వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.46.0-wmf.24
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
సూచిక:Sarada Lekhalu Vol 1.pdf
106
58977
554340
553583
2026-04-24T14:12:10Z
Rajasekhar1961
50
554340
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[శారద లేఖలు]]
|భాష=te
|సంపుటి=[[శారద లేఖలు (మొదటి సంపుటము)|మొదటి సంపుటము]]
|రచయిత=[[రచయిత:కనుపర్తి వరలక్ష్మమ్మ|కనుపర్తి వరలక్ష్మమ్మ]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=౧౯౩౪
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=V
|పుటలు=<pagelist
1="ముఖచిత్రం"
2=-
3="మనవి"
4to10="రచయిత్రి"
11to16="అభిప్రాయాలు"
17to18=-
19to22="విసూ"
23to24="విజ్ఞప్తి"
25=1
79to80="dpl" 81=55
227to228="శుద్ధపత్రిక"
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు={{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/19}}
{{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/20}}
{{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/21}}
{{:పుట:Sarada Lekhalu Vol 1.pdf/22}}
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
ffney68nzelt6vbrfj8fs77qbxkvp7l
సూచిక:Sarada Lekhalu 2.pdf
106
58978
554341
469724
2026-04-24T14:12:51Z
Rajasekhar1961
50
554341
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[శారద లేఖలు]]
|భాష=te
|సంపుటి=[[శారద లేఖలు (రెండవ సంపుటము)|రెండవ సంపుటము]]
|రచయిత=[[రచయిత:కనుపర్తి వరలక్ష్మమ్మ|కనుపర్తి వరలక్ష్మమ్మ]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1934
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=V
|పుటలు=<pagelist
1="ముఖచిత్రం "
2=-
4=-
5=" విసూ"
6=-
7=1
111to112=-
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
nw7tub8tw156ouorkkkw13u4srw6val
పుట:Sarada Lekhalu Vol 1.pdf/22
104
59176
554339
188548
2026-04-24T14:11:16Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
554339
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/16-వ లేఖ|16-వ లేఖ 161—166.]]}}
|}}
{{smaller|విడాకులచట్టమునకు వ్యతిరేకాభిప్రాయము,}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/17-వ లేఖ|17-వ లేఖ 167—173.]]}}
|}}
{{smaller|స్వరాజ్యోద్యమ ప్రకర్ష.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/18-వ లేఖ|18-వ లేఖ 174—185.]]}}
|}}
{{smaller|నూలు వడకుట; స్త్రీలు మద్యపాన నిషేధమును బ్రచారము చేయుట.}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/19-వ లేఖ|19-వ లేఖ 186—191.]]}}
|}}
{{smaller|శారదా చట్టమునకు సవరణ లనవసరములు,}}
{{dotted TOC page listing|
|{{sc|[[శారద లేఖలు (మొదటి సంపుటము)/20-వ లేఖ|20-వ లేఖ 192—200.]]}}
|}}
{{smaller|ధనుర్మాసము, సంక్రాన్తి, బాలికలగొబ్బి తట్టుట మొదలగు వాటి యం దిమిడియున్న యత్తమా శయములు మొదలగునవి.}}
{{rule|5em}}<noinclude></noinclude>
ijeqmyko0bx5lh2r9c0pkpjl3d8ujyb
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/5
104
160040
554426
467919
2026-04-25T10:46:25Z
Rajasekhar1961
50
554426
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Saiphani02" /></noinclude>{{Center|
{{p|fs200}}'''విషయసూచిక'''</p>
}}
'''I గ్రంథాలకు ఎక్కని ఒక చరిత్ర'''
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/ఒక పురాతన తెగ|1. ఒక పురాతన తెగ]]}}
|{{DJVU page link|6|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/తెగ నాయకుని ఆచారాలు|2. తెగ నాయకుని ఆచారాలు]]}}
|{{DJVU page link|9|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/మాతంగుల రాజు|3. మాతంగుల రాజు]]}}
|{{DJVU page link|11|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/చెల్లాచెదరవటం - దాస్యం|4. చెల్లాచెదరవటం - దాస్యం]]}}
|{{DJVU page link|13|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/గేదె రూపం|5. గేదె రూపం]]}}
|{{DJVU page link|16|1}}
}}
'''II పురాతన మాతృపూజ:'''
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/అరుంధతి శాపం|1. అరుంధతి శాపం]]}}
|{{DJVU page link|19|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/మాతంగి ఉపదేశం|2. మాతంగి ఉపదేశం]]}}
|{{DJVU page link|21|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/గాథలలో కథలలో మాతంగి|3. గాథలలో కథలలో మాతంగి]]}}
|{{DJVU page link|24|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/మహాలక్ష్మీ అమ్మవారు (మాలచ్చుమ్మ)|4. మహాలక్ష్మీ అమ్మవారు (మాలచ్చుమ్మ)]]}}
|{{DJVU page link|27|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/రహస్య సమావేశాలు - అర్ధరాత్రి గుంపుకామాలు|5. రహస్య సమావేశాలు - అర్ధరాత్రి గుంపుకామాలు]]}}
|{{DJVU page link|30|1}}
}}
'''III క్రైస్తవమూ - గురువులూ:'''
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/సత్యాన్వేషణ|1. సత్యాన్వేషణ]]}}
|{{DJVU page link|33|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/ఆరుగురు గురువుల వరస|2. ఆరుగురు గురువుల వరస]]}}
|{{DJVU page link|37|1}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/రామస్వామి మౌనం|3. రామస్వామి మౌనం]]}}
|{{DJVU page link|40|1}}
}}
'''IV నజరయ్య నుండి క్రీస్తు వరకూ:'''
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/సంస్కర్త నజరయ్య|1. సంస్కర్త నజరయ్య]]}}
|{{DJVU page link|10|6}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/దైవ దర్శనాకాంక్ష|2. దైవ దర్శనాకాంక్ష]]}}
|{{DJVU page link|3|6}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/తల్లి శాపం|3. తల్లి శాపం]]}}
|{{DJVU page link|5|6}}
}}
'''V రెండు మతాల యుద్ధభూమి:'''
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/కల్లోలంలో|1. కల్లోలంలో]]}}
|{{DJVU page link|10|6}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/శాంతికాదు ఆయుధం|2. శాంతికాదు ఆయుధం]]}}
|{{DJVU page link|3|6}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/మతద్వేషి - అతని అంతం|3. మతద్వేషి - అతని అంతం]]}}
|{{DJVU page link|5|6}}
}}
'''VI క్రైస్తవం శక్తి:'''
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/ఒక గొప్ప సంక్షోభం|1. ఒక గొప్ప సంక్షోభం]]}}
|{{DJVU page link|10|6}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/ఆధునిక పెంతకోస్ట్|2. ఆధునిక పెంతకోస్ట్]]}}
|{{DJVU page link|3|6}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[చెప్పులు కుడుతూ కుడుతూ/ముగింపు|3. ముగింపు]]}}
|{{DJVU page link|5|6}}
}}<noinclude><references/></noinclude>
d5fge7grd4neaumlzr1tszmub18sow8
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/99
104
186362
554362
554040
2026-04-24T22:11:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554362
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|<poem>గద్య
ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగ చొక్కనాథ
మహీనాథ కరుణాకటాక్షసంపాదిత గజతురంగమాందోళికా
ప్రముఖ నిఖిలసంపత్పారంపరీ సమేధమాన
సముఖ మీనాక్షీనాయకతనూభవ మీనాక్షీ
దేవీకటాక్షలబ్ధకవితాసంప్రదాయ
వేంకటకృష్ణప్పనాయకప్రణీ
తం బైనజైమినిభారతం
బున నశ్వమేధపర్వ
మ్మను వచనకావ్యంబు
నందు
ద్వితీయాశ్వాసము.</poem>}}
{{Css image crop
|Image = జైమిని_భారతము_(సముఖం_వేంకటకృష్ణప్పనాయకుడు).pdf
|Page = 99
|bSize = 489
|cWidth = 72
|cHeight = 29
|oTop = 450
|oLeft = 176
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
0dzlfjjkcc93cimi9e3g1oi22uc0098
554363
554362
2026-04-24T22:12:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554363
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|<poem>గద్య
ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగ చొక్కనాథ
మహీనాథ కరుణాకటాక్షసంపాదిత గజతురంగమాందోళికా
ప్రముఖ నిఖిలసంపత్పారంపరీ సమేధమాన
సముఖ మీనాక్షీనాయకతనూభవ మీనాక్షీ
దేవీకటాక్షలబ్ధకవితాసంప్రదాయ
వేంకటకృష్ణప్పనాయకప్రణీ
తం బైనజైమినిభారతం
బున నశ్వమేధపర్వ
మ్మను వచనకావ్యంబు
నందు
ద్వితీయాశ్వాసము.</poem>}}<noinclude><references/></noinclude>
f1pvv55bfkpx57wq4ciuscgsa1g3ndn
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/136
104
186399
554361
554196
2026-04-24T22:08:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554361
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|<poem>గద్య :
ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగ చొక్కనాథ మహీనాథ
కరుణాకటాక్షసంపాదితగజతురంగమాందోళికాప్రముఖనిఖిల
సంపత్పారంపరీసమేధమాన, సముఖమీనాక్షీనాయక
తనూభవ, మీనాక్షీదేవీకటాక్షలబ్ధకవితాసంప్రదాయ
వేంకటకృష్ణప్పనాయకప్రణీతం బైనజైమిని
భారతంబున నశ్వమేధపర్వమ్మను
వచనకావ్యంబునందుఁ
తృతీయాశ్వాసము.</poem>}}
{{Center|———౦———}}<noinclude><references/></noinclude>
8ilofqt6fcc53sb8y9kw3p8em3h4f22
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/170
104
186433
554357
504659
2026-04-24T19:17:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554357
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నంతఃపురంబునకుఁ బోయి, ధారుణిం బడిన హారంబులును, ఖండితంబులైన కటకంబులును, విరిగిన మంజీరంబులును, బోరగిలంబడవైచిన దూర్వాక్షతలాజపాత్రంబులు, నాఱిన నీరాజనంబులును, విరయంబడిన కురులతో నేడ్చు సఖీజనంబులుం గలిగి, దుఃఖాక్రాంతంబైన యంతఃపురంబునఁ జింతాక్రాంతలై మూర్ఛిల్లిన తల్లులం జూచి, 'తల్లులారా, యింత వంత నొంద నేమిటికి? ఏను శత్రుసంహారంబు సేసి జయరమాసమేతుండనై వచ్చినయెడ న న్నభినందింపకుండుటకుఁ గారణం బేమి?' యనిన విని చిత్రాంగద, 'కుమారకా, నీవే నా పగదాయ వైతివి. వృక్షశాఖవలనం జనియించిన యగ్నియే యావృక్షంబును దహించిన తెఱంగున, నీవు పుత్రుండవై జనియించి, తండ్రి యగు నర్జునుని సంహరించితివి. కావున నింక విధవకు భూషణంబులేల? కుమారకా, నీచే నంతంబు నొందిన కౌంతేయుని చెంగటికి నన్నుం దోడ్కొని పొమ్ము. అగ్నిప్రవేశంబు సేసి యమరలోకంబున నర్జును నాననంబు నవలోకించెద,' ననిన విని యులూచి చిత్రాంగదఁ జూచి, 'నా యుద్యానవనంబులో నేను గూరిమిఁ బెంచునట్టి యైదుదాడిమి తరుపు లున్నయట్ల యుండి నిన్నటిరేయి నిష్కారణంబుగా దహింపబడియె. ఆ దుర్నిమిత్తంబు గనుంగొని మన ప్రాణవల్లభుండైన కిరీటి మరణంబు నిశ్చయించితి' ననియె. అప్పుడు చిత్రాంగద, బభ్రువాహనునిఁ జూచి, 'తండ్రిం జంపిన మహాపాతకంబు సంభవించె. బుద్ధిపూర్వకంబుగా నింత పాపము వచ్చె; నింక నేటి యుత్సాహము? ఏమిటి జయంబు? సమరస్థలంబునకు మమ్ములను బిలిచికొని పొమ్మ'నిన, బభ్రువాహనుండు భయాకులితమానసుండై, మొగంబు వెలవెలబాఱఁ, దల్లులం దోడ్కొని పోవునప్పు డప్పడంతుకలు, బెబ్బులి ఘోషంబు వినిన ధేనువులచందంబున ‘హా!' యని యుల్లంబున తల్లడిల్లి, ఖండితంబులగు కదళీకాండంబుల చందంబున భూమండలిని వ్రాలఁ బరిచారికాజనంబు లగు మగువలు లేవనెత్తిరి.
{{p|ac|fwb}}చిత్రాంగద, యులూచి యుద్ధభూమి కేగుట</p>
(అప్పుడు వారు) నెత్తమ్ములఁ బోలిన కన్నుల బాష్పధారాపూరంబులు కాల్వలై పాఱఁ, బెదవులెండఁ, బొరలి యేడ్చుచు, లేచి ముప్పిరిగొను మోహంబునఁ బయ్యెదలు జాఱి జీరాడ, ముత్యాలపేరులు కుచకుంభంబులం బుటంబు<noinclude><references/></noinclude>
84gv31q4a16cl501fict8qjrmrhcsay
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/171
104
186434
554358
504660
2026-04-24T21:43:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554358
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లెగసి దుముకులాడ, నసదుగౌను లల్లాడఁ, గప్పుకొప్పులు వీడ, నడుగుదమ్ములు తడఁబడ, డెందంబులఁ బొగులుచుఁ, గ్రందుగొని భేదంబున సమరాంగణంబునకుఁ జనిరి.
తదనంతరంబ చిత్రాంగదయు, భుజంగరాజతనూభవయును, ఫల్గునుని పాదంబుంపయిం బడి యురంబులను, శిరంబులను మోఁదుకొనుచు, వికీర్ణకేశపాశలై 'హా మహావీరా, పురందరనందనా, నివాతకవచకాలకేయాంతకా, దేవతాసమూహంబులను దఱిమి, యాఖండలుని జయించి, నగ్నిదేవుని కాహుతిఁ జేసిన నీశౌర్యం బెందుఁ జనె? ఎక్కటికయ్యంబున ముక్కంటితోడఁ బెనంగి మెప్పించి పాశుపతాద్యస్త్రంబులఁ గైకొన్న నీవిక్రమం బెం దణంగె? కాలకేయనివాతకవచాది దైతేయుల నుక్కణగించి జయంబు గైకొనిన మహాప్రతాపం బేమూల డాఁగె? భీష్మద్రోణ కర్ణ కృపాశ్వత్థామ దుర్యోధన దుశ్శాసన వికర్ణాదుల జయించి, ఏకవీరుండవై గోగణంబు మరల్చిన బాహుబలం బేచక్కిం జనియె? అన్నయగు ధర్మజునిచే రాజసూయాధ్వరంబుం జేయింపంబూని, యిలావృత కింపురుష భద్రాశ్వ కేతుమూల కురువర్షంబుల దేవతాయోగ్యంబు లైన దివ్యవస్తువాహనంబుల నపారంబుగాఁ దెచ్చిన భుజావిజృంభణం బెక్కడఁ బోయె? యాదవబలంబుల సరకు సేయక సుభద్ర నరదంబుపై నుంచుకొని వచ్చిన యా మగటిమి యేదిక్కునం బోయె? చక్కరవిలుతుని ధిక్కరించు చక్కదనంబు గల నీచొక్కటపునెమ్మేను దుమ్మునఁ గ్రమ్మి యున్నయది! ఇంద్రనీలకవాటంబుకరణి వాటంబైన నీ యురస్తటంబున నిశితవిశిఖంబులు నాఁటి యున్నయవి! చంద్రబింబోపమానంబును, మందస్మితసుందరంబు నైన నీ వదనారవిందంబు ఖండితంబయ్యును గలకల నగుచుఁ, జెన్నుఁ దొలగక యున్నయది!' అని బహుప్రకారంబులఁ బలవించి, తత్సమీపంబునఁ గర్ణనందనుని శిరంబు గాంచి, వక్షంబునఁ జేర్చికొని, 'తండ్రీ, కుమారకంఠీరవా కర్ణకుమారకా, నీకుఁ బినతండ్రియైన ధనంజయుని సూడు దీర్చుకొనక యిట్లుండఁదగునె?' యని పలికి బభ్రువాహనునిఁ జూచి, 'తనూభవా, దానశూరుఁడైన
కర్ణకుమారునిం జంపితివి. ఇందు నీ కేమి కీర్తి కలిగె? అధ్వరాశ్వంబువెంబడి హస్తినాపురంబునకు జని కుంతీ ద్రౌపదీ సుభద్రలం, దక్కునుంగల బాంధవుల నవలోకించి, యశ్వమేధ్వాబృథస్నానంబు సేసి, మా వల్లభుండైన సవ్యసాచితో విహరింపవలయునను కోరిక లంకురించుచునుండ వానిని ఖండించితివి. నీ జన<noinclude><references/></noinclude>
bmb2m74sic7z4hj6xzunuk1qnlzxsc8
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/172
104
186435
554366
504661
2026-04-25T01:14:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554366
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కునిం జంపిన తెఱంగున జననుల మగు మమ్ముఁ బరిమార్చి మా కాంతునిచెంతకుఁ బంపుము. ఇట్లు చేసితివేని, తల్లిని మాత్రంబు జంపిన పరశురాముని కన్న మిన్న గావించితివని కొనియాడుదురు. ప్రియుఁడు పరలోకగతుండైన పిమ్మట ననుగమనంబుఁ జేయుట సతుల కుచితకృత్యంబు. కావున, నందులకుఁ దగినయత్నంబు సేయుము. అగ్నిముఖంబునఁ బ్రవేశించి పతివిరహాగ్నిసంతాపంబు బాసెద' మని పలుకుచున్న తల్లుల నవలోకించి బభ్రువాహనుండు, 'అంబలారా, మున్ను మన సేనాపతి యెఱుఁగక హయంబుఁ బట్టిన, నది నేను విచారించి, తురంగంబును, ధనకనకవస్తువాహనరత్నభూషణాంబరంబులఁ గానుకలుగాఁ గొనుచుంజని, సాష్టాంగదండప్రణామంబు గావించి, తురంగంబు మరల నొప్పగించుటయు, నాదరింపక సభామధ్యంబునఁ దుచ్ఛవాక్యంబులఁ బలుకరించిన సహించి యుండితి. అంతట నిలువక మాతృనిందాకరంబులైన నీచవాక్యంబు లాడుట కతనం గోపంబు వొడమె. అందువలనఁ బితృహత్య సంభవించె. ఇమ్మహాపాతకంబుఁ బాపుకొనుటకు, వనంబునకుం జని, కృఛ్రచాంద్రాయణాదివ్రతంబులు, యజ్ఞదానాధ్యయనాది సత్కర్మంబులుం జేయుచు నుపవాసంబులచే మేను శోషింపఁజేసెద. మున్ను నేను జనియించిన లగ్నంబునఁ బితృస్థానంబు క్రూరగ్రహాధిష్ఠితంబు నశుభక్షితంబునై యుండెం గావునఁ బితృఘాతుకుండని యెఱింగి చిత్రాంగద నన్నుం జంపక పెనుచుటవలనఁగదా యిట్టి పాతకంబు సంభవించె! ఇక నిమిషమాత్రంబేనియు శరీరంబు నిలుపుకొనంజాల. అగ్నిముఖంబున నాహుతి గావించి పాతకవిముక్తుండ నయ్యెద' ననిన, విని, యులూచి తనయునిఁ జూచి, 'కుమారకా, పదరకుము. మాతండ్రియైన శేషుని నగరమున మృతసంజీవనమణి గలదు. పన్నగాంతకుండైన గరుత్మంతుని ఘాతచేఁ బ్రతిదినంబును మృతింబొందెడు పన్నగులయెడ దయచేసి పన్నగాభరణుండు నాపన్నరక్షకుండునై నీలకంఠుండు నాగకులసంరక్షణార్థంబుగా నారత్నంబు నాతండ్రికి దయచేసె. కుళిక వాసుకి శంఖకర్కోటక తక్షకాది నాగంబులు మణిప్రభామండితంబులైన ఫణిమండలంబులతో దానిం గాపాడుచునుండుదురు. కావున బలిమిచేతం గైకొనఁగూడదు. సామవచనంబుల వేడినఁ దేవచ్చును. అందులకు మా వాకిటి ప్రధానియగు పుండరీకుఁడు తక్క వేఱొక్కరుండు దేనోపం'డని వానిఁ బిలిచి తన తాటంకమంగళసూత్రంబులు వానిచేతి కిచ్చి, ఫణిలోకస్వామితోఁ దన దుర్దశఁ దెలిపి యమ్మణింజే కొని రమ్మని వీడ్కొలిపె.<noinclude><references/></noinclude>
sqqvx1vmvizn7up5y8oe1exip4qy3c0
554367
554366
2026-04-25T01:16:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554367
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కునిం జంపిన తెఱంగున జననుల మగు మమ్ముఁ బరిమార్చి మా కాంతునిచెంతకుఁ బంపుము. ఇట్లు చేసితివేని, తల్లిని మాత్రంబు జంపిన పరశురాముని కన్న మిన్న గావించితివని కొనియాడుదురు. ప్రియుఁడు పరలోకగతుండైన పిమ్మట ననుగమనంబుఁ జేయుట సతుల కుచితకృత్యంబు. కావున, నందులకుఁ దగినయత్నంబు సేయుము. అగ్నిముఖంబునఁ బ్రవేశించి పతివిరహాగ్నిసంతాపంబు బాసెద' మని పలుకుచున్న తల్లుల నవలోకించి బభ్రువాహనుండు, 'అంబలారా, మున్ను మన సేనాపతి యెఱుఁగక హయంబుఁ బట్టిన, నది నేను విచారించి, తురంగంబును, ధనకనకవస్తువాహనరత్నభూషణాంబరంబులఁ గానుకలుగాఁ గొనుచుంజని, సాష్టాంగదండప్రణామంబు గావించి, తురంగంబు మరల నొప్పగించుటయు, నాదరింపక సభామధ్యంబునఁ దుచ్ఛవాక్యంబులఁ బలుకరించిన సహించి యుండితి. అంతట నిలువక మాతృనిందాకరంబులైన నీచవాక్యంబు లాడుట కతనం గోపంబు వొడమె. అందువలనఁ బితృహత్య సంభవించె. ఇమ్మహాపాతకంబుఁ బాపుకొనుటకు, వనంబునకుం జని, కృఛ్రచాంద్రాయణాదివ్రతంబులు, యజ్ఞదానాధ్యయనాది సత్కర్మంబులుం జేయుచు నుపవాసంబులచే మేను శోషింపఁజేసెద. మున్ను నేను జనియించిన లగ్నంబునఁ బితృస్థానంబు క్రూరగ్రహాధిష్ఠితంబు నశుభక్షితంబునై యుండెం గావునఁ బితృఘాతుకుండని యెఱింగి చిత్రాంగద నన్నుం జంపక పెనుచుటవలనఁగదా యిట్టి పాతకంబు సంభవించె! ఇక నిమిషమాత్రంబేనియు శరీరంబు నిలుపుకొనంజాల. అగ్నిముఖంబున నాహుతి గావించి పాతకవిముక్తుండ నయ్యెద' ననిన, విని, యులూచి తనయునిఁ జూచి, 'కుమారకా, పదరకుము. మాతండ్రియైన శేషుని నగరమున మృతసంజీవనమణి గలదు. పన్నగాంతకుండైన గరుత్మంతుని ఘాతచేఁ బ్రతిదినంబును మృతింబొందెడు పన్నగులయెడ దయచేసి పన్నగాభరణుండు నాపన్నరక్షకుండునై నీలకంఠుండు నాగకులసంరక్షణార్థంబుగా నారత్నంబు నాతండ్రికి దయచేసె. కుళిక వాసుకి శంఖకర్కోటక తక్షకాది నాగంబులు మణిప్రభామండితంబులైన ఫణిమండలంబులతో దానిం గాపాడుచునుండుదురు. కావున బలిమిచేతం గైకొనఁగూడదు. సామవచనంబుల వేడినఁ దేవచ్చును. అందులకు మా వాకిటి ప్రధానియగు పుండరీకుఁడు తక్క వేఱొక్కరుండు దేనోపం'డని వానిఁ బిలిచి తన తాటంకమంగళసూత్రంబులు వానిచేతి కిచ్చి, ఫణిలోకస్వామితోఁ దన దుర్దశఁ దెలిపి యమ్మణిం జేకొని రమ్మని వీడ్కొలిపె.<noinclude><references/></noinclude>
15b08uqsbbjk53w3he4frln2ri2kbev
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/173
104
186436
554371
504662
2026-04-25T02:47:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554371
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}ఉలూచి మృతసంజీవనమణికై పుండరీకుని పంపుట</p>
అంతం బుండరీకుండు, విజయ వృషకేతువుల శరీరంబులు వికారంబు నొందకుండ మూర్కొని, వారినిఁ గాపాడుకొని యుండుండని బభ్రువాహనునితో నెచ్చరించి, మహేతలంబు సొచ్చి, మరకతమణిమయంబులైన చందనవృక్షంబులం బొలుపొందు రసాతలంబు నతిక్రమించి, భోగవతీపురంబున నభిరామంబైన యారామంబునఁ బొలుపొందు హాటకేశ్వరు నాలయంబున నటనంబు సేయు నాగకన్యకల గానంబులచే నాదమేదురంబైన పాతాళంబునకుం జని, యచ్చట భోగవతీ నామిక యగు పాతాళగంగలో స్నానంబు సేసి, నిత్యకృత్యంబులు నిర్వర్తించి, సువర్ణమయంబులైన పంకజంబులచే హాటకేశ్వరుఁ బూజించి, ఫాలంబున నంజలిఁ గీలించి, యద్దేవుని వీడుకొని, రాజమందిరంబునకుం జని, యచ్చట నవరత్నఖచితంబును నలినమిత్రాడంబరవిడంబకంబు ననేకసహస్రస్తంభశోభితంబు నగు నాస్థానమండపంబున, వాసుకి కర్కోటక తక్షకైలాపుత్ర కాళీయ ధృతరాష్ట్రాది మహానాగేంద్రులు పరివేష్టింప, నవరత్నస్థగితసింహాసనంబున సుఖాసీనుండును, శ్రీమన్నారాయణస్మరణనిర్ధూతనిఖిలమాయావిశేషుండు నైన శేషునిం గనుంగొని సవినయంబుగాఁ బ్రణామంబు సేసి, యులూచి పంచిన కుందనంపు మెఱుగుకమ్మలును, దాళిబొట్టునుఁ జూపి, 'యర్జునుండు ధర్మజుని మఖవాజి సంరక్షణార్థంబుగా వచ్చునెడ బభ్రువాహను మార్కొని హతుఁడయ్యెఁ గావునఁ దనకుఁ బతిదానంబుఁ జేయుమని యామె వేఁడుకొనియె. ధరణీతలంబు ఫణామండలంబునం దాల్చి సమస్తజీవకోటులకుఁ బరమసుఖంబు గావించెదవు. ఫాలనేత్రుని వింటికి గుణంబవై త్రిపురజయం బొసంగి వేల్పులఁ బ్రోచితివి. పన్నగనాయకా, నీవిహారంబులన్నియుం బరోపకారంబులు గావున నీ నగరియందు మహానాగసంరక్షితంబైన మృతసంజీవనమణిం దయసేసినఁ బార్థుండు బ్రదుకగలండ'నిన, విని శేషుం డిట్లనియె:
'హరిభక్తిపరాయణుండైన యర్జునుని జయింప నాదినారాయణుకుం దక్క నెవ్వరి తరంబు? ఇతండు సమరంబున మృతుం డయ్యెననుట యద్భుతంబయ్యెడి.' అనిన విని పుండరీకుండు, 'భుజంగవల్లభా, విజయుని మార్కొను సాటి మేటిమగలు ముజ్జగంబున లేరనుట నిజంబు. పుత్రశోకోపహతయగు గంగానదీ<noinclude><references/></noinclude>
daw6hydeo2v163dfjg5i5jz3uafkgu2
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/174
104
186437
554372
504663
2026-04-25T03:03:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554372
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>
శాపంబున నతని కిత్తెఱంగు వాటిల్లె' ననిన, దయార్ద్రహృదయుండై యనంతుండు 'మృతసంజీవనమణియు, నమృతకుంభంబు నొసంగి సమరహతుఁ డైన సవ్యసాచిం బ్రదికించి జగత్రయంబున నతులితంబైన కీర్తి వహించెద'నని నిశ్చయించి, ధృతరాష్ట్రుండను ఫణిపతిం బిలిచి, 'సంపాదించిన వస్తువులలో దాతయైన పురుషున కీయరాని వస్తువు లేదు'. అనిన విని యాభుజంగం బిట్లనియె. 'దేవా, యొక్కవిన్నపంబు వినుము. మర్త్యు లసత్యవాదులు. కృతఘ్నులు. వారియెడ నేక్రియలు ఫలింపవు. నాగకులంబునకెల్ల జీవనహేతువులై న యీవస్తువుల నొసంగితిమేని, మనకు, నీరు పామునకు విశేషం బెయ్యది? గరుడండు ప్రతిదినంబునుం దఱుముకొని తిఱుగు. ఊరజోగులు మంత్రబలంబునం బట్టి యాడింతురు. పడంతులు పడగలనున్న రత్నంబుల నొలుచుకొనియెదరు. మున్ను మతంగమహాముని శాపంబువలన వైనతేయుం డిచటికి రాకుండ నున్నాఁడు. ఇవ్విధం బెఱింగెనేని, రత్నంబు, నమృతకలశంబు నపహరించుకొనిపోవుగాని మన కేల యీయనిచ్చు? రాజు మదగజంబు వంటివాఁడు. అతండు మేర మీఱి నడచినయెడఁ గ్రమంబున మఱలింపవలయుంగాని మీఱనీయం దగదు.' అనిన విని, శేషుండు ధృతరాష్ట్రుం జూచి, 'మున్ను చతుర్ముఖుండు లేఁగదూడలఁ గోపబాలకుల నటమటించినయెడ వెన్నుఁడు బ్రహ్మసృష్టికిం బ్రతిసృష్టి నొనర్చె. అఘటనఘటనావిహారుండైన యా కేశవునకు నసాధ్యం బెద్ది? అతండు చేపట్టినం బూరిపుడుక వజ్రాయుధం బగు. శ్రీమన్నారాయణుని కరుణ లేకున్న మహామేరువైనం దృణం బగు. అద్దేవుని కృపాకటాక్షంబునంగాదె మనమందఱము బ్రతికియున్నాము.' అనిన విని ధృతరాష్ట్రుండు శేషుం జూచి, 'యా వనజనాభుండే వాసవతనయునిం బ్రతికిఁపంగలఁ డనినయెడ సంజీవనమణియు సుధాకలశంబు నేమిటికి నిరర్థకంబుగా నిచ్చుట వలన ఫణికులంబునకు హాని సంభవించుటే కాని ప్రయోజనంబు లేద'నుటయుఁ, గుండలీంద్రుండు పుండరీకుని జూచి 'మాకులంబు వారు సంజీవనమణియు, సుధాకలశంబు నీయరు. శ్రీహరి కృప కలిగిన యర్జునున కేమి కొదవ? ఆ దేవుండు తానె బ్రతికించు ననిన విని, పుండరీకుడు విఫలమనోరథుండై, వచ్చినత్రోవఁ బట్టి చని, సంగరాంగణంబునకు వచ్చి, యచ్చట గంధతైలావసిక్తంబులుఁ, గనకదండమండితంబులుఁ, గర్పూరప్రదీప్తంబులు నైన కరదీపికా<noinclude><references/></noinclude>
antumlzro9cnho03qqycuq8vjowevuh
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/175
104
186438
554373
504664
2026-04-25T03:22:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554373
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సహస్రంబులు ప్రకాశింపఁ గొలువున్న బభ్రువాహనుని, నతనిచెంగట నర్జునునిశిరంబు నంకతలంబున నునిచికొని, దీనవాక్యంబుల పలవించుచున్న యులూచి చిత్రాంగదల నవలోకించి, విషాదంబు దోఁప నిట్లనియె. 'తల్లీ, నీ జనకుండైన శేషుండు సంజీవరత్నం బీయక లోభంబునం బలికిన రోసి వచ్చితి, మీర లింకఁ బుత్రదత్తంబైన యగ్నిం బ్రవేశింపుం' డనిన విని బభ్రువాహనుండు క్రోధారుణలోచనుఁడై, కనుబౌమల ముడిపాటు ఘటించి కార్ముకంబుఁ గరంబునఁ గైకొని, '[వృథా] శేషఫణి గర్వించి న న్నెంచక సభలో నిరాకరణవచనంబులు పలికెనే? దుర్మంత్రులైన వాసుకి తక్షక కర్కోటక ధృతరాష్ట్రాదుల దుర్భుద్ధులు విని జీవరత్నం బీయడాయెనే? ఈ క్షణంబ పాతాళక్షోణికిం జని, సాక్షాత్కారంబుగా
నిటలాక్షుఁడు వారికి సహాయుం డయ్యెనేని, నాగలోకంబు నిశ్శేషంబు గావించి, మృతసంజీవనమణియు, సుధారసంబునుం దెచ్చెద, వగవకుండుఁ'డని పలికెను.
{{p|ac|fwb}}బభ్రువాహనుండు సర్పములతోడి యుద్ధంబున కేగుట</p>
(ఇట్లు పలికి యాతండు) మాతంగతురంగశతాంగవీరభటసమేతుండై, పుండరీకుండు మార్గంబు సూపఁ గాతాళంబునఁ బాతాళంబునకుం జని, శంఖభేరీమృదంగనిస్సాణాదివాద్యఘోషంబులు దిక్కులు గ్రక్కతిల్లఁ గడంగుటయు, శేషుండు తక్షక వాసుకి కర్కోటక ధృతరాష్ట్రాదులం జూచి, 'బభ్రువాహనుండు పితృమరణవ్యథాకులితమానసుండై మనమీఁదికిం జనుదెంచె. చిలువకులంబు నిరవశేషంబు సేయక విడువండు. ధృతరాష్ట్రుని దుర్నీతి నాచరించుట వలన నాగకులంబున కింతటి యాపద యొదవె. ఇంక నేమి సేయంగలవారము? మీరు నపారబలసమేతంబుగాఁ బోరికిం జనుండు.' అనిన విని, కుండలి మండలీంద్రుని యాజ్ఞ శిరంబున ధరియించి, వాసుకి తక్షక శంఖ కర్కోటక మూషద కాళీయప్రభృతులైన సర్పకులాధ్యక్షులు, రత్నకుండలకిరీటహారకేయూరమాల్యచందనదుకూలాదులు ధరియించి, కరితురగరథభటసమూహంబులతో వెడలి, కదనంబునకుం దలపడుటయుఁ, గల్పాంతకాలంబున ఘూర్ణిల్లు పూర్వపశ్చిమసముద్రంబులకైవడిం గనుపట్టె. నాగకుమారులు కరితురగారూఢులై పంచయోజనవిస్తీర్ణంబైన నరసుతుని సేనలోనం జొచ్చి విషజ్వాలామాలికల దహించుటయు, విజయసుతుం డవష్టంభవిజృంభితుఁడై, మయూరాస్త్రంబు ప్రయోగించుటయు, నపారంబులైన మయూ<noinclude><references/></noinclude>
ge9ffwfkqtmyrqg0z8ald8wn7mp98rn
554374
554373
2026-04-25T03:22:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554374
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సహస్రంబులు ప్రకాశింపఁ గొలువున్న బభ్రువాహనుని, నతనిచెంగట నర్జునునిశిరంబు నంకతలంబున నునిచికొని, దీనవాక్యంబుల పలవించుచున్న యులూచి చిత్రాంగదల నవలోకించి, విషాదంబు దోఁప నిట్లనియె. 'తల్లీ, నీ జనకుండైన శేషుండు సంజీవరత్నం బీయక లోభంబునం బలికిన రోసి వచ్చితి, మీర లింకఁ బుత్రదత్తంబైన యగ్నిం బ్రవేశింపుం' డనిన విని బభ్రువాహనుండు క్రోధారుణలోచనుఁడై, కనుబౌమల ముడిపాటు ఘటించి కార్ముకంబుఁ గరంబునఁ గైకొని, '[వృథా] శేషఫణి గర్వించి న న్నెంచక సభలో నిరాకరణవచనంబులు పలికెనే? దుర్మంత్రులైన వాసుకి తక్షక కర్కోటక ధృతరాష్ట్రాదుల దుర్భుద్ధులు విని జీవరత్నం బీయఁడాయెనే? ఈ క్షణంబ పాతాళక్షోణికిం జని, సాక్షాత్కారంబుగా
నిటలాక్షుఁడు వారికి సహాయుం డయ్యెనేని, నాగలోకంబు నిశ్శేషంబు గావించి, మృతసంజీవనమణియు, సుధారసంబునుం దెచ్చెద, వగవకుండుఁ'డని పలికెను.
{{p|ac|fwb}}బభ్రువాహనుండు సర్పములతోడి యుద్ధంబున కేగుట</p>
(ఇట్లు పలికి యాతండు) మాతంగతురంగశతాంగవీరభటసమేతుండై, పుండరీకుండు మార్గంబు సూపఁ గాతాళంబునఁ బాతాళంబునకుం జని, శంఖభేరీమృదంగనిస్సాణాదివాద్యఘోషంబులు దిక్కులు గ్రక్కతిల్లఁ గడంగుటయు, శేషుండు తక్షక వాసుకి కర్కోటక ధృతరాష్ట్రాదులం జూచి, 'బభ్రువాహనుండు పితృమరణవ్యథాకులితమానసుండై మనమీఁదికిం జనుదెంచె. చిలువకులంబు నిరవశేషంబు సేయక విడువండు. ధృతరాష్ట్రుని దుర్నీతి నాచరించుట వలన నాగకులంబున కింతటి యాపద యొదవె. ఇంక నేమి సేయంగలవారము? మీరు నపారబలసమేతంబుగాఁ బోరికిం జనుండు.' అనిన విని, కుండలి మండలీంద్రుని యాజ్ఞ శిరంబున ధరియించి, వాసుకి తక్షక శంఖ కర్కోటక మూషద కాళీయప్రభృతులైన సర్పకులాధ్యక్షులు, రత్నకుండలకిరీటహారకేయూరమాల్యచందనదుకూలాదులు ధరియించి, కరితురగరథభటసమూహంబులతో వెడలి, కదనంబునకుం దలపడుటయుఁ, గల్పాంతకాలంబున ఘూర్ణిల్లు పూర్వపశ్చిమసముద్రంబులకైవడిం గనుపట్టె. నాగకుమారులు కరితురగారూఢులై పంచయోజనవిస్తీర్ణంబైన నరసుతుని సేనలోనం జొచ్చి విషజ్వాలామాలికల దహించుటయు, విజయసుతుం డవష్టంభవిజృంభితుఁడై, మయూరాస్త్రంబు ప్రయోగించుటయు, నపారంబులైన మయూ<noinclude><references/></noinclude>
jcb8qb9h8jl173ch0awg7kzbpm3yi1f
554375
554374
2026-04-25T03:25:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554375
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సహస్రంబులు ప్రకాశింపఁ గొలువున్న బభ్రువాహనుని, నతనిచెంగట నర్జునునిశిరంబు నంకతలంబున నునిచికొని, దీనవాక్యంబుల పలవించుచున్న యులూచి చిత్రాంగదల నవలోకించి, విషాదంబు దోఁప నిట్లనియె. 'తల్లీ, నీ జనకుండైన శేషుండు సంజీవరత్నం బీయక లోభంబునం బలికిన రోసి వచ్చితి, మీర లింకఁ బుత్రదత్తంబైన యగ్నిం బ్రవేశింపుం' డనిన విని బభ్రువాహనుండు క్రోధారుణలోచనుఁడై, కనుబొమలముడిపాటు ఘటించి కార్ముకంబుఁ గరంబునఁ గైకొని, '[వృథా] శేషఫణి గర్వించి న న్నెంచక సభలో నిరాకరణవచనంబులు పలికెనే? దుర్మంత్రులైన వాసుకి తక్షక కర్కోటక ధృతరాష్ట్రాదుల దుర్భుద్ధులు విని జీవరత్నం బీయఁడాయెనే? ఈ క్షణంబ పాతాళక్షోణికిం జని, సాక్షాత్కారంబుగా నిటలాక్షుఁడు వారికి సహాయుం డయ్యెనేని, నాగలోకంబు నిశ్శేషంబు గావించి, మృతసంజీవనమణియు, సుధారసంబునుం దెచ్చెద, వగవకుండుఁ'డని పలికెను.
{{p|ac|fwb}}బభ్రువాహనుండు సర్పములతోడి యుద్ధంబున కేగుట</p>
(ఇట్లు పలికి యాతండు) మాతంగతురంగశతాంగవీరభటసమేతుండై, పుండరీకుండు మార్గంబు సూపఁ గాతాళంబునఁ బాతాళంబునకుం జని, శంఖభేరీమృదంగనిస్సాణాదివాద్యఘోషంబులు దిక్కులు గ్రక్కతిల్లఁ గడంగుటయు, శేషుండు తక్షక వాసుకి కర్కోటక ధృతరాష్ట్రాదులం జూచి, 'బభ్రువాహనుండు పితృమరణవ్యథాకులితమానసుండై మనమీఁదికిం జనుదెంచె. చిలువకులంబు నిరవశేషంబు సేయక విడువండు. ధృతరాష్ట్రుని దుర్నీతి నాచరించుట వలన నాగకులంబున కింతటి యాపద యొదవె. ఇంక నేమి సేయంగలవారము? మీరు నపారబలసమేతంబుగాఁ బోరికిం జనుండు.' అనిన విని, కుండలి మండలీంద్రుని యాజ్ఞ శిరంబున ధరియించి, వాసుకి తక్షక శంఖ కర్కోటక మూషద కాళీయప్రభృతులైన సర్పకులాధ్యక్షులు, రత్నకుండలకిరీటహారకేయూరమాల్యచందనదుకూలాదులు ధరియించి, కరితురగరథభటసమూహంబులతో వెడలి, కదనంబునకుం దలపడుటయుఁ, గల్పాంతకాలంబున ఘూర్ణిల్లు పూర్వపశ్చిమసముద్రంబులకైవడిం గనుపట్టె. నాగకుమారులు కరితురగారూఢులై పంచయోజనవిస్తీర్ణంబైన నరసుతుని సేనలోనం జొచ్చి విషజ్వాలామాలికల దహించుటయు, విజయసుతుం డవష్టంభవిజృంభితుఁడై, మయూరాస్త్రంబు ప్రయోగించుటయు, నపారంబులైన మయూ<noinclude><references/></noinclude>
a4dkf08diqd7b8dqemublckrvrh14wj
554376
554375
2026-04-25T03:27:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554376
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సహస్రంబులు ప్రకాశింపఁ గొలువున్న బభ్రువాహనుని, నతనిచెంగట నర్జునునిశిరంబు నంకతలంబున నునిచికొని, దీనవాక్యంబుల పలవించుచున్న యులూచి చిత్రాంగదల నవలోకించి, విషాదంబు దోఁప నిట్లనియె. 'తల్లీ, నీ జనకుండైన శేషుండు సంజీవరత్నం బీయక లోభంబునం బలికిన రోసి వచ్చితి, మీర లింకఁ బుత్రదత్తంబైన యగ్నిం బ్రవేశింపుం' డనిన విని బభ్రువాహనుండు క్రోధారుణలోచనుఁడై, కనుబొమలముడిపాటు ఘటించి కార్ముకంబుఁ గరంబునఁ గైకొని, '[వృథా] శేషఫణి గర్వించి న న్నెంచక సభలో నిరాకరణవచనంబులు పలికెనే? దుర్మంత్రులైన వాసుకి తక్షక కర్కోటక ధృతరాష్ట్రాదుల దుర్భుద్ధులు విని జీవరత్నం బీయఁడాయెనే? ఈ క్షణంబ పాతాళక్షోణికిం జని, సాక్షాత్కారంబుగా నిటలాక్షుఁడు వారికి సహాయుం డయ్యెనేని, నాగలోకంబు నిశ్శేషంబు గావించి, మృతసంజీవనమణియు, సుధారసంబునుం దెచ్చెద, వగవకుండుఁ'డని పలికెను.
{{p|ac|fwb}}బభ్రువాహనుండు సర్పములతోడి యుద్ధంబున కేగుట</p>
(ఇట్లు పలికి యాతండు) మాతంగతురంగశతాంగవీరభటసమేతుండై, పుండరీకుండు మార్గంబు సూపఁ గాతాళంబునఁ బాతాళంబునకుం జని, శంఖభేరీమృదంగనిస్సాణాదివాద్యఘోషంబులు దిక్కులు గ్రక్కతిల్లఁ గడంగుటయు, శేషుండు తక్షక వాసుకి కర్కోటక ధృతరాష్ట్రాదులం జూచి, 'బభ్రువాహనుండు పితృమరణవ్యధాకులితమానసుండై మనమీఁదికిం జనుదెంచె. చిలువకులంబు నిరవశేషంబు సేయక విడువండు. ధృతరాష్ట్రుని దుర్నీతి నాచరించుట వలన నాగకులంబున కింతటి యాపద యొదవె. ఇంక నేమి సేయంగలవారము? మీరు నపారబలసమేతంబుగాఁ బోరికిం జనుండు.' అనిన విని, కుండలి మండలీంద్రుని యాజ్ఞ శిరంబున ధరియించి, వాసుకి తక్షక శంఖ కర్కోటక మూషద కాళీయప్రభృతులైన సర్పకులాధ్యక్షులు, రత్నకుండలకిరీటహారకేయూరమాల్యచందనదుకూలాదులు ధరియించి, కరితురగరథభటసమూహంబులతో వెడలి, కదనంబునకుం దలపడుటయుఁ, గల్పాంతకాలంబున ఘూర్ణిల్లు పూర్వపశ్చిమసముద్రంబులకైవడిం గనుపట్టె. నాగకుమారులు కరితురగారూఢులై పంచయోజనవిస్తీర్ణంబైన నరసుతుని సేనలోనం జొచ్చి విషజ్వాలామాలికల దహించుటయు, విజయసుతుం డవష్టంభవిజృంభితుఁడై, మయూరాస్త్రంబు ప్రయోగించుటయు, నపారంబులైన మయూ<noinclude><references/></noinclude>
4y1bztpv60e8lyxve228hco0hbre1ju
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/176
104
186439
554379
504665
2026-04-25T04:17:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554379
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రంబులు వెడలి, యిన్నూఱు, మున్నూఱు, నన్నూఱు పడగలు గలిగిన ఫణుల ఫణంబులు నుఱుమారుటయు, వాని శిరంబులనుండి ప్రళయకాలంబునందలి యుల్కాపాతంబులకరణి శిరోరత్నంబులు రాలం దొడంగె. ఇత్తఱంగునఁ గేకిలోకంబు కాకోదరంబులం జీకాకుపడం జుంచువులం జీరి, నఖంబులం జించి, ఱెక్కలఁ గొట్టియుఁ బ్రేవులు ప్రోవులుపడ నాలికలు పేలికలవిధంబునం దూలఁ దూలించుటయు, నవ్విధంబుఁ గనుంగొని యక్కుమారకంఠీరవుండు తోడనె మధుబాణంబుం బ్రయోగించినఁ దేనియవాన గురిసె. ఆ వెంబడిఁ బిపీలికాస్త్రం బేయుటయు నందువలన నుక్కుముఖంబుల చీమలు పెక్కులు వెలువడి పాముల శరీరంబులు తొలిచి, తొఱటలు వాఱం జేయుటయుఁ, జలువదళంబులు తల బీకనకాయలు యథాయథలుఁ గకావికలునై మొనగట్టంజాలక శేషాహి చెంగటికిం బఱచిన, వారలం గనుంగొని భుజంగపుంగవుండు, 'ధృతరాష్ట్రా, నీ దురంతంబు వలన నింత యాపద సంభవించె. ఇప్పుడు నీ కుయుక్తి యెక్కడికిం బోయె?' నని నిరసించె.
{{p|ac|fwb}}బభ్రువాహనుఁడు సంజీవనమణిఁ దెచ్చుట</p>
ఆ క్షణంబ నాదిశేషుఁడు బభ్రువాహనునకుఁ గర్బురమయంబైన దివ్యకవచంబును, శతశలాకాచ్చత్రంబును, రత్నకుండలాభరణంబులును, గంధమాల్యదుకూలాదులు, నుపాయనంబులు ఘటించి, గాండీవికిఁ దగిన కట్నంబులు బంగరుపెట్టియల జతనంబు సేయించి, మృతసంజీవనమణియు, నమృతకుంభంబునుం గొనుచుఁ దక్షకకర్కోటకాదులు గొలువుఁ బాతాళగహ్వరంబు వెలువడి, బభ్రువాహనుని సంధించికొని యతనితోడఁగూడ మణిపురంబునకు వచ్చె.
{{p|ac|fwb}}నాగకుమారు లర్జునుతల నపహరించుట</p>
అప్పుడు శేషుండు సభలోఁ ద న్నవమానించుటవలన ధృతరాష్ట్రుండు దుఃఖితుండై, గృహంబునకుం జని, దుర్బుద్ధి దుస్స్వభావులను నామధేయంబులు గల కుమారులం బిలిచి, బభ్రువాహనునిచే నైన పరాభవంబు దెలిపి, 'నేను ధృతరాష్ట్ర నామధేయుండఁ గావునఁ బాండవులకు మనకు మొదలనుండి యెడతెగని<noinclude><references/></noinclude>
63mv4jqqncw4m7m68t07nipypgegwjb
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/177
104
186440
554380
504666
2026-04-25T04:27:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వైరులు మీ రెఱింగినదియే కదా! ఇప్పు డాఖండలసుతుండు బ్రతుకకుండు నుపాయంబు చింతింపుండ'నుటయు, వారలు తండ్రి నవలోకించి, 'శిరంబు దాచితిమేని, కిరీటిం బ్రతికింప సంజీవనమణియు శేషుండునుం గాదు, శ్రీకృష్ణుం డేనియుఁ జాలండు, అంతట నయ్యశ్వం బెవ్వండేనియు హరించు. ధర్మనందనుండు యజ్ఞవిహీనుండై చెడు. అంతట నీపగ దీఱు. కావున నర్జునుశిరంబు మే మపహరింతుము. నీవు మనంబునఁ గుందవలవ' దనిన, ధృతరాష్ట్రుండు సంతుష్టాంతరంగుండై, 'యిత్తెఱంగు సేయుండ'ని పుత్రులం బనిచి, తా నెఱుంగనియట్ల శేషాహివెంబడిం జనియె. ఆక్షణంబ ధృతరాష్ట్రుని కొడుకులు మాయారూపంబుల
వచ్చి, విజయుని శిరంబు నపహరించుకొని, గరుడసంచారవర్జితంబైన బకదాల్భ్యవనంబున దాఁచిరి. అప్పు డులూచియు, జిత్రాంగదయు గాండీవిమస్తకంబు గానక నలుదిక్కులు బరికించి, వదనోదరంబులు మోఁదికొనుచు వసుధాతలంబునం బొరలాడుటయు, సక్కోలాహలం బాలకించి బభ్రువాహనుం డరుదెంచి, యర్జునుశిరంబు గానక మూర్ఛాక్రాంతుఁడై పుడమిం బడియె, ఆరాత్రి కరినగరంబునఁ గుంతీదేవి దుస్వప్నంబుం గని, దిగ్గన లేచి, దిగులు సెంది, కన్నుల బాష్పకణంబు లొలుక, వెన్నుండును యుధిష్ఠిరుం డున్నయెడకుం జనుదెంచి, గద్గదకంఠంబుతోఁ, 'గంసమర్థనా, నేడు నా కలలోన నీ మఱందియగు నర్జునుండు నూనియ మేన నలందికొని తైలకూపంబున మునింగినట్లును, గోమయంబు శరీరంబునం బూసికొని, రక్తమాల్యంబులు ధరియించి, యొంటె నెక్కి దక్షిణాభిముఖుండై పోవునట్లుగాఁ గలఁగంటి. నా స్వప్నంబు దప్పదు. కిరీటికిఁ గీడు వచ్చుట నిజంబు. అంతరంగంబు గలుగుచున్నయది. నీవు దయసేయుట కిది సమయం'బని రోదనంబు సేయుటయు, నాపద్బాంధవుండైన యచ్యుతుండు
వెఱవకుమని యూరడించె.
{{p|ac|fwb}}శ్రీకృష్ణుండు మొదలగువా రర్జునునిదగ్గఱకు వచ్చుట</p>
అప్పుడు స్మరణమాత్రసన్నిహితుండైన పక్షిరాజుమీదఁ గుంతీయశోదా దేవకీ భీమసేనులతోడంగూడ నధిరోహించి, ముహూర్తమాత్రంబున మణిపురంబునకుం జని యచ్చట ఖండితంబులైన వేదండశరీరంబులును, ఛిన్నఛిన్నంబులైన తురంగదేహంబులును, జెక్కచెక్కలైన యరదంబులును, జల్లెడక్రంతలు పడి దొర్లిన సుభటకాయంబులును, జూర్ణంబులైన భూషణంబు<noinclude><references/></noinclude>
33jp5oie4h18rcsfvt2mbakiwp9g11n
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/178
104
186441
554381
504667
2026-04-25T04:39:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554381
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లును, నురుములైన గదాఖడ్గముసలాద్యాయుధంబులును, భిన్నంబులైన యాతపత్రంబులును, శీర్ణంబులైన కేతనంబులుసు, నిధనంబు నొందిన మహారథికులును గలిగి దుర్నిరీక్ష్యంబైన యుద్ధరంగంబునఁ బక్షికులపుంగవునిం దిగి పద్మాక్షుండును, భీమసేనుండును, గుంతియు, దేవకీ యశోదలును, నిరుత్సాహంబుగా నరిగి శిరోవిరహితంబైన గాండీవికాయంబు గనుంగొని, రోదనధ్వనులు రోదసీకుహరంబునం బర్వ మూర్ఛల మునుంగుచు నుండునంతఁ, గుంతి నిధనంబు నొందిన ధనంజయుం గనుంగొని, వదనంబు కరపల్లవంబుల మోదికొనుచు, గన్నులనీరు చెక్కుల జాఱి వెల్లువలు వాఱ, నపారశోకసాగరంబున మునింగి, చెన్ను దొఱంగ, డెందంబు కరంగి, మూర్ఛ నణంగి, యొక్కింతసేపునకుఁ దెలిసి (యిట్లని విలపించదొడంగె):
{{p|ac|fwb}}కుంతి యర్జునుని మరణంబునకు విలపించుట</p>
'హా సుకుమారా హా వరగుణాధారా హా విద్యావినయవిహారా, హా కులకలశపారావారకుముదబాంధవా, నోమరాని నోమిలు నోమి, చేయరాని పంతంబులు సేసి, యుండరాని యువవాసంబు లుండి, యనేకదానంబు లొనర్చి, నిన్నుఁ గాంచి, నాటఁ బెంచువానిఁ బూటఁ బెంచి, దాదిఱొమ్మున దూదిపాన్పున నుంచి, యభివృద్ధి నొందించి, కడపట బభ్రువాహనుని యస్త్రాగ్నిపాలు సేయవలసెనే! నీ భుజాబలంబు మంటంగలసెనే! ఎండకన్ను నీడక న్నెఱుంగనట్టి పుట్టుభోగికి నిట్టివేతలు గంగాశాపంబునఁ బుట్టెనా? ధూళిధూసరితగాత్రుండవై శిరంబు లేక చేష్టలు దక్కి ధరాతలంబునఁ బడియున్న నిన్నుఁ జూచి కడుపు దహించుకొనియె. అన్నా, నన్ను గన్న కన్నా, నిన్నుఁ గన్నది మొదలుగా నడవులం
దిరిగియు, నిడుమలం బడియు, వెతలఁ జెందితినే కాని, సుఖంబున నుండనోచనైతిని.
నా ముద్దులకొడుకా, యెటు లోర్తురా! నీవంటి న్యాయానువర్తికి, నీవంటి ధర్మమూర్తికి, నీరీతి ధాత వ్రాయఁదగునే? నన్నుఁ గన్న తండ్రీ, యరవిందదళంబులం బోలు కన్నులు, నరుణబింబాధరంబు, నంకురితదరహాసంబునైన నీ ముఖంబుఁ గనుఁగొనకయున్నను, జక్కెరపానకంబుల బోలు నీ చక్కనిపల్కులు వీనులవిందుగా వినకయున్నను, నిమిషమాత్రంబేనియుఁ బ్రాణంబు నిలువజాలదురా! ఈశోకసాగరం బెటువలె నీదుదురా! ఎన్నివిధంబులఁ బిలిచినఁ బలుక వేమిరా! దేవదేవుండైన<noinclude><references/></noinclude>
1cfb3c41kj2me70n3sdthly9atv7uai
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/179
104
186442
554385
504668
2026-04-25T05:11:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554385
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శ్రీకృష్ణుండు ప్రాపైయుండ నీ కితరభయంబు లేదని యెంచి, కన్నులపండువుగా నుండు నీ మేను గందుఁ గదయ్యా! భానుకిరణంబుల నీ మేను గందు గదయ్యా! అంత నిన్నేలాగున మఱతు? నా కెవ్వరు దిక్కు? న న్నెవ్వ రాదరించువారు? కమ్మనిమాటల నెమ్మి మీఱ 'నమ్మా' యని న న్నెవ్వరు పిలుచువారు? తనయా, సద్గుణసంజాతనయా, దైవంబు తన మనంబునకు నిన్ను బరువుగా నెన్నెనో! చతుస్సముద్రముద్రితమహీపతుల యతులమణికిరీటంబులఁ దాపిన పద్మరాగంబుల డంబుల కెంపుసొంపుసంపదలం బొదలు పదంబు గలిగిన మహారాజవైన నీకుం బండియుండుటకుఁ జేరెడుపఱపు లేదయ్యెనే! అయ్యయ్యో నందనా, హరిచరణారవిందనందనా,' యని తన యునికి నీ పాటు వచ్చెఁ దనయునికి నిఁక నేమిటికని, దైవమా యనుచు, దైవమాయను దెలియ వశమా యనుచు, వగచి వగచి పేరెలుంగునఁ గుమారునిం బిలిచి పిలిచి, యడలుచుండు సమయంబున, శ్రీకాంతుండు కౌంతేయుని చెంగటికిం జని 'ధనంజయా, కుంతియు, యశోదయు, దేవకియు, నిన్నుం గానని దుఃఖంబునఁ బొగులుచునుండ నివ్విధంబున రాక యుందువే? ఎందుఁ బోయితివి? ప్రాణసఖుండ నైన నన్నుం గన్నులు దెఱచి చూడవదేమి?' అని పలవించు శ్రీకృష్ణునిం జూచి, భీమసేనుం డిట్లనియె: 'దేవా, నీవు రమ్మని పిలుచుటంజేసి విజయుం డవశ్యంబును బ్రతుకును. మీ చరణావిందంబులు నమ్మినవారల కావంత యేనియు వంతరాదు.' అని పలుకుచున్నంత సూర్యోదయం బగుటయు, బభ్రువాహనుండు తల్లులుఁ దానును మూర్ఛ దెలిసి, కదనంబునం జిక్కిన ప్రద్యుమ్నునిచే శ్రీకృష్ణుని, భీమసేనుని, దేవకీ యశోదా కుంతీదేవులను నెఱింగి, భయభక్తివినయసంభ్రమంబులతో, శ్రీకృష్ణునకు మ్రొక్కి, భీమసేనునకు వందనంబు సేసి, కుంతీ దేవకీ యశోదలకుం బ్రణమిల్లి కృతాంజలియై యుండె. అప్పుడు పన్నగాధీశ్వరుండు పద్మనాభుని సన్నిధిం జేరి యిట్లనియె:
{{p|ac|fwb}}శ్రీకృష్ణుం డర్జునుని బ్రదికించుట</p>
'దేవా, సంజీవరత్నంబు వచ్చియున్నయది. మీ చెలికాని శిరంబు నపహరించిన నీచమతులం బట్టి తొల్లి రాహుకేతువులం దునిమినమాడ్కి దెగటార్పుము. ధర్మజుకులంబు నిలుపుము. ఇంతటికి హేతు వర్జునుని బ్రతికించుట. శిరంబు లేక బ్రతికింపఁగూడదు గావున, దేవర దివ్యదృష్టిచే నరుని<noinclude><references/></noinclude>
474n5rxw42xf5sa2rfh6fo3uh3nbpy6
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/180
104
186443
554386
504669
2026-04-25T05:27:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554386
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శిరంబున్న ఠా వెఱింగి రప్పింపు'మనుటయు, బ్రహ్మమయుండైన పురుషోత్తముండు, ప్రతిన సేయ దలంచి, 'నేను ద్రిలోకవిఖ్యాతంబైన నైష్ఠికబ్రహ్మచర్యవ్రతంబునం బెంపొందినవాఁడ నైతినేని, సత్యంబు దప్పనివాఁడ నైతినేని, నరుని శిరంబు వచ్చుఁగాక! తచ్చోరకుల శిరంబులు వ్రయ్యలగుంగాక!' అని పలికిన యాక్షణంబ వాసవసుతునిశిరంబు వచ్చె. ధృతరాష్ట్ర సూనుల శిరంబులు శతశకలంబు లయ్యె. అంతఁ గిరీటి వృషకేతనుల శిరంబుల శరీరంబులతోడం గూర్చి సంజీవరత్నం బురంబున నునుచుటయు, నయస్కాంతసంయోగంబున లోహంబునుం బలె వారల తలలు నట్టలు నేకంబులై తోడన ప్రాణంబులు వచ్చె.
తదనంతరంబ సంజీవనరత్నవైభవంబున వృషకేతుండు లేచి, శ్రీహరిం గీర్తించుచు, సమీపస్థితుండైన వైరి నదలించుటయు, ముకుందుండు ముదంబునం గౌఁగిలించె. అర్జునుండు నట్లే లేచుటయు, నెండఁ గొట్టుపడిన సస్యంబులు వానచేతం దేఱిన చందంబునఁ బాండవసైన్యంబులు కిరీటి నవలోకించి హర్షంబు నొందె, అయ్యవసరంబున భేర్యాదిరవంబులును, వందిజనస్తోత్రంబులును, బృందారకుల పువ్వుల వానలు, దివ్యదుందుభి ధ్వానంబులును జెలంగె.
{{p|ac|fwb}}శ్రీకృష్ణాదులు మణిపురంబున కేగుట</p>
కుంతీదేవియుఁ బునర్జన్మంబు నొందిన పుత్రునిం గనుంగొని కౌఁగిలించె. అంతఁ బ్రద్యుమ్నుండు దర్లింపఁ జతురంగబలంబులు నేల యీనినతెఱంగునఁ బట్టణంబు సేరంజనునెడఁ, బద్మనాథుండును, ఫల్గుణుండును రాజమార్గంబునం జనుదెంచునెడ, నన్నగరనారీశిరోమణులు నివాళించి చల్లు దివ్యమణులం జూచి, కుబేరుండు సైతంబు శిరఃకంపంబు సేయుచు నచ్చెరువొందె. అట్లు రమణీయంబైన మణిపురంబున బభ్రువాహనుని మందిరంబునకుం జని, దివ్యరత్నప్రభాస్థానంబున మేరుశిఖరోపమానంబులైన సింహాసనంబుల శ్రీకృష్ణుండును, గాండీవియుఁ గూర్చున్న యవసరంబున, హంసధ్వజాది మహీపాలకులు నుచితపీఠంబులం గూర్చుండిరి. అప్పుడు తలవంచుకొనియున్న నరునిం జూచి శేషాహి యిట్లనియె: 'అర్జునా, జయపరాజయంబు లనిత్యంబులు. అందులకై వగవం బనిలేదు. విశేషించియు క్షత్రియులకు సర్వత్ర జయంబు గలిగినను బుత్రుని<noinclude><references/></noinclude>
dxjmbvkjnwwh19ru6eo0u6b0npbz7c1
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/181
104
186444
554387
504670
2026-04-25T05:37:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554387
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చేతఁ పరాజయంబు నొందుట మోదావహంబు గాని, ఖేదావహంబు గాదు. నీకూర్మిపట్టియైన బభ్రువాహనుని క్షాత్రంబు గని మెచ్చక యిటువలె లజ్జించుట యుక్తంబు గాదు. అదియునుంగాక, నీకు గంగాభవానిశాపనిమిత్తంబుగ నిట్టియాపద సంభవించె. చిత్తంబున నుత్తలంబు నొందక ముకుందచరణారవిందభక్తివైభవసంపాదితంబైన భవదీయనందనుని రాజ్యభోగంబు లనుభవింపుము. నీ కళత్రంబులైన చిత్రాంగదయు నులూచియు డెందంబుల నానందంబు నొందునట్లుగా నూఱడింపుము. ని న్నెదిరించుట వలన లజ్జితుండైన కుమారునిం గౌఁగిలించుకొని యాదరింపుము.' అని పలికి యహివల్లభుఁ డంబుజనాభుని గనుంగొని 'దేవా, కవ్వడిమనంబునందలి నొవ్వు దీఱ బోధించి దేవకీయశోదలుఁ గుంతియుఁ జిత్రాంగదయు, నులూచియు మొదలగువారల మనంబులకు హర్షంబులు గలుగం జేసి భవదీయచరణారవిందసేవానిరతుండును, బితృభక్తుండును, భ్రాతృవత్సలుండును, మానధనుండును, యశోనిధియు నైన బభ్రువాహనుండు జనకునిం జంపిన పాతకంబునకుఁ బ్రాయశ్చిత్తంబుగా హిమవంతంబున కరిగి తనశరీరంబు పరిత్యజింపఁదలచి యున్నవాఁడు గావునఁ దగుతెఱంగునం దెలియఁ బలుకవలయు ననినయెడ, వడముడి బభ్రువాహనుం జూచి, 'కుమారకా, యూచార్యునిం బితామహుఁ దోబుట్టువుల వధించియు నచ్యుతునికటాక్షంబు వలనఁ గలుషంబు లందక మేము సుఖంబున నున్నవారము. నీ వేటికి వెఱచెదవు? మీ తండ్రియుం బ్రదికె. నీవు క్షత్రధర్మంబు చెల్లించుకొంటివి. నాల్గుయుగంబుల నేదేవుని నామస్మరణంబు గావించినమాత్రంబునఁ బాపంబులు రూపణంగు, నద్దేవుండైన యీ దేవకీనందనుని నమ్మియున్న మనకు శోకంబును, బాపభయంబును, దైన్యంబును బొందఁ బనిలేదు' అని బహువిధంబులం
దెలియంబలుకు భీమసేనునివాక్యంబులు విని చిత్రాంగదానందనుండు విషాదంబు మాని, ప్రసన్నముఖుం డగుటయు, రాజాధిరాజులందఱు నతని గుణంబులు నానావిధంబుల నుతియించిరి. అంత మురాంతకుండు, కౌంతేయమధ్యముండును, భీమసేనాదులతోడం గూడ నపరిమితంబులైన భోగంబు లనుభవించుచు, సంగీతసాహిత్యనాట్యప్రముఖవిద్యావినోదంబులం బ్రొద్దు గడపుచు, మణిపురంబున నయిదుదినంబులు వసియించిరి. ఆ సమయంబునఁ
గృష్ణుండు పురందరనందనునిం జూచి, 'నీ నందనుని మందిరంబున నయిదుదినంబు లుంటిమి, అఖిలశ్రమంబులు దీఱె. మన తల్లులను, గోడండ్రను, ధన<noinclude><references/></noinclude>
56u7o4ulr59zeadpthuhe99a77dn55r
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/182
104
186445
554393
504671
2026-04-25T06:18:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554393
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కనకవస్తువాహనసమూహంబులను, భీమసేనుని వెంబడిం గూర్చి యజాతశత్రునికడకుం బంపుదము, వీరలు ధర్మజుచే యజ్ఞం బుపక్రమింపం జేసి, తద్విధానంబు నడిపించెదరు. ఇంకమీఁద నింతకంటె బలవంతులైన రాజులు పెక్కండ్రు గలరు. కావున హయరక్షణంబునకు ని న్నొంటిగా నంపంజాలను. నేనుఁ గూడ వచ్చెద' నని పలికి, దేవకి మొదలైన సతీనివహంబులను, ధనరాసులం గూర్చి భీమసేనుని వెంబడి హస్తిపురంబునకుం బనిచె. అనంతుండు చిత్రాంగదాకుమారునిచే బహుమానంబు గాంచి, కృష్ణార్జునుల వీడ్కొని పాతాళంబునకుం జనియె.
{{p|ac|fwb}}తామ్రధ్వజుండు పాండవాశ్వంబును బట్టించుట</p>
తదనంతరంబ గోవిందుని యనుమతిచేఁ దరలింపంబడిన యధ్వరాశ్వంబు నానాజనపదంబులు గడచి, క్రమంబున మయూరధ్వజుండను వసుంధరావరునిచేఁ బరిపాలితంబైన రత్నపురంబు సేరంబోవు నవసరంబున, నా మయూరధ్వజుండు తాను నశ్వమేధంబు సేయ సంకల్పించి పుత్రుండైన తామ్రధ్వజుని దురఁగరక్షణంబునకుం బంపిన, దైవయోగంబున నా రెండుగుఱ్ఱంబులు నొండొంటి నెదుర్కొని, కయ్యంబునకుఁ గడింగి, భీషణంబులైన హేషారవంబులు సేయుచు, మోము మోమునం జేర్చి, పూర్వఖురాగ్రంబుల భూతలంబులు ద్రవ్వి, దుమ్ము లెగయించుచు, నొకటొకటిం జుట్టుకొని కందంబులం గబళించి విదళించునెడ, మయూరధ్వజుని హయంబు లోఁబడుటయుఁ, బాండవహయంబు పైకొని దంతంబులం గబళించి, ............గడంగుటయుఁ, దామ్రధ్వజుండు క్రోధతామ్రాక్షుండై, నకులధ్వజ నామకుండైన సేనానాయకుఁ జూచి, 'యీ హయం బెవరిది? విచారింపు' మనిన, నతండు సత్వరంబుగా నా ఘోటకంబు దాటకుండఁ జతురంగంబులఁ జుట్టు నిలిపి వేడెంబులు వెట్టు నా వాజిం బట్టుకొని, చుంచువు బిగియం బట్టి, నుదుట నున్న హేమపట్టికఁ గలయం జూచి, చదివి, యవ్విధంబు తామ్రధ్వజునితో విన్నవించుటయు, నతండు నవ్వుచు, 'మన దొరయగు మయూరధ్వజుం డేడశ్వమేధంబులు సేసె. ఇంక నెనిమిదవయాగంబు సేయుంగాక' యని యత్తురంగంబుఁ బట్టి కట్టించి, నకులధ్వజునిం జూచి, 'సేనాగ్రణీ, పాండవసైన్యంబున వృషకేతుండును, గాండీవియు దక్కఁ జేవగల మగలు లేరని నిన్న నారదుండు<noinclude><references/></noinclude>
d1l0w28tywtlavpjabe6n1badqdwb6h
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/183
104
186446
554394
504672
2026-04-25T06:27:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554394
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పలికె. నేఁటికి నరనారాయణులతో సమరంబు మనకు దొరకె' అనిన విని దళవాయి యతనిం జూచి, 'పాండవసైన్యంబున బభ్రువాహనుఁ డొక్కరుండు శూరుం డంటిమేని వాఁడును దేవర నాటకశాల వధూటులకుఁ బుష్పాంజలులు సేయందగు ముత్తియంబు లొసంగువాఁడు. తక్కినవార లెవ్వ రున్నారని' వీరాలాపంబులు పలుకుచు, సైన్యంబు నర్ధచంద్రవ్యూహంబుగాఁ బన్నించి తానునుం గట్టాయితంబై విక్రమాటోపవిజృంభితుండైన తామ్రధ్వజుని ముంగల నిలుచుటయు, నారాయణుండు నరునిం జూచి, 'మహాయోధవీరులకు మరణకారణంబైన రణంబు నేటికిఁ బ్రాపించె, ఎదుటివారలు కాలాంతకరుద్రులకు సమానులు గాని సామాన్యులు గారు' అని పలికి ప్రద్యుమ్నునిం జూచి, 'మనబలంబులనెల్ల గృధ్రవ్యూహంబుగాఁ బన్నింపు' మని నియమించి, దారకుండు తెచ్చిన తనయరదంబు నెక్కి, దిక్కులు పిక్కటిల్లం బాంచజన్యంబు పూరించె. అమ్మహావ్యూహంబున ననుసాళ్వుండు కంఠంబును, హంసధ్వజుండు వక్షంబును, ప్రద్యుమ్నానిరుద్ధులు పక్షంబులును, సాత్యకికృతవర్మలు చరణంబులును, బభ్రువాహనుండును, సత్యభామా తనయులగు చిత్రభాను చారుచిత్రులు ముఖంబును, జుంచువులును, నపరిమితసేనాసమేతుండైన గాండీవి యుదరంబును, నతని నలుగెలంకులఁ బుండరీకాక్షుండును, వృషకేతనుండును, యౌవనాశ్వుండును, మేఘవర్ణుండునుంగా నభేద్యంబైన వ్యూహంబు బన్ని యెదిర్చినం గనుంగొని తామ్రధ్వజుండు గరుడధ్వజునిం జూచి, 'నారాయణా, నీవు శూరుండును బౌరుషవంతుండునుం బలె శంఖచక్రగదాద్యాయుధంబులు పూని న న్నెదిర్చితివి. నా హయంబుఁ బట్టింపవలవదె?' అని పలికి యలుకవలనం గన్నుల విస్ఫులింగంబులు దొలుక నిజరథంబు సేరందెచ్చె.
{{p|ac|fwb}}ప్రద్యుమ్నాదివీరులు తామ్రధ్వజునితోఁ బోరాడుట</p>
తదనంతరంబు తామ్రకేతుండు గాండీవి మొగ్గరంబు డగ్గఱి, యర్ధచంద్రబాణంబు లనేకంబులుగాఁ బ్రయోగించి, రక్తమాంసంబులు నలుదిక్కుల వెదజల్లి, కార్ముకజ్ఞ్యానాదం బనియెడు మంత్రంబుచే శాకినీ ఢాకినీ ప్రముఖంబు లైన భూతగణంబులఁ బిలిపించి, రణధరామండలంబు మెండుకొనం జేసి, యేడు వాడిబాణంబుల వాసుదేవువక్షంబు వ్రక్కలించి, యేనింట సూతుని స్రుక్కడంచి, నాల్గునారసంబుల సైన్యసుగ్రీవమేఘపుష్పవలాహకంబుం<noinclude><references/></noinclude>
5u5x5bazexs7155rxpamt042mv0whgs
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/184
104
186447
554396
504673
2026-04-25T06:37:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554396
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గ్రుచ్చి, యర్జును డెబ్బదిబాణంబులు, సాత్యకిఁ దొంబదిశరంబులఁ, గృతవర్మ నెనిమిదిసాయకంబులఁ, బ్రద్యుమ్నుని వేయిమార్గణంబుల, ననిరుద్ధుని లక్షవిశిఖంబుల ముంచి, వెండియుం దనివోక, హంసధ్వజ యౌవనాశ్వప్రముఖు లైన మహీపతుల నుక్కణంచి, పట్టపగలింటి సూర్యునిపగిది బ్రతాపించి, సింహనాదంబు గావించుటయుఁ, దనమీఁదం గురిసిన బాణవర్షంబు నివారించి, యనిరుద్ధుండు మహోద్ధతుఁడై, యనేకసహస్రసంఖ్యంబులైన యాశుగంబులు గురియించి, యెదిరించిన వీరుల మదం బణంచుచుఁ, బ్రచండకాలానలజ్వాలాభీలంబులైన యమ్ము లొక్కుమ్మడిం గుమ్మరించుచు, నలుదిక్కుల నెత్తురుటేరులు పారించి, మూఁడక్షౌహిణులు సమయింపం జేసి, శింజినీనాదంబును, సింహనాదంబును జెలంగఁ, బగతునిఁ జూచి, 'ఏమిరా, యింకమీదనైనఁ దురంగంబు విడవవేని, బంటుతనంబున గెంటక నాయెదుట నొంటికయ్యంబునకు నిలువు' మనినఁ, దామ్రధ్వజుండు తామ్రాధరంబున నించుక చిఱునగ వంకురింపఁ, 'బువ్వులవిలుకానికొడుకవు గదా! అనిరుద్ధా, నిన్నుఁ దొల్లి బాణుండు నిరుద్ధుం చేసినప్పు డుషాకన్య మంగళసూత్రవైభవంబునఁ దలదప్పె. నేఁటి కింక నిన్ను బోనిచ్చువాఁడం గాను.' అనిన, యనిరుద్ధుండు మహోద్ధతి మెఱయ బడబానలశిఖాసఖంబులైన విశిఖంబు లడరించి, వక్షస్స్థలంబు వ్రక్కలించి, యొక్కనెలవంకబాణంబున సూతుని తల డులిచి, తేరితురంగంబుల నాల్గింటం గూల్చి యార్చిన, సుచిత్రనామకుండైన యా తామ్రధ్వజుండు కత్తియుఁ గేడెంబునుం బూని, తేరు డిగ్గ నుఱికినఁ, బ్రద్యుమ్నకుమారుండును, గరవాలంబును బలకయుం బూని భూమికి దిగిన, నయ్యిరువురు సింగంపుకొదమలతెఱంగునం గెరలి, ఖడ్గాఖడ్గిం బోరాడుచు గ్రమ్ముచు గ్రుమ్ముచు, లోవెలిం జిమ్ముచుఁ, గృపాణంబులఁ డోకించుచు, నొండొరులం జౌకించుచు, మర్మంబు లదరంట వ్రేయుచుఁ, జండించి వెనుకకుం బాయుచు, బిసబిస లెసంగ నసిలతల విసరుచు, 'మేలు! బళీ! యేడి మాయన్న!' యని కొసరుచుఁ, గత్తెర యడులగతిం జిత్తరపాతరలవలె నటించుచుఁ, గేడంబు లడ్డంబుగా ఘటించుచుఁ, బేరెంబులు వాఱుచు, వీరంబు మీఱు నెఱ్ఱమంటిగట్టునఁ గోరాడిన మదపుటేనుగులచందంబున నెత్తుటం జొత్తిల్లిన గాత్రంబులం గనుపట్టుచు, నొండొరుల వ్రేటులచే ఖేటకకృపాణంబులు తునుక లగుటయు బిఱుతివియని బంటుఁదనంబున బాహుయుద్ధంబునకుం జొచ్చి, యాజగజెట్లు దగదొట్టక ముష్టీముష్టి, బాహా<noinclude><references/></noinclude>
tbjlyub97fmnlust8m30t4uf9m56ss3
554397
554396
2026-04-25T06:38:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554397
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గ్రుచ్చి, యర్జును డెబ్బదిబాణంబులు, సాత్యకిఁ దొంబదిశరంబులఁ, గృతవర్మ నెనిమిదిసాయకంబులఁ, బ్రద్యుమ్నుని వేయిమార్గణంబుల, ననిరుద్ధుని లక్షవిశిఖంబుల ముంచి, వెండియుం దనివోక, హంసధ్వజ యౌవనాశ్వప్రముఖు లైన మహీపతుల నుక్కణంచి, పట్టపగలింటి సూర్యునిపగిది బ్రతాపించి, సింహనాదంబు గావించుటయుఁ, దనమీఁదం గురిసిన బాణవర్షంబు నివారించి, యనిరుద్ధుండు మహోద్ధతుండై, యనేకసహస్రసంఖ్యంబులైన యాశుగంబులు గురియించి, యెదిరించిన వీరుల మదం బణంచుచుఁ, బ్రచండకాలానలజ్వాలాభీలంబులైన యమ్ము లొక్కుమ్మడిం గుమ్మరించుచు, నలుదిక్కుల నెత్తురుటేరులు పారించి, మూఁడక్షౌహిణులు సమయింపం జేసి, శింజినీనాదంబును, సింహనాదంబును జెలంగఁ, బగతునిఁ జూచి, 'ఏమిరా, యింకమీదనైనఁ దురంగంబు విడవవేని, బంటుతనంబున గెంటక నాయెదుట నొంటికయ్యంబునకు నిలువు' మనినఁ, దామ్రధ్వజుండు తామ్రాధరంబున నించుక చిఱునగ వంకురింపఁ, 'బువ్వులవిలుకానికొడుకవు గదా! అనిరుద్ధా, నిన్నుఁ దొల్లి బాణుండు నిరుద్ధుం చేసినప్పు డుషాకన్య మంగళసూత్రవైభవంబునఁ దలదప్పె. నేఁటి కింక నిన్ను బోనిచ్చువాఁడం గాను.' అనిన, యనిరుద్ధుండు మహోద్ధతి మెఱయ బడబానలశిఖాసఖంబులైన విశిఖంబు లడరించి, వక్షస్స్థలంబు వ్రక్కలించి, యొక్కనెలవంకబాణంబున సూతుని తల డులిచి, తేరితురంగంబుల నాల్గింటం గూల్చి యార్చిన, సుచిత్రనామకుండైన యా తామ్రధ్వజుండు కత్తియుఁ గేడెంబునుం బూని, తేరు డిగ్గ నుఱికినఁ, బ్రద్యుమ్నకుమారుండును, గరవాలంబును బలకయుం బూని భూమికి దిగిన, నయ్యిరువురు సింగంపుకొదమలతెఱంగునం గెరలి, ఖడ్గాఖడ్గిం బోరాడుచు గ్రమ్ముచు గ్రుమ్ముచు, లోవెలిం జిమ్ముచుఁ, గృపాణంబులఁ డోకించుచు, నొండొరులం జౌకించుచు, మర్మంబు లదరంట వ్రేయుచుఁ, జండించి వెనుకకుం బాయుచు, బిసబిస లెసంగ నసిలతల విసరుచు, 'మేలు! బళీ! యేడి మాయన్న!' యని కొసరుచుఁ, గత్తెర యడులగతిం జిత్తరపాతరలవలె నటించుచుఁ, గేడంబు లడ్డంబుగా ఘటించుచుఁ, బేరెంబులు వాఱుచు, వీరంబు మీఱు నెఱ్ఱమంటిగట్టునఁ గోరాడిన మదపుటేనుగులచందంబున నెత్తుటం జొత్తిల్లిన గాత్రంబులం గనుపట్టుచు, నొండొరుల వ్రేటులచే ఖేటకకృపాణంబులు తునుక లగుటయు బిఱుతివియని బంటుఁదనంబున బాహుయుద్ధంబునకుం జొచ్చి, యాజగజెట్లు దగదొట్టక ముష్టీముష్టి, బాహా<noinclude><references/></noinclude>
ojzhsd37nrip5ubynj4xow2ambgof7z
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/185
104
186448
554398
504674
2026-04-25T06:52:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554398
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బాహిఁ, గచాకచిం గడంగి, పెద్దయుం బొద్దు పోరాడినయెడ, ననిరుద్ధుండు దగ నిలువం జాలక జగతీతలంబునం బడి మూర్ఛ నొందుటయు, సుచిత్రుండు గగనంబు పగుల నార్చుచు, వేఱొక్కయరదం బెక్కి ప్రద్యుమ్నునురంబు నైదుశరంబులఁ గరంబు నొప్పించుటయుఁ, గర్ణనందనుండు సుచిత్రుని గాత్రంబున నాఱుశరంబులు గ్రుచ్చి విరథునిం జేయ, నతండు వేఱొక్కరథం బెక్కి విలుగుణధ్వని సేయ నయ్యరదంబునుం దునియె. ఇవ్విధంబున మున్నూఱు రథంబులు, ముహుర్తమాత్రంబులో శకలంబులు గావింప, వేఱొక్కతే రెక్కి నిశితవిశిఖంబులు కర్ణపుత్రునిపయిం బ్రయోగించిన, రోగంబు తనువునం బుట్టినమాడ్కి దుర్దశం జెందె. ఆ వృషకేతనుని పాటు గనుంగొని, యనుసాళ్వుం డెదిరించుటయు, నతని నైదింటను యౌవనాశ్వు నొక్కయుక్కుటమ్మునఁ, గృతవర్ముని రెండుకాండంబుల స్రుక్కించుటయు, సాత్యకి మార్కొని యారాజు తేరివాజులం దునిమి, శంఖంబు పూరించిన, నా నాదం బాఱకమున్న తామ్రధ్వజుండు క్రూరనారాచపరంపరలచే సాత్యకివక్షంబు విక్షోభంబు సేసిన, మూర్ఛాపరవశుండై శైనేయుండు లోచనంబులు మోడ్చి, యరదంబుమీఁద వ్రాలినఁ, జిత్రాంగదాకుమారుండు వజ్రోపమానంబులైన వాఁడిబాణంబు లైదు వాని యురంబున నాటించుటయుఁ, దామ్రకేతుండు చిఱునవ్వు మొగంబు నలంకరింప 'బభ్రువాహనా, మాకు నెప్పు డప్పనంబుగా నీయందగిన ముత్తియంబులు పెఱికలం బట్టి తెప్పించితే?' అని పలుకుచు, కల్పాగ్నికీలాసఖంబులైన విశిఖంబుల వాన గురిసి విముఖునిం జేసి, యంత విలువక మహోగ్రబాణంబులచే మరాళకేతనునిఁ బూజితునిం జేసి, ప్రళయకాలతాండవోద్దండఖండపరశుండునుం బలెఁ బాండవసైన్యంబు ఖండించుచు నుండె.
ఇవ్విధంబున వైరిసేనాధూమకేతుండైన తామ్రకేతుని భుజావిజృంభణంబు గనుంగొని, పాండవసైన్యంబులు దైన్యంబు నొంది, చచ్చియు, నొచ్చియు, విచ్చియుఁ జెల్లాచెదరుగాఁ బఱచునెడఁ, దురంగమాతంగవీరభటాంగంబులం దొరఁగు రక్తంబను జలంబును, గేశంబులను నాఁచుతీవియలు, బాణకృపాణకుంతతోమరంబు లనియెడు మీసంబులును, ధవళాతపత్రంబు లనియెడు నురుగులును, యోధవీరుల ముఖంబు లనియెడు పద్మంబులును, ఖండింపఁబడిన
వేదండతండంబు లనియెడు గట్లును, ధ్వజంబు లనియెడు వేతసకుంజంబులును, రథంబు లనియెడు నోడలునుం గలిగి రక్తనదీప్రవాహంబు ప్రవహించె.<noinclude><references/></noinclude>
99nzqrvc31yqz55s7tzacbv05pwdnbw
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/186
104
186449
554399
504675
2026-04-25T07:22:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554399
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అప్పుడు, కిరీటి చెంగటి వీరులు వాలంపగములం బొందునంబడి యేదు వెరిగిన చందంబునఁ జేయికాలు గదలింపం గూడని నాలంబునకుఁ జాలంబురికొనంజాలక, సవ్యసాచిం జూచి, 'బంధువధజనితంబగు పాతకంబు నివారింపగోరి, యశ్వమేధంబు సేయ సమకట్టి మమ్ముఁ దామ్రధ్వజుఁబారికి బోరి గొరియలం జేసితివి. ఇందున నీ కేమి ప్రయోజనంబు?' అని దూరినం గ్రీడి 'యోడకుండుఁడ'ని వారల నూఱడించి, తేరు వైరిసమ్ముఖంబు సేసి, మెఱుంగువాలంపగుంపులచేఁ దామ్రధ్వజుని కాయంబు గాయంబులు సేసి, విరథునిం గావించుటయు, నబ్బిరుదుమగండు వేఱొక్కయరదం బెక్కి, 'కవ్వడీ, యెక్కడఁ బోయెదవు? యాగసైంధవంబుతో నిన్నుఁగూడ బంధించికొని పోయెద' నని పలుకుచుఁ, గులశైలంబు వర్షధారలం గప్పు కాలమేఘంబుచందంబునఁ, గంకపత్రవిచిత్రంబులైన నిశితవిశిఖంబులం బరగించుటయు, వానివేగంబున నర్జును రథంబు యోజనమాత్రంబు వెనుకకుం జనిన, మగిడించి, యతివేగంబున వచ్చి, తనసేనలం బొలియించు తామ్రధ్వజుని పఱపి దేవదత్తంబు పూరించె. ఇవ్విధంబున నంతంతకు వంతున కెక్కు పంతంబులను, బిఱుతివియని చలంబులును, నగ్గలికలు మెఱయ నేడహోరాత్రంబులు చిత్రవిహారంబులం బోరిరి. ఆ సమయంబునఁ ద్రామధ్వజునితేరు తిలమాత్రశకలంబులుగా ఖండించి, గాండీవి వెండియు వాఁ డెక్కినరథంబులు రెండువేలు చూర్ణంబులుగాఁ జేసి, యక్షౌహిణీబలంబుఁ బరిమార్చె. తామ్రధ్వజునిచేఁ గౌంతేయుని బలంబును నట్ల నిధనంబు నొందె. అంత, మహాబలపరాక్రమధురీణుండైన తామ్రధ్వజుండు, మాంసఖండంబు రెమ్మికొనిపోవు సాళువంబు చందంబునం గిరీటితోడం గూడఁ దద్రథంబు నొక్కకరంబున నెత్తికొని యాకసంబునకు దాఁటి
భూతలంబునకుం ద్రిప్పివైచుటయు, వివ్వచ్చుండు చచ్చెఁ జచ్చెనని సైనికు లాహారవంబులు సేసిరి. అప్పు డప్పురుషోత్తముండు నిజకరాబ్జంబునం బడకుండఁ బట్టికొనుటయుఁ, దామ్రకేతుం డలుక దొలుక గదాధరునిం జూచి, యర్జునునితోఁ బోరునపుడు దొమ్మికిం దలపడితివి. ఇది వీరధర్మంబు గా దని పలుకుచు దంభోళిసన్నిభంబైన యొక్కశరంబు వింట సంధించి, యాకర్ణాంతంబుగాఁ దివియునంతలో, మురాంతకుఁడు వానిరథంబునకు దాటి తద్వక్షస్స్థలంబు దన్ని, తన చేతిగదాదండంబు ద్రిప్పి, వాని నడునెత్తిగాతు కలఁగఁగొట్టి లంఘించుటయు, నతండును జలింపక, నిజస్కందనంబు చిత్రగతుల నటింపం<noinclude><references/></noinclude>
hqhw6mbgf5cwr7pjds56xdmcia90rxm
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/187
104
186450
554404
504676
2026-04-25T08:06:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554404
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>జేయుచుఁ, జతురంగబలంబుల బారి సమరుటయు, ముకుందుండు నర్జునుం బేర్కొని, 'మన యోధయూధంబులు యథాయథలుగాఁ గలంగె. ప్రద్యుమ్నాది యోధవీరులు మూర్ఛదెప్పిఱం జాలక యున్నారు గావున, మన మిరువురము వీనితోడం దలపడి పోరవలయు' నని, శార్ఙ్గకోదండం బెక్కుపెట్టి, దిక్కులు గ్రక్కదల గుణధ్వని గావించుటయు, గాండీవియుఁ దన కోదండంబు నధిజ్యంబు గావించి మౌర్వీరావంబున భూనభో౽౦తరంబులు పూరించె. ఇవ్విధంబునం గృష్ణార్జును లిరుగెలంకులం బిడిగులంబోని బెడిదంపుటంపఱల పరంపర వాడుటయుఁ, దామ్రధ్వజుండు సరకుఁ గొనక యిరువుర చాపంబులు మౌర్వి నెడలం జేయుటయు, నింద్రనందనుఁ డుపేంద్రునిం జూచి, 'యీ యల్పునిమీఁద నీవాయుధం బెత్త నేమిటికి? ముహూర్తమాత్రంబున వీనిం బరిమార్చెద. నీవు నాకు సారథివై యుండినం జాలు,' ననిన, వనజనాథుఁ డియ్యకొని యుగ్యంబుల పగ్గంబులు గేలంబూని చిత్రంబుగా సారథ్యంబు సేయుటయుఁ, దామ్రధ్వజుండు క్రోధతామ్రాక్షుండై, పదితూపులం గృష్ణుని, నరువదిశరంబుల
నర్జునుని నాటించి, గొడుగు తెగవేయుటయు, వాసవతనయుండు వాని యరదంబు నూఱుశకలంబులు సేసె. దానం గలంగక యా రాజనందనుండు మదపుటేనుంగు నెక్కి యుక్కుటమ్ము లొక్కుమ్మడిం గురిసినఁ, దూపుల ఱెక్కలవలనం బొడమిన సుడిగాలిలోనం దవిలి నరుని యరదంబు గాలిచక్రంబు చందంబున బిఱబిఱం దిరుగు సమయంబునఁ బ్రద్యుమ్నాది యోధవీరులు మూర్ఛ దెప్పిఱి నిశితశరపరంపరల నొవ్వనేయుటయుఁ, దామ్రధ్వజుం డవక్రపరాక్రమంబున నవ్వీరవరుల నారాచధారాపూరంబుల ముంచి మగుడ మూర్ఛనొందించె.
{{p|ac|fwb}}తామ్రధ్వజుండు యాగహయంబుఁ గొని పురంబునకుఁ బోవుట</p>
తదనంతరంబు కంసమర్ధనుండు కోపాటోపదీపితుండై సహస్రధారాఘోరంబైన సుదర్శనంబు గేలంబూని నక్షత్రతారాగ్రహసహితంబైన గగనంబును, శైలకాననసమేతంబైన భూతలంబును గంపింప, రథంబు డిగ్గనుఱికి యెదురు వచ్చుటయుఁ, దామ్రధ్వజుండు నవ్వుచు, "శ్రీకృష్ణా,<noinclude><references/></noinclude>
ryduyxbhq5lj9bm7budizh1wwlc32qk
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/188
104
186451
554405
504677
2026-04-25T08:22:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554405
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వృష్ణికులభూషణా, యానాఁటికిఁ గౌంతేయుని గావంబూని నీవు చేసినసుకృతంబు నిచ్చివేసితివి. ఇప్పు డీదేహంబునే యీయం జూచెదవు. మంచిది. కానిమ్ము, నిన్ను, నీ మఱందిని నీ హయంబు తోడం బట్టి కట్టికొని పోయెద' నని యేనుంగు డిగ్గి శ్రీకృష్ణదేవుని కరాంబుజంబు మెలిపెట్టి, చక్రంబు నురిమికొనునంతలో రమాకాంతుండు పేరెలుం గెత్తి, 'యర్జునా, నాచేతిచక్రంబు నాఁచుకొని పోవుచున్నవాఁడు. వీని క్రూరనారాచధారాపరంపరల వెంపరలాడి విడిపింపు' మనుటయుఁ, గౌంతేయుండు శతనిశితవిశిఖంబుల వానిపార్వ్శంబు నొప్పించిన, లెక్కగొనక తామ్రధ్వజుఁడు కృష్ణార్జునుల నిరువుర రెండుచేతులం బట్టి బిగియించి, మూర్ఛ నొందించి, భూమిం బడవైచి, రెండుయాగహయంబుల బట్టికొని, పురంబునకుం జని, నిజజనకుండైన మయూరధ్వజునిచెంతకుం బోయి మ్రొక్కి నిలిచిన, సేనాపతియైన నకులధ్వజునిదిక్కు గనుంగొని, నతండు మయూరధ్వజునితో, 'నీ కుమారుండు కృష్ణార్జునులం గెలిచి సవనహయంబుం బట్టికొని తెచ్చె' ననిన, విని యతఁడు కోపంబునం గన్నులఁ గెంపు గదురఁ గొడుకు నవలోకించి, 'నీవు శ్రీకృష్ణార్జునుల గొనిరాక తురంగంబు మాత్రమే తెచ్చితివి. ఇంత పడుచుఁదనంబు గలదే? యజ్ఞమయుండును, యజ్ఞకర్తయు, యజ్ఞభోక్తయు, యజ్ఞఫలప్రదాతయు నైన శ్రీవాసుదేవుండు లేని జన్మం బేమిటికి? ఎవ్వరి నుద్దేశించి యాగంబు సేయంగలవారము?' అని భార్యయుం దానును బరితాపంబు నొందుచు, నడలుచు నున్న సమయంబున, నర్కుం డస్తగిరిశిఖరంబునకు నలంకారంబై నిలిచె. పాండవసైనికుల వదనంబులు పంకజంబులం బోలె ముకుళితంబులయ్యె. గాయంబు వలనం బొడమిన రక్తరాగంబు సంధ్యారాగంబుతో నైక్యంబుఁ జెందె. జారులు మోడ్పుగన్నులును, గైరవంబులును వికాసంబు నొందె. అవ్వేళ మూర్ఛఁ దెలిసి లేచి, నరుఁడు శ్రీహరిని నిరీక్షించి, 'యిత తడవు కయ్యంబు సేసిన యోధ సవనతురంగంబుం గొని యే త్రోవం బోయెనో నాకెఱిగింపు; మతని రణంబునం గెలిచి యజ్ఞవాహంబు గొని వచ్చెద' ననిన, నవ్వి, యవ్వెన్నుండు 'కపికేతనా, తామ్రకేతుఁడు మనల నిరువుర గెలిచి మూర్ఛఁ బుచ్చి హయంబు గొనుచు రత్నపురంబునకుం జని తన తండ్రి కొసంగె. ఇంక మనము గాదు; త్రిమూర్తు లొక్కటై వచ్చినను గెలువఁ దరంబు గాదు. వాఁడు మదీయభక్తాగ్రగణ్యుండు. దాన క్షాత్రాధీశ్వరుండు. వాని సాహసౌదార్యంబులు<noinclude><references/></noinclude>
cev3r4vj1w6z49p71z0mymz0m2o51om
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/189
104
186453
554406
504679
2026-04-25T08:35:34Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554406
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చూడవలయునేని నావెంబడిం జనుదెమ్మ'ని తోడుకొనిపోయి బలంబులు పురసమీపంబున నిలిపెను.
{{p|ac|fwb}}శ్రీకృష్ణుండు మాయారూపంబున నర్జునునితో రత్నపురంబు సేరుట</p>
(అప్పుడు) శ్రీకృష్ణుఁడు ప్రాతముదుకనీర్కావిబ్రహ్మకమ్మిదోవతియు, నందు పైనఁ జినిగిన యుత్తరీయంబును, నుదుట గోపీచందనపుటూర్ధ్వపుండ్రంబును, వక్షస్స్థలంబునఁ బద్మాక్షమాలికయు, గర్ణరంధ్రంబుల నులి వాఁడిన శ్రీతులసియు, భుజంబున యాయవారపు గోనెసంచియుఁ, గక్షభాగంబులఁ గృష్ణాజినంబు దేవతార్చన కక్షపాలయు, దక్షిణహస్తంబునఁ బుప్పివెదురూఁతకోలయు, గూనివీఁపునఁ జినిగిన గొడుగుతునుకయు, వణంకెడు బడుగుదేహంబునుం గలిగి, వృద్ధబ్రాహ్మణరూపంబునం దనకూర్మిసఖుండైన యర్జునుని బ్రాహ్మచారివై శిష్యుఁడవుగ రమ్మని పూర్వరాత్రంబున రత్నపురంబునకు జనియె.
తదనంతరంబు, శ్రీకృష్ణదేవుం డర్జునునితోడం గూడ నా రత్నపురంబు సొచ్చి, యగురుసాంబ్రాణిధూపసమ్మిళితంబును, గుంకుమకర్పూరకస్తూరికాదిపాణింధమంబును, నానావిధకుసుమమాలికాసముదీర్ణసౌరభంబును నైన యొక్కవీథిం జనునెడ, నందంబైన యిందుకాంత సౌధంబున నొక్కమందయాన తోడఁగూడఁ గ్రీడించుచు, నొక్కవిటుం డాకుటిలకుంతలం జూచి, 'నీకురులకుఁ గృష్టత్వంబు గలిగె. మేలు, బళీ!' యని మెచ్చుటయు, నాకలకంఠి ప్రాణేశునికేలు కేలునం దెమలించి, 'నీకరంబులు శంఖచక్రాంకితంబులై యున్నయవి. కావున నీవు పురుషోత్తముండవు' అని పలుకుటయు, నమ్మాటలు విని సరసిజాక్షుం డర్జునుని గనుంగొని, 'యీయాశ్చర్యంబు వింటివే! కేళికాలంబునందును మదీయనామసంకీర్తనంబు సేయుచున్నవారు. ఇట్టివారలచిత్తంబులు మత్పదాయత్తంబులు. వీరల వచనంబులు మదీయదివ్యనామరచనంబులు. ఈజనుల కృత్యంబులు మత్యైంకర్యనిత్యంబులు. ఈపట్టణంబు భూలోకవైకుంఠంబు' అని పొగడుచు, నరుడునుం దాను,<noinclude><references/></noinclude>
9e51ddkhseeuschewzjg9lrikxytkyn
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/190
104
186454
554408
504680
2026-04-25T08:46:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554408
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}}
నా రాత్రియెల్లఁ బట్టణవీథులం దిరిగి, వేఁకువజామున నర్మదానదికిం జని, యందలి నిర్మలంబులగు నుదకంబుల స్నానసంధ్యావందనాదికృత్యంబులు నిర్వర్తించి, సూర్యోపాస్తిఁ జేసి, తత్సమీపంబున రాజహంసకూజితంబులచేత ద్విగుణీకృతంబులైన కింకిణీరవంబులచే నలంకృతంబైన ఘోటకంబుచే నొప్పు యజ్ఞవాటంబునకుం జని, యయ్యాస్థానంబును, నందలి ఋత్విక్కులను, దత్సభాసదులను, వారలచే నుచ్చరితంబులైన ఋగ్యజుస్సామమంత్రంబులను, వానిచే నావహింపబడి దివ్యవిమానంబులతో వచ్చు నింద్రాదిదేవతలను, యజ్ఞశాలామధ్యంబున దీక్షాపరుండును, బత్నీసమేతుండును, దర్భాసనాసీనుండును, సకలసామంతమహీకాంతకిరీటఘటితమణిప్రభానీరాజితపదుండును నైన మయూరకేతనుం గాంచి, కపటభూసురు లిద్దఱు 'రాజోత్తమా, భద్రమస్తు.' అని యాశీర్వాదంబు
సేసిన, నన్నరవరుండు ప్రత్యుత్థానంబు సేసి, నమస్కరించి, 'ధరణీసురోత్తమా, నేను వందనంబు సేయకమున్నె మీ రాశీర్వాదంబు సేయుట శపియించుట గాని దీవించుట గాదు. ఎందుండి యెందుఁ బోవుచు నిందులకు విజయంబు సేసితిరి? నా వలనం గాఁగల కార్యం బెయ్యది?' అనిన, నా కపటభూసురుండు పరమానందకందళితహృదయుండై 'రాజకులావతంసా, మేము కార్యార్థులమై వచ్చినవారము గావున, ముందుగా నాశీర్వాదంబు సేయుటయు, వెనుక నీవు వందనంబు సేయుటయు నెగ్గు గాదు.' అనిన విని, జననాయకుం 'డనఘా! అభ్యాగత స్స్వయం విష్ణుః, అనబడును గనుక నీవు సాక్షాజ్జనార్దనుండవని తోఁచుచున్నది. దొడ్డు కొంచెంబనక వేఁడుము. దేహవంచనయు, మనోవంచనయు, ద్రవ్యవంచనయు లేక యొసంగెద.' అనిన విని యమ్మహీసురుండు, 'రాజశేఖరా, ధర్మపురంబున వాసంబు సేయుదును. కృష్ణశర్మ యనువాఁడను. ఇతండు నాకు శిష్యుండు. ఇతని తోడం గూడ నేను మత్కుమారునిం దోడ్కొని నీపురోహితుండైన సుశీలునియింటఁ గన్నె యున్నదని విని, మత్కుమారునకు వివాహంబుగా నడుగవలయు నను తలంపున వచ్చుచున్నయెడ, నతిభయంకరం బైన యరణ్యమధ్యంబున నాఁకలి గొని కోపోద్దీపితంబైన యొక్కసింహంబు మదీయపుత్రునిం గదిసి యతని గళంబు పట్టికొనుటయు, విడిపింపం దరంబు<noinclude><references/></noinclude>
ood0wm82zv1vsgzrxw5fw1lfzba5eq8
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/191
104
186455
554410
504681
2026-04-25T09:17:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554410
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గాక, వేఱొక్కయుపాయంబునుం గానక 'శ్రీనృసింహ, శ్రీనృసింహ' యని నూటయెనిమిదిమాఱులు జపించిన నద్దేవుండు ప్రత్యక్షంబయ్య నాపుత్రుం గావలేఁడయ్యె. ఇవ్విధంబున నాపన్నుండైన కుమారునిం జూచి, యత్యంతపరితాపంబు నొందుచున్న నన్నుం గని, యా మృగరాజంబు వాలంబు సారించుచు, నా పుత్రుని గాత్రంబు నఖంబుల గ్రుచ్చుచు, దంష్ట్రాంకురంబుల నప్పళించుచు, మనుష్యభాషణంబుల న న్నుద్దేశించి, 'భూసురా, నాచేతం
దగిలిన జంతువును గృతాంతుండేనియు విడిపింపనోపఁడు. అట్టియెడ నీ వెంతవాఁడవు? నాకన్న బలవంతుఁడు జగంబున లేఁడు. శిష్యుండును, నీవును, గృహంబునకుం బొండ'ని నిరాశగాఁ బలికిన నేను నాపరానిక్లేశంబున నాశిశువుఁ బాసిపోవం గాళ్లాడక పుత్రహీనుల కూర్ధ్వగతి లేదని వినియుండుటం జేసి, మచ్చరీరకబళంబు గొని నా సుతుని శరీరంబు మగుడ నొసంగుమనిన, విని యక్కంఠీరవం బకుంఠితోత్కంఠ మెఱయ నన్నుం గూర్చి యిట్లనియె. 'నావంటి దుష్టజంతువులము మృత్యువునకు భృత్యులముగావున నిట్టి యల్పాయుష్కులంగాని నీవంటి దీర్ఘాయుష్కులం బట్టనొల్లము. నీవు పట్టికొఱకై యింతఁబట్టి పెనంగం బనిలేదు మరలిపొ మ్మ'నిన, నే నా మృగరాజంబునుం జూచి, 'యోయీ, పంచాననా, నేఁ జేసినసుకృతంబులన్నియు నీకు నిచ్చెద, నిప్పాపని నొప్పింపక నాకు నొప్పింపు'మని వేఁడుకొనిన నియ్యకొనక, 'మాకు నీవలనఁ గావలసినప్రయోజనం బొక్కటియు లేదు. మయూరధ్వజునివలనం గాఁదగిన కార్యంబు గలదు.' అని పలికె. అక్కార్యంబు నీ వంగీకరించెదని యెఱింగించెద.'
అనిన విని యాభూసురోత్తమునకు రాజసత్తముం డిట్లనియె. 'ఆసింహంబు సాక్షాన్నృసింహదేవుండెగాని, సామాన్యసింహంబు గాదు. మదీయదేశకాననంబున గిరులం జరించు సింహ వ్యాఘ్ర వరాహ మహిష దర్వీకరాది జంతువులు ప్రాణిహింసఁ జేయ వెఱచు; నైననేమి? నీయడిగిన పదార్థంబునెల్ల దామసింపక యొసంగెద. నామాట వృథగాదు. నీవు కావలసినదాని నడుగుము'. అనిన భూసురాగ్రేసరుం డానృపాగ్రణిం జూచి, 'దుర్బలస్య బలం రాజా యను వచనంబున్నది. కావున మము బోఁటి యర్థులకు మిముబోఁటి దాతల వేడుటకు సంశయింపఁ బని లేదు. నా యార్తిని హరింపుము. ఆసింహము నీదేహంబులో సగంబు నిచ్చిన నాకుమారుని విడిచెద ననిన నేను నాసింహంబు నవలోకించి బహుజనసంరక్షకులైన మహారాజుల దేహంబులఁ గోసి యిమ్మనుట మాబోఁటి<noinclude><references/></noinclude>
l4dwxd6rutiolgrye4k0ycclbhg063t
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/192
104
186456
554412
504682
2026-04-25T09:28:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554412
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విప్రుల కుచితం బగునె? అనిన విని యా కంఠీరవంబు నన్ను౦ జూచి, సురేంద్రా, యన్నరేంద్రుని సామాన్యునిగాఁ దలంపకుము, దీనజనరక్షకుఁడు, నాత్మవిద్యావిశారదుఁడు, నుత్తమోత్తముండు, నుదారుండును సత్యసంధుడు నైన మయూరధ్వజమహారాజునకు దొడ్డు కొంచెంబు లేదు. కావున నతని నడుగవలసిన కార్యంబునకు నీవు సంశయంబు నొందవలదు.
అతని నడిగిన నుత్తరక్షణంబున నీ కోరికను ఫలియింపజేయు. నది యట్లుండె. నీ శరీరంబు కుమారునకు బదులొసంగెద నంటివి. జరచే ముదిసి, తపంబుల శోషించి, యుపవాసంబులఁ గృశించి, బలహీనంబు నీ బడుగుదేహంబు మాకేమిటికి? ఆ రాజదేహంబు సకలరసంబులఁ దృప్తినొంది సర్వసుఖంబులచేతఁ దనిసి నవనీతంపుముద్దయుంబలె నా నోటి కింపై యుండునని సింహంబె నన్నుం బొమ్మనె. దశరథనందనుండు మృతుండైన బాలునిఁ బ్రతికించిన తెఱంగున నా పుత్రునిం బ్రతికింపుము. కాని, నీకు కొదవకాని మాకేమి?' అనుటయు మయూరకేతనుం డామాటలు విని, యా భూసురకుమారునకు బదులుగా తనశరీరం బీయఁదలంచి, మంత్రి పురోహిత బంధుమిత్రాదులం జూచి, 'రాజులకు రణంబున నేనియు, గోబ్రాహ్మణనిమిత్తంబేనియు శరీరంబుఁ ద్యజించు టుచితధర్మంబు. తొల్లి శిబి కర్ణ జీమూతవాహనాదులు పరార్థంబుగా నిజశరీరంబులఁ ద్యజించి, స్వర్గసుఖంబులం జెందిరి. కావున నే నీవిప్రోత్తమునకై నా శరీరంబు నొసఁగి కృతకృత్యుండ నయ్యెద. దీనికి విఘాతంబుగాఁ బలుకవలవ'దని, కుమారుఁడగు తామ్రకేతుని రాజ్యాభిషిక్తునిగాఁ బ్రతిష్ఠించి, నర్మదానదిఁ గృతస్నానుండై, యనేకదానంబుల జేసి, యావిప్రపుంగవుం చిలిచి, 'సలిలధారాపూర్వకంబుగా మదీయదేహంబులో సగంబొసంగుట వలన శ్రీకృష్ణదేవుండును బ్రీతుండగుంగాక!' అని భూసురునిచేత ధారవోసి శంకారహితుండై, యజ్ఞవేదికాస్థలంబున దర్భాసనంబునఁ గూర్చుండి బృందారకబృందవందితుండై, ముకుందు చరణారవిందంబుల హృదయారవిందంబునం దిరంబుగా నిలిపి, మొగలిరేకుం బోలిన ఱంపంబున శిరంబు మోపి, తెగువసేయం బూనినంత లోపలఁ, బుణ్యచారిత్రయు, సౌభాగ్యవతియు, బతివ్రతాశిరోమణియుఁ, బరమసాధ్వియు నైన యతనిభార్య కుముద్వతీదేవి యివ్విధం బెఱింగి సత్వరంబుగాఁ జనుదెంచి, 'పురుషుని యర్ధశరీరంబు భార్యయను వేదవచనంబు గలదు. కావున మదీయదేహంబు బ్రాహ్మణార్థంబుగా సమర్పించెద నిలువు'<noinclude><references/></noinclude>
0wzykrnejnuadkp7swtn2ktznxc8dl8
554413
554412
2026-04-25T09:28:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554413
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విప్రుల కుచితం బగునె? అనిన విని యా కంఠీరవంబు నన్ను౦ జూచి, సురేంద్రా, యన్నరేంద్రుని సామాన్యునిగాఁ దలంపకుము, దీనజనరక్షకుఁడు, నాత్మవిద్యావిశారదుఁడు, నుత్తమోత్తముండు, నుదారుండును సత్యసంధుఁడు నైన మయూరధ్వజమహారాజునకు దొడ్డు కొంచెంబు లేదు. కావున నతని నడుగవలసిన కార్యంబునకు నీవు సంశయంబు నొందవలదు.
అతని నడిగిన నుత్తరక్షణంబున నీ కోరికను ఫలియింపజేయు. నది యట్లుండె. నీ శరీరంబు కుమారునకు బదులొసంగెద నంటివి. జరచే ముదిసి, తపంబుల శోషించి, యుపవాసంబులఁ గృశించి, బలహీనంబు నీ బడుగుదేహంబు మాకేమిటికి? ఆ రాజదేహంబు సకలరసంబులఁ దృప్తినొంది సర్వసుఖంబులచేతఁ దనిసి నవనీతంపుముద్దయుంబలె నా నోటి కింపై యుండునని సింహంబె నన్నుం బొమ్మనె. దశరథనందనుండు మృతుండైన బాలునిఁ బ్రతికించిన తెఱంగున నా పుత్రునిం బ్రతికింపుము. కాని, నీకు కొదవకాని మాకేమి?' అనుటయు మయూరకేతనుం డామాటలు విని, యా భూసురకుమారునకు బదులుగా తనశరీరం బీయఁదలంచి, మంత్రి పురోహిత బంధుమిత్రాదులం జూచి, 'రాజులకు రణంబున నేనియు, గోబ్రాహ్మణనిమిత్తంబేనియు శరీరంబుఁ ద్యజించు టుచితధర్మంబు. తొల్లి శిబి కర్ణ జీమూతవాహనాదులు పరార్థంబుగా నిజశరీరంబులఁ ద్యజించి, స్వర్గసుఖంబులం జెందిరి. కావున నే నీవిప్రోత్తమునకై నా శరీరంబు నొసఁగి కృతకృత్యుండ నయ్యెద. దీనికి విఘాతంబుగాఁ బలుకవలవ'దని, కుమారుఁడగు తామ్రకేతుని రాజ్యాభిషిక్తునిగాఁ బ్రతిష్ఠించి, నర్మదానదిఁ గృతస్నానుండై, యనేకదానంబుల జేసి, యావిప్రపుంగవుం చిలిచి, 'సలిలధారాపూర్వకంబుగా మదీయదేహంబులో సగంబొసంగుట వలన శ్రీకృష్ణదేవుండును బ్రీతుండగుంగాక!' అని భూసురునిచేత ధారవోసి శంకారహితుండై, యజ్ఞవేదికాస్థలంబున దర్భాసనంబునఁ గూర్చుండి బృందారకబృందవందితుండై, ముకుందు చరణారవిందంబుల హృదయారవిందంబునం దిరంబుగా నిలిపి, మొగలిరేకుం బోలిన ఱంపంబున శిరంబు మోపి, తెగువసేయం బూనినంత లోపలఁ, బుణ్యచారిత్రయు, సౌభాగ్యవతియు, బతివ్రతాశిరోమణియుఁ, బరమసాధ్వియు నైన యతనిభార్య కుముద్వతీదేవి యివ్విధం బెఱింగి సత్వరంబుగాఁ జనుదెంచి, 'పురుషుని యర్ధశరీరంబు భార్యయను వేదవచనంబు గలదు. కావున మదీయదేహంబు బ్రాహ్మణార్థంబుగా సమర్పించెద నిలువు'<noinclude><references/></noinclude>
lu3tqtfs3q2nmz1zhoh410oyn6j2sbp
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/193
104
186457
554418
504683
2026-04-25T09:53:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554418
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మనిన విని యా కపటభూసురుండు మహీపాలుం జూచి, 'పురుషుని వామార్ధంబు స్త్రీభాగంబు గావున మయూరకేతను వామభాగంబు తేవలవదని యా సింహంబు పలికె, నట్టియెడ నియ్యంగన శరీరం బొప్పుకొనునె?' అనుటయు, నమ్మహారాజసుతుండగు తామ్రకేతుండు నమ్మహీసురునకు నమస్కరించి యిట్లనియె 'మహీసురోత్తమా, తన యాత్మయె పుత్రుండై జనియించునని వేదవవచనంబు గలదు. కావున మజ్జనకుని దేహంబునకుఁ బ్రతినిధిగా నా శరీరంబు నిచ్చి నేను ఋణత్రయవిముక్తుండనై తండ్రి చేసిన ప్రతిన జెల్లించి, శ్రీరామభద్రుండును, భీష్ముండునుం జెందిన కీర్తిం జెందెద' ననిన, నక్కైతవభూసురోత్తముఁడు 'రాజనందనా, సింగంబు పలికినమాట వినుము. ఆ రాజు దేహంబును దత్కళత్రంబును, సుతుండునుం గోసియిచ్చిన నందులో
దక్షణ భాగంబుఁ గొని తెమ్మని నన్నుం బనిచెఁ గావున నవ్వచనంబును సత్యంబు గావింపం జనుదు' ననిన, నా రాజు దరహసితవదనుండై తన భార్యను గుమారునిఁ గనుంగొని, 'యీ భూసురుఁడు పలికినట్లు గావింపు'డని తనచేత నున్నఱంపంబు వారలచేతికి నొసఁగుటయు, నారాజపత్నియైన కుముద్వతియు నందనుండైన తామ్రకేతుండును గైకొని, యతిధీరయగు కుముద్వతీసతి, కుమారుని చిత్తుంబుత్తలంబుమానం బలికి, యిరువురు రెండుపార్శ్వంబుల నిలిచి, యతి కర్కశంబైన యా ఫంపంబు భూపాలకుని శిరంబునఁ జేర్చి, 'రఘుపతీ, శ్రీమన్నారాయణా, హరిహరీ, శ్రీకృష్ణా, పురుషోత్తమా!' అని కోయునెడ మేరుగిరిశిఖరంబునుండి దొఱఁగు గైరికధాతుఝరంబులతెఱంగున రక్తపూరంబు లపారంబుగాఁ గురియ భూజను లాహాకారంబులఁ గావించిరి. ధీరజనులు కొనియాడిరి. దేవతలు ప్రశంసించిరి. అప్పు డమ్మహీపాలుండు చిత్తంబును వాసుదేవపదాయత్తంబుఁ జేసి ధీరుఁడై యుండునెడ నతని యెడమకంట నీరు గ్రమ్ముటయు, నమ్మహీసురుం డది గనుంగొని కోపాటోపంబునఁ గరంబుల విదల్చి, వేణుదండంబును ధరాతలంబునం బడవైచి, యిటునటు గంతులు వైచుచు, 'నపుత్రత వలన నూర్ధ్వలోకంబులు లేకపోయినం బోవనిమ్ము. ఏడ్చుచు నొసంగిన దానంబు నే నొల్ల'నని శిష్యుని కరంబు బట్టి యీడ్చుకొనిపోవుటయు, నమ్మహీపాలుని సతీమణి తన ప్రాణేశు మస్తకంబు గదియంబట్టి, 'యక్కటా , నీ శరీరంబు వ్యర్థంబుగాఁ గోయించి, తాను నొల్లనని యివ్విప్రుండు లేనినేరంబులు బెట్టి యలిగిపోవుచు నున్నవాఁడు. ఇంక నెట్టు' లనిన, నమ్మహీ<noinclude><references/></noinclude>
6bey3hrng1fq15eyeu84vbv53kzcve8
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/194
104
186458
554419
504684
2026-04-25T10:02:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554419
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రమణుండు చనుచున్న మహీసురుఁ జేరఁబిలిచి, 'మహాత్మా, నీ వేటికి గోపంబుఁ జెంది పోయెదవు? నీ వంటి సత్పాత్రంబున కీశరీరంబులోన దక్షిణభాగం బుపకారంబునకు వచ్చె. వామాంకంబగు తా నుపయోగంబునకు రాకపోయితిని గదా యని కంట బాష్పములు గ్రమ్మ నడలుచున్నయది. వేదనచేతఁ దొఱఁగెడి బాష్పంబు లంటివేని రెండుకన్నులం బొడమవలదె? నాయెడ దయచేసి నీభాగమ్ముఁ గొని పొమ్మనుటయు, నర్జునుని తోడఁ గూడ శ్రీకృష్ణుండు ప్రత్యక్షంబై నిలిచి, యమ్మహీపాలకుఁ గౌగిలించికొని, 'రాజకులచంద్రా, నీ ధైర్యస్థైర్యసాహసౌదార్యంబులకు మెచ్చితి, నీ సుతుండును, సతీమణియుఁ గొలువ మా యాగీహయంబుల రెంటి నుంచుకొని, యాగద్వయంబును నీవె చేయుము. కర్మను కర్తనునై నేన సర్వంబు నిర్వహించెద. నీకుమారుఁడు మమ్ము నిరువురఁ దా నొక్కరుండె యుద్ధంబున జయించె. నీవు దేహంబు నొసంగి మమ్ము జయించితివి. ఈ రాజకులంబులోన నీవంటి వీరవితరణగుణంబులు గల మేటి లేఁ'డనియె. అప్పు డప్పుడమిఱేఁడును దామోదరుని కరారవిందస్పర్శంబున గాయంబు మాని, సంతసంబున నద్దేవుని చరణపద్మంబులకు సాష్టాంగదండప్రణామంబు సేసి, 'దేవా, కర్మఫలదుండవు. సకలయాగసమారాధ్యుండవు, యజ్ఞమయుండవునైన నిన్నుఁ గనుఁగొంటిని. ఎండగొట్టున దప్పిఁ గొనినవానికి విమలోదకంబులచేత దప్పి తీఱవలయునుగాని, మంచుతుంపరలం దీఱునె? పునరావృత్తిరహితమోక్షసామ్రాజ్యప్రదుఁడ వైన నిన్నుఁ బ్రత్యక్షంబుగాఁ గనుంగొనియుఁ జాలక కర్మారంభంబు సేయంబూనిన నన్నుఁ జూచి విద్వజ్జనులు నవ్వరె? ద్రవ్యంబుఁ గుమ్మరించి వట్టికొప్పెరఁ దెచ్చిన వెట్టివానివిధంబున, దురంబున మీ స్వరూపం బెఱుంగఁజాలక నా కుమారుఁ డవివేకియై రిత్తహయంబుఁ బట్టి తెచ్చె. దేహంబు లస్థిరంబులని తెలియక యీ హరిఁ బట్టి తెచ్చె; నందువలన శ్రీహరివగు నీ సందర్శనంబు కలిగె. నేను ధన్యుఁడనైతిని. ప్రళయసాగరంబున శుత్రిచోరకుఁడగు దైత్యుని సంహరించుటకు మీనరూపంబమైన నీకుఁ బ్రణామంబు. కూర్మరూపధరుండవై జలధిమథనంబు గావించి సురల కమృతంబు నొసంగిన నీకు వందనంబు.<noinclude><references/></noinclude>
4h9hup6bv5vdsep8y8nuqjp115vnjiu
554420
554419
2026-04-25T10:02:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554420
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రమణుండు చనుచున్న మహీసురుఁ జేరఁబిలిచి, 'మహాత్మా, నీ వేటికి గోపంబుఁ జెంది పోయెదవు? నీ వంటి సత్పాత్రంబున కీశరీరంబులోన దక్షిణభాగం బుపకారంబునకు వచ్చె. వామాంకంబగు తా నుపయోగంబునకు రాకపోయితిని గదా యని కంట బాష్పములు గ్రమ్మ నడలుచున్నయది. వేదనచేతఁ దొఱఁగెడి బాష్పంబు లంటివేని రెండుకన్నులం బొడమవలదె? నాయెడ దయచేసి నీభాగమ్ముఁ గొని పొమ్మనుటయు, నర్జునుని తోడఁ గూడ శ్రీకృష్ణుండు ప్రత్యక్షంబై నిలిచి, యమ్మహీపాలకుఁ గౌఁగిలించికొని, 'రాజకులచంద్రా, నీ ధైర్యస్థైర్యసాహసౌదార్యంబులకు మెచ్చితి, నీ సుతుండును, సతీమణియుఁ గొలువ మా యాగీహయంబుల రెంటి నుంచుకొని, యాగద్వయంబును నీవె చేయుము. కర్మను కర్తనునై నేన సర్వంబు నిర్వహించెద. నీకుమారుఁడు మమ్ము నిరువురఁ దా నొక్కరుండె యుద్ధంబున జయించె. నీవు దేహంబు నొసంగి మమ్ము జయించితివి. ఈ రాజకులంబులోన నీవంటి వీరవితరణగుణంబులు గల మేటి లేఁ'డనియె. అప్పు డప్పుడమిఱేఁడును దామోదరుని కరారవిందస్పర్శంబున గాయంబు మాని, సంతసంబున నద్దేవుని చరణపద్మంబులకు సాష్టాంగదండప్రణామంబు సేసి, 'దేవా, కర్మఫలదుండవు. సకలయాగసమారాధ్యుండవు, యజ్ఞమయుండవునైన నిన్నుఁ గనుఁగొంటిని. ఎండగొట్టున దప్పిఁ గొనినవానికి విమలోదకంబులచేత దప్పి తీఱవలయునుగాని, మంచుతుంపరలం దీఱునె? పునరావృత్తిరహితమోక్షసామ్రాజ్యప్రదుఁడ వైన నిన్నుఁ బ్రత్యక్షంబుగాఁ గనుంగొనియుఁ జాలక కర్మారంభంబు సేయంబూనిన నన్నుఁ జూచి విద్వజ్జనులు నవ్వరె? ద్రవ్యంబుఁ గుమ్మరించి వట్టికొప్పెరఁ దెచ్చిన వెట్టివానివిధంబున, దురంబున మీ స్వరూపం బెఱుంగఁజాలక నా కుమారుఁ డవివేకియై రిత్తహయంబుఁ బట్టి తెచ్చె. దేహంబు లస్థిరంబులని తెలియక యీ హరిఁ బట్టి తెచ్చె; నందువలన శ్రీహరివగు నీ సందర్శనంబు కలిగె. నేను ధన్యుఁడనైతిని. ప్రళయసాగరంబున శుత్రిచోరకుఁడగు దైత్యుని సంహరించుటకు మీనరూపంబమైన నీకుఁ బ్రణామంబు. కూర్మరూపధరుండవై జలధిమథనంబు గావించి సురల కమృతంబు నొసంగిన నీకు వందనంబు.<noinclude><references/></noinclude>
5c7y8k8ozr5dmyujrr9gwlk374tf9fu
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/195
104
186459
554421
504686
2026-04-25T10:17:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554421
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లీలావరాహమూర్తి వై భూమి నుద్ధరించిన నీకు నమస్కారంబు. స్తంభంబునఁ బుట్టి ప్రహ్లాదుఁ గాచిన నరసింహా, నీకు దండంబు. వామనమూర్తివై మూఁడడుగుల ముల్లోకంబుల నాక్రమించిన త్రివిక్రమా, నీకుఁ బ్రణుతి నొనర్చెద. క్షత్రియకుల ధూమకేతువైన భృగురామా, నీకు మ్రొక్కెద. దశకంఠకంఠలుంఠకనారాచధారాచకితరక్షస్స్తోమా! రఘురామా! నీకు నమోవాకంబు. ప్రలంబదానవశైలవజ్రాయుధా! హలాయుధా! నీకు జోహారు. త్రిపురసంహారహేతుబౌద్ధా! యనిరుద్ధా! నీకుఁ గేలు మోడ్చెద. మ్లేచ్ఛనికరవిచ్ఛేదనప్రచండమండలాగ్రధారాసంపాదితకీర్తీ! కలికిమూర్తీ! నీ పదాబ్జంబులకు నమ్రుండనైతి,' నని బహువిధంబులఁ బ్రస్తుతించి, సమస్తవస్తుజాతంబు అమ్మాధవున కర్పించి, సంప్రీతుఁ జేసి, పురందరనందను నట్ల పూజించి కౌఁగిలించి, బంధుజనసమన్వితుండై శ్రీకృష్ణార్జునుల నిజపురంబునకుఁ దోడ్కొనిపోయె. అంత గోవిందుండు గాండీవికి మయూరధ్వజుని భక్తి దెలుపవలసి బలసమన్వితంబుగా దివసత్రయం బధివసించె, అనిన జనమేజయుండు జైమినిమునితోఁ దరువాతివృత్తాంతం బెఱింగిపు మనుటయు —
{{Telugu poem|type=|శా.lines=<poem>ఆలంకామిహికాచలప్రకటశౌద్యాగాధగాఢాశతో
ద్వేల....స్త్యయశోవిశోభితధరిత్రాఖండ, ఖండాదిక
స్వాలాపామృతసేచనోల్లసితవిద్వత్కర్ణ, కర్ణాటల
క్ష్మీలీలైకధురీణ, రీణనృపరాజీలంఘితాశాంతరా.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>కల్పకసమదానకళా
కల్పకనిజబాహుదండ గండరగండా
కల్పకసత్కవివినుతా
కల్పకసత్కీర్తిసాంద్ర కనకమృగేంద్రా.</poem>|ref=}}
{{Telugu poem|type=పంచచామరము.|lines=<poem>ఘనాఘనౌఘనాదనాదికాహళీహళాహళీ
ఘనర్విభావిభాసితద్యుగర్భదార్భటీ
కనద్ధరావరాహకేతుకాండచండవాహినీ
వినోదనోదనగ్నభగ్నవీరవైరిమండలా.</poem>|ref=}}<noinclude><references/></noinclude>
gil7f8rtwpvcckdeo2iiz1cv0fwnkhi
554422
554421
2026-04-25T10:18:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554422
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లీలావరాహమూర్తి వై భూమి నుద్ధరించిన నీకు నమస్కారంబు. స్తంభంబునఁ బుట్టి ప్రహ్లాదుఁ గాచిన నరసింహా, నీకు దండంబు. వామనమూర్తివై మూఁడడుగుల ముల్లోకంబుల నాక్రమించిన త్రివిక్రమా, నీకుఁ బ్రణుతి నొనర్చెద. క్షత్రియకుల ధూమకేతువైన భృగురామా, నీకు మ్రొక్కెద. దశకంఠకంఠలుంఠకనారాచధారాచకితరక్షస్స్తోమా! రఘురామా! నీకు నమోవాకంబు. ప్రలంబదానవశైలవజ్రాయుధా! హలాయుధా! నీకు జోహారు. త్రిపురసంహారహేతుబౌద్ధా! యనిరుద్ధా! నీకుఁ గేలు మోడ్చెద. మ్లేచ్ఛనికరవిచ్ఛేదనప్రచండమండలాగ్రధారాసంపాదితకీర్తీ! కలికిమూర్తీ! నీ పదాబ్జంబులకు నమ్రుండనైతి,' నని బహువిధంబులఁ బ్రస్తుతించి, సమస్తవస్తుజాతంబు అమ్మాధవున కర్పించి, సంప్రీతుఁ జేసి, పురందరనందను నట్ల పూజించి కౌఁగిలించి, బంధుజనసమన్వితుండై శ్రీకృష్ణార్జునుల నిజపురంబునకుఁ దోడ్కొనిపోయె. అంత గోవిందుండు గాండీవికి మయూరధ్వజుని భక్తి దెలుపవలసి బలసమన్వితంబుగా దివసత్రయం బధివసించె, అనిన జనమేజయుండు జైమినిమునితోఁ దరువాతివృత్తాంతం బెఱింగిపు మనుటయు —
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆలంకామిహికాచలప్రకటశౌద్యాగాధగాఢాశతో
ద్వేల....స్త్యయశోవిశోభితధరిత్రాఖండ ఖండాదిక
స్వాలాపామృతసేచనోల్లసితవిద్వత్కర్ణ కర్ణాటల
క్ష్మీలీలైకధురీణ రీణనృపరాజీలంఘితాశాంతరా.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>కల్పకసమదానకళా
కల్పకనిజబాహుదండ గండరగండా
కల్పకసత్కవివినుతా
కల్పకసత్కీర్తిసాంద్ర కనకమృగేంద్రా.</poem>|ref=}}
{{Telugu poem|type=పంచచామరము.|lines=<poem>ఘనాఘనౌఘనాదనాదికాహళీహళాహళీ
ఘనర్విభావిభాసితద్యుగర్భదార్భటీ
కనద్ధరావరాహకేతుకాండచండవాహినీ
వినోదనోదనగ్నభగ్నవీరవైరిమండలా.</poem>|ref=}}<noinclude><references/></noinclude>
inm4r46bk9v9xsgzcanr612n003zn3l
554423
554422
2026-04-25T10:19:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
554423
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లీలావరాహమూర్తి వై భూమి నుద్ధరించిన నీకు నమస్కారంబు. స్తంభంబునఁ బుట్టి ప్రహ్లాదుఁ గాచిన నరసింహా, నీకు దండంబు. వామనమూర్తివై మూఁడడుగుల ముల్లోకంబుల నాక్రమించిన త్రివిక్రమా, నీకుఁ బ్రణుతి నొనర్చెద. క్షత్రియకుల ధూమకేతువైన భృగురామా, నీకు మ్రొక్కెద. దశకంఠకంఠలుంఠకనారాచధారాచకితరక్షస్స్తోమా! రఘురామా! నీకు నమోవాకంబు. ప్రలంబదానవశైలవజ్రాయుధా! హలాయుధా! నీకు జోహారు. త్రిపురసంహారహేతుబౌద్ధా! యనిరుద్ధా! నీకుఁ గేలు మోడ్చెద. మ్లేచ్ఛనికరవిచ్ఛేదనప్రచండమండలాగ్రధారాసంపాదితకీర్తీ! కలికిమూర్తీ! నీ పదాబ్జంబులకు నమ్రుండనైతి,' నని బహువిధంబులఁ బ్రస్తుతించి, సమస్తవస్తుజాతంబు లమ్మాధవున కర్పించి, సంప్రీతుఁ జేసి, పురందరనందను నట్ల పూజించి కౌఁగిలించి, బంధుజనసమన్వితుండై శ్రీకృష్ణార్జునుల నిజపురంబునకుఁ దోడ్కొనిపోయె. అంత గోవిందుండు గాండీవికి మయూరధ్వజుని భక్తి దెలుపవలసి బలసమన్వితంబుగా దివసత్రయం బధివసించె, అనిన జనమేజయుండు జైమినిమునితోఁ దరువాతివృత్తాంతం బెఱింగిపు మనుటయు —
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆలంకామిహికాచలప్రకటశౌద్యాగాధగాఢాశతో
ద్వేల....స్త్యయశోవిశోభితధరిత్రాఖండ ఖండాదిక
స్వాలాపామృతసేచనోల్లసితవిద్వత్కర్ణ కర్ణాటల
క్ష్మీలీలైకధురీణ రీణనృపరాజీలంఘితాశాంతరా.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>కల్పకసమదానకళా
కల్పకనిజబాహుదండ గండరగండా
కల్పకసత్కవివినుతా
కల్పకసత్కీర్తిసాంద్ర కనకమృగేంద్రా.</poem>|ref=}}
{{Telugu poem|type=పంచచామరము.|lines=<poem>ఘనాఘనౌఘనాదనాదికాహళీహళాహళీ
ఘనర్విభావిభాసితద్యుగర్భదార్భటీ
కనద్ధరావరాహకేతుకాండచండవాహినీ
వినోదనోదనగ్నభగ్నవీరవైరిమండలా.</poem>|ref=}}<noinclude><references/></noinclude>
iwrcfz9kwzpt3xps7k62dnv7npmtw8v
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/196
104
186460
554359
504687
2026-04-24T21:57:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554359
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|<poem>గద్య
ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగ చొక్కనాథ
మహీనాథకరుణాకటాక్షసంపాదిత గజతురంగమాందోళికా
ప్రముఖ నిఖిలసంపత్పారంపరీసమేధమాన
సముఖ మీనాక్షీనాయకతనూభవ మీనాక్షీ
దేవీకటాక్షలబ్ధకవితాసాంప్రదాయక
వేంకట కృష్ణప్ప నాయక ప్రణీ
తం బైనజైమినిభారతం
బున నశ్వమేధపర్వ
మ్మను వచన
కావ్యంబునందుఁ
జతుర్థాశ్వాసము.</poem>}}
{{Center|———౦———}}<noinclude><references/></noinclude>
c9l0sjas1vpr3nv2wvulxicbz71yp0f
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/197
104
186461
554360
504688
2026-04-24T22:07:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554360
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}జైమినిభారతము</p>
{{p|fs125}}పంచమాశ్వాసము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>శ్రీమధురాపురనాథా
...మధురాధరగభీర...నిజవినోదా,
భూమీసుత భూరికళా
స్తోమాంకా, విజయరంగ చొక్క మృగాంకా.</poem>|ref=}}
అవధరింపుము. జైమిని మునీంద్రుఁడు జనమేజయ నరేంద్రునిఁ గనుఁగొని యిట్లనియె. అవ్విధంబున రత్ననగరంబునఁ గృష్ణార్జునులు రాజుచేతఁ బూజలు గొనుచు, మూఁడుదినంబు లుండి, నాలవనాఁడు సముత్తుంగతురంగశతాంగవీరభటపరంపరలతో, మయూరకేతనుండు కొలిచిరా, యాగతురంగంబులఁ గదలింప, నవియు నానాదేశంబులు, నదులు, నదంబులు, జనపదంబులు నతిక్రమించి, క్రమక్రమంబున సారస్వతపురంబునకుం జేరనరిగె. ఆరాజు రాష్ట్రం
బున నెల్లకాలంబును గృతయుగంబునందునుంబలె ధర్మంబు నాల్గుపాదంబుల నడచు. ఏ సత్యసంధుని దేశంబునందలి ప్రజలు కలవరించియేనియు బొంక, రేవదాన్యుఁడు చేయు దానధారాప్రవాహంబులచేత మేదినీతలంబు ముక్కాఱును బండు, నేసుశీలుఁడు 'బ్రాహ్మణో మమదైవతం' బని నిశ్చయించి విప్రసంతర్పణంబు నెడ విడువక సేయు,
{{p|ac|fwb}}వీరవర్మ గుఱ్ఱంబును బట్టుట</p>
అట్టి పరమధార్మికుండైన వీరవర్మ తనచారులచేతఁ గపిధ్వజ మయూరధ్వజుల యాగీయఘోటకంబులు తనదేశంబునకు వచ్చెనని విని, వాని రెంటినిఁ బట్టికొనఁ జెంగటివారలం బంచుటయు, వార లట్లు గావింప, యౌవనాశ్వానుసాళ్వ హంసధ్వజ మయూరధ్వజాది మహారాజ సేనాసందోహసమున్నతంబును, నపరిమితకరితురగరథభటపటలచటులంబును నై, కల్లోలినీవల్ల<noinclude><references/></noinclude>
6xg03pw94slmmn0doe3vulnotl8tr0g
పుట:జైమిని భారతము (సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు).pdf/198
104
186462
554427
504689
2026-04-25T10:57:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
554427
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>భునివిధంబున వెల్లివిరిసియు, బాండవసైన్యంబులకెల్ల నధిష్ఠాతయు, సమరకర్కశుండును, విక్రమజితశ్వేతవాహనుండును నైన బభ్రువాహనుం డెదుటిసైన్యంబులం గదిసి, తులితభిదురంబులైన ప్రదరంబుల దరంబుగా నెదురం బ్రయోగించి, సేనాంగంబుల భంగంబు నొందించుటయు, నవ్వీరకుమారులు కువలుండును, సులతుండు ననువారలు దివ్యరథంబుల నధిరోహించి, బభ్రువాహనుఁ దాకి, దండధరదండోపమానంబులైన చండకాండంబులఁ దండతండంబులుగా నొండొండ నిగిడించుటయు, నుభయసైన్యంబులకు ముషీముష్టి, బాహాబాహి, కచాకచి, ఖడ్గాఖడ్గి, దండాదండిగా భండనంబయ్యె. అప్పుడు పదివేల మహారథులతోడంగూడ వీరవర్మ కుమారులు బభ్రువాహనునిఁ గిట్టి పెట్టిన, దండె తీయక నిశితశరనికరంబుల నొప్పించుటయు, నింద్రుని మనుమఁడు మండుచు, జండాంశుకిరణకాండసదృశంబులైన శరప్రకాండంబులు వర్షించుటయు, నగ్నిలోనంబడిన శలభంబులకైవడి వీరవర్మ సైన్యంబులు మ్రొగ్గతిలంబాఱె. అప్పు డతని యల్లుండగు నంతకుండు విఱిగిన దళంబులం బురికొల్పి, శతసహస్రాయుతనియుతకోట్యర్బుదన్యర్బుదఖర్వమహాఖర్వశంఖసంఖ్యలును, బుంఖానుబుంఖంబులు నగు కంకపత్రంబులు నిగిడించిన, వ్రాలు నేనుంగులును, గూలు గుఱ్ఱంబులును, దూలు రథంబులును, గీలు దప్పిన బొమ్మలగతిఁ బడు వీరభటులును, మూర్ఛల మునుంగు యోధులును, మునింగిన మహారథులును, మోహంబు నొందిన మహీపతులునుం గలిగి, దీనదశం బొందిన సేనల నవలోకించి, కిరీటి కైటభాంతకునిఁ జూచి 'వీఁ డెవ్వఁడో దురంతపరాక్రముఁ డంతకునితెఱంగున మనబలంబు నంతంబు నొందించుచున్నవాఁడు. నాకుఁ జూడ వీని మనుష్యుం డనంగూడ' దనిన విని వనమాలి కిరీటిం జూచి యిట్లనియె.
{{p|ac|fwb}}కృష్ణుం డర్జునునకు యమవృతాంతంబుఁ జెప్పుట</p>
'ఈ రాజు కూఁతురగు మాలిని యను వధూటికి యముఁడు మగఁడు. కావున నతండు మామ నిమిత్తంబుగా మనతో నెదిరించి పోరుచున్నవాఁడు. ఆకన్య జమునిఁ బెండ్లి యాడిన తెఱఁగు వినుము. వీరవర్మ కుమారి మాలిని లోకైకసౌందర్యశాలిని మవ్వంపుజవ్వనంబున నివ్వటిల్లుటయు, నప్పువ్వుబోణిఁ జూచి, యవ్విభుండు 'తల్లీ, నీ వెవ్వరిఁ బెండ్లియాడెదవు? సమ్మతుండైన పురుషునిం దెలు<noinclude><references/></noinclude>
m8z6cenu22o1ebfggv7xy9z73kue4qi
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/390
104
203736
554330
530632
2026-04-24T12:17:52Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554330
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఆలోచనకు ప్రేరకం అది.
సద్యస్పూర్తికిన్నీ దోహదం అది.
చిన్నప్పణ్ణుంచీ అలవాటయివుంటుంది పాశ్చాత్యుల కిది.
కాగా - "ఏగుమ్మాన వెడతాడో?" అనుకుంటూ ఆత్రంగా వున్నారు వకీళ్ళందరూ; కాని వుడతలాగ వొక కిటికీలోనుంచి బయటికి దూకేశాడు దొర "రండి" అని వకీళ్ళను పీలుస్తూ.
అందరూ తెల్లపోయారు.
వెంటనే కవరు తీశాడు జేబులోనుంచి దొర.
కవరులోనుంచి కాగితమూ తీశాడు, అవ్యవధానంగా.
ఆ కాగితం అతనిచేతిలో వుండగానే చదివేశాడు బెంచిక్లార్కు.
"వొక కృత్రిమద్వారంలోనుంచి బయటి కురుకుతావు" అని.
తుళ్ళిపడ్డాడు దొర.
ఎగిరిపడ్డారు వకీళ్లు.
{{c|<big><big>56</big></big>}}
చెప్పవచ్చిం దేమి టంటే?
దగ్గిర వుండి, వొక రెడ్డియువకుణ్ణి చెట్టెక్కించి మర్రాకులు కోయిస్తున్నాడు సుబ్బారాయ డావేళ, కిందపడ్డవన్నీ పెద్దబ్బాయిగారి దగ్గరికి చేరుస్తూ.
సుబ్బారాయడే తెచ్చాడు శ్రవణానందం ప్రసక్తి, అప్పుడు.
చాలాదూరమూ తీసుకువెళ్ళా డది, ఆ పట్టుపట్టు.
వినివిని "అసందర్భాలే కాదు, అన్వయదోషాలూ, రసభంగాలూ, అపార్థాలూ, పడికట్టురాళ్ళూ, ప్రక్రమభంగాలూ - ఇలాంటివన్నీ చాలా వున్నా యందులో" అన్నారు పెద్దబ్బాయిగారు.
చకితుణ్ణయిపోయా న్నేనది విని.
అలాంటి శీర్షికలు నిర్ధారణ చేసుకునే యెన్నో దోషాలు గుర్తుపెట్టుకునివున్నా న్నేనప్పటికీ, యెర్రపెన్సిలుతో.
ఇది విని "కనక, శ్రవణానందం విమర్శించాలి మీ" రంటూ కూచున్నాడు సుబ్బారాయడు.
చిన్నప్పుడు దొడ్డంపేటలోనే కలిగివుండింది, నాకీ వుద్దేశం, మరిచిపోలేదు.
పీఠాపురంలో సాహిత్య సాధన చెయ్యడంలో యెంతో కొంత యోగ్యతా అబ్బివుంది, నా కప్పటికీ.
కాని "శ్రమా, కాలహరణమూ, డబ్బు దండుగూ తప్ప దానివల్ల మరి ప్రయోజనం వుండ" దన్నారు పెద్దబ్బాయిగారు.
"భాషాపరంగా నయినా, సాహిత్యదృష్ట్యా అయినా ప్రామాణికత్వం యేర్పడివుందా దాని కసలు?" అనడిగారు ముందు, వారు.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||366}}</noinclude>
hcnhd8ef2zvz3wpu8rpzs9jbncx7rnq
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/391
104
203737
554331
530634
2026-04-24T12:31:39Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554331
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>“నలుగురూ చదువుతున్నా రని మీరు భ్రాంతిపడకండి. అచ్చుపడి బయటికి రావడమే తడువుగా జనసామాన్యంలోకి చొచ్చుకుపోయిన గ్రంథానికి పూతమూ వుండదు, అంతస్థూ యేర్పడదు. పద్యాలు సులభంగా వుండడమూ తమాషాగా వుండడమూ కాదు రసికుల కాకర్షకం. రసభావాలకు సంబంధించిన విశిష్టత కర్ణతాడితం
అయితేనే వా రేగ్రంథం కోసమైనా అర్రులు చాపుతారు. కనక, గుణప్రచురమైనది విమర్శించాలి గాని మీవంటివా రిలాంటిది కాదు" అనిన్నీ చెప్పారు వారు, దృఢంగా.
నా నమ్మకమూ యింతే, యివాళ.
కాని వారి హితోపదేశం నా చెవికెక్క లే దాపాలపొంగులో.
పైగా, ఆవేళ, నేదునూరి శంకరంగారు చేసిన లౌక్యం జ్ఞాపకం వచ్చింది నా కప్పుడు.
దాని కెప్పణ్ణుంచో ప్రతిక్రియ చెయ్యాలని వుంది నాకు.
సుబ్బారాయడి ప్రోత్సాహం అందుకున్నూ త్వరపెట్టింది నన్ను.
దాంతో, ఆ రాత్రే ప్రణాళిక చేసుకున్నాను.
ఆ కవులే రచించిన పాణిగృహీత జ్ఞాపకంవచ్చింది నా కాసందర్భంలో.
కానయితే, శ్రవణానందాని కున్న పేరు లేదు దానికి.
కవులున్నూ అంతంతగానే శ్రద్ధపెట్టారు దాని రచనలో.
ఇక కథా, మరీ నీరసం అది.
తిరుపతి వేంకట కవులకు శ్రవణానందం వల్ల వచ్చిన కీర్తిలో, పాణిగృహీత వల్ల యెంతో కొంత తగ్గిపోయింది గాని హెచ్చలేదు.
నిజంగా, తమ పేరుతో రావలసిన గ్రంథమే కాకపోయినా వారు సగర్వంగా ప్రకటించుకున్నా రది.
కనక "అది విమర్శించతగ్గ దయితే యిది విడిచిపెట్ట తగ్గదా?" అనిపించింది నాకు.
అదిన్నీ చదివాను శ్రవణానందం విమర్శ ఆపుచేసి రెండుమాట్లు, శ్రద్ధగా.
తరవాత రెండు మాసాలు నిద్రాహారాలు మరిచిపోయాను.
గ్రంథం తయారయింది.
చిత్తులో “పాణిగృహీత – శ్రవణానందము” అని వున్న పేరు "పాణిగృహీతాశ్రవణానంద శృంఖల" అయిపోయింది, సాపులో.
అచ్చున్నూ పడిపోయిం దది, అవ్యవధానంగా.
{{c|<big><big>57</big></big>}}
పాణిగృహీతాశ్రవణానంద శృంఖల రచించినందుకూ, సాహసించి ప్రకటించినందుకూ - అనుబంధానికి భంగం రానివిధంగా, చాలా కోప్పడ్డారు వేంకటరామశాస్త్రిగారు, నామీద.
“రాతప్రతి మాకెందుకు చూపించలేదూ?" అంటూ నిక్కచ్చి చేశారు రామకృష్ణశాస్త్రిగారు.<noinclude><references/>
{{rh|367||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
qfk7cv0p00q3xr2mre0g3eybj5wwh75
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/392
104
203738
554332
530635
2026-04-24T12:36:14Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554332
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"దీంతో, మీరున్నూ యీ అగ్గిలో వురికినట్టయింది. మా ప్రేరణ లేకపోడం వొకటే యిందులో వున్న విశేషం. అయినా, మీరు చేసివుండవలసింది కాదు; కాని కీడొక్కటే కాదులెండి మేలూ వుంది దీనివల్ల కావలసినంత” అని కూడా అన్నారు వారు.
"మీ రచనలో కొన్ని పొరపాట్లున్నాయి మరి” అనీ అన్నారు, నిర్మొగమాటంగా.
కాకపోయినా, నా విమర్శ ఖండిస్తారు వేంకటశాస్త్రిగారు, తప్పనిసరిగా.
ఏది యేమయినా యిది నేదునూరి శంకరంగారికిన్నీ కళ్ళ బడాలి.
ఒక ప్రతి అకొండి కామరాజుగారి కివ్వడమే అందు కుపాయం.
సరిగా గురువులు శృంఖల పరిశీలిస్తున్నప్పుడే కామరాజు గారు వచ్చారు, పిలిచినట్టుగా.
"శంకరంగారి కిది ప్రతిక్రియ" అనిన్నీ అన్నారు, నే ననుకున్నట్టే.
వెంటనే వారికో ప్రతి యిచ్చా న్నేను.
"ఈ వివాద సందర్భంగా అనేకాలు తామే రాసి వేంకట శాస్త్రిగారు తమ శిష్యుల పేరు పెట్టడం మనకందరికీ తెలుసు. అలాకాక - మీ పక్షంగా - మీకు తెలియకుండా మీ శిష్యుడీ గ్రంథం రచించడమూ ప్రకటించడమూ మీ పక్షానికి
మిక్కిలీ మంచిది" అన్నారు కామరాజుగారు, ప్రసంగవశాన.
"నా మాట ప్రమాణం కాదు, నాకూ తెలుసు. వేంకటశాస్త్రిగారి రచనల విషయమై మల్లయ్య (పురాణపండా) శాస్త్రిగారున్నూ పెదవి విరిచారు, మా నాయనగారి దగ్గిర. అనేకులు ప్రామాణికుల భావమూ అలాంటిదే వింటున్నాముగా? అయినా, మీకూ మాకూ అసలు, కలహం రావడమే చాలా అనుచితం; కాని ప్రారంభం అయిపోయింది, అనుకోకుండా. పెరిగీపోయింది హద్దులేకుండా, ఇక అటూ యిటూ కూడా మూలపురుషులతోనే యిది పరిమితం అయివుండాలంటే సాగదు. ఉభయత్రా శిష్యులూ అభిమానులూ కూడా యిందులో వురకడం
అనివార్యం. కనక, సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చేసింది నేను తప్పనను. అయితే, దీనివల్ల ఆయనకూ కొన్ని దెబ్బలు తగుల్తాయి, తప్పదు; కాని సాహిత్య వ్యవసాయి కదీ వొక సాధనోపాయమేగా?" అనికూడా అన్నారు వారు.
“అది వొక్కటే యిందులో వున్న విశేషం” అన్నారు చివరికి, వేంకటరామశాస్త్రిగారు.
ఒకవిధంగా నిరుత్సాహంగానూ, మరోవిధంగా ప్రోత్సాహంగానూ యింటికి వచ్చేశా న్నేను.
పుస్తకం చూసీ పిఠాపురంలో జరిగింది విని చాలా సంతోషించాడు సుబ్బారాయడు.
పెద్దబ్బాయిగారూ చదివారు శృంఖల; కాని “తుషాహననం చేశారు మీ" రన్నారు, నిష్ఠురంగా.
చాలా పత్రికలకు పంపాను పుస్తకం.
కొన్ని అటూ, కొన్ని యిటూ రాశాయి.
పండితులున్నూ తెగిడినవారు తెగిడారు, పొగిడినవారు పొగిడారు.
ఆంధ్రభారతి అంటూ వొక మాసపత్రిక వచ్చే దారోజుల్లో.
ముట్నూరి కృష్ణారావుగారే ప్రకటించేవా రది బందరులో.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||368}}</noinclude>
m4km9nm48y8ujfp5cl1que20sqn05k5
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/393
104
203739
554333
530646
2026-04-24T12:40:43Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554333
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"శృంఖలాతృణీకరణం" అని పేరుపెట్టి, వేంకటశాస్త్రిగారు, నా విమర్శమీద ఖండన ప్రారంభించారా పత్రికలో.
వేంకటశాస్త్రిగారి శిష్యులు కస్తూరి శివశంకరకవిగారు తమ సుదర్శనిపత్రికలో విమర్శ ప్రారంభించారు, నరసాపురంలో.
“ఇక్కడ తిరుపతివేంకట కవులు పొరపడ్డారు, సందేహం లేదు; కాని సుబ్రహ్మణ్యశాస్త్రిగా రిక్కడ తప్పుకానిది తప్పన్నారు. దానికీ దీనికీ చెల్లు” - ఈ ధోరణిలో నడిచింది, శివశంకరకవిగారి విమర్శ.
వేంకటశాస్త్రిగారు మాత్రం ఖండించినంతవరకూ “ఘాటుగానే ఖండించారు.
"ఘాటుగా" అంటే బుకాయిస్తూ అన్నమాట.
ఇక “ఖండించినంతవరకూ" అనెందు కన్నానంటే, నా ఆక్షేపణల్లో, సగానికయినా వారు బదులుచెప్పలేదు.
పైగా క్రమం విడిచి అక్కడొకటీ యిక్కడొకటీ ఆక్షేపించి ఖండించేశా ననిపించుకున్నా రాయన.
నా విమర్శ అంతా ఖండించేసినట్టు లోకాన్ని భ్రమ పెట్టడాని కాయన ప్రయత్నం.
పాణిగృహీతా శ్రవణానందశృంఖల అసలు నేను రాయనేలేదని ఆయన వాదం.
వేంకటరామకృష్ణకవులే రాసి నా పేరు పెట్టారని ఆయన ప్రచారం.
చాలాకాలం యిలాగే చెప్పేవారు(ట) ఆయన.
అమలాపురంలో వారి శిష్యులొకరు ప్రయివేటు మెడికల్ ప్రాక్టీషనరు.
పేరు జ్ఞాపకం లేదు - ఇంటిపేరు బులుసువారు.
రాజా శ్రీ వాడ్రేవు విశ్వసుందరరావు బహద్దరువారి కుమారులు శ్రీధరరావు బహద్దరువారి వివాహానికి వెళ్లినప్పుడు వారి యింటోనే బస చెయ్యడం తటస్థించింది నాకు.
మా నాయనగారూ మా చిన్నన్నగారూ కూడా స్వయంపాక నియమం గలవారు కావడంవల్ల ఆడపెళ్ళివారు మాకోసం ప్రత్యేకంగా వొక బస యేర్పాటు చేశారు.
కాని అది దూరాన పడిపోయింది.
దానివల్ల వచ్చే యిబ్బందులు గుర్తించి నేను మరో బస చూడ్డానికి బయలుదేరాను.
ఒక రిద్దరు వీలులే దన్న తరవాత “సరే, రావచ్చు" నన్నవారు, ఆ డాక్టరుగారు.
నా పేరు చెప్పుకుంటూ బస అడిగా న్నేను.
"పరోక్షంగా మిమ్మ ల్నెరుగుదు" నంటూనే బస యిచ్చారు వారు.
అప్పుడే అన్నారు వారు "రామకృష్ణకవులే రాసి మీ పేరు పెట్టారనే వేంకటశాస్త్రిగారి నమ్మకం మొన్నటిదాకా; కాని తక్కిన మీ రచనలు - ముఖ్యంగా వీరపూజ చూశాక అది మీరే రాసివుంటారని నిశ్చయించుకున్నారు వారు” అని.
నా పుస్తకాల విషయమై వారెంతో, వారి పుస్తకాల విషయమై నేనూ అంతే, స్వతంత్రులం మేము, ఏమనుకోడాని కయినా.
కాగా, - వేంకటశాస్త్రిగారి ఆ నిశ్చయంతో నాకు తరిగేది లేదు, ఈ నిశ్చయంతో వొరిగేదీ లేదు.
పోతే, శృంఖలారచన నా కెంతో మేలుచేసింది.<noinclude><references/>
{{rh|369||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
p4z23kjv64u1mf69f7eozltw85rs98g
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/394
104
203740
554334
530647
2026-04-24T12:44:14Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554334
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అది రచించడంలోనూ, వేంకటశాస్త్రిగారి తృణీకరణం ఖండించడంలోనూ నే నెంతో సాధన చెయ్యవలసివచ్చింది మరి, ఏకాగ్రంగా.
ఆ పునాదిమీద నా సాధనకు మించిన నిర్మాణాలు చెయ్యడానికి తగ్గ శక్తి కలిగింది నాకు.
కాగా, అది రచించినందు కిప్పటికీ నేను కించపడ్డంలే దేకొంచెమున్ను.
{{c|<big><big>58</big></big>}}
శృంఖలాతృణీకరణం చూసి వొకవిధంగా నవ్వుకున్నా న్నేను.
వెంటనే దానిమీద ఖండన రాయడానికిన్నీ పూనుకున్నాను.
నా రచనపేరు "గళహస్తిక.”
మొదట నే నిచ్చిన శీర్షికల్లో ఏయేనెంబర్లకు వేంకటశాస్త్రిగారు జవాబులు రాయలేదో చూపించి "యిందుకేం చెబుతా" రని నిక్కచ్చిచేశాను.
వా రిచ్చిన జవాబుల్లోనూ అనేకా లెంత అసందర్భంగా వున్నాయో సహేతుకంగా నిరూపించాను, తరవాత.
వారి జవాబుల్లో కొన్ని అంగీకరించి, నా పొరపాట్లున్నూ వొప్పుకున్నాను, చివరికి.
ఇక సాపు రాయడమే తరువాయిగా వుండగా, వొకమాటు గురువులకు చూపిద్దామని పిఠాపురం పట్టుకువెళ్ళా నది.
28 అరటావులు - అంటే యెడాపెడా 56 పేజీల గ్రంథం అది.
అచ్చులో 80 పేజీ లవుతుంది, బిగిసి.
గురువు లిద్దరూ కూచున్నారు పరిశీలనకు.
సమయానికి ఆకొండి కామరాజుగారున్నూ వచ్చారు.
రెండుమూడు గంటలసే పదే పనయింది మా కాపూట.
రామకృష్ణశాస్త్రిగారు స్వయంగా చేతబుచ్చుకుని చదివా రది.
"ఒకటి రెండుచోట్ల మీ సమర్థనం చాలదు" అని, "అయినా నే నొకటి చెబుతాను వింటారా?" అనడిగారు చదవడం పూర్తిచేసి.
అది ప్రకటించవ ద్దంటారు వారు, అనుకున్నదే.
“అయినా, సెలవిప్పించండి" అన్నా న్నేను.
అన్నాను - అంతే, నిలువుగా రెండు చీలికలు చేసేశారు వెంటనే వా రది.
చకితుణ్ణయినాను నేను.
"అదేమిటీ?" అంటూ తెల్లపోయారు కామరాజు గారున్నూ.
ఇది చాల దన్నట్టు “భీష్, మంచిపని చేశా" వన్నారు వేంకటరామశాస్త్రిగారు.
"నే నిలా చెయ్యడం కష్టంగానే వుంటుంది మీకు” అంటూ ప్రారంభించా రప్పుడు రామకృష్ణశాస్త్రిగారు, మెల్లిగా.
"గ్రంథకర్తలకు స్వాతంత్ర్యం వొక్కటే కాదు, బాధ్యత వుం దెంతో. 'నిరంకుశాః కవయః' అన్నమాట యెరుగుదును; అయితే, దాని కతివ్యాప్తి పట్టకుండా చూసుకోవాలి కవి అయినవాడు. ఔచిత్యం భంగపడనంతవరకే ఆ నిరంకుశతకు<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 2||370}}</noinclude>
h9rkikjwbt3db9z2qcsomy4xlp1qzvj
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/395
104
203741
554336
530680
2026-04-24T12:47:04Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
554336
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>చెల్లుబడి. మీరు తిరుపతివేంకటకవుల పాణిగృహితా శ్రవణానందమూ విమర్శించారంటే పండితులయినవారి కందరికీ సామాన్యధర్మమే అది. ప్రశంసించేవా రెప్పుడుంటారో విమర్శించేవారూ అప్పుడే వుంటారేదో యెత్తున ఏ గ్రంథానికయినా. గ్రంథకర్త మొదట గుర్తించుకోవలసిన సత్యం యిది. అయితే, కొందరు ప్రశంసించినందుకు పొంగిపోడమూ, మరికొందరు విమర్శించినందుకు కుంగిపోడమా? గ్రంథకర్త గంభీర్యమూ, ఔచిత్యపరిజ్ఞానమూ వెల్లడి అయే సన్నివేశం యిది. తిరుపతివేంకటకవులు వయస్సులో మనకంటే చాలా పెద్దలు. చాలా దేశం తిరిగారు. కిందా మీదా కూడా పడ్డారు. తన్మూలంగా అనుభవమున్నూ యెక్కువగానే సంపాదించుకున్నారు. కనక వారి ప్రవృత్తి మరో విధంగా వుండవలసింది. అలా వుండకపోడంవల్లనే మాకూ మాకూ యీ కలహం. ఇక మీ విమర్శ సంగతి. మీరు వారి రచనల్లో తప్పులు పట్టారు. అవి వొక్క భాషకూ, వ్యాకరణానికీ, ఛందస్సుకీ మాత్రమే సంబంధించినవి కావు. అచ్చంగా కవిత్వానికి సంబంధించినవిన్నీ. మీ విమర్శకు గల విశిష్టత యిది. నిజంగా అవి తప్పులేనా? అహం విడిచి గ్రంథకర్త లాలోచించుకోవలసిన విషయం యిది. తప్పులయితే దిద్దుకోవాలి, మాట్టాడకుండా. కావూ? ఆక్షేపణలు చూసీచూడన ట్టూరుకోడం గ్రంథకర్తలకు పరమధర్మం. గ్రంథకర్తల కుండవలసిన యోగ్యతకు పరమావధి యిది. కాక - కవి తన రచన సమర్థించుకున్నా సమర్థించుకోవచ్చు, అది గాంభీర్యానికి లోటే గాని తప్పుకాదు. మీకూ వారికీ కూడా యిప్పుడిదీ హద్దు. 'మరి, మీరలా చేస్తున్నారా?' అనడక్కండి. మాది కలహం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సంకుల సమరం. స్వత్వానికీ భుక్తానికీ సంబంధించిం దిది. ఆక్రమణకూ ప్రతిఘటనకూ సన్నాహం ఎక్కడ. ఒకవిధంగా మాకూ మాకూ జీవస్మరణసమస్య యిది. విమర్శలతో ప్రారంభం కాలే దిది. విమర్శలతో ఆగదు.
విమర్శలతో ముగియనే ముగియదు. విమర్శ, ఎక్కడ, వొక ఆయుధం, అంతే. మీ సంగతి యిలాంటిది కాదు. అది ఉత్కృష్టమైన వొక కళకు సంబంధించినది. మీరూ మీరూ కూడా చివరి అడుగువేశారు. ఇక ముందుకు వెళ్ళడానికి మీ కుభయులకూ గూడా అధికారం లేదు. మీ ఉభయుల విషయంలోనూ యిక రసికులదే బాధ్యత. మీ ఆక్షేపణలకూ వారి జవాబులకూ విలవకట్టవలసినవారు వారు. వారికయినా, యీ సాధన సామగ్రితో పాణిగృహీతలోనూ శ్రవణానందంలోనూ ఉజ్వలమైన కవిత్వం వుందో లేదో విచారణ చెయ్యడానికే అర్హత. అవి మంచివో చెడ్డవో -
నిలుస్తాయో అంతరిస్తాయో - ఇవి నిర్ణయించే అధికారం కాలానిది. అలాకాక, - మీ హద్దు జవదాటి మళ్లీ మీరు వారి రచన విమర్శిస్తారూ? మీ విమర్శలు వారూ విమర్శిస్తారు పర్యాయత్వేనా, కనక, మొదట విరమించవలసిన పూచీ మీకే వుంది, యెక్కువగా. మీ రిప్పుడే అలా చెయ్యడంలో యెంతో ఔచిత్యమూ వుంది. మీరూ మీరూ కూడా యిది గుర్తించుకోకపోతే లోకగర్హణకు గురి అవుతారు. ఇంతకీ, - వారి సంగతి మా కక్కరలేదు. మాకూ మీకూ దృఢమైన అనుబంధం వుంది. అంచేత, మీకు మాకు నచ్చచెప్పవలసిన విధి వుంది. మీ రయినా మా మాట అంగీకరించారు, కనపడుతూనే వుంది. ఇది ప్రకాశమానమైన వొక గొప్ప ఘట్టం అవుతుంది మీ జీవితానికి."
“సెబాస్, చాలా బాగా చెప్పా” రన్నారు కామరాజుగారు నే నందుకోకముందే.<noinclude><references/>
{{rh|371||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి}}</noinclude>
9a7is03yycmjgmwdbkury05g3yatf91
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/266
104
211547
554338
554321
2026-04-24T14:04:02Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554338
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఉన్నారు. వారి అనుభవాల సారాన్ని లక్ష్మీనారాయణ గ్రహించారు. తమను తాను మలుచుకున్నారు. ప్రతికూలమైన
పరిస్థితుల్లో సైతం బెంబేలు పడిపోయి.. నీరుగారిపోకుండా వాటిని తమకు అనుకూలంగా మలుచుకోగలిగే స్థిరచిత్తం,
సంయమన శీలం లక్ష్మీనారాయణకు ఆ జైలు జీవితం నేర్పింది. జైలు నుంచి తిరిగి వచ్చాక 'లా' పూర్తిచేసి బూర్గుల
వారివద్దనే జూనియర్ లాయర్ చేరారు. బూర్గుల వారి కార్యక్రమాలన్నింటిలోనూ చేదోడువాదోడుగా లక్ష్మీనారాయణ
నిలిచారు. ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో క్రియాశీలక పాత్ర వహించారు.
రాజకీయ ఉద్యమాలో కాక దళిత జనోద్ధరణం, ఖాదీ ప్రచారం, హిందీ వ్యాప్తి లాంటి సమకాలీనమైన సంస్కరణ
కార్యకలాపాలకు స్పందించారు. నిజాం ప్రభుత్వ అజ్జను ఉల్లంఘించి హిందీ పాఠశాలను స్థాపించారు. పోలీసులు
దాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించారు. లక్ష్మీనారాయణ తదనంతర కాలంలో హిందీ ప్రతిష్టాన్ సంస్థకు మేనేజింగ్
ట్రస్టీగా వ్యవహరించడానికి హిందీ మాతృ భాష గానీ, దక్షిణ భారత హిందీ రచయితల సమ్మేళనాలు బెంగుళూరు, చెన్నై, త్రివేండ్రం, గోవా లాంటి నగరాల్లో మనంగా నిర్వహించడానికి బీజాలు పడింది ఇక్కడే. ప్రముఖ
గాంధేయ వాది స్వర్గీయ రామకృష్ణదూత్ 1946లో ఆజన్మాంతం ఖద్దరునే ధరిస్తామని 120 మంది యువకుల
చేత చేయించిన ప్రతిజ్ఞలో లక్ష్మీనారాయణ గారున్నారు. ఆనాటి నుంచి ఖద్దరు ధరించారు.
ఆచార్య ఎన్.జి.రంగా ప్రేరణతో 1945లో లక్ష్మీనారాయణ హైదరాబాద్ యువజన కాంగ్రెస్ను స్థాపించి భాయి రామ్మూర్తి నాయుడిని అధ్యక్షునిగా చేసి తాను ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. దీన్ని బ్రిటిష్, ఆంధ్ర పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఉర్దు పత్రికలు మాత్రం యువకుల్ని చదువుకోనీయకుండా రాజకీయాల్లోకి దించు తున్నారంటూ ఆడిపోసుకుంటే.. ఆంధ్ర పత్రికలు, తెలుగు పత్రికలు ఘనంగా ప్రశంసించాయి. బూర్గుల లాంటి
పెద్దలు వెలిగిస్తున్న చైతన్య జ్యోతి మసకబారిపోకుండా, వారు సత్యాగ్రహాలు నిర్వహించి జైలుకు పోయినప్పుడు స్తబ్ద్బత ఏర్పడకుండా కాటం లక్ష్మీనారాయణ యువజన కాంగ్రెస్ కృషిచేసింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం రాజ్యానికి మాత్రం విముక్తి లభించలేదు. బూర్గుల వారు, కాటం వారు ప్రపంచ నాయకుల దృష్టికి దీనిని తీసుకువచ్చి వారి సహకారాన్ని, సానుభూతిని పొందాలనుకున్నారు. 1947 ఆగస్టు 15 ఇరువురు మద్రాసు (చెన్నై) రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ నేతల నుంచి నైతిక సహకారాన్ని అభ్యర్ధిస్తూ టెలిగ్రాములు ఇచ్చారు. ఇది తెలుసుకున్న నిజాం ప్రభుత్వం హైదరాబాద్ లో కాలుపెట్టిన మరుక్షణం గురుశిమ్మలిద్దరిని అరెస్టు చేసింది.
జైల్లో ఉన్నప్పుడు బూర్గుల కె.వి. రంగారెడ్డి, కాశీనాథుని వైద్య లాంటి నాయకులతో ఏదోరకంగా రాజీపడాలని నిజాం
ప్రభుత్వం ఓ ఎత్తుగడ వేసింది. 22 వేలమంది చావుబతుకులకు తెగించి జైళ్లలో ఉంటే రాజీ ప్రతిపాదనలా..? ఇది ఉద్యమ స్ఫూర్తికే కళంకం అని యువ ప్రతినిధి అయిన కాటం లక్ష్మీనారాయణ లేఖలు రాయడంతో ఆ ప్రతిపాదనకు గండి పడింది. కాటం లక్ష్మీనారాయణ జైల్లో ఉన్నంతకాలం వారి కుటుంబ పోషణ కోసం కె.వి.రంగారెడ్డి నెలకు 15 రూపాయలు ఇచ్చేవారట. కె.వి.రంగారెడ్డి గారికి లక్ష్మీనారాయణ అంటే అంత అభిమానం. కాస్త వయసులో పెద్దవారైన మర్రి చెన్నారెడ్డి గారితోనూ లక్ష్మీనారాయణకు అంతే సాన్నిహిత్యం ఉండేది. మర్రిచెన్నారెడ్డి, లక్ష్మీనారాయణ ఒకే సైకిల్ ఎక్కి హైదరాబాద్లో చక్కర్లు కొట్టేవారట.
1947 మే నెల 11న పెళ్లి చేసుకున్న లక్ష్మీనారాయణ నాలుగు నెలలకే మళ్లీ అరెస్టయ్యారు. ఇలాగ పోలీసుల యాక్షన్ జరిగేదాకా అంటే 1948 సెప్టెంబర్ దాకా జైలుకు వెళ్లడం తిరిగి రావడం, మళ్లీ జైలుకు వెళ్లడం మళ్లీ తెరిగి రావడం అన్నది లక్ష్మీనారాయణ జీవితంలో చాలా మామూలు విషయమైపోయింది. ఆంధ్రప్రదేశ్ అవతరణాంతరం మంత్రి
పదవుల కోసం పాకులాడకుండా ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక రంగాల్లో రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం 1949 డిసెంబర్లో
'జనతా' పేరుతో ఉర్దూలో వారపత్రికను ప్రారంభించారు. 1945-46లలో మందుముల రామచంద్రారావు స్థాపించిన
'రయ్యత్' పత్రికలో పనిచేసిన అనుభవం లక్ష్మీనారాయణకు ఈ సందర్భంలో ఉపకరించింది. రజాకారుల చేతిలో
హతుడైన పోయ 1952లో రాష్ట్ర కర్షక సంఘం స్థాపించారు. ఎస్. బి. చౌహాన్ లాంటి మేటి నాయకులు ఈ సంఘం
కార్యవర్గ సభ్యులుగా ఉండేవారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |245| తేజోమూర్తులు}}</noinclude>
h9d5kbr8jonij9rsisb5br4wgk9782i
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/267
104
211688
554342
551938
2026-04-24T14:17:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554342
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
తెలుగు భూమి అనే మరో పత్రికను 1969లో ప్రారంభించారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ నాటి ఉద్యమ సమయంలో చాలామంది రచయితలు, నాయకుల లాగానే సమైక్యవాదిగా నిలిచారు. ప్రభాకర్ జీ లాంటి సర్వోదయ మండలి ఆచార్యుల ఆశీస్సులతో సర్వోదయ సాహిత్య ప్రచారాన్ని, భూదానోద్యమ కార్యక్రమాలను వ్యాపిం
పజేశారు.ఇప్పటికీ సర్వోదయ మండలి భూదానోద్యమ సంస్థలు తమ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమి లాగా హిందీ అకాడమీ ఉండాలని చెప్పి ప్రభుత్వం చేత ఏర్పాటు చేయించి దానికి
ఉపాధ్యక్షులయ్యారు. హిందీ పుస్తక ప్రచురణలకు ఆర్థిక సాయం, రచయితలకు శిక్షణ శిబిరాలు నిర్వహింపచేశారు.
ఒక దశలో రాష్ట్ర హైకోర్టు 1968లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ఉన్న బడుగు, బలహీన వర్గాల నాయకులందరినీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చి... ఒక కార్యవర్గాన్ని ఏర్పరచి దానికి
కాటం లక్ష్మీనారాయణ కన్వీనర్ అయి సుప్రీంకోర్టుకు వెల్లి హైకోర్టు తీర్పు రద్దుచేయించారు. ఈ సందర్భంలోనే లక్షలాది మంది వెనుకబడిన కులాలను సమీకరించి ఒక మహాసభ నిర్వహించారు. దానికి సాక్షాత్తు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వచ్చారు. కాటం వారు సాధించిన ఘన విజయాల్లో ఇది ఒకటి.
దేశ స్వాతంత్య్రొద్యమంలో అన్నివిధాల త్యాగాలు చేసిన దేశభక్తులకు వరం లాంటిది స్వాతంత్య్ర సమరయోధుల
పెన్షన్ పథకం. ఈ పథకాన్ని హైదరాబాద్ వారికీ వర్తింపజేయాలని కేంద్రప్రభుత్వంతో లక్ష్మీనారాయణ గారు చర్చలు జరిపారు. మొదట కేంద్రప్రభుత్వం అంగీకరించ లేదు. మరుసటి రోజు కాటం లక్ష్మీనారాయణ తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుని సత్యాగ్రహం అనే అట్టను మెడకు తగిలించుకుని ప్రధాని నివాసం ముందు నిరాహారదీక్ష చేశారు. ఢిల్లీ పత్రికలు దీన్ని ప్రముఖంగా ప్రచురించాయి. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ లక్ష్మీనారాయణను పిలిపించుకుని ఏమిటి సంగతి అని వివరాలు అడిగారు.
సంస్థానాల్లోని స్వాతంత్య్ర సమరయోధులను మీరు గుర్తించకపోవడం కన్నా మాకు అవమానం ఏమున్నది..? బ్రిటిష్ ఆంధ్ర నాయకులు ఒక బ్రిటిష్ వారిమీదనే పోరాడారు. కానీ సంస్థానాల వారు అటు సంస్థానాధి పతులకు వ్యతిరేకం గాను, ఇటు బ్రిటిష్ వారికి వ్యతిరేకం గానూ పోరాడారు. 15 ఆగస్టు మాకు స్వాతంత్య్ర దినం వచ్చినట్టు కాదా ! హైదరాబాద్ విముక్తి జరిగిన సెప్టెంబర్ 17ను స్వాతంత్య్ర దినంగా జరుపుకోమంటారా ? ఒక్క హైదరాబాద్ సంస్థాన ప్రజలే కాదు... అసలు సంస్థానాల ప్రజలు భారతీయులు అవునా.. కాదా... ప్రకటించండి అని సూటిగా, ధైర్యంగా కాటం లక్ష్మీనారాయణ ఇందిరాగాంధీని ప్రశ్నించారు. దీంతో 22 వేలమంది స్థానిక స్వాతంత్య్ర సమరయోధులకు పెన్షన్ సౌకర్యం లభించింది.
లక్ష్మీనారాయణ గారు చేసిన మహత్తర కృషి హైదరాబాద్ స్వాతంత్య్ర చరిత్రను ప్రామాణిక పద్ధతిలో గ్రంథస్తం చేయించే కృషిచేపట్టారు. ఆ ప్రమాణికలో వచ్చిందే వెల్దుర్తి మాణిక్యాల రావు గారి 844 పేజీల హైదరాబాద్ స్వాతంత్య్ర సమర చరిత్ర. ఇది ఇప్పటికీ ప్రామాణిక గ్రంథం. చాలా పెద్దఎత్తున సభలను ఒక్కచేతి మీదుగా నిర్వహించడం
లక్ష్మీనారాయణ గారి గొప్పతనాల్లో ఒకటి. హైదరాబాద్ స్వాతంత్య్రొద్యమ చరిత్రను హైదరాబాద్లో అప్పటి రాష్ట్రపతి
జైల్ సింగ్ చేత ఆవిష్కరింపజేశారు. కాటం లక్ష్మీనారాయణ గారి కుమారులు ప్రముఖ లాయర్ కాటం రమేష్ రాసిన
ఆంధ్రదేశ స్వాతంత్య్ర చరిత్రను 1992 భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్లో ఆవిష్కరింప జేశారు.
పి.వి.నరసింహారావు, టి. అంజయ్య, కాసు బ్రహ్మానంద రెడ్డి, భవనం వెంకట్రావు నలుగురు ముఖ్యమంత్రులతో ఒక
పెద్ద సభ నిర్వహించారు. కాటం లక్ష్మీనారాయణ నిర్వహించిన సభల్లో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, పీఠాధిపతులు, స్వాతంత్య్ర సమర యోధులు, దలైలామా లాంటి వారి ఎందరో పాల్గొనేవారు.
తన కోసం వీసమాత్రమైనా అడగకపోవడం, సర్వజన శ్రేయస్సు కోసం, విలువల కోసం ఎంతటి వారినైనా
నిర్మొహమాటంగా విమర్శించడానికి వెనుకంజ వేయక పోవడం కాటం లక్ష్మీనారాయణ గారి వ్యక్తిత్వంలోని ప్రధాన
గుణం. 86 ఏళ్ల పరిపూర్ణ జీవితం గడిపి 25 ఫిబ్రవరి, 2010న అస్తమించారు. అలాంటి వారిని స్మరించుకోవడం
స్ఫూర్తిదాయకం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |246| తేజోమూర్తులు}}</noinclude>
omg4mzftm2o5gv63puj9wsm7fvcsvhn
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/268
104
211689
554344
551939
2026-04-24T14:29:15Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554344
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''70. కేశనకుర్తి వీరభద్రాచారి '''</p>}}
{{right|-కందాళై రాఘవాచార్య}}
కీ.శే. కేశనకుర్తి వీరభద్రాచారి అనగానే నిజామాబాద్లో అన్ని కళల కేంద్రబిందువు అని ప్రతివారూ స్మరించాల్సిందే! ఆరడుగుల మనిషి - నల్లని కోటు టై - పొడుగాటి పాతకాలం హీరోలు గుర్తుకు వచ్చే ప్యాంటు నడిమ పాపిట, పొడుగాటి వెంట్రుకలు. చేతిలో ఐదారు పుస్తకాలు! టకటక బూట్లు చప్పుడు వరండాలో! అదిగో చారి సార్ వస్తున్నారు! కాలేజీ విద్యార్థులంతా ఆంగ్ల పాఠం కోసం ఎదురు చూస్తున్న క్షణానికి శుభ సూచకం ఆయన ఆగమనం. గిరిరాజ కాలేజీలో వృత్తిరీత్యా ఆంగ్లోపన్యాసకుడిగా ఉన్నా ఆయన ప్రవృత్తి రీత్యా తెలుగునాట ప్రసిద్ధిపొందారు.
ఎక్కడో భీమవరంలో నివసించి ఉద్యోగరీత్య ఇందూరుకు వచ్చి ఈ జిల్లాను సకళ కళామయంగా పూర్ణ చంద్రుడి వెన్నెల వేదికగా తీర్చిదిద్దారు చారి సార్ !
ఉషశ్రీ - వీరభద్రాచారిగారు కలిసి రాసిన వేంకటేశ్వర కళ్యాణం అప్పటి కళాశాల విద్యార్థులకు తెలుగు ఉపవాచక
మైంది. వేదికపై నాటకమైంది. ఇలాంటి సకళ కళల సమాహారమైన కేశనకుర్తి వీరభద్రాచారిసార్ 14-05-1927
శ్రీకాకుళం జిల్లా కొర్ని'లో కేశనకుర్తి అప్పారావు, వరహాలమ్మ దంపతులకు జన్మించారు. మాతో అప్పుడప్పుడు చెప్పేవారు- 12వ యేటనే అనేక నాటికలు రాసి వేసేవాళ్ళమని! అవి రాతప్రతులే ఐనాయిగాని అచ్చు ప్రతులు కాలేదని చింతించేవారు. 1969 సంక్రాంతి 14న నిజామాబాద్లో గొప్ప కవుల వేదిక అవతరించింది. ఈ మకర సంక్రాంతి
శుభవేళ ఇందూరులో సాహితీ వికాసం! సరికొత్త ఉదయం! దీనికి వేసింది కేశనకుర్తి వీరభద్రాచారిగారే! ఈ సంస్థ పేరే 'ఇందూరు భారతి రచయితల సమాఖ్య'-
వీరికి చేదోడు వాదోడుగా సైబ పరంధాములు, ఆపుకారి సూర్యప్రకాశ్, బద్దూరి మొదలగు యువకిశోరాలు చారిగారిని అనుసరించారు.
ఆయనకు ఆలోచన రావడం మేమందరం అమలుపరచడం జరిగిపోయేవి!
ఇందూరు భారతి ఆవిర్భావం తరువాత అనేకులు కలం పట్టి కవులైనారు కవయిత్రులైనారు! గొప్పవాళ్ళను ఆహ్వానించి వారితో ప్రసంగాలు ఇప్పించి యువకులకు ప్రేరణ అందేలా చారి సార్ ప్రణాళిక రచించేవారు.
దాశరథి కృష్ణమాచార్య, బెజవాడ గోపాలరెడ్డి దేవులపల్లి రామానుజారావు, జగ్గయ్య, నండూరి రామకృష్ణ మాచార్య, నార్ల చిరంజీవి, వానమామలై వరదాచార్యులు, సి.నా.రె. ఇలాంటి పెద్దలను ఆహ్వానించి ఇందూరు భారతిని
సుప్రసిద్ధం చేశారు.
కవిత్వమే కాకుండా గానం నాట్యం కోసం 'సరస్వతీ గానసభను ప్రారంభించారు. అనేకమంది అమ్మాయిలు<noinclude><references/>
{{rh|తెలంగాణ |247| తేజోమూర్తులు}}</noinclude>
ck2e5548l4s6vs2ei6tu2b2kcepspc0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/269
104
211690
554345
551940
2026-04-24T14:41:21Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554345
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఇంటింటా నాట్య సరస్వతులు, గాన కోకిలలూ ఐనారు. సాయంత్రం బాలవిహార్ పిల్లలతో సందడి సందడిగా ఉండేది.
విడివిడిగా అనేక నాటిక సంస్థలు ఎవరికివారే అన్నట్లుగా ఉండేవారు. వీరభద్రాచారి గారి సలహాల మేరకు అన్ని నాటక సంస్థలు ఒకటై 'నగరనట సమాఖ్యగా ఒక్కటైనారు. ఈ సమాఖ్య నేపథ్యంలో చారి సార్ విశాల హృదయం ప్రగతి ఆలోచనలే కారణం.
ఈ సంస్థ ద్వారా అనేక నాటకాల పోటీలు నిర్వహింప జేసి - గొప్ప నటులను ఆహ్వానించి ఇందూరు పేరు తెలుగు
నాట సుప్రసిద్ధం చేశారు.
గానసభ ద్వారా శోభానాయుడు నరసింహాచారి, వసంత, ఈమని శంకరశాస్త్రి చిట్టిబాబు పర్విన్ సుల్తానా వంటి సుప్రసిద్ధులను ఆహ్వానించి నిజామాబాదున్ను రాయల యుగంగా మార్చారు.
సాహితీ కళాసంస్థలలోనే కాకుండా సేవాసంస్థలైన Lions, Lio మొదలైన క్లబ్బుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహింపజేసేవారు. యువకులందరికి ఆంగ్లం ఎలా మాట్లాడాలో శిక్షణ సైతం ఇచ్చేవారు.
వేదికపై వ్యాఖ్యానం ఎలా చేయాలో, కవిత్వం ఎలా చదవాలో, వేదిక మంగళాచరణ గీతం నుండి వందన సమర్పణ వరకు పెట్టి మెలుకువలు ఉపయోగించాలో ఇవన్నీ యువతకు నేర్పించి గొప్ప కవులుగా నటులుగా గాయకులుగా తీర్చిదిద్దారు.
అప్పటి సాహిత్య అకాడమిలో దాదాపు తన జీవిత కాలము సభ్యుడిగా ఉండి నిజామాబాద్కు ఎనలేని సాహిత్య
సాంస్కృతిక సేవలనందించారు.
తాను ఎన్నో కవితలు పద్యాలు రాసినా అవి అచ్చుకు నోచుకోలేదని, అలాంటి స్థితి యువతకు ఉండకూడదని
ఇందూరు భారతి ద్వారా వెలుగులోకి, నగ్న చిత్రాలు, ప్రతి సంవత్సర సావనీర్లను ప్రింటు చేయించారు.
24 గంటలలో దాదాపు అర్ధరాత్రి దాటేవరకు బిజీగా ఉండేవారు. మళ్లీ ఉదయమే ఇంగ్లీషు ట్యూషన్స్ చెప్పేవారు.
అప్పుడప్పుడు కవిత్వం సామాన్య జనానికి అందాలని రాత్రిపూట గ్రామాల్లో కవిసమ్మేళనం నిర్వహించేవారు. కంజర్ల బోర్గాం ముబారక్ నగర్, మొదలైన గ్రామాల్లో అందరూ భోంచేసి వచ్చిన తరువాత కవిత్వం వేదిక ప్రారంభమయేది. అందరు కవులు సామాన్య జనానికి అర్థమయేలా ఉన్నా కవిత్వాన్ని అందించేవారు. ఈ కవి సమ్మేళనం దాదాపు అర్ధరాత్రి దాటిపోయేది. ఇలాంటి స్ఫూర్తి కలిగించింది చారి సారే.
అంతేగాక పున్నమి వెన్నెల రాత్రుల్లో ఊరి బయట చెరువుకట్ల మీద కవి సమ్మేళనం నిర్వహింపజేసేవారు. బొడ్డెము, చెరువు మంచిప్ప చెరువు, అలీసాగర్ మొదలైన చెరువుల వద్దకు పెట్రోమాక్స్ వెళ్లేవాళ్ళం. దాదాపు 10 గంటల రాత్రి గడిచిపోయేది. కవితా విభావరులు ఇలా అనేకమంది యువకవుల్లో ప్రేరణగా నిల్చిపోయాయి.
చర్చలు, సమావేశాలు, గృహ సమావేశాలు, కవుల సంకలనాలపై ఉపన్యాసాలు, క్లుప్త గోష్టులు, కవితాపోటీలు,
అనేకమందికి అవార్డులు, పండుగ పూట కవిత్వం వేడుకలు. ఇలా భోజరాజు కాలంలో సాగినట్లే కేశనకుర్తి వీరభద్రాచారి గారి మార్గదర్శకత్వంలో ఇందూరు భారతి సాహితీ శిఖరంగా ఎదిగింది.
1985లో ఆంగ్లోపన్యాసకులుగా పదవీ విరమణ గావించినా ఏనాడు అలసిపోని కళాతపస్విగా తమ సేవలను అందిస్తూ వచ్చారు.
నిరంతర సేవలు అందించడం ఎప్పుడు విరామమెరుగని ట్యూషన్లు మొదలైన వాటివలన కేశవకుర్తి వీరభద్రాచారిగారికి శ్వాసకోశాల ఇబ్బంది తలెత్తింది. చికిత్స నిమిత్తం చెన్నైలోని విజయా హాస్పిటల్కు వెళుతున్నప్పుడు అందరం చారిగారికి ధైర్యం చెపుతూ పసిపిల్లాడిలా వీడ్కోలు చెప్పాం! కానీ చారి సార్ అనారోగ్యం తీవ్రతై అక్కడే 04-06-1986 నాడు కళాకీర్తిశేషులైనారు.
నిజామాబాదులో వారు పరమపదించి ఉంటే కొన్ని కిలోమీటర్ల పర్యంతరం కళాభిమానులు చారి సార్ కు వీడ్కోలు
పలికేవారు. అంత్యక్రియలూ సన్మానప్రాయంగా జరిగేవి. కానీ చెన్నైలో కాలధర్మం చెందటంతో వారిని ఇక్కడికి రప్పించే అవకాశం రాలేదు. మా అందరికీ కడచూపుకూడా కరవైంది.
నిజామాబాదును ఇలా సర్వతోకళావేదికగా తీర్చిదిద్దిన<noinclude><references/>
{{rh|తెలంగాణ |248| తేజోమూర్తులు}}</noinclude>
1zz15fjngd769i6jl9to2ep25zayjop
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/270
104
211718
554346
552089
2026-04-24T14:48:34Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554346
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఆ మహామనీషికి అశ్రు అంజలి మాత్రమే ఘటించగలిగారు. కళాభిమానులు.
వారు వెళ్లిపోయాకా వారి కవితలు అచ్చుకాకుండా ఉండిపోయినై. మేమంతా వాటిని వారి కుటుంబ సభ్యుల సహకారంతో పెట్టెలు, పుస్తకాలు, ఫైల్లు పాత పత్రికలు అన్నీ అన్వేషించి వారి కవితలను పరిష్కరించి 'కొత్తదారి'
పేరిట సంకలనాన్ని రూపొందించాం.
దీనికై ముందు మాట దాశరథి కృష్ణమాచార్యులవారు కంటతడిపెడుతూ రాశారు. దాశరథి వారికి చారిసారు కు
ఉన్న అనుబంధం చాలా గొప్పది. నిజామాబాద్ అన్నా - చారిసార్ అన్నా, ఇందూరు భారతి కవులన్నా దాశరథిగారికి
ఎనలేని ఆత్మీయ స్పర్శ.
సంకలనం చారిగారి ప్రెస్ ఐన 'శ్రీ' ప్రింటర్స్లోనే అచ్చెంది. ఈ ఆవిష్కరణ వేడుకకు కీ.శే. రావూరి భరద్వాజా
విచ్చేసి అనేక గాద్దదిక మాటల మధ్య చారిసార్ ను స్మరించుకునేలా చేశారు.
ఆవిష్కరణ సభకు కేశసకుర్తి వీరభద్రాచారిగారు స్థాపింపజేసిన అనేక కళానాటక నాట్య సంస్థలు విచ్చేసి వారి
స్మృతిగా ‘కొత్తదారి' వేసుకున్నారు.
ఈనాటికి గిరిరాజ కాలేజీ భవనాన్ని చూసినా, కొండెంగ హనుమాన్ వారున్న పాత ఇల్లు చూసినా, పెద్దబజార్ రోడ్ చూసినా, మణిక్ భవన్ కళావేదిక చూసినా కేశనకుర్తి వీరభద్రచారిగారే జ్ఞాపకం వస్తారు.
ఈనాడు లబ్ధప్రతిష్ఠులైన అనేక కవులు, నటులు, గాయకులు ప్రతిరోజూ ఏదో సందర్భంలో వారి పేరును నాల్కపైకి తెచ్చుకొని స్మరించకుండా ఉండలేరు.
ఎక్కడో భీమవరంలో స్థిరమైనా ఇక్కడ ఇందూరుకు వచ్చి కళాక్షేత్రంగా రూపొందించిన కేశనకుర్తి వీరభద్రాచారిగారు శరీరంతో లేకున్నా - వారి సాహితీ కళా అత్మ మా ఎదురుగా ఉన్నట్టేగా భావిస్తుంటాం.
ఈ రోజు ఇందూరు భారతి ద్వారా మేము నిరంతర సేవలందిస్త్నుమాటే వారి స్పూర్తి మాకు కవిత జీవకళ..
నిజామాబాద్ సాహితీ కళాచరిత్రలో వారి పేరు అనేక గ్రంథాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది.
కళాకారుడికి మరణం నిజంగా లేదని ఇందరి అభిమానమే నేటికి ఋజువు చేస్తోంది. ఇందూరు కళలకు వేసింది కమలాల పూలదారి. వీరు రాసింది సరికొత్త 'కొత్తదారి'. మాలో నిలిచి ఉండే కారణున్యులు కేశనకుర్తి
వీరభద్రాచారి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |249| తేజోమూర్తులు}}</noinclude>
8qu1c1ns3vt02a7ioddorvmmkuowl17
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/271
104
211719
554352
552090
2026-04-24T14:57:53Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554352
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''71. కేవల్ కిషన్ '''</p>}}
{{right|- డా॥ బెల్లంకొండ సంపత్ కుమార్}}
తెలంగాణ సమాజం స్థానిక పరిమళాలను రచించుకుంటున్నది. ఆగమైన తన ఘనచరిత్రను చిత్రిక కడుతున్నది. అనామకంగా, వెలుగు చూడని ఎందరో వైతాళికులను, వీరులను, యోధులను, సాహితీ ఆణిముత్యాలను స్మరించుకుంటుంది. అలాంటి దారిదీపాలలో కేవల్ కిషన్ చిరస్మరణీయుడు. ఆయన లేకపోయినా ప్రజల గుండెలలో గుడికట్టుకున్నాడు. ఆయన మరణించిన చోట సమాధివద్ద ప్రజలు జాతర చేస్తారు. జాతరలో బండ్లు తిరుగుతాయి. దేవుని బిళ్ళలవలే, ఫోటోల వలె, లాకెట్లవలె కేవల్ కిషన్ చిత్రం గల బిళ్ళలు, ఫోటోలు, రాకెట్లు జాతరలో
లాభాపేక్ష లేకుండా అమ్ముతారు. ఎందరో తమ పిల్లలకు కిషన్ అని పేర్లు పెట్టుకున్నారంటే ఆయన సేవలు ఎంతటివో అర్థం చేసుకోవచ్చు.
కేవల్ కిషన్ 1922 మే నెల ఏడోతేదీన జన్మించాడు. వారిది మెదక్ జిల్లా, మాందాపురం అనే గ్రామం. తల్లిపేరు
మున్నాబాయి. తండ్రి నారాయణ. ఆనాటికే వారిది చదువుకున్న కుటుంబం. తండ్రి పట్వారీగా పనిచేసేవాడు.
ఆయన తెలుగు, ఉర్దూ, అరబ్బీ, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో మంచి విద్యామణి. తమ పిల్లలను బాగా చదివించి
ఉన్నతస్థాయి ఉద్యోగాలలో చూడాలన్నది వారి కోరిక,
కేవల్ కిషన్ శెట్టిపల్లి, మాందాపురంలో అక్షరాలు అభ్యసించినా ఉన్నత విద్య మెదక్ లో సాగింది. తాను
చదువుకుంటున్న రోజులలోనే తోటి పిల్లల బీదరికం గురించి ఆలోచించేవాడు. బాల్యంలో కేవల్ కిషన్ను బాగా
ప్రభావితపర్చిన ఊరు టేక్మాల్, అది కేవల్ కిషన్ అమ్మమ్మగారి గ్రామం కావడం వలన సెలవు రోజులు టేక్మాల్ లో గడిపేవాడు.
ఈ గ్రామంలో నివసించే ఉప్పు చంద్రయ్య, టేక్మాల్ రంగారావు, వెంకటేశ్వరరావు, చయనుల సదాశివ శర్మ,
సింగరాయకొండ పురుషోత్తమాచార్యులు, రావికోటి రఘురామశర్మ మొదలైన సాహిత్య, స్వాతంత్య్ర సమరయోధుల గురించి కథలు కథలుగా విన్నాడు. ఇరవై ఐదుమందితో ఏకకాలంలో పోరాడనేర్పుగల దొడ్ల నారాయణ గురించి తెలుసుకొని ప్రేరణ పొందాడు. టేక్మాల్లోని దర్గా షరీఫ్ నేపథ్యం, మత సామరస్యం పరస్పరం ఆప్యాయంగా
పిల్చుకోవడం కేవల్ కిషన్ ను ముగ్ధుడిని చేసిన వాస్తవాలు.
కేవల్ కిషన్ మెదక్ లో విద్యనభ్యసిస్తున్న కాలంలో తోటివారిని తీసుకొని కొలిగడ్డకు పోయి వ్యాయామం చేసేవాడు. టేక్మాల్ గ్రామంలోని ప్రముఖుల విషయాలను చర్చించేవాడు. ఆ విధంగా ఆయనలో నాయకత్వ లక్షణాలు ఏర్పడ్డాయి. పాఠశాల దశనుండే సామాజిక స్పృహ గల నాటకాలు వేశాడు. చరిత్రపట్ల నిశితమైన దృష్టి గలవాడు.
రాజు, మంత్రులు, భటుల వేషాలు వేశాడు. పౌరాణిక నాటకాలలో పాండవ వనవాసం, పాదుకా పట్టాభిషేకం<noinclude><references/>
{{rh|తెలంగాణ |250| తేజోమూర్తులు}}</noinclude>
phw3g33hv0kovwjxc290vrlvkr7z41q
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/272
104
211720
554356
552091
2026-04-24T15:06:50Z
A.Murali
3019
554356
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
వంటి నాటకాలలో కేవల్ కిషన్ పాత్రధారి కావడం వలన తెలుగు భాషమీద ఆయనకు పట్టు కలిగింది.
అమ్మ మున్నాబాయి తీరికవేళలో కథలు చెప్పేది. ఆ కథాంశాన్ని నిజంగా జరుగుతున్నట్టు ఊహిస్తూ, సమాజ
పరిస్థితులకు పోల్చి చూసేవాడు. కథలోని కౄర పాత్రల గురించి ముచ్చటించేవాడు. అంతే సహజంగా యెట్టిచాకిరీని
వ్యతిరేకించాడు ఆ దురాచారాన్ని పోషిస్తున్న సంపన్నులను నిరసించి ఆగ్రహానికి గురయ్యేవాడు. ఎనిమిదో తరగతిలోనే ఆయన విద్యార్థి ఉద్యమాలపట్ల ఆకర్షితుడయ్యాడు.
కేవల్కిషన్ పాఠశాల జీవితం నుండే తబలా, హార్మోనియం వాద్యాలపట్ల ఆకర్షితుడైనాడు. భజన సంఘాలతో తిరిగి తబల హార్మోనియం నేర్చుకున్నాడు. అ దశలోనే ఈ ఆసక్తి ప్రజలతో మమేకం కావడానికి ఉపయోగపడింది. హైస్కూలు విద్యా దశలోనే ఆయనకు సాంబమూర్తితో పరిచయం ఏర్పడింది. ఆయన కేవలేషన్కు స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. సాంబకిషన్ ఆశ్చర్యపడేవాడు. ఆయనే కేవల్టిషన్కు రాజకీయ గురువై మార్గదర్శనం చేశాడు. మెదక్ లొ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కళాశాల విద్యకోసం హైదరాబాదు సిటి కాలేజికి చేరుకోవడం ఆయన జీవితంలో ఒక మలుపు ఉర్దూ మీడియంలో విద్య అభ్యసించడం వలన పాలనకు సంబంధించిన విషయాలను బాగా అవగాహన పొందాడు. రాజకీయచైతన్యం పొందాడు.
ఆనాడు నిజాం ఏలుబడిలో చిన్న చిన్న ఫ్యూడల్ ఎస్టేట్లు ఉండేవి. వాటిని సర్ఫేఖాస్, జాగిర్లు, సంస్థానాలు,
పాయగాలు, మక్తాలుగా పిలిచేవారు. అలాగే ఖల్సా ప్రాంతాలు ఉండేవి. ఈ నాటికీ మఖా, ఖల్సా పేర్లు కొన్నిచోట్ల
వాడుకలో ఉన్నాయి. ఖల్సా అంటే రైతులలో అంతరాలులేని ప్రాంతం. స్వేచ్ఛా ప్రాంతం. విముక్తి అయిన ప్రాంతమని అర్ధం. అయినా ఇక్కడ ఫ్యూడల్, దోపిడి, నిరంకుశత్వం కొనసాగేది. పన్నుల భారంతో విపరీతమైన కౌలు దోపిడితో, వెట్టి, తిట్లు, అవమానాలతో ఈ ప్రాంతాలు దుర్భరంగా ఉండేవి. ఈ విధానంపట్ల కేవల్కిషన్ విముఖుడు. సిటి కాలేజిలో ఇంటర్మీడియట్ స్థాయి విద్యాదశలోనే ఆయనలో రాజకీయ చైతన్యం ఉరకలు వేసింది. ఆనాడు నిజాం సర్కార్లో గ్రామ్ సుధారక్ సంఘాలకు నామమాత్ర ఎన్నికలు జరిగేవి. అవి సర్కారుకు అనుకూలంగా నడిచేవి. పటేల్, పర్వూరి, పోలీస్ ల చేతిలో ఊర్లు నలిగిపోయేవి. ఆ గ్రామీణ జీవన చిత్రణను కళ్ళారా చూసిన కేవలి కిషన్ భూస్వాముల, అధికారుల నిరంకుశత్వంపట్ల చైతన్యం కలిగించడానికి తోటి విద్యార్థి మిత్రులతో కలిసి హైదరాబాద్లో 'విద్యార్థి యువజన సంఘం' స్థాపించాడు.
కేవల్కిషన్ 1939లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ. కోర్సులో చేరాడు. అక్కడ పలువురి మేధావులతో పరిచయాలు ఆయనలో మార్పు తెచ్చాయి. కామ్రేడ్ అసోసియేషన్తో కలిసి పనిచేశాడు. నాగపూర్ కమ్యూనిస్టులతో కలిసి హైదరాబాద్ విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. కామ్రేడ్స్ అసోసియేషన్ను పోలిన ఒక సంఘం మెదక్
పట్టణంలో అవసరమని వివిధ సంఘాల వాని కలిపి ఒకే సంఘం ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో ఆ సంఘం
మెదక్ కమ్యూనిస్టు సమితిగా మారింది. అందులోని సభ్యులకు కేవల్ కిషన్ ఆదర్శప్రాయుడు, మెదట్లో పలు
సమావేశాలు నిర్వహిస్తూ మగ్దూం మొయి నుద్దీన్, జవాద్ రజ్వి, ఓంకార్ ప్రసాద్లోంటి మేధావులను ఆహ్వానించాడు.
ఈ క్రమంలో రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి, డా. ఎం. ఎస్. జయసూర్య రాజేశ్వరరావు, గురువారెడ్డి వంటి
ప్రముఖుల పరిచయాలు కేవల్కిషన్లోని పోరాట వెలుగు జాడలను దేదీప్యమానం చేశాయి.
ఆంధ్ర మహాసభలు ఇచ్చిన స్ఫూర్తి, గ్రంథాలయాలు,
గ్రంథమాల, పత్రికలు, సంఘాలు, సభలు అప్పటి యువతనం
ముందడుగు వేయడానికి దోహదమయ్యాయి. కేవలి కిషన్
పరసశీలి. తను చదివిన పుస్తకాలు, పత్రికలలోని
విషయాలను తోటివారితో ప్రజలతో చర్చించేవాడు. మెదక్,
హైదరాబాదు ఆయన ఉద్యమ కేంద్రాలు. ఆంధ్ర మహా
సభలలో చరుకుగా పాల్గొన్నాడు. రెడ్డి హాస్టల్, ఉస్మానియా
విశ్వవిద్యాలయం, సిటికాలేజి కేంద్రాలుగా విద్యార్థుల
కార్యక్రమాలలో ముందుండేవాడు. నిద్రాహారాలు తెలువ
కుండా పనిచేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటికే
సిటీ కాలేజీలో లెక్చరర్గా ఉన్న మగ్దూం మొయినుద్దీన్
సాయుధ పోరాటానికి మద్దతు పల్కడం వలన కేవలి
కిషన్
ప్రభావితుడైనాడు. ఉద్యమం వార్తలను ప్రచురించే గోలకొండ,
మీజాన్ పత్రికలు చదివేవాడు. కోఠీ ప్రాంతంలో ఈ పత్రికలు
కల్గి ఉన్నందుకు దుండగులు కొట్టి పత్రికలు కాల్చేసిన
య తెలంగాణ (251 తేజోమూర్తులు<noinclude><references/>
{{rh|తెలంగాణ |251| తేజోమూర్తులు}}</noinclude>
ibzsxingp6c0e7a7y7kkej5h5igehtv
554382
554356
2026-04-25T04:40:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554382
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
వంటి నాటకాలలో కేవల్ కిషన్ పాత్రధారి కావడం వలన తెలుగు భాషమీద ఆయనకు పట్టు కలిగింది.
అమ్మ మున్నాబాయి తీరికవేళలో కథలు చెప్పేది. ఆ కథాంశాన్ని నిజంగా జరుగుతున్నట్టు ఊహిస్తూ, సమాజ
పరిస్థితులకు పోల్చి చూసేవాడు. కథలోని కౄర పాత్రల గురించి ముచ్చటించేవాడు. అంతే సహజంగా యెట్టిచాకిరీని
వ్యతిరేకించాడు ఆ దురాచారాన్ని పోషిస్తున్న సంపన్నులను నిరసించి ఆగ్రహానికి గురయ్యేవాడు. ఎనిమిదో తరగతిలోనే ఆయన విద్యార్థి ఉద్యమాలపట్ల ఆకర్షితుడయ్యాడు.
కేవల్కిషన్ పాఠశాల జీవితం నుండే తబలా, హార్మోనియం వాద్యాలపట్ల ఆకర్షితుడైనాడు. భజన సంఘాలతో తిరిగి తబల హార్మోనియం నేర్చుకున్నాడు. అ దశలోనే ఈ ఆసక్తి ప్రజలతో మమేకం కావడానికి ఉపయోగపడింది. హైస్కూలు విద్యా దశలోనే ఆయనకు సాంబమూర్తితో పరిచయం ఏర్పడింది. ఆయన కేవలేషన్కు స్ఫూర్తి ప్రదాత అయ్యాడు. సాంబకిషన్ ఆశ్చర్యపడేవాడు. ఆయనే కేవల్టిషన్కు రాజకీయ గురువై మార్గదర్శనం చేశాడు. మెదక్ లొ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కళాశాల విద్యకోసం హైదరాబాదు సిటి కాలేజికి చేరుకోవడం ఆయన జీవితంలో ఒక మలుపు ఉర్దూ మీడియంలో విద్య అభ్యసించడం వలన పాలనకు సంబంధించిన విషయాలను బాగా అవగాహన పొందాడు. రాజకీయచైతన్యం పొందాడు.
ఆనాడు నిజాం ఏలుబడిలో చిన్న చిన్న ఫ్యూడల్ ఎస్టేట్లు ఉండేవి. వాటిని సర్ఫేఖాస్, జాగిర్లు, సంస్థానాలు,
పాయగాలు, మక్తాలుగా పిలిచేవారు. అలాగే ఖల్సా ప్రాంతాలు ఉండేవి. ఈ నాటికీ మఖా, ఖల్సా పేర్లు కొన్నిచోట్ల
వాడుకలో ఉన్నాయి. ఖల్సా అంటే రైతులలో అంతరాలులేని ప్రాంతం. స్వేచ్ఛా ప్రాంతం. విముక్తి అయిన ప్రాంతమని అర్ధం. అయినా ఇక్కడ ఫ్యూడల్, దోపిడి, నిరంకుశత్వం కొనసాగేది. పన్నుల భారంతో విపరీతమైన కౌలు దోపిడితో, వెట్టి, తిట్లు, అవమానాలతో ఈ ప్రాంతాలు దుర్భరంగా ఉండేవి. ఈ విధానంపట్ల కేవల్కిషన్ విముఖుడు. సిటి కాలేజిలో ఇంటర్మీడియట్ స్థాయి విద్యాదశలోనే ఆయనలో రాజకీయ చైతన్యం ఉరకలు వేసింది. ఆనాడు నిజాం సర్కార్లో గ్రామ్ సుధారక్ సంఘాలకు నామమాత్ర ఎన్నికలు జరిగేవి. అవి సర్కారుకు అనుకూలంగా నడిచేవి. పటేల్, పర్వూరి, పోలీస్ ల చేతిలో ఊర్లు నలిగిపోయేవి. ఆ గ్రామీణ జీవన చిత్రణను కళ్ళారా చూసిన కేవలి కిషన్ భూస్వాముల, అధికారుల నిరంకుశత్వంపట్ల చైతన్యం కలిగించడానికి తోటి విద్యార్థి మిత్రులతో కలిసి హైదరాబాద్లో 'విద్యార్థి యువజన సంఘం' స్థాపించాడు.
కేవల్కిషన్ 1939లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ. కోర్సులో చేరాడు. అక్కడ పలువురి మేధావులతో పరిచయాలు ఆయనలో మార్పు తెచ్చాయి. కామ్రేడ్ అసోసియేషన్తో కలిసి పనిచేశాడు. నాగపూర్ కమ్యూనిస్టులతో కలిసి హైదరాబాద్ విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటు చేశాడు. కామ్రేడ్స్ అసోసియేషన్ను పోలిన ఒక సంఘం మెదక్
పట్టణంలో అవసరమని వివిధ సంఘాల వాని కలిపి ఒకే సంఘం ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో ఆ సంఘం
మెదక్ కమ్యూనిస్టు సమితిగా మారింది. అందులోని సభ్యులకు కేవల్ కిషన్ ఆదర్శప్రాయుడు, మెదట్లో పలు
సమావేశాలు నిర్వహిస్తూ మగ్దూం మొయి నుద్దీన్, జవాద్ రజ్వి, ఓంకార్ ప్రసాద్లోంటి మేధావులను ఆహ్వానించాడు.
ఈ క్రమంలో రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి, డా. ఎం. ఎస్. జయసూర్య రాజేశ్వరరావు, గురువారెడ్డి వంటి
ప్రముఖుల పరిచయాలు కేవల్కిషన్లోని పోరాట వెలుగు జాడలను దేదీప్యమానం చేశాయి.
ఆంధ్ర మహాసభలు ఇచ్చిన స్ఫూర్తి, గ్రంథాలయాలు, గ్రంథమాల, పత్రికలు, సంఘాలు, సభలు అప్పటి యువతనం ముందడుగు వేయడానికి దోహదమయ్యాయి. కేవల్ కిషన్ పఠసశీలి. తను చదివిన పుస్తకాలు, పత్రికలలోని విషయాలను తోటివారితో ప్రజలతో చర్చించేవాడు. మెదక్, హైదరాబాదు ఆయన ఉద్యమ కేంద్రాలు. ఆంధ్ర మహా సభలలో చరుకుగా పాల్గొన్నాడు. రెడ్డి హాస్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటికాలేజి కేంద్రాలుగా విద్యార్థుల కార్యక్రమాలలో ముందుండేవాడు. నిద్రాహారాలు తెలువ కుండా పనిచేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటికే సిటీ కాలేజీలో లెక్చరర్గా ఉన్న మగ్దూం మొయినుద్దీన్ సాయుధ పోరాటానికి మద్దతు పల్కడం వలన కేవలి
కిషన్ ప్రభావితుడైనాడు. ఉద్యమం వార్తలను ప్రచురించే గోలకొండ, మీజాన్ పత్రికలు చదివేవాడు. కోఠీ ప్రాంతంలో ఈ పత్రికలు కల్గి ఉన్నందుకు దుండగులు కొట్టి పత్రికలు కాల్చేసిన<noinclude><references/>
{{rh|తెలంగాణ |251| తేజోమూర్తులు}}</noinclude>
7c1vn9zpyudfgk6xaxbwed9jcpalj9b
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/273
104
211721
554383
552092
2026-04-25T04:54:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554383
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సంఘటనలో కేవల్కిషన్ పట్ల నిర్బంధం మొదలైంది. ఆ కారణంగా కొంతకాలం ఎవరికీ కనబడకుండా రహస్యంగా
ఉండటంవలసి వచ్చింది.
మెదక్ జిల్లా కేంద్రం కార్యాలయాలు సంగారెడ్డిలో పని చేయడం వలన మెదక్ ప్రాంత ప్రజలకు ఇబ్బంది
కల్లుతున్నదని సంగారెడ్డిలో దీక్ష చేసాడు ఆనాడు ప్రభుత్వానికి నిరసన తెలియజేయడమే గొప్ప సాహసం.
కేవల్కిషన్ తండ్రి కేవల్ నారాయణ కొడుకు డిగ్రీ పూర్తిచేసి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశించాడు. అందుకు భిన్నంగా కేవల్కిషన్ ప్రజల స్వేచ్ఛ, విముక్తి పోరాటాలే తన ధ్యేయంగా ఆశయాన్ని బహిర్గతపర్చాడు. మెదక్ మున్సిఫ్ మెజిస్ట్రేటుగా ఉన్న అబ్దుల్ రహం మొగిలి ద్వారా తహసిల్దారు ఉద్యోగాన్ని చేపట్టమని ఎన్నోసార్లు వివిధ ఉద్యోగాలు ఎరచూపి ప్రభుత్వం సందేశం పంపింది. కేవల్కిషన్ నిరాకరించాడు. దొరల ప్రాంతాలలో యెట్టి చేస్తున్న బీదలను సమీకరించాడు. సమావేశాలు నిర్వహించాడు. పొద్దంతా ప్రజల చైతన్యం కోసం శ్రమించి
రాత్రి ఎప్పుడో ఇల్లు చేరేవాడు. తల్లి కాళ్ళత్తుతూ ప్రజల దీనగాధలు వివరించేవాడు. ఆయనకు తల్లితో అనుబంధం
ఎక్కువ. దీన ప్రజలను ఆదుకోవాలని తల్లి హితబోధచేసేది.
తెలంగాణలో పటేల్పట్వారీ దొరలు, పోలీసులు అధికారులు గొర్లు, మేకలు, కోళ్ళు తెమ్మని వ్యవసాయ సామాన్య రైతులను వురికొల్పేవారు. పశువుల కాపరులను ఆజ్ఞాపించేవారు. కేవల్ థెషన్ దీనిని వ్యతిరేకించేవాడు. అభిమానంతో మాందాంపురం గొల్లలు ఒకసారి కేవల్అషన్కు మేకలు తెచ్చిఇస్తే ఇది మంచి పద్ధతికాదని నచ్చకొచ్చారు. ఎంతకు వినకపోయేసరికి వెంటనే ఆ మూగ జీవాలను మందలో కలిపాడు. మేకపుల్లరి పన్ను విధానం
మీద వారిలో చైతన్యం రగిలించాడు. 1942 సం॥ నుండే వివిధ గ్రామాలు తిరిగుతూ ప్రజలను సంఘటితపర్చాడు.
బానిసత్వ విముక్తి, మద్యపాన వ్యతిరేకత యెట్టి వ్యతిరేకతలు ప్రచారం చేశాడు. 1943 నుండి కౌలుదార్ల పోరాటాలను
ఉధృతం చేశాడు. మెదక్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ప్రజాపోరాటాలలో భాగమయ్యాడు. 1949లో తన తండ్రి
స్వంత ఆస్తి అని చెప్పిన 250 ఎకరాల భూమిని ఎరుకలకు, లంబాడి ప్రజలకు, దళితులకు, భిక్షువులకు పంచాడు.
అక్కడినుండి ప్రారంభమైన ఆయన భూపోరాటం నలుదిక్కులకు పాకింది. ఆ మార్పుతో పటేళ్ళ దొరల సేవలకు
వెళ్ళడానికి యెట్టి జీతగాళ్ళు నిరాకరించారు. ఆయన ప్రభావంతో పలుప్రాంతాలలో వెట్టిపనులు ఆగిపోయాయి.
భూస్వాముల భూములలో చాలాకాలంగా పనిచేస్తున్న రైతులకు శ్రమకు తగ్గ ఫలితం లభించింది. భూమి లభించింది. ఆ దశలో కేవలె ్కషన్ దాడులను ఎదుర్కున్నాడు.
ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవితోపాటు కమ్యూనిస్టు నాయకులు కేవల్కిషన్ తో కలిసి 1946-47 లలో సుదీర్ఘ చర్చలు జరిపారు. నియంతృత్వ పాలన అంతం కావడానికి సమకాలీన రాజకీయ దుర్మార్గాలను ఎదుర్కోవ డానికి సాయుధపోరాటమే శరణ్యమని కేవల్ కిషన్ మగ్దూం దారిని సమర్ధించాడు. వెట్టి జీతగాళ్ళ విముక్తి, సీలింగు మించి అదనంగా కల్గివున్న భూస్వాముల భూమిని పంచడం. మద్యపానం బంద్ చేయడం రాత్రి పాఠశాలలు. విద్య అభ్య
సించడం మొదలైన ప్రజా కార్యాలను ఆయన సాధించాడు.
కిట్టన్నపేట భూ పోరాటంలో పాల్గొని అంటరానితనం, వెట్టి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాడు. ఆ
ప్రాంతంలోని ఎందరో యువకులు కేవలి కిషన్ దళంలో చేరారు. ఆయన మీద బాబాహుకూమత్, కాలగష్ఠి, గస్తినిషాన్
తిర్బన్ ప్రభావాలు పడ్డాయి. ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకున్నది. పూర్తిస్థాయిలో నిర్బంధం పెరగడం
వలన పోరాట మార్గం బలమైంది.
1947 సం॥ కాలానికే కేవల్కిషన్ రహస్యంగా కరపత్రాలు ముద్రించి పంచే కార్యక్రమం తీసుకున్నాడు. ఆనాడు ఆయన ప్రచురించిన కరపత్రంలో 1. పేద రైతులు చెల్లించే మితిమీరిన మిత్తి రద్దు కావాలి 2. ఏ ఊరిలో ఉన్న మిగులు భూమి ఆ ఊరి ప్రజలకు చెందాలి 3. దున్నేవారికే భూమి 4. వెట్టి, మద్యపానం తరాలుగా సాగుతున్న జీతగాళ్ళ
విధానం రద్దుకావాలని పిలుపు నిచ్చాడు. 1948-50 లలో వరస కరువులొచ్చినప్పుడు 'కరువుదానా' పేరిట కలవారి
దగ్గరి నుండి ధాన్యం ప్రోగుచేసి బీదలకు పంచాడు. అక్కన్నపేట చెఱువు పోరాటంలో 120 ఎకరాల పేదల భూమి కబ్జా కాకుండా కాపాడాడు. స్థానికంగా పనిచేసిన దళాల ప్రభావంగా ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి భూస్వాములను అడ్డగించడం ఇక్కడ జరిగింది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |252 | తేజోమూర్తులు}}</noinclude>
7y9rq2gzxeblp9g48q9jc8l9ktdwi6q
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/274
104
211722
554384
552093
2026-04-25T05:01:34Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
554384
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సాయుధ పోరాట విరమణ తర్వాత కేవల్కిషన్ 1952 లొ అసెంబ్లీ, భారత పార్లమెంటు ఎన్నికలలో పాల్గొన్నాడు.
ఈజయసూర్య గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేశాడు. తనూ ఎన్నికలలో పోటీ చేశాడు. 1952, 1957 లలో ఓటమి
పొందినా ప్రజల సమస్యల మీద చురుకుగా పనిచేశాడు.
కేవల్కిషన్ రాజ్యాంగం ఇచ్చిన సౌలభ్యాలనే అమలుపర్చాలని డిమాండ్ చేసి ప్రజలకు మేలు కలిగేలా పోరాడాడు. ఆయన శాంతంగా పరిస్థితులు విడమర్చి చెప్పే విధానం, న్యాయం కోరే పద్ధతి చూసి జిల్లా కలెక్టర్లు అధికారులు ఆశ్చర్యపడేవారు. కేవల్ కిషన్ రాగానే లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించేవారు. గరీబులు గంజినీళ్ళిచ్చినా, లంబడోళ్ళు తైదంబలి పోసినా, ముస్లిం బీదలు మక్కరొట్టె ఇచ్చినా ఇష్టంగా స్వీకరించాడు. వందలాది ఎకరాల భూమి పేదలకు చెందేవిధంగా పోరాడాడు. ఆయన 1960 డిసెంబర్ 26వ తేదీన రాత్రి 11.30 గం౹౹ మాసాయిపేట నిరుపేదలతో సమావేశమై తిరిగి వస్తుందగా పోల్కంపల్లి వద్ద అనుమాన పరిస్థితిలో ప్రమాదానికి గురై అసువులు బాసారు. నలభై ఏండ్లన్న రాకముందే నూరేళ్ళు నిండాయి. ఆ ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం కేవలి కిషన్ జాతర జరుగుతుంది. ఒక మనిషిని దేవుని అంతగా జాతర జరపడం అరుదైన విషయం. ప్రజలు దేవుని ఫొటోల పక్కన కేవలి కిషన్ ఫొటో పెట్టుకోవడం ఇక్కడ ఉంది. ఇతర రాష్ట్రాల ప్రజలు జాతరకు తరలివస్తారు. ఆయన అక్షరాలా ఏ స్వార్థ ఆశలులేని ప్రజల మనిషి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |253 | తేజోమూర్తులు}}</noinclude>
2uakgzlbsiz0s339v9uxtzanrb4nibi
పుట:Sangitarasataran022902mbp.pdf/65
104
212345
554400
554099
2026-04-25T07:59:51Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554400
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="65A" />{{left margin|5em}}<poem>మానసులగుచునుగ్రూరులగుచు
జంతువులఁజంపుదురరణ్యజనపదముల॥
సాధ్యమైనంతపనిచేసి మాన్పలేక పోదునా.</poem> </div>
{{right|'''(నిష్క్రమణము)'''}}
<section end="65A" />
<section begin="65A" /><section end="65A" />
<section begin="65B" />{{Center|{{p|fs125}}పంచమాంకము</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమరంగము —— పూలతోట</p>}}
{{rule |6em }}
{{Center|'''(మిశ్రా, విష్కంభము, ఇద్దఱు వనపాలకులు ప్రవేశము)'''}}
వన - ౧ ఓయీ చెలికాడా విన్నావా
వన - ౨ ఏమిటి చెప్పవయ్యా.
వన - ౧ మనరాజు గారి కుమారుఁడు ఈరాత్రి తన యిల్లాలిప్రక్కనుండి లేచి ఛన్నుని కంటకార్వమునుదీసికొనియెక్కడికో
పారిపోయినాడట. యశోధరా దేవి గారు లేచి చూచి చాలా దుఃఖపడినారటోయి.
వన — ౨ అయ్యో! యెంతదుఃఖపడియుండుమోకదా. సిద్ధార్థునకును యశోధరకును అంతపరస్పరప్రేమానుబంధముకలదుగదా.
ఇంతవింతపనిజరిగినదేమి ! సరే కాని మనప్రభువుగారును రాణిగారును ఎచ్చటనున్నారో.
వన——-౧ ఈవృత్తాంతము వారికినిదెలసి రాజకుమారుడు క్షేమముగా మరలివచ్చుటకై ఈశ్వరాలయమందు జపహోమాధిషేకాదులు జరిగించుటకై వెళ్లియున్నారట.
కమల — (వచ్చి) ఓహోవనపాలకులార.
వన పాలకులు ఇద్దరు - (వేగముగావచ్చి) ఏమి కమలమ్మగారు సెలవు.
కమల —— (విచారముతో) మీరు విననేలేదా!
{{left margin|5em}}<poem>ఈ॥ ముద్దులమూట సోయగపుమొల్కలతోట యశోధరమ్మదా
దద్దయువేదనంబడి నిదాఘజలంబులమేనునానగా
బొద్దుటినుండియొక్కగతిఁ బొక్కుచునున్నది రాజపుత్రుడీ
యద్దమరేయిదన్ను విడనాడి తటాలునఁబారి పోయిన౯॥</poem> </div> <section end="65B" /><noinclude><references/></noinclude>
tawksah2a86jbc4pvu6unxqwk1mwzbn
554401
554400
2026-04-25T08:01:38Z
Brjswiki
6801
554401
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="65A" />{{left margin|5em}}<poem>మానసులగుచునుగ్రూరులగుచు
జంతువులఁజంపుదురరణ్యజనపదముల॥
సాధ్యమైనంతపనిచేసి మాన్పలేక పోదునా.</poem> </div>
{{right|'''(నిష్క్రమణము)'''}}
<section end="65A" />
<section begin="65A" /><section end="65A" />
<section begin="65B" />{{Center|{{p|fs125}}పంచమాంకము</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమరంగము —— పూలతోట</p>}}
{{rule |6em }}
{{Center|'''(మిశ్రా, విష్కంభము, ఇద్దఱు వనపాలకులు ప్రవేశము)'''}}
వన - ౧ ఓయీ చెలికాడా విన్నావా
వన - ౨ ఏమిటి చెప్పవయ్యా.
వన - ౧ మనరాజు గారి కుమారుఁడు ఈరాత్రి తన యిల్లాలిప్రక్కనుండి లేచి ఛన్నుని కంటకార్వమునుదీసికొనియెక్కడికో
::పారిపోయినాడట. యశోధరా దేవి గారు లేచి చూచి చాలా దుఃఖపడినారటోయి.
వన — ౨ అయ్యో! యెంతదుఃఖపడియుండుమోకదా. సిద్ధార్థునకును యశోధరకును అంతపరస్పరప్రేమానుబంధముకలదుగదా.
::ఇంతవింతపనిజరిగినదేమి ! సరే కాని మనప్రభువుగారును రాణిగారును ఎచ్చటనున్నారో.
వన——-౧ ఈవృత్తాంతము వారికినిదెలసి రాజకుమారుడు క్షేమముగా మరలివచ్చుటకై ఈశ్వరాలయమందు జపహోమాధిషేకాదులు ::జరిగించుటకై వెళ్లియున్నారట.
కమల — (వచ్చి) ఓహోవనపాలకులార.
వన పాలకులు ఇద్దరు - (వేగముగావచ్చి) ఏమి కమలమ్మగారు సెలవు.
కమల —— (విచారముతో) మీరు విననేలేదా!
{{left margin|5em}}<poem>ఈ॥ ముద్దులమూట సోయగపుమొల్కలతోట యశోధరమ్మదా
దద్దయువేదనంబడి నిదాఘజలంబులమేనునానగా
బొద్దుటినుండియొక్కగతిఁ బొక్కుచునున్నది రాజపుత్రుడీ
యద్దమరేయిదన్ను విడనాడి తటాలునఁబారి పోయిన౯॥</poem> </div> <section end="65B" /><noinclude><references/></noinclude>
108sfgy8uqaq5x0sapfswv8s7nkpnj6
554402
554401
2026-04-25T08:03:59Z
Brjswiki
6801
554402
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="65A" />{{left margin|5em}}<poem>మానసులగుచునుగ్రూరులగుచు
జంతువులఁజంపుదురరణ్యజనపదముల॥
సాధ్యమైనంతపనిచేసి మాన్పలేక పోదునా.</poem> </div>
{{right|'''(నిష్క్రమణము)'''}}
<section end="65A" />
<section begin="65A" /><section end="65A" />
<section begin="65B" />{{Center|{{p|fs125}}పంచమాంకము</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమరంగము —— పూలతోట</p>}}
{{rule |6em }}
{{Center|'''(మిశ్రా, విష్కంభము, ఇద్దఱు వనపాలకులు ప్రవేశము)'''}}
వన - ౧ ఓయీ చెలికాడా విన్నావా
వన - ౨ ఏమిటి చెప్పవయ్యా.
వన - ౧ మనరాజు గారి కుమారుఁడు ఈరాత్రి తన యిల్లాలిప్రక్కనుండి లేచి ఛన్నుని కంటకార్వమునుదీసికొనియెక్కడికో
::పారిపోయినాడట. యశోధరా దేవి గారు లేచి చూచి చాలా దుఃఖపడినారటోయి.
వన — ౨ అయ్యో! యెంతదుఃఖపడియుండుమోకదా. సిద్ధార్థునకును యశోధరకును అంతపరస్పరప్రేమానుబంధముకలదుగదా.
::ఇంతవింతపనిజరిగినదేమి! సరే కాని మనప్రభువుగారును రాణిగారును ఎచ్చటనున్నారో.
వన - ౧ ఈవృత్తాంతము వారికినిదెలసి రాజకుమారుడు క్షేమముగా మరలివచ్చుటకై ఈశ్వరాలయమందు జపహోమాధిషేకాదులు ::జరిగించుటకై వెళ్లియున్నారట.
కమల — (వచ్చి) ఓహోవనపాలకులార.
వన పాలకులు ఇద్దరు - (వేగముగావచ్చి) ఏమి కమలమ్మగారు సెలవు.
కమల —— (విచారముతో) మీరు విననేలేదా!
{{left margin|5em}}<poem>ఈ॥ ముద్దులమూట సోయగపుమొల్కలతోట యశోధరమ్మదా
దద్దయువేదనంబడి నిదాఘజలంబులమేనునానగా
బొద్దుటినుండియొక్కగతిఁ బొక్కుచునున్నది రాజపుత్రుడీ
యద్దమరేయిదన్ను విడనాడి తటాలునఁబారి పోయిన౯॥</poem> </div> <section end="65B" /><noinclude><references/></noinclude>
hhfd6uzb4o40awpmahhsszivjumpazl
554403
554402
2026-04-25T08:04:54Z
Brjswiki
6801
554403
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="65A" />{{left margin|5em}}<poem>మానసులగుచునుగ్రూరులగుచు
జంతువులఁజంపుదురరణ్యజనపదముల॥
సాధ్యమైనంతపనిచేసి మాన్పలేక పోదునా.</poem> </div>
{{right|'''(నిష్క్రమణము)'''}}
<section end="65A" />
<section begin="65A" /><section end="65A" />
<section begin="65B" />{{Center|{{p|fs125}}పంచమాంకము</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమరంగము —— పూలతోట</p>}}
{{rule |6em }}
{{Center|'''(మిశ్రా, విష్కంభము, ఇద్దఱు వనపాలకులు ప్రవేశము)'''}}
వన - ౧ ఓయీ చెలికాడా విన్నావా
వన - ౨ ఏమిటి చెప్పవయ్యా.
వన - ౧ మనరాజు గారి కుమారుఁడు ఈరాత్రి తన యిల్లాలిప్రక్కనుండి లేచి ఛన్నుని కంటకార్వమునుదీసికొనియెక్కడికో
::పారిపోయినాడట. యశోధరా దేవి గారు లేచి చూచి చాలా దుఃఖపడినారటోయి.
వన — ౨ అయ్యో! యెంతదుఃఖపడియుండుమోకదా. సిద్ధార్థునకును యశోధరకును అంతపరస్పరప్రేమానుబంధముకలదుగదా.
::ఇంతవింతపనిజరిగినదేమి! సరే కాని మనప్రభువుగారును రాణిగారును ఎచ్చటనున్నారో.
వన - ౧ ఈవృత్తాంతము వారికినిదెలసి రాజకుమారుడు క్షేమముగా మరలివచ్చుటకై ఈశ్వరాలయమందు
::జపహోమాధిషేకాదులు జరిగించుటకై వెళ్లియున్నారట.
కమల — (వచ్చి) ఓహోవనపాలకులార.
వన పాలకులు ఇద్దరు - (వేగముగావచ్చి) ఏమి కమలమ్మగారు సెలవు.
కమల —— (విచారముతో) మీరు విననేలేదా!
{{left margin|5em}}<poem>ఈ॥ ముద్దులమూట సోయగపుమొల్కలతోట యశోధరమ్మదా
దద్దయువేదనంబడి నిదాఘజలంబులమేనునానగా
బొద్దుటినుండియొక్కగతిఁ బొక్కుచునున్నది రాజపుత్రుడీ
యద్దమరేయిదన్ను విడనాడి తటాలునఁబారి పోయిన౯॥</poem> </div> <section end="65B" /><noinclude><references/></noinclude>
qm58g555xs62fhbt2du3vrvp1xyklev
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/44
104
212370
554343
554258
2026-04-24T14:27:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554343
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}నజరయ్య నుండి క్రీస్తు వరకూ</p>
1. సంస్కర్త నజరయ్య
2. దైవదర్శనా కాంక్ష
3. తల్లి శాపం<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|43|}}</noinclude>
35ob8nkrc2g9oq3q74wy8f0uw5idd0u
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/45
104
212371
554364
554259
2026-04-24T23:02:32Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554364
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}1. సంస్కర్త నజరయ్య</p>
{{Largeinitial|"నే}}ను క్రైస్తవుడిని కాకముందు నజరయ్య మతంకి చెందినవాడిని” అనేక మంది ఆడామగా పదే పదే నాతో చెప్పేవారు. ఈ మతమేమిటా అని సహజంగానే నేను ఆరా తీసాను.
"నజరయ్య మత గురువులు మా దగ్గరకి వచ్చి చెప్పారు. దొంగతనం వద్దు. విగ్రహారాధన వద్దు. దేముడు ఒక్కడే-"
"మాదిగలలో చాలామంది ఈ మతంవారా?”
జవాబులు అస్పష్టంగా వుండేవి. ఒకతను కనీసం వందమంది ఉంటారన్నాడు. ఇంకొకతను వెయ్యి అన్నాడు. మూడోవాడు నాకెలా తెలుస్తుంది-" అన్నాడు.
నేను అనేక ప్రశ్నలు వేశాను. ఈ నజరయ్య ఎవరు? ఏ కాలంవాడు? హిందువుల అసంఖ్యాక శాఖలలో ఇది ఏ తరగతికి చెందినది? నాకొకతను దొరికాడు. నజరయ్య మతం ఏడాది పండగకి త్రిపురాంతకంలో ఉన్నానన్నాడు. నజరయ్య మతం తాలూకు చివరి గురువు సుందరమ్మ బతికే వుందని తను చూశానని
ఇంకొకడు చెప్పాడు. చివరికి ఓ మాదిగతను నజరయ్యను స్వయంగా చూశాడని విన్నాను. అతని కోసం కబురంపాను. వచ్చాడు. పండుముసలి. రోమన్ ముక్కు, దట్టమైన కనుబొమలు. "నువ్వు నజరయ్యను చూశావా?"
రెండు కళ్ళమీదా అయిదువేళ్ళూ పెట్టుకొన్నాడు. నా వేపు వంగాడు. అతని ప్రవర్తన, శరీరంలోని కదలికలూ అతని మాటలమీద నమ్మకం పెంచాయి. "ఈ కళ్ళతో నేను నజరయ్యని చూశాను".
ఆ విధంగా నాకు నజరయ్య కాలం తెలిసింది. అతనికి డబ్బయి లేదా డబ్బై అయిదు ఏళ్ళుంటాయి. నజరయ్య ఆరంభించిన మతోద్యమంలో అతని తండ్రి కొట్టుకుపోయాడు. ఓ చిన్నికుర్రాడిగా ఉన్నపుడు అతనిని త్రిపురాంతకం తీసుకెళ్ళాడు. కొన్నేళ్ళకి చనిపోతాడనగా నజరయ్యను ఈ బాలుడు చూశాడు. అంటే అది 1825 అయింటుంది.
అనేక సంవత్సరాలు గడిచినా ప్రభావం నశించని ఈ నజరయ్య వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నాను. నా ముందున్న ఈ ముసలతను అతని గురించి ఏమీ చెప్పలేకపోయాడు. నజరయ్య పేరిట ఉన్న మతం గురించి చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాడు. అనేక సంవత్సరాలుగా ఆ మతం దీక్ష పుచ్చుకున్న గురువు ఈ ముసలతను. అతను చెప్పగలిగింది అంతా సేకరించాను. విన్నకొద్దీ
ఈ నజరయ్య ఎవరో తెలుసుకోవాలన్న కోరిక పెరిగింది. అనేక చోట్లకి కబుర్లు పంపాను. గురువు నజరయ్య కథ ఎవరికైనా వాళ్ళ త్రండి చెప్పడం గుర్తుందా అని అడిగాను. ఒక మహమ్మదీయుడని కనిపెట్టాను. అతని తండ్రి నజరయ్య నుంచి దీక్ష పొందాడు. నజరయ్య అంత పెద్ద గురువు ఎలా అయ్యాడో ఆ కథ చెప్పాడట. చిన్న కుర్రాడుగా తనే స్వయంగా దూశాడుట. అతనొక ముసలివాడు. అతను చెప్పిన కథ భారతదేశపు మత జీవితపు స్వభావంతోనే ఉంది.
వందేళ్ళ క్రితం మహమ్మదీయమతానికి చెందిన సయ్యద్ శాఖలో ఓ ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడుట. అనేక ఓడలుండేవి. తరచూ దూర ప్రయాణాలు చేసేవాడు. గలప్ షరీఫ్ అనే ఆ వ్యాపారి అలాంటి ఓ ప్రయాణంలో ఒక గురువును కలిసి అతని బోధలకు ఆకర్షించబడ్డాడు. అతను దీక్ష తీసుకున్నాడు. తన గురువుకి పూర్తిగా విధేయుడయిపోయాడు. లాభాలు వచ్చే వ్యాపారాన్ని వదిలేశాడు. బాపట్ల తాలూకాలో తనకోసం ఓ గుడికట్టుకున్నాడు. అక్కడే నివశించాడు. అనేక మంది అతని బోధలు వినడానికి వచ్చేవాడు. అతని ముఖ్య సిద్ధాంతం దేవుడు ఒకే ఒక్కడు.
నరసారావుపేట రాజా గలెప్ షరీఫ్ గురించి విన్నాడు. అతనికి దైవిక శక్తులున్నాయిట. అద్భుతాలు చేస్తాడుట. ఓ దూతని పంపి గురువుని తన భవనానికి ఆహ్వానించాడు. అతనికి శిష్యుడవాలనుకుంటున్నానని కబురంపించాడు. షరీఫ్ వచ్చాడు. ఒకటి రెండురోజులు నిరీక్షించాడు. కాని రాజా తన సముఖంలోకి రప్పించడానికి ఆలస్యం చేశాడు. ఇంక నిరీక్షించలేక లేచి ఇంటి మొహం పట్టాడు.
రాజా దగ్గర ఒక సహాయకుడు ఉన్నాడు. పేరు నజర్ మహమూద్. షేక్ శాఖ. అతనికి ఈ గురువుమీద ఆసక్తి ఎక్కువ. షరీఫ్ని అనుసరించి వెళ్ళాడు. కాళ్ళమీద పడ్డాడు. తనని శిష్యుడిగా చేసుకుని ఉపదేశం ఇమ్మన్నాడు. గురువు ఉపదేశానికి నాలుగువందల రూపాయలు ఇమ్మన్నాడు. నజర్ మహమూద్కి ఉన్న బలీయమైన కోరికవల్ల ఆ నాలుగువందలు ఇస్తానన్నాడు. అయితే అతని దగ్గర ఆ డబ్బు చెల్లించడానికి ఏమీ లేదు. అద్భుతశక్తులు నేర్పాక ఇస్తానన్న డబ్బు ఇవ్వాల్సిన రోజు దగ్గర పడింది. నజర్ మహమూద్ లేచి పారిపోయాడు. త్రిపురాంతకం చేరాడు. అక్కడో హిందూదేవాలయం ఉంది. దేవాలయంలో వాళ్ళు,
భక్తులూ అతని బోధనలను వినడానికి వచ్చేవారు. రోజు రోజుకీ అతనికి అనుచరులు పెరిగారు.
తన శిష్యుడు నజర్ మొహమూద్ దాక్కున్న స్థలం గలెప్ షరీఫ్కి తెలిసింది. ఇస్తానన్న ధనంకోసం దేవాలయానికి వచ్చాడు. నజర్ మహమూద్ శిష్యులు మాట్లాడుకున్నారు. “ఆయన గొప్ప గురువు. అతని అప్పు తీరుద్దాం. గుడికడదాం. ఆయన మన మధ్య ఉంటాడు. మనం ముక్తి సంపాదించుకుందాం" అనుకున్నారు. షరీఫ్ తన డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక పెద్ద గుడి కట్టారు. కొత్త గురువు పేరు అన్ని చోట్లకీ పాకింది. మహమ్మదీయ పేరు<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|44|}}</noinclude>
pzcyoz58kzkkuj6vchtay2ceq5ujhu1
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/46
104
212372
554365
554260
2026-04-24T23:22:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554365
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>నజర్కి తెలుగు 'అయ్య' చేర్చారు సామాన్య జనం. ఆ విధంగా ఆ మతం నజరయ్య మతం అయింది.
నజరయ్య మతమేమిటి? పుట్టుకరీత్యా మహమ్మదీయుడు. అయినప్పటికీ అతనుగాని అతని శిష్యులుగాని మహమ్మద్ ప్రవక్త పేరు చెప్పారు. గలెప్ షరీఫ్ తన ప్రయాణంలో కలుసుకున్న గురువు ఓ యోగి అయుండాలి. నజరయ్య బోధనలు చాలావరకూ యోగి సిద్ధాంతాలు. నిజానికి అతని అనుచరులు తమని రాజయోగి ప్రజలుగా చెప్పుకుంటారు. మహమ్మదీయులూ ఈ యోగీ కూడా దేముడు ఒక్కడేనని ఒకేలా నమ్ముతారు.
నజరయ్య ఉపదేశ విధానం యోగి సిద్ధాంతానికి సరిపోలుతుంది. “నీ మనసుని కేంద్రీకరించు. అన్ని రహస్య ఆలోచనలనూ వదిలిపెట్టు. పైకి చూడు. శరీరం ఉనికిని మరిచిపో. తలమీద ఉన్న జుత్తు ముడిమీద దృష్టిపెట్టు. (సన్యాసుల జుత్తులాగ), నిశ్చలబుద్ధితో పరికించు. అప్పుడు నీకు ప్రత్యక్షమవుతాయి... కాంతి. దైవాత్మలు, పవిత్రనదులూ స్థలాలూ, రుషులు, సూర్యచంద్రులు, మెరుపులు, ఉరుములు, నిప్పు, నీరు, శబ్దాలూ ఆకాశాన్ని నింపేస్తాయి. భూమి ఒక గుడ్డులా కనిపిస్తుంది. బ్రహ్మ కనిపిస్తాడు అంతా ఒకటైపోతుంది".
నజరయ్య శిష్యులని తయారుచేశాడు. తన బోధలను ప్రచారం చెయ్యడానికి పంపాడు. అతను కులభేదాలను, లింగభేదాలనూ పాటించలేదు. ఆడామగా అందరికీ ఉపదేశాల తంతు (దీక్ష) జరిగింది. అందరూ మతం మారారు. నేను ఈ తంతుల గురించి ఆరాతీశాను. ప్రతిసారీ నాకు చుక్కెదురయింది. నేను విన్నది అంతా ఒకటే చెవిలో ఏదో అంటారు. ఉపదేశానికి అనర్హులయిన ఎవరికీ ఎట్టి పరిస్థితులలోనూ దానిని చెప్పకూడదు.
నజరయ్య జీవితకాలంలో ఆయన నిషేధించిన వాటిని చెయ్యటానికి శిష్యులు ఎవరూ సాహసించలేదు. సారాయి కాని భంగు కాని వాళ్ళు వాడితే చివాట్లు వేసేవాడు. కులవివక్షమీద విరుచుకుపడ్డాడు, అతనికి ధర్మాగ్రహంతో ఒళ్ళు తెలిసేదికాదు. నజరయ్య ఎవరో చెప్పలేనివారు కూడా కామవాంఛలమీద ద్వేషానికి గుర్తుగా అతను పగబట్టి రక్తం చిందించిన కథ చెప్పగలిగేవారు. ఓ రోజు ఒక స్త్రీ శిష్యురాలు కేకలు వినిపించాయి. ఆమె మీద గాయాలూ అవమానాలూ కనిపించాయి. ఆ తప్పు చేసిన వాడిని పట్టుకుని గుండెల్లో పొడిచేశాడు నజరయ్య. ఆయనకేమీ జరగలేదు. జైలు వేసినా ఎవ్వరూ అతన్ని
పట్టుకోలేకపోయారు. జైలు గోడల నుంచి ఆయన బయటికి రావడం వీధుల్లో తిరగటం జైలు తలుపులవద్ద భటులు నిలబడిపోవడం సామాన్య జనం చూశారు. నజరయ్య గురించి చెప్పుకునే అలాంటి కథలు జనంమీద ఆయనకున్న పట్టుని వివరిస్తాయి.
ఆయన మరణానంతరం నజరయ్య మతం పాడయిపోయింది. విగ్రహారాధన చేస్తే ఏ అపాయమూ జరగదన్నారు శిష్యులు. నైతిక నియమాలలో వాళ్ళు దారితప్పారు. బయటపడకుండా చెయ్యగలిగితే దొంగతనం ఎందుకు చెయ్యగూడదు? సారాయి, భంగు తప్పించుకోటం కష్టం. శక్తి పూజ తాలూకు అసహ్యకర రూపాలు కూడా నజరయ్య మతంలో ప్రవేశించినట్టున్నాయి.
త్రిపురాంతకంలోని మాదిగల ప్రత్యేకమైన గుడి నజరయ్య జీవితకాలంలో కట్టలేదేమోనని నా అనుమానం. కులవివక్షకి అలాంటి ప్రాముఖ్యతను ఆయన అంగీకరించే అవకాశంలేదు. ఆయన మతం మార్చి గురువుగా తయారుచేసిన తొలి శిష్యులలో ఒక మాదిగ ఉన్నట్టున్నాడు. ఆయన జనాలను మతం మార్చడానికి పంపి ఉంటాడు. నజరయ్య మతం పుచ్చుకోవడం మాదిగలకి అభివృద్ధి అని అర్థం. వాళ్ళ గ్రామాలలోని సంప్రదాయాలలోని బహుదైవత్వంకన్న నజరయ్య ఏకదైవత్వం మెరుగయినదని గ్రహించారు. ఒకతను నాతో అన్నాడు- "నేను పాపాత్ముడనని ఒక యోగి చెప్పాడు. ముక్తి సంపాదించుకోవాలన్నాడు. నేనంతకు
ముందు ఎప్పుడూ అలా ఆలోచించలేదు.” ఇంకో మనిషి అన్నాడు- "మా గ్రామదేవతలతోబాటు నేను విష్ణువు విగ్రహాలను పూజించాను. రాజయోగి ప్రజలు వచ్చి దేవుడు ఒక్కడేనని, ఈ విగ్రహాలవల్ల
ప్రయోజనం లేదని చెపితే నేను వారిని నమ్మాను. నేను అంతకు మునుపు విన్నవాటి అన్నింటికన్నా ఇది మంచిది.” నజరయ్య మతానికి చెందటం మాదిగల సాంఘిక స్థాయిని కూడా పెంచింది. ఎందుకంటే త్రిపురాంతకంలో శిశిరంలో ఏటా జరిగే ఉత్సవంలో అన్ని కులాల తరగతులవాళ్ళతో ఒకే వరసలో నిలబడతారు.
మొత్తం కుటుంబాలు కలిసి ఆ ఉత్సవానికి వెళ్తారు. వాళ్ళతో బాటు మేకలు, కోళ్ళూ, బియ్యం, చింతపండు, కూర మసాలా తీసుకువెళతారు. ఇవన్నీ సుందరమ్మకి అర్పిస్తారు. ప్రత్యేక శ్రద్ధతో మొక్కుతారు. నజరయ్య చుట్టూచేరిన శిష్యగణంలో ఆమె చివరిది. నజరయ్య సమాధిమీద పూలు ఉంచి పూజలు చేస్తారు. సుందరమ్మ అవన్నీ తీస్కుని సామూహిక వంటకి అందిస్తుంది. వచ్చిన వారందరికి కులం ఏదైనప్పటికీ ఒకే కుండలో వండుతారు. తినేటపడు అందరూ కూర్చుని కలిసి తింటారు. కాని మాదిగలు కాస్తంత ఓ పక్కగా కూర్చుంటారు. చివరికి నజరయ్య మతంలో కూడా శూద్రులు, మాదిగలు పక్కపక్కన కూర్చుని భోంచెయ్యరు.
మాదిగలు క్రైస్తవానికి రావటం మొదలైనపుడు నజరయ్య మతస్థులే క్రీస్తులో లభించే దివ్య జీవితానికి హృదయాలు తెరిచారు. నజరయ్యను అనుసరించినవారు క్రీస్తు శిష్యులయ్యారు. త్రిపురాంతకంలో అనుకున్నారు "మాదిగలు మనని వదిలేస్తున్నారు” కొందరు భుజాలు ఎగరేశారు- “వాళ్ళని పట్టి ఉంచటానికి మనమేం చెయ్యగలం? వాళ్ళు ఓ కొత్త మతాన్ని అనుసరిస్తున్నారు”. ఇతరులు అన్నారు. "పోనీండి!". ఆ విధంగా నజరయ్య మతం చాలా మందికి అంతకన్నా ఉన్నతమైన దానికి ఎక్కేరాయిగా
గుర్తుండిపోయింది.<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|45|}}</noinclude>
mxndfwzjtovxyszphhqhpi1t4lqi4hb
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/47
104
212373
554368
554261
2026-04-25T01:19:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554368
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}2. దైవదర్శనాకాంక్ష</p>
ఉల్లూరి వారి కుటుంబం కీర్తి నలుదిశలా వ్యాపించింది. వాళ్ళ ధనాన్ని బట్టి కాదు. గొప్ప గొప్ప పనులు చెయ్యటంలో ముందున్నందుకు కాదు. వాళ్ళ భక్తి తత్పరతే దానికి కారణం. గురువు పోలయ్యకి పదహారు రూపాయల విలువైన ఆవుని వారు యిచ్చారు. ఒక గురువుకి యిచ్చే కానుకలలో ఇది చాలా గొప్పగా
భావించబడింది. మతపరమైన అంకితభావానికి ఆ కుటుంబం ఖ్యాతి సంపాదించుకుంది.
చిన్నపూడి పోలయ్య పూర్తిగా నిరక్షాస్యుడైనప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆదరాన్ని సంపాదించుకున్న మనిషి అయుంటాడు. అదే అతన్ని తతిమ్మా వాళ్ళ కన్నా భిన్నమైన వాడుగా చేసి గురువుని చేసింది. అతను ధ్యానముద్రలో ఉండేవాడు. స్వప్నాల స్వాప్నికుడు. ఓరోజు తెలివిగా ఓ ప్రశ్న లేవదీశాడు "కోటప్పకొండ స్వామి తతిమ్మా స్థలాలలోని స్వాములూ, జనం యింతగా పూజ చేస్తున్నారు గాని, మనుషులు తయారుచేసేవాళ్ళే. ఈ మనుషులు చేసిందెవరు? భూమ్యాకాశాలను చేసిందెవరు? దేవుని చూడకుండా నేను చనిపోవాలా?” అతని తండ్రి నజరయ్యను అనుసరించినవాడు. నజరయ్యను చూడటానికి అతని తండ్రి నజరయ్యను అనుసరించినవాడు. నజరయ్యను చూడటినికి అతని తండ్రి త్రిపురంతకం తీసుకువెళ్ళటం ఆ పోలయ్య తొలి జ్ఞాపకాలలో ఒకటి. బీదరికంలో సన్యాసిలా బ్రతికి ఎవరితోనయినా ఎప్పుడైనా దేముడు ఒక్కడే అన్న తన ముఖ్యసిద్ధాంతం గురించి మాటలాడటానికి సిద్ధంగా ఉండే నజరయ్యను ఆ బాలుడు పోలయ్య ఏనాడూ మరచిపోలేదు. ఆ బాలుడి మనసులో విగ్రహారాధన పట్ల
వ్యతిరిక్తత, భగవంతుడిని చూడాలన్న అవిశ్రాంత కాంక్ష నజరయ్య నాటాడు.
ఉల్లూరి కుటుంబానికి గురువైన పోలయ్యకి తన ఉపచారాలలో తన అజ్ఞానాన్ని గంభీరమైన గురుత్వంలో ఎలా కప్పిపెట్టుకోవాలో బాగా తెలుసు. వాళ్ళకి మంత్రాలు శ్లోకాలూ చెప్పేవాడు. రాజయోగి ప్రజల వేదాంతంలో ఇక్కడో ముక్క అక్కడో ముక్క నేర్చాడు. ప్రత్యేక సమయాలలో తన జ్ఞానాన్ని కొంచెం
ప్రదర్శించేవాడు. అతను తనకి మించిన లోతులకి వెళ్తున్నానని తెలియగానే వెనక్కి తగ్గి ఒక రహస్యమయ వాతావరణాన్ని కల్పించేవాడు. అది సరళ స్వభావులకీ చాలా అద్భుతంగా అనిపించేది. మరోసారి యింకా ఎక్కువ చెపుతానని మాట యిచ్చేవాడు. ఆవిధంగా వారిలో కుతూహలాన్ని రేకెత్తించి తిరిగి వచ్చినపుడు ఏం చెపుతాడా అన్న కౌతుకంతో ఎదురు చూసేటట్టు చేసేవాడు.
దేముడిని చూపిస్తానని చెప్పటం తన శిష్యులకి పోలయ్య యిచ్చిన వాగ్దానాలలో వాళ్ళని పట్టి ఉంచిన వాటిలో ఒకటి. ఆ కుటుంబంలో వయసు మీదబడిన తండ్రికి దేముడికి చూడాలన్న బలీయమైన కోరిక కలిగింది. అతనంటే అందరికీ గౌరవం. కొడుకులు తండ్రి కోరికని శ్రద్ధగా పట్టించుకున్నారు. వాళ్ళు
పోలయ్యను సంప్రదించారు. అతను పదిహేను రూపాయలు ఇమ్మన్నాడు. వాళ్ళు ఇది చాలా ఎక్కువ అనుకున్నారు. ఆ తాంత్రిక రహస్యాన్ని సంపాదించుకోటానికి తాను ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నదీ మైనంలా కరిగిపోయేలా అద్భుతంగా వర్ణించాడు. తన ప్రయత్నాల ద్వారా ఆకుటుంబంలో ఒక్కరు దేముడిని చూడగలిగితే మొత్తం కుటుంబానికి నిస్సందేహంగా ముక్తి దొరుకుతుందని నొక్కి చెప్పాడు. చివరికి పోలయ్య పదకొండు రూపాయలకి ఒప్పుకున్నాడు. ఆ ప్రయత్నం చేసే రాత్రి నిశ్చయమయింది.
పదిమంది ఆడామగా దేముడిని చూడాలన్న కాంక్షతో విశ్వాసంతో అర్ధరాత్రి వేళ ఉల్లూరి వారి ఇంటిలో కూర్చున్నారు. గోడకున్న గూటిలో రెండు చిన్న నూనె దీపం బుడ్లు వెలుగుతున్నాయి. అక్కడ కొద్దిపాటి వెలుతురిని యిస్తున్నాయి. గురువు మధ్యలో కూర్చున్నాడు. శిష్యులు చుట్టూ వృత్తాకారంలోకూర్చున్నారు. నజరయ్య మతం తాలూకు మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. అతని హడావుడి భయంకరంగా ఉంది.
చూస్తున్న వాళ్ళంతా ఊపిరిబిగబట్టారు. కదలకుండా ఉండిపోయారు.
చిట్టచివరికి ఆ క్షణం వచ్చేసింది. అందరినీ పొమ్మని సంజ్ఞచేశాడు. ఆ ముసలతనిని మాత్రం కూర్చోమన్నాడు. మరిన్ని మంత్రాలు చదివాడు. మరిన్ని విచిత్రమైన బొమ్మలు గీశాడు. ముసలతను ముక్కు చెవులూ, కళ్ళు మీద అంతకు ముందు పోలయ్య చెప్పినట్టుగా వేళ్ళు పెట్టుకున్నాడు. బాహిర ప్రపంచంతో
ఆ విధంగా సంబంధాలు తెంచుకుని అంతరేంద్రియంతో భగవంతుడిని చూడాలని అతనికి అర్ధమయ్యింది.
కొంత సమయం గడిచింది. పోలయ్య చెవిలో గొణిగాడు. నీకేమైనా కనిపిస్తోందా అని.
"అంతా ఎర్రగా పచ్చగా కనిపిస్తోంది. మధ్యలో ఏదో మనిషి బొమ్మ ఉన్నట్టు కనిపిస్తోంది" అన్నాడు ముసిలతను.
“అదే దేవుడు. నువ్వు చూశావు" అన్నాడు పోలయ్య
ఆశ్చర్యంతో సంభ్రమంతో ముసిలాయన పిల్లలని కలిశాడు. మనవలు చుట్టూ ఆడుకుంటుండగా ఇంటి పట్టున కూర్చుని, అనేక రోజులు దాని గురించే ఆలోచించాడు. జనం వస్తున్నారు. వెళుతున్నారు. అంతా ఎలా కనిపించిందీ చెపుతున్నాడు. ఆ ముసిలాయనకి అదో గొప్ప తృప్తిని కలిగించే విషయమయింది.
అంతా డబ్బులు ఖర్చుపెట్టినందుకు పిల్లలు విచారించలేదు.<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|46|}}</noinclude>
ay7m0d7830g8wd8x59hnk9ghdp8dpcy
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/48
104
212374
554369
554262
2026-04-25T01:39:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554369
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>కొన్నేళ్ళు గడిచాయి. పశిగోపు బసయ్య తన తోలుపని పరికరాలను పదునుపెట్టించుకోటానికి ఒకరోజు మదులూరు వచ్చాడు. అతను ఉల్లూరి వాళ్ళ కుటుంబానికి స్నేహితుడు. ఇంటికి బయల్దేరే ముందు వాళ్ళని చూడటానికి వెళ్ళాడు. అదీ యిదీ మాట్లాడుకుంటున్నారు. కొత్త మతాన్ని ఒక దొర ఒంగోలుకి
తీసుకువచ్చాడు. విన్నారా అని అడిగాడు. దాన్నంతా మంచి మతం అనుకుంటున్నారు. అని చెప్పాడు. వివరాల కోసం వాళ్ళు అడిగారు. కాని బసవయ్య వాళ్ళకి తృప్తి కలిగించలేకపోయాడు. ఈ మతాన్ని
నమ్మినవాళ్ళని జీసస్ క్రీస్తు రక్షిస్తాడు. ఆయనే పూజించాలి. మిగిలిన స్వాములు అందరూ తరువాతే అని మాత్రం బసయ్య విన్నాడు. అంతేకాక అనేకమంది ఈ మతం పుచ్చుకున్న మాదిగలు ఆదివారం
పనిచెయ్యరు. వచ్చిన గొడ్డు మాంసాన్ని వాడలోకి తీసుకురారు అని ఓ వెట్టి బసయ్యతో చెప్పాడు.
బసయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రయాణంలో అలసిపోయిన ఓ మనిషి అతని ఇంటివద్ద చెట్టుకింద కూర్చుని ఉండటం కనిపించింది. అతను మాదిగల పెద్ద గురించి అడిగాడు. వస్తాడని చెప్పారు. మాదిగల పెద్దగా బసయ్య కొత్తవాళ్ళని ఆహ్వానించటం, వాళ్ళ కష్టసుఖాలు విచారించటం, తన పెద్దరికంతో ఏదైనా సాయంకోరితే చెయ్యటం అతని విధులు తన ఎదురుగా ఉన్న బద్దేపూడి కన్నయ్య క్రైస్తవుడని తెలుసుకుని చాలా సంతోషించాడు. అతని అవసరాలు చూశాడు. కన్నయ్య బాధ్యత అంతా తీసుకున్నాడు. క్రైస్తవ ప్రచారానికి భారతీయ గ్రామీణ సమాజంలోని తెగ పద్ధతి ఆ విధంగా ఒక వాహిక అయింది. మర్నాడు మదులూరికి వెళ్ళారు. అతిధులుగా వారిని ఆదరించారు. కన్నయ్య ఎందుకొచ్చింది
బసయ్య చెప్పాడు. అతను చెప్పేది వినటానికి ఒప్పుకున్నారు.
ఆ వేళ ఎక్కువేం చెప్పలేదు. వచ్చినవాళ్ళు వెళ్ళాక ఈ మతం గురిచి మళ్ళీ వినటానికి వాళ్ళని మళ్ళీ పిలుద్దామనుకున్నారు. అలాగే పిలిచారు. ఇద్దరు మనుషులు వెళ్ళి పిలిచారు కన్నయ్య వచ్చాడు. అతనికి ఆ రోజు, మంచి అవకాశం దొరికింది. అందరూ వినటానికి సిద్ధమయ్యారు. పిల్లలు పడుకున్నారు. కుక్కలు మాత్రం అప్పుడప్పుడు రాత్రి శబ్దాన్ని బద్దలు చేస్తున్నాయి. క్రీస్తు మరణగాథ విన్నారు. క్రైస్తవుల పద్ధతిలో కన్నయ్య ప్రార్ధించాడు. ఇలాంటిది వాళ్ళంతకు ముందు ఎప్పుడూ తెలియదనుకున్నారు. “మనమెందుకు ముందుకు వెళ్ళకూడదు? మనం చేస్తున్న దానిలో ఎలాంటి ముక్తి లేదు? అనుకున్నారు. ఆ తర్వాత రోజులలో.
ఉల్లూరి వాళ్ళ కుటుంబంలో చిన్నవాళ్ళు తోటివాళ్ళతో ఈ కొత్తమతం గురించి చర్చించారు. దోవన పోతున్న వెట్టివాడు మదులూరిలో విచిత్రాలు జరుగుతున్నాయని చెప్పాడు. ఉల్లూరి వాళ్ళ ముసలి తండ్రి ఆ విషయాలను ఆలోచించి పట్టించుకోమని సలహా యిచ్చాడు. వాళ్ళకి దైవభక్తి ఉందని గుర్తుచేశాడు.
త్రిపురాంతకంలో నజరయ్య సమాధిని చూడటానికి కుటుంబమంతా వెళ్ళలేదా? బియ్యమూ, మేకా యివ్వలేదా? పాటలు పాడుతూ నజరయ్య సమాధిమీద పూదండలుంచలేదా? పూజలకి పోలయ్య గురువుకి ఆవుని యివ్వలేదా? అన్నింటికన్నా కొన్నేళ్ళక్రితం అర్ధరాత్రి తమ తండ్రికి దేముడుని చూపించలేదా?
అంతేకాక ఈ మాదిగ కుటుంబ పెద్దకి ఉక్కమ్మ అనే కూతురు ఉంది. ఒక ప్రత్యేకమైన ప్రేమాదరాలతో ఆమెను చూసుకునేవాడు. పదేళ్ళ వయసులోనే ఆమె విధవ అయింది. ఆర్య హిందూ ఆచారాలని అనుసరిస్తూ పసితనంలోనే వాళ్ళకి బాగా తెలిసిన కుటుంబంలోని ఓ యువకుడికి యిచ్చి పెళ్ళిచేశారు. అత్తారింటికి పంపే రెండో కార్యక్రమం జరగలేదు. బ్రాహ్మణ విధవలాగే ఈ చిన్న మాదిగ కన్య మళ్ళీ పెళ్ళాడరాదు. మాదిగల పద్ధతికి అది చెందకపోవచ్చు. రెండుసార్లు పుట్టే బ్రాహ్మణులను అనుసరించటం
మంచిదనుకున్నారు.
ఏళ్ళు గడుస్తున్నాయి. ఉక్కమ్మ నజరయ్య శిష్యులు చెప్పిన మత విధులలో మునిగిపోయింది. ఆమతం పాటలని పాడటాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆమెకి తోడుగా వెళ్ళేవారు. క్రమంగా ఉక్కమ్మకి నలభై ఏళ్ళు వచ్చాయి. ఆ ఊరు ఈ ఊరు పాడటానికి ఆడటానికి పిలిచేవారు. ఆమెని చాలా గౌరవించేవారు.
"ఆమె అందరు ఆడాళ్ళలాంటిది కాదు. భగవంతుడిని సేవిస్తోంది." అనుకునేవారు. కొన్నాళ్ళకి ఆమె వేలు విడిచిన సోదరి కూడా భర్తని కోల్పోయింది. ఇద్దరు ఆడవాళ్ళు అప్పటినుంచి కలిసి తిరుగుతుండేవారు. వాళ్ళు ఏ వూరు వెళ్ళిపాడినా ఉట్టి చేతులతో పంపేవారు కాదు. వాళ్ళ చేతుల్లో డబ్బు పోగయింది. కొంత
నజరయ్య గుడికి యిచ్చారు. కొంత తల్లిదండ్రులకు యిచ్చారు.
ఉక్కమ్మ దూర గ్రామంలో ఉండి కుటుంబంలో అందరికన్నా దైవభక్తి గలది కనుక ఏ ముఖ్యనిర్ణయం తీసుకోవాలన్నా ఆమెను సంప్రదించాలని తండ్రి గట్టిగా చెప్పాడు. 'పెద్ద కొడుకు కొండయ్యకు ఆ తర్వాత రోజులలో నిద్రపట్టలేదు. "ఉక్కమ్మ రావటంలేదు. నేనే వెళ్తాను. అన్నాడు. రెండు రోజులు ప్రయాణం
చేశాడు. అక్క కళ్ళు మెరిసాయి. " ఇంటి దగ్గర అందరూ బాగున్నారా"? అని అడిగింది. ఆ వాడ వాళ్ళందరికీ తన తమ్ముడు. వచ్చాడని చెప్పింది. మాదిగ పెద్ద భార్య ఇత్తడి గ్లాసులో మజ్జిగ యిచ్చింది. సేదదీరాడు.
అక్కా తమ్ముడూ కూర్చుని మాట్లాడుకున్నారు. అక్క వ్యతిరేకించదని కొండయ్యకి తెలిసిపోయింది. "ఈ మతం గురించి విన్నాను. మన నజరయ్య చెప్పిందీ దేవుడు ఒకడేనని. అది సత్యం. కాని మనం తప్పు చేశాం. విగ్రహాలను పూజిస్తున్నాం. నీకు ఒంగోలుకి వెళ్ళాలనిపించటం మంచిదే. నా కోసం చూడకు.
వెంటనే వెళ్ళు. తొందరలోనే నేను యింటికి వస్తాను. నేను కూడా జీసస్ క్రీస్తుమీద విశ్వాసాన్ని ప్రకటిస్తాను. అంది ఉక్కమ్మ. ఉక్కమ్మ మాటలు కొండయ్య ఇంటికి వచ్చి చెప్పాడు. అందరూ తృప్తిపడ్డారు. పాతది వదిలేసి కొత్త జీవితంలోకి ప్రవేశించే సమయం వచ్చిందన్నారు.<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|47|}}</noinclude>
hnqr80gwurtr94x4wdn6q4df6wxdo13
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/49
104
212375
554370
554263
2026-04-25T01:57:30Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554370
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఆ కుటుంబంలో మార్పులు వ్యాఖ్యానాలకు గురవకుండా ఉండవు. వారి కుటుంబం అంత ప్రసిద్ధమైనది. శూద్రులకు వాళ్ళమీద కోపం వచ్చింది. ఆదివారం నాడు పిలిస్తే. ఈ రోజున జరుగుతున్నట్టు. రామని ఉల్లూరి వాళ్ళ కుటుంబం అంతకుముందు ఎన్నడూ అనలేదు. క్రైస్తవుల సంఖ్య పెరుగుతోంది. అందరూ
ఒకేరకంగా ధిక్కరిస్తున్నారు. అంతకుముందు ఎన్నడూ వాళ్ళ పాలేర్లలో శూద్రులు అలాంటివి చూడలేదు. “వాళ్ళకి పాఠంవ చెప్పాలి” అనుకున్నారు.
అవి నూర్పిళ్ళ రోజులు. కొందరు క్రైస్తవులు దమ్ముల్లోనూ, నాట్లలోనూ పనిచేశారు. పాత ఆచారాల ప్రకారం వాళ్ళ వంతు ధాన్యం తీసుకోవటం వాళ్ళ హక్కు వాళ్ళకి పాఠం చెప్పటానికి శూద్రులు ఆదివారం రోజునే మార్చారు. ఆ రోజు పనిలోకి రాకుండా ఉండిపోయారు క్రైస్తవులు. ఆ విధంగా వాళ్ళకి చాలా నష్టం వాటిల్లింది.
ఓ ఆదివారం రోజున శూద్రులందరూ పనుల కోసం పొలాలకు వెళ్ళారు. ఊళ్ళో కొంతమందే ఉన్నారు. పాలు కాచటానికి మునసబు ముసలి తల్లి నిప్పు ముట్టించింది. అలా పక్కకి వెళ్ళేసరికి పక్కనే ఉన్న చిట్టు తట్ట అంటుకుంది. పొలాల నుంచి జనం వచ్చేసరికి పది ఇళ్ళు కాలిపోయాయి. క్రైస్తవులకి నష్టం కలిగించటానికి ఆదివారం నాడు నూర్చిన ధాన్యమంతా కాలిపోయింది. దాక్కోటానికి ముసలమ్మ పారిపోయింది. తిరిగి వచ్చి గుండెలు బాదుకుంది. “దేముడు మనలని శిక్షించాడు” అంది. అంతకు ముందు క్రైస్తవుల మీద చాలా కఠినంగా ఉండేది. దైవం యిచ్చిన ఈ తీర్పుకి ప్రధాన కారణం తనే అనుకుంది. వివాదం ముగిసింది. అప్పటినుంచి శూద్రులు ఆదివారాలలో చిన్న చిన్న పనులు చేసుకుని ముఖ్యమైన పనులు క్రైస్తవులు తమతోచేరినపుడు చేసుకోసాగారు.
గ్రామదేవత పండగ చేసుకోటానికి శూద్రులు అన్ని ఏర్పాట్లు చేసుకుని మాదిగలకి దేవతా విగ్రహం ముందు డప్పుకొట్టమని, నాట్యం చెయ్యమని కబురుపంపారు. ఇది అనాదిగా వస్తున్న పరస్పర సహకారపద్ధతిలో మాదిగలు నిర్వహించవలసిన విధి. వాళ్ళు ఇప్పుడు రామన్నారు. శూద్రులకి మళ్ళీ ఆగ్రహం కలిగింది.
వాళ్ళు మాదిగలకి కబురుపంపారు. "అయితే మీ అంతట మీరుండండి. మా అంతట మేం ఉంటాం. మీరు మాకు పనులు చెయ్యనక్కరలేదు. మీరు మాకు వద్దు.”
శూద్రులు అనుకున్నంత సులువుకాలేదు బరువులు మొయ్యటం, క్రైస్తవులు కాని మాదిగలు కూడా ఓ విధమైన సంఘీభావనతో తమవాళ్ళు నిరాకరించిన పనులను తామూ చెయ్యమన్నారు. ఏదో కొద్దిమంది పనికిమాలిన వాళ్ళు వెళ్ళారు. దాంతో శూద్రులు రాజీ పడదామన్నారు.
ఉల్లూరు వాళ్ళ కుటుంబానికి చాలా కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి. గురువు పోలయ్య కూడా ముక్తి మార్గానికి క్రైస్తవుడవటమే మార్గమని సలహా యిచ్చాడని అందరికీ తెలిసింది. ఈ మార్పు తాలుకు ప్రాధాన్యత ఆ కుటుంబాలలో దూరం వాళ్ళు గ్రహించలేరు. వాళ్ళు గురువులు మాత్రం మారారని, మాదిగలలో పురాతన సంప్రదాయాలను వారు ముట్టుకోలేదని అనుకున్నారు.
పదిమైళ్ళ దూరంలోని ఓ కుటుంబం నించి పేరంటారు పండగకి రమ్మని కబురొచ్చింది. "మేం క్రైస్తవులం. పేరంటాలుతో మనమేం చెయ్యగలం" అన్నారు చాలామంది.
"గోడమీద ఆ చిహ్నాల గురించి మనం ఏమనుకుంటున్నదీ వెళ్ళి చెప్పుదాం" అన్నారు ఇతరులు.
వెళ్ళారు. గోడమీద పేరంటాలు చిహ్నాలని చెరిపేస్తేనే వండిన వంటలను ముట్టుకుంటామన్నారు.
అందులో ఒకడు బలహీనంగా అన్నాడు. “ఇంతవరకూ ఎవరు ఎందులో చేరినా తేడా ఏమీ లేకుండా పేరంటాలుని పూజించేవారు. క్రైస్తవం వాటికన్న భిన్నమయినదా?”
వాదనలు నడిచాయి. మధ్యలో ఒకడు లేచి కావాలంటే నా చెప్పులతో పేరంటాలు తాలూకు పసుపుబొట్లు, ఎర్రబొట్లు చెరిపేస్తానని ముందుకొచ్చాడు. అది జరిగింది. గొడవ చల్లారింది. ఆ కుటుంబం తాలూకు పురాతన స్త్రీ పూర్వీకురాలుకి పెట్టకుండా విందు జరిగింది.
"మనకావిడ ఏం మంచి చేసింది? ఏ పాపం తొలగించింది? మనకి కావలసినది దేవుని ఆశీర్వచనాలు" అన్నారు. వచ్చిన వాళ్ళలో ఒకరు.
మరో కుటుంబ శాఖ ఏటా చేసే నాగరప్పమ్మ పండగకి తయారవుతోంది. వాళ్ళు నాగులని పూజిస్తారు. పడగపట్టిన పాముని స్త్రీ రూపంలో పూజిస్తారు. పురాతనమైన సర్పరూప పూజశక్తి పూజల కలయిక అది. పొలాల్లో చీమల పుట్టల్లో పాములు నివాసముంటాయి. ఏడాదికోమారు నాగరప్పమ్మ పండగ జరుగుతుంది. పాము నివాసాలుగా భావించే చీమ పుట్టల మీద నీళ్ళు పోస్తారు. అన్నం పుట్ట ముందు పెడతారు. పాలు కన్నాల్లో పోస్తారు. ఆ చీమల పుట్ట పాము గుర్తులున్నా లేకపోయినా పూజలు చేస్తారు. భక్తులు తృప్తిగా వెళ్ళి విందు చేసుకుంటారు. నాగరప్పమ్మ వాళ్ళ పూజలను స్వీకరించిందని నమ్ముతారు.
పేరంటాలు చిహ్నాలకు జరిగింది తెలిసి నాగరప్పమ్మ పండగని మానెయ్యడం మంచిదనుకున్నారు. వాస్తవానికి ఆ పండగ మళ్ళీ జరగలేదు. క్రైస్తవం ఎంత తొందరగా వ్యాపించిందంటే దానికి పూర్వంవి అన్నిటినీ తుడిచేసింది.
ఆ కుటుంబాల్లోని ఎల్లమ్మ భక్తులు కూడా ఇంట్లో ఎల్లమ్మ గృహాన్ని కప్పునించి వేళ్ళాడే కుండనీ, చిహ్నప్రాయమైన గుల్లలనీ ఉంచుకోటానికి సిగ్గుపడ్డారు. ఆ ప్రాంతంలోని మాతంగి మాత్రం తన కోపాన్ని దాచుకోకుండా చూస్తూ ఉండిపోయింది.
బడులు మొదలయాయి. తెలివైన పిల్లలిని చదువులకి ఒంగోలు పంపారు. నజరయ్య మతస్థులు ప్రత్యేకించి ఒకరి తర్వాత ఒకరు మాదిగలని క్రైస్తవులుగా మార్చే ఉద్యమంలోని ముఖ్యకేంద్రాలలో గొప్పు సేవ చేశారు.<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|48|}}</noinclude>
9r9xtbjbudjoi2am3vxhfa9trfnzwbv
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/50
104
212376
554377
554264
2026-04-25T03:53:54Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554377
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}3. తల్లి శాపం</p>
{{Largeinitial|కొ}}మ్ము పున్నయ్య అనే యువకుడు ఉత్తరాదికి తోళ్ళ వర్తకం కోసం బయలుదేరేముందు తిరిగొచ్చాక సుబ్బమ్మ అనే పిల్లని పెళ్ళాడ్డానికి నిశ్చయించుకున్నాడు. ఆమె పదమూడేళ్ళ అందాల బొమ్మ. దూరం చుట్టం కనుక తరచు చూసేవాడు. ఈ మధ్యకాలంలో ఆచారం ఒప్పుకోదు గనుక మాట్లాట్టానికి సాహసించలేదు.
అతను వాళ్ళ కుటుంబంతో మాట్లాడాడు. పెళ్ళికి ఒప్పుకున్నారు. ఓ రోజు ఆ పిల్ల బామ్మతో మాట్లాడుతున్నాడు. సుబ్బమ్మ తలుపు వెనుక ఉందని తెలుసు. ప్రతీమాటా వింటోందని తెలును. "ఒక్క ఏడాదిలో తిరిగొస్తాను. నా చేతుల్లో డబ్బులుంటాయి. నేను లేనప్పుడు సుబ్బమ్మకి పెళ్ళి చెయ్యకండి”
అన్నాడు. ముసలమ్మ “అలానే నువ్వు వచ్చాక నీకే పెళ్ళాం అవుతుంది” అంది. తలుపు వెనక ఏదో కదలిక. ముహాన్ని చేతుల్తో కప్పుకుని సంతోషంతో ఉందని పున్నయ్య గ్రహించాడు.
ఓ ఏడు కాదు. అయిదేళ్ళు గడిచాయి. ఎవరైనా మాదిగ తన తోళ్ళ బళ్ళతో ఊరికి తిరిగి వెళ్తున్నారని తెలియగానే సుబ్బమ్మ మామ్మకి కబురుపంపేవాడు. తను బానేవున్నానని, యింటికి తిరిగిరాగానే సుబ్బమ్మని పెళ్ళాడుతానని కబురు పంపేవాడు.
పున్నయ్య నజరయ్య మతస్థుడు. ఉత్తరాదిన అతనితోనే ఉండే శేషయ్యది కూడా అదే మతం. దార్ల ఎల్లయ్య అనే మాదిగది కూడా అదే వ్యాపారం. అతను ఆరునెలలకు ఓ సారి వచ్చేవాడు. పున్నయ్య శేషయ్య కొన్న తోళ్ళను బేరం చేసేవాడు. ఎల్లయ్య క్రైస్తవుడు. ముగ్గురూ కూర్చుని వాళ్ళ మతాల గురించి
మాట్లాడుకునేవారు. ఎల్లయ్య క్రైస్తవ పాటలు పాడితే వాళ్ళిద్దరూ నజరయ్య పాటలు పాడారు. కాని క్రైస్తవ పాటలని నేర్పమన్నారు.
నజరయ్య మతం తాలూకు అన్ని రకాల ఆచారాలు పూజలూ ముందుగా వదిలెయ్యాలన్నాడు. నిజమైన దేవుడిని మాత్రం పూజించాలన్నాడు. ఇదెలాగవుతుందని వాళ్ళు అడిగారు. ఆ సమయానికి ఓ నది ఒడ్డున ఉండటం జరిగింది. ఎల్లయ్య భుజంమీద తువ్వాలు తీసి నేలమీద పరిచాడు. వాళ్ళని తనతోబాటు మోకరిల్లమన్నాడు. “నేనే నా తండ్రియైన దేవునితో మాట్లాడతాను” వినమన్నాడు ఆరోజు వాళ్లని వదిలేముందు టెన్ కమాండ్మెంట్స్ చెప్పాడు. అతను వెళ్లిపోయాక వాళ్ళు అనుకున్నారు. “మనం
నజరయ్య పాటలని పాడుకోవచ్చు. అయితే ఎల్లయ్య చేసినట్టు ప్రార్ధిస్తే మంచిది”.
ఎల్లయ్య అటు వెళ్ళినపుడు వాళ్ళకి యింకా యింకా బోధించాడు. కొన్నాళ్ళకు వాళ్ళు అనుకున్నారు. “మనం సారా మానేద్దాం. చచ్చిన గొడ్డుమాంసం తినొద్దు" వాళ్ళు తోళ్ళ బేరం కుదుర్చుకున్న మాలలకు కోపం వచ్చింది. "మీరు మాదిగలలా ఉండటంలేదు. చచ్చిన గొడ్డుమాంసం తినటంలేదు. మీరు క్రైస్తవులు” అన్నారు. చేసుకున్న ఒప్పందాన్ని తిరస్కరించారు. పున్నయ్య చేతిలో ఎలాంటి రుజువూ లేదు. మదుపు
పెట్టినదంతా పోయింది. ఆ తరువాత అతను నేరుగా కొన్నాడు. ఒప్పందంలో మిగిలినంత మిగలలేదు.
పున్నయ్య ఇంటికి వచ్చాడు. పెళ్ళాడాడు. సంసారంలో స్థిరపడ్డాడు. ధనవంతుడయ్యాడు. అతను కాస్త చదవనేర్చిన మనిషిని పట్టుకుని చదువు నేర్పమన్నాడు. అతని ద్వారా ఒంగోలుకి ఓ దొర వచ్చాడని విన్నాడు. వెళ్ళి చూడాలని నిశ్చయించుకున్నాడు. మేకతోళ్ళు ఓ బరుపు వేసుకుని అమ్మకానికి ఒంగోలు
బయలుదేరాడు. మిషన్ వాకిలిలో అడుగుపెట్టగానే పెంటయ్యను కలిశాడు. చెట్లకింద కూర్చుని కబుర్లు మొదలెట్టాడు. పెంటయ్య అమ్ముతున్న చిన్ని చిన్ని పుస్తకాలమీద ఆసక్తి కలిగింది. పుస్తకాలంటే
పున్నయ్యకి ఆకర్షణ. కొన్నేళ్ళ తరువాత అతను క్రమబద్ధమైన బోధకుడు అయ్యాక అతను అనేక తెలుగు గ్రంథాలు పుస్తకాలు సేకరించాడు. అతని దగ్గర పుస్తకాలు కొన్నే ఉండటం తెలుగు క్రైస్తవ సాహిత్యం తగినంతగా లేకపోవడాన్ని సాక్ష్యం. కాని పున్నయ్యకి తన లైబ్రరీ అంటే చాలా గొప్ప. ఎవరయినా వచ్చి
చూసేలోగానే తెల్లచీమలు వచ్చి మొత్తం తినేశాయి. తర్వాత అతను ఒక మిషన్ కుటుంబం నుంచి కొద్ది రూపాయలకు, ఒక "మాంసం పెట్టె (Meat Safe)" కొన్నాడు. దానిలో తెల్లచీమలు ఏరవు. అతను నాకు వివరించాడు. "చుట్టూ ఇనప కిటికీలు ఉంటాయి". దాని ద్వారా నాకు అది తీగచిక్కం (Wire-netted) అని అర్థమయింది. ఆహారానికి చీమలూ దోమలూ పట్టకుండా ఉంచే ఆ పెట్టెలో తన కొత్త గ్రంథాలయం భద్రంగా ఉంటుందని పున్నయ్య అనుకున్నాడు. పుస్తకాలమీద ప్రేమతో పున్నయ్య వెంటనే
ఆ పుస్తకాలు తీసుకువెళ్ళి తన తోళ్ళ అమ్మకంతోబాటు పెంటయ్య కోసం అమ్మిపెడతానన్నాడు. ఇద్దరూ బంగ్లాకి వెళ్ళారు. దొరికి పెంటయ్య పరిచయం చేశాడు. క్రైస్తవునిలా జీవిస్తున్నాడని చెప్పాడు. పుస్తకాలు అమ్మటానికి ఒప్పుకున్నాడని చెప్పాడు. ఒంగోలు స్కూలుకి రమ్మన్నాడు దొర. సరే అన్నాడు.
వ్యాపార నిమిత్తం వచ్చి వెళ్లినపుడల్లా పున్నయ్యని స్కూలుకి రమ్మంటూనే ఉన్నారు. అస్తమానూ వస్తాననేవాడు కాని అతని వ్యాపార ప్రవృత్తి బలమైనది. డబ్బు సంపాదన ప్రయత్నాలలో రాటానికి సంకోచించాడు. ఒకరోజు మేకతోళ్ళ బండి బరువుతో ఒంగోలు వచ్చాడు. మామూలుగా దొరని చూడటానికి వెళ్ళాడు.
"ఎలా ఉన్నావు పున్నయ్యా?”
తెలుగు వాళ్ళకి సాధారణమైన విధంగా తల ఊపి బానే వున్నాను అని అన్నాడు పున్నయ్య.<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|49|}}</noinclude>
aovi5n3fdbcr8ctooob4zktebxlkuw1
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/51
104
212377
554378
554265
2026-04-25T04:11:59Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554378
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>"ఈసారి ఎంత డబ్బు వచ్చింది?"
“ముప్పై రూపాయలు” నడుముకి కట్టుకున్న మూట విప్పి వెండిని చూపించాడు. దొర అతని చేతులు పట్టుకుని ఆ డబ్బులు తీసేసుకుని అన్నాడు. "నువ్వు మాట మారుస్తున్నందుకు యిది ఫైన్. నాలుగుసార్లు స్కూలుకి వస్తానన్నావు. రాలేదు. సలాం" అని దొర బంగ్లాలోకి వెళ్ళిపోయాడు.
పున్నయ్య వెళ్ళలేదు. బయట నిలబడి దొర లోపల తిరుగుతూండటం గమనించుతున్నాడు. రెండుసార్లు తలుపు తీసి "ఎందుకు వెళ్ళటం లేదు" అని అడిగాడు.
"నాకు నా డబ్బు కావాలి”
చిట్టచివరికి దొర పిలిచాడు. భుజం మీద చెయ్యేశాడు. మృదువుగా కదిపాడు. దాదాపు ఆ యువకుడు పడిపోయినంత పనయింది. కాని అది అతనికి అమితమైన ఆనందం యిచ్చింది. "ఇదిగో నీ డబ్బు. స్కూలుకి వస్తావా"?
"వస్తాను".
కాని దొర తన భోధకుడిని పిలిచాడు "జొనాధన్! ఈ యువకుడు నాతో నాలుగుసార్లు అబద్దమాడాడు. ఇప్పుడతను స్కూలుకి వస్తానంటున్నాడు. అతను రాకపోతే నువ్వే సాక్ష్యం. నువ్వు ఇతన్ని తీసుకొచ్చి నాకు అప్పగించాలి. పేరు రాసుకో! అన్నాడు. జోనాథన్ పేరు రాసుకున్నాడు. పున్నయ్య యింటికి వెళ్ళాడు.
ఆ తర్వాత పున్నయ్యకి శాంతి లేకపోయింది. పశువులు అమ్మేశాడు. అంతా సిద్ధం అయాక ఒంగోలుకి
బయలుదేరాలనుకున్నాడు. భార్య సుబ్బమ్మ "నేను రాను" అంది. సుబ్బమ్మ చాలా అందమైన యువతి ఇప్పుడు. మెడలో నల్లపూసలు, చేతులకి గాజులు ఆమెకి ఇష్టం. వాళ్ళకి పెళ్ళయినప్పుడు ఆచార
ప్రకారం మాదిగ దాసరి ధాన్యం రాశి మీద ఉంచిన తాళిబొట్టు తీసి పున్నయ్య చేతికి యిచ్చి సుబ్బమ్మ మెడలో కట్టించాడు. తాళిబొట్టు బంగారంది. ఆమె యితర నగల్లో వెండీ, బంగారం తక్కువకాని చూడటానికి బానే ఉండేవి.
మొదట మతంపుచ్చుకున్న ఆడవాళ్ళు దొరసాని గాజులు మంగళసూత్రాలు వేసుకోకపోవటం చూసి ఇవి లేకపోవటం క్రైస్తవమతంలో భాగమయుంటుందని తొలి రోజులలో భావించినట్టు కనిపిస్తుంది. బంగారపు తిమ్మయ్య భార్య సత్యమ్మ గాజులని పగలగొట్టింది. వాళ్ళు వెళ్ళిన చోటల్లా 'రాజయోగి మతం వెండిరింగులు వేసుకోమంది. వేసుకున్నాను. అయితే యిప్పుడు ఏమీ లేదు” అని బోధించేవారు.
ఆడవాళ్ళు వేసుకునే గాజులు కేవలం నగలు కాదు. వేసుకున్నావిడ విధవ కాదు అని తెలియజేస్తాయి. బ్రాహ్మణులలో మగవాడు చనిపోతే విధవరాలి నగలన్నీ తీసేస్తారు. ఒక్కోమారు క్రూరంగా కూడ వొలిచేస్తారు. రెండుసార్లు జన్మించే ఆర్యుల ఈ ఆచారాన్ని మాదిగలు తప్పనిసరిగా అనుకరించి ఉంటారని నేను
అనుకొంటాను. మాదిగలు విధవరాలిని కొత్తగా చేసిన భర్త సమాధి వద్దకి తీసుకువెళతారు. ఓ కర్రతో ఆ గాజులని పగలగొడతాడు. మాదిగ దాసరి.
మిషన్ కొత్తగా వచ్చిన రోజులలో ఒక బోధకుని భార్య తనకు బాగా తెలిసిన గ్రామానికి వెళ్ళింది. ఆమె చేతులకు గాజులు లేవు. అక్కడ ఆడాళ్ళు పో అన్నారు. "మీ దేముడు మాకు అవసరంలేదు. నువ్విక్కడ ఉన్నపుడు నీకు భర్త ఉన్నాడు. ఇప్పుడు నీ చేతులు చూడు గాజులు పోయాయి. నీ కొత్త దేముడు నీకు చేసినది ఏమిటి?" ఆ తరువాత మిషనరీ అతని భార్య ఆడవాళ్ళని గాజులు ఉంచుకోమన్నట్లు కనిపిస్తుంది. ఇందులో ఒక సాంఘిక ఆచారం ఉంది కనుక దానిలో కలగజేసుకోటం తగదనుకున్నారు.
పున్నయ్య భార్య సుబ్బమ్మ ఇది వినే వుంటుంది. నగలు లేకుండా రానంది. ఒంగోలుకి తనతోబాటు తీసుకువెళ్తున్నట్లు ఆమె తల్లికీ, బామ్మకి తెలియకుండా చూసుకున్నాడు పున్నయ్య. ఒక్కడే వెళ్ళాడు. ఆరు నెలల తర్వాత సుబ్బమ్మ కోసం వచ్చాడు. తల్లీ, బామ్మ ఏడ్చారు. ఊళ్ళో గొడవ చేశారు. అంతా అన్నారు.
"అది దాని మొగుడితో వెళుతూంది. అందులో గొడవేముంది”? నేను వెళ్తున్నాను అంది సుబ్బమ్మ ఒంగోలుకి పదిమైళ్ళ దూరంలో ఓ చెట్టు కింద కూర్చున్నాక కాళ్ళకి మట్టెలు, దండ కడియాలు సత్తుతో చేసినవి “ఇవి ఒంగోలులో బాగుండవు" అన్నాడు. సుబ్బమ్మతో పున్నయ్య 'తీసెయ్యి' అంది ఆమె. గాజులు ఉంచుకుంది. దొర, దొరసానిలకు సలాం చేయించాడు. పున్నయ్య. 'చాలా మంచి అమ్మాయి' అన్నారు వాళ్ళు.
ఏళ్ళు గడిచాయి. పున్నయ్య బాధ్యతలను మోయగలడడు గనుక బోధకుడయ్యాడు. సుబ్బమ్మ చిన్న చిన్న పిల్లలని ఆమె తల్లి చూసుకునేది. వాళ్ళిద్దరూ ఆరంభించిన స్కూలులో సుబ్బమ్మ పాఠాలు చెప్పేది. ఓ రోజు కొల్లుం రామయ్య ఒక ఆపదలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అతను క్రీస్తుని నమ్ముతున్నాడు కాని
కుటుంబమంతా వ్యతిరేకిస్తోంది.
పున్నయ్య అతని ఊరు వెళ్ళాడు. అతను ఆతిథ్యం యిచ్చాడు. పున్నయ్య ఊళ్ళోకి ఎక్కడికి వెళ్ళినా బియ్యం దంచుతున్న ఆడాళ్ళతోనూ ఆటల్లో ఉన్న పిల్లలతోనూ మాట్లాడుతూంటే రామయ్య అంటిపెట్టుకుని ఉండేవాడు. కోడిని కొయ్యమని ఆ సాయంత్రం పెళ్ళానికి చెప్పాడు. 'ఈ మనిషి, మనకి చుట్టమా అంత విందు చెయ్యడానికి' అని ముసిలావిడ అనటం విన్నాడు. రామయ్య ఆ రాత్రి కొబ్బరి నూనెదీపం వత్తి తగ్గించి గాలి ఆర్పేయకుండా గూట్లో ఉంచాడు. తతిమ్మా వాళ్ళు నిద్రోయారు. తెల్లారీదాకా రామయ్య పున్నయ్య కొత్త మతం గురించి మాట్లాడుకున్నారు. "నేను జీసస్ క్రీస్తుని నమ్ముతాను. ఇంతవరకూ
నేను చేసినవన్నీ వ్యర్ధం" అన్నాడు రామయ్య.
రామయ్య భార్య అతనివేపే ఉంది. లేకపోతే కుటుంబంలో ఒక్కడూ అయిపోయేవాడు. ఆమె కష్టాల్లో పడింది. అత్తగారు<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|50|}}</noinclude>
5g6fiynqy5jfwh9cdr792eopfz5s59a
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/52
104
212378
554388
554266
2026-04-25T05:48:15Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554388
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>వాళ్ళింటికి వస్తున్న కీడంతటికి కారణం నువ్వే అని కోడలుని తిట్టింది. నువ్వు క్రైస్తవులలో చేరితే నిన్నొదిలేస్తానని భర్తతో ఎందుకు అనలేదు?- అని అడిగింది. భర్త ఆమె మీద ఒత్తిడిని గమనించాడు.
కుటుంబం అందరిముందూ- "రాదలుచుకుంటే- రా. సంతోషిస్తాను. రాదలుచుకోలేదూ- ఉండిపో. నేను మాత్రం నీతో ఉండను. నీకోసం నేను నా ఆత్మ విముక్తి మార్గాన్ని వదులుకోలేను-" అన్నాడు భార్యతో. అతనలా అనడంతో ఆమెని ఎవరూ తప్పుపట్టలేకపోయారు. నువ్వెక్కడికి వెళ్తే నేనూ అక్కడికే. నువ్వు
లేనిచోట నేనుండను" అని చెప్పింది.
తన బాప్తిజం కారణంగా తన కుటుంబం తనని వెలివేయడం చూచి రామయ్య అతని భార్య బంధువులు ఎవరైనా తమతో కలుస్తారని ఆశపెట్టుకున్నాడు. అరవైమైళ్ళు నడిచి వెళ్ళాడు. భార్య బంధువులు ఆదరంగా ఆహ్వానించారు. వాళ్ళు నజరయ్య మతస్థులు. అందువల్ల రామయ్య తీసుకొన్న నిర్ణయంపట్ల
వ్యతిరిక్తత చూపించలేదు. "త్రిపురాంతకంలో ఏడాది పండగకి మాతోరా. పడమటను దూరంగా ఉన్న మా కుటుంబం వాళ్ళు అక్కడకి వస్తారు. మేం కలుస్తాం. అంతా కలిసి నువ్వు చెప్పేది వింటాం" అన్నారు.
ప్రయాణం జరిగింది. ఓ పెద్ద మర్రిచెట్టు కింద త్రిపురాంతకంలో కుటుంబమంతా కలిసి కూర్చుంది. రామయ్య అడిగాడు- "క్రీస్తు తప్ప మరో మార్గంలేదు. మనం ఇంకా తప్పుడు దోవలలోనే ఎందుకుండాలి?”
రామయ్య భార్య పినతండ్రి వయసు రీత్యా హుందాతనం రీత్యా ఆ కుటుంబమంతటికీ పెద్ద. "నజరయ్య మనని బిడ్డల్లా అనుసరించమన్నాడు. ఆయనే మనకి దారి చూపిస్తాడు." అన్నాడు.
"మీరు నజరయ్యను కూడా అనుసరించటంలేదు. విగ్రహారాధన వద్దన్నాడు ఆయన. మీరు పోలేరమ్మకీ మహాలక్ష్మికీ మొక్కుతూనే ఉంటారు. అన్నాడో రామయ్య.
అతని భార్య పెద్దన్న మరో కోణంలోంచి చూశాడు. "క్రైస్తవం సరయిన మతమే కావచ్చు. కాని మనం దాన్ని భరించలేం. “సారాయి తాగొద్దు. దొంగతనం చెయ్యెద్దు. ఇతర పాపాలు చెయ్యద్దు అన్నాడు నజరయ్య. కాని మనం నజరయ్య నియమాలని పాటిస్తున్నామా లేదాఅని ఎవరూ అడగరు. క్రైస్తవులయితే మనం
జాగ్రత్తగా ఉండాలి. చాలా కష్టం. ఎవరయినా క్రైస్తవ నియమాలతో ఎలా బ్రతకగలరు?"
అవునంటే అవునన్నారు అందరూ. నజరయ్య మతంలో ఉండటం మరింత సునాయాసంగా ఉంటుంది. క్రైస్తవ జీవితం చాలా కష్టంగా కనిపించింది.
రామయ్య భార్య పినతల్లి చివరగా అంది. ఆమె తెలివైనది. అందరూ ఆమె మాటను వింటూంటారు. “మనం పోలేరమ్మకి అంకాలమ్మకి మొక్కటం వల్ల తినటానికింత తిండి ఈ రోజు దొరుకుతోంది. వాళ్ళకి మొక్కడం మానివేస్తే తిండానికి గడ్డీ గాదం తప్ప ఏమీ దొరక్కపోవచ్చు.”
వాళ్ళ సమస్యకి అది వాస్తవ పరిష్కారంగా అందరికీ సంతోషం కలిగింది. చాలామంది లేచి కాళ్ళు జాడించుకున్నారు. అది చర్చకి ముగింపు. "అయితే మీరు మీ తిండి కోసం ఆత్మలని వదులుకొంటారా? అని అడిగాడు. రామయ్య తను విఫలుడనయ్యానని గ్రహించి అతనూ వెళ్ళటానికి బయలుదేరాడు.
ఇంటికి వెళ్తూ రామయ్య పున్నయ్యను కలిశాడు. సంగతి చెప్పాడు. మనలాంటి వాళ్ళు కొన్నాళ్ళు వెలివేయబడతారు. కాని కొన్నాళ్ళకి మన కుటుంబాలు మనని కలుస్తాయి” అన్నాడు. పున్నయ్య ఇంటికి వచ్చేసరికి తండ్రి యిద్దరు తమ్ముళ్ళూ వినటానికి సిద్దపడేసరికి రామయ్యలో మళ్ళీ ఆశ పుంజుకుంది. కాని
రామయ్యతండ్రి మెత్తటి మనిషి. పెళ్ళామంటే భయం. తమ్ముళ్ళు అటూ యిటూగా ఉన్నారు. అన్న మొదటి అడుగువేయాలని చూస్తున్నారు. రామయ్య నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందనుకున్నాడు. ఒంగోలు వెళ్ళి బాప్తిజం తీసుకున్నాడు.
ఒంగోలు నుంచి తన పల్లెకి వచ్చేసరికి రామయ్య భార్య చేతులలో చంటి బిడ్డతో దోవ పక్కన కనిపించింది. ఈ సమయానికి రావచ్చని అక్కడ నిరీక్షిస్తోంది. "మనం ఏం చెయ్యాలి? మీ అమ్మ మండిపడుతోంది. నిన్ను యింట్లోకి రానివ్వను అంటోంది" అంది.
"ఫరవాలేదు మనం మరోచోటు చూసుకుందాం" ప్రశాంతంగా అన్నాడు. నెమ్మదిగా యింటికి వెళ్ళారు. రాత్రి భోజనానికి ధ్యానం దంచుతోంది తల్లి. పెద్ద కొడుకుని చూసింది. అతను తలగుడ్డ విప్పగానే కొప్పుముడి లేకపోవటం గమనించింది. గొప్ప దుఃఖంతో అంది.
"నిన్ను కన్నాను. పెంచాను. ముసలితనంలో నన్ను చూస్తావనుకున్నాను. మనం వెళ్ళగూడని మార్గంలో నువ్వు వెళ్ళావు. నీ చేతి తిండి నేను తినను. పో! నువ్వు నాకు చచ్చినవాడికిందే సమానం”
రామయ్య జీవితంలో తన నిర్ణయాలతోనే ఇంతకాలం నడిచాడు. ఇప్పుడు లొంగే అవకాశమే లేదు. ఇల్లు తనదే అన్నట్టు అతను ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతనితో కలగజేసుకునే ధైర్యం ఎవరికీ లేకుండాపోయింది. కాని కుల కట్టుబాట్లు అతనికన్నా బలమైనవి. కుటుంబం భోంచేసేటపుడు వాళ్ళతో తిననివ్వలేదు. అతనికీ పెళ్ళానికి తిండి వేరేగా పెట్టారు. అతని మైల అంటుకుని అందరికీ రోగాలు వస్తాయి గనుక నూతిలో నీళ్ళు తోడనివ్వమన్నారు. తనకోసం ఓ నూతిని తవ్వుకోవలసి వచ్చింది. నీళ్ళు వెంటనే పడ్డాయి. బరువుగా బాధగా గడిచాయి రోజులు.
కాని తల్లి కఠిన నియమం నిలవలేదు. చిన్న కొడుకులు కూడా బాప్టిజం తీసుకున్నారు. జుత్తు కత్తిరించుకుని వచ్చినపుడు ఆమె వాళ్ళని శపించటానికి సాహసించలేదు. 'ముసలాయన మంచాన
పడ్డాడు. చావు దగ్గరవుతోంది. క్రీస్తు గురించి చెప్పే ప్రతి పదంకోసం తపిస్తున్నాడు. కాని భార్య తిడుతుందేమోనన్న భయంకొద్దీ<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|51|}}</noinclude>
h1cessxmtay16d26vf1k5ja6j3zxxhn
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/53
104
212379
554389
554267
2026-04-25T05:52:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554389
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>తనకి శాంతి కలిగించేదేమిటో చెప్పటానికి ధైర్యం లేకపోయింది. అతను నజరేల్ యొక్క జీసస్ మీద విశ్వాసంతో చనిపోయాడు. రామయ్య ఒక తమ్ముడు ఒంగోలుకి స్కూలుకి వెళ్ళారు. ఆఖరాడు అమ్మకి సహాయంగా ఇంటివద్ద ఉండిపోయాడు. బయటకు ఒప్పుకోకపోయినా, ఎవరో ఒకరు యింటివద్ద ఉండిపోయి తనను చూసుకుంటే తల్లి సంతోషించింది.
కొన్నేళ్ళు గడచాక ఆఖరాడు అన్నదమ్ములను చూడటానికి ఒంగోలు వెళ్ళాడు. అక్కడ ముగ్గురూ ఉండగా కొద్దిగా జబ్బుపడి తల్లి చనిపోయిందని కబురు వచ్చింది. ముగ్గురూ ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకున్నారు. ఒకరి ఆలోచన ఒకరికి తెలుసు. రెండు చేతుల్లోనూ ముఖం పెట్టుకుని రామయ్య ఏడిచాడు. "నేను తనకి చచ్చిపోయినట్టేనని చెప్పింది. ముసలితనంలో నా చేతి తిండి తిననంది. పిల్లలందరూ దూరంగా ఉండగా చనిపోయింది. తనన్నట్టే చేసింది."
తల్లిని తలచుకున్నపుడల్లా రామయ్యకి అలవికాని బాధ కలుగుతుంది. తల్లి శాపం గురించి చెప్పినపుడల్లా అతని కళ్ళలో నీళ్ళు నిండుతాయి.<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|52|}}</noinclude>
owoy3kux8gxicy2k53a4zx88s5tlhvk
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/54
104
212380
554390
554268
2026-04-25T05:55:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554390
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}రెండు మతాల యుద్ధభూమి<p>
1. కల్లోలంలో
2. శాంతికాదు ఆయుధం
3. మతద్వేషి అతని అంతం<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|53|}}</noinclude>
5yyuhq9ec3tytyqxft5hrno560npx1s
554391
554390
2026-04-25T05:57:13Z
శ్రీరామమూర్తి
1517
554391
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}రెండు మతాల యుద్ధభూమి<p>
1. కల్లోలంలో
2. శాంతికాదు ఆయుధం
3. మతద్వేషి అతని అంతం<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|53|}}</noinclude>
6hlctdq3ut47cjty8tcmop8dxbmvoxo
554392
554391
2026-04-25T05:59:40Z
శ్రీరామమూర్తి
1517
554392
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}రెండు మతాల యుద్ధభూమి<p>
1. కల్లోలంలో
2. శాంతికాదు ఆయుధం
3. మతద్వేషి అతని అంతం<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|53|}}</noinclude>
5yyuhq9ec3tytyqxft5hrno560npx1s
554407
554392
2026-04-25T08:40:17Z
శ్రీరామమూర్తి
1517
554407
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}రెండు మతాల యుద్ధభూమి</p>
1. కల్లోలంలో
2. శాంతికాదు ఆయుధం
3. మతద్వేషి అతని అంతం<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|53|}}</noinclude>
b8gporwhy5481zb1a2ow1ghuvqrmspw
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/55
104
212381
554409
554269
2026-04-25T09:01:53Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554409
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}1. కల్లోలంలో</p>
{{Largeinitial|ఎం}}డ్లూరి రత్నం భార్య తన భర్త పని మధ్యలో ఆపుచేసి తలవంచి చేతులు మడచి తనలో తను అనుకోవటం గమనించింది. “దేముడా నేను పాపిని. నాకు జ్ఞానం ఇయ్యి దారి వెతుక్కుంటాను” ఆమె కూడా అతనితో మోకరిల్లేది. దూర గ్రామంలో క్రైస్తవులను, వర్తకం కోసం వెళ్ళి చూసానన్నాడు. "అది తప్పకుండా మంచి మతం అయుంటుంది”. అంది.
బంగారపు తాతయ్య తన వాళ్ళ మతం మంచి చెడ్డలు కనుక్కోటానికి ఒకరోజు వచ్చాడు. ఎందువల్లనో రత్నం తన మనసులో మాట చెప్పలేదు. తాతయ్యని నిరుత్సాహపరిచాడు. "క్రైస్తవమూ నజరయ్య మతమూ ఒకటే. నేనెక్కడున్నానో అక్కడే ఉంటాను.” అన్నాడు. పదేళ్ళుగా నజరయ్య మతంలో ఉన్నందుకు రత్నంకి గొప్పగా ఉంది. రత్నం చాలాసార్లు త్రిపురాంతకం పండగకి వెళ్ళాడు. నేర్పిన మంత్రాలూ పాటలూ నేర్చాడు. దేముడు ఒక్కడే అన్నది పూర్తిగా నమ్మాడు. అయినా గురవడు స్వామిని పూజించటానికి తోటివాళ్ళు వెళ్తే తనూ వెళ్ళాడు. ఊరి చివర వేపచెట్టు కింద గురవడు నివాసం ఉంది.
ఆ ఊరి ముసిలాళ్ళు ఒకప్పుడు గురవడు అనే మనిషి ఉండేవాడని విచిత్రంగా చనిపోయాడని చెప్పేవారు. చుట్టాలంతా కుండలో అన్నం వండి గురవడు స్వామి సమాధి దగ్గరకు వెళ్ళి అన్నం పోసి రెండు పోగులు పెట్టారు. ఒక దానిలోంచి ఒక గుప్పెడు అన్నం తీసి రెండోదానిలో పెట్టి అర్పించారు. కొంచెం దూరంలో కూచుని చూస్తున్నారు. కాకులు వచ్చి తింటే గురవడు దయదలిచాడని వాళ్ళు భావించేవారు. కాకులు ఎగిరిపోతే వాటి రెక్కల మీద ఆత్మ శరీరాన్ని విడిచి స్వర్గానికి వెళతుందని మాదిగలు నమ్మేవారు.
గురవడు సమాధి వద్ద కాకులు వచ్చి తినలేదు. నేల మీదే ఆత్మ అలమటిస్తోందని అది తమకు కీడు చేయబోతోందని వాళ్ళకి తెలుసు. ఆ వేపచెట్టుకింద విచిత్రమైనవి రాత్రివేళ తిరగటం చాలామంది చూశారు. దాంతో దాని కింద ఓ రాయిపెట్టి పసుపురాసి ఎర్రచుక్కలు పెట్టి పూజిస్తే మంచిదనుకున్నారు. గురవడు ఏ రూపంలో ఉన్నా అలా గౌరవించి పూజించితే అతను ఊరికి కీడుచేయడు. గురవడు భయం తండ్రుల నుంచి కొడుకులకి సంక్రమించింది. ఊరికి ఏదయినా ఆపద జరిగితే అది గురవడు దెయ్యం పనేననుకునేవారు.
గురవడు గురించి తను అనుకుంటున్నది బంగారపు తాతయ్య ఎండ్లూరి రత్నంకి ధైర్యంగా చెప్పాడు. ఆ విషయం మీద తాతయ్యకు ఎప్పుడూ వ్యతిరేకతే వచ్చింది. తాతయ్య మాత్రం బాధపడలేదు. ఒంగోలు నుంచి ఒక బోధకుడు వచ్చినపుడు రత్నం వాళ్ళ ఊరు వెళ్ళమని తనవాళ్లని వదిలేయవద్దనీ చెప్పాడు. అతను తెలివైనవాడు. విద్యావంతుడు. మాదిగలలో మతం మార్పిడి జరుగుతున్న తొలినాళ్ళలో పూర్వం మిషనరీలలో చేసిన సేవలకి ప్రసిద్ధుడు. ఆ తరువాత ఒంగోలు మిషనరీకి కుడిభుజం అయాడు. ఊరంతా అతనిచుట్టూ మూగారు. అతను ముగించకముందే నజరయ్య మతానికి క్రైస్తవానికి తేడా రత్నానికి అర్ధం అయింది. అంతేకాదు ఆ బోధకుడు స్వామి గురవడు గురించి వేళాకోళంగా మాట్లాడాడు. అందరూ నవ్వారు. అందరి అనుమతి తీసుకుని గురవడు రాయిని, దాని మీద పసుపూ, ఎరుపూ చిహ్నాలతో
కాలవలో పడేశాడు. బోధకుడికి ఏమీ జరగలేదు. గురవడు ఆనవాళ్ళు లేవు.
ఆ రోజు రత్నంతో ఒంటరిగా మాట్లాడాడు. కొన్ని ప్రశ్నలు వేశాడు. "నీవు పాపివా జ్ఞానివా? నువ్వు స్వాములను పూజించటం మంచిదా చెడ్డదా? నువ్వు విగ్రహాలకు మొక్కావు. నీ శూద్ర యజమాని కళ్ళబడకుండా ధాన్యం దొంగతనం చేశావు. ఆదివారాలు పనిచేశావు, వచ్చిన గొడ్లమాంసం తిన్నావు. నీవు
చేసిందాని గురించి ఇప్పుడేమనుకుంటున్నావు?" రత్నం తప్పుచేశానని ఒప్పుకున్నాడు. అవన్నీ వదిలెయ్యాలని ఒప్పుకున్నాడు. బోధకుడు సంతోషించాడు.
కొన్నాళ్ళలో రత్నాన్ని కరణం ఓ దూరపు గ్రామానికి ఉత్తరం తీసుకెళ్ళమన్నాడు. మిగిలిన పనంతా వదిలేసి ప్రయాణం చెయ్యాలి. దానికేం కూలి కూడా ఉండదు. కొన్ని తరాల క్రితం వెంకటగిరి రాజా ఆ కుటుంబానికి నాలుగెకరాల మాన్యం యిచ్చాడు. దానికి బదులుగా కరణం చెప్పిన పని చెయ్యటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇది వెట్టి చాకిరీ, మధ్య యుగాలలో Serfdomకి దగ్గరగా ఉంటుంది. రత్నం తలగుడ్డలో చుట్టుకుని ఉత్తరాన్ని తీసుకువెళ్ళాడు. పెట్లూరు చేరాడు. ప్రభుత్వ కార్యాలయానికి
వెళ్ళాడు. బ్రాహ్మణ గుమాస్తాలు, అధికారులు పనిలో ఉన్నారు. దగ్గరికి వెళ్ళే ధైర్యం చెయ్యలేదు. ఒక పేద మాదిగ ఎదుటబడితేనే వాళ్ళు పీల్చే ఊపిరి మైలపడుతుంది. దూరంగా నిలబడ్డాడు. తెచ్చిన ఉత్తరం ఎత్తి పట్టుకున్నాడు. ఒక శూద్ర సేవకుడు వచ్చి ఉత్తరం తీసుకున్నాడు. అతన్ని వెళ్ళిపోవచ్చని చెప్పారు. ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాక చుట్టు దారిన ఇంటికి బయలుదేరాడు.
ఎండ్లూరి రత్నయ్య దూరపు బంధువు పుల్లికూరి లక్ష్మయ్య ఈ మధ్యనే బాప్టిజం తీసుకున్నాడని విని రాజయోగి గురువుల పనికిమాలినతనం గురించి చెపుతాడని విని చూడటానికి బయలుదేరాడు. లక్ష్యయ్య స్నేహదరాలతో ఆహ్వానించాడు. పుల్లలు వెలిగించి స్నానానికి వేణ్ణీళ్ళు పెట్టాడు. ఆడవాళ్ళు చేస్తున్న రాత్రి
వంట ఘుమఘుమలాడుతుంది. చింత చెట్టు కింద కూర్చున్నారు. ఆ సాయంత్రపు చల్లదనంలో ఇద్దరూ అనేకం మాట్లాడుకున్నారు.<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ..కుడుతూ..తెలుగు మాదిగల గాథలు|54|}}</noinclude>
2frjnt77b8rwcgs8ktfuezkz81912ig
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/56
104
212382
554411
554270
2026-04-25T09:20:50Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554411
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>లక్ష్మయ్య అధికారయుతంగా మాట్లాడక తప్పదనుకున్నాడు. "నువ్వు క్రీస్తుని నమ్మవా?" అని అడిగాడు. అవునన్నాడు. రత్నం. “నువ్వు బాప్టిజం తీసుకున్నావా? "లేదు". అయితే ఈ నెలలోనే ఒంగోలు వెళ్ళు. బాప్టిజం తీసుకో. లేకపోతే నువ్వు తొందర్లోనే చచ్చి నరకానికి పోతావు".
ఆత్మలు, దెయ్యాలు, భూతప్రేతాలు నమ్మే మాదిగలలో ఆలోచించేవాళ్ళకి మరణానంతరం మంచి జరగాలని బలీయమైన కోరిక ఉంటుంది. క్రైస్తవ భావనలైన స్వర్గము, నరకమూ వాళ్ళకి సులువుగా పట్టాయి. ఒకటి దొరకాలన్న ఆశ మరొకటంటే భయమూ వారి నైతిక వర్తన మీద మతావేశం మీద బలమైన ప్రభావం కలిగి ఉంటాయి. ఆ విధంగా లక్ష్మయ్య ఎక్కించడంతో రత్నం ఊగిసలాట ముగిసింది. ఒంగోలు మిషన్ ఎంచదగ్గ ఒక గొప్ప సేవకునిగా అతని భవితవ్యం రూపొందింది.
రత్నం రూపంలోనే ఒక విధమైన మర్యాద ఉట్టిపడుతూంటుంది. అతని వాలకం సాధారణమైనదేనా గొప్ప
రాజనం కనిపిస్తుంటుంది. ప్రతి ఉద్యోగమూ కళ్ళల్లో కనిపిస్తుంటుంది. అతను తదనంతరం జీవితంలో ఆదుర్దాకి అలవాటుపడ్డాడు. అది అతని జీవితంలోని కష్టాలకు గుర్తు. ఎవరైనా దయగా చూస్తే అతని వదనం అరుదైన చిరునవ్వుతో ప్రకాశవంతమవుతుంది. ఆ దయకి బదులుగా అతనిలో భక్తి కనిపిస్తుంది.
మొదటి సంవత్సరాలలో చుట్టుపక్కల ఊళ్ళలో బోధించటానికి వెళ్ళేపుడు తోడుగా భార్యని తీసుకు వెళ్ళేవాడు. ఇది అసాధ్యమైపోయింది. మతం మార్చుకున్నవాళ్ళు పెరిగే కొద్ది శూద్రులతో సమస్యలు పెరిగాయి. బోధకుడి మీద అతని భార్య మీద గొడవలు వచ్చాయి. "ఈ అవమానాలను ఎదుర్కోవడం
ఆడాళ్ళకు అపాయం” అన్నాడు. అప్పటినుంచి ఒక్కడూ వెళ్ళేవాడు.
ఒక చిన్నతరహా సాంఘిక విప్లవం ఆ రోజుల్లో నడుస్తుండేది. మాదిగ జనాభా తొందరగా క్రైస్తవంలోకి మారుతోంది. తత్ఫలితంగా శతాబ్దాలుగా మాదిగలని పట్టి ఉంచిన ఆర్ధిక సామాజిక సంబంధాలు తెగిపోతున్నాయి. వారానికి ఒకరోజు విశ్రాంతి, దైవప్రార్ధన కావాలన్న క్రైస్తవుల కోరికలో ఒక కొత్తదనం ఉంది. చాలామంది మాదిగలకు వారంలో రోజులను గుర్తుంచుకోవటం తెలియని పని. ఎన్ని రోజులు గడిచిందీ
తెలుసుకునీపాటి జ్ఞానం మానవులలో నైతిక వర్తనను అలవరచుకుందుకు అవకాశం యిస్తుంది.
మాదిగల ఈ నూతన స్వతంత్ర భావన శూద్ర భూస్వాములకి నిరంతరం చికాకుకి కారణమవుతూనే ఉంటుంది. కావలిసొచ్చినపుడల్లా తన పాలేర్లను పనికి పిలవటానికి అలవాటు పడ్డాడు. రాత్రీ పగలూ, విత్తనాల టైము పంటల టైము ఎప్పుడూ అతని పిలుపుకి సిద్ధంగా ఉండాలి. విశ్రాంతి పట్ల వారి కోరిక
న్యాయబద్ధమైనదిగా భూస్వామి చూడలేదు. అధికారం మీద తిరుగుబాటుగా శూద్రునికి కనిపించింది. శూద్రుల బాధను కరణం పంచుకున్నాడు. అతనూ క్రైస్తవ వెట్టివారిని ఆదివారం పనిచేయమన్నాడు. దూరప్రయాణాలు ఆరంభించమన్నాడు. వాళ్ళు మర్నాడు వెళ్ళటానికి అనుమతించమన్నారు.
ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత వ్యాపించింది. ఎప్పుడన్నా అమ్మవార్లకి, దేవతలకి పూజలు చెయ్యాల్సివస్తే తిరగబడుతున్న మాదిగలను ఎలా ఒప్పించాలన్న ప్రశ్న ఎదురయింది. గ్రామ సమాజానికి చేయవలసిన సేవలకు వాళ్ళు ఋణపడి ఉన్నారు. వాళ్ళ సేవలకు ప్రతిగా బలిచేయబడ్డ జంతువులు వాళ్ళకు చెందేవి.
రత్నం కింద ఉన్నగ్రామాలలో ఒకటైన బళ్ళపూడి గ్రామంలో ఈ తగువు తారస్థాయికి చేరింది. మాదిగలు పురాతన వ్యవస్థల మీద తిరగబడ్డారు. గ్రామీణ సామాజిక వ్యవస్థను వాళ్ళమీద ఉపయోగించారు. కుమ్మరి చేసే కుండలు పగిలిపోతూ ఉంటాయి. వాటిని తరచు మార్చాలి. అలాగే చాకళ్ళు గ్రామం అంతటికీ
సేవ చేస్తుంటారు. వాళ్ళ యిళ్ళు ఊళ్ళోనే ఉంటాయి. చెరువు ఎండిపోతే తగినంత నీరు ఉన్నచోట్లకి గాడిదల మీద వేసి బట్టలు తీసుకెళ్లారు. అనేకరకాలుగా పరస్పరం ఆధారపడటం గ్రామీణ జీవితంలో ఉంది. మునసబు, కరణం గనక ఆజ్ఞాపిస్తే మాదిగలకి పరస్పర సహకార గ్రామ జీవితం ఉండదు. వాళ్ళ వెలి చాలా దుర్భరంగా ఉంటుంది.
బల్లపూడి కరణం మరీ ధృడమైనవాడు కాదు. కాని పీడించే అధికారం తనకి ఉందని తెలుసు. తనే ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ దారి తప్పుతున్న మాదిగలతో ఎలా వ్యవహరించాలో ఆ ప్రాంతానికంతటికీ చూపించాలనుకున్నాడు. చాకళ్ళని క్రైస్తవుల బట్టలు ఉతకవద్దని చెప్పారు. కుమ్మరిని కుండలు అమ్మవద్దన్నారు. అందరూ మేపుకొనే పోరంబోకు భూముల్లోకి వాళ్ళ పశువులని రానివ్వనీలేదు. శూద్రులు అందరూ చెప్పులు కుట్టడం వంటి పనులు ఇవ్వమన్నారు. పంటల సమయంలో వాళ్ళని పనుల్లోకి రానీలేదు. శూద్రులు యిచ్చే ధాన్యం దొరకలేదు. వాళ్ళని అన్నివిధాల బహిష్కరించారు. ఎక్కడెక్కడి నుంచో విగ్రహారాధన చేసే మాదిగలను రప్పించి ఊరిపనులు చేయించాడు కరణం. క్రైస్తవులకి గత్యంతరం లేక దూరపు ఊళ్ళు పోయి చచ్చి చెడీ పొట్టపోసుకోవలసి వచ్చింది. ఇలా ఓ ఏడాది గడచింది. ప్రజల కష్టాలకి రత్నం చాలా బాధపడ్డాడు.
బళ్ళపూడి గ్రామానికి దగ్గర తోపులో ఒంగోలు మిషనరీ మకాం వేసినప్పుడు రోగం కట్టే రోజు వచ్చింది. ఊరి బజారులోంచి మిషనరీ వెళ్తునపుడు రత్నం తతిమ్మా క్రైస్తవులు వెంట ఉన్నారు. మిషనరీ ఉండటం వల్ల వాళ్ళకి గొప్ప సంతోషంగా, ధైర్యంగా ఉంది. రోడ్డుకి ఓ పక్కన రెండు చేతులూ కట్టుకుని నిలబడ్డాడు. కరణం. "అతనే" అని రత్నం దొరకి చూపించాడు. కరణం ఒంగి ఒంగి సలాములు చేశాడు. దొర అతన్ని లెక్కపెట్టనట్టు కనిపించాడు. అప్పటికే భయంతో ఉన్న కరణం తనకి ఏం జరుగుతుందా అని<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|55|}}</noinclude>
b52ssbnkloiyrbr24w7e9n1e6p4rgdl
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/57
104
212383
554416
554271
2026-04-25T09:39:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554416
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఆందోళనతో నిండిపోయాడు. ఈ మాదిగలని రక్షించటంలో ఒంగోలు మిషనరీకి చాలా బలముందని అతను విన్నాడు.
గుర్రం వెనకాలే నడుస్తూ కరణం తప్పయిపోయింది. తప్పయిపోయిందనటం మొదలుపెట్టాడు. అన్ని కులాల వాళ్ళతో పెద్ద గుంపు చుట్టూ మూగింది. మహమ్మదీయులు కూడా ఉన్నారు. డేరా వేసిన దగ్గర నుంచి దానితోపాటు వచ్చిన లష్కర్లు చెపుతూనే ఉన్నారు. బళ్ళపూడికి దొర వస్తే చుట్టుపక్కల నుంచి జనం తండోపతండాలుగా వస్తారని అంటున్నారు. ఈ గొడవ అందరికీ ఆసక్తిగా ఉంది. దొర గనుక కరణాన్ని బెదరగొట్టకపోతే ఆ ప్రాంతంలో మాదిగల బ్రతుకు దుర్భరమయిపోతుంది. ఇతర కరణాలు ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోటానికి సిద్ధంగా ఉన్నారు.
భయంతో వణుకుతున్న కరణం వైపు కూడా దొర చూడటంలేదు. మతద్వేష బాధితులు ఆడామగా అతని చుట్టూ చిన్న గుంపు తయారయారు. కరణం చెప్పే కారణాలు కూడా వినలేదు. చివరికి వినమని అభ్యర్ధించితే విన్నాడు. "నేనా పని చెయ్యలేదు. సాక్ష్యాలు లేవు' అన్నాడు కరణం.
దొర గుర్రం ఆగింది. వణుకుతున్న కరణం వేపు తిరిగింది. అది చాలా అందమైన తెల్లని జంతువు. పాత రోజులలో బోధకులకి అదుంటే గొప్ప. పాత రోజుల్లో ఓ మారు మిషన్ అప్పుల్లో ఉంది. దొర తన గుర్రాన్ని అమ్మేయటానికి సిద్ధపడ్డాడు. ఆ డబ్బు తన బోధకులకి యిద్దామనుకున్నాడు. కాని వాళ్ళు గుర్రాన్ని
అమ్మొద్దన్నారు. "మాకు ఫరవాలేదు. గుర్రాన్ని ఉంచుకోండి. మమ్మల్ని హింసించే మత ద్వేషులకి మా దొర గుర్రపు స్వారీ ఎందుకు చేయటం లేదంటే మేమేం చెప్పగలం? అన్నారు.
దొరకి కరణానికి మధ్య జరిగిన దాన్ని నాతో చెప్పేటపుడు దొర గుర్రం గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకున్నాడు రత్నం. "మా దొర జనంలో గాని నడిస్తే ఎంత లోకువగా ఉండేది? రత్నం గుండెలలో దొర ఒక మాట గొప్ప విచిత్రమైన కృతజ్ఞతా భావాన్ని నింపింది. కరణంతో అన్నాడు దొర "సాక్షులు లేరంటున్నావు. నువ్వేం చేసింది క్రైస్తవులు నాతో చెప్పారు. నాకు తమ్ముడు లాంటి బోధకుడు చెప్పాడు. నా తమ్ముడు నాతో అబద్ధమాడతాడా? నువ్వు అబద్ధం చెబుతున్నావు" ఇదంతా నాకు చెపుతున్న అనేకసార్లు రత్నం మొహంలో కృతజ్ఞత తొణికిసలాడింది. తనమీద కత్తిగట్టి వచ్చిన జనసమూహం ముందు, కొద్దిమంది తన వాళ్ళ ముందు దొర తనని "తమ్ముడు" అన్నాడు.
ఇంకెప్పుడూ తప్పులు చేయనని బడిపిల్లాడిలా కరణం ఒప్పుకున్నాడు. ఓసారి కాదు, రెండుసార్లు, క్రైస్తవులని ఇంకా బాదించనని అన్నాడు. దొరికి అతను అబద్దమాడొచ్చనని శంక. మాదిగలు దేముని బిడ్డలని, దేముడు వారిని ప్రత్యేకంగా చూసుకుంటాడని చెపుతుంటే విని ఆశ్చర్యపోయాడు. “వాళ్ళ
దేముడు మీ స్వాముల్లా పేదవాళ్ళు ప్రార్ధిస్తే వినకుండా, చూడకుండా ఊరుకోడు. దేముడు దూరంగా లేడు. వాళ్ళని ముట్టుకుంటే ఖబడ్దార్! అన్నాడు మిషనరీ.
తలొంచుకుని కరణం ఇంటికి వెళ్ళిపోయాడు. తన కిందనున్న వాళ్ళని అణిచెయ్యగలడు గాని తన చర్యలకు సమాధానం చెప్పమని నిలదీసే వాడి ముందు వణికిపోయిన పిరికిపంద అనుకున్నారు. ఆ ప్రాంతంలో చాలామంది క్రైస్తవుల మీద కోపంతో రగలిపోతున్నారు. అయినా ఇతరులు వాళ్ళకి బుద్ధిచెప్పనీ మనం మాత్రం దూరంగా ఉందామనుకున్నారు.
కొన్నేళ్ళు గడిచాయి. అంకాలమ్మ దేవత పూజారులు ముక్తిమళ్ళ గ్రామంలోని ఆలయంలో జాతర వైభవంగా చెయ్యాలని నిశ్చయించుకున్నారు. తరచుగా పశువులకి రోగాలూ, నూతులు ఎండిపోటాలు జరుగుతున్నాయి. ఈ మధ్యలో పూజలు సరిగ్గా జరగకపోవటం వల్ల, మాదిగలు డప్పు కొట్టడానికి నిరాకరించటం వల్ల కూడా అమ్మవారికి కోపం వచ్చి ఉంటుందని చెప్పారు. ఈ అంకాలమ్మ శివుని అర్ధాంగి పార్వతి అంశ. పది గొప్ప శక్తిరూపాలలో ఒకటి. ముక్తిమళ్ళ కరణం బ్రాహ్మణుడు. డెబ్భై ఏళ్ళ వయసు. శివభక్తుడు. శతాబ్దాలుగా జరుగుతున్నట్టు ఆ జాతరలో మాదిగలు డప్పులు వాయించాలని నిశ్చయించాడు. అంతేకాదు తిరగబడుతున్న మాదిగలకు తగినట్టు అవమానం జరిగితే అమ్మవారికి దాన్ని చూసే సంతోషం కలుగుతుంది.
జాతర నడుస్తోంది. భక్తులు మూగారు. కరణం క్రైస్తవులని రమ్మని డప్పు వాయించమని కబురంపాడు. వాళ్ళ మతం విగ్రహారాధనని ఒప్పుకోదని వాళ్ళు సమాధానం చెప్పారు. అయిదుగురు గ్రామభటులు వెళ్ళి అయిదుగురు ప్రముఖ క్రైస్తవులని బలవంతంగా తీసుకువచ్చారు. క్రైస్తవ మతం తాలూకు మైల పోయేవరకు వాళ్ళ నెత్తిమీద నీళ్ళు పోశారు. తలలు గొరిగారు. పిలక ఉంచారు. దానిలోనే స్వామి కాపురం ఉంటాడు. వాళ్ళ నుదుట మిగిలిన భక్తులకు లాగే విభూతి రాశారు. బొట్లు పెట్టారు. డప్పులు బలవంతంగా చేతుల్లో పెట్టారు. మూడు రోజుల వరకూ వాళ్ళా స్థితిని భరించవలసిందేనన్నారు. అమ్మవారిని పూజించటానికి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు.
రత్నం అక్కడికి పరుగెత్తాడు. వాళ్ళంతా అతనివాళ్లే. కాని ఏం చేయగలరు? వాళ్ళు సంఖ్యలో చాలా తక్కువ. అయిదుగురూ వాళ్ళ జుత్తుని పోగుచేసి గుడ్డలో మూటకట్టారు. విడిచిపెట్టగానే ఒంగోలుకి పరుగెత్తారు. మిషనరీకి తమ కథ చెప్పారు. మూటలోని జుత్తు చూపించారు. తలగుడ్డలు విప్పి తమ అవమానంకి గుర్తయిన బోడిగుళ్ళు చూపించారు.
క్రిమినల్ కోర్టులో కేసు వేశారు. ఒంగోలు ఆంగ్ల మెజిస్ట్రేటు కేసుని స్వయంగా విచారించారు. మీరు అవమానించబడినట్టు భావిస్తున్నారా అని ఆ అయిదుగురు క్రైస్తవులనీ అడిగాడు. "మా తలలు తెగ్గొట్టినంత అవమానంగా ఉంది" అన్నారు వాళ్ళు. రత్నం మరో యిద్దరు క్రైస్తవ మాస్టర్లు ఒకవేపు సాక్షులు. రెండోవేపు అనేకమంది తప్పుడు సాక్ష్యాలు కొన్నాళ్ళు న్యాయవిచారణ<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|56|}}</noinclude>
3upo84aq4d57bqupltx9wg5iv6iqjaw
పుట:Cheppulu Kudutu Kudutu....pdf/58
104
212384
554417
554272
2026-04-25T09:44:17Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
554417
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>జరిగింది. తీర్పు వచ్చింది. కరణం వృద్ధుడు గనక పడవలసిన మూడు సంవత్సరాల జైలు తప్పించారు. ముప్పైరూపాయల జరిమానా, మూడు నెలల ఖైదు వేశారు. జైలు శిక్ష అంటే అన్నింటిలోకి పెద్ద మైల. విడుదల అయిన నాలుగు రోజులకు కరణం చచ్చిపోయాడు. కొడుకు అతని స్థానంలోకి వచ్చాడు. తండ్రి కన్న కొడుకు మంచాడా అని రత్నాన్ని అడిగాను. "పులి కడుపున నక్క పుడుతుందా?" అన్నాడు.
ఆ విదంగా ప్రభుత్వం తనంత తనే క్రైస్తవ సూత్రాలకు ఒక విధంగా వాహనమయింది. అసహాయులైన మాదిగల చేతిలో డప్పులు పెట్టడం చూడాలన్న అంకాలమ్మ కోరికను పట్టించుకోలేదు. మత అసహనంకి సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘించితే అయిదేళ్ళవరకూ శిక్ష విధించుతారు. ఒక ముసలి బ్రాహ్మణుడు గౌరవనీయమైన హోదాలో ఉన్నవాడు తీవ్రంగా అవమానం అనుభవించి ఉంటాడు. వెలివేసి అయిదుగురి మత విశ్వాసాలను అవమానించటం వల్ల ఇలా జరిగింది. పూర్వం రోజులలో అయితే ఇతర కులాల వారితో సమానమైన న్యాయ పరిధిలోకి రావటం చాలా అవమానంగా భావించబడేది. నిజానికి శతాబ్దాలుగా దాస్యం తప్ప మరేమీ తెలియని ఒక ఆదివాసీ తెగ అవశేషాలకు ఒక కొత్త రోజు ఉదయించింది.<noinclude><references/>
{{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|57|}}</noinclude>
fh18wwkj34h2vrcylppbor0bklf5ej5
పుట:Sangitarasataran022902mbp.pdf/62
104
212409
554329
2026-04-24T12:01:31Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554329
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>బుద్ధు —— చూడకయేమి రాకపోదుమా?
ఛన్ను — రాజకుమారా! మీ తండ్రి నీవెక్కడనున్నాడనని యడిగిన నేమిచేప్పును.
{{left margin|5em}}<poem>సీ॥ ఆరివర్గముజయింప నాత్మలోదలపోసి యడవిదారులబట్టి యరిగెననుము
దుష్టమానవకోటి ధూర్తనర్తననూన్ప దేశదేశంబులఁదిరుగుననుము
జ్ఞాకదయావృద్ధిగల్గించుకోఁగోరి భూమిసఁచారంబుపూ నెనరుము
జంతుహింసనుమాన్ప సమకట్టియిల్లిల్లు శోధిఁపఁబల్లెలఁచూచుననుము</poem> </div>
{{left margin|5em}}<poem>గీ॥ మంచివిద్యనుదానభ్యసించుననుము
చెడుపనులుకలలో నైనఁ జేయఁడనుము
లోపమేమతనిదెయెల్లలోకమనుము
మరలమీపురికరుదెంచుమానఁడనుము॥</poem> </div>
{{Center|'''(తెరలో)'''}}
ఓహోధర్మజ్ఞా ఓహోసుగతా ఓధర్మరాజా మాయాదేవీతనూజా. అదిగో నీపార్శ్వంబుననున్న శ్వేతశిలపై నీకనుగుణమగు కావివస్త్రులును దండంబును కమండలువు సిద్ధముగానున్నవి త్వరగాగైకొనుము బుద్ధుఁడపై లోకంబున జ్ఞానబీజింబునాటును అప్రతిహతమైన వాక్కు
సర్వజక క్లాఘనీయమగుగాక.
బద్ధు — (ప్రక్కగాబోయి బట్టలు ధరించును దండకనుండలు బిక్షపాత్రలుగ్రహించును)
ఛన్ను — (కంటకమును దోలుకొని యాభరణసహితుఁడైపోవును. తెరదింపఁబడును)
{{right|'''(నిష్క్రమణము)'''}}
{{Center|{{p|fs125}}చతుర్ధరంగము — పర్వతపదేశము</p>}}
{{rule |6em }}
{{Center|'''(బుద్ధుకు యతీ వేషముతో పద్మాసనస్ధుఁడై యోగధ్యానపరుఁడై ఆసీనుడైయుండును. నిమిషమాత్రము నిశ్శబ్దము)'''}}
{{Center|'''(శబరుఁడును, శబరియు నిప్పపూబుంగతో వత్తురు)'''}}
{{Center|{{p|fs125}}పాట</p>}}
శబర - {{left margin|5em}}<poem>దసురోదరాజుకూ నాల్గొరుపెల్లాలు
ధైయంటేకుయిక్కుమనరో ॥రామియ్యా॥
ధైయంటేకుయిక్కుమనరో ॥రామియ్యా॥</poem> </div><noinclude><references/></noinclude>
fxyjonwb10pb2d3tk58qm5u5r3uaou9
పుట:Sangitarasataran022902mbp.pdf/63
104
212410
554335
2026-04-24T12:45:45Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554335
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ఖోసల్లెఖన్నాది - రామన్న రాజునో
ఖరిగిత్తవొంటివాడో - రామియ్యా॥
సూమింధ్రఖన్నదో - సౌతురుఘులసుమన్న
జోడుగుళ్లంటినోల్లో - రామియ్యా॥
భైఖమ్మఖన్నదీ - బరతన్నరాజునోగంగి
గోవంటివాడో - రామియ్యా॥</poem> </div>
శబరి - నేను మార్థడను యిన్రాధోరా
శబరు - మాఢేనేన్కుడా నీధోమాద్దా౯
ఇద్దరు - (చేతులు యెదురుగాపట్టుకొని)
శబరి — {{left margin|5em}}<poem>ఆఖూలభుంగాలొ యిప్పుపువ్వెట్టి
ఆభుంగమిధాను యీతాకువెట్టి
ధెయితక్క - ధెయితక్క - ధెయితక్కలే॥</poem> </div>
శబరు - {{left margin|5em}}<poem>ఈధాకుమీధాను టేకాకువేసి
గుడిసెలోకిమోయి గుసగుసలాడి
ధెయితక్క - ధెయితక్క - ధెయితక్కలే॥</poem> </div>
శబరి - {{left margin|5em}}<poem>తాటేళ్లతిల్లోను కోడ్ఫిల్లనెట్టి
మంఢాపురోట్లోను గొఱ్ఱగింజలోసి
ధెయితక్క - ధెయితక్క - ధెయితక్కలే॥</poem> </div>
శబరు - ఏంధో అదెంధో యెరద్ధాలేంది.
శబరి - అబ్బోదెయ్యాము సూఢూ సూఢు.
శబరు — (చూచి బుద్ధిసమీపముచేరి)
::యారయ్యభా బ్లో మారిసల్లేవుఁఢనే సెప్పయ్య మోఖుతా౯ తేజ్, నాపెట్టామిల్లజడు సుకుంఢాది.
బుద్ధు — (లేచి) కోయదోరా. నేను యతీని బుద్ధుడను.
శబరు - భాబూదాడ్ఢనూ రాజువయ్యా, బుద్ధయ్యదొరగోరు.
బద్ధు — (శబరుని సమీపించి)
{{Center|{{p|fs125}}పాట. శ్రీరాగము</p>}}
ముద్దుతమ్మూడారార ముచ్చటాడగా
::సద్దుజేయఁబోకుమంచి సుద్ధిజెపెద ఔరా<noinclude><references/></noinclude>
oue89ul4vc8rltbz22qpsrvcewrzkb9
పుట:Sangitarasataran022902mbp.pdf/64
104
212411
554337
2026-04-24T13:26:11Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శబరు — సుద్దులుజెపుధావు భాభూచెప్పూయింధామ్. బుద్ధు — సందేహమేమీ నేను చెప్పుడవి యన్ని యు సుద్దులేనోయీ . పాట వద్దుకోపమునీకు కద్దుమోక్షము నిద్దమైన మనసుగల్గి నిర్దయజూపకురా ఔ...'
554337
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>శబరు — సుద్దులుజెపుధావు భాభూచెప్పూయింధామ్.
బుద్ధు — సందేహమేమీ నేను చెప్పుడవి యన్ని యు సుద్దులేనోయీ .
పాట
వద్దుకోపమునీకు కద్దుమోక్షము
నిద్దమైన మనసుగల్గి నిర్దయజూపకురా ఔరా
శబరు_భాభూ దొడ్డదొరవయ్యా మామేలుమాటలు "సెప్తవుండవు.
శబరి—ఓరి శప్పనియ్యివు సేప్తడా యింకా మాడ్తక్ యిఁధయి పాడుధారా.
పాట
బుద్ధు— మాయజగమునమ్మబోకురా మంచిబుద్ధి గ లిగిమనర॥
చేయకురా జంతుహింస చెరువు చెరుపు చెరుపు చెరువు॥
-
శబరు——ఏమయ్యభౌభూ అట్టచెప్తవు. మొఖం మెటా కొరుకొక మోతేమేము బృ
దెట్టభాభూ.
శబరి—భోడిమిల్లా గొమిల్లా తిన్క పోతేయె కాదొరా,
బుద్ధు—ఈయరణ్యములో నెన్ని ఫలములులేవు ఎన్ని కాయలులేవు ఎన్ని దుంపలు లేవు
యేళ్లంద నివ్వరిధాన్యములేదా ఆకులులేవా సమస్తమునుకలదే.
శబకు__మరి సెప్పయేమి, సింతపిక్యాలు పనసవీక్క్యాలు ఇప్పపువ్వు కొమ్మరిటిపళ్లు
భాభూవుంచాయి గాని పికల్నే సుకొంరేగాని తిల్నే ముఖాభూ.
బుద్ధు--మంచిది 'నేను చెప్పినబుద్ధినిని ఆరుమాసములు మాంసాహారమును వర్ణించిచూ
డుము, నీ దేహము వజ్రదేహ మగును నీవు ప్వత్ప్రుడవయ్యెదవు.
శబరు__.భూ అఠాగేచేస్తాము గాని యిఖణ్నే వుంఢావా, ఇప్పపూధింతావా వీటి
బుద్ధు—అన్నియు దినియెదగానీ మాంసము. సుర. గంజాయి మాత్రము తినను రా
శబరి__కోడిగుడ్డుసొనెూ గువ్వగుడ్లు పనికొద్ధాయా,
బుద్దు — ఛీఛీ! అబకూడదుతల్లీ. నీవురూ గుడ్డును ముట్టరాదుసుమా.
శబరి__మాబఁధోగులు ఒప్పుకుందారా?
బుద్ధు -
మీ బందువులకందరికి నేను చెప్పితినని చెప్పి నా సమీపమునంజేర్పుము.
శబరి, శబరు—అఠాగే (నిష్క్రమింతురు)
బుద్ధుగీః కర్మవశతను శబ్దËపుల్క సరికాత
దేహులగుచు జనించి యీ తీరు సంగతోర<noinclude><references/></noinclude>
r30iekzw2sjymq4fdp6i7wsjhc5uq8z
554395
554337
2026-04-25T06:29:47Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554395
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>శబరు — సుద్దులుజెపుధావు భాభూచెప్పూయింధామ్.
బుద్ధు — సందేహమేమీ నేను చెప్పుడవి యన్ని యు సుద్దులేనోయీ .
{{Center|{{p|fs125}}పాట</p>}}
{{left margin|5em}}<poem>వద్దుకోపమునీకు కద్దుమోక్షము
నిద్దమైన మనసుగల్గి నిర్దయజూపకురా ఔరా</poem> </div>
శబరు - భాభూ దొడ్డదొరవయ్యా మామేలుమాటలు సెప్తవుండవు.
శబరి — ఓరి శప్పనియ్యివు సేప్తడ్రా యింకా మాడ్త౯ యిఁధయి పాడుధారా.
{{Center|{{p|fs125}}పాట</p>}}
బుద్ధు — {{left margin|5em}}<poem>మాయజగమునమ్మబోకురా మంచిబుద్ధి గలిగిమనర॥ ॥మా॥
చేయకురా జంతుహింస చెరుపు చెరుపు చెరుపు చెరుపు॥ ॥మా॥</poem> </div>
శబరు - ఏమయ్యభౌభూ అట్టచెప్తవు. మొఖం మెట్రాకొరుకొక మోతేమేము బ్రకెదెట్టభాభూ.
శబరి — భోడిమిల్లా గొట్రమిల్లా తిన్కపోతేయెరాదొరా,
బుద్ధు — ఈయరణ్యములో నెన్ని ఫలములులేవు. ఎన్ని కాయలులేవు. ఎన్ని దుంపలు లేవు యేళ్లంక్రీంద నివ్వరిధాన్యములేదా
ఆకులులేవా సమస్తమునుకలదే.
శబరు - మరి సెప్పయేమి, సింతపిక్యాలు పనసపిక్క్యాలు ఇప్పపువ్వు కొమ్మరిటిపళ్లు, భాభూవుండాయిగాని పిడకల్నేసుకొంరేగాని
తిల్నేముభాభూ.
బుద్ధు - మంచిది నేనుచెప్పినబుద్ధినిని ఆరుమాసములు మాంసాహారమును వర్ణించిచూడుము, నీ దేహము వజ్రదేహమగును నీవు
పవిత్రుడవయ్యెదవు.
శబరు - భా భూ అఠాగేచేస్తాము గాని యిఖణ్నే వుంఢావా, ఇప్పపూధింతావా వీరి శేమ
బుద్ధు — అన్నియు దినియెదగానీ మాంసము. సుర. గంజాయి మాత్రముతిననురా
శబరి - కోడిగుడ్డుసొనెూ గువ్వగుడ్లు పనికొద్ధాయా.
బుద్దు — ఛీఛీ! అనకూడదుతల్లీ. నీవురూ గుడ్డును ముట్టరాదుసుమా.
శబరి - మాబంధోగులు ఒప్పుకుంధారా?
బుద్ధు - మీ బందువులకందరికి నేనుచెప్పితిననిచెప్పి నా సమీపమునంజేర్పుము.
శబరి, శబరు — అఠాగే (నిష్క్రమింతురు)
బుద్ధు - {{left margin|5em}}<poem>గీ॥ కర్మవశతను శబరపుల్క సకి రికాత
దేహులగుచుజనించి యీతీరునంగఠొర</poem></div><noinclude><references/></noinclude>
0utr93i625zo88x95aftgdmk7wcift1
శారద లేఖలు (మొదటి సంపుటము)/16-వ లేఖ
0
212412
554347
2026-04-24T14:53:58Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 16-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554347
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 16-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=187 to=193 />
[[వర్గం:శారద లేఖలు]]
kazou3cos31obtgtfucxox55yvhsc2j
554348
554347
2026-04-24T14:54:22Z
Rajasekhar1961
50
554348
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 16-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=187 to=192 />
[[వర్గం:శారద లేఖలు]]
b9lu5q7dqmn47wspya2m0gl7nm2iqez
శారద లేఖలు (మొదటి సంపుటము)/17-వ లేఖ
0
212413
554349
2026-04-24T14:55:52Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 17-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554349
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 17-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=193 to=199 />
[[వర్గం:శారద లేఖలు]]
la96sptt0q4cnwrvqfsfn44c7jxfvz5
శారద లేఖలు (మొదటి సంపుటము)/18-వ లేఖ
0
212414
554350
2026-04-24T14:57:12Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 18-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554350
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 18-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=200 to=210 />
[[వర్గం:శారద లేఖలు]]
6yrnjksagio0o1at16g2utz7zxg7xp0
554351
554350
2026-04-24T14:57:45Z
Rajasekhar1961
50
554351
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 18-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=200 to=211 />
[[వర్గం:శారద లేఖలు]]
qfxefjwkuncg1nd5qkca5zq3sc8t9b6
శారద లేఖలు (మొదటి సంపుటము)/19-వ లేఖ
0
212415
554353
2026-04-24T14:59:02Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 19-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554353
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 19-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=212 to=217 />
[[వర్గం:శారద లేఖలు]]
b8uxyj2qadtonc80kdry5dli4o6q7p0
శారద లేఖలు (మొదటి సంపుటము)/20-వ లేఖ
0
212416
554354
2026-04-24T15:00:17Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]] | రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ |అనువాదం= | విభాగము = 20-వ లేఖ | ముందరి = | తదుపరి =[[/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం=1934 }} <pages index="Sarada Lekhalu Vol 1.pd...'
554354
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 20-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=218 to=227 />
[[వర్గం:శారద లేఖలు]]
14q3iu4qqi55a09pbl4c8l69nh2md8u
554355
554354
2026-04-24T15:00:42Z
Rajasekhar1961
50
554355
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[శారద లేఖలు (మొదటి సంపుటము)]]
| రచయిత = కనుపర్తి వరలక్ష్మమ్మ
|అనువాదం=
| విభాగము = 20-వ లేఖ
| ముందరి =
| తదుపరి =[[/పీఠిక|పీఠిక]]
| వివరములు =
|సంవత్సరం=1934
}}
<pages index="Sarada Lekhalu Vol 1.pdf" from=218 to=226 />
[[వర్గం:శారద లేఖలు]]
3hdrua55ceepqmb7ej68yn62rlqwf2o
పుట:Sangitarasataran022902mbp.pdf/66
104
212417
554414
2026-04-25T09:29:08Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554414
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>వన - సర్వార్ధకుమారరాజుగారు లేచివెళ్లినవర్త మానముజూజూయఁగా తెలిసింది.
::కాని యింకనురానేలేదా.
కమల - రానేలేదు వనపాలకా. అందుచేతనే ప్రభువుగారు కనూరునిక్షేమార్థము శివపూజాభిషేకాదులు
::చేయించుటకు మహాదేవాలయమునకు వెళ్లియున్నారు.
వన - ౧ అమ్మా! ఒక్కరే లేచివెళ్లినారా?
కమల — కంటకాశ్వముతోను ఛన్నునితోను గూడవెల్లినారు.
వన - ౧ మేమీ యుద్యాసమునకు వెలుపలనుండి ఒకవేళతిరిగినత్తురేమో చూచుచుండుము.
కమల - యశోధరాదేవి యీనాడు జాముపొద్దువేళకు ఉద్యానమునకు దయచేయుదురు పరులనెవ్వరిని
::లోపలికిరానీక జాగ్రత్తతోనుండుడు వనపాలకులారా!
వసాలకులు ఇద్దఱు - చిత్తము.
{{right|'''(ఇద్దఱు నిష్క్రమణము)'''}}
{{Center|'''(విచారగ్రస్తయై యశోధర, కాంతిమతి, కమల ప్రవేశము)'''}}
యశో — దైవమా యెంతపనిపుటైను. ఏమి కాంతిమతీ. ఏయే కమలా నాప్రాణనాధుఁడీ యర్ధరాత్రమున నన్ను
::విడిచిపారిపోవుటకు కాళ్లేట్లాడెనోకదా యీ పూలతోటలో వెచ్చటనైనడాగి యుండలేదుగదా. చూతురు.
కాంతి — మేముచూచితిమి యెచ్చటనుకానరాలేదు. దేవీ! మేమేమిచేయుదుము .
యశో- హాప్రాణనాధా! హాధర్మరాజా! హాభగవంతుఁడా! హాదేవరా! హారాజకుమారా! హాసుకుమారశరీర. నాడుఃఖము
నెవ్వరు తీర్చగలరు నిన్నువిడిచి నేనెట్లుజీవింతు నీపొత్తున గుడుచుభాగ్యమీవాడు లేక పోయెనే అన్న పొనములు
విసర్జించి యాయాసభరంబునంజిక్కి శల్యావశిష్టనై నానెచ్చెలుల కాయాసమిచ్చుటకంటె ఊరిబోసుకొని చచ్చుటయైనను
మేలు ముక్కుమూసుకొన్న మూడుగడియలదీప్రాణము. దీనికింతనగచిననేమిఫలంబు హా! హా! హా! దైవమా! దైవమా!
చెలియలారా!
{{left margin|5em}}<poem>ఉ॥ హాననుబాసియే? ఇకట విభుఁడిన్యాసతీపరామజ్ఞుఖుం
డౌనని యేనెఱుంగుదుగదా యిదియట్టిదికాదు ధర్మ్యమే
పూనికగా మెలంగెడీని పట్టిననాటనుగోలెశాంతిమై
జ్ఞానదయాసముద్రుండ యికాంతనుజింతను ముంపన్యాయమా!॥</poem> </div><noinclude><references/></noinclude>
s9tj4cxhhby9l1eqohwkaa6w73bhwl4
పుట:Sangitarasataran022902mbp.pdf/67
104
212418
554415
2026-04-25T09:33:12Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కమల — ఇది న్యాయమైనపనియని మేమెవ్వరమనగలము. ఆమహానుభావుని యంత రంగవృత్తి జుట్లు గానుండి నిన్ను విడుచుటకు సాహసించెనో యెవ్వరికి దెలియు ను, కాని నేడో రేపో మగలి రాకూడదా. కాంతి—ఇం...'
554415
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>కమల — ఇది న్యాయమైనపనియని మేమెవ్వరమనగలము. ఆమహానుభావుని యంత రంగవృత్తి జుట్లు గానుండి నిన్ను విడుచుటకు సాహసించెనో యెవ్వరికి దెలియు
ను, కాని నేడో రేపో మగలి రాకూడదా.
కాంతి—ఇంత
కేమి నేనొక్కటి చెప్పెదను అవశ్యమనః భోక్తవ్యమ్ | కృతంకర్మశుభా
శుభమ్ అనువాక్యము నీ వెఱుఁగవా నేను నీకు జ్ఞాపకి ము జేయుటయ కాని
బోధచేయుటకాదు కానిమ్ము ఎట్లుజరుగు సూచూచెదము.
యశో కాంతిమతీ! ఇంతకంటె నీసమయమునందు దుఃఖ హేతువు మరియొకటి
కెలదా ? “హ సద్భిజ్రియతేకర్మ రుదర్భిరనభూయ తే పూర్వముకు ఇవ్వుచు
దోషము చేసియుంటినో, ఇప్పుడది యేడ్చుచు మనుభవించుచున్నాను.
పాట. జంఝూటి॥
మును పెంత దష్కృతంబుజేసి యుంటినోక దే
ఘనమైన దుఃఖసాగరమున మునిగిపోతినే॥
కలగాంచిమేలుకొంచి యేడ్చి కష్టమంటినే
మల్టీకాదటంచు గనుల నీరుగారదుడిచె
నీకుగీడు గాదటంచు నిద్రబుచ్చె దిగఁ
బ్రాకి పాస్సునుండి లేనిపాకిపోయె నే#
ము
మ॥
కాంతిమతీ ! యింతవచ్చునని నేనెరిగియున్న యెడల నా ప్ర్రాణేశ్వరుని వేగో
లుపోరుగా, మాయనిదురి నన్నింతజేసినది. ఇంతకేమి “బుద్ధిగక రాము సారిణీ
అను వాక్య మేలతప్పును,
పాట, పీలు,
మాయనిద్రబపైనే శేమగ నిగోలుపోతి"నే
కాయమే తెలిసియున్న చేయిఁబట్టి విడుతునే అయో!
3. కన్ను లమూసితి కలవరము నందితీ ఆయ్యో
ఉదలు పెరుగ నైతి వానిగనులజూడనైతి ఆయ్యోని
మా
నీ చెలికాని జూడరే చెట్లలోనికి నేగి కోడి గానకపడాగికొనియె ము
సదయాత్ముఁగానరే పొదలడొంకలలోన నవులాటక నిగూరి;డచు నేమొ
ప్రాణేకుఁజూడరే మానికొమ్మలమీద మనసు శోధింపంగ మరి 7 వే
గుణవంతుఁ జూడ రే కొలఁగలదరిఁ జేరి వింతజూ పెదనని విడిసి నేమొ<noinclude><references/></noinclude>
98colcnvn983j9bv6y9467msyqoxkme
554428
554415
2026-04-25T11:06:29Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554428
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కమల — ఇది న్యాయమైనపనియని మేమెవ్వరమనగలము. ఆమహానుభావుని యంత రంగవృత్తి జుట్లు గానుండి నిన్ను
::విడుచుటకు సాహసించెనో యెవ్వరికి దెలియును. కాని నేడోరేపో మరలిరాకూడదా.
కాంతి — ఇంతకేమి నేనొక్కటి చెప్పెదను "అవశ్యమనుభోక్తవ్యమ్| కృతంకర్మశుభాశుభమ్" అనువాక్యము నీ వెఱుఁగవా
::నేను నీకుజ్ఞాపకము జేయుటయ కాని బోధచేయుటకాదు కానిమ్ము ఎట్లుజరుగుచూచెదము.
యశో - కాంతిమతీ! ఇంతకంటె నీసమయమునందు దుఃఖహేతువు మరియొకటి కెలదా? “హసద్భి:క్రియతేకర్మ
రుదర్భిరనుభూయతే" పూర్వమున నవ్వుచు నేదోషముచేసియుంటినో. ఇప్పుడది యేడ్చుచు మనుభవించుచున్నాను.
{{Center|{{p|fs125}}పాట. జంఝూటి॥</p>}}
{{left margin|5em}}<poem>మునుపెంత దష్కృతంబుజేసి యుంటినోకదే
::ఘనమైన దుఃఖసాగరమున మునిగిపోతినే॥ ॥ము॥
కలగాంచిమేలుకొంచి యేడ్చి కష్టమంటినే
::మఱికాదటంచు గనులనీరుగారదుడిచెనే॥ ॥ము॥
నీకుగీరుగాదటంచు నిద్రబుచ్చె నేదిగఁ
::బ్రాకిపాన్పునుండి లేనిపాకిపోయెనే॥ ॥ము॥</poem> </div>
కాంతిమతీ! యింతవచ్చునని నేనెరిగియున్నయెడల నా ప్రాణేశ్వరుని సేగోలుపోరుగా, మాయనిదుర నన్నింతజేసినది.
::ఇంతకేమి “బుద్ధి:కర్మానుసారిణీ" అను వాక్యమేలతప్పును.
{{Center|{{p|fs125}}పాట. పీలు.</p>}}
మాయనిద్రబట్టెనే నేమగనిగోలుపోతినే
::కాయమే తెలిసియున్న చేయిఁబట్టినిడుతునే అయో! ॥మా॥
కన్నులట్టేమూసితి కలవరముమెందితీ ఆయ్యో
::కదలుటెరుగనైతి వానిగనులజూడనైతి ఆయ్యో॥ ॥మా॥
{{left margin|5em}}<poem>నీ॥ చెలికానిజూడరే చెట్లలోనికినేగి కోడిగానకుపడాగికొనియెనేమొ
సదయాత్ముఁగానరే పొదలడొంకలలోన నవులాటకనిగూరినడచునేమొ
ప్రాణేశుఁజూడరే మ్రానికొమ్మలమీద మనసుశోధింపంగ మరిగెనేమొ
గుణవంతుఁజూడరే కొలంలఁకులదరింజేరి వింతఁజూపెదనని విడిసెనేమొ॥</poem> </div><noinclude><references/></noinclude>
t4qsmrlta8e8a4vzv4bqg91u5zbl72a
చెప్పులు కుడుతూ కుడుతూ/రామస్వామి మౌనం
0
212419
554424
2026-04-25T10:44:16Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]] | రచయిత = | అనువాదం= వివిన మూర్తి | విభాగము = రామస్వామి మౌనం | ముందరి =చెప్పులు కుడుతూ కుడుతూ/ఆరుగురు గురువుల వరస|ఆరుగురు గురువుల వ...'
554424
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]]
| రచయిత =
| అనువాదం= వివిన మూర్తి
| విభాగము = రామస్వామి మౌనం
| ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/ఆరుగురు గురువుల వరస|ఆరుగురు గురువుల వరస]]
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=2010
}}
<pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=41 to=49/>
eaxr6mmj9ltcz27xt4zp0ja9t8dttpv
554425
554424
2026-04-25T10:45:08Z
Rajasekhar1961
50
554425
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[చెప్పులు కుడుతూ కుడుతూ]]
| రచయిత =
| అనువాదం= వివిన మూర్తి
| విభాగము = రామస్వామి మౌనం
| ముందరి =[[చెప్పులు కుడుతూ కుడుతూ/ఆరుగురు గురువుల వరస|ఆరుగురు గురువుల వరస]]
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=2010
}}
<pages index="Cheppulu Kudutu Kudutu....pdf" from=41 to=43/>
lw2vninx1s37el44sllsbb64lrkwnsl
పుట:Sangitarasataran022902mbp.pdf/68
104
212420
554429
2026-04-25T11:31:13Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554429
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>గీ॥ ధైర్యవంతునిఁజూడరే దట్టమైన
చలువపందిళ్లగురువేళ్ల నలరుపొళ్ల
మళ్లమామిళ్ల సెలయేళ్ల మంచిరాళ్ల
దళ్లనెగతాళికనితారితక్కె సేమొ॥</poem> </div>
{{right|'''(తెరలో)'''}}
ఛన్నుండువచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు.
యశో - (కన్నులువిప్పి దిగ్గునమొగమెత్తి)
కాంతిమతీ! కమలా! ఛన్నుండు వచ్చుచున్నాఁడనుమాటలు వినవచ్చినవి. అటుబోయిచూచి నిజమాయెనేని వానినిటు దోడ్కొనిరండు.
కమల - అట్లుగానే చేయుచున్నాను (వెళ్లును)
యశో - కాంతిమతీ!
{{Center|{{p|fs125}}పాట. ఫరుజు.</p>}}
అయ్యోయేమిచెప్పుమో ఛన్నుఁడు
నుయ్యో గొయ్యో చూపునొ॥
నెయ్యుఁడు నాగుండె వయ్యలెసేయుమో
వెయ్యేలనాకూ విశమేగతియనునో॥
కొమ్మానాయుల్లమిదే చాలఁగకొట్టుకొనుచున్న దే
లెమ్ము లెమ్ము బ్రహ్మలిఖిత మెట్లున్న దో
కమ్మనివార్తలఁ గాచిరక్షించునో॥ అయ్యో॥
(ఛన్ను నిందీసుకొని కంటకాశ్వము వెంటరాఁగా కమలవచ్చును) దూరము.
యశో - కాంతిమతీ! ఛన్నుండేమి చెప్పునొకదే ఏమిసేయుదునే నాగుండెలుకొట్టు కొనుచున్నవికదా నేమనిలువలేను
::ఎట్లోతెలియదు అయ్యో. ఛన్నుఁడు సమీపించుచున్నాఁడే దైవమా యేమిచెప్పునోకదా మొగమువాలియున్నది.
::నడవలేక నెమ్మదిగావచ్చుచున్నాఁడే కట్టా యేడ్చుచున్నాఁడేమి ఏదోపుట్టేమునిగినదితల్లీ నామదిచేడిపోయింది.
::త్రాడులేదుగదా గట్టితీగెసుకొనిరమ్ము. కాంతిమతీ యింకనేమియున్నది. ఏలనన్ను బట్టుకొని యూరడించెదరే
::(వెక్కి వెక్కి యేడ్చుచు) ఏ. ఏ. ఏ. మి.మి. మీ. ఛ ఛ ఛ. న్నా.
ఛన్ను - (తొందరగా) అమ్మా సుఖముగానున్నారు.
యశో - వ.వ.చ్చి.చ్చి.రా.<noinclude><references/></noinclude>
nmusmpiqsoc9z95sj7s7bw6pibo26mv
పుట:Sangitarasataran022902mbp.pdf/69
104
212421
554430
2026-04-25T11:55:08Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
554430
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఛన్ను - కొన్నాళ్లకు తిరిగివచ్చెదనని చెప్పినారు.
యశో — ఎం, యెం. దుకి, ప్పుడురాలేదూ:
ఛన్ను - జ్ఞానము సంపాదించుకొనుటకు హింసనురూపుమాపుటకు పట్టుపట్టినారు.
యశో — ఏ. యే. మి. పట్టు.
ఛన్ను - (యేడ్చుచు య య్య య్య య్య.
యశో - ఏమిటి. శ్వ, త్వ. ర. రగాఁజెప్పు ఛన్నా.
ఛన్ను - య. తి. తి. తి. అయినారు (దుఃఖము)
యశో — అయ్యో యతియా యతియా ఆవేషమేధరించినారా.
ఛన్ను - అవును.
యశో - ఇంకనేమున్నది. దైవమా దైవమా నాజీవధనము నాకుఁదక్కదాయెఁ గదా (మూర్చ) 8 నిమిషములు విశ్చబ్దము)
కాంతి - ఏమికమలా మనయశోధర నెట్లు బ్రతికింపఁగలము. ఏమియుపాయము మనమాటలువినదు సాహసించి యేమిచేయుమోకదా.
కమల - నాకేమి తెలియకయున్నది. మనముమాత్రము బ్రతుకువారమా! మనయశోధరకేగతియో ఆగతియేమనకునుకాని యెటులైన యశోధరను బ్రతికించినదవే.
కాంతి - ఆపన్నీరు బుడ్లుకొనిరమ్ము కమలా.
కమల - ఇవిగో తెచ్చితిని.
కాంతి — (యశోధర మొగమునఁజల్లుచున్నది)
యశో — (మూర్ఛ తెలసి సగములేచి)
ఇస్సిరో. ఇస్సీరో. దైవమా! దైవమా!
{{Center|{{p|fs125}}పాట. పీలు.</p>}}
{{left margin|5em}}<poem>నట్టేటినడుమను నన్ను ముంచితివా
కట్టడిదైవమా కారణమేమీ॥ ॥న॥
ఇంతదోసకారి నేనెట్టులైతి
పంతాననావిభుఁడు బొంతఁగప్పెనుగా॥ ॥న॥
విడచెనన్ని టుడించి విభుఁడునాబ్రతుకు
అడవిగాసిన వెన్నె లాయెనేమందు॥ ॥న॥</poem> </div>
కాంతిమతీ ! యింకేమున్నది.<noinclude><references/></noinclude>
egrtu7pxq67ecp4c446ajvzsjd5b5ms