయినం దాని తండ్రి, 'కూతురా, జనంబుల దేహంబులు సోఁకి మయిలవడిన కోకలు శుద్ధిసేసి, ధారణయోగ్యంబులు సేయునట్టి యుత్తమకులంబునకు నుయిలఁ గల్పించితివి. ఇంటిజగడం బింటిలోననే యడంపక యింతదూరంబు వచ్చుట తగవు కాదు.' అని కూఁతుం దోడ్కొని యల్లునికడకు వచ్చిన, వాఁడు నెయ్యివేసిన యగ్నిచందంబున భగ్గున మండుచు, 'నిల్లు వెడలి నాలుగుదినంబులు వేఱొకచోటనుండి, మగుడ నాకడకు వచ్చిన పడంతి నేలుటకు రక్కసుండు గొనిపోయిన సీతం దెచ్చికొనిన రాఘవుండనుగాను.' అని యన్నీచుండు దుర్భాషలు పలికినఁ, జెవులు మూసికొని వాని మామ కొమరితం దోడ్కొని యింటికిం బోయె. మలినాంబరంబులకు నిడగా మిగిలిన యెంగిలి<noinclude><references/></noinclude>
ebpzk553zuudsoenx2ab5de7lishm0i
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/121
104
186384
554122
504608
2026-04-23T05:35:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554122
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గంజి ద్రావుచుఁ బొట్టబోసుకొను నీచునియందు నిట్టి దుర్గుణంబులుగాని, మంచిమాట లేమిటికిం బొడము? ఐన నీవృత్తాంతంబు దేవర కెఱింగింప వచ్చితి' మనిన, మనుకులతిలకుండు మనంబు జల్లన, మేను మ్రాన్పడంఁ, గొంతతడ వుండి ధైర్యం బవలంబించి, చారులం బొమ్మని, యారాత్రి నాలవజాము బ్రహ్మకల్పంబు గడపినకరణిం గడపె.
అనంతరంబ వేగుటయు, భరత లక్ష్మణ శత్రుఘ్నులు సత్వరంబుగా రామ భూమీశ్వరు సమ్ముఖంబునకు వచ్చి చింతాక్రాంతుడును, వివర్ణవదనుండును, బాష్పాకులితనేత్రుండునునై, రాహుగ్రస్తుండైన పూర్ణచంద్రుండునుంబోలె, కాంతివిరహితుండై యున్న యన్న నవలోకించినంత మాత్రంబున, ఖిన్నులై తత్పాదంబులకు మ్రొక్కి పలుక వెఱచి, మెల్లమెల్లన 'జగద్వల్లభా,
దేవరపాదసేవయే సకలపురుషార్థంబునకుం శరణంబని యెంచునట్టి మాయెడం దయ చూడకుండుటకుఁ గారణంబేమి?' అనిన రఘువరుండు చారులవాక్యంబులు పలుకరించి, 'దుష్టపురుషునిచే నిందితంబగు వేదంబుకరణి, క్షుద్రజనులచేఁ బరమసాధ్వియగు సీత నిందంజెందె. అశనిపాతసంకాంశంబైన లోకాపవాదంబునం గలుగుభయంబు డెందంబు వ్రక్కలింపం దొడంగె. జన్మమరణభయభీతుండగు యోగిపురుషుండు మాయనుంబోలె పరమసాధ్వియైన సీతను బరిత్యజించెద'. అనిన విని భరతుండు భయకంపితస్వాంతుండై, 'అయ్యా, నీవంటి వివేకి యిట్లానతీయందగునె? కపిలధేనువును సంపాదించి, యంటుపడెననుచు నడవిలో విడువనడుచువాఁడునుం గలఁడె? తొలుత లంకాపురంబున దశముఖుని సంహరించిన పిమ్మట ననలంబులోనం జొచ్చి, బ్రహ్మపురందరబృందారకబృందంబులు వినుతింపఁ గందకుండ నున్న యిన్నారీమణిం జూచి,
యీ పతివ్రతాతిలకంబు తనకుఁ గోడలైన కతంబునఁ బుణ్యలోకంబులు గలిగె.
కాకున్నం బుత్రశోకంబున మృతిఁ బొందినవారలకు గతి కలుగ నేర్చునే? అని దేవ దానవ రాక్షస వానరవీరులు వినుచునుండ మన తండ్రియగు దశరథమహారాజు కొనియాడినట్టి శుభచరిత్రయు, నిక్ష్వాకుకులపవిత్రయు, సౌజన్యపాత్రయునగు జనకపుత్రికను, ఘోరమృగపక్షిగణాకీర్ణంబును, నిశాచరవిహారస్థానంబైన కాననంబునఁ ద్యజించుటకంటెఁ బాపంబు లేదు. కావున నిట్లు చేయుట యనుచితం' బనిన లక్ష్మణుఁడు రోషారుణలోచనుండై 'లోకమాత యగు సీత నిట్లాడిన నరాధమునిం బరిమొండెంబులు సేయవలయుఁగాని,<noinclude><references/></noinclude>
o5xwiz8m9gf6668n4dk250mr6ykog9w
554123
554122
2026-04-23T05:37:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554123
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గంజి ద్రావుచుఁ బొట్టబోసుకొను నీచునియందు నిట్టి దుర్గుణంబులుగాని, మంచిమాట లేమిటికిం బొడము? ఐన నీవృత్తాంతంబు దేవర కెఱింగింప వచ్చితి' మనిన, మనుకులతిలకుండు మనంబు జ ల్లన, మేను మ్రాన్పడఁ, గొంతతడ వుండి ధైర్యం బవలంబించి, చారులం బొమ్మని, యారాత్రి నాలవజాము బ్రహ్మకల్పంబు గడపినకరణిం గడపె.
అనంతరంబ వేగుటయు, భరత లక్ష్మణ శత్రుఘ్నులు సత్వరంబుగా రామ భూమీశ్వరు సమ్ముఖంబునకు వచ్చి చింతాక్రాంతుడును, వివర్ణవదనుండును, బాష్పాకులితనేత్రుండునునై, రాహుగ్రస్తుండైన పూర్ణచంద్రుండునుంబోలె, కాంతివిరహితుండై యున్న యన్న నవలోకించినంత మాత్రంబున, ఖిన్నులై తత్పాదంబులకు మ్రొక్కి పలుక వెఱచి, మెల్లమెల్లన 'జగద్వల్లభా,
దేవరపాదసేవయే సకలపురుషార్థంబునకుం శరణంబని యెంచునట్టి మాయెడం దయ చూడకుండుటకుఁ గారణంబేమి?' అనిన రఘువరుండు చారులవాక్యంబులు పలుకరించి, 'దుష్టపురుషునిచే నిందితంబగు వేదంబుకరణి, క్షుద్రజనులచేఁ బరమసాధ్వియగు సీత నిందంజెందె. అశనిపాతసంకాంశంబైన లోకాపవాదంబునం గలుగుభయంబు డెందంబు వ్రక్కలింపం దొడంగె. జన్మమరణభయభీతుండగు యోగిపురుషుండు మాయనుంబోలె పరమసాధ్వియైన సీతను బరిత్యజించెద'. అనిన విని భరతుండు భయకంపితస్వాంతుండై, 'అయ్యా, నీవంటి వివేకి యిట్లానతీయందగునె? కపిలధేనువును సంపాదించి, యంటుపడెననుచు నడవిలో విడువనడుచువాఁడునుం గలఁడె? తొలుత లంకాపురంబున దశముఖుని సంహరించిన పిమ్మట ననలంబులోనం జొచ్చి, బ్రహ్మపురందరబృందారకబృందంబులు వినుతింపఁ గందకుండ నున్న యిన్నారీమణిం జూచి,
యీ పతివ్రతాతిలకంబు తనకుఁ గోడలైన కతంబునఁ బుణ్యలోకంబులు గలిగె.
కాకున్నం బుత్రశోకంబున మృతిఁ బొందినవారలకు గతి కలుగ నేర్చునే? అని దేవ దానవ రాక్షస వానరవీరులు వినుచునుండ మన తండ్రియగు దశరథమహారాజు కొనియాడినట్టి శుభచరిత్రయు, నిక్ష్వాకుకులపవిత్రయు, సౌజన్యపాత్రయునగు జనకపుత్రికను, ఘోరమృగపక్షిగణాకీర్ణంబును, నిశాచరవిహారస్థానంబైన కాననంబునఁ ద్యజించుటకంటెఁ బాపంబు లేదు. కావున నిట్లు చేయుట యనుచితం' బనిన లక్ష్మణుఁడు రోషారుణలోచనుండై 'లోకమాత యగు సీత నిట్లాడిన నరాధమునిం బరిమొండెంబులు సేయవలయుఁగాని,<noinclude><references/></noinclude>
2mhv2nfahg7va70dg5n3azwe66gf7mw
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/122
104
186385
554124
504609
2026-04-23T05:44:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554124
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యాయంబఁ బరిత్యజింప నగునే?' అనుటయు, శత్రుఘ్నుండును నట్లన పలికిన, రాఘవుండు భరతాదులం జూచి, 'జానకి లోకపావని యగుట నే నెఱుంగుదు, నైన లోకాపవాదంబు పుట్టినయెడ నర్థంబునైన, ననుజులనైన, హితులనైన, దేహంబునైనఁ దృణంబుగాఁ ద్యజింతు ననినయెడ నిది యేమి యెచ్చు? మనవంశసంభవులును మానధనులునైన హరిశ్చంద్రాదులు తొల్లి కీర్తికొఱకుఁగా సర్వస్వంబునుఁ బరిత్యజించిరి. కీర్తిహీనులు జీవన్మృతులుగా నెఱుంగుఁడు. తొంటి రాజర్షులు తనువులైనం బరిత్యజించి కీర్తి సంపాదించిరి. అట్లగుటకతనఁ బావనచరిత్రయైన సీత నుజ్జగించి, కప్పసం బూడ్చిన సర్పంబు తెఱంగునఁ బ్రకాశించెద.' అనిన, రఘువీరుని తెగువ గనుంగొని భయంబున మాటాడ వెఱచి భరతశత్రుఘ్ను లప్పటికిం దలంకి చనిరి.
తదనంతరంబ దుఃఖంబునఁ జిక్కిన యన్నయొద్ద లక్ష్మణుం డొక్కరుండ నిలిచె. అప్పుడు కాకుత్స్థుండు లక్ష్మణుని జేరంబిలిచి, 'సీతను గంగాతీరంబున నడవిలో విడిచి రమ్ము. కాదేని యీఖడ్గంబుచే నాశిరంబుఁ దెగవ్రేయుము. జానకిం గానలో విడిచిన పాతకంబు నాకుంగాని నీకుం బనిలేదు'. అనిన విని భుజంగంబుకరణి నిట్టూర్పులు నిగిడించుచు, గమనోన్ముఖుండై
యన్నకు మ్రొక్కి, యరదంబు నెక్కి, యనేకంబులైన యపశకునంబులు గనుచు, సీతాంగన యుండు నంతఃపురంబునకుం జనుదెంచి, యయ్యంబ పాదారవిందంబులకుఁ బ్రణమిల్లి, 'తల్లీ, నీ వల్లభుండు నీ కోర్కె చెల్లింపందలంచె; విచ్చేయు' మనుటయు, నాయమ్మ తానొక్కసారి వేడినఁ, జనవిచ్చి పంపె. పెనిమిటికిం దనమీఁద నెంతఁ ప్రేమయో యని సంతసించుచు, శ్రీరామునిపాదుకలు మున్నుగాఁ గైకొని, రత్నభూషణంబులును, రజతకనకంబులు, నంబరంబులు, సుగంధంబులు, నానావిధంబులగు భక్ష్యంబులు హవణించి,
రథంబు మీఁద నునిచి, యత్తలకు మ్రొక్కి, కౌసల్యతో నిట్లనియె: 'నాదుకోరికి సమకూర్చుటకు సుమిత్రాసూనునిం గూడఁ బయనమ్ము సేసి, గంగాతీరవాసీనులయిన సువాసినులం జూచిరమ్మని మీకుమారుండు పనిచె' ననినఁ, గోసలరాజతనూజ భూమిజం జూచి, 'అమ్మా, కోమలాంగివి, ఘోరవనంబుల కెట్లు చనియెదవు? ఎండచే నెమ్ముగంబు గందు. తనులత వాఁడు. ఇదేమి కోరిక? మానుము'. అనుటయు, 'సమస్తభయనివారకుండయిన శ్రీ రఘువీరుండు నా మనంబున నుండుట కతన వంత రవంతయును రాదు. మీ కరుణ<noinclude><references/></noinclude>
a2q8kzpqhx42ym5wtj6hn2a3yp7d92i
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/123
104
186386
554125
504610
2026-04-23T05:54:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554125
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కలిగియుండ నశుభంబు లేశంబును లేదు. మనసు కొదవలు మాని నన్నుఁ బంపు' మనుటయు, నయ్యమ్మ యేమియు ననక యూరకుండినఁ దక్కినవారల వీడ్కొని యవ్వెలంది యుత్తరీయంబుఁ జక్కఁజెక్కి, పచ్చనిగుఱ్ఱంబులు పూన్చినరథంబు నెక్కి కదలుటయు, సుమిత్రాసూనుండు గద్గదస్వరంబుతో సారథిఁ జూచి (యిట్లనియె:)
{{p|ac|fwb}}లక్ష్మణుఁడు సీతాదేవిని వనంబునకుఁ గొనిపోవుట</p>
'అశ్వంబులు కన్నీరు నించి తలలు వంచుచున్నయవి. ఇదియేమి?' యనుటయు, 'దేవా, నే నశ్వహృదయంబు చక్కగా నెఱుంగుదును. సమరంబులయందు నిరాఘాటంబుగా సంచరించు నీఘోటకంబు లిట్లుండుటచే నెద్దియేని యొకదుర్దశ రాఁగలదని తోఁచుచున్నది. అయినను నానేర్పు జూడు' మని గుఱ్ఱంబుల గందంబులు దట్టి ధే యని వాగె సడలించిన, వాయువేగంబున నరదంబు పోవునెడ వాయసంబును, బాలభరద్వాజంబును, గరుడుండును గగనంబునఁ గనుపట్టె. కుందేలు, నక్క మొదలగు మృగంబులు రథంబునకు నడ్డంబుగాఁ బఱవం దొడంగె, అయ్యమ్మకు దక్షిణనేత్రం బదరె. అప్పుడు సీతాదేవి రామానుజునిం గనుంగొని, 'బెట్టుగా దుర్నిమిత్తంబులు దోఁచుచున్నయవి. తేవెట్టి కలంచినగతి నాయుల్లంబు దురపిల్లుచున్నయది. కరుణాసముద్రుండును, శౌర్యసముదీర్ణుండును నగు శ్రీరామభద్రునకు శుభంబు గలుగుం కాక. ఏవీరుఁడు ఖరదూషణాదిరాక్షసులం బదునాల్గువేల నొకముహూర్తంబున నుక్కడంచె, నేమేటి యెలయించుకొని పోవు మారీచుమస్తకంబు ఖండించె, నేమహానుభావుండు గొండలు పఱపించి సముద్రంబున సేతువు గట్టించె, నే జగజట్టి రావణ కుంభకర్ణాదుల వధియించి లోకత్రయంబున సౌఖ్యంబు సంపాదించె, నేదయానిధి విభీషణునకు శాశ్వతంబునగా లంకాసామ్రాజ్యం బొసంగె, శరణాగతసంరక్షణవ్రతుండును, రాజేంద్రుండును, ననంతకల్యాణగుణసాంద్రుండు నైన యాశ్రీరామచంద్రుం డయోధ్యానగరంబు నేలుచు, నాచంద్రతారకంబుగా సుఖంబున నుండుగాక' అని పలుకుచుఁ గొంత దవ్వు చని జానకీదేవి యుభయతీరంబులం బొడమిన తరులతానికరంబుల పుష్పవాసనలం బరిమి, శితంబులును, బూర్వసముద్రపరిచుంబితంబులునునై, సప్తశతప్రవాహముఖంబులం గనుపట్టుచుఁ జక్ర<noinclude><references/></noinclude>
5gw9olnp77f6m1ejonczva7ix5kjofu
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/124
104
186387
554126
504611
2026-04-23T06:02:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554126
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వాకపక్షమారుతసంచరద్వీచీకలాపయైన దివ్యాపగం గనుంగొని, వకుళతిలకసహకారసమేరుప్రియకమేదురం బైనతటంబున, జనకతనూజయు, సుమిత్రాసుతుండును రథంబు డిగ్గి, కువలయమనోహరంబును, సత్కవిసేవితంబును, సుధాప్రకాశంబునై, రాఘవుని కీర్తిం బోలుచున్న గంగం గనుంగొని, సంతసంబునం గొనియాడుచు, నావికుండు దెచ్చినయోడ నెక్కి, యవ్వలిగట్టునకుం బోయి, స్నానంబులు సేసి, ధౌతపరిధానంబులు ధరియించి పాదచారంబునఁ జీమలకుం దూఱఁగూడని కాఱడవి తెరువుఁ బట్టి, యకుంఠితంబులైన కంఠీరవకఠోరఘోషంబులం ఘూర్జిల్లు మదగజంబులు, జంబుకంబులు, వృకంబులు, వాలుమొకంబులు మొదలగు మెకంబుల భయంకరఘోషంబులును, నడవియీఁగల ఝంకృతులును, నిలకోళ్ల జీంకృతులును, వనమహిషంబుల భాంకృతులునుం జెవులు వ్రక్కలు సేయ, భీకరంబైన యక్కానంబు నవలోకించి భూపుత్రి సుమిత్రాపుత్రునితో నిట్లను, 'జీర్ణంబులు, నీరసంబులు, ఛాయ వర్ణితంబులు నైన వృక్షషండంబులచేఁ బ్రవేశింపం గూడని యరణ్యంబు గనుపట్టుచున్నయది. కాని, పావనంబులైన తపోవనంబులు గానరావు. వికటంబులు, దీక్ష్ణటంబులు నైన బలుసు, తుమ్మ, చండ్ర, వెణుతురు, కొరింద మొదలగు పొడలు గనుపట్టుచున్నవి. కాని, పుణ్యపేటికలైన యతివర మఠవాటికలు గానరావు. కాఱుచిచ్చు వలనంబెచ్చు పెరిఁగిన పొగ లెగయుచున్నయవి. కాని, హోమధూమంబులు గానరావు. సివంగులు చిఱుతపులులుం గనుపడుచున్నయవి కాని, మునిబాలకులు గానరారు. పాషాణకర్కశంబు లైన కాపథంబులు గనుపెట్టుచున్నయవి. కాని నడయాడుమార్గంబు గానరాదు. దశరథరాజనందను నెడఁబాయ నోర్చిన ననుబోటి పాపకర్మురాలికి మంచిది యేల కానవచ్చు?' నని సంతాపంబు నొందు సీతాసతి నవలోకించి సౌమిత్రి మొగంబు వాంచి, బాష్పపూరంబులు రాలుడు, 'దల్లీ, లోకాపవాదనిమిత్తంబుగా నిన్నుఁ గాంతారంబు నొందించి రమ్మని 'రాఘవుండు కృపావిహీనుండ నగు నన్నుం బనిచె' ననియెడి తీవ్రభాషణంబు లశనిపాతంబురీతిఁ గర్ణరంధ్రంబుల సోకుటయు, సురగాలిచేత వ్రాలిన కుసుమవల్లియుంబోలె మూర్ఛఁ జెంది పుడమిం బడి, యెడలెఱుంగక యున్న జనకపుత్రిం జూచి, సౌమిత్రి పటాంచలంబున విసరి, యుపచారంబులు సేయఁ దెలివి నొందక యుండుటయుఁ, 'ద్రికరణంబుగ శ్రీరామచంద్రుని చరణార<noinclude><references/></noinclude>
t6q22827blzdzw29r5rlqx8gg5swqy8
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/125
104
186388
554127
504612
2026-04-23T06:10:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554127
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విందంబులయందు నిజభక్తి గలవాఁడనేని, జనకజనందన బ్రతుకుం గాక' యని ప్రతిన సేయుటయుఁ గన్నులు తెఱచి యా యన్నులమిన్న యన్నువపక్షియుంబలె విలపించుచు (నిట్లనియె.)
{{p|ac|fwb}}లక్ష్మణునియొద్ద సీత దుఃఖించుట</p>
'అన్నా. నీ యన్నయు నీవును బదునాలుగేండ్లరణ్యంబునఁ గాపాడితిరి. ఇప్పు డిట్లు నట్టడవిలో దిగవిడువం దగునే? మఱఁదులలో నీవు నాయెడ భక్తివిశ్వాసములు గలవాఁడవు. తొల్లి దండకవనంబున నేఁ దెమ్మనిన పువ్వులు దెచ్చియిచ్చి, తనూభవునికైవడిం గాపాడిన దయాపరుండవగు నీ విట్టి నిర్దయత్వంబున కొడిగట్టితివే! అపకీర్తికి వెఱవని సుగ్రీవునకు, విభీషణునకు నిట్టిచెయిదంబులు సెల్లుంగాని, నీకుం జెల్లునే? తండ్రీ, యేమనఁగలదాన? నాపాపకర్మంబు నాకు వనవాసంబునం గోరికగా బరిణమించెఁ, గాకున్న నెల్లకార్యంబులు పరామర్శించి చేయు నీయన్న నిష్కారణంబుగా నన్నుఁ గాఱడవిలో విడిచి రమ్మనునె? మున్ను నానిమిత్తంబుగాఁ గొండవిల్కాని కోదండంబు బెండువలె విరిచివైచె. నాకొఱకు మారీచమృగంబు మస్తకంబు ఖండించె. నన్నుఁ దెచ్చుటకై పాథోనిధిం గపులచే బంధింపించి సేనల దాఁటించె. నన్నుం జెందుటకై పదిమొగంబుల రక్కసుని శిరంబులు ఖండించె. అట్టి గుణాభిరాముండును, దయారసధాముండునైన శ్రీరామచంద్రుండు, కాకులు దూఱని కాఱడవి నన్ను విడిచి రమ్మనియెనే? ఇది నా నోముఫలంబుగాని నీ వేమి చేయుదువు? మీ యన్న యానతి సేసితివి. మీ ప్రతిన నెఱవేరె. వేగంబ సాకేతనగరంబునకుఁ బొమ్ము', అని జనకనందిని సుమిత్రానందనుం గనుంగొని, 'తమ్ముడా, వశిష్ఠ విశ్వామిత్రులు జనక దశరథులుం జూచుచునుండ నాఁడు వివాహ సమయంబునఁ జిప్ప కూఁకటి యొప్పుమీఱుచు, రత్నఖచితంబులైన కర్ణభూషణంబులం బొలుపొందుచుఁ, దెలిదమ్మిరేకులం దెగడు కనుఁగవయు, బింబాధరంబును, మందహాసంబునం జెలువొందఁ బూర్ణేందుసన్నిభంబైన
రామదేవుని ముఖాంబుజంబు ధ్యానంబు సేయుచునుండంగలదాన. న న్నెడఁబాసిన విరహవేదన సైరింపంజాలక రాఘవుం డేతీవియలం గౌఁగిలించుకొనియెనో యయ్యడవితీఁగలలో నన్నుఁ ద్రోసిరమ్మనె. నాదురదృష్టంబు నేమందు? అత్తలకెల్లం గేలుమోడ్చితి ననుము. పూర్ణగర్భయు, నిరపరాధయు<noinclude><references/></noinclude>
435i3uzb9j14psiymnft6yhau69bpnd
554128
554127
2026-04-23T06:10:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554128
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విందంబులయందు నిజభక్తి గలవాఁడనేని, జనకజనందన బ్రతుకుం గాక' యని ప్రతిన సేయుటయుఁ గన్నులు తెఱచి యా యన్నులమిన్న యన్నువపక్షియుంబలె విలపించుచు (నిట్లనియె.)
{{p|ac|fwb}}లక్ష్మణునియొద్ద సీత దుఃఖించుట</p>
'అన్నా. నీ యన్నయు నీవును బదునాలుగేం డ్లరణ్యంబునఁ గాపాడితిరి. ఇప్పు డిట్లు నట్టడవిలో దిగవిడువం దగునే? మఱఁదులలో నీవు నాయెడ భక్తివిశ్వాసములు గలవాఁడవు. తొల్లి దండకవనంబున నేఁ దెమ్మనిన పువ్వులు దెచ్చియిచ్చి, తనూభవునికైవడిం గాపాడిన దయాపరుండవగు నీ విట్టి నిర్దయత్వంబున కొడిగట్టితివే! అపకీర్తికి వెఱవని సుగ్రీవునకు, విభీషణునకు నిట్టిచెయిదంబులు సెల్లుంగాని, నీకుం జెల్లునే? తండ్రీ, యేమనఁగలదాన? నాపాపకర్మంబు నాకు వనవాసంబునం గోరికగా బరిణమించెఁ, గాకున్న నెల్లకార్యంబులు పరామర్శించి చేయు నీయన్న నిష్కారణంబుగా నన్నుఁ గాఱడవిలో విడిచి రమ్మనునె? మున్ను నానిమిత్తంబుగాఁ గొండవిల్కాని కోదండంబు బెండువలె విరిచివైచె. నాకొఱకు మారీచమృగంబు మస్తకంబు ఖండించె. నన్నుఁ దెచ్చుటకై పాథోనిధిం గపులచే బంధింపించి సేనల దాఁటించె. నన్నుం జెందుటకై పదిమొగంబుల రక్కసుని శిరంబులు ఖండించె. అట్టి గుణాభిరాముండును, దయారసధాముండునైన శ్రీరామచంద్రుండు, కాకులు దూఱని కాఱడవి నన్ను విడిచి రమ్మనియెనే? ఇది నా నోముఫలంబుగాని నీ వేమి చేయుదువు? మీ యన్న యానతి సేసితివి. మీ ప్రతిన నెఱవేరె. వేగంబ సాకేతనగరంబునకుఁ బొమ్ము', అని జనకనందిని సుమిత్రానందనుం గనుంగొని, 'తమ్ముడా, వశిష్ఠ విశ్వామిత్రులు జనక దశరథులుం జూచుచునుండ నాఁడు వివాహ సమయంబునఁ జిప్ప కూఁకటి యొప్పుమీఱుచు, రత్నఖచితంబులైన కర్ణభూషణంబులం బొలుపొందుచుఁ, దెలిదమ్మిరేకులం దెగడు కనుఁగవయు, బింబాధరంబును, మందహాసంబునం జెలువొందఁ బూర్ణేందుసన్నిభంబైన
రామదేవుని ముఖాంబుజంబు ధ్యానంబు సేయుచునుండంగలదాన. న న్నెడఁబాసిన విరహవేదన సైరింపంజాలక రాఘవుం డేతీవియలం గౌఁగిలించుకొనియెనో యయ్యడవితీఁగలలో నన్నుఁ ద్రోసిరమ్మనె. నాదురదృష్టంబు నేమందు? అత్తలకెల్లం గేలుమోడ్చితి ననుము. పూర్ణగర్భయు, నిరపరాధయు<noinclude><references/></noinclude>
43si7i8igeytvfufzncqezdv6vnzngx
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/126
104
186389
554129
504613
2026-04-23T06:17:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554129
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నైన జానకిని నిష్కారణంబుగా నట్టడవిలో విడిచి వచ్చితి ననుము. వత్సా, నీకు మేలగుఁగాక! భరత శత్రుఘ్నుల నడిగితి ననుము'. అని పలవించు భూమినందనం గనుంగొని లక్ష్మణుండు, 'సాధ్వీశిరోమణి, దైవయోగం బిటులుండె. ఏల వగచెదవు? అల్లవే తాపసాశ్రమంబులు గనిపించుచున్నయవి. భాగీరథియు, భూమిదేవియు, వనదేవతలు నిన్ను రక్షించుదురుగాక! నీయోర్పును, నీపాతివ్రత్యంబును నిన్ను గాపాడు'నని యూఱడం బలికి, కన్నీరు ఱెప్పల నప్పళించుచుఁ, బ్రదక్షిణంబు సేసి, లక్ష్మణుం డలంఘనీయంబైన రాఘవుని శాసనంబులకుం దలంపుచుఁ, దిరిగితిరిగి చూచుచుఁ, బశుబాలకుండు దోలుకొనిపోవ నంబారవంబు సేయుచు వత్సంబు విడువ నోపని ధేనువుతెఱంగునఁ బలవరించుచు, జనకరాజనందన చూచుచుండ, హుటాహుటి రథంబుఁ దోలుకొని రామానుజుండు దవ్వుగా నరిగి యదృష్టిగోచరుం డగుచు నయోధ్యకుం జనియె.
(ఇచట) ధరణిపుత్రియు నరణ్యరోదనంబు సేయుచు, మూర్ఛ నొంది పుడమిపై వ్రాలినం బక్షులు రెక్కలచే నీడ గల్పించుచు నంబరంబునం దిరిగె. చమరీమృగంబులు వాలంబుల నల్లనల్లన విసరె. సింహ శరభ శార్దూలాదులు చుట్టునుం బరివేష్టించి కాపాడుచునుండె. మదపుటేనుంగులు కరశీకరంబులచే జలధూమ్రంబులు నించె. భానుండు కిరణంబులవేడిమి సోకకుండ వెన్నెలకరణి నెండగాసె. వాయుదేవుండు శైత్యమాంద్యసౌరభంబులతో మెల్లమెల్లన
విసరుచు సేదదీర్చె.
{{p|ac|fwb}}వాల్మీకి సీతను తనయాశ్రమంబునకుఁ గొనిపోవుట</p>
అయ్యవసరంబున వేదవేదాంగకోవిదుండును, దత్తవిశారదుండునునైన వాల్మీకి నిఖిలవిద్యారహస్యంబులు దెలిసిన శిష్యులు పెక్కండ్రు పరివేష్టింప, యాగార్థంబుగా సమిధలును, యూపంబులును, దర్భలు, గుసుమంబులుఁ గందమూలంబులు సంపాదించుటకై యయ్యడవికిం జనుదెంచి, యప్పరమపావనిం గనుంగొని 'అమ్మా, నీ వెవ్వతెవు? ఏకతంబున నేకతంబ యివ్వనంబున శోకించెదవు?' అను నమ్ముని యాదరణవాక్యంబులకు వేసవియెడం గొట్టువడిన మయూరి మేఘగర్జితంబునకుం బలె, నాహ్లాదంబు నొంది, వీడియున్న ధమ్మిల్లంబు<noinclude><references/></noinclude>
rmxj71ejv2n1hng6s0u1d7fb7y6zw0q
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/127
104
186390
554147
504614
2026-04-23T08:24:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554147
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చక్కనొత్తి గద్గదస్వరంబున 'అయ్యా, యేను మిథిలాపతి పుత్రికను. నావల్లభుండు శ్రీరాముండు, లోకాపవాదభయంబునఁ గల్లనిజంబులు విచారింపక కానలకు వెడలనడిచె. ప్రాణంబులు త్యజింపఁజూచిన భ్రూణహత్యాదోషంబు వచ్చుచున్నయది. కావున సాహసంబు సేయనెంచినదానం గాను. ఏను జేసిన పురాకృతకర్మంబున నిటువంటి దుర్దశ ప్రాప్తంబయ్యె. నిన్నుం జూచిన మజ్జనకుంబోలె నున్నది. నన్ను రక్షింపు' మని చరణంబుల వ్రాలిన, వాల్మీకి దయాకులితమానసుండై, 'సాధ్వీ, శోకింపకుము. మీతండ్రియగు జనకునకు నేను సఖుండ. నీవు శీఘ్రంబ బలపరాక్రమసంపన్నులు, నుత్తమచరితులు నైన పుత్రుల నిరువురం గనియెదవు. గర్భక్షోభంబుగాఁ దెగువసేయం దలంతురే!' అని యోదార్చి జానకిం దోడ్కొని యాశ్రమంబునకుం జనియె.
{{p|ac|fwb}}కుశలవుల జన్మవృత్తాంతము</p>
తదనంతరంబ యా వాల్మీకి మునీంద్రుఁడు మునిభామల రావించి, యా సతీమణి గర్భంబునకు హానిరాకుండం గాపాడుండని యాజ్ఞాపించిన, వారలు జానకినిఁ బర్ణశాలలోనికిం దోడ్కొనిపోయి, నివాతస్థలంబున దర్భలపయిం బఱచిన కృష్ణాజినంబుపై నునిచి, పాదపద్మంబులఁ గాడిన ముండ్లు మెల్లనఁ దివిచి, వెచ్చనికరంబులఁ బాదంబులం గాచి, కొంచెంబుగాఁ గారనూనె
పంకించి, తల చిక్కు వాపి ముడిచి, చెక్కుటద్దంబుల గాఱు కన్నీరు పయ్యెదచెఱంగుతో నొత్తి, మొగంబు పుడికి, పుడమిపయిం బొరలాడిన కతంబున దువ్వయైన వలువ పరిహరించి, పలుచని నారచీరలు గట్టి, కందమూలంబులు, నడవికూరలు లఘుతరంబుగా నారగింపంజేసి, పూటపూఁటకు నుపచారంబు లొనర్చుచుఁ, బోషింప ననుదినంబును బుణ్యకథాప్రసంగంబులఁ బ్రొద్దులు గడపఁ, దొమ్మిదినెల లతిక్రమించుటయు, సౌమ్యగృహంబు లైదు సూర్యునిం గూడక యుచ్ఛకేంద్రస్థానంబుల వెలుంగుచున్న శుభలగ్నంబున జనకపుత్రిక యిరువురు కొమరులం గనియె. అప్పుడు దిక్కులు ప్రసన్నంబులయ్యె. పుష్పవృష్టి గురిసె. అగ్ని ప్రదక్షిణార్చులం గనుపట్టె. పరిమళమారుతంబులు వీచె. దివ్యదుందుభులు మొరసె. అప్పుడు తాపసాంగన లవ్వృత్తాంతం బెఱింగింప చటువులం బనుచుటయు, వార 'లక్క యమకడ బిడ్డలం గనియె' నని చెప్పిన,<noinclude><references/></noinclude>
ppl8maoh0ill9xm5iknrfttevf9j6p4
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/128
104
186391
554154
504615
2026-04-23T09:07:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554154
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వేగంబ వచ్చి సీతాసుతులం జూచి, సంతసంబున నుప్పొంగి, సూర్యవైశ్వానరతేజస్కులైన కవలకుఁ గుశలవంబులచే నభిమంత్రించి, రక్ష యొనర్చి జాతకర్మంబు నిర్వర్తించి, కుశలవులను నామకరణంబు సేసి పెనిచిన, వారలును ననుదినప్రవర్థమానులై పెరిగి, కరికలభంబుల భంగి నొప్పుటయు, వాచంయమశ్రేష్ఠుండైన వాల్మీకి చౌలంబు సేసి, యుపనయనమ్ము గావించి, యమ్మహోత్సవంబునకుఁ గామధేనువుం దలంచుటయుఁ, దోడనె వచ్చి జీలకఱ్ఱ సన్నబియ్యంపుటస్నంపురాసులు, నొలుపుఁ బప్పులతిప్పులు, నేతిదొరువులు, పిండివంటలకొండలు, కూరలరాసులు, పానకాలకాలువలు, పనసరసాల కదళీ ఖర్జూరాది ఫలసమూహంబులును నిర్మించిన, బంగరుపళ్లెరంబుల నునిచి, బంతులు సాగించి, మునిసతులు వడ్డింప, షడ్రసోపేతంబుగా నారగించి, మునీంద్రు లాశీర్వాదంబులు గావించి, కర్పూరతాంబూలంబులు బహుమానంబులు గైకొనిపోవుటయు, సూర్యచంద్రులుంబోలెఁ దేజోవిరాజితులై, యక్కుమారులు నాలుగువేదంబులు, షడంగంబులు, నానాపురాణంబులు, నాగమంబులు నధికరింపఁజేసి, ధనుర్వేదంబు సాంగంబుగా నేర్పి, దివ్యాస్త్రసంధానంబు నాకర్షణంబు, నుపసంహారంబును, లాఘవలక్ష్యశుద్ధిం జిత్రత్వదృఢత్వంబులును దెలియఁజేసి, సంగీతశాస్త్రంబు సమర్మంబుగాఁ దెలిపి, శ్రీమద్రామాయణం బుపదేశించుటయు, నేకసంథాగ్రహణంబున గ్రహియించి కుశలవులు వీణయు, దాళంబునుం గైకొని నానారాగంబుల స్వరమైత్రియు, విన్యాసవిశేషంబులు, నారోహావరోహణక్రమంబులు, లయకాలంబునుం దెలిసి వీనులవిందుగా నమృతంపుసోనలు గురియ, నెండినమ్రాకులు చిగురింప, ఱాళ్ళు కరగంగ, రామాయణంబు గానంబు సేయుచు, మునికుమారులతో నడవికిం జని, కందమూలఫలంబులు, తేనియలు, కుసుమంబులు, మధురోదకంబులు దెచ్చి యొసంగఁ, కొడుకులం జూచి శోకంబు మాని సీతాంగన యాశ్రమంబున సుఖంబుండె.
{{p|ac|fwb}}శ్రీరాముఁ డశ్వమేధము చేయ హయంబును విడుచుట</p>
తదనంతరంబ, శ్రీరామచంద్రుఁ డయోధ్యానగరంబున రాజ్యపరిపాలనంబు సేయుచు, బ్రహ్మకు నాలవమనుమఁడైన రావణునిం జంపుటవలననైన బ్రహ్మహత్యా దోషంబు నివారింపం దలంచి, హయమేధంబు సేయు తలంపున, ననుజ పురోహిత మిత్రామాత్య సామంతరాజులు గొలువ నిండోలగంబునఁ గూర్చుండి,<noinclude><references/></noinclude>
1udibhcn7cuprwsyei162mhpq41aw4s
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/129
104
186392
554156
504616
2026-04-23T09:17:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554156
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వశిష్ఠ వామదేవ గాలవ గాధేయాదులం జూచి, 'యశ్వమేధంబువలన బ్రహ్మహత్యాదోషంబు తొలఁగునను శ్రుతివచనంబు వినంబడుచున్నయది. ఆయాగంబు సేయు విధానంబు సవిస్తరంబుగా నెఱింగింపుఁˈడనిన, వశిష్ఠుండు 'నరేంద్రా, అశ్వమేధంబు సేయుట బహుప్రయాసంబు. గోక్షీరవర్ణంబైన శరీరంబును, కుంకుమంబునుంబలెఁ గెంపుఁజాయ గులుకు కంఠంబును, గనకవర్ణం బైన వాలంబును, నల్లనిచెవియునుంగల యశ్వంబును, శౌర్యనిధులైన
యోధులం గూర్చి, యథేచ్ఛముగా విహరింప విడువవలయును. విద్యాతపోధనులైన ఋత్విజులు గావలయు. వారలకు నొక్కొక్కనికి యొక్కగజంబు, నొక్కయరదంబు, నలుగురుకాలుబంట్లు, నూఱుగుఱ్ఱంబులు, నన్నిధేనువులు, వేయిబారువులధనంబు, నలుతుముముత్యాలును దక్షిణలుగా నొసంగం దగు. భార్య లేని వారలకు యాగంబున నధికారంబు లేదు. పత్నీసమేతంబుగా దీక్షించి, యసిధారావ్రతంబుగా హయమేధంబు నెఱవేర్పవలయు.' అనిన, నినకులతిలకుండు బంగారుచే సీతారూపంబు గావించి, మునుల యనుమతి గైకొని, యీ చెప్పిన లక్షణంబులుగల హయంబును దనలాయంబున వెదకి తెప్పించి, విహితదక్షిణ లొసంగి, వేవురుఋత్విజులం గూర్చి, జాతరూపసీతాసమేతుండై దీక్ష వహించి, చామరరత్నకింకిణీ చిత్రమాల్య పరిధాన గంధకస్తూరికాద్యనులేపనపూజితంబైన వాణినిటలంబున, 'మిత్రకులాగ్రణియు, దివిజస్తుత్యపరాక్రముండును, వీరమాతయగు కౌసల్యాదేవికిం బుత్రుండునైన రఘువీరుండు విడిచిన యాగీతురంగంబు నుర్వీతలంబులో శౌర్యసాహససమానులైన రాజకుమారులు గలరేని పట్టి కట్టుం' డని లిఖించిన కాంచనపట్టంబు గట్టి, వాద్యఘోషంబులతోఁ బ్రదక్షిణంబు సేసి, మ్రొక్కు సమయంబున, నిత్యశత్రుఘ్నుండైన శత్రుఘ్నుం డక్షౌహిణీత్రయంబుతో వచ్చి యన్నకు మ్రొక్కిన, దీవించి, కౌఁగిటం గదియించి, 'హయసంరక్షణంబు సేయుము. అష్టదిక్పాలకులు, హరిహరబ్రహ్మాదులు విరోధించిరేనియు నిరోధించి జయంబు సేకొను'మని పంపుటయుఁ, గ్రతుఘోటంబు నిరాఘాటంబుగా నిఖిలదేశంబులు దాఁటిపోవునెడఁ గొందఱు నరేంద్రు లెడసొచ్చి తదీయపాలస్థితంబైన పత్రికం జూచి, చేతులు మొగిడ్చి కొలిచిరా నయ్యశ్వంబు వాల్మీక్యాశ్రమసమీపకాననంబునం బ్రవేశించె.<noinclude><references/></noinclude>
psdhh3sg8hvabna26asx6xj327jqxmd
554178
554156
2026-04-23T11:24:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554178
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వశిష్ఠ వామదేవ గాలవ గాధేయాదులం జూచి, 'యశ్వమేధంబువలన బ్రహ్మహత్యాదోషంబు తొలఁగునను శ్రుతివచనంబు వినంబడుచున్నయది. ఆయాగంబు సేయు విధానంబు సవిస్తరంబుగా నెఱింగింపుఁˈడనిన, వశిష్ఠుండు 'నరేంద్రా, అశ్వమేధంబు సేయుట బహుప్రయాసంబు. గోక్షీరవర్ణంబైన శరీరంబును, కుంకుమంబునుంబలెఁ గెంపుఁజాయ గులుకు కంఠంబును, గనకవర్ణం బైన వాలంబును, నల్లనిచెవియునుంగల యశ్వంబును, శౌర్యనిధులైన యోధులం గూర్చి, యథేచ్ఛముగా విహరింప విడువవలయును. విద్యాతపోధనులైన ఋత్విజులు గావలయు. వారలకు నొక్కొక్కనికి యొక్కగజంబు, నొక్కయరదంబు, నలుగురుకాలుబంట్లు, నూఱుగుఱ్ఱంబులు, నన్నిధేనువులు, వేయిబారువులధనంబు, నలుతుముముత్యాలును దక్షిణలుగా నొసంగం దగు. భార్య లేని వారలకు యాగంబున నధికారంబు లేదు. పత్నీసమేతంబుగా దీక్షించి, యసిధారావ్రతంబుగా హయమేధంబు నెఱవేర్పవలయు.' అనిన, నినకులతిలకుండు బంగారుచే సీతారూపంబు గావించి, మునుల యనుమతి గైకొని, యీ చెప్పిన లక్షణంబులుగల హయంబును దనలాయంబున వెదకి తెప్పించి, విహితదక్షిణ లొసంగి, వేవురుఋత్విజులం గూర్చి, జాతరూపసీతాసమేతుండై దీక్ష వహించి, చామరరత్నకింకిణీ చిత్రమాల్య పరిధాన గంధకస్తూరికాద్యనులేపనపూజితంబైన వాణినిటలంబున, 'మిత్రకులాగ్రణియు, దివిజస్తుత్యపరాక్రముండును, వీరమాతయగు కౌసల్యాదేవికిం బుత్రుండునైన రఘువీరుండు విడిచిన యాగీతురంగంబు నుర్వీతలంబులో శౌర్యసాహససమానులైన రాజకుమారులు గలరేని పట్టి కట్టుం' డని లిఖించిన కాంచనపట్టంబు గట్టి, వాద్యఘోషంబులతోఁ బ్రదక్షిణంబు సేసి, మ్రొక్కు సమయంబున, నిత్యశత్రుఘ్నుండైన శత్రుఘ్నుం డక్షౌహిణీత్రయంబుతో వచ్చి యన్నకు మ్రొక్కిన, దీవించి, కౌఁగిటం గదియించి, 'హయసంరక్షణంబు సేయుము. అష్టదిక్పాలకులు, హరిహరబ్రహ్మాదులు విరోధించిరేనియు నిరోధించి జయంబు సేకొను'మని పంపుటయుఁ, గ్రతుఘోటంబు నిరాఘాటంబుగా నిఖిలదేశంబులు దాఁటిపోవునెడఁ గొందఱు నరేంద్రు లెడసొచ్చి తదీయపాలస్థితంబైన పత్రికం జూచి, చేతులు మొగిడ్చి కొలిచిరా నయ్యశ్వంబు వాల్మీక్యాశ్రమసమీపకాననంబునం బ్రవేశించె.<noinclude><references/></noinclude>
a9yf70qzc35unananmwgi2cm7mac9xq
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/130
104
186393
554177
504617
2026-04-23T11:23:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554177
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}యాగీ యాశ్వమునకై లవశత్రుఘ్నులు పోరాడుట</p>
ఆసమయంబున వల్మీకభవుండు వరుణపురంబున యాగంబు సేయుటకై చనియుండె. అపుడు వేల్పుటేటితటంబున శ్యామలంబులు కోమలంబులు నైన దూర్వాదళంబులు మేయుచు దర్శనీయంబైన యాగహయంబు సంచరింపం జూచిన బ్రహ్మచారులును, సజ్జీకృతకార్ముకుండై యయ్యాశ్రమకాననంబు రేపగలు రక్షించుచుండు లవునకుం జూపుటయు, నతండును దాని నిటలంబునం గట్టిన హేమపట్టికను లిఖించిన బిరుదాక్షరంబులు చదివికొని, 'బళి బళీ! రాఘవునిం గన్నతల్లి కౌసల్య వీరమాతయఁట. కుశలవులం గన్న సీతాంగన గొడ్డువోయెఁ గాఁబోలు' నని, పకపక నవ్వి, యత్తురంగంబుపయిం దన యుత్తరీయంబు వైచి యీడ్చతెచ్చి, యాశ్రమసమీపంబున నున్న కదళీతరువునం గట్టివేయుటయు, విప్రకుమారు లతనిం జూచి 'నిరర్థకవైరంబు లేమిటికి? దీనివెంబడి సైన్యంబు లల్లవె కనుంగొనుము.' నావుడు సీతాతనయుండు మునితనయులం జూచి, 'మీకు రాజధర్మంబు తెలియదు. అని మొసం గినిసి పగఱం బరిమార్చుటయొండె. లేకయున్న సమరహితుండనై కైవల్యంబు గాంచుట యొండె, గాక వేఱె కలదా?' అని పలుకునంతలో నశ్వరక్షకులైన భటవీరులు కొందఱు వేగంబ పఱతెంచి, 'యెవ్వండురా, ఘోటకంబునుఁ బట్టిన దుండగీఁ' డనిన, విని సీతాకుమారుండు 'యజ్ఞతురంగంబును బట్టినవాఁడు లవుండు. ఏమిటికి రిత్తనొచ్చెదరు? పొండు పొండ’నిన నవ్వి యవ్వీరులు, 'బాలకా, పొమ్ము పొమ్మ'ని యనాదరణంబుగా సైంధవమోక్షణంబు సేయ, లవుం 'డుండుండ' నుచు, వారల కరంబులు, శరంబులఁ దునియనేసిన, నబ్బలంబులు మెరయ, ముద్గరచక్రతోమరంబులు ప్రయోగించిన, నతండు గోదావరిలోఁ గ్రుంకిన జనుండు పాపంబుల రూపణంచు చందంబునం జూర్ణంబులు చేసిన, నవ్వృత్తాంతంబు విని శత్రుఘ్నుండు తేరు గదియం దోలించిన, లవుండు నిశ్శంకుండై మాహేశ్వరాస్త్రంబు వింటం దొడిగి శరపరంపరలచే విపక్షుపక్షంబు గవాక్షంబుగాఁ జేయుటయు, మూర్ఛఁ జెంది లవణాసురాంతకుండు క్రమ్మఱం
దెలిసి, లవుని ఫాలతలంబున మూఁడువాఁడితూపులు సొనుపుటయుఁ, దామరమొగ్గలు వైచిన చందంబున నొవ్వక నవ్వుచు, నయ్యమ్ములు దివిచివైచి<noinclude><references/></noinclude>
59ww1az0n7gn9p2f2qwtpnkee6du1al
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/131
104
186394
554182
504618
2026-04-23T11:33:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554182
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కుశానుజుండు పినతండ్రిం జూచి, రోషభీషణాకారుండై ధనుర్గుణారావంబున దిగంతరాళంబులు పగులం జేయుచు, నొక్కవిశిఖంబునం గేతనంబును, సూతుని నాలుగుసాయకంబులఁ, జక్రరక్షకుల నన్నియబాణంబుల రథ్యంబులం ద్రుంచి, యొక్కభల్లంబున హృదయంబు భేదించి యార్చుటయు, లక్ష్మణానుజుండు కన్నులం గెంపు గులుక నేయస్త్రంబుచే లవణాసురుం దునిమె, నయ్యస్త్రంబు వింట సంధించి, 'వత్సా, యిది యమోఘంబైన బాణంబు. సంగ్రామంబునకుం దొలంగి పొమ్ము, నీమీఁది యంతఃకరణంబునం బలికితి' ననిన, సీతాకుమారుండు తనమనంబున 'మాయన్న కుశుం డుండెనేని యీయస్త్రంబు చూర్ణంబు సేయు, నైనను మాతల్లియగు సీతాదేవి పాతివ్రత్యధర్మంబువలన నిబ్బాణంబు ఖండించెద' నని ప్రతిన సేసి, యెదురు నిలిచి, శత్రుఘ్నుం డేసిన యస్త్రంబుపై వేఱొక్కయస్త్రంబు ప్రయోగించి ఖండించిన, సగంబు ఖండితంబై పుడమిఁ బడియె. మిగిలిన సగంబు నెగసి చని విల్లు ఖండించి, వక్షస్థలంబు దూరి భూమింగాడిన, నిశ్చేష్టితుండు రక్తసిక్తాంగుండునైన లవుండు
పుడమింబడిన, భేరీ శంఖ మృదంగ పటహ ఢక్కారవంబులు సెలంగ సింహనాదంబులు సేయుచు, హతశేషులైన సైనికులు తురంగంబు గొనిపోయిన, శౌర్యనిధానుండైన శత్రుఘ్నుండు కుశానుజుం గాంచి, బాణఘాతసంతాపంబు మాన, మేనం బొదివి, యెత్తుకొని, 'యిక్కుమారుండు రాఘవప్రతిబింబంబుకరణి నున్నవాఁడు. అతనికిం జూపవలయు' నని తనువునం దొరఁగు రుధిరంబును సలిలపూరంబులం గడిగి, రథంబున నబ్బాలు నిడికొని, మఘాశ్వం బేగుదెసకుం జనియె.
{{p|ac|fwb}}సీత లవుని దలఁచి విచారించుట</p>
అంత నక్కడ భూపుత్రి తనయాత్మగతంబున 'నక్కటా! లవుం డాకొనియె, నీవేళకు వచ్చినవాఁడు కాఁ' డని శోకంబునం బొక్కుచుండ, మునికుమారులు పఱతెంచి, 'యమ్మా, నీకొడుకు మఘతురంగంబును బట్టి మార్కొను నరిబలంబులం గనుపుకొట్టి యొక్కమహారథికు నెదిరించిన, నతండు విల్లు ద్రుంచి మూర్ఛ నొందించి పట్టికొనిపోవుచున్నవాఁ డ' నిన, మేఘగర్జితంబునకుం భయపడు మరాళబాలిక పోలికఁ దనయుం బేర్కొని బహువిధంబుల నడలచునుండం, గుశుం డంతకంమున్న మూల ఫలంబులు<noinclude><references/></noinclude>
5se3b78yji22igo0vzghec72mvvyx9s
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/132
104
186395
554183
504619
2026-04-23T11:43:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554183
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సమిత్కుశపత్రపుష్పంబులునుం దెచ్చుటకై వనంబునకుం జనినయెడ నెడమక న్నదరెం గావున, మనంబున భయంబు నొంది, తోడనె సమరవిజయసూచకంబులగు నిమిత్తంబులు గనుపట్టిన 'నెద్దియేనియు నొక్కయుద్ధంబును, దాన జయంబునుం గలుగు' నని సంభ్రమించుచు వచ్చి, ధనంబు గోలుపోయిన చందంబునఁ జిన్నవోయిన ముఖంబుతోఁ జెన్ను దొఱంగియున్న తల్లికి
వందనంబు సేసి, 'యమ్మా, నీమనంబున నింత యుమ్మలిక యేమిటికి? లవునిం గాన, నెందుఁ బోయె? నెఱిఁగింపు' మనిన, 'నెచ్చటి నుండియో యధ్వరాశ్వంబు వచ్చినం బట్టి కదళీతరువునం గట్టి పెక్కండ్రువీరులతోడం బెనంగి, చతురంగబలంబులు సమయించినయెడ నొక్కపాతకుండు బిడ్డని విల్లు ఖండించి, పట్టుకొని పోయెనఁట. అతని చేటుపాటు తెలియక పొగిలెద. శాత్రవునిం జయించి యనుజుని మఱలించి నా దుఃఖం బార్పు' మనిన, 'నంబా, శోకంబు మానుము. బాణ బాణాసన తూణీర చక్రగదా కుంత ముసల ముద్గరకవచంబులు దీవించి యొసంగు' మనినం, 'గుమారకా, కుశలంబుతో నిరంకుశంబుగా రిపులం గెలిచిరమ్ము. కుశకుమారకా, యెల్ల దేవతలు నిన్ను రక్షింపుదురు' అని దీవించినఁ, దల్లి చరణపద్మములకుం బ్రణమిల్లి, యా జగదంబ యొసంగిన శరశరాసనకవచాదులు గైకొని, సన్నాహంబై, సమరకౌతూహలంబున భుజంబు లప్పళించుచుఁ, గల్పాంతమేఘంబు కరణిం గర్జించుచు, గమనవేగంబున వృక్షంబులు వేళ్లతోడం బెల్లగిల్ల, శైలంబులు చూర్ణంబులుగాఁ, బదఘట్టనంబులం బుడమి గడగడ వడంక, దిగంతంబులం జీఁకటులు గ్రమ్మ, సజ్జీకృతకార్ముకుండును, సంధీకృతబాణుండును, సంభృతకవచుండును, సమరసన్నద్ధుండునై సరభసంబుగా సింగపుంగొదమతెఱంగున వచ్చు నవ్వీరుం జూచి, సైనికులు నిలువంచాలక నలుదిక్కులం బఱచిరి.
అంత శత్రుఘ్నుండు చెదరిన సైనికులఁ గ్రమ్మఱం బురికొల్పి, సారథిం గనుంగొని, 'యుగాంతకాలంబున సంహారోన్ముఖుండై వచ్చు కాలరుద్రునిచందంబున నిక్కుమారుం డసహాయశూరుండై మన పయినివ్వచ్చుచున్నవాఁడు. వీనిం జూచి సైన్యంబు దైన్యంబు నొంది కలగం బాఱె. దిశావసాశంబులు ధూళిధూసరితంబులయ్యె. కాక ఘూక కంక ఘుద్రంబులు రథికులశిరంబులమీఁద వ్రాలె, ధ్వజపతాకలు పొగయు చున్నయవి. ఉఱుమకయె యశనిపాతంబులు గలిగె. నక్కలు సేనాముఖంబునం బోవందొడంగె.<noinclude><references/></noinclude>
nbe5w6iayxzsytbpq8zts2erddld6cw
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/370
104
203717
554073
530303
2026-04-22T12:18:36Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554073
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>నేను వెళ్ళి తటపర్తి వేంకటరాజుగారి దగ్గిర కూచున్నాను.
తాను జరిగి నాకు చోటిచ్చాడు నా చేత విజయవిలాసం చదివించిన సత్తి సుబ్బారాయడు.
రెడ్లలో భూమంచి రెడ్డిశాఖ అతనిది.
తూర్పుపడమటి గోదావరిజిల్లాల్లో యీశాఖ చాలా హెచ్చు.
విఖ్యాత వణిక్ఛిఖామణులు కొవ్వూరి బసివిరెడ్డిగారూ, ఆంధ్రభాషాపోషకులు కొవ్వూరి చంద్రారెడ్డిగారూ, ఆ శాఖీయులే.
పూర్తిగా పురాణధోరణి కాదు; గాని చిన్నచిన్న మాటలతో కథ చక్కగా చెబుతున్నారు పెద్దబ్బాయిగారు, సూరీడుగారి పఠనమే బాగా లేదు.
ముఖ్యంగా, అది, అన్వయానుకూలంగా లేక మళ్ళీమళ్ళీ చదివించుకోవలసివస్తోంది పెద్దబ్బాయిగారికి.
ఆయన సరిపెట్టుకుంటూనే వున్నారు; గాని సుబ్బారాయ డూరుకోలేకపోయాడు.
పెద్దబ్బాయిగారి ధోరణి కూడా దెబ్బతింటోందన్న బాధ అతనిది.
పోనీ అంటే తాను రాగరంజితంగా చదవలేడు.
కాగా, వూరుకోలేక, వేంకటరాజుగారిని సంబోధించి నాచేత చదివించమన్నా డతను.
అతనిది, నేను, అన్వయానికి భంగం కలిగించనన్న నమ్మకమే గాని నేనూ రాగరంజితంగా చదవలేను, తెలుసు అతనికి.
అంచేత కూడా నేనందు కంగీకరించలేదు.
వెంకటరాజుగారూ అంగీకరించలేదు, తగువులు వస్తాయని.
ఇది జనాంతికం అని మా ముగ్గురికీ నమ్మకం; కానీ యీమాటలు సూరీడుగారి చెవినిబడ్డాయి.
చాలా కోపం వచ్చిందాయనకు.
ఆ రావడం నామీద వచ్చింది, సుబ్బారాయడిమీదకంటే హెచ్చుగా.
మాపూర్వవైరాని కదొక మారాకు.
ఇంతలో వొక ఆశ్వాసం పూర్తికావచ్చింది.
అంటే ఆశ్వాసాంతపద్యాలు ప్రారంభం అయినాయి.
గ్రంథకర్తకు కవిత్వంకంటే పాండిత్యం హెచ్చు, చాలా జటిలంగా వున్నాయవి.
ఒక పద్యంలో భుజార్కళా అన్న సంబోధన వచ్చింది.
అది నడవలేదు పెద్దబ్బాయిగారికి.
"ఏమిటీ?” “మళ్ళీ” “మళ్ళీ" అంటూ నాలుగైదుమాట్లు చదివించుకున్నా రాయన, అప్పటికీ స్ఫురించలేదు.
నేను చకితుణ్ణయిపోయా నది చూసి.
ఈ మాట యెప్పుడూ వినలేదే" అంటూ రెట్టించారు పెద్దబ్బాయిగారు, అంతటితో వూరుకోక.
“బాగా చూసి చదవం”డన్నారు సూరీరావుగారు.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||346}}</noinclude>
abb9wqoovi1twjcniaichjolj60v1b4
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/371
104
203718
554075
530304
2026-04-22T12:22:25Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554075
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>దానిమీద మరీ రుసరుసలాడారు సూరీడుగారు.
"బావగారూ, మీకేమయినా అవగాహన అవుతోందా?” అని నన్నడిగారు. సూరీరావుగారు, ఆయనమాట లెక్క చెయ్యక.
అవగాహన కావడానికేం వుందీ, భుజార్గళా అన్న మాట అది, గావత్తుకి బదులు కావత్తు పడిందచ్చులో.
పెద్దబ్బాయిగారున్నూ అడిగారు నన్ను "మీరెప్పుడయినా విన్నారా ఆమాట?” అని.
అది సూరీడుగారికి పరాభవం అనిపించింది.
“మీకేం చాదస్తమా యేమిటండీ?" అంటూ గురువుగారిమీదే చర్రుమన్నా రాయన.
అయినా, సూరీరావుగారు నన్ను విడిచిపెట్టలేదు.
తప్పనిసరి అయి అప్పుడన్నాను పెద్దబ్బాయిగారితో "అచ్చు తప్పనుకుంటాను. భుజార్గళా అన్నమాట అది" అని.
"బాగుంది" అంటూ అర్థం చెప్పేశారు వారు వెంటనే.
కాని "కాదు కా"దంటూ కూచున్నారు సూరీడుగారు.
"చెన్నపట్నంలో అచ్చయిన పుస్తకంలో వూరి పొలిమేరలు దాటనివాళ్ళు కూడా తప్పులుపట్టడమేనా?" అని ఆయన అభిమానం.
"మనకి తెలిసిన మాట చేర్చుకుంటే సరిటండీ, పుస్తకంలో వున్న మాట కర్ధం చెప్పాలి గానీ?" అని ఆయన వాదమున్నూ.
"ఏమయినా "భుజార్గళా" అన్నమాటే అది" అనేశారు పెద్దబ్బాయిగారు.
అప్పటికీ వూరుకోలేదు సూరీడుగారు.
తమ పఠనం బాగాలేదని సభలో గుసగుసలు రేగడమూ, తమర్ని తప్పించమనీ నాచేత చదివించమనీ సుబ్బారాయడు తొందరచెయ్యడమూ, అయిదారు మాట్లూ కూడా తాము భుజార్కళా అనే చదివుండడం వల్ల తామాతప్పు గుర్తించలేకపోయినట్లు సభ్యు లనుకుంటున్నా రనుకోడమూ - ఇదీ ఆయన బాధ పాపం!
ఇది పెద్దబ్బాయిగారికి లేనిదిన్నీ.
పోనీ అంటే, వారి కందనిదా యిది?
అచంచలా లయిన బాహుబలదర్పాలు చెప్పవలసినచోట తరుచు వచ్చేదే యీమాట, పూర్వగ్రంథాల్లో అయితే, "జనార్ధనా” వంటి కొత్తప్రయోగాలు కొన్ని చేశాడాకవి అక్కడక్కడ.
అవి పెద్దబ్బాయిగారు చాలా సరసంగానే విరిచి అర్థం చెప్పారు.
ఇదీ అలాంటి కొత్తప్రయోగమేమో అన్న ఆలోచనలో పడ్డా రాయన.
ఇది స్పురణకి అడ్డంకి అయింది.
కాక, -
అచ్చుతప్పు గుర్తించినంతమాత్రాన పెద్దబ్బాయిగారికంటే గొప్ప వాణ్ణయిపోయానా నేను?<noinclude><references/>
{{rh|347||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
b3ztu6woe2exxuhjxz3vtn91zkvq7vq
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/372
104
203719
554076
530305
2026-04-22T12:26:09Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554076
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇదేమీ కాదు, తాము తప్పుచేసినట్టూ, అది నేను దిద్దినట్టూ - ఇలా అనిపించింది సూరీడుగారికి.
దీంతో కొట్టినంత పనయిం దాయనకు.
తరవాత కథాశ్రవణం పూర్తి అయిపోయింది.
అందరూ లేచారు.
సూరీడుగారికి మాత్రం దుగ్ధ పోలేదు.
“రోజు లలా వున్నాయండీ! మహానుభావులు తిరుపతి వేంకటకవులు - కాస్తలేసి కుర్రాళ్ళు రామకృష్ణకవులు వారి నెదిరించడం - చూశారు కదూ?" అంటూ ప్లేటు మార్చా రాయన దివాకరరాజుగారితో.
నాకు నవ్వు వచ్చింది.
భుజార్కళా అన్నది అచ్చుతప్పని గుర్తించలేని పండితుడు - "ఉన్నదున్నట్టే వుంచి దానికర్థం చెప్పా”లంటూ కూచున్న కవి, తమ్ము మహానుభావులన్నంత మాత్రాన తిరుపతివేంకట కవులు మాత్రం పొంగిపోతారా?
ఇది గుర్తించుకోలేకపోయారు సూరీడుగారు.
నిజమే, ఆ సన్నివేశం అలాంటిది మరి; కాని “అదేమిటి మళ్లీ” అన్నాడు సుబ్బారాయడు చకితుడై.
"అదెందుకూ యిప్పుడూ?" అనడుగుతూ సూరీరావు గారు, సూరీడుగారి నటు మళ్ళించారు రెక్క పట్టుకుని.
ఆమాటా యీమాటా చెబుతూ పెద్దబ్బాయిగారు బయలుదేరారు.
వీధిలోకి వచ్చాక వారి సెలవు పుచ్చుకుని నే నింటికి మళ్ళాను.
నన్ననుసరించాడు సుబ్బారాయడు "మీ గురువులనునిందిస్తే గాని ఆయనకు తృప్తికాలేదు చూశారా?" అనడుగుతూ.
పదిబారల్లో మా యిల్లు తగిలింది.
తిరుపతివేంకట కవుల సంగతే అడుగుతూ పదిపదిహేను నిమిషాలు నుంచున్నాడు మా వీధిలో సుబ్బారాయడు.
అడుగుతూ అడుగుతూనే "మీ రెప్పుడయినా శ్రవణానందం చదివారా?” అనిన్నీ అడిగా డతను.
"చదివా"నన్నా న్నేను.
"ఎలావుంది.?"
"ఉంది, వోమోస్తరుగా.”
"చాలా అసందర్భాలు కనపడ్డాయి నాకు.”
"నాకూను."
"అయితే, గ్రంథం రేపు తీసుకువస్తా, నిద్దరమూ పరిశీలనగా చూతాం.”
"సంయే" అంటే "సంయే” అనుకుంటూ మే మిద్దరమూ విడిపోయాం.
{{c|<big><big>51</big></big>}}
అన్నప్రకారం శ్రవణానందం పట్టుకుచక్కావచ్చా డతను, అన్న క్షణానికి.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||348}}</noinclude>
ad2rs1unekxe6v3obd30kgu40ksoju4
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/373
104
203720
554130
530306
2026-04-23T06:50:49Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554130
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>నా పుస్తకం పుచ్చుకున్నేను కూచున్నాను.
తనకి తోచిన అసందర్భాలు కనపరుస్తూ అతనే చదవసాగాడు, నన్ను చూస్తూ వుండ మని.
పదిపదిహేను పద్యాలయినాయి ఆ పూట.
మధ్యాహ్నం మళ్లీ కూచున్నాం.
“ఒక్క పద్యంలోనూ చిక్కదనం కనపడ దేమిటండీ?" అనడిగా డతను చదివి చదివి.
"పద్యం తరవాత పద్యం చరచరా నడిచిపోతోంది; కాని కాస్త సాహిత్యపరిచయం వున్నవాడికి, ఇందులో, వొక్కమాటు నిలబెట్టే రచనాప్రౌఢీ లేదు, వొక్కమాటు ఆహా అనిపించే భావమూ లేదు.”
“కులాసాగా చదువుకోడానికి బాగుందా పోనీ?"
"పాడుకోడానికి కొన్ని పద్యాలు బాగున్నాయి, అక్కడక్కడ కుంటుతూ వుండినా."
“మరి చాలామంది మెచ్చుకుంటారే యిది?"
"నేనూ ఆ భ్రాంతితోనే కొన్నాను; కాని నిరాశ చేసుకోవలసి వచ్చింది." 'మనమా వద్దికి నాదుమాట వినుమా, మర్యాదగా పాడుమా' అన్న మకుటంతో కొన్ని పద్యాలున్నూ యిందులో, కాని 'నాదు మాట యేమిటండీ?' ఏవో శబ్దాలు ఏదో విధంగా బిగించగానే సరాయిసకపూడి వడ్రంలాగ, అతకవద్దూ? పైగా పిష్టపేషణం తప్ప యేంవుందీ అందులో?" అన్నా డతను.
వెంటనే దొడ్డంపేట వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది నాకు.
"పెద్దబ్బాయిగారికి వినిపించా నిది. చప్పరించేశారు వారు" అనిన్నీ చెప్పా డతను.
ధర్మమే.
మనుచరిత్రవొక్క టే కాదు, వసుచరిత్రా, ఆముక్తమాల్యదా, రాఘవపాండవీయమూ జిహ్వాగ్రాన వున్నవారు పెద్దబ్బాయిగారు.
ఎందరికో పాఠమున్నూ చెప్పివున్నా రవి.
పద్యం చూస్తే "ఏముందీ దీల్లో విశేషం?" అని పరిశీలించడం వారి పద్ధతి.
నారికేళపాకం అయితేనే ప్రీతికాదు వారికి, విజయవిలాసంలో నున్నూ యేమిటేమిటో విశేషాలు చెప్పేవా రాయన, అంత సులభమైన పద్యాల్లో కూడా విరుపులు విరుస్తూనూ, విశ్లేషించి వివరిస్తూనూ.
అప్పటి రసికు లందరిదీ అదే తీరు.
బంధకవి భుజంగరాయడుగారని వొక సంపన్న నియోగి గృహస్థు.
మాకు మూడుమైళ్ళలో వున్న లొల్ల గ్రామానికి కారణం ఆయన.
తటవర్తి వేంకటరాజుగారి వియ్యంకులున్నూ.
ప్రతిపదార్థం నడిచేది కాదాయనకు, భారత భాగవత రామాయణాలు మాత్రం పురాణం చెప్పేవారు మళ్ళీ, పండితులున్నూ వోహో అనేటట్టు.<noinclude><references/>
{{rh|349||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
komex9gvlpazkra3qbhd2h1vjc3wqix
554131
554130
2026-04-23T06:52:34Z
Vickyganti
7066
554131
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>నా పుస్తకం పుచ్చుకున్నేను కూచున్నాను.
తనకి తోచిన అసందర్భాలు కనపరుస్తూ అతనే చదవసాగాడు, నన్ను చూస్తూ వుండ మని.
పదిపదిహేను పద్యాలయినాయి ఆ పూట.
మధ్యాహ్నం మళ్లీ కూచున్నాం.
“ఒక్క పద్యంలోనూ చిక్కదనం కనపడ దేమిటండీ?" అనడిగా డతను చదివి చదివి.
"పద్యం తరవాత పద్యం చరచరా నడిచిపోతోంది; కాని కాస్త సాహిత్యపరిచయం వున్నవాడికి, ఇందులో, వొక్కమాటు నిలబెట్టే రచనాప్రౌఢీ లేదు, వొక్కమాటు ఆహా అనిపించే భావమూ లేదు.”
“కులాసాగా చదువుకోడానికి బాగుందా పోనీ?"
"పాడుకోడానికి కొన్ని పద్యాలు బాగున్నాయి, అక్కడక్కడ కుంటుతూ వుండినా."
“మరి చాలామంది మెచ్చుకుంటారే యిది?"
"నేనూ ఆ భ్రాంతితోనే కొన్నాను; కాని నిరాశ చేసుకోవలసి వచ్చింది." 'మనమా వద్దికి నాదుమాట వినుమా, మర్యాదగా పాడుమా' అన్న మకుటంతో కొన్ని పద్యాలున్నూ యిందులో, కాని 'నాదు మాట యేమిటండీ?' ఏవో శబ్దాలు ఏదో విధంగా బిగించగానే సరాయిసకపూడి వడ్రంలాగ, అతకవద్దూ? పైగా పిష్టపేషణం తప్ప యేంవుందీ అందులో?" అన్నా డతను.
వెంటనే దొడ్డంపేట వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది నాకు.
"పెద్దబ్బాయిగారికి వినిపించా నిది. చప్పరించేశారు వారు" అనిన్నీ చెప్పా డతను.
ధర్మమే.
మనుచరిత్రవొక్క టే కాదు, వసుచరిత్రా, ఆముక్తమాల్యదా, రాఘవపాండవీయమూ జిహ్వాగ్రాన వున్నవారు పెద్దబ్బాయిగారు.
ఎందరికో పాఠమున్నూ చెప్పివున్నా రవి.
పద్యం చూస్తే "ఏముందీ దీల్లో విశేషం?" అని పరిశీలించడం వారి పద్ధతి.
నారికేళపాకం అయితేనే ప్రీతికాదు వారికి, విజయవిలాసంలో నున్నూ యేమిటేమిటో విశేషాలు చెప్పేవా రాయన, అంత సులభమైన పద్యాల్లో కూడా విరుపులు విరుస్తూనూ, విశ్లేషించి వివరిస్తూనూ.
అప్పటి రసికు లందరిదీ అదే తీరు.
బంధకవి భుజంగరాయడుగారని వొక సంపన్న నియోగి గృహస్థు.
మాకు మూడుమైళ్ళలో వున్న లొల్ల గ్రామానికి కరణం ఆయన.
తటవర్తి వేంకటరాజుగారి వియ్యంకులున్నూ.
ప్రతిపదార్థం నడిచేది కాదాయనకు, భారత భాగవత రామాయణాలు మాత్రం పురాణం చెప్పేవారు మళ్ళీ, పండితులున్నూ వోహో అనేటట్టు.<noinclude><references/>
{{rh|349||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
1sw3cj4xl77tu0tsw2jviwq9wmumryl
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/374
104
203721
554133
530307
2026-04-23T06:56:37Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554133
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పద్యంలో యేదో వొక విశేషం లేకపోతే "ఆంధ్రనామ సంగ్రహం పద్యాలకంటే దీల్లో యేమిటి విశేషం?” అనడిగేవా రాయన నిర్మొగమాటంగా.
కవిత్వంచదివి ఆనందించేవారి దందరిదీ ఇదే పద్ధతి ఆ రోజుల్లో.
ఇది యిప్పుడు మోటుపద్ధతి.
నడకే ప్రధానం యిప్పుడు పద్యానికి.
"రీతి రాత్మా కావ్యస్య" అన్న వామనుడి సిద్ధాంతానికే చెలామణీ యిప్పుడు.
పద్యం కడితే కమ్మెచ్చున తీసిన ట్టుండాలిట.
మాకూ అలాగే వుండాలి, మరి.
పద్యం పాడితే లలితమైన నాదం రావాలిట.
మాకూ రావాలి, మరి
మరి?
తరవాతి మాట?
పద్యం చదివితే ఆలోచించినకొద్దీ చవులూరించే గంభీర భావా లుండవద్దూ?
"కవిత్వం అందరికీ తెలిసేటట్టుండాలి" అని మరో కొత్త నినాదం యిప్పుడు.
అశక్తదుర్జనత్వం యిది.
కవిత్వం, మనిషికి, తనంతట తానే తెలిసిపోవాలా, ప్రయత్నించి మనిషే కవిత్వం తెలుసుకోవాలా?
ప్రతీమనిషి హృదయమూ స్పందిస్తుందా కవిత్వానికీ, పోనీ?
ప్రపంచంలో యేభాషలో నయినా వుందా అటువంటి కవిత్వం?
జగత్తులో యేమూలనయినా వుందా అలాంటి జాతి అయినా?
ఇది సృష్టిక్రమానికే ప్రతికూలం.
పూర్తిగా తప్పుడు సిద్ధాంతమున్నూ.
ఎంత గాంభీర్యంవుంటే అంతా ముపద్గీతనం అవిపించుకుంటుంది వ్యవహర్తకు.
నిత్యవ్యవహారసరణిలోనే గాంభీర్యాని కిలాంటి మన్నన వున్నప్పుడు, అతిలోక రమణీయమైన కవిత్వంలో వుండవద్దూ అదీ?
కాక, -
కవిత్వం మాటల్లో లేదు, మాటల కూర్పులో వుంది.
ఆ కూర్పు అవగాహన చేసుకోగలవారికే అనుభూతం అవుతుంది కవిత్వం.
శబ్దార్థపరిజ్ఞానం వేరూ, శబ్దరచనావైచిత్రి అవగాహన చేసుకునే యోగ్యత వేరూను.
కవి ప్రవృత్తిని బట్టి కూర్పు, విశదమూ కావచ్చు, శ్లిష్టమూ కావచ్చు.
ఎంత సరళమైన భావం అయినా శ్లిష్టపదబంధంలో యిమడ్చడం నొక గుణం కాని దోషం కాదు రచనకు.
క్లిష్టత మాత్రమే దోషం.
గర్హ్యమున్నూ.
మల్లెపువ్వులోనుంచి అనుస్యూతంగా వ్యక్తం అవుతుంది సౌరభం.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||350}}</noinclude>
3b2d44qxcdm3pzzmxycecvar7nr4es7
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/375
104
203722
554134
530313
2026-04-23T07:00:08Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554134
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పద్యంలోనుంచయినా వచనంలోనుంచయినా భావమున్నూ అలాగే ద్యోతకం అవుతూ వుండాలి, నిరవధికంగా
విచారణకున్నూ ఆగాలి అది.
అదీ కవిత్వానికి యోగ్యత.
ఆలోచనామృతం గాని సంగీతంలాగ ఆపాతమధురం కాదు కవిత్వం, మరి.
ఆ ఆలోచనకున్నూ అధికార తారతమ్యం వుంది, మళ్ళీ.
ఈతపండు సులభంగా నోట వేసుకోవచ్చు, పనసతొన సాధించుకోడమే శ్రమ, పండు చేతిలో పెట్టినా.
శ్రమ అంటే కవిత్వం సందర్భంలో కాయికం కాదు, మనోధర్మం.
ఆస్వాదన చతురతకు సంబంధించిన విచారణ వచ్చినప్పుడు, పనసతొనతినేవాడికా ఆదరగౌరవాలు, ఈతపండు తినేవాడికా?
ఇవి రసికుల విశ్వాసా లప్పుడు.
ఇవాళ “రసికు”డంటే తిట్టు అని భావన.
"సరసు"డన్నా వొణికిపోతారు కొంద రిప్పుడు.
మన జాతికిప్పుడు గాఢానుభవాని క్కావలసిన జవసత్వాలు లేకపోడమే యిందు క్కారణం.
తెలుసుకోగలిగితే, సరసతా రసికతా కూడా విశిష్టమైన నాగరకతకు చిహ్నాలు.
అవి సభాపూజ్యాలున్నూ.
మనిషి కవి వుండడమే సభలో ప్రవేశించడాని కర్హత, డబ్బుండడమూ అధికారం వుండడమూ రాజకీయాల్లో తిరుగుతూ వుండడమూ కావు.
ఏమంటే?
అవిన్నీ మనోధర్మాలే.
కళాప్రీతి కాదు వాటిక్కొలబద్ద, కళాపరిజ్ఞానం.
శాకుంతల నాటకం చదివి, గేథే అనే జర్మను సాహిత్యవేత్తకూడా ఆనందతాండవం చేశాట్ట, మరి, ఆ శాకుంతలం రచించిన కాళిదాసే కుమారసంభవంలో అష్టమసర్గా రచించాడు, అతని రసికత నింద్యమేనా?
చెప్పవచ్చిందేమిటంటే?
ఇప్పటి మనవారి చదువు వేరు.
అది లేశమూ జాతీయం కాదు.
రసానుభవపద్దతి వేరు.
అది యేకొంచెమూ భారతీయం కాదు.
జీవనసరణి వేరు.
దాని క్కావలసినంత మనోదార్డ్యం లేదు.
దృక్పథమున్నూ వేరు.
దానికి స్ఫుటమైన ప్రాప్యమే లేదు.
ఎటూ కాని తరం యిది.
పోనీ అంటే యేసంస్కారమూ అస్థిగతం కాని తరం యిది.<noinclude><references/>
{{rh|351||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
it3b3viefqdz9edxb3y79hh8bvo1vho
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/376
104
203723
554135
530314
2026-04-23T07:04:58Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554135
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>చరిత్రకున్నూ యెక్కలేని తరం యిది.
జాతికి అవిచ్ఛిన్నత మాత్రమే సంఘటించే తరం యిది.
వేత్తలయిన సాహిత్యప్రియు లెవరూ కూడా పద్యాలు గదా అని, వీరిలాగ, పదులుపదులు రచనలు చదివి ఆనందించలేరు, ఎవరేమన్నా.
వీరానందించగలిగే సారస్వతం శాశ్వతమూ కాలేదు.
{{c|<big><big>52</big></big>}}
“చదివి చదివి, చెప్పిన్నీ చెప్పి 'నీచులకు గురుత్వంబు వైష్ణవులకు సతంబు' అన్న పద్యం విని మిక్కిలీ అసహ్యించుకున్నారు పెద్దబ్బాయిగా”రంటూ తాను నిరసనభావం కనపరుస్తూ కిందపడేశాడు పుస్తకం, సుబ్బారాయ డావేళ.
ఉలిక్కిపడ్డా న్నేను.
పెద్దబ్బాయిగారు పూర్వాచారపరాయణులు.
తమ తమ్ములు నరసింహాచార్యులుగారికంటే వీరవైష్ణవు లాయన.
ఆయన కామాట కోపకారణం కావడం ఆశ్చర్యం యేమీ లేదు.
కాగా, - కేవలసాహిత్య రసికుడైనవాడు అర్థాంతరన్యాస అని సంతోషించడమా, అసభ్యం అని యేవగించుకోడమా అది?'
వైష్ణవులకు శిష్యులైనవారు నీచులనడం యెవరయినా ఆక్షేపించతగ్గదే.
ఏమంటే?
వైష్ణవశిష్యులకు తిరుపతివేంకట కవు లారోపించే యీ నీచత పుట్టుకను పురస్కరించుకునా, మతవిశ్వాసం పురస్కరించునా?
పుట్టుకను బట్టే అయితే, హీనజాతులవారే కాక, రెడ్డి, కమ్మ, వెలమ, కాపు - ఇలాంటి యోధజాతులవారికీ తగులుతుం దీ నింద.
వారే కాదు, బ్రహ్మ క్షత్రియవైశ్యులున్నూ వున్నారు వైష్ణవశిష్యులు - వారికీ తగులుతుం దీ దెబ్బ-
మతవిశ్వాసం పురస్కరించుకునే అయితే, వైష్ణవానికే తగులుతోంది, సూటిగా.
దీనికి వైష్ణవు లేమంటారని కాదు మనం చూడవలసింది, ఇలాంటి కల్పనలు చేస్తేగాని రసస్ఫూర్తి కలిగించడం సాధ్యం కాదా, రసికు లానందించరా?
"శ్రవణానంద కథకు మూలం యేమిటో అది చాలామందికి తెలుసు. అద్వైతి అయిన నాయకుణ్ణి విశిష్టాద్వైతిగా చిత్రించడంలోనే వుంది అసలు, దుస్సాహసం” అన్నారు పెద్దబ్బాయిగారు, పొలాన తారసపడి వొకనాడు.
ఆకులు బొత్తిపెడుతూ వొక మర్రిచెట్టుకింద కూచుని వున్నారు వా రవుడు.
నేనూ మర్రి ఆకులకోసమే వెళ్లా నక్కడికి, యథాపూర్వంగా.
కర్రి వెంకయ్య అనే వొక రెడ్డి చేలో వుందా చెట్టు.
ఆ వూరి బ్రాహ్మల్లో యెవరికి మర్రాకులు కావలసి వచ్చినా ఆ చెట్టే ఆధారం, యే రోజుల్లోనూ కూడా.
బ్రాహ్మలంటే విశిష్టమైన గౌరవాదరా లతనికి.
అక్షరం రాదు; కాని గొప్ప వ్యవహర్త అతను.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||352}}</noinclude>
6w8eb5jgnaqwc5t9af9ufcly0vry2dt
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/377
104
203724
554136
530315
2026-04-23T07:13:13Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554136
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఊరుమ్మడి వ్యవహారాల్లో, చాలాకాలం, సూరీరావు గారికి ఏకైక ప్రతిస్పర్థి అతను.
ఎత్తుపై యెత్తుల్లో సూరీరావుగారు వెంకయ్యను మించితే, వెంకయ్య సూరీరావుగారిని మించేవాడు.
షష్టి ఘడియలూ లౌక్యంలో మునిగి తేలుతూ వుండీ కూడా, ఇట్టే సావధాను డయిపోయేవాడు విద్యల గొడవ వచ్చేటప్పటి కతను.
నిదర్శనా లెన్నో వున్నాయందుకు, దర్భా బైరాగి శాస్త్రిగారు వచ్చారొకమాటు, మా యింటికి.
కూడా వొక శిష్యుడున్నూ వచ్చాడు, మాఘం చదువుతూ.
ఉదయం దంతధావనంకాగానే రెండోసర్గ చింతన చేసుకోసాగా డతను, వీధి అరుగుమీద కూచుని.
సంస్కృతంలో అన్వయించుకుంటూ తెనుగులో భావం చెప్పుకుంటున్నా డతను, సభలో కూచుని పురాణం చెబుతున్నట్టు.
ఎందుకో వీధిలోకి వచ్చాను, అప్పటికే వెంకయ్య కూచుని వున్నాడతని కెడంగా.
నేను పలకరిద్దా మనుకుంటూ వుండగానే మాట్టాడకుండా కూచోమన్నట్టు సన్నచేశా డతను నాకు.
కొద్దిదినాల కిందటే మాఘం మొదటి నాలుగుసర్గలూ స్వయంగా అన్వయించుకుని వున్నా న్నేను. ఆ విద్యార్థి చింతన నాకూ హృదయంగమంగానే వుంది.
మరో రెండుగంటల కాచింతన పూర్తిచేసుకుని స్నానానికి కాలవకి వెళ్లిపోయా డావిద్యార్థి.
అప్పుడన్నాడు వెంకయ్య "కృష్ణుడూ బలరాముడూ, ఉద్దవుడూ ఆర్గ్యూ చేశారు, వినడాని కెంతో బాగుం"దని.
ఎవరు - ఎక్కడ పురాణం చెప్పినా, వూళ్లో వున్నాడా - తెలిసిందా - అతను వచ్చి కూచున్నా డన్నమాటే అక్కడ.
పౌరాణికుడి ధోరణి బాగుందా లేదా అంటే విచారణ యేమీ అవసరం లేదతణ్ణి చూస్తే చాలు.
బాగుందీ, అత్యాసక్తితో వినేవా డతను చెపులోర జేసుకుని.
లేదూ, గోడకి చేరబడి అక్కడే కమ్మగా నిద్రపోయేవాడు, గుర్రుపెడుతూ.
ఏ విద్య అన్నా అతని కిష్టమే, జ్యోతిషం అంటే మాత్రం మరి యిష్టం.
జాతకాలు చెప్పించుకోడమూ, రాయించుకోడమూ, ప్రశ్నలడగడమూ - ఇవంటే ప్రత్యేక శ్రద్ధ అతనికి.
తన దౌహిత్రుని జాతకం నాచేత రాయించుకున్నా డతను.
దాని క్కారణం వింత అయినది.
ఒకనాడు, సాయంత్రం, జ్యోతిషానికి సంబంధించిందేదో చెబుతున్నారు మా నాయనగారు, మా అన్నదమ్ములం ముగ్గురమూ వింటున్నాం, అరుగుమీద కూచుని.
పరుగుపరుగున చక్కా వచ్చా డతను “ప్రశ్న చూడ”మంటూ.
ప్రశ్న చెప్పమంటారే గాని విషయం చెప్పరు కొందరు.<noinclude><references/>
{{rh|353||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
pe7zi7w1msq8kvx1kqhlbiey9bv2jiy
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/378
104
203725
554138
530316
2026-04-23T07:18:26Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554138
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఫలితం సరిగా చెప్పగలవాడికి విషయం తెలుసుకోవడం యేమంత కష్టంకాదు; గాని, విషయం ముందు చెప్పే ఫలితం చెప్పమనేవా డతను.
"నా భార్య ప్రసవించుబోతోంది. మొగపిల్లవాడు పుడతాడా, ఆడపిల్ల కలుగుతుందా?" ఇదీ అప్పుడతని ప్రశ్న.
కొందరడిగి తెలుసుకుంటారు, అంతే, అతను మాత్రం యే సంతానం కలిగినా వెంటనే పుత్రోత్సవం చేసేవాడు, వూళ్లో వున్న బ్రాహ్మల నందరినీ పిలిచి గుమ్మడిపళ్లో కొబ్బరి బోండాలో సదక్షిణాకంగా యిచ్చి.
లగ్నం కట్టుకుని మేము నలుగురమూ బదులు చెప్పాం, ఎవరికీ వారే ఆలోచించుకుని.
మా నాయనగారూ మా అన్నలూ కూతురు పుడుతుందన్నారు, అందుకు భిన్నంగా “కొడుకు పుడతా" డన్నా న్నేను.
పరుగు పరుగున వెళ్ళి యెగిరివచ్చా డతను "మీ చిన్నబ్బాయిగారి మాటే నెగ్గిందంటూ.
తరవాత, అతని దౌహిత్రుని జాతకం నేను రాయడాని కిదీ కారణం.
{{c|<big><big>53</big></big>}}
తక్కిన మన విద్యల్లో దేనిమీదా కూడా లేశమూ లేదు; గాని మనవారిలో కొందరికి, జ్యోతిశ్శాస్త్రంమీద - ముఖ్యంగా జాతకప్రశ్నల భాగలమీద గట్టి నమ్మకమే వుందిప్పుడు.
వారిలో కొందరు, ఒక్క వారఫలాలకోసమే పత్రికలు కొంటారు, అవి తప్పించి వొక్క అక్షరమైనా చదవకపోయినా.
సిద్ధాంతులకున్నూ యిప్పుడీ రెండు భాగలవల్లనే మంచి రాబడి, బాగా ఆలోచించగలవా రయితే.
మా నాయనగారికిన్నీ జీవితయాత్ర సుకరం కావడానికీ విద్యలు చాలా వుపకరించాయి.
ఒక నిదర్శనం చెబుతాను.
మునికొడవలి విడిచి మా నాయనగారు పొలమూరు ప్రవేశించిన కొత్తరికం అది.
పక్కవూళ్ళో వొక డీ-పీ-డబ్ల్యూ కంట్రాక్టరు.
ఒక్కక్షరమైనా చదువురాదు; కాని పక్కా ముస్సద్దీ.
పిట్టంత మనిషి; కాని ప్రభుదర్పం పొంగిపోయేది, మొగాన.
ఎక్కడికి వెళ్లినా గుర్రంమీద వెళ్లేవాడు.
తలుచుకున్నాడా, ఏమయినా చెయ్యగల నిగ్రహానుగ్రహసమర్థుడు.
నమ్మినచోట ప్రాణం అయినా ధారపోసే ప్రకృతి అతనిది.
మా నాయనగారు తరుచు చూస్తూవుండేవా రతణ్ణి, మరికొందరు సంపన్నుల తోపాటు.
ఒకనాడు వెళ్లేటప్పటికి దిగాలుపడిపోయి వున్నా డతను.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||354}}</noinclude>
hbxs6sy8j2fyqygem5nq40i82csfamb
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/379
104
203726
554139
530317
2026-04-23T07:22:49Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554139
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పరివేష్టించివుండిన పోష్యవర్గీయులున్నూ కత్తివేస్తే నెత్తురు చుక్క లేకుండా వున్నారు.
“ఏమా?” అనుకుంటూ మా నాయనగారు సమీపించేటప్పటికి “ప్రశ్న చెప్పండి" అంటూ ప్రత్యుత్థానం చేశా డతను.
"కంగారు పడనక్కరలేదు, జయం చేతికి వచ్చింది, పది నిమిషాల్లో వార్త అందుతుంది" అని చెప్పారు. మా నాయనగా రాలోచించి.
"ఈ సిద్ధాంతిగారి శక్తి యేమాత్రం?" అనుకుంటూ వుండేవా డంతవరకూ అతను.
"అది యిప్పుడు తెలిసిపోతుం"దనుకున్నా డప్పుడు, అంత నిక్కచ్చిగా చెప్పడం చూసి.
"జయం జయం" అంటూ నిదానం వినిపించింది, ఉరుములాగ, ఇంతలో.
అందరూ సందుమొగకేసి చూశారు.
గుమాస్తా కనపడ్డాడు మేఘాలమీద యెగిరివస్తూ.
ఆలస్యం సహించలేక యెదురు వెళ్లాడు కంట్రాక్టరు.
“జయం జయం" అంటూ మళ్ళీ అరిచారు గుమాస్తా, యజమాని ఆత్రం చూసి.
అందరూ ప్రపుల్లముఖులయినారు.
గందరగోళం అయిపోయింది, ప్రశ్నోత్తరాలతో కొంతసే పక్కడ.
దిగులు పోయి ఆనందమున్నూ లాస్యంచేసిం దక్కడ.
కంట్రాక్టరు గుమాస్తా చాకచక్యం మెచ్చుకోగా, పరివేష్టించి వుండినవారు కాంట్రాక్టరు అదృష్టం మెచ్చుకున్నారు.
“మీ విశేషం యిప్పటిదాకా గుర్తించలేకపోయా” నంటూ మా నాయనగారి పాదాలమీదే వాలిపోయాడు కంట్రాక్టరు.
అస లేమి టంటే?
ఒక పడవలకాలవ లోతు చెయ్యడానికి తవ్వకం కంట్రాక్టు చేశా డతను.
లక్షరూపాయల పని అది, పాతిక వేలది మాత్రమే జరిగింది.
బిల్లు మాత్రం లక్షకూ వెళ్ళింది దపాదపాలు.
చాలామట్టుకి చేతికి వచ్చింది డబ్బు.
కాని పోటీపడి తిరస్కృతు లయినవారు పైకి పిటీషన్లు పెట్టారు "మోసం జరిగింది పరీక్ష చేయించ"మని.
కైదు - ఆస్తి జప్తు - ఇలాంటివి తటస్థపడతా యంతపనీ జరిగితే.
ప్రతీఅడుగునా మోసమే జరిగింది తవ్వకంలో మరి.
ఆ చుట్టుపట్ల గ్రామాల్లో చక్రవర్తిగా చెలామణి అవుతున్నా డతను.
డబ్బుపోయినా బాధపడ డతను, పరువు పోతుంది.
తలయెత్తుకు తిరగడానికి వీలుండ దిక.
అందుకే అతని కాదిగులు.<noinclude><references/>
{{rh|355||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
qku2fgyeqssp4e4ryqu5hid2bfndm0a
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/380
104
203727
554140
530549
2026-04-23T07:28:16Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554140
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అందుకే గుమాస్తా బయలుదేరివెళ్ళాడు చక్రం అడ్డు వెయ్యడానికి, రెండెడ్ల బండిమీద.
రాత్రి పన్నెండు కొడితే చాలు కాలవకు నీరు విడిచి పెడతారు.
విడిచిపెట్టారా, దేవుడు వచ్చిన్నీ మోసం గుర్తించలేడు.
నిజమే; కాని పైనుంచి దొర టెలిగ్రాం కొట్టాడు "కాలవలు తెరవ్వద్దు, మెయిల్లో వస్తున్నా "నని.
అయితే, కంట్రాక్టరు వొక్కడికే కాదు దిగులు, ఇక్కడి ఆఫీసర్లకున్నూ.
"కొలతలు సరిగా వున్నా"యని గట్టిగా సర్టిఫై చేశారు మరి, వారు.
ఆ రోజుల్లో మద్రాసు మెయిలూ, కలకత్తా మెయిలూ కూడా అర్ధరాత్రివేళ వచ్చేవి రాజమండ్రీ.
సామర్లకోట విడిచిపెడితే రాజమండ్రినే మెయిలాగడం - అంచేత మధ్య ఎక్కడో దిగి, కాలవగట్టే ధవళేశ్వరం చేరుకోడానికి వీళ్ళు లేవు.
పోనీ అంటే, ఇండియా మొత్తంమీద లేవు మోటారు కార్లప్పటికి.
ఆఫీసర్లు, రాజమండ్రీ వెళ్లి, స్వాగతం నివేదించి, ధవళేశ్వరం తీసుకువచ్చి దొరని విడిదిలో ప్రవేశపెట్టారు, ధర్మపత్నీ సమేతంగా.
ఇక్కడివా రందరూ కంగారుపడిపోతున్నట్టే వుండినారు - "ఈ ఆకస్మికాగమనం యెందుకా?" అన్నట్టు.
తెల్లవారింది.
దొర బయలుదేరాడు, పిటీషన్లు చేతబుచ్చుకుని.
కాని, ఏటి లాకుదగ్గిరికి వెళ్లేటప్పటికి పొంగిపొర్లిపోతోంది కాలవ, నాట్యకత్తెలాగ.
ఆఫీసర్లు కొయ్యయిపోయారు ముందు.
"ఏమిటిది?" అంటూ వురిమాడు దొర, ఇంతలో అగ్గి అయి.
అత నొక్కడే కాదు దొర, యిక్కడివారిలోనూ వున్నారు కొందరు, గవర్నరునిమించి చెలామణీ అవుతూ.
వారూ, వారికిందివారూ కూడా అగ్గీ అయిపోయారు దొరతోపాటు, నీళ్లూ కారిపోయారు. ఏటిలాకుతో పాటు.
కొంతసేపటి కొక లాస్కర్ని పట్టి తీసుకువచ్చారు "ప్యూన్సు.”
వొణికిపోతున్నాడు లాస్కరు.
కాళ్లలో పట్టుతప్పిపోయేటట్టున్నూ వుంది వాడికి.
ఈ దొరలతో కలిసి మళ్లీ వురిమా డాదొర.
అంతకి ముందే మీదపడిపోయారు "ఇండియనాఫీసర్లు" నీకు బుద్ధి లేదా అంటూ.
బుద్ధి అందరికీ వుంది, వెకిలిప్రశ్న అది.
పశువులకు లేనిదీ, మనుష్యుల కున్నదీ యీ బుద్ధే.
బుద్ధితోపాటివే మనుష్యులకు సిగ్గుబిడియాలున్నూ, విశిష్టాలు.
అన్యోన్యా లివి.
ఒక రాశి యివి.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||356}}</noinclude>
su0wkan5pu0iw7kq0yvkq1h39go9jio
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/245
104
211525
554086
554070
2026-04-22T13:57:43Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554086
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అల్పులగు మానవులనడిగేదెవడు' అని కండ్లేర్ర చేస్తడు. పండించు ప్రాణాలు వస్తువడ్డాక, పాడు రాజ్యాన్ని
కాపాడకుంటే ఏమి? అన్నడు. 'బీదల సర్వస్వముతో ధనికులు చేసే బేరము చాలింక, మూతులు నాకుచు, ఆత్మవంచనతో కట్టిన మూటలు చాలింక. ఇట్లాటి వ్యత్యాసాలు తొలగకపోతే ఆయ్య బాంచెను అన్న పౌరుడే అయ్య గొంతుకను అట్నే అదుమున్' అన్నడు. అందుకే ఈ వ్యత్యాసాలు పోయి, మనిషి, సాటి మనిషిని మనిషిగా చూడాలి. జాతియని, రీతియని, దేశమని, వేసమని విసముగక్కే వింత బిసగ మారినది, ఆధునిక ఆర్భాట మందణిగి అవనియే ఆత్మజుచ్చీ జనుల అడవైంది అన్నాడు.
ప్రభుత్వాలు ఏంచేసినా సామాన్య మానవునికి వాటి ఫలాలు అందాలనేది కాళోజీ మాట.
కాళోజీ భాష, సామాన్యుని భాష. అదే తన కవిత్వానరించుకున్నాడు. మనం ఏం చెప్తున్నామో, ఎవనికోసం
చెస్తున్నమో, దానికి తెల్వాలే గద, తెలిస్తేగద వాడు ఆచరణలో పెడ్డడు. వాని బాసల, యాసల చెప్తే వానికి తెలుస్తది అనేది కాళోజీ మాట.
మనం సామాన్య మానవున్ని చైతన్యవంతున్ని చేసి వాన్ని ఆచరణ వైపు మరల్చకపోతే మన బ్రతుకు దండుగ
అంటడు. కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక అన్నడు.
పర్యటిస్తూ వేమన జనజీవితంల చూసిస సంఘటనలకు ప్రభావితుడై తేట తేట మాటలల్ల కవిత్వాలు చెప్పినట్లే అన్ని సంఘటనలకు స్పందించిండు కాళోజీ. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చానా కాళోజీకి కంటినిండా నీళ్ళే. అసలు మనిషిలో ఆర్ద్రత లేకపోతే వాడు మనిషే కాడంటడు కాళోజీ, 'ఆశ్రువులు లేనట్టి అసువులేలా నాకు, అని కన్నీళ్ళు నన్నెపుడు ఆదుకుని వుండాలె ననీ అన్నడు. కవిత్వం ప్రజల కోసం అన్న కాళోజీ కవిత్వం ఎట్లా ఎండాల్నో
గూడ చెప్పిండు. నా గొడవ కాలానికి (ప్రతికూలంగా) పారేది ఎదురెక్కేది అన్నడు. అందరు పొయ్యే బాటల నీటి వాటంగా పోలే కాళోజీ. నా గొడవ, ఏనాడూ ఎవ్వనికి తలవంచలేదు. కాలునకే కాదు మహాకాలునకును ఏనాడును జీ అనని కలేజాతో ఉండాలె. అండ్ల అన్ని, నీ, భావనలే మన భావనలే, సమరస భావనలే. అది ఎదచించుక పారాలే. సామాన్యుని దుఃఖం వతుగ ఎందరాగబట్టినా ఆగకుండ ఎక్కి ఎక్కి వచ్చేటిదే.
ఆయన కవిత్వంల నిత్యసత్యాలు అనదగ్గ పంక్తులు చాన ఉంటాయి. వేమన, కబీర్ చెప్పినట్లు సామెతలవతు,
మల్ల మల్ల చెప్పేటట్టుంటయి.
:సాగిపోవుటే బ్రతుడు, ఆగిపోవుటెచావు.
:బ్రతుకుపోరాటము - పడకు ఆరాటము.
స్వాతంత్య్రం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సామాన్యుని సంక్షేమం కోసం కోట్లు కోట్లు ఖర్చుపెట్టినా, వాటి ఫలాలు
సామాన్యునికి చేరలేదు. మిరియాల పాటు ఖర్చు, పుచ్చిన జొన్నల సేద్యం అన్నడు.
ప్రజాస్వామ్యంలోపల ప్రజలేగొప్ప, సామాన్య ప్రజలకు కావల్సిందల్లా లేదా తీరవలసిందల్లా కూటి సమస్య, గూటి
సమస్య, గూటిలోపలి గువ్వల జంటి సమస్యః ఈ సమస్య తీరంటే కర్మయోగం, గీతా బోధలు దండుగ, గంటము లెన్నో అరిగెను కంటకాలు మాత్రం తరగలేదు. లోకం తంటాలు తీరలేదు అని కాళోజీ బాధ పడ్తాడు. కాళోజీ రాజకీయాలను రోసిండు. ప్రజాకీయాలు కావాలన్నాడు. సామాన్యుని బ్రతుకు బాగుపడాలె అన్న కాళోజీకి మనిషి తర్వాత మనిషి బ్రతుకంటే గొప్ప విశ్వాసం. ఆయన అంటడు 'ఇతుకు తప్పదు బతక్కు తప్పదు. శాస్త్రం తప్పుతుంది. ధర్మం తప్పుతుంది. న్యాయం తప్పుతుంది గాని బతుకు తప్పదు, బ్రతక్క తప్పదు' అన్నది.
ఆయన మాట. ఇంత విశ్వాసం ఉన్నది గనకనే అవగాహనకు ఉదాహరణ. చాలా గొప్ప కవిత. 'బతుకమ్మ బతుకు, అమ్మల మరవని సంతానము గని బతుకమ్మ బతుకు'
కాళోజీకి ప్రజాస్వామ్యం మీద గొప్ప విశ్వాసం. గొప్ప ప్రజాస్వామ్య వాది కాళోజీ. గత చరిత్ర తెలిసిన వాళ్ళకు
ఆంధ్రప్రదేశ్లో ప్రణాస్వామ్యం ఖూన్ చేయబడ్డప్పుడు ఆయన కొట్లాడిన విషయం గుర్తే ఉంటది.
చరిత్రకారుడెప్పుడు జరిగిన చరిత్రను తరువాత కాలంల సేకరించి కొంత విని, చదివి, వ్రాస్తడు. కాళోజీ ప్రజల తానొక్కడై, ప్రజా ఉద్యమాలల్ల పాల్గొని సమకాలీనుడుగా, ప్రత్యక్షంగా పాల్గొని, తన అనుభవాలను కవిత్వీకరించి రాసిన కవిత్వం. అదొక రన్నింగ్ కామెంటరీ.<noinclude><references/>
{{rh|తెలంగాణ |224| తేజోమూర్తులు}}</noinclude>
8v6s7cwyjyqw5teursntn7z1415mpiu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/246
104
211526
554091
551553
2026-04-22T14:05:51Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554091
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
కరుణార్హశీలి కాళోజీ. ప్రతి సంఘటనా సూటిగా ఆయన గుండెను తాకి, జాలినీళ్ళ ఉప్పెన పొంగీ, వాక్కై ఆయన నోటి నుండి, భాష్పంగా కంటి నుండి, త్య్రంబక గోముఖిగా వెలువడతాయని ఒక ప్రముఖుడన్న మాట అక్షరాల నిజం.
కాళోజీ ఎక్కడున్న ఏం చేసినా ప్రజల మనిషి. ప్రజల గొడవే కాళోజీ గొడవ. ఆయన కవిత్వంలోని ప్రతి కమ్మ
అందుకు ఉదాహరణ. ప్రజల సమస్యలే ఆయన్ను కవిగా చేసినయి అన్నడు ఇంకొక ఆయన. ప్రజల భాషలో ప్రజల
హృదయాలను ప్రదర్శించిన అచ్చమైన తెలుగు, తెలంగాణ కవి కాళోజీ, నూటికి నూరుపాళ్ళు ప్రజాకవి.
రాజీ పడలేదాయన, లోపట తన భావన తప్పని తెలుసుకొని, ఎవరనుకొన్నారు ఇల్లావునని ఎవరుకొన్నారు అనీ, రెండున్నర జిల్లాలదె దండి భాస అంటారని, తక్కినోళ్ళ యాస, తొక్కి నొక్కి పెడతారని, అందుకే ప్రత్యేకంగా రాజ్యం
పాలు కోరడం తప్పనిసరి అని వాపోయిండు.
1969లో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అంతా కలె తిరిగిండు. కవిత్వం చెప్పిండు. తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో కాళోజీ ప్రస్తావన లేకుండా ఏ సభ, ఏ ఉపన్యాసం లేదంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆశిస్సులు పుష్కలంగా ఉండె. భాష విషయంలో కాళోజీకి నిర్దిష్టమైన దృక్పథం ఉన్నది. బడి పలుకుల భాష గాక పలుకుబళ్ళ భాష గావలె అన్నడు. ఎవి భాషనైనా యాసనైనా ఎగతాళి చేయ్యొద్దన్నడు.
కాళోజీ అణగారిన శ్రమజీవులు నిర్మించిన పోరాట చరిత్రో పాటు నడిచి బతుకంతా దేశానిదే అయిన మనిషి.
మౌలికంగా ఆయన మనిషి, మనిషి గొడవే ఆయన గొడవ. నిత్య పథికుడు. నిత్యాన్వేషి, రక్తమాంసాలున్న మనుషు
అందర్కీ అర్ధమయ్యే భాష ఆయనది. పుటుక నీది చావు నీది, బతుకంతా దేశానిది అని లోకనాయక్ జయప్రకాశ్
గురించి ఆయన రాసిన మాట ఆయనకూ వర్తిస్తది.
ఖలీల్ జిబ్రాన్ ప్రొఫెట్లో అల్ ముస్తఫను తానుండిన కాలానికి తానె ఉషస్సయిన వాడు అంటాడు. ప్రజా కవి కాళోజీ గూడ తానుండిన కాలానికి తానే ఉషస్సయిన వాడు. కాళోజీ గురించి ఎంత చెప్పినా వొడవని ముచ్చట. కాళోజీ
రచనల వివరాలు, కాళోజీకి వచ్చిన పురస్కారాలు, తఫ్పీలు చెప్పను. ఆయన నిరంతరం ప్రజల నాల్కల మీద
నడయాడుతూ వాండ్ల మనస్సుల్ల చిరంజీవి ఐండు. ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక సాహితీ పురస్కారం ప్రతి ఏటా ఇచ్చే ఏర్పాటు చేసింది. వరంగల్ కాళోజీ పేరిట ఆడిటోరియం నిర్మించి దాంట్లో కాళోజీ ఫౌండేషన్
కార్యాలయానికి, స్మారక గ్రంథాలయానికి చోటు కల్పించేందుకు వాగ్దానం చేసింది.
కాళోజీ అన్న ఒక్క మాటతో, నా మాటలు ముగిస్త ఎంతటి ధనికునికైనా, అధికారమున్నానికైనా నేరం చేసే అవకాశం ఉండకూడదు. ఎంతటి బీద వాడికైనా నేరం చేసే అవసరం రాకూడదు. అది కాళోజీ కోరుకున్న సమాజం. ఆ సమాజం కోసం ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో కృషి చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమే.<noinclude><references/>
{{rh|తెలంగాణ |225| తేజోమూర్తులు}}</noinclude>
7xk6zntnkwhygdtuvsv58twuvs5ldj9
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/247
104
211527
554092
551554
2026-04-22T14:15:34Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554092
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''64. కాళోజీ రామేశ్వరరావు 'షాద్''''</p>}}
{{right|- వి.ఆర్. విద్యార్థి}}
హైదరాబాద్ రాజ్యంలో ఇరవయోశతాబ్దం కీలకమైనది. ప్రపంచంలో వొచ్చిన అన్ని విపత్కర పరిస్థితుల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారతదేశంపై పడడం అనివార్యమయింది. హైదరాబాద్ రాజ్యం ఇందుకు మినహాయింపు కాదు. అప్పటికే జాగీరుదార్లు, దేశముఖులు, చిన్నపాటి దొరలు ప్రజల జీవితాల్ని నిరంకుశంగా శాసిస్తున్నారు. గాంధీజీ నాయకత్వంలో బ్రిటిష్ పరిపాలన అంతంచేయడానికి దేశమంతటా అహింసా మార్గంలో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ స్ఫూర్తితో హైదరాబాద్ రాజ్య ప్రజలుగూడా నైజాం రాజు నుండి విముక్తి కోసం పోరాటాలు ఆరంభించారు. తమ భాషా సంస్కృతుల్ని పునరుద్ధరించుకోవడం కోసం హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలవాళ్ళు ఉద్యమించారు. తెలంగాణలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. సాయుధ పోరాటం ఆరంభమయింది. వివిధ రాజకీయ విశ్వాసాలతో ఎవరి మార్గంలో వాళ్ళు స్వాతంత్య్ర పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళలో కాళోజీ సోదరులు గుర్తించదగిన యోధులు.
కాళోజీ సోదరులలో అగ్రజులు రామేశ్వరరావు పూర్తిపేరు 'రామేశ్వర్ నరహరిరాధాకిషన్ ఝర్జీశ్యాంరాజా కాళోజీ'. తమ్ముడు నారాయణరావు. పూర్తిపేరు 'రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రాజా కాళోజీ'. ప్రజాకవిగా ప్రసిద్ధులు.
వీరి పూర్వీకులు మహారాష్ట్రులు. పీష్వాల రక్షణశాఖలో లెక్కలు చూసేవారు. ఆరు తరాలక్రితం నిజాంరాజు నుండి
'చేత్' పన్ను వసూలు చేయడాని సైన్యం వెంటవచ్చి బీదర్, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తర్వాత వీరిలో ఒకరిద్దరు తిరిగి మహారాష్ట్ర నాగపూరికి వెళ్ళి స్థిరపడ్డారు. తెలంగాణాలో వీరి పేరు చివరి 'పంతరావుగా ఇంటిపేరు 'కాళే ' నుండి కాళోజీగా మారింది.
కాళోజీ రామేశ్వరరావు హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పటి రంగారెడ్డి జిల్లాలోని 'ఆలూరు'లో 22 జూన్ 1908లో కాళోజీ రంగారావు, రమాబాయి దంపతులకు జన్మించారు. తండ్రి మహారాష్ట్ర బ్రాహ్మణుడు కాగా తల్లి కర్ణాటక మధ్య బ్రాహ్మణ కుటుంబంనుండి వచ్చినవారు. అందుకే వీరింట్లో తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు వినిపించేవి. రామేశ్వరరావు తండ్రి రంగారావు ప్రభుత్యోద్యోగం చేసి విరమణ తరువాత మడికొండలోనూ, హైదరాబాద్లోనూ విద్యాలయాలు స్థాపించి పిల్లలకు ఉచితంగా విద్య నేర్పేవారు. సంస్కృతం, ఇంగ్లీష్, ఉర్దూ, ఫార్సీలలో పండితులు. ఈ నేపధ్యమే రామేశ్వర్రావు గారికి, నారాయణరావు గారికి అనేక భాషలు నేర్పింది.
రామేశ్వరరావు గారి మేనమామ పండిట్ నర్దేవ్ శాస్త్రి. వారు తిలక్ స్కూల్ ఆఫ్ థాట్ కు చెందినవారు. ఉత్తరప్రదేశ్లో స్థిరపడ్డవారు. ఆర్య సమాజిస్టు, బ్రహ్మచారి,<noinclude><references/>
{{rh|తెలంగాణ |226| తేజోమూర్తులు}}</noinclude>
jcmckoqv824mwci0s5mmwo6vzjbgyff
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/248
104
211528
554093
551555
2026-04-22T14:26:22Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554093
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
స్వాతంత్రయ సమరయోధులు. వీరి ప్రభావం రామేశ్వరరావు, నారాయణరావుగారలపై బాగా ఉంది. వీరు ఆర్య
సమాజిస్టులు. ఇంట్లో కుల, మత భేదాలు లేవు.
రామేశ్వరరావు గారి విద్యాభ్యాసం మడికొండలో, హన్మకొండలో, హైదరాబాద్లో జరిగింది. ఒక సందర్భంలో విద్యార్థి దశలో కోర్టుకు వెళ్ళి అక్కడ న్యాయవాదుల పనితీరుకు ఆకర్షితులై 'వకాలత్' (న్యాయశాస్త్రం) చదివి పేరు మోసిన
'క్రిమినల్ లాయర్ అయ్యారు. న్యాయవృత్తిలో వీరు సంపాదించిందిలేదు. ప్రజాసేవతప్ప. కూడబెట్టిన ఆస్తులూ
లేవు. ప్రజలు న్యాయవాదిగా పేరు వీరికి.
రామేశ్వరరావు గారి ధర్మపత్ని 'సరస్వతీబాయి' గొప్ప మనిషి. భర్త ఆలోచనాధోరణుల్ని, ఆదర్భాల్ని గొప్పగా
సమర్థించి, సహకరించిన ఇల్లాలు. వీరికి ఒక కూతురు పేరు సక్కు బాయి. సక్కుబాయి భర్త పెండెం శ్రీనివాసరావు
జర్నలిజంలో ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధులు పి.వి. నరసింహారావు గారికి సన్నిహితులు. వీరికి సంతానంలేదు.
రామేశ్వర్రావు గారు తమ్ముడు ప్రజాకవి కాళోజీని ఆయన కుటుంబాన్ని తమ చివరి శ్వాసవరకూ పోషించారు. తమ్ముడు ప్రజాకవి కాళోజీని ప్రజలకు అంకితం చేశారు.
అన్నదమ్ములిద్దరూ స్వాతంత్య్ర సమరయోధులు. ప్రజాకవి కాళోజీది ప్రత్యక్ష పోరాటమైతే రామేశ్వరరావు గారిది పరోక్ష పోరాటం. ఉద్యమకారుల పక్షాన వకాల్తా పుచ్చుకునేవారు.
రామేశ్వరరావు గారు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ సభ్యులు. స్వాతంత్య్రానంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా,
మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. ఉద్ధండ రాజకీయ నాయకులైన హయగ్రీవాచారి, పి.వి. నర్శింహారావు, ఇటికాల
మధుసూదనరావు మొదలగువారంతా వీరి శిష్యుల వంటివారే. ఐతే అక్రమమనిపించినప్పుడు రామేశ్వరావు గారు ఎవరినీ సహించేవారుకారు.
బూర్గుల రాంకిషన్ రావులాంటి నాయకులు వీరిని ఎంతో గౌరవించేవారు. ప్రజాస్వామ్యంపై సంపూర్ణ విశ్వాసమున్న వారు రామేశ్వరరావు గారు.
రామేశ్వరరావు గారి రాజకీయ జీవితం, న్యాయవాద వృత్తి, సంఘ సేవ ఒక ఎత్తయితే వీరి కవితా జీవితం మరొక
ఎత్తు. వీరింట్లో ఉంటూ వీరి తిండి తింటూ ఎంతోమంది విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నతస్థానాలకు ఎదిగారు.
వీరి గృహం కవులకు ఆశ్రమం. ఆశ్రమం మొదట తెలుగులో రచనలు చేసినా ఉర్దూ కవిగానే స్థిరపడ్డారు. వీరి కలంపేరు 'షాద్' (ఆనందం).
తెలుగులో కథలు, స్కెచ్లు, కవితలు రచించారు. హిందీలోనూ కవిత్వం రాశారు. కాని ఉర్దూ కవిత్వం 'షాద్'
గారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళింది. 'దక్కన కవి’గా దేశంలో ఉర్దూ సాహితీ లోకంలో ప్రసిద్ధులయ్యారు. వరంగల్
కవులకు ఉస్తాద్ (గురువు) అయ్యారు. 'సియాసత్' లాంటి ప్రసిద్ధ ఉర్దూ పత్రిక 'షాద్' గురించి ప్రముఖ సాహితీవేత్త
సామల సదాశివ గారిచే సమాలోచన వ్యాసాలు రాయించి ప్రచురించింది. తమ తరం హైదరాబాద్ ప్రముఖ ఉర్దూ
కవులు షాద్ కవిత్వాన్ని అభిమానించి ఎన్నో ముషాయిరాలకు ఆహ్వానించి గౌరవించారు.
షాద్ ఉర్దూ కవిత్వంలో కొంతభాగం కలామెషాద్. అవ్వల్ కలామెషాద్ దువ్వమ్, కాయనా తెషాన్గా మూడు సంపుటాలు తాజా ముస్తర్, ఇన్మత ముజిఫరీ లాంటి కవి మిత్రులు ప్రచురించారు. తెలుగులో 'కాళోజీ రామేశ్వర్రావు షాద్ రచనలు' (స్వీయరచనలు, అనువాదాలు)గా పామర రామగోపాలరావు, తంగేళ్ళ ప్రకాశరావు గారలు ప్రచురించారు. హిందీలో గుజీగాన్' అనే హిందీ కావ్యాన్ని, కాళోజీ ఫౌండేషన్ వరంగల్, మిత్రమండలి ప్రచురించాయి.
'మనన్ కర్ నా చాహతాహు' అనే హిందీ కావ్యం, ఇంకా అనేక ఉర్దూ, హిందీ కవితలు అచ్చు కావల్సివుంది.
'షబ్నం' లాంటి వీరి ఉర్దూ కవితలు చాలా శక్తివంతమైనవి. 'జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక హైదరాబాద్ ప్రచురించిన 'మరో కొత్త వంతెన ఎక్ జార్ నయాపూల్ 'లో షాద్ ఉర్దూ కవిత, తెలుగు అనువాదంతో ప్రముఖమైనది. ఉర్దూ తెలుగు సాహితీ ప్రపంచానికి అన్నలాంటి కాళోజీ రామేశ్వర్రావు షాద్ అనారోగ్యంతో తమ 89వ ఏట 11 నవంబర్ 1996న ఉదయం 11.20కి తమ్ముడు ప్రజాకవి కాళోజీ మిగతా కుటుంబ సభ్యులు, మిత్రమండలి మిత్రుల, వారి వైద్యుల నుండి 'ఇకచాలు ఈ<noinclude><references/>
{{rh|తెలంగాణ |227| తేజోమూర్తులు}}</noinclude>
37f16tdpq0jrugy8luqjznwsmbxvkuo
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/249
104
211529
554094
551556
2026-04-22T14:42:02Z
A.Murali
3019
554094
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
'జీవితం' ఇటూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఈ పుణ్యజీవి, ఋషి తమ చివరిరోజు తుది శ్వాసకు పదిహేడు
గంటలముందు 'పలకరింత' అనే కావ్యాన్ని అంకితం తీసుకున్నారు. మొదటి ప్రతిని తమ్ముడు కాళోజీ సాక్షిగా
అందుకుని గుండేలకు హత్తుకున్నారు.... షాద్ తమ చివరి నిమిషంవరకూ సాహితీ ప్రపంచంలోనే జీవించారు.
'షాద్' మరణానంతరం తమ పార్థివ శరీరాన్ని మెడికల్ విద్యార్థుల చదువు, పరిశోధనకోసం మెడికల్ కాలేజీకి డొనేట్
చేయాలని బిల్లు రాసి రిజిస్టర్ చేయించారు. ఆ ప్రకారమే వారి శరీరాన్ని తమ్ముడు కాళోజీ, మిత్రమండలి ఉర్దూ
కవులూ మిత్రులూ కాళోజీ ఫౌండేషన్ వరంగల్లు వారు ఉర్దూ కవులు షాద్ డాక్టర్ మిత్రులూ, ఇంకా అశేష జనానీకం
కాకతీయ మెడికల్ కాలేజికి ఇవ్వడం జరిగింది.
'ఇష్టపూర్తిగా తమ శరీరాన్ని మెడికల్ కాలేజికి డౌనేట్ చేయడంలో కాళోజీ రామేశ్వరరావు 'షాద్' మొదటివారై అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఆ తర్వాత 'షాద్' తమ్ముడు ప్రజాకవి కాళోజీ, 'షాద్' కూతురు 'సక్కుబాయి'
షాద్ బాటలో నడిచి తమ పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు డొనేట్ చేశారు. షాద్ జీవితాంతం
ఇతరుల కోసం కన్నుల తడిలో జీవించారు. కాళోజీ రామేశ్వరరావు షాద్ రచనల్లో కొన్ని రచనలు:
<poem>
“దారి బత్తెము చెల్లి పోవగ
దారి మాత్రము మిగిలియున్నది.
బాటసారిని కలచివేసెడు
బాధమాత్రము మిగిలియున్నది" </poem>
అంటూ నోగజిలో అంటారు జీవితపు చివరిరోజుల్లో.
<poem>
"ఎన్నికలవేళ వాడెంత గొప్పోడు
ఓటున్న ప్రతి పౌరుడొక చక్రవర్తి
ఆ క్షణము గడిచెనా అన్నాదివాడు" </poem>
అంటూ ఎన్నికల ప్రహసనాన్ని తెలియజేస్తారు.
ఒక హిందీ కవితలో -
<poem>
"అన్యా యీ జగే సే లడ్ కర్ బార్ బార్ ఘాయల్ హోతాహుం
హార్ హార్ కర్ తక్ జాతాహు తబ్ తన్హామీమే రోతాహు కవితామె
అప్నే సీనేక గహరీ దామ్ దిఖాతా హు పత్తర కొ విగ్లా సక్ తాహు”...</poem>
హైదరాబాద్ 400 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరో కొత్త వంతెన - ఎక్ జార్ నయాపూల్
అనే ప్రసిద్ధ కవితా సంగలనానికి రాసిన కవితలో-
<poem>
"హిందూ ముస్లిం సభ్యతలకు
మేలు కలయిక భాగ్యనగరము
ప్రతి అతిధిని ఆదరించి
తనవాదిగ చేసుకొనెను”</poem>
ఇంకొక కవిత ఉర్దూలో రాసింది. శీర్షిక 'షబ్నం. ఇది షాద్ కవితల్లో ప్రసిద్ధమైనది-
"జో గున్చే చమన్ మెధో సోతేహు మే వున్హే ఆకె షబ్నం జగాకర్ యీ, సబ్గేరా హువా ముహ్ ధులాకర్ గయీ నహ్లాకర్
ధులంకర్ సజాకర్ గమీ
రహీఘుద్ చమన్ సదా అశ్బీర్ తబస్సుం కలీలో
అతాకర్ గయీ రహీతాజీ సబ్ కో దేతె హుయె గయీతో
సబీ కో హసాకర్ గయీ అంథేరె సె ఆయా సుబహ్ దమ్
గయీ నజానా కిసీవె కబ్ ఆకర్ గయీ మిలీథీ వుసే ముక్తసర్
సీ హయాత్ వునీమె కిసీకా భలాకర్ గయీ బసేరా ఘడీభర్
చతున్మె కియూ చమన్ కో మగర్ క్యాసెక్యాకర్ గయీ
ఘడీ దోఘడీ కా వతన్ థా చమన్ జి.సె. ఆకె షబ్నం
హరాకర్ గయీ చమన్ సే వుసే కుఛ్న హాసిల్ హవా
మగర్ వున్పై సబ్కుచ్ లుటాకర్ గయీ లుటాకర్ చమన్
పర్ నిజి ఆబరూ గులిస్తాకి శౌనక్ బఢాకర్ గయీ బులావే
జబ్ ఆయీ ఆయే మునీర్ చమక్ దమక్ తే ఖజాకర్
గయీ ఘడీభర్మ రోథో రుస్సత్ హుమీ పుసేగమ్ సహీఫర్డ్
అధాకర్ గయీ జమానే కె దర్సే షహాదత్ దియా హమే
మర్కె జీనా సిఖాకర్ గయీ యహీ మేక్ పానీకి ఛోటీసి
బూంద్ మేరే దిల్మె హల్చల్ మాచాకరయీ
'షాద్' రచించిన ఈ కవితలో 'షబ్నం' (మంచుబిందువు) వస్తువు. ఒక ఉదయంపూట తోటలో పచ్చికమీద మంచుబిందువున చూస్తుంటే కవిలో కల్గిన భావన కవితగా మనోజ్ఞంగా రూపుదిద్దుకున్నది.
మంచుబిందువు తోటలోని పచ్చికకూ, పూలగుత్తులకూ<noinclude><references/>
{{rh|తెలంగాణ |228| తేజోమూర్తులు}}</noinclude>
pal1rqcnsbny8jt50hd1dlvd6zwfciw
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/250
104
211530
554095
551557
2026-04-22T14:44:52Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554095
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ప్రాణం పోస్తుంది. మొగలదిగులును దూరం కొడుతుంది. తోటను చైతన్యపరుస్తుంది. ఆనందపరుస్తుంది. స్వార్ధరహితంగా తానున్న, కొద్దిసేపే తోటకు మేలుచేసి దాని మనసు గెలుస్తుంది. సూర్యకాంతి పడగానే మెరుస్తూ
తోటనుండి శాశ్వతంగానిష్క్రమిస్తుంది. మంచుబిందువు తాను మరణిస్తూ తోటకు ప్రాణం పోస్తుంది.
లోక 'కల్యాణం' కోసం నిస్వార్థంగా మనిషి తనను తాను అర్పించుకోవాలన్నది ఈ కవితలోని అంతర్భావం.
కాళోజీ రామేశ్వరరావు 'షాద్' జీవితంగూడా అటువంటిదే. జీవితమంతా ఇతరుల కోసమే బ్రతికారు. ఇతరుల కోసమే శ్రమించారు. 'షాద్' కూ 'షబ్నం' కు చాలా పోలికలున్నాయి. మనిషిగా మాత్రం సంపూర్ణ ఆయుష్షు (89 ఏళ్ళు) జీవించారు.
'షాద్' ఒక నిజమైనకవి. వారి కవిత్వమంతా సౌందర్యాన్వేషణే! ఇంతేకాకుండా మనిషి తత్వం గురించి చెప్పుతూ మనిషి జీవిత కర్తవ్యతను సూచిస్తారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |229| తేజోమూర్తులు}}</noinclude>
4d4xygkze3u7uv737e1micp9o7a6see
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/251
104
211531
554132
551558
2026-04-23T06:56:21Z
A.Murali
3019
554132
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''65. కాల్వ బాలయ్య '''</p>}}
{{right|-ఉండ్రాల రాజేశం}}
పండిత పామర జనరంజకమైన సంగీత, సాహిత్య, నృత్య, కళామయమైన సాహిత్య ప్రక్రియల్లో స్వతంత్ర ముద్రను కలిగి, కలికితురాయిలా శోభిల్లు ప్రక్రియ యక్షగానం. యక్షగానాలు నైజాం మత దురహంకారాన్ని తట్టుకుని నిలిచి తెలంగాణ సాంస్కృతిక అద్దం పట్టింది. యక్షగానం అనగా యక్షుల పాటయని సామాన్యార్ధం. యక్షులనే పేరు అత్యంత ప్రాచీన కాలమునుండి వైదిక, బౌద్ధ, జైన సాహిత్యములలో ఉదహరించబడింది.
యక్షగాన శబ్దము మొదటగా శ్రీనాథుని భీమఖండంలో ఉటంకించబడింది. 16వ శతాబ్దములో కందుకూరి రుద్రకవి
రచించిన “సుగ్రీవ విజయం" యక్షగాన వాఙ్మయములో మొదటిదని చెప్పవచ్చు శతాబ్దాలుగా యక్షగాన పాటలు
ప్రజల నాల్కలయందు నాట్యమాడినవి. మెతుకు సీమ మాగాణములో చెర్విరాల బాగయ్య, బెల్లోజు రమణాచారి
అనే కవులు శతాధిక యక్షగానాలు పండించి అందించడం, ఆడించడం విశేషం. అదేపరం పరలో యక్షగానములు రాసి, పాడి, ఆడించిన కళాకాలులలో కాల్వ బాలయ్య ఒకరు.
కళలకు కాణాచియై, సాహిత్యానికి కల్పవల్లియైన సిద్దిపేట పట్టణములో 1936 సం॥లో కాల్వ లక్ష్మి - శంకరయ్య దంపతులకు బాలయ్య జన్మించాడు. వారిది చేనేత కుటుంబం. బాలయ్య తండ్రి వద్దనే ఆక్షరాభ్యాసం చేసి అతని వద్దనే పెద్దబాలశిక్ష నేర్చుకున్నాడు. తరువాత
కుల వృత్తిలోకి దిగాడు. మగ్గంతో బట్టలు నేస్తూ భీవండి,
బొంబాయి తదితర ప్రదేశాలు తిరగసాగాడు. కడుబీద
స్థితిలోవుండి రాత్రుల్లో యక్షగానాలు, వీధి నాటకాలు
చూపేవాడు. తాను నాటకాలలోని పాత్రలలో
లీనమైపోవడమేకాదు, రామాయణ, మహాభారత పాత్రలలో
చినన్నప్పుడే నటించి కళాహృదయుల మన్ననలు పొందాడు.
పురాణాలు, ఇతిహాసాలు ఇంటిలోనే చదివి వాటి సారమును
గ్రహించాడు. సృజనాత్మకత శక్తిబలపడింది. తానుకూడా
యక్షగానాలు రాయగలనని నిర్ణయించుకున్నాడు.
కాల్వ బాలయ్య కళారంగములో మంచి కార్యకర్త.
1960 ప్రాంతంలో "శివభక్తమండలిని ఏర్పాటు చేశాడు.
కొంతమంది శిష్యబృందాన్ని ఏర్పరచుకుని సిద్ధిపేట
మార్కండేయ దేవస్థానమందు యక్షగానములు అభ్యాసనము
చేసి, చేయించి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తరువాత నెమ్మదిగా
ప్రవాహంలో సిద్ధిపేట పరిసర గ్రామాల్లో, దుబ్బాక, ముచ్చర్ల,
కొత్తపల్లి, నాందేడ్, సోలాపూర్, భీవండి, బిక్కనూర్
ప్రాంతాలలో యక్షగాన ప్రదర్శన ఇచ్చేవాడు.
ఉగాది, వినాయకచవితి, దేవీనవరాత్రులు,
దేవాలయాల వార్షికోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా యక్షగాన
ప్రదర్శన ఆకర్షించేది. సినిమాలు, టెలివిజన్లు లేని ఆ
కాలములో చిందు యక్షగానాలే మనోరంజకాలు. ఈయన
యక్షగానాలలో దుర్యోధన, శాంతన మహారాజు,
తెలంగాణ (230 తేజోమూర్తులు ఉ<noinclude><references/>
{{rh|తెలంగాణ |230| తేజోమూర్తులు}}</noinclude>
m0xat3zkd4ttcbr8p4qwl3h7ix88czd
554137
554132
2026-04-23T07:16:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554137
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''65. కాల్వ బాలయ్య '''</p>}}
{{right|-ఉండ్రాల రాజేశం}}
పండిత పామర జనరంజకమైన సంగీత, సాహిత్య, నృత్య, కళామయమైన సాహిత్య ప్రక్రియల్లో స్వతంత్ర ముద్రను కలిగి, కలికితురాయిలా శోభిల్లు ప్రక్రియ యక్షగానం. యక్షగానాలు నైజాం మత దురహంకారాన్ని తట్టుకుని నిలిచి తెలంగాణ సాంస్కృతిక అద్దం పట్టింది. యక్షగానం అనగా యక్షుల పాటయని సామాన్యార్ధం. యక్షులనే పేరు అత్యంత ప్రాచీన కాలమునుండి వైదిక, బౌద్ధ, జైన సాహిత్యములలో ఉదహరించబడింది.
యక్షగాన శబ్దము మొదటగా శ్రీనాథుని భీమఖండంలో ఉటంకించబడింది. 16వ శతాబ్దములో కందుకూరి రుద్రకవి
రచించిన “సుగ్రీవ విజయం" యక్షగాన వాఙ్మయములో మొదటిదని చెప్పవచ్చు శతాబ్దాలుగా యక్షగాన పాటలు
ప్రజల నాల్కలయందు నాట్యమాడినవి. మెతుకు సీమ మాగాణములో చెర్విరాల బాగయ్య, బెల్లోజు రమణాచారి
అనే కవులు శతాధిక యక్షగానాలు పండించి అందించడం, ఆడించడం విశేషం. అదేపరం పరలో యక్షగానములు రాసి, పాడి, ఆడించిన కళాకాలులలో కాల్వ బాలయ్య ఒకరు.
కళలకు కాణాచియై, సాహిత్యానికి కల్పవల్లియైన సిద్దిపేట పట్టణములో 1936 సం॥లో కాల్వ లక్ష్మి - శంకరయ్య దంపతులకు బాలయ్య జన్మించాడు. వారిది చేనేత కుటుంబం. బాలయ్య తండ్రి వద్దనే ఆక్షరాభ్యాసం చేసి అతని వద్దనే పెద్దబాలశిక్ష నేర్చుకున్నాడు. తరువాత కుల వృత్తిలోకి దిగాడు. మగ్గంతో బట్టలు నేస్తూ భీవండి, బొంబాయి తదితర ప్రదేశాలు తిరగసాగాడు. కడుబీద స్థితిలోవుండి రాత్రుల్లో యక్షగానాలు, వీధి నాటకాలు చూపేవాడు. తాను నాటకాలలోని పాత్రలలో లీనమైపోవడమేకాదు, రామాయణ, మహాభారత పాత్రలలో చినన్నప్పుడే నటించి కళా హృదయుల మన్ననలు పొందాడు. పురాణాలు, ఇతిహాసాలు ఇంటిలోనే చదివి వాటి సారమును గ్రహించాడు. సృజనాత్మకత శక్తిబలపడింది. తానుకూడా యక్షగానాలు రాయగలనని నిర్ణయించుకున్నాడు.
కాల్వ బాలయ్య కళారంగములో మంచి కార్యకర్త. 1960 ప్రాంతంలో "శివభక్తమండలిని ఏర్పాటు చేశాడు. కొంతమంది శిష్యబృందాన్ని ఏర్పరచుకుని సిద్ధిపేట మార్కండేయ దేవస్థానమందు యక్షగానములు అభ్యాసనము చేసి, చేయించి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తరువాత నెమ్మదిగా ప్రవాహంలో సిద్ధిపేట పరిసర గ్రామాల్లో, దుబ్బాక, ముచ్చర్ల, కొత్తపల్లి, నాందేడ్, సోలాపూర్, భీవండి, బిక్కనూర్ ప్రాంతాలలో యక్షగాన ప్రదర్శన ఇచ్చేవాడు.
ఉగాది, వినాయకచవితి, దేవీనవరాత్రులు, దేవాలయాల వార్షికోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా యక్షగాన ప్రదర్శన ఆకర్షించేది. సినిమాలు, టెలివిజన్లు లేని ఆ కాలములో చిందు యక్షగానాలే మనోరంజకాలు. ఈయన యక్షగానాలలో దుర్యోధన, శాంతన మహారాజు,<noinclude><references/>
{{rh|తెలంగాణ |230| తేజోమూర్తులు}}</noinclude>
ihoh4b4xf7dw4rvlgf0n50iqs836tp1
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/252
104
211532
554141
551559
2026-04-23T07:33:57Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554141
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
భృగుమహర్షి, అర్జునుడు, తదితర పాత్రలు పోషించి, ఎందరో ఆదరాభిమానాలు పొందాడు. కాల్వ బాలయ్య ఉదయం నుండి సాయంత్రందాకా మగ్గం నేయడం రాత్రుల్లో యక్షగాన ప్రదర్శనల్లో లీనమయ్యేవారు. కడుబీద స్థితిలోవున్నా ఊహలకు పదునుపెట్టి యక్షగాన రచనల్లో కృషి చేయసాగాడు. అనతికాలములోనే యక్షగాన రచనా ప్రక్రియ కరతలామలకమైంది.
కాల్వ బాలయ్య తాను యక్షగాన ప్రదర్శనలివ్వడమే గాదు, తన మేథా ప్రతిభచే భీష్మ ప్రతిజ్ఞ, శ్రీకృష్ణమాయ మృగము, శూర్పణక కర్ణనాసికా ఛేదనము, గంగాభగీరథో పాఖ్యానము, భావన మహర్షి విజయము, శ్రీనివాస కళ్యాణ్ము, నీలకంఠరుద్ర సంభవము మొదలైన యక్షగానాలు నాటక కళామాతల్లికి మణిభూషణాలుగా అలంకరించాడు. పై యక్షగానములు రచించేందుకు పురాణాలను మరోసారి చదివి, వాటిలోని లోతుపాతుల్ని గ్రహించాడు. కీర్తనలు,
పాటల సంభాషణలు, కందార్థాలను కమ్మగా రాశాడు.
యక్షగానము సర్వసాధారణ ప్రజల అభిమానం చూరగొన్న ప్రదర్శన. ప్రతి యక్షగానంలో ఒక హాస్యపాత్ర(బుద్ధరణాన్) ప్రవేశిస్తుంది. అదే పాత్ర అప్పుడప్పుడు మంత్రిగా, సైనికుడిగా మరెన్నో చిన్న పాత్రలను పరిచయం చేస్తుంది. అట్టి హాస్య పాత్రనే నిగతా పాత్రలను రక్తి కట్టించేలా ఉంటుంది. యక్షగాన కళాకారుడికి నటన రావాలి. నాట్యం రావాలి. పాటలు పాడే శక్తి ఉండాలి. సంభాషణలను అర్థవంతంగా చెప్పే సామర్థ్యం ఉండాలి. ప్రతి యక్షగానంలో నటన - నృత్యం - పాటలతోపాటు రాగం, తానం, పల్లవిల పరిజ్ఞానం ఉండాలి అవన్ని ప్రాధాన్యత వహిస్తాయి. ఇవన్నింటిలో కాల్వ బాలయ్య ఆరితేరినవాడు. సామాన్యంగా యక్షగానాలు పురాణీతిహాసముల ఇతివృత్తములు. యక్షగాన రచయిత కు పురాణ, ఇతిహాసాలు తెలిసి ఉండాలి. సాహిత్యంతోపాటు రాగం, తానం, పల్లవిలను సాధన ద్వారా బాలయ్య సంపాదించాడు.
కాల్వ బాలయ్య అన్నింటిని అలవోకగా పోషిస్తూ, తాను రచించిన యక్షగానములను ఇతర కళాకారులకు నేర్పిస్తూ, వాయిద్యాలు నేర్పిస్తూ, తానూ అందులో పాత్రకారి అయ్యేవాడు. అట్లే వాటికి దర్శకత్వం వహించేవాడు. శ్రీకృష్ణ మాయ లేడి అనే సరికొత్త ఇతివృత్తంలో యక్షగానం రాసి, ప్రదర్శించి పేరు ప్రఖ్యాతలు ఆర్జించాడు. మహాభారతం లోని చిన్న అంశంను తీసుకుని రామాయణాంశం జోడించి లౌకికంగా పాటలు, పద్యాలతో కథను అద్భుతంగా నడిపాడు. అందులో ఆయా సందర్భానుసారంగా ముఖ్య పాత్రలు పోషించాడు. తన జట్టులోని నటులందరికి చక్కని మార్గదర్శనం చేశాడు. ఎందుకంటే ఆ రోజులలో స్త్రీల పాత్రలను మగవారే పోషించారు కాబట్టి ఆహార్యం దెబ్బ తినకుండా చూసేవారు.
చక్కని ఆహార్యం, అతి చక్కని అంగీకంలు కాల్వ బాలయ్య సొంతం. ఈయన యక్షగాన పాత్ర వేదిక పై
ప్రవేశింపబడిందంటే చాలు ప్రులంతా కరింతలు కొట్టేవారు. తియ్యటి గొంతుగల బాలయ్య గానామృతాన్ని మౌనంగా
ఆస్వాదించేవారు. కంటి కునుకు లేకుండా రాత్రులంతా ప్రదర్శనలు తిలకించేవారు జనాలు. నటులు వేషాలు
వేసుకోవడంలో, వస్త్రాలంకరణ చేసుకొనడంలో క్రమశిక్షణ పాటింపజేసి సహజత్వానికి దగ్గరగా చూపేవాడు.
యక్షగాన రచనలో కందార్థముల సృష్టి తెలివి తేటలతో కూడుకున్నది. అట్టి రచనను కాల్వ బాలయ్య "నీలకంఠ
రుద్ర సంభవము" అను యక్షగానంలో ఇంద్రుడు ఇలా అంటున్నాడు. నా యొక్క అచ్చబ క్వర్యాలు పాల సముద్రంలో పడిపోయినాయి. పాలసముద్రంలో విషమును తొలగించి, అమృతాన్ని కాపాడి మాకు అందించినావు శివుడా! నన్ను కాపాడు అంటూ ఇంద్రుడి గూర్చి “ఆటతాళంలో” ఇలా వర్ణించాడు.
<poem>
{{left margin|5em}}
ఇ౹౹క౹౹
తెలియక నొనరించితిని దుష్పల సాగరమందు
మునిగి భ్రష్టుడనైతిన్ కల దప్పిపోయితిని
నా కలతలు విదళించవేర ద ఆట కాకోదర
భూషణ చిన్మయరూప కా మిత్ర అకడలి విషమణ
గ జేసియు నట్టి పీయూషమును గాచియు మా
కు శుభములందజేయవె మంగళింగభవా </poem>
'''సనాతన కా '''
సంగీతము, సాహిత్యాలను జీర్ణించుకున్నాడు కాబట్టి యక్షగాన రంగములో సాటిలేనివాడయ్యాడు బాలయ్య
మరొక యక్షగానం “భావనమహర్షి విజయం” కాల్వ<noinclude><references/>
{{rh|తెలంగాణ |231| తేజోమూర్తులు}}</noinclude>
sxidixpgwfc9mlibf80n1aobfygx3bo
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/253
104
211533
554143
551560
2026-04-23T07:57:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554143
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
బాలయ్య కలం నుండి కదిలివచ్చింది. అందులో కాలశేషుడనే రాక్షసుడు భద్రావతిని చూసిన సందర్భంలో
'త్రిపుట' తాళంలో అందమైన పాటలనుందించాడు.
అందులో ఒక పాట:
<poem>
1 చ౹౹ కలికి మీరు వాతి భాతి కలల్ గలభామిని క
గలభామిని గజంగామిని చెలి భమర
కుం తలిగాంచితిని భళి క
2 చ౹౹ నిలువగనులేను నేను వలల్ చలియించెన్ ని
చలియించెను పులకించెను వల ఱేనితూ
పుల కోసమే నిల క
3 చ॥ ధరణీ ప్ర సిద్ధి సిద్ధి పురీ వరుణేలును ధ వరుడేలును
దరిచేర్చును గరి సొగను మం జరి గాంచితిని పరి క</poem>
ఇలాగే కాల్వ బాలయ్య రాసిన పాటలు, సంభాషణలు సాధారణ ప్రజల కర్దమయేవిలా, అలంకారాలతో కూడి
ఉండేవి.
గంగా భాగీరధోపాఖ్యానము యక్షగానములో భగీరథుడు తపస్సు చేసి ఆకాశ గంగను భూమ్మీదికి తెచ్చి, తన తాతల భస్మరాసులను తడిపి వారికి మోక్షము లభించేలా చేసిన విధానాన్ని హృద్యమైన పద్యాలు, పాటలు, సంభాషణలతో రచించి ఆ పురాణగాథను ముందు తరాలవారికి కందించాడు. దానివల్ల భగీరథ ప్రయత్నమంటే ఏమిటో సాధారణ ప్రజలకర్ధమైంది.
తండ్రి సుఖం కోసం అపురూపమైన త్యాగం చేసిన భీష్ముని గురించి యక్షగానం రాసి భీష్మప్రతిజ్ఞ అంటే ఏమిటో
పల్లే జనాలకు, పామర జనాలకు అర్థం చేయించారు. "శ్రీనివాస కళ్యాణము" యక్షగానంలో కలియుగ దైవమైన
వేంకటేశ్వర మహాత్యాన్ని కళ్ళకు కట్టించాడు. తాను నీలకంఠ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి నీలకంఠేశ్వర
మహాత్మ్యం అందరికి తెలిసేలా "నీలకంఠ రుద్ర సంభవము” యక్షగానము రాశాడు. అందులో తాను ముఖ్య ధారియై
దర్శకత్వం వహించాడు.
కాల్వ బాలయ్య యక్షగానాలే కాకుండా సాహిత్యసీమలో కవిగా రాణించారు. అన్నిరకాల ఛందస్సులలో పద్యాలను రాసి, శతకాలను వెలువరించాడు. శ్రీ కోటిలింగేశ్వరశతకం, అన్నపూర్ణ భవానీశతకం, శ్రీ నీలకంఠేశ్వర శతకం, నేటికాల స్త్రీ పురుష ప్రవర్తన, కందార్థములు, షిరిడి సాయిబాబ శతకాలను సాహితీ లోకానికి అందించాడు. సిద్ధిపేట లో వెలసిన శ్రీ కోటిలింగేశ్వరస్వామి మహాత్మ్యాన్ని 'శ్రీ కోటిలింగేశ్వర శతకం'. నీలకంఠేశ్వరుడి మహిమలను "నీలకంఠేశ్వర శతకంలో పద్యాలతో రక్తికట్టించాడు. కాశీ అన్నపూర్ణదేవి మహిమలను “అన్నపూర్ణభవాని శతకంలో వర్ణించారు.
ముఖ్యంగా కాల్వ బాలయ్య శతకాలలో మరొకటి "శునక వానరీయం" పద్య కృతిని, ప్రత్యక్ష సంఘటనా విరచితముగా ఆవిష్కరించాడు. ఈ యదార్థ సంఘటన పద్యకథగా మలిచినాడు. మూగజీవులైన కుక్క కోతి స్నేహంగా ఉంటూ అందరిని ఆశ్చర్యచకితులను చేస్తూ ఉండేవి. కోతికెవరైనా కుడుక అందించిన కుక్కకు తినబెట్టేది. అన్నదమ్ముల మధ్య వైరముందే ఈ రోజులలో కుక్క కోతి స్నేహబంధం ఎంతో ఉదాత్తమైనది. మానవాళికి ఆదర్శప్రాయమైనది. ఒకసారి కుక్క అకస్మాత్తుగా మరణించింది. కుక్క శవము పక్కన కూర్చుండి, కోతి దుఃఖముతో కుక్కను ఆలింగనం చేసుకుంటున్న దృశ్యాన్ని చూడడానికి జనులు తండోపతండాలు వచ్చి అందరు దుఃఖించారు. గుండెల్ని కదిలించే ఈ అద్భుత సంఘటనను కాల్వ బాలయ్య ఇలా చెప్పసాగారు.
<poem>
{{left margin|5em}}
సీ. కోటికి పడగెత్తి మేటియైన నరుందు
జచ్చినవారు యీ చందముగను
పదిమందిలో పల్కుబడి యున్నమనుజుడు
సమసినరారు యీ జనములిట్లు
కావ్యంబునందు ప్రఖ్యాతి గాంచినవాడు.
బోయినరారు యీ పుడమినందు
రోగంబులన్ మాన్పి బాగుగా యశమెందు
వాడు మ్రగ్గిన నిట్లు జూడరారు
గీ. తాల్ల జన్మంబునందు నీ నల్లకుక్క
పుణ్యకార్యంబు లెన్నెన్ని పుడమిజేసి
మెత్తెనో యిట్టి జన్మంబు నెంచి జూడ
వేల కన్నులు జూచుట వింతగాదె </poem>
అనే పద్యరచనతో మూగజీవుల రాగబంధంపై చక్కగా వర్ణించి ఎందరో హృదయాల్లో నిలిచినట్టి కవి కాల్వ<noinclude><references/>
{{rh|తెలంగాణ |232| తేజోమూర్తులు}}</noinclude>
2cands9y9b2pe3hrio0uohj9nrcbwa0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/254
104
211534
554144
551561
2026-04-23T08:04:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554144
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
బాలయ్య. పంచతంత్రములో పక్షులు - జంతుజాలములు పాత్రధారులై మానవులకు నీతులు నేర్పినట్లుగా
"శునకవానరీయము” మానవాళికి మార్గదర్శనము చేసింది.
కాల్వ బాలయ్య నిత్యం దేవాలయాలలో భజనలు చేయుటకుగాను అనేకమైన భజన కీర్తనలు రచించి భక్త బృందము ఆమోదం పొందేవాడు. భజున కీర్తనలను తాను పాడుతూ, భక్తులచే బాడిస్తూ, భక్తి పారవశ్యములో మునిగేవాడు. తాలాలు మరియు తబలా లయబద్ధంగా వాయిస్తూ పాటలను వినసొంపుగా మార్చేవాడు. నిన్న వారిని ఆనందడోలిక లూగించేవాడు.ఆయన రాసిన భజన కీర్తనలు నేటికి గూడా సిద్ధిపేట ప్రాంతంలోని దేవాలయాల్లో పాడుకుంటున్నారు.
సాహిత్యం, సంగీతం, నృత్యం, సంభాషణాచాతుర్యం సమపాళ్ళలోగల కాల్వ బాలయ్య యక్షగాన రచనలపై లక్ష్మి
అన్నపూర్ణ, డా. దాశరథుల బాలయ్యలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేయడం జరిగింది.
మహాభారత యక్షగానాల పరిశోధనల్లో భాగంగా కాల్వ బాలయ్య రచన "శ్రీకృష్ణ మాయామృగం” యక్షగానంపై
కూడా పరిశోధన జరిగింది. తనకు ఒక కన్ను కన్పించకపోయినా,దృష్టిలోపంవున్నా రచనలు మాత్రం కొనసాగించాడు. అవార్డులను, రివార్డులను ఆమడ దూరంలోవుండి ప్రజలమధ్యనే నిలిచి యక్షగాన ప్రదర్శనల్లో మునిగితేలాడు కాల్వ బాలయ్య.
సాహితీ క్షేత్రంలోని యక్షగాన విభాగంలో విశాలంగా కృషి చేసిన కాల్వ బాలయ్య 2.10.2015 రోజున పరమపదించారు. ఆయన ముగ్గురు కుమారులను విద్యావంతులుగా తీర్చిదిద్దినారు. కఠిక దారిద్య్రం అనుభవించినా, కఠోర పరిశ్రమతో సాహితీ క్షేత్రంలో ఎన్నో విజయాలు సాధించారు. కాల్వ బాలయ్య అముద్రిత రచనలు సాహితీ రత్నాలుగా వున్నా, ఆర్థిక సమస్యల వల్ల ముద్రణకు నోచుకోలేదు.
"కళల విద్యలెన్ని నేర్చినా - కుల విద్యల సాటిరావు గువ్వలచెన్నా” అన్నట్లుగా కాల్వ బాలయ్య చేనేత కార్మికుడిగా
కూడా మంచి పేరు. ప్రఖ్యాతలనార్జించాడు. చేనేతలో కూడా తోటివారికి మెలకువలు నేర్పించాడు. ప్రముఖ బాతిక్
చిత్రకారులకు రంగుల అద్దడంలో అర్థవంతమైన సూచనలు ఇచ్చాడు. నేటికి ఆయన శిష్యులు చిందు యక్షగాన
కళాకారులు నేటికి అతనిని గురు భావంతో పూజిస్తారు. కాల్వ బాలయ్య యక్షగానముల దృశ్యమాలికలు నేడు కోకోల్లలుగా అనేక ప్రాంతాలలో ఉనికి ఉన్నాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |233| తేజోమూర్తులు}}</noinclude>
efw2azxvu6zx2i1b1mxxodaus1t2g9q
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/255
104
211535
554145
551562
2026-04-23T08:21:51Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554145
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''66. కనపర్తి రామచంద్రుడు '''</p>}}
{{right|- డా॥ దాసోజు పద్మావతి}}
:వచన కవిత నా ఉద్యమం
:వచన కవిత నా ఉద్యోగం
అని నినదించి, వచన కవిత్వమే ధ్యాసగా, శ్వాసగా జీవించిన కవి కనపర్తి. తెలంగాణా తల్లి ఒడిలో ఉదయించిన
సిద్ధిపేట ముద్దు బిడ్డ వచన కవితా ప్రవీణ కనపర్తి రామచంద్రాచార్యులు.
కనపర్తి 1947 ఆగస్టు 9వ తేదీన జన్మించారు. తల్లి భూలక్ష్మి, తండ్రి రంగన్న. రంగన్నగారు తెలంగాణ సాయుధ
పోరాటంలో వీర మరణం పొందారు. అపుడు కనపర్తికి 2 సంవత్సరాల వయస్సు. తల్లి భూలక్ష్మిగారు (తెలుగు భాషా
పండితులు) తల్లి, తండ్రి, గురువు తానై కనపర్తిని చక్కని విద్యాబుద్ధులతో తీర్చిదిద్ది మంచి కవిని సమాజానికి
అందించారు. బయోడేటా అన్న కవితలో కనపర్తి తన గూర్చి ఇలా వ్రాసుకున్నారు.
<poem>
{{left margin|5em}}
నాన్న ఒక 'అగ్గిపుల్ల
వెలిగించి వెళ్ళిపోయారు
అమ్మ 'చమురు' లాంటిది
ఇంకా నా కోసం
లోలోపలే ఇగిరిపోతుంది.</poem>
కనపర్తి ప్రాథమిక విద్యాభ్యాసమంతా తోర్నాల, సిద్ధిపేటలో జరిగింది. నా కవితా ప్రస్థానానికి పచ్చతోరణం కట్టింది తోర్నాల గ్రామమే అంటారు కనపర్తి. అది కీలక నామ సంవత్సరం హెచ్.ఎస్.సి చదువుతున్న రోజులు (14
సంవత్సరాల వయస్సు) ఆశువుగా చెప్పిన కవిత. ఇది తొలికవితగా కవి వ్రాసుకున్నారు.
మడిసింది నాలో అజ్ఞాన ప్లవంగం - (ప్లవంగం -కొతి)
చెపుతావా సరస్వతి వీ కవితా కీలకం (కీలకం -రహస్యం) అంటారు కనపర్తి.
కనపర్తి స్కూల్ స్థాయిలో భారత, భాగవత, రామాయణాధికావ్యాలు చదివారు. ప్రాచీన సాహిత్యమన్న, పద్యసాహిత్య మన్న ఎంతో ఇష్టం కనపర్తికి. ఆంధ్రసారస్వత పరిషత్లో బి.ఓ.ఎల్ చదివేటపుడు 1971 వ సంవత్సరం మార్చి 17న కమలతో వారి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు నాగరాజు, విద్యా ప్రకాశ్ శరత్. కనపర్తి ఉద్యోగ జీవితం 1974వ సంవత్సరం పశుసంవర్ధక శాఖ జోగిపేటలో ప్రారంభమైంది. వృత్తికి, ప్రవృత్తికి పొంతక కుదరక కొద్ది కాలానికే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తరువాత పూర్తి కాలం కవితా వ్యాసాంగానికే వెచ్చించారు. మధ్య తరగతి సామాన్యునికి ఉద్యోగం లేకపోతే ఎదురయ్యే కష్టాలు మాటలకందనివి. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవితకాలం ఆర్థిక సమస్యలు వెంటాడాయి కనపర్తిని.
మెదక్ జిల్లాలోను, సిద్దిపేటలోను ఏ సాహితీ కార్యక్రమం జరిగినా కవి సమ్మేళనం జరిగినా అక్కడ కనపర్తి<noinclude><references/>
{{rh|తెలంగాణ |234| తేజోమూర్తులు}}</noinclude>
0pgc8673plwcuzzeptvd5u3v6n8paud
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/256
104
211536
554146
551563
2026-04-23T08:24:52Z
A.Murali
3019
554146
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఉండాల్సిందే. వారి స్వగ్రామం సిద్ధిపేటంటే వారికి ఎంతో
ఇష్టం, కవులకు, కళాకారులకే కాదు వీరులకు, ఉద్యమ
కారులకు కట్టని కోట నా సిద్దిపేట అంటారు కనపర్తి,
దుకుంటారు కోటి లింగేశ్వరుడు
ఊరి మధ్యలోనే
కాపురం పెట్టాడు శ్రీవేంకటేశ్వరుడు' అంటూ వారి
స్వగ్రామం గూర్చి వ్రాసుకున్నారు.
కనపర్తికి ప్రాచీన కవులంటే ఎంతో అభిమానం.
ఆధునిక కవుల్లో శ్రీ.శ్రీ. దాశరథి, కుందుర్తి, కృష్ణ శాస్త్రి
రచనలంటే ఎంతో మక్కువ. కాళోజీ అంటే ప్రాణం. కాళోజీ
ప్రభావం ఎంతగానో వుంది కనపర్తి రచనలపై,
అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు
కదలిక అని కాళోజీగారన్నారు.
శ్రీ కారానికి ప్రతీక
ఓంకారానికి టీక
ఒక సిరా చుక్క
ఒక సిరా చుక్క
నిద్రాముద్రిత జన చైతన్యానికి
వేగు చుక్కు
బీడు వారిన మెదడు భూముల్లో
వాన చుక్క
అటూ సిరాచుక్క గూర్చి వ్రాసుకున్నారు కనవర్తి.
ప్రాచీన సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే మీరు, వచన
ప్రక్రియను ఎంచుకోవడానికి కారణమేమిటంటే 'పద్యపాదాలే
నా వచన కవితకు ప్రాణాలంటారు కనపర్తి. ప్రక్రియకున్న
వస్తువు ముఖ్యం. ఏ ఛందస్సులో నడిచింది అన్నది కాదు
ముఖ్యం. ఏ చందంగా సాగుతున్నదన్నదే మనకు ప్రధానం
అంటారు కనపర్తి, వారి కవితల్లో అంత్యలయల విన్యాసాలు,
అను ప్రాసలగలగలలు, విరుపులు
పద బంధాలు కోకొల్లలుగా ఉంటాయి.
"పలికెడిది వచన కవిత్వమట
-
-
పలికెడు వాడు రామచంద్రుడట”
పలుకుబడులు
అంటూ పోతన్నను గుర్తుకు తెస్తారు కనపర్తి, కనపర్తి
ప్రకృతి ప్రేమికుడు. రవీంద్రుని గీతాంజలిని హృదయాంజలి
పేరుతో స్వేదాసేవాదం చేశారు. కబీరు, తులసీదాస్
దోహాలను వచన కవితలుగా చిన్న చిన్న కథలుగా
వ్రాసేవారు.
కనపర్తి కవనంలో చోటు చేసుకోని పువ్వే లేదన్న
అతిశయోక్తి కాదు. మల్లే, గులాబి, తంగేడు, గునుగు,
గడ్డిపువ్వు, పూల కవితలన్ని కూర్చి 'పూజా పుష్పాలు' అన్న
కావ్యం వ్రాసి కన్నతల్లికి అంకితమిచ్చారు కవి. కావ్యాన్ని
అంకితం తీసుకుంటున్న వేళ అమ్మ ఆనందానికి అవధులు
లేవు.
"పట్టి ఇచ్చేది కాదు రా కవిత్వం
పుట్టుకొచ్చేది బిడ్డా దాని తత్వం"
అంటూ కవికి జన్మనిచ్చినందుకు నా జన్మ
ధన్యమైందంటూ పొంగిపోయారు.
'మల్లే నా చెల్లే
| ప్రాస కోసం కాదీ పిలుపు
ఎన్నైనా పూర్వ జన్మల వాసనల్ని
త్రవ్వి పోస్తుంది నీ వలవు
దైవానికి నీ వంటే ఎంతో ప్రేమ
నిన్న బురదలో దించలేదు.
ముళ్ల మీద ఉంచలేదు.
కనపర్తి కవిత్వంలో మనకు ప్రస్ఫుటంగా కనిపించేవి
భావ చిత్రాలు. కవి, తను పొందిన అనుభవాన్ని శ్రోతలకు
తన రచనలలో అందించడమే భావ చిత్రం. ఉపమానాల్ని
అనేకం ఉపయోగిస్తారు కవి. పూలతో ప్రకృతిని పూజించడం
తెలంగాణలో ఒక విశిష్ట సంప్రదాయం అదే మన బతుకమ్మ
పండుగ. బతుకమ్మ పెరువులో తంగేడు పూలది
అగ్రతాంబూలం.
వందు ముత్తెదువులు
పసుపు ముద్దలార బెట్టినట్లు
ఎవరో పసుపు పారాణితో
నవ వధువులు నడిచి వెళ్ళినట్లు
ఎవరో పచ్చి బాలింతరాలు
తెలుగు ఆచారాన్ని పాటిస్తూ
ఈ త్రోవలో పోయినట్లు
ఏ స్వర్ణ కారుడో
తెలంగాణ (235) తేజోమూర్తులు ఓ<noinclude><references/>
{{rh|తెలంగాణ |235| తేజోమూర్తులు}}</noinclude>
4uk7fq2g9iu1edzb3rlb8q9uh5yza7k
554176
554146
2026-04-23T11:14:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554176
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఉండాల్సిందే. వారి స్వగ్రామం సిద్ధిపేటంటే వారికి ఎంతో ఇష్టం, కవులకు, కళాకారులకే కాదు వీరులకు, ఉద్యమ
కారులకు కట్టని కోట నా సిద్దిపేట అంటారు కనపర్తి,
:ఆదుకుంటారు కోటి లింగేశ్వరుడు
:ఊరి మధ్యలోనే
:కాపురం పెట్టాడు శ్రీవేంకటేశ్వరుడు' అంటూ వారి స్వగ్రామం గూర్చి వ్రాసుకున్నారు.
కనపర్తికి ప్రాచీన కవులంటే ఎంతో అభిమానం. ఆధునిక కవుల్లో శ్రీ.శ్రీ. దాశరథి, కుందుర్తి, కృష్ణ శాస్త్రి రచనలంటే ఎంతో మక్కువ. కాళోజీ అంటే ప్రాణం. కాళోజీ ప్రభావం ఎంతగానో వుంది కనపర్తి రచనలపై,
అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అని కాళోజీగారన్నారు.
<poem>
{{left margin|5em}}
శ్రీ కారానికి ప్రతీక
ఓంకారానికి టీక
ఒక సిరా చుక్క
ఒక సిరా చుక్క
నిద్రాముద్రిత జన చైతన్యానికి
వేగు చుక్కు
బీడు వారిన మెదడు భూముల్లో
వాన చుక్క</poem>
అటూ సిరాచుక్క గూర్చి వ్రాసుకున్నారు కనవర్తి.
ప్రాచీన సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే మీరు, వచన ప్రక్రియను ఎంచుకోవడానికి కారణమేమిటంటే 'పద్యపాదాలే
నా వచన కవితకు ప్రాణాలంటారు కనపర్తి. ప్రక్రియకున్న వస్తువు ముఖ్యం. ఏ ఛందస్సులో నడిచింది అన్నది కాదు
ముఖ్యం. ఏ చందంగా సాగుతున్నదన్నదే మనకు ప్రధానం అంటారు కనపర్తి, వారి కవితల్లో అంత్యలయల విన్యాసాలు, అను ప్రాసలగలగలలు, విరుపులు- పలుకుబడులు-పద బంధాలు కోకొల్లలుగా ఉంటాయి.
:"పలికెడిది -వచన కవిత్వమట
:పలికెడు వాడు -రామచంద్రుడట”
అంటూ పోతన్నను గుర్తుకు తెస్తారు కనపర్తి, కనపర్తి ప్రకృతి ప్రేమికుడు. రవీంద్రుని గీతాంజలిని హృదయాంజలి
పేరుతో స్వేచ్చానువాదం చేశారు. కబీరు, తులసీదాస్ దోహాలను వచన కవితలుగా చిన్న చిన్న కథలుగా వ్రాసేవారు.
కనపర్తి కవనంలో చోటు చేసుకోని పువ్వే లేదన్న అతిశయోక్తి కాదు. మల్లే, గులాబి, తంగేడు, గునుగు, గడ్డిపువ్వు, పూల కవితలన్ని కూర్చి 'పూజా పుష్పాలు' అన్న కావ్యం వ్రాసి కన్నతల్లికి అంకితమిచ్చారు కవి. కావ్యాన్ని అంకితం తీసుకుంటున్న వేళ అమ్మ ఆనందానికి అవధులు లేవు.
:"పట్టి ఇచ్చేది కాదు రా కవిత్వం
:పుట్టుకొచ్చేది బిడ్డా దాని తత్వం"
అంటూ కవికి జన్మనిచ్చినందుకు నా జన్మ ధన్యమైందంటూ పొంగిపోయారు.
<poem>
{{left margin|5em}}
'మల్లే నా చెల్లే
ప్రాస కోసం కాదీ పిలుపు
ఎన్నైనా పూర్వ జన్మల వాసనల్ని
త్రవ్వి పోస్తుంది నీ వలవు
దైవానికి నీ వంటే ఎంతో ప్రేమ
నిన్న బురదలో దించలేదు.
ముళ్ల మీద ఉంచలేదు.</poem>
కనపర్తి కవిత్వంలో మనకు ప్రస్ఫుటంగా కనిపించేవి భావ చిత్రాలు. కవి, తను పొందిన అనుభవాన్ని శ్రోతలకు
తన రచనలలో అందించడమే భావ చిత్రం. ఉపమానాల్ని అనేకం ఉపయోగిస్తారు కవి. పూలతో ప్రకృతిని పూజించడం తెలంగాణలో ఒక విశిష్ట సంప్రదాయం అదే మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ పెరువులో తంగేడు పూలది అగ్రతాంబూలం.
<poem>
{{left margin|5em}}
పండు ముత్తెదువులు
పసుపు ముద్దలార బెట్టినట్లు
ఎవరో పసుపు పారాణితో
నవ వధువులు నడిచి వెళ్ళినట్లు
ఎవరో పచ్చి బాలింతరాలు
తెలుగు ఆచారాన్ని పాటిస్తూ
ఈ త్రోవలో పోయినట్లు
ఏ స్వర్ణ కారుడో</poem><noinclude><references/>
{{rh|తెలంగాణ |235| తేజోమూర్తులు}}</noinclude>
3oknpkpmcl74cdysuf98ywxntgvslvy
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/257
104
211537
554179
551564
2026-04-23T11:25:01Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554179
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><poem>
{{left margin|5em}}
'మంగళ సూత్రాల' కోసం
పసిడిరేకులు కత్తిరించి పోసినట్లు
ఎంత బాగున్నాయి.
ఈ బంగారు పూలు
పరకాయ ప్రవేశం నాకొస్తే
ఒక్క గడియైనా చాలు
నేను తంగేడు పువునై పోతాను.
అంటూ కవి పూల మీదున్న మమకారాన్ని చాటుకున్నారు కనపర్తి,
దేవతల్ని భరించనందుకు
పాపం! ఈ రాయికి మిగిందేమిటి?
ఉల్లిగాట్లు! సుత్తిపోట్లు
ఔను మరి!
రాయైనా, మనిషైనా దేవుడు కావాలంటే
"తప్పవు ఎన్నెన్నో పాట్లు" అను నిత్య సత్యాన్ని చెప్పారు కనపర్తి.</poem>
కవిత్వం అంటే ఉత్తమ సంస్కార విలువల సమ్మేళనం మానవీయ కోణాల ఆవిష్కారం. అంతేకాని అస్పష్టమైన,
అశ్లీలమైన, అసంబద్ధవాక్య నిర్మాణం కాదంటారు కనపర్తి.
<poem>
{{left margin|5em}}
“కవిత్వం కనకపు సింహాసనం
దానిపైన అశ్లీల నినాదాల
శునకాల్ని కూర్చోబెట్టకు
గాడిద విడిచి గుడ్డల్ని మోసినట్లు కాదు
అశ్వం వీర యోధుల్ని మోసినట్లు
పదాలు అర్ధ గౌరవాన్ని మోయాలి" అపుడే కవికి, కవిత్వానికి అర్ధం, పరమార్ధం అంటారు కనపర్తి,</పొఎమ్>
కనపర్తి తన కవిత్వంతో అన్ని వృత్తుల వారిని పల్కరించారు. సుప్రసిద్ధ చిత్రకారులు కీ.శే. కాపురాజయ్యగారి
జాతీయ బహుమతి పొందిన "రిస్క్ లైఫ్" చిత్రానికి కనపర్తి "ఆకాశానికి నిచ్చెన" పేరుతో (20/9/1991లో) చక్కని
వచన కవిత వ్రాశారు.
<poem>
ఆకాశానికి నిచ్చెన వేస్తావు.
అమృత బాండాన్ని అవనికి దింపుతావు
ఓ శ్రమైక జీవన సౌందర్యరాశి
కాళ్ళకు బంధం, నడుముకు బంధం
ఈ చెట్టుకూ - నీకు, ఏ నాటిదో ఈ బంధం
చెట్టుకొట్టుకొనలో పిట్టలాగా నీవుంటే
నీ ఇల్లాలి "తాడు" గట్టిదనం
నా కలానికి ధైర్యాన్ని నేర్పుతుంది.
ఓ గీతకార్మికుడా! నేను గీతాల కార్మికున్ని</poem>
అంటూ "గీత కార్మికుడి" గూర్చి వ్రాస్తారు. కావు రాజయ్య గారంటే కనపర్తికి ఎంతో పూజ్యభావం. కనపర్తి రచించిన చాలా పుస్తకాలకు రాజయ్యగారు 'ముఖ చిత్రం' వేశారు.
అనుభూతి వైవిద్యం లేకపోతే అసలు జీవితంలో ఆనందమే ఉండదు. చూసే మనసు ఉండాలే కాని సమాజంలోని అన్ని అంశాలు కవితా వస్తువులే అంటారు కనపర్తి. మసిగుడ్డ, అలుకు పిడుస, చెత్త బుట్ట, గాజు పెంకు,
గుండుసూది అన్నింటిలో మానవీయ కోణాన్ని దర్శిస్తారు. కనపర్తి.
కాలికి గాజుముక్క కుచ్చుకొని రక్తం కారుతుంటే ఆ గాయాన్ని వెంటనే అందమైన గేయంగా మార్చుకున్నారు.
<poem>
ఇది ఏ తల్లి కరకంకణమై మెరిసిందో
ఏ చెల్లి హస్త భూషణమై విరిసిందో
ఎప్పుడు ఏ ప్రణయ కలహంలో నలిగి
ఏ ప్రళయ సమరంలో నేలరాలిందో</poem>
నారీమణుల సౌభాగ్య చిహ్నమైన తనను రోడ్డుపై పారేసారన్న కోపంతో నా కాలికి కుచ్చుకుంది. నా కలాన్ని
రెచ్చగొట్టింది అంటారు కనపర్తి. మసిగుడ్డను గూర్చి కూడా ఆలోచించే మనసు ఎందరికుంటుంది.
<poem>
"నిజంగా మసిగుడ్డ పసిబిడ్డ లాంటిది.
ఎప్పుడు అమ్మచేతిలో ఆడుకుంటుంది”
తన తనవు కాలిన మన చేయి కాలనివ్వదు
అగ్ని సాక్షిగా మనతోనే జీవిస్తుంది.</poem>
ఈ కవితను అర్ధం చేసుకుంటే అంతర్లీనంగా (స్త్రీమూర్తి) ఇల్లాలి నిస్వార్ధ సేవ కనిపిస్తుంది. అంతేకాదు. గుండుసూది చిన్నదైనా దాని గుండె పెద్దది. అల్బప్రాణి కదా అని ఆటలాడుకుంటే రక్తం కళ్ల చూస్తుందంటారు. కనపర్తి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |236| తేజోమూర్తులు}}</noinclude>
jtfxjalximc8rctt8qdhcq2i8ao8yxe
554180
554179
2026-04-23T11:27:05Z
A.Murali
3019
554180
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><poem>
{{left margin|5em}}
'మంగళ సూత్రాల' కోసం
పసిడిరేకులు కత్తిరించి పోసినట్లు
ఎంత బాగున్నాయి.
ఈ బంగారు పూలు
పరకాయ ప్రవేశం నాకొస్తే
ఒక్క గడియైనా చాలు
నేను తంగేడు పువునై పోతాను.
అంటూ కవి పూల మీదున్న మమకారాన్ని చాటుకున్నారు కనపర్తి,
దేవతల్ని భరించనందుకు
పాపం! ఈ రాయికి మిగిందేమిటి?
ఉల్లిగాట్లు! సుత్తిపోట్లు
ఔను మరి!
రాయైనా, మనిషైనా దేవుడు కావాలంటే
"తప్పవు ఎన్నెన్నో పాట్లు" అను నిత్య సత్యాన్ని చెప్పారు కనపర్తి.</poem>
కవిత్వం అంటే ఉత్తమ సంస్కార విలువల సమ్మేళనం మానవీయ కోణాల ఆవిష్కారం. అంతేకాని అస్పష్టమైన,
అశ్లీలమైన, అసంబద్ధవాక్య నిర్మాణం కాదంటారు కనపర్తి.
<poem>
{{left margin|5em}}
“కవిత్వం కనకపు సింహాసనం
దానిపైన అశ్లీల నినాదాల
శునకాల్ని కూర్చోబెట్టకు
గాడిద విడిచి గుడ్డల్ని మోసినట్లు కాదు
అశ్వం వీర యోధుల్ని మోసినట్లు
పదాలు అర్ధ గౌరవాన్ని మోయాలి" అపుడే కవికి, కవిత్వానికి అర్ధం, పరమార్ధం అంటారు కనపర్తి,</poem>>
కనపర్తి తన కవిత్వంతో అన్ని వృత్తుల వారిని పల్కరించారు. సుప్రసిద్ధ చిత్రకారులు కీ.శే. కాపురాజయ్యగారి
జాతీయ బహుమతి పొందిన "రిస్క్ లైఫ్" చిత్రానికి కనపర్తి "ఆకాశానికి నిచ్చెన" పేరుతో (20/9/1991లో) చక్కని
వచన కవిత వ్రాశారు.
<poem>
ఆకాశానికి నిచ్చెన వేస్తావు.
అమృత బాండాన్ని అవనికి దింపుతావు
ఓ శ్రమైక జీవన సౌందర్యరాశి
కాళ్ళకు బంధం, నడుముకు బంధం
ఈ చెట్టుకూ - నీకు, ఏ నాటిదో ఈ బంధం
చెట్టుకొట్టుకొనలో పిట్టలాగా నీవుంటే
నీ ఇల్లాలి "తాడు" గట్టిదనం
నా కలానికి ధైర్యాన్ని నేర్పుతుంది.
ఓ గీతకార్మికుడా! నేను గీతాల కార్మికున్ని</poem>
అంటూ "గీత కార్మికుడి" గూర్చి వ్రాస్తారు. కావు రాజయ్య గారంటే కనపర్తికి ఎంతో పూజ్యభావం. కనపర్తి రచించిన చాలా పుస్తకాలకు రాజయ్యగారు 'ముఖ చిత్రం' వేశారు.
అనుభూతి వైవిద్యం లేకపోతే అసలు జీవితంలో ఆనందమే ఉండదు. చూసే మనసు ఉండాలే కాని సమాజంలోని అన్ని అంశాలు కవితా వస్తువులే అంటారు కనపర్తి. మసిగుడ్డ, అలుకు పిడుస, చెత్త బుట్ట, గాజు పెంకు,
గుండుసూది అన్నింటిలో మానవీయ కోణాన్ని దర్శిస్తారు. కనపర్తి.
కాలికి గాజుముక్క కుచ్చుకొని రక్తం కారుతుంటే ఆ గాయాన్ని వెంటనే అందమైన గేయంగా మార్చుకున్నారు.
<poem>
ఇది ఏ తల్లి కరకంకణమై మెరిసిందో
ఏ చెల్లి హస్త భూషణమై విరిసిందో
ఎప్పుడు ఏ ప్రణయ కలహంలో నలిగి
ఏ ప్రళయ సమరంలో నేలరాలిందో</poem>
నారీమణుల సౌభాగ్య చిహ్నమైన తనను రోడ్డుపై పారేసారన్న కోపంతో నా కాలికి కుచ్చుకుంది. నా కలాన్ని
రెచ్చగొట్టింది అంటారు కనపర్తి. మసిగుడ్డను గూర్చి కూడా ఆలోచించే మనసు ఎందరికుంటుంది.
<poem>
"నిజంగా మసిగుడ్డ పసిబిడ్డ లాంటిది.
ఎప్పుడు అమ్మచేతిలో ఆడుకుంటుంది”
తన తనవు కాలిన మన చేయి కాలనివ్వదు
అగ్ని సాక్షిగా మనతోనే జీవిస్తుంది.</poem>
ఈ కవితను అర్ధం చేసుకుంటే అంతర్లీనంగా (స్త్రీమూర్తి) ఇల్లాలి నిస్వార్ధ సేవ కనిపిస్తుంది. అంతేకాదు. గుండుసూది చిన్నదైనా దాని గుండె పెద్దది. అల్బప్రాణి కదా అని ఆటలాడుకుంటే రక్తం కళ్ల చూస్తుందంటారు. కనపర్తి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |236| తేజోమూర్తులు}}</noinclude>
gxsz8i6t15eb43rsgwrbvsfvibkepsp
554181
554180
2026-04-23T11:29:10Z
A.Murali
3019
554181
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><poem>
{{left margin|5em}}
'మంగళ సూత్రాల' కోసం
పసిడిరేకులు కత్తిరించి పోసినట్లు
ఎంత బాగున్నాయి.
ఈ బంగారు పూలు
పరకాయ ప్రవేశం నాకొస్తే
ఒక్క గడియైనా చాలు
నేను తంగేడు పువునై పోతాను.
అంటూ కవి పూల మీదున్న మమకారాన్ని చాటుకున్నారు కనపర్తి,
దేవతల్ని భరించనందుకు
పాపం! ఈ రాయికి మిగిందేమిటి?
ఉల్లిగాట్లు! సుత్తిపోట్లు
ఔను మరి!
రాయైనా, మనిషైనా దేవుడు కావాలంటే
"తప్పవు ఎన్నెన్నో పాట్లు" అను నిత్య సత్యాన్ని చెప్పారు కనపర్తి.</poem>
కవిత్వం అంటే ఉత్తమ సంస్కార విలువల సమ్మేళనం మానవీయ కోణాల ఆవిష్కారం. అంతేకాని అస్పష్టమైన,
అశ్లీలమైన, అసంబద్ధవాక్య నిర్మాణం కాదంటారు కనపర్తి.
<poem>
{{left margin|5em}}
“కవిత్వం కనకపు సింహాసనం
దానిపైన అశ్లీల నినాదాల
శునకాల్ని కూర్చోబెట్టకు
గాడిద విడిచి గుడ్డల్ని మోసినట్లు కాదు
అశ్వం వీర యోధుల్ని మోసినట్లు
పదాలు అర్ధ గౌరవాన్ని మోయాలి" అపుడే కవికి, కవిత్వానికి అర్ధం, పరమార్ధం అంటారు కనపర్తి,</poem>>
కనపర్తి తన కవిత్వంతో అన్ని వృత్తుల వారిని పల్కరించారు. సుప్రసిద్ధ చిత్రకారులు కీ.శే. కాపురాజయ్యగారి
జాతీయ బహుమతి పొందిన "రిస్క్ లైఫ్" చిత్రానికి కనపర్తి "ఆకాశానికి నిచ్చెన" పేరుతో (20/9/1991లో) చక్కని
వచన కవిత వ్రాశారు.
<poem>
{{left margin|5em}}
ఆకాశానికి నిచ్చెన వేస్తావు.
అమృత బాండాన్ని అవనికి దింపుతావు
ఓ శ్రమైక జీవన సౌందర్యరాశి
కాళ్ళకు బంధం, నడుముకు బంధం
ఈ చెట్టుకూ - నీకు, ఏ నాటిదో ఈ బంధం
చెట్టుకొట్టుకొనలో పిట్టలాగా నీవుంటే
నీ ఇల్లాలి "తాడు" గట్టిదనం
నా కలానికి ధైర్యాన్ని నేర్పుతుంది.
ఓ గీతకార్మికుడా! నేను గీతాల కార్మికున్ని</poem>
అంటూ "గీత కార్మికుడి" గూర్చి వ్రాస్తారు. కావు రాజయ్య గారంటే కనపర్తికి ఎంతో పూజ్యభావం. కనపర్తి రచించిన చాలా పుస్తకాలకు రాజయ్యగారు 'ముఖ చిత్రం' వేశారు.
అనుభూతి వైవిద్యం లేకపోతే అసలు జీవితంలో ఆనందమే ఉండదు. చూసే మనసు ఉండాలే కాని సమాజంలోని అన్ని అంశాలు కవితా వస్తువులే అంటారు కనపర్తి. మసిగుడ్డ, అలుకు పిడుస, చెత్త బుట్ట, గాజు పెంకు,
గుండుసూది అన్నింటిలో మానవీయ కోణాన్ని దర్శిస్తారు. కనపర్తి.
కాలికి గాజుముక్క కుచ్చుకొని రక్తం కారుతుంటే ఆ గాయాన్ని వెంటనే అందమైన గేయంగా మార్చుకున్నారు.
<poem>
{{left margin|5em}}
ఇది ఏ తల్లి కరకంకణమై మెరిసిందో
ఏ చెల్లి హస్త భూషణమై విరిసిందో
ఎప్పుడు ఏ ప్రణయ కలహంలో నలిగి
ఏ ప్రళయ సమరంలో నేలరాలిందో</poem>
నారీమణుల సౌభాగ్య చిహ్నమైన తనను రోడ్డుపై పారేసారన్న కోపంతో నా కాలికి కుచ్చుకుంది. నా కలాన్ని
రెచ్చగొట్టింది అంటారు కనపర్తి. మసిగుడ్డను గూర్చి కూడా ఆలోచించే మనసు ఎందరికుంటుంది.
<poem>
{{left margin|5em}}
"నిజంగా మసిగుడ్డ పసిబిడ్డ లాంటిది.
ఎప్పుడు అమ్మచేతిలో ఆడుకుంటుంది”
తన తనవు కాలిన మన చేయి కాలనివ్వదు
అగ్ని సాక్షిగా మనతోనే జీవిస్తుంది.</poem>
ఈ కవితను అర్ధం చేసుకుంటే అంతర్లీనంగా (స్త్రీమూర్తి) ఇల్లాలి నిస్వార్ధ సేవ కనిపిస్తుంది. అంతేకాదు. గుండుసూది చిన్నదైనా దాని గుండె పెద్దది. అల్బప్రాణి కదా అని ఆటలాడుకుంటే రక్తం కళ్ల చూస్తుందంటారు. కనపర్తి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |236| తేజోమూర్తులు}}</noinclude>
m13y3u4lvdrepu45ai15otfejydiy33
పుట:Sangitarasataran022902mbp.pdf/34
104
212325
554096
553865
2026-04-22T17:38:18Z
Vjsuseela
1850
554096
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="34A" />{{Center|'''ఇదిగో వృక్షకాండము రెండుఖండములు గావలయు'''}}
{{Center|'''(కత్తితో నరకును)'''}}
అందఱు — భళీ సిద్ధార్థా భళీ.
సుప్ర - (యశోధర చేయిపట్టుకొని)
గీ॥ క్షత్రవంశమునకు ఖ్యాతిఁగూర్చినయట్టి
ఘనుఁడుశాక్యశీతకరుఁడు నేడు
క్షాత్రంద్యలందు జయమెనొందెనుగాన
పెండ్లియాడుమమ్మ ప్రేమమీర॥
యశో - (సిద్ధార్థుని కంఠమునఁ బుష్పమాలికనువైచును)
కాంతిమతి, కనుల ౼
{{Center|{{p|fs125}}పాట, మోహన ౼ ఏక</p>}}
{{left margin|5em}}<poem>జయముజయము శాక్యభూషణ శత్రుసంహరణా
శత్రుసంహరణా సర్వభూభరణా</poem> </div>
{{right|(యవనికపడును)}}
{{rule |6em }}
<section end="34A" />
<section begin="34A" /><section end="34A" />
<section begin="34B" />{{Center|{{p|fs125}}తృతీయాంకము</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమరంగము — ఉద్యానభవనము</p>}}
{{rule |6em }}
{{Center|'''కాంతిమతి, కనుల ప్రవేశము'''}}
కాంతి — చెలీ! నేడుమనపరిజనులు, సంపంగిపూబొదలకును సన్నజాజులకును సవరించిన జోడియలంజూచి మావిగున్నలనడుమనున్న పడుభావికెత్తియున్న జలయంత్రమును వెడలిపైకెగయు నీటితుంపురుల రమ్యతను గాంచుచు నచ్చటచ్చట నీచిన్నియరటాకుదొన్నె నిండబువ్వులేరితెచ్చునప్పటికే సంజపడి ప్రోద్దుగ్రుందుగుంకెను. ఇంకనీవీకుసుమసరములుగ్రుచ్చి యశోధరకెప్పుడిచ్చివచ్చెదవు.
కమల - కాంతిమతీ! నీకింతవేగిరమేటికి. ఆడుచు పాడుచు నిమిషములో గుచ్చెదము. ఇంతలో నీవీణగైకొని యొక్కగీతము బాడరాదా.
కాంతి — (పూవులం కనులచేతికిచ్చి వీణగైకొని)
<section end="34B" /><noinclude><references/></noinclude>
roiivl3ho7m773suq66tweh2pw8469q
పుట:Sangitarasataran022902mbp.pdf/48
104
212340
554084
554058
2026-04-22T13:27:57Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554084
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>నుయ్యోయ్యో పొయ్యో చచ్చు॥ అయ్యె॥
తెగులు నెగులో పెగలో చచ్చు! ॥ అయ్యె॥
త్రాడో కోడో కాడో చచ్చు! ॥ అయ్యె॥
అపుడో ఇపుడో యెపుడో చచ్చు॥ అయ్యె॥
ఛన్నా! పొద్దుగ్రుంకవచ్చినది యికమనము గృహముప్రవేశింతమా.
ఛన్నా - గీ॥ చూడఁజూడంగ డెందానశోక మొదవు
యంచియివియెల్ల తలపునమంచబోకు
పరమకారుణ్య రసపూరభగభీర
మేదినీవల్లభ కుమారమేరుధీర॥
రాజకుమారా! చిత్తము గృహమునకు బ్రవేశింతము.
{{rule |6em }}
{{Center|{{p|fs125}}చతుర్థరంగము — అరణ్యము</p>}}
{{rule |6em }}
{{Center|'''(సిద్ధార్థుడును, ఛన్నుఁడును ప్రవేశము)'''}}
ఛన్ను - రాజకుమారా! పురంబుపరీక్షించితిరి నేడరణ్యంబునంగల వినోదంబులు జూడంగోరితిరి గావున ఇచ్చటికిం గొనివచ్చితి. ఇది తుహినాచలమహారణ్యము చూడుండు. అల్లిబిల్లిగ నల్లుకొనిన మొల్లంవులతోబంధంబులచే గట్టుబడిన యీపొన్నమావి మద్దిపనస గున్నలును మద్దిమావి పనసగున్నల నిండునీడంబదిలంబుగా బెరిగి పచ్చనియాకులచే గ్రమ్ముకోనంబడి రేలుబవళ్లు దెలియక యంధకారబంధుగంబులై దుష్ప్రవేశ్యంబులగు పొదరిండ్లును పొదరిండ్లనుజుట్టుకొని యందంబుగా మిగులు సన్నంబులగుపోగులతో సహజవిద్యా నైపుణ్యంబున
గూండ్లల్లు సాలెపురుగులును సాలెపురుగులంబట్టంగమకించుచు పాదంబులనెగదిగనిడుచు నిక్కిచూచుతొఁడలును తొండలుబెదర సలఘుజవంబులం బారుకుండేళ్లును కుందేళ్లను వెంబడించుచు పరువిడివచ్చు వేసిజాగిలంబులు వేవి జాగిలంబుల జాడలయుచు మరులు వలలు చిక్కంబులు భుజంబులందగిలించుకుని మిఱ్ఱి మిఱ్ఱి చూచుచువచ్చు వేఁటకాండ్రును వేఁటకాండ్రవలలందగిలి కాళ్లాడకగొట్టుకొను మృగశాబంబులును శాబంబులవిడనాడమోపక సంతంత దూరంబున బెదరి బెదరి చూచుచు మేనులుముడుచుచు దు మెల్లనరచుపొడి లేడి<noinclude><references/></noinclude>
kj4054lxygbp9lbsq99h5unlfvd878u
శారద లేఖలు (మొదటి సంపుటము)/8-వ లేఖ
0
212341
554082
2026-04-22T12:58:26Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 8-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf...'
554082
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 8-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=101 to=129 />
[[వర్గం:శారద లేఖలు]]
p4jnkxnmvgwn1yzanuuxrcfw2k4g49n
554083
554082
2026-04-22T12:59:03Z
Rajasekhar1961
50
554083
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 8-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=101 to=125 />
[[వర్గం:శారద లేఖలు]]
s7q2cwfsvp7e7g7nys93kaa4j5o6qwc
పుట:Sangitarasataran022902mbp.pdf/49
104
212342
554085
2026-04-22T13:55:24Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554085
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కొదమలును లేడికొదమలంబట్ట నుంకించుచు నేలంబాదంబులోని మెల్లమెల్ల బ్రాకుచువచ్చు సివ్వంగులును సివంగిపిండునారయుచు గికురించిదుమికి మెడల మిదంబడు రేచులును రేచులనెత్తులవాలి నెత్తురులుపీల్చు పెద్దపులుగులును పులుగుల తోకలంబట్టి రక్తపానంబు సేయు జోరీగలును జోరీగల రెక్కలసందుననిల్చి గిలిగింతికొలిపి విసుకంజేయు చిట్టిగతండంబులునుంగలిగి నానావిధ జంతుజాలంబులకును వృక్షసముదయంబులకును ధాతుపాషాణలోహాది శిలామయద్రవ్యంబులును నిలయంబైన యీవనంబు దేవతాఋషి సంచారయోగ్యంబై
చెన్నలరుచున్న యది. ఆయావిశేషంబులు గనుము రాజకుమారా!
సిద్ధా — ఆహా! యేమి ప్రపంచమర్యాదలు మనమేమిచేయఁగలము. సర్వజంతువులు భయాన్వితములైయున్నవి. కాని, వానివాని స్వభావవిధులెట్లుగానున్నను దయలేక మనుజులు వీనిని హింసించుట మిగుల శోచనీయముగదా.
{{left margin|5em}}<poem>సీ॥ ఈగకేశేభయమని యెన్నంరాదుసూ కప్పనొటనుబడి ముప్పుజెందు
కప్పకేభయమని చెప్పంగరాదుసూ యెలుకనోటను బడి పొలియుసుమ్ము
యెలుకకేభయమని తలపంగరాదునూ పామునోటనుబడి ప్రాణమెడలు
పామునకేపాటి భయమనియానరాదు నెమలికోటనుబడి సీల్గుజుమ్ము॥</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ నెమలికేభయమనుచు గణింపరాదు.
చెంచువిలుకానిచేతిలో చేటుమూడు
చెంచునకుభయమేమని యెంచరాదు
కొత్తవాగులనీటితో గోడుగుడుచు॥</poem> </div>
ఏమీ! యిచ్చట ముత్యములు విశేషముగా రాలియున్నవి.
ఛన్ను - <poem>సీ॥ ఖగతర హరినఖక్రక చవిఛిన్న సామజ కుంభజంబుకీమౌక్తికములు.</poem>
సర్వా — ఆహా! శంహములు పగలగొట్టగా పగిలిన యేనుగుకుంభములలోనుండి రాలినవాయివి. యేరు ప్రపంచవైచిత్రి. వధయే ప్రధానమైనట్లున్నదే. సరే కాని, నిడుదలై ముడతలారి రక్తమాంసంబు వెండితెగిపడి కలలవంటి పొదల
నిండియున్న యిన్ని శృంగంబులెచ్చటివి.
ఛన్ను — <poem>సీ॥ దారుణకార్డుల చంష్ట్రానిఖండిత మృగశిరోగతములీశృంగతతులు.</poem>
::ఆహా! బెబ్బులులు ధోరలతో కొఱకగా తెగిన వేళ్లతలలయొక్క కొమ్ములాయివి. ఎన్ని నిరుపరాధములగు సారంగములు వధింప
::బడినవో,భువననాటక మిట్లుగానున్నదిగదా. అదిసరే, యిదేమిటి, యీప్రక్కజూచితివా కస్తూ<noinclude><references/></noinclude>
7lyzp7rlaj4o49fdwmbtohkqslmpzpx
సంగీతరస తరంగిణి/ద్వితీయాంకము
0
212343
554097
2026-04-22T17:39:12Z
Vjsuseela
1850
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగీతరస తరంగిణి]] | రచయిత = దాసు నారాయణరావు | అనువాదం= | విభాగము =[[సంగీతరస తరంగిణి/ద్వితీయాంకము]] | ముందరి = [[సంగీతరస తరంగిణి/ప్రధమాంకము]] | తదుపరి =సంగీతరస తరం...'
554097
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగీతరస తరంగిణి]]
| రచయిత = దాసు నారాయణరావు
| అనువాదం=
| విభాగము =[[సంగీతరస తరంగిణి/ద్వితీయాంకము]]
| ముందరి = [[సంగీతరస తరంగిణి/ప్రధమాంకము]]
| తదుపరి =[[సంగీతరస తరంగిణి/తృతీయాంకము]]
| వివరములు = ఈ గ్రంథ రచయతలు- దాసు నారాయణరావు, దాసు శ్రీరాములు
|సంవత్సరం=1907
}}
<pages index="Sangitarasataran022902mbp.pdf" from=22 to=34 tosection="34A"/>
je24dhv9mrsyy0gz7f4wc9b3wnpb42c
సంగీతరస తరంగిణి/తృతీయాంకము
0
212344
554098
2026-04-22T17:45:02Z
Vjsuseela
1850
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగీతరస తరంగిణి]] | రచయిత = దాసు నారాయణరావు | అనువాదం= | విభాగము =[[సంగీతరస తరంగిణి/తృతీయాంకము]] | ముందరి = [[సంగీతరస తరంగిణి/ద్వితీయాంకము]] | తదుపరి =సంగీతరస తరం...'
554098
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగీతరస తరంగిణి]]
| రచయిత = దాసు నారాయణరావు
| అనువాదం=
| విభాగము =[[సంగీతరస తరంగిణి/తృతీయాంకము]]
| ముందరి = [[సంగీతరస తరంగిణి/ద్వితీయాంకము]]
| తదుపరి =[[సంగీతరస తరంగిణి/చతుర్ధాంకము]]
| వివరములు = ఈ గ్రంథ రచయతలు- దాసు నారాయణరావు, దాసు శ్రీరాములు
|సంవత్సరం=1907
}}
<pages index="Sangitarasataran022902mbp.pdf" from=34 to=52 fromsection="34B"/>
k11lcz547qt3wwvdmkifgdrxz1ag8uy
పుట:Sangitarasataran022902mbp.pdf/65
104
212345
554099
2026-04-22T17:54:40Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '<section begin="65A" />మానసులగుచునుగూకులగుచు జంతువులఁజంపుదురరణ్యజనపదముల|| సాధ్యమైనంతపనిచేసి మాన్పలేక పోదునా. (నిష్క్రమణము) <section end="65A" /> <section begin="65A" /><section end="65A" /> <section begin="65B" />పంచమాంకము. ప్రధమరింగము——...'
554099
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Vjsuseela" /></noinclude><section begin="65A" />మానసులగుచునుగూకులగుచు
జంతువులఁజంపుదురరణ్యజనపదముల||
సాధ్యమైనంతపనిచేసి మాన్పలేక పోదునా.
(నిష్క్రమణము)
<section end="65A" />
<section begin="65A" /><section end="65A" />
<section begin="65B" />పంచమాంకము.
ప్రధమరింగము——పూలతోట.
(మిశ్రా, విష్కంభము, ఇద్దఱు వనపాలకులు ప్రవేశము)
వర్ష_౧ ఓయీ చెలికాడా నిన్నా వ్యా
వన ౨ ఏమిటి చెప్పవయ్యా.
వస౦ మనరాజు గారి కుమారుఁడు ఈరాత్రి తన యిల్లాలిప్రక్కనుండి లేచి భ
ని కంటకార్వమును దీసికొని యెక్కడికో పారిపోయి నాడట. యశోధరా
దేవి గారు లేచి చూచి చాలా
దుఃఖపడినారటోయి.
వన—9 అయ్యో ! యెంతదుఃఖపడియుండు మోక దా. సిద్ధార్థునకును యశోధరకును
అంతపరస్పర ప్రేమానుబలధ ము కలదుగదా. ఇంత వింతపనిజరిగిన దేమి ! సరే
కాని మనస్ప్రభువు గారును రాణి గారును ఎచ్చటనున్నారో.
వన——-౧ ఈవృత్తాంతము వారికినిదెలసి రాజకుమారుడు క్షేమముగా మరలివచ్చుటకై
ఈశ్వరాలయమందు జపహోమాధిషేకాదులు జరిగించుటకై వెళ్లియున్నారట.
కమల—(వచ్చి) ఓహోవని పాలకులారు.
పాలకులు
} (వేగముగావచ్చి) ఏమి కమలమ్మగారు సెలవు.
కమల——(విచారముతో) మీరు విసరే లేదా!
ఈ ముద్దులమూట సోయగపు మొల్కలతోట యశోధకమ్మడా
దద్దయు వేదవంబడి నిదానజలంబుల మేను నానగా
బొద్దుటినుండి యొక్క గతిఁ బొక్కుచునున్నది రాజపుత్రుడి
యద్దసురేయిదన్ను విడనాడి తటాలునఁ బారి పోయినజ్<section end="65B" /><noinclude><references/></noinclude>
ilj78cx82y2kfxf1t3pued6e4g1d19r
సంగీతరస తరంగిణి/చతుర్ధాంకము
0
212346
554100
2026-04-22T18:00:15Z
Vjsuseela
1850
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగీతరస తరంగిణి]] | రచయిత = దాసు శ్రీరాములు | అనువాదం= | విభాగము =[[సంగీతరస తరంగిణి/చతుర్ధాంకము]] | ముందరి = [[సంగీతరస తరంగిణి/తృతీయాంకము]] | తదుపరి =సంగీతరస తరంగ...'
554100
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగీతరస తరంగిణి]]
| రచయిత = దాసు శ్రీరాములు
| అనువాదం=
| విభాగము =[[సంగీతరస తరంగిణి/చతుర్ధాంకము]]
| ముందరి = [[సంగీతరస తరంగిణి/తృతీయాంకము]]
| తదుపరి =[[సంగీతరస తరంగిణి/పంచమాంకము]]
| వివరములు = ఈ గ్రంథ రచయతలు- దాసు నారాయణరావు, దాసు శ్రీరాములు
|సంవత్సరం=1907
}}
<pages index="Sangitarasataran022902mbp.pdf" from=53 to=65 tosection="65A"/>
kzzvf6h2yhdcmkrxwse9t1u7072jr6k
సంగీతరస తరంగిణి/పంచమాంకము
0
212347
554101
2026-04-22T18:08:27Z
Vjsuseela
1850
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగీతరస తరంగిణి]] | రచయిత = దాసు శ్రీరాములు | అనువాదం= | విభాగము =[[సంగీతరస తరంగిణి/పంచమాంకము]] | ముందరి = [[సంగీతరస తరంగిణి/చతుర్ధాంకము]] | తదుపరి =సంగీతరస తరంగి...'
554101
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగీతరస తరంగిణి]]
| రచయిత = దాసు శ్రీరాములు
| అనువాదం=
| విభాగము =[[సంగీతరస తరంగిణి/పంచమాంకము]]
| ముందరి = [[సంగీతరస తరంగిణి/చతుర్ధాంకము]]
| తదుపరి =[[సంగీతరస తరంగిణి/షష్ఠాంకము]]
| వివరములు = ఈ గ్రంథ రచయతలు- దాసు నారాయణరావు, దాసు శ్రీరాములు
|సంవత్సరం=1907
}}
<pages index="Sangitarasataran022902mbp.pdf" from=65 to=74 fromsection="65B" tosection="74A"/>
6m8hu87hw1a94uv1qal3ws1tw7a5tac
పుట:Sangitarasataran022902mbp.pdf/74
104
212348
554102
2026-04-22T18:11:24Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '<section begin="74A" />కేమియీడువచ్చినది వేయే డ్లును ఇర్కుది రెండేండ్లేక దా ఇంతనిగక్తివెట్లు పుట్టెసూ, చితిమాయెను. ఛన్నా ! నీవువచ్చునప్పుడు నీతో శ్లేమైన చెప్పి నాడా! ఛిన్న చూఅమ్మ గారిత...'
554102
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Vjsuseela" /></noinclude><section begin="74A" />కేమియీడువచ్చినది వేయే డ్లును ఇర్కుది రెండేండ్లేక దా ఇంతనిగక్తివెట్లు
పుట్టెసూ, చితిమాయెను. ఛన్నా ! నీవువచ్చునప్పుడు నీతో శ్లేమైన చెప్పి
నాడా!
ఛిన్న చూఅమ్మ గారితో మనల నేనవచ్చెదనని చెప్పుము. జ్ఞానముగఁపాదించుకొ
మటగురు దేశములందూచుచుటకును వెళ్లి నాడని చెప్పుము దుఃఖింపవలదని చె
ప్పుడు. నేను సుఖముగానున్నా నని చెప్పుము. అన్నా రుకెల్లీ.
ప్రతిహరి—(వచ్చి) అంతఃపురమున కొత్త మేడలో యశోధర అన్న పానాదులు
విడిచి మిగులదుఃఖముతో నన్న ది.
శద్ధో—(మంత్రికో) అదరిని గృహంబునపంజేర్పుము నేసునువచ్చుదున్నా ఁడను
(నిష్క్రమణము)
<section end="74A" />
<section begin="74A" /><section end="74A" />
<section begin="74B" />షష్ఠాంకము.
ప్రధమరంగము—బింబిసారు పురము.
T
(భితుకుఁడగు బుద్ధదేవర ప్రవేశము )
బుద్ధు—గృహాంగణముల యందిటునటుదిరుగుచు).
ఆహా! ఈ ప్రపంచ నెంతదుర్నీ తినవలంబించినది. ఎంజెంలేదుస్కృత్యములు
లోఁబడినది. ఈహింపలేమి ఈయసత్యము లేమి ఈయ పరిశుద్ధియేమి ఈ సురా
పానాది మహాపాతకంబు లేమి కాంతియనునది యెచ్చటను లేదే దుర్వ్యాపార
దురోదకములు మెండైఇవి స్వార్ధపరాయులై యుద్ధంబులు సేయుము ననేక
జీవంబులనుగ్గుచేయుచున్నారుగదా రాజన్యులు ఇట్టిలో కమురు బాగుచేయం
బూచువాఁడొక్కఁడుకు గానరాడే. నేనెక్కరుండ సమర్ధుండవా కాను
అయిననేమి చీమ కొండ ఁడా కినట్టు బ్రాకెట్. ఈజగచ్చక్తి లా
యుపశు భాగ ముకొంతయైనను లేదా నాహృదయమును నిల్పి పెట్టుకొనిఁజాలక
న్నాను. ఇది సత్యముని నాహృదయము నాకుపదేశించిన రీతిని నేనును
పంచమున శుపదేశించుచు నానావిధ జాతులకు నుపన్యసించెద సాధ్యమైన
కట్టు రర్షంబులును మినుఃవ్యస్త్రోక్తంబులునగు శాస్త్రంబులకు వల్లించెద గ
హించెద ఈతనువు శాశ్వితంబుకాదుగదా. ఈతనువున్నన్ని నాళ్లు ఇదేదీ4
య
లో నాకు సహా<section end="74B" /><noinclude><references/></noinclude>
nspsr77ay1oqbaag27l4dh0cdsneozl
పుట:Sangitarasataran022902mbp.pdf/87
104
212349
554103
2026-04-22T18:15:01Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '<section begin="87A" />బ్రాహ్మ——అట్లు గానే జరుగును. (అని అందరు నిష్క్రమణము) - <section end="87A" /> <section begin="87A" /><section end="87A" /> <section begin="87B" />సప్తమాంకము. ప్రఢమరింగము——పద్మాపురము రామగిరి క్షేత్రము మిశ్రవిష్కంభము. (బు...'
554103
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Vjsuseela" /></noinclude><section begin="87A" />బ్రాహ్మ——అట్లు గానే జరుగును. (అని అందరు నిష్క్రమణము)
-
<section end="87A" />
<section begin="87A" /><section end="87A" />
<section begin="87B" />సప్తమాంకము.
ప్రఢమరింగము——పద్మాపురము రామగిరి క్షేత్రము
మిశ్రవిష్కంభము.
(బుద్ధ శిష్యులు, దయానందుడు ప్రదేశము)
దయా....ఓహో మహామతా వులై భగవంతులని పేరుకడసిన శ్రీ సర్వజ్ఞ బుద్ధరేక్షక
వారు దక్షిణాపధఁబుస దమ మతమును వ్యాపింపఁజేయుటకుఁబోవుచు ధమ
శిష్యులమైన గూలో ఁ గొందఱినిఁ బశ్చిమంబునకునుఁ గొందజీని బూర్వదిగ్భా
సన్ను ను యోగానందుని వృత్తే రాపనమునకుఁణంపిక యో
గానందుఁడు కాళిలో నిన్ను విడిచి కాశ్మీరంబునకుంబోయెను జేనీరాను కి
వచ్చితిని ఇచ్చట యీకార్తీకమాసములో నీపద్మాపురం నన్ను గలి పెద
సని చెప్పియుండియు నింకను రాలేదే.
(సత్యానందుడువచ్చును)
దయా—ఓహో సత్యానందులవారా నిర్వాణ్ నిర్వాణ్.
.
సత్యా—ఓ హో దయా నందులవారు ఇచ్చట గేయాన్నారే నిర్వాణ్ నిర్వాణా.
చయా.___.అయ్యా ! మీరుదయచేసిన యెల్లరాజ్యములందును జయ: థియేక ద
సత్యా—సుగతకటాక్షమువలన సర్వగిద్ధి-
దయా_మీ రేయే దేశములనుజూచితిరో సెలవిచ్చెదరా.
సత్యా చాలదేశములఁజూచితి మీతో జెప్పఁదగిన యొక శుభకర్త మానముగలదు విం
రా.
తయా— సెలవిండు, ఏమిటి.
సత్యా -- 81 దేవియశోధక మనజీన
దేవ: ఓడినాడి దుఃఖతీవ్రకయుడుగం
రావెడలె దండ్రియింటికిఁ
భోజేగమె సౌగతుండుప్పునటమహిత్ !<section end="87B" /><noinclude><references/></noinclude>
n3mxim6qk69xdzn0w8hho6r7ntkxng8
సంగీతరస తరంగిణి/షష్ఠాంకము
0
212350
554104
2026-04-22T18:17:18Z
Vjsuseela
1850
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగీతరస తరంగిణి]] | రచయిత = దాసు శ్రీరాములు | అనువాదం= | విభాగము =[[సంగీతరస తరంగిణి/షష్ఠాంకము]] | ముందరి = [[సంగీతరస తరంగిణి/పంచమాంకము]] | తదుపరి =సంగీతరస తరంగిణి/...'
554104
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగీతరస తరంగిణి]]
| రచయిత = దాసు శ్రీరాములు
| అనువాదం=
| విభాగము =[[సంగీతరస తరంగిణి/షష్ఠాంకము]]
| ముందరి = [[సంగీతరస తరంగిణి/పంచమాంకము]]
| తదుపరి =[[సంగీతరస తరంగిణి/షష్ఠాంకము]]
| వివరములు = ఈ గ్రంథ రచయతలు- దాసు నారాయణరావు, దాసు శ్రీరాములు
|సంవత్సరం=1907
}}
<pages index="Sangitarasataran022902mbp.pdf" from=74 to=87 fromsection="74B" tosection="87A"/>
hd26w1n6y7ea22sltj4fkorr46dvh9n
సంగీతరస తరంగిణి/సప్తమాంకము
0
212351
554105
2026-04-22T18:22:55Z
Vjsuseela
1850
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగీతరస తరంగిణి]] | రచయిత = దాసు శ్రీరాములు | అనువాదం= | విభాగము =[[సంగీతరస తరంగిణి/సప్తమాంకము]] | ముందరి = [[సంగీతరస తరంగిణి/షష్ఠాంకము]] | తదుపరి =సంగీతరస తరంగిణ...'
554105
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగీతరస తరంగిణి]]
| రచయిత = దాసు శ్రీరాములు
| అనువాదం=
| విభాగము =[[సంగీతరస తరంగిణి/సప్తమాంకము]]
| ముందరి = [[సంగీతరస తరంగిణి/షష్ఠాంకము]]
| తదుపరి =[[సంగీతరస తరంగిణి]]
| వివరములు = ఈ గ్రంథ రచయతలు- దాసు నారాయణరావు, దాసు శ్రీరాములు
|సంవత్సరం=1907
}}
<pages index="Sangitarasataran022902mbp.pdf" from=87 to=99 fromsection="87B"/>
apsiwulfx8ge50j5gdvnty7f0nd7j3q
పుట:Sangitarasataran022902mbp.pdf/51
104
212352
554151
2026-04-23T08:56:29Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554151
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ఎద్దులను సెయ్యలను యెనుములను దున్నలను
గద్దరితనానజంపి, ముద్ద గావండించి తిందు ॥ఎం॥
భూమిలోన బుట్టి పెరిగి - ఆముకవిసి ఆశబెంచి
యేమి సుఖము ననుభవించు, నెడ్డెమనుజుఁడు హింసజేపి॥ఎం॥</poem> </div>
{{Center|'''(ఒక యతిప్రదేశము).'''}}
ఛన్నా! యెవ్వరో వచ్చుచున్నారు చూడు.
ఛన్ను - యతివలె నున్నాఁడు రాజకుమారా!
సిద్ధా — అవును (యతింజూచి) ఎవ్వరయ్యా మీరు స్వామి.
యతి — నేను విరక్తుఁడవైన యతిని. సంసారత్యాగము చేసి తపంబున ముక్తిబడయుదునని యీహిమాలయ ప్రాంతారణ్యము ధ్యానంబునకు యోగ్యంబనితలంచి జనసంచారములేని యీపట్టున నిలచియున్నాడను.
{{Center|{{p|fs125}}పాట. ధవ్యాసి</p>}}
{{left margin|5em}}<poem>యతినినేను రాజకుమారా॥ ॥యతి॥
వితతసంసార పతితుఁడగాను॥ ॥యతి॥
తలనుబోడిసేసి, బిరాన తల్లిదండ్రిబాసి
కలిత మోక్షమార్గము చింతించు॥యతి॥
కానిగుడ్డకట్టి బుజాన, గంతబొంతబెట్టి
ఏవేళనేని బ్రాహ్మైవాహమస్మియను॥ ॥యతి॥</poem> </div>
సిద్ధా - స్వామీ! మీతలంపునుంచిదేకాని కావిగుడ్డలును గంతబొంతలును జోడితలయు మోక్షమిచ్చునని మీరేట్లుతలంచితిరి.
యతి — దీనివలన మోక్షార్థియను గుఱుతంగనపరచుటతక్క యితరఫలఁబుకానరాదు. కానీ మోక్షప్రతిబంధకఁబు మాత్రము కాదని మహామహులు చెప్పుదురు.
సిద్ధా — మీకాహారమెట్లుగా సిద్ధించును.
యతి — ఆహా! యీయరణ్యములో ఆకులెన్ని కలవు. పూవులెన్ని కలవు. కాయలెన్ని కలవు. ఫలము లెన్ని కలవు. స్వచ్చమగు జలంబులతో నిండిన నీకొలుకులెన్ని కలవు. కర్మవరంబున పుర గ్రామవాస ప్రాప్తియగునేని జ్ఞాక్షాపాత్రమేగతి. శయనంలుకంటివా నీలశిలామయ వేదికులెన్ని, గుహలెన్ని కలవు. ఆదిగో మెత్తని చెత్తచూడము.
సిద్ధా — శయ్యకా స్వామీ.<noinclude><references/></noinclude>
fpj2lnoxqvlralbbvu8cf1pzrnhqe0c
554160
554151
2026-04-23T09:28:09Z
Brjswiki
6801
554160
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ఎద్దులను సెయ్యలను యెనుములను దున్నలను
గద్దరితనానజంపి, ముద్ద గావండించి తిందు ॥ఎం॥
భూమిలోన బుట్టి పెరిగి - ఆముకవిసి ఆశబెంచి
యేమి సుఖము ననుభవించు, నెడ్డెమనుజుఁడు హింసజేపి॥ఎం॥</poem> </div>
{{Center|'''(ఒక యతిప్రదేశము).'''}}
ఛన్నా! యెవ్వరో వచ్చుచున్నారు చూడు.
ఛన్ను - యతివలె నున్నాఁడు రాజకుమారా!
సిద్ధా — అవును (యతింజూచి) ఎవ్వరయ్యా మీరు స్వామి.
యతి — నేను విరక్తుఁడవైన యతిని. సంసారత్యాగము చేసి తపంబున ముక్తిబడయుదునని యీహిమాలయ ప్రాంతారణ్యము ధ్యానంబునకు యోగ్యంబనితలంచి జనసంచారములేని యీపట్టున నిలచియున్నాడను.
{{Center|{{p|fs125}}పాట. ధన్యాసి</p>}}
{{left margin|5em}}<poem>యతినినేను రాజకుమారా॥ ॥యతి॥
వితతసంసార పతితుఁడగాను॥ ॥యతి॥
తలనుబోడిసేసి, బిరాన తల్లిదండ్రిబాసి
కలిత మోక్షమార్గము చింతించు॥యతి॥
కానిగుడ్డకట్టి బుజాన, గంతబొంతబెట్టి
ఏవేళనేని బ్రాహ్మైవాహమస్మియను॥ ॥యతి॥</poem> </div>
సిద్ధా - స్వామీ! మీతలంపునుంచిదేకాని కావిగుడ్డలును గంతబొంతలును జోడితలయు మోక్షమిచ్చునని మీరేట్లుతలంచితిరి.
యతి — దీనివలన మోక్షార్థియను గుఱుతంగనపరచుటతక్క యితరఫలఁబుకానరాదు. కానీ మోక్షప్రతిబంధకఁబు మాత్రము కాదని మహామహులు చెప్పుదురు.
సిద్ధా — మీకాహారమెట్లుగా సిద్ధించును.
యతి — ఆహా! యీయరణ్యములో ఆకులెన్ని కలవు. పూవులెన్ని కలవు. కాయలెన్ని కలవు. ఫలము లెన్ని కలవు. స్వచ్చమగు జలంబులతో నిండిన నీకొలుకులెన్ని కలవు. కర్మవరంబున పుర గ్రామవాస ప్రాప్తియగునేని జ్ఞాక్షాపాత్రమేగతి. శయనంలుకంటివా నీలశిలామయ వేదికులెన్ని, గుహలెన్ని కలవు. ఆదిగో మెత్తని చెత్తచూడము.
సిద్ధా — శయ్యకా స్వామీ.<noinclude><references/></noinclude>
hg9rbc2zmp2l3pm66dqfthrl8pkfxz4
పుట:Sangitarasataran022902mbp.pdf/52
104
212353
554157
2026-04-23T09:21:05Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554157
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యతి - శయ్యోపధానంబుల కంతకంటె నేమికావలయును. ఇదిగో సొరకాయబుఱ్ఱ. ఇదిగో నారికేళ భిక్షాపాత్రము. ఇదోత్రోలు. ఇంక నేమికావలయునయ్యా.
సిద్ధా - మీకు వివాహమైనదా, తలిదండ్రులున్నారా స్వామి, వారంగీకరించిరా, (మెల్లగా) ఎట్లురాగల్గితిరి.
{{Center|{{p|fs125}}పాట, ధన్యాసి</p>}}
యతి — తల్లిదండ్రులనెడ బాసితి తరణోపాయమె చూచితి
దొంగనైతి దొడ్డిజేరితి గోడదూకితి త్రోవఁబట్టితి ॥తల్లి ॥
పెద్దలందరు పెళ్లి పెళ్లనగానే, వద్దంటి మెడకు
మొద్దంటి వీపు గుద్దంటి సుఖము వద్దఁటి॥ ॥తల్లి॥
కల్లకాపురము ఒల్లనంటి, కానిపుట్టమే కట్టుకొంటి
ఇల్లేలా పెళ్లేలా పిల్లలేలా జెల్లలేలా ॥తల్లి॥
క॥ పెండ్లాము కాలిసంకిలి
పెండ్లామే మెడనుగట్టు పెనుబోండయగు౯
పెండ్లాము పెద్దదెయ్యము
పెండ్లామనుమాట శ్రవణపీడాశరమా॥
గీ॥ అల్పుడైన నితరునాశ్రయింపకపోదు
ఆధికుడైన నగలకాస హెచ్చు
పాటియైన కాలిసంకిలిగానుండు
ఆలుగాదు నల్లతేలుసుమ్ము॥
సర్వా — స్వామి నమస్కరించుచున్నాను.
యతి — నిర్వాణ్, నిర్వాణ్.
సర్వా — సెలవిండుస్వామీ గృహంబుజేరెదము. ఛన్నా! పోదమా.
ఛన్ను - చిత్తము.
{{right|(అందఱు నిష్క్రమణము)}}
{{rule |6em }}<noinclude><references/></noinclude>
g1j0i3yzhgyl2pnet80w1getkouxuq0
554158
554157
2026-04-23T09:23:25Z
Brjswiki
6801
554158
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యతి - శయ్యోపధానంబుల కంతకంటె నేమికావలయును. ఇదిగో సొరకాయబుఱ్ఱ. ఇదిగో నారికేళ భిక్షాపాత్రము. ఇదోత్రోలు. ఇంక నేమికావలయునయ్యా.
సిద్ధా - మీకు వివాహమైనదా, తలిదండ్రులున్నారా స్వామి, వారంగీకరించిరా, (మెల్లగా) ఎట్లురాగల్గితిరి.
{{Center|{{p|fs125}}పాట, ధన్యాసి</p>}}
యతి — {{left margin|5em}}<poem>తల్లిదండ్రులనెడ బాసితి తరణోపాయమె చూచితి
దొంగనైతి దొడ్డిజేరితి గోడదూకితి త్రోవఁబట్టితి ॥తల్లి ॥
పెద్దలందరు పెళ్లి పెళ్లనగానే, వద్దంటి మెడకు
మొద్దంటి వీపు గుద్దంటి సుఖము వద్దఁటి॥ ॥తల్లి॥
కల్లకాపురము ఒల్లనంటి, కానిపుట్టమే కట్టుకొంటి
ఇల్లేలా పెళ్లేలా పిల్లలేలా జెల్లలేలా ॥తల్లి॥</poem> </div>
{{left margin|5em}}<poem>క॥ పెండ్లాము కాలిసంకిలి
పెండ్లామే మెడనుగట్టు పెనుబోండయగు౯
పెండ్లాము పెద్దదెయ్యము
పెండ్లామనుమాట శ్రవణపీడాశరమా॥</poem> </div>
<poem>గీ॥ అల్పుడైన నితరునాశ్రయింపకపోదు
ఆధికుడైన నగలకాస హెచ్చు
పాటియైన కాలిసంకిలిగానుండు
ఆలుగాదు నల్లతేలుసుమ్ము॥</poem>
సర్వా — స్వామి నమస్కరించుచున్నాను.
యతి — నిర్వాణ్, నిర్వాణ్.
సర్వా — సెలవిండుస్వామీ గృహంబుజేరెదము. ఛన్నా! పోదమా.
ఛన్ను - చిత్తము.
{{right|(అందఱు నిష్క్రమణము)}}
{{rule |6em }}<noinclude><references/></noinclude>
mgnizcoyvjhi8lmac41apxacwybujyy
554159
554158
2026-04-23T09:26:02Z
Brjswiki
6801
554159
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యతి - శయ్యోపధానంబుల కంతకంటె నేమికావలయును. ఇదిగో సొరకాయబుఱ్ఱ. ఇదిగో నారికేళ భిక్షాపాత్రము. ఇదోత్రోలు. ఇంక నేమికావలయునయ్యా.
సిద్ధా - మీకు వివాహమైనదా, తలిదండ్రులున్నారా స్వామి, వారంగీకరించిరా, (మెల్లగా) ఎట్లురాగల్గితిరి.
{{Center|{{p|fs125}}పాట, ధన్యాసి</p>}}
యతి — {{left margin|5em}}<poem>తల్లిదండ్రులనెడ బాసితి తరణోపాయమె చూచితి
దొంగనైతి దొడ్డిజేరితి గోడదూకితి త్రోవఁబట్టితి ॥తల్లి ॥
పెద్దలందరు పెళ్లి పెళ్లనగానే, వద్దంటి మెడకు
మొద్దంటి వీపు గుద్దంటి సుఖము వద్దఁటి॥ ॥తల్లి॥
కల్లకాపురము ఒల్లనంటి, కానిపుట్టమే కట్టుకొంటి
ఇల్లేలా పెళ్లేలా పిల్లలేలా జెల్లలేలా ॥తల్లి॥</poem> </div>
{{left margin|5em}}<poem>క॥ పెండ్లాము కాలిసంకిలి
పెండ్లామే మెడనుగట్టు పెనుబోండయగు౯
పెండ్లాము పెద్దదెయ్యము
పెండ్లామనుమాట శ్రవణపీడాశరమా॥</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ అల్పుడైన నితరునాశ్రయింపకపోదు
ఆధికుడైన నగలకాస హెచ్చు
పాటియైన కాలిసంకిలిగానుండు
ఆలుగాదు నల్లతేలుసుమ్ము॥</poem> </div>
సర్వా — స్వామి నమస్కరించుచున్నాను.
యతి — నిర్వాణ్, నిర్వాణ్.
సర్వా — సెలవిండుస్వామీ గృహంబుజేరెదము. ఛన్నా! పోదమా.
ఛన్ను - చిత్తము.
{{right|(అందఱు నిష్క్రమణము)}}
{{rule |6em }}<noinclude><references/></noinclude>
sglmfucwyr5h09uq862ma4mke11njtg
పుట:Sangitarasataran022902mbp.pdf/53
104
212354
554161
2026-04-23T09:37:10Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
554161
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}చతుర్థాంకము</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమరంగము —— కేళికామందిరము</p>}}
{{rule |6em }}
({{Center|ఎత్తైనహంసతూలికా తల్పముమీద నిద్రించుచున్న సిద్ధార్థుడు. ప్రక్కను సగము వేచియున్న యశోధర. వాకిట శయనించి}}
{{Center|నిద్రించు కాంతిమతి. కమల ప్రవేశము)}}
యశో — (జాలి నిద్రపోకు దీనధ్వని).
51
ప్ర్రాణనాధా ప్రాణనాధా ప్రాణవారా లేవరూ. లేవరూ. ఇదిగో లేవరూ,
అయ్యో నాజీవి లేశ్వరుడు సుఖనిద్రలో నున్నా జే. నేనెట్లు లేపుదును. లేప
మున్న నాదుఃఖంబునిలుచునట్లు లేదే (ఏడ్చుచు) నా మనోహరా! నా మదన
మోహనాకారా. రాజకుమారా నిన్ను సుఖనిద్ర నుండి లేపవలసి వచ్చినందుకుం
గూడ దుఃఖము వచ్చుచున్న దే (వెక్కి వెక్కి) ఎంతసేపు నేనిట్లుబోగి లేదు.
లేవరూ లేవరూ.
సిద్ధా(దిగ్గున లేచి ఏమి ప్రాణేశ్వరీయిది. ఇట్లు వెక్కి వెక్కి యేడ్చెదవేమి. జడిసి
కొంటినా నాష్త్రక్కనే పండియున్న నీకింత దుఃఖమేల ఊరుకో (సందిటకే
ర్చుకుని ఊరడించుచు) ఏలదుఃఖించెదవు, కారణము చెప్పరాదా. నేనుంటిగ దా
నీ భయము నిప్పుడే తీర్చెదగదా.
సీ॥ కలువ రేకులవంటి కన్నులువాఁడగా కలికి యీ కన్నీళ్లు గారనేల
కోయలధ్వనివంటి గొంతు బొంగురువోవ సతిన నీ వీరీతినడం నేల
చిగురుటాకులవంటి చేతులుకు సుగంద వెసమాటి మాటికిఁబిసుక నేల
నెలకూ నవంటి నీ నెన్నో సల్పసదూల నూర్చుచుకేతులు జేర్చ నేల
గీ తేలను జుట్టినపూవుల తావిఁ బట్టి
తుమ్మెదో వేణి మెయిలని నెమ్మియొక్కొ
సొగసు మోపిని పండని శుక మొకఱచె
గాకమఱియేమిదుః ఖైక కారణంబు||
యశో—కాదునాధా, కాదునాధా!
సిద్ధా_ముగ్ధా ! అట్లుగా దేని మరియేమి బాధకలిగినద్ధి చెప్పరాదా? నన్ను ఁగూడ
దుఃఖ
పెట్టుట ధర్మమా !<noinclude><references/></noinclude>
5ry67lhh6owxdlw2fg4rhzkwamlu8s6
554165
554161
2026-04-23T10:48:30Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554165
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}చతుర్థాంకము</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమరంగము —— కేళికామందిరము</p>}}
{{rule |6em }}
'''(ఎత్తైనహంసతూలికా తల్పముమీద నిద్రించుచున్న సిద్ధార్థుడు. ప్రక్కను సగము వేచియున్న యశోధర. వాకిట శయనించి'''
'''నిద్రించు కాంతిమతి. కమల ప్రవేశము)'''
యశో — (జాలి నిద్రపోకు దీనధ్వని).
::ప్రాణనాధా ప్రాణనాధా ప్రాణవారా లేవరూ. లేవరూ. ఇదిగో లేవరూ. అయ్యో నాజీవితేశ్వరుడు సుఖనిద్రలో నున్నాడే. నేనెట్లు
::లేపుదును. లేపకున్న నాదుఃఖంబునిలుచునట్లు లేదే (ఏడ్చుచు) నా మనోహరా! నా మదన మోహనాకారా. రాజకుమారా నిన్ను
::సుఖనిద్ర నుండి లేపవలసి వచ్చినందుకుంగూడ దుఃఖము వచ్చుచున్నదే (వెక్కి వెక్కి) ఎంతసేపు నేనిట్లుబోగిలెద.
::లేవరూ లేవరూ.
సిద్ధా - (దిగ్గునలేచి) ఏమిప్రాణేశ్వరీయిది. ఇట్లు వెక్కి వెక్కి యేడ్చెదవేమి. జడిసి కొంటినా నాష్త్రక్కనే పండియున్న నీకింత
::దుఃఖమేల ఊరుకో (సందిటజేర్చుకుని ఊరడించుచు) ఏలదుఃఖించెదవు, కారణము చెప్పరాదా. నేనుంటిగదా నీ భయము
::నిప్పుడే తీర్చెదగదా.
{{left margin|5em}}<poem>సీ॥ కలువరేకులవంటి కన్నులువాఁడగా కలికి యీ కన్నీళ్లుగారనేల
కోయలధ్వనివంటి గొంతుబొంగురువోవ సతిన నీవీరీతినడలనేల
చిగురుటాకులవంటి చేతులుకుసుగంద వెసమాటి మాటికిఁలిసుకనేల
నెలకూనవంటి నీనెన్నో సల్పసదూల నూర్చుచుజేతులు జేర్చ నేల</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ తలనుజుట్టినపూవుల తావిఁబట్టి
తుమ్మెదో వేణిమెయిలని నెమ్మియొక్కొ
సొగసుమోవినిపండని శుకమొకఱచె
గాకమఱియేమిదుఃఖైక కారణంబు॥</poem> </div>
యశో — కాదునాధా, కాదునాధా!
సిద్ధా - ముగ్ధా! అట్లుగాదేని మరియేమిబాధకలిగినద్ధి చెప్పరాదా? నన్నుంగూడ దుఃఖపెట్టుట ధర్మమా!<noinclude><references/></noinclude>
ok1s7glkkhx7uq21ohfpaw6jd868a42
శారద లేఖలు (మొదటి సంపుటము)/9-వ లేఖ
0
212355
554164
2026-04-23T10:38:27Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 9-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pdf...'
554164
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 9-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=126 to=137 />
[[వర్గం:శారద లేఖలు]]
dvh0spyc63fvha6t2qe2soxc8akogg8
శారద లేఖలు (మొదటి సంపుటము)/10-వ లేఖ
0
212356
554166
2026-04-23T10:50:04Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 10-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554166
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 10-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=138 to=142 />
[[వర్గం:శారద లేఖలు]]
2g44s0hn488saaohkvzy2sbu5lb0aec
శారద లేఖలు (మొదటి సంపుటము)/11-వ లేఖ
0
212357
554167
2026-04-23T10:55:37Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 11-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554167
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 11-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=143 to=149 />
[[వర్గం:శారద లేఖలు]]
htea2eb7lney7gwr4jp0prmeq74mpmp
554168
554167
2026-04-23T10:56:13Z
Rajasekhar1961
50
554168
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 11-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=143 to=150 />
[[వర్గం:శారద లేఖలు]]
kigl6v6bk9c1n5d3yps6pgj2pw6dscu
శారద లేఖలు (మొదటి సంపుటము)/12-వ లేఖ
0
212358
554169
2026-04-23T10:57:42Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 12-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554169
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 12-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=151 to=155 />
[[వర్గం:శారద లేఖలు]]
24lhnsx1i2wxv8zo8837aua4rdojzto
శారద లేఖలు (మొదటి సంపుటము)/13-వ లేఖ
0
212359
554170
2026-04-23T10:58:41Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 13-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554170
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 13-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=156 to=159 />
[[వర్గం:శారద లేఖలు]]
q5jlya62c5slehfw7zd8dfc7xv76wqm
554171
554170
2026-04-23T10:59:46Z
Rajasekhar1961
50
554171
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 13-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=156 to=169 />
[[వర్గం:శారద లేఖలు]]
4yh9bbmj2urx8qrob75ga2p9zjptrdd
554172
554171
2026-04-23T11:00:19Z
Rajasekhar1961
50
554172
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 13-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=156 to=166 />
[[వర్గం:శారద లేఖలు]]
4c62mgqi2udbywf26wexult63lxp5ja
శారద లేఖలు (మొదటి సంపుటము)/14-వ లేఖ
0
212360
554173
2026-04-23T11:01:02Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 14-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554173
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 14-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=167 to=183 />
[[వర్గం:శారద లేఖలు]]
79d0yv2xhxdbn63437wt96c5btkim8l
554174
554173
2026-04-23T11:01:36Z
Rajasekhar1961
50
554174
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 14-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=167 to=180 />
[[వర్గం:శారద లేఖలు]]
csjvr0gimflhlawta61ns0fv55373ge
శారద లేఖలు (మొదటి సంపుటము)/15-వ లేఖ
0
212361
554175
2026-04-23T11:02:32Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 15-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554175
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 15-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=181 to=186 />
[[వర్గం:శారద లేఖలు]]
9ooldzz236np5x4moryn1muhw2wkal5
పుట:Sangitarasataran022902mbp.pdf/54
104
212362
554184
2026-04-23T11:47:16Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554184
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యశో — (మిక్కిలి దుఃఖముతో) నాధా నాకొక పాడుకలవచ్చినది.
సిద్ధా - ఏమికలఅది. అంతమాత్రముచే నింతదుఃఖింపవలయునా, ముగ్ధవుగాక.
{{Center|{{p|fs125}}పాట. శ్రీరంజన</p>}}
కలగంటినీ, చెప్పలేనునే, కడుచెడ్డది కడుచెడ్డది స్వామి కొన్ని నెలలనుండి నాకేమో దేహములో నొకతీరుగానున్నయది. అప్పుడప్పుడు పైత్యాధిక్యముచే జ్వరము తగులుచు తలమెచ్చినట్లుండి ఆకలి తిన్న గాకాక నిదుర తక్కువమై యుందున్నది. అయినను నానవమన్మధాకారా ప్రాణేశ్వరా! నీయందుగల ప్రేమాతిశయముచే నినుంబాయలేక ఆయల్పనిద్రతోనే ఆయాసమెఱుంగక సంతోషముతో నెకశయ్యనే పండుకొనుచుంటి.
సిద్ధా —— ఓహో యింతమాత్రమునకేనా యీనెగులు. వెఱ్ఱిదానవు. ముగ్ధవునీవెఱుఁగ వైతివి. ప్రౌఢస్త్రీలనడుగలేదా!
యశో — (సిగ్గుతోను ఉఃఖముతోను నత్తుచు) (మెల్లగా) గర్భచిహ్నములనిరి.
సిద్ధా — సరే తెలనెగా. ఇకనేలదుఃఖించెదవు. సంతోషమేకదా.
యశో — (పెనిమిటింగట్టిగాఁ బట్టుకొని ప్రక్కఁగాగౌఁగలించి) కాదు ప్రాణనాధా కాదు.
సిద్ధా — ఏమిటి మరి చెప్పరాదా!
{{Center|{{p|fs125}}పాట</p>}}
{{left margin|5em}}<poem>మొదటి భాగమూ ముందుఁజెప్పెద
::వెడదకొమ్ములవెల్ల యెద్దుగంటిని ॥కల॥
వెల్లయెద్దుదా వీధిలోఁదిరుగా
::కల్లగాదెవారు కట్టలేరైరి ॥కల॥
పట్టియెద్దును కట్టలేకున్న
::నట్టెపోవుభాగ్య మని నింగిపల్కె ॥కల॥
అట్టెనేనుబోయి పట్టితీగడే
::ఆయెనేమినాకు నాగకదాటెగా ॥కల॥</poem></div>
{{right|(ఊరకుండును)}}
సిద్ధా — సరే యిది మొదటి భాగమంటివి. యిందులో నేమి చెరుపునులేదే. రెండవదేమిటి చెప్పుము.
యశో — చెప్పలేను ప్రాణనాధా!<noinclude><references/></noinclude>
kcoteu3ne2ff82uc1unxfknh04ymrdx