వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.26 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/241 104 171163 555138 483009 2026-04-29T00:10:07Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 555138 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| 222 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude><poem></poem> {{float right| }} పేరుగలచక్రము, రంజిల్లున్ - ప్రకాశించును. అందున్ = ఆ స్వాధిష్ఠాన చక్రమందు చతుర్ముఖుడు = దాని యధిదేవతయైన బ్రహ్మకు, ఆఱువేలును = ఆఱువేలజపంబును, నా భిస్థానంబున్ = నాభియందు, డఢణతథదధనపఫవర్ణగంబై = డ,ఢ,ణ, త, ధ, ద, ధ,న, ప, ఫ అనునక్షరములు గలదియె, దశదళోపేతంబై = పదిరేకులతోఁ గూడి, తేజో నివాసంబై = అగ్నిభూతమున కాశ్రయమై, పీతవర్ణంబై = పచ్చనివర్ణము గలదియై నేత్రకారణంబై = నేతేంద్రియమునకు హేతువై, మణిపూరకచక్రంబు = మణిపూరక మను పేరు గలచక్రము, ప్రకాశించున్ = ప్రకాశించును. అందున్ = ఆమణిపూరక చక్రమునందు, శ్రీమహావిష్ణునకున్ = అధిదేవతయై యున్న విష్ణువునకు, ఆఱువేలును = ఆఱువేలజపంబును, హృదయస్థానంబునన్ = వక్షస్థలమునందు, క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ వర్ణగంబై = క,ఖ,గ,ఘ,ఙ,చ,ఛ,జ,ఝు,ఞ,ట,ఠ అను నక్షరములు గలది. యై, ద్వాదశదళోపేతంబై = పండ్రెండు దళములతో గూడినదియై, శ్వేతవర్ణంబై = తెల్లనివర్ణము గలదియై, మరున్మందిరంబై = వాయుభూతమునకు ఆధారమై, త్వగింద్రి యకారణంబై = త్వగింద్రియమునకుఁ గారణమై, అనాహతచక్రంబు = అనాహతమను పేరుగలచక్రము, తనరున్ = ఒప్పును, అందున్ = ఆచక్రమునందు, రుద్రునకున్ = ఆధి దేవతయైన యీశ్వరునకు, ఆఱువేలును = ఆఱువేలజపఁబును, కంఠస్థానమందున్ = కం ఠమునందు, అకారాదిషోడశస్వరకంబయి = అకారము మొదలు పదియాఱువర్ణములు గలదియై, షోడశదళయుతంబై = పదియాఱు దళములతోఁ గూడినదియై, నీలవర్ణంబయి = నల్లనివర్ణముగలదియై, గగనసదనంబయి = ఆకాశభూతములకు నాధారమై, శ్రోత్రకా రణంబయి =శ్రోత్రేంద్రియమునకుఁ గారణమై, విశుద్ధచక్రంబు = విశుద్ధమను పేర గలచక్రము, అలరు = ఒప్పుచున్నది. అందున్ = ఆవిశుద్ధచక్రమునందు, జీవాత్ము నకున్ = అధిష్ఠానదేవతయై యున్న జీవునకు, సహస్రంబును = పదినూఱులును, భ్రూ మధ్యస్థానంబునన్ = బొమల నడిమిభాగమున, హంక్షమ్మను వర్ణంబులు గలిగి = హాం క్షం అను రెండక్షరములతోఁ గూడి, ద్విదళలలితంబై = రెండు దళములతోఁ ప్ర కాశించు, మాణిక్యవర్థంబై = మాణిక్యమువంటివర్ణముగలదియై, అంతఃకరణభవం బయి = అంతఃకరణమునకు నివాసస్థానమై, ఆజ్ఞాచక్రంబు = ఆజ్ఞయను పేరుగల చక్రము, ఒప్పును = ప్రకాశించును. అందున్ = ఆయాఙ్ఞాచక్రమునందు. పర మాత్మునకున్ = అధిష్ఠానదేవతయైన పరబ్రహ్మమునకు, సహస్రంబును = పదినూఱుల జపమును, బ్రహ్మరంధ్రస్థానంబును - శిరస్సునందు , ఓంకారవర్ణగంబయి = ఓంకారమునువర్ణముగలదియై, సహస్రదళశోభితంబయి = సహస్రదళములతోఁ గూడి కోటిసూర్యప్రకాశమానంబయి = కోటిసూర్యులయట్లు కాంతిగలిగి, ధీవిలయస్థలంబై = బుద్ధిలయమునొందుటకు స్థానమై, సహస్రారచక్రంబు = సహస్రారమనుచక్రము, అల రారున్ = ఒప్పుచుండును, అందున్ = ఆసహస్రారచక్రమునందు, శ్రీగురుస్వామికిన్<noinclude><references/></noinclude> 9kgwe9rz4an3dq4c7o3948b2p4jiuly 555147 555138 2026-04-29T04:18:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 555147 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 222 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>పేరుగలచక్రము, రంజిల్లున్ = ప్రకాశించును. అందున్ = ఆ స్వాధిష్ఠానచక్రమందు, చతుర్ముఖుడు = దాని యధిదేవతయైన బ్రహ్మకు, ఆఱువేలును = ఆఱువేలజపంబును, నాభిస్థానంబున్ = నాభియందు, డఢణతథదధనపఫవర్ణగంబై = డ,ఢ,ణ,త,థ,ద,ధ,న,ప,ఫ అనునక్షరములు గలదియై, దశదళోపేతంబై = పదిరేకులతోఁ గూడి, తేజోనివాసంబై = అగ్నిభూతమున కాశ్రయమై, పీతవర్ణంబై = పచ్చనివర్ణము గలదియై, నేత్రకారణంబై = నేత్రేంద్రియమునకు హేతువై, మణిపూరకచక్రంబు = మణిపూరకమను పేరు గలచక్రము, ప్రకాశించున్ = ప్రకాశించును. అందున్ = ఆమణిపూరకచక్రమునందు, శ్రీమహావిష్ణునకున్ = అధిదేవతయై యున్న విష్ణువునకు, ఆఱువేలును = ఆఱువేలజపంబును, హృదయస్థానంబునన్ = వక్షస్థలమునందు, క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ వర్ణగంబై = క,ఖ,గ,ఘ,ఙ,చ,ఛ,జ,ఝు,ఞ,ట,ఠ అను నక్షరములు గలది యై, ద్వాదశదళోపేతంబై = పండ్రెండుదళములతో గూడినదియై, శ్వేతవర్ణంబై = తెల్లనివర్ణము గలదియై, మరున్మందిరంబై = వాయుభూతమునకు ఆధారమై, త్వగింద్రియకారణంబై = త్వగింద్రియమునకుఁ గారణమై, అనాహతచక్రంబు = అనాహతమను పేరుగలచక్రము, తనరున్ = ఒప్పును, అందున్ = ఆచక్రమునందు, రుద్రునకున్ = అధిదేవతయైన యీశ్వరునకు, ఆఱువేలును = ఆఱువేలజపంబును, కంఠస్థానమందున్ = కంఠమునందు, అకారాదిషోడశస్వరకంబయి = అకారము మొదలు పదియాఱువర్ణములు గలదియై, షోడశదళయుతంబై = పదియాఱుదళములతోఁ గూడినదియై, నీలవర్ణంబయి = నల్లనివర్ణము గలదియై, గగనసదనంబయి = ఆకాశభూతములకు నాధారమై, శ్రోత్రకారణంబయి = శ్రోత్రేంద్రియమునకుఁ గారణమై, విశుద్ధచక్రంబు = విశుద్ధమను పేరు గలచక్రము, అలరున్ = ఒప్పుచున్నది. అందున్ = ఆవిశుద్ధచక్రమునందు, జీవాత్మునకున్ = అధిష్ఠానదేవతయై యున్న జీవునకు, సహస్రంబును = పదినూఱులును, భ్రూమధ్యస్థానంబునన్ = బొమల నడిమిభాగమున, హంక్షమ్మను వర్ణంబులు గలిగి = హం క్షం అను రెండక్షరములతోఁ గూడి, ద్విదళలలితంబై = రెండుదళములతోఁ ప్రకాశించు, మాణిక్యవర్థంబై = మాణిక్యమువంటివర్ణము గలదియై, అంతఃకరణభవంబయి = అంతఃకరణమునకు నివాసస్థానమై, ఆజ్ఞాచక్రంబు = ఆజ్ఞయను పేరుగలచక్రము, ఒప్పును = ప్రకాశించును. అందున్ = ఆయాజ్ఞాచక్రమునందు, పర మాత్మునకున్ = అధిష్ఠానదేవతయైన పరబ్రహ్మమునకు, సహస్రంబును = పదినూఱుల జపమును, బ్రహ్మరంధ్రస్థానంబునన్ = శిరస్సునందు, ఓంకారవర్ణగంబయి = ఓంకారమనువర్ణము గలదియై, సహస్రదళశోభితంబయి = సహస్రదళములతోఁ గూడి, కోటిసూర్యప్రకాశమానంబయి = కోటిసూర్యులయట్లు కాంతి గలిగి, ధీవిలయస్థలంబై = బుద్ధి లయము నొందుటకు స్థానమై, సహస్రారచక్రంబు = సహస్రారమనుచక్రము, అలరారున్ = ఒప్పుచుండును, అందున్ = ఆసహస్రారచక్రమునందు, శ్రీగురుస్వామికిన్<noinclude><references/></noinclude> czpkbmryiqv313oq4erkjgdzbqig3bi పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/302 104 211750 555130 554948 2026-04-28T14:14:22Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 555130 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> సువర్ణ ధార, ద్విధా, శ్రీమతి వంటి కొన్ని ఖండికలు చేర్చారు. శ్రీమతి ఖండికలో ఒక పద్యం.. <poem> కామమొకండె నిత్యము జగమ్మును గ్రమ్మినదేమొ? తా యశః కామము గానువచ్చు, ధనకామము గూడను కానువచ్చు, స్త్రీ కామము కానువచ్చు, నిది కాడగు కాదగదంచు లేదు - నా కామ తమస్సు జీల్బు వెలుగై చను దేవి నమాపరించుతున్....”</poem> ఆంజేయాయమ్ పేరుతో హనుమంతుని గూర్చి ఒక శతకాన్ని, చేరాకు ఒక శతమానం పేరుతో ఒక చమత్కార శతకాన్ని రచించారు. వీటన్నిటికంటె ముందు 1950 ప్రాంతాలలో రచించినప్పటికీ ఆలస్యంగా ముద్రించి అభిష్కరించి డా. వెల్చాల కొండలరావుగారికి అంకితం ఇచ్చిన అపూర్వ గేయ కావ్యం అవర్ణ, ఆధునిక ఇతివృత్తంతో గేయకథా కావ్యం, ఇందులో పలురకాల గేయాలు నడకలు ఉన్నాయి. పద్యమైనా,గేయమైనా, వచనపద్యమైనా తనదైన శైలి, దేశీయమైన భావనా పునాదిగా, వివిధ రకాలు ప్రయోగాలతో రచించిన సంపత్కుమార సృజన తనతరంలో విలక్షనంగానే భావించదగినది. 1960లో లక్షణ దీపిక పేరుతో సులభ వ్యాకరణం విద్యార్థులకు ఉపయోగపడే రీతిలో తేలికగా అర్థమయే టట్లుగా రచించారు. ప్రాచీనాలంకార శాస్త్రాలు మొదలుకొని తెలుగులో అప్పకవీయం వరకు అనేక గ్రంథాల నవలోకనం చేసి 'తెలుగు ఛందోవికాసము' అనే గ్రంథాన్ని రచించి పోటీకి పంపించారు. ఆంధ్రప్రదేశ్ అకాడమి ప్రచురణకు తగిన పారితోషికం ఇచ్చి ప్రశంసించారు. నిజానికి తెలుగులో వచ్చిన అత్యంత ప్రామాణికమైన ఛందో గ్రంథము సంపత్కుమారగారి తెలుగు ఛందో వికాసము మాత్రమే నేటికీ నిలిచి ఉన్నది. 1990లో తెలుగు అకాడమి ఈ గ్రంథాన్ని పునర్ముద్రణ చేసి అందరికి అందుబాటులో తెచ్చింది. ఛందస్సులో వీరి కృషిని గమనించి తెలుగు అకాడమీ వారి కోరిక మేరకు 1977లో తెలుగు ఛందఃపదకోశము రూపొందించి అందించారు. అప్పటికి తెలుగులో విరివిగా వెలువడుతున్న వచన కవిత్వాన్ని వచన పద్యం అనాలని, వచన కవితకు కూడా కొన్ని నియమాలుంటాయని తెలుపుతూ భారతిలో వ్యాసాలు రాశారు. భాషాశాస్త్రంలో పోటాపోటీగా అనేక వ్యాసాలు సాధికారికంగా, సోదాహరణంగా, సోవవత్తికంగా రచించారు. ఆనాటికి ఇద్దరికీ వ్యక్తిగత పరిచయం లేదు. కాని ఇద్దరూ ఎంతో సంయమనంతో వ్యక్తిగత విమర్శల ప్రస్తావన చేయకుండా కేవలం విషయానికే పరిమితమయి తమభాషా వ్యాకరణ ఛందో విషయాల పరిజ్ఞానాలను తవ్విపోస్తూ ఎదురుకోవడం విశేషం. అంత సౌమనస్యంగా ఒక విషయంపై విరుద్ధ భావాలు ప్రకటించడం ఆనాటి సాహితీలోకంలో గొప్ప ఆదర్శమయింది. తరువాత చేకూరి, సంపత్కుమార ఇద్దరూ కలిసి వచనపద్యం లక్షణ చర్చ పేరుతో వారిరువురి వ్యాసాలూ ఒక సంకలనంగా ప్రచురించి సాహిత్యలోకాన్ని విస్మితులను చేశారు. విజ్ఞులను చేశారు. వచన పద్యం అని పిలువడానికి నేటికీ ఎందరో అంగీకరించాల్సిన వాదన సంపత్కుమార చేశారు. ఛందస్సులో మరింత కృషి చేసి కూచిమంచి తిమ్మకవి లక్షణ సార సంగ్రహం గ్రంథాన్ని 1971లో పరిష్కరించి విపుల పీఠిక రచించారు. కూచిమంచి వెంకటరాయని ఛందోగ్రంథం సుకవి జన రంజకం తాళపత్ర ప్రతిని 1976లో పరిష్కరించి విపుల పీరికతో అప్పటి ఆంధ్రప్రదేశ్ అకాడమీ వారికందించారు. తెలుగు ఛందో భూమికలు పేరుతో 1993లో ఒక పుస్తకం రచించారు. ఈ పీఠికలు, మరికొన్ని వ్యాకరణ గ్రంథాల పరిష్కరణ పీఠికలు కలిపి తెలుగు ఛందస్సులో కొన్ని వెలుగులు పేరుతో ఒక పుస్తకాన్ని 2003లో ప్రచురించారు. అన్నమాచార్యుల కీర్తనలలోని ద్విపదలు, రగడలు, మాత్రాఛందో వైవిధ్యంపై వ్యాసాలు రచించారు. ఛందస్సులో ఏ వంశయానికైనా వెంటనే సమాధానం చెప్పగల మహావేత్త సంపత్కుమార ఒక్కరే అనే ఖ్యాతి పండితలోకంలో ఆయనకే దక్కింది. విమర్శనారంగంలో పూర్వాలంకారికుల సిద్ధాంతాలు మొదలుకొని ఆధునికుల సిద్ధాంతాల వరకు అధ్యయనం చేయడమే కాక విశ్లేషించి సమన్వయం చేస్తూ 'తెలుగులో ఆధునిక విమర్శ సాంప్రదాయక రీతి' అనే సిద్ధాంత గ్రంథాన్ని వెలువరించారు. ఆధునికులలో కందుకూరి, కట్టమంచి మొదలుకొని శ్రీశ్రీ, శేషేంద్రల వరకు గల అనేక ప్రతిపాదనలను తార్కికంగా వివేచించారు. సోదాహరణంగా విపులీకరించి వివరించారు. ఆధునిక విమర్శలో పాశ్చత్య ధోరణులు, ప్రభావాలను కూడా వివరించారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |281 | తేజోమూర్తులు}}</noinclude> boh75u3nhexw732ywf515pvdrvwul6t పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/303 104 211751 555131 552122 2026-04-28T14:25:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 555131 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> విశ్వనాథ రామాయణంలో యుద్ధకాండ శిల్పావ తారికి, చలం పురూరవ రచనపై చేసిన విమర్శతో పాటు పలు విమర్శలు పాఠకుల పండితుల సాహితీ వేత్తల మన్నన లందుకున్నాయి. సంపత్కుమారగారి విమర్శనా ధోరణి ఏ కవినీ రచయితనూ కరుకుగా తప్పుపడుతున్నట్లుండదు. పాఠకునికి అనేక విశేషాలు తెలుపుతూ విషయపరిజ్ఞానాన్ని కలిగిస్తాయి. సాహితీ వికాసాన్ని కలిగిస్తాయి. ఒక ఆత్మిక ప్రకటన వలె ఉండి రచయితకు, పాఠకుడికి ఇద్దరినీ ఒప్పించే సున్నితమైన వ్యక్తీకరణ ఉంటుంది. తెలుగు పూర్వకవుల కావ్య దృక్పథాలు, కన్యాశుల్కం మరోవైపు, విశ్వనాథ సాహిత్య వ్యక్తిత్వం, కిన్నెరసాని పాటలు వస్తువిన్యాసం మొదలైన విమర్శలు వేనికవే సాటి. ఆయన విమర్శలు ఆయా రచనల లోతులను చూడమే కాక విమర్శ ఎట్లా ఉండాలి? ఎట్లా ఆలోచించాలి? ఒక రచనను ఎట్లా చదవాలి? అనే విధానాలు కూడా పరోక్షంగా తెలుపు తున్నట్లుగా ఉంటాయి. ఒక విధంగా విమర్శకు సంబంధించిన పాఠాలు చెపుతున్నట్లు ఉంటాయి. ఆధునిక ప్రక్రియలైన కథలు, నవలలు, నాటకాలు, కూడా ఆయన విమర్శతో భాగమయినాయి. తనను విబేధించిన వారితో ఎప్పుడూ తాను కలహించలేదు. తన శక్తితో నిరూపించి అవుననిపించడమే ఆయన సహజమైన నైపుణ్యం. విశ్వనాథ రామాయణంలో ఒక ఘట్టం ఇప్పుడే రాసినానని వినిపించారట. సంపత్కుమార పెదవి విరిచి విశ్వనాథ రాసినట్లుగా లేవన్నారట. వెంటనే విశ్వనాథ ఆ కాగితాలు చించేసి తరువాత తిరిగి కొత్తగా రాసుకున్నారట. విశ్వనాథ పద్యాలను ఆయన ఎదుట అంతధైర్యంగా అంత సున్నితంగా చెప్పగల పాండితీ విమర్శనా పటిమ సంపత్కుమార గారిది. ఇవన్నీ కాగా, 1969, 70లలో వరంగల్లుకు చెందిన ఒక వందసంవత్సరాల కాల పరిధిలోని సాహితీ వేత్తల వివరాలు సేకరించి మనపండితులు, కవులు, రచయితలు, అనే పేరుతో ఒక సంకలనం వెలువరించారు. అది ఈనాటి తెలంగాణ సాహితీ వేత్తలకు ప్రతిజిల్లాకు అంతటి కృషి చేయడానికి ఒక మార్గదర్శనంగా నిలిచింది. సంపాదకీయాలు, పాత్రికేయ వ్యాసాలు, అముద్రితాలుగా ఉన్న రచనలు ఇంకా ఉన్నాయి. ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య కవి, పండితుడు, ఛందశ్శాస్త్ర వేత్త, గొప్ప విమర్శకుడు. ఇవన్నీ ఎంతగొప్పగా ఉన్నా అహంభావం అణుమాత్రం కూడా లేని నిరాడంబర జీవి. ఏ పురస్కారాలకు, సన్మానాలకు ఎదురుచూడలేదు. రాలేదని పెదవి విరవలేదు. రాజీవ్ ప్రతిభా పురస్కారం రాష్ట్ర స్థాయిలో అందుకున్నప్పుడు మా వంటి విద్యార్థులందరినీ పిలిచి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఎప్పుడూ లాల్చీ ధోతీ నుదుట సంప్రదాయబద్ధంగా ఉండే నామం ఎన్నడూ మారలేదు. అయితే ఎంత సంప్రదాయంగా కనిపిస్తారో అంత ఆధునికుడు. ఆధునిక కవిత్వాన్ని, ఆధునిక భావాలను అమితంగా ఆదరించి ప్రేమిస్తాడు. తనతోటి ఆచార్యులు పండితులతో ఎట్లా ఉంటారో తన విద్యార్థులతో కూడా అంతే స్నేహంగా ప్రేమగా ఉత్సాహంగా ఉండేవారు. నిత్యం స్నేహితులతో, విద్యార్థులతో గడపటం, చమత్కారంగా మాట్లాడటం, ఏనాడూ కోపం లేకపోవడం ఆయన వ్యక్తిత్వాన్ని మరో అంతస్తు పెంచాయి. సుప్రసన్న, రామకోటి శాస్త్రి, కాళోజీ, వానమామలై, జువ్వాడి గౌతమరావు, చేరా, బేరా, వెల్చాల కొండలరావు, లక్ష్మణ యతీంద్రులు మొదలైన వారందరితో ఒక సాహితీ కుటుంబంగా గడిపిన అదృష్టవంతుడు. సహృదయుడు. అపార పాండిత్యమూ, అమిత శిష్యవాత్సల్యమూ, ఆత్మీయ స్నేహభావమూ సంపత్కుమారను సాహిత్య రంగంలోనే కాక సామాజిక రంగంలో కూడా ఉన్నతుడిని చేశాయి. వివిధ ప్రక్రియల్లో ఆయన రచనలు నాటిన మొక్కలు డా. అనుమాండ్ల భూమయ్య, ఆచార్య బన్న అయిలయ్య, నేనూ (రచయిత) మావంటి ఎందరో ఆయన నాటిన మొక్కలం. ఆచార్య సంపత్కుమార నిన్నటి శతాబ్దంలో శిఖర ప్రాయమైన సాహితీవేత్త డా. వెళ్బాల కొండలరావుగారన్నట్లు ఆయనాథ ఎన్సైక్లోపీడియా, ఒక రెఫరెన్స్, ఒక పెద్ద దిక్కు ఆగస్టు 5, 2010లో పరమ పదాన్ని అందుకొని సాహితీ జగత్తులో అమరులయ్యారు. అందరికీ ఇష్టమన ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు గారు సాహితీక్షేత్ర వనమాలి.<noinclude><references/> {{rh|తెలంగాణ |282 | తేజోమూర్తులు}}</noinclude> cyq7vb7d3g91csy81skczvcbhm36t9f పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/304 104 211752 555132 552123 2026-04-28T14:34:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 555132 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''79. కృష్ణమాచార్య శతావధాని '''<p>}} {{right|- డా॥ సి. హెచ్. లక్ష్మణ చక్రవర్తి}} "పూర్వము మన తెలంగాణ ప్రాంతమున ఎందరో మహా పండితులు కవులు, మహాకావ్యకర్తలు జన్మించియున్నారు. కాని వారి జీవితములు వ్రాసి లేనందున ప్రాంతీయ చరిత్ర కందకున్నారు. వారి కావ్యములు ముద్రణాది సౌకర్యములు లేనందున కాలగర్భంలో కలిసి పోయినవి”ని తెలంగాణ ప్రాంత స్థితిని గురించి అవగాహన చేసుకుని మాట్లాడిన పండితులు శిరిశనహల్ కృష్ణమాచార్యులు. తాను స్వీయ కవితాను జీవనము వ్రాయడానికి కారణం తన గొప్పతనం చెప్పుకోవడానికి కాదని, తన కవితాత్మక జీవితాన్ని వివరించడం ద్వారా తన ప్రాంత స్థితిని, తన కాలపు కవుల పరిస్థితిని చెప్పడం లక్ష్యమన్నారు. వారు 18-8-1905న రంగనాయకమ్మ, వెంకటాచార్యులు దంపతులకు నిజామాబాదు జిల్లా మోర్తాడులో జన్మించారు. స్వీయ కవితాను జీవనము 1986లో రచించారు. అంటే సుమారు 81 సంవత్సరాల కవితా జీవితం, అందులో పరచుకుని ఉన్నదన్నమాట. ఇది వారి చిట్ట చివరి రచన. చిన్నప్పుడు తండ్రి దగ్గర ఐదేళ్ల వయసులో విద్యాభ్యాసం ప్రారంభించిన వారికి 9 సంవత్సరాలకే వివాహమైంది. ఈ సంఘటన వారు బాల్యవివాహాలు నిరసిస్తూ కవిత్వం వ్రాయడానికి ప్రేరణగా నిలిచింది. కరీంనగర్ జిల్లా బండలింగా పురం లోని మాతామహుల దగ్గర సంస్కృత నాటక అలంకారాలు, కొన్ని సంప్రదాయ గ్రంథాలు చదివారు. నల్లగొండ జిల్లా వారైన కనడాపురపు శ్రీనివాసాచార్యుల దగ్గర తర్కం, కుందోఝల వెంకన్న దగ్గర జ్యోతిషం, కోరుట్లలో సేనాపతి నరసింహాచార్యుల దగ్గర వ్యాకరణం, తెలుగు కావ్యాలు చదివి మద్రాసులోని శ్రీ పెరుంబూదూరు వేదాంత కళాశాలలో మీమాంసా, న్యాయ, వేదాంత శాస్త్రాలు చదివారు గీతాభాష్యం, ఉపనిషత్తు భాష్యాలు, శ్రీభాష్యం, భగద్విషయాలు అధ్యయనం చేశారు. తెలంగాణ ప్రాంతంలో వేదాంత సంస్కృత విద్యలు నలుగురికీ పంచాలన్న లక్ష్యం వారికి ఉండేది. కోరుట్ల సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నప్పుడే పొనుగోటి ఆనందమాంబకు విద్యాబోధన చేశారు. ఆమె 8 సంవత్సరాల వయసులోనే అవధానం చేయడానికి వీరి శిష్యరికం కారణమంటారు. ఆమెకు సంస్కృతం, కవితా రచనలో మెలకువలు నేర్పించారు. తెలంగాణ ప్రాంతంలోని చాలామంది పండితులు వారి శిష్యులే అంటే ఆశ్చర్య పడనవసరంలేదు. కోరుట్ల ఉభయవేదాంత కళాశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఉండి ఎంతోమందికి విద్యాదానం చేశారు. 'కళాశాలాభ్యుదయము అన్న కృష్ణమాచార్యుల వారి రచనలో ఈ కళాశాల విశేషాలను, విశిష్టతను గమనించవచ్చు. సంస్కృతం, తెలుగు, తమిళ భాషలలో పండితులైన వీరు అనేక రచనలు చేశారు. సంస్కృతంలో మనస్సందేశ కావ్యం, సంపత్కుమారసంభవమ్, గురువంశ మహాకావ్యమ్,<noinclude><references/> {{rh|తెలంగాణ |283 | తేజోమూర్తులు}}</noinclude> t0rkkfci3eh1p12uyc3mdpatl48b8vo పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/305 104 211753 555164 552124 2026-04-29T10:13:25Z A.Murali 3019 555164 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> మనోజవిజయ భాణమ్, ధర్మపురి లక్ష్మీనృసింహ సుప్రభాతం, ప్రపత్తి, స్తోత్రం, మంగళా శాసనం జియ్యరు స్వామి చరిత్రం వంటి కావ్యాలు, తత్యార్థ ప్రకాశిక, అర్చిరాది మార్గం. శ్రీ వచన భూషణం, రహస్యతయం, వేదాంత దీపం, పూర్వ పక్ష సిద్ధాంత సంయోజనం వంటి గద్య రచనలు చేశారు. తెలుగులో కళాశాలాభ్యుదయము, మనస్సందేశము, ఆంధ్ర మహానాటకము, రామానుజ చరిత్ర కావ్యాలు విశిష్టాద్వైత మత సంగ్రహము, స్వీయ కవితానుజీవనము అన్న వచన రచనలు చేశారు. విశ్వకర్మ శతక ఖండన మండనము, గీతాచార్య మత ప్రభావము, పద్మావతీ పరిణయము, రుక్మిణీ కళ్యాణము, గరుడ గర్వాపహరణము, కృష్ణగారడి, ఆధ్యాత్మ భారత హరికథ, గాంధీ జీవిత చరిత్ర, ప్రజాస్వామ్యము, అభినవకుచేలోపాఖ్యానము, రత్నమాల, శతవిధ బంధ పద్య శతకము, శృంగార పంచ బాణ విజయబాణం వంటివి ముద్రితా ముద్రిత లభ్యాలభ్య రచనలు. 1940లో సేనావతి నరసింహాచార్యుల దగ్గర విద్యాభూషణ బిరుదు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి పండిత సన్మానం (1955) ఉభయ వేదాంతాచార్య బిరుదు పెద్ద జియ్యరు స్వామి వారి నుండి (1973) ప్రపంచ తెలుగు మహాసభల కవి సన్మానం--(1975) తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం (1992) మొదలు అనేక సాహితీ సంస్థల నుండి సన్మానాలు గౌరవాలు పొందారు. 40 అష్టావధానాలు, 5 శతావధానాలు చేసిన, చిత్రబింధ కవిత్వాలు రచించిన కృష్ణమాచార్యులు నైజాం రాష్ట్రాద్య శతావధాని బిరుదును పొందారు. అది వారికి అన్వర్థనామధేయమైంది. అలా కృష్ణమాచార్య శతావధానిగా వారు ప్రసిద్ధిని పొందారు. 16 సంవత్సరాలలో తొలి సంస్కృత శ్లోకం రచించిన వారు తన రచనా యాత్రను సంస్కృత మనోజ విజయభాణంతో ప్రారంభించారు. పెద్దపల్లి దగ్గరి నంబులాద్రి నరసింహ రథోత్సవమే ఇందులోని ఇతిష్పత్తం. తొలి తెలుగు కవిత కంద పద్యం. నాటి కరీంనగర్ను <poem> కరివర శుభక్ష్యా, కరమగుటన్ ప్రాంత భూప కమనీయభజత్ కరకం నికరములనుగన, కరినగరంబ నగ సార్థకరమై యొప్పన్ </poem> హరి భక్తులకు, రాజులకు పన్నులు చెల్లించే సంపన్నులకు నిలయం కరీంనగరమని వర్ణించారు. ఒకరోజు రాత్రి సరస్వతీ దేవి కలలో వచ్చి ఒక సమస్యను పూరించమని అడిగింది. ఉత్పలమాలలో పూరించారు. అలా ప్రారంభమైన వారి ధారణ, పూరణలు అష్టావధానాలు, శతావధానా చేయడానికి పురిగాల్చింది. 1928లో జరిగిన రాజా అనంతకిషన్ రావు ఏర్పాటు చేసిన శతావధానం మరో కారణం. అవధానం మంత్రోపాసన బలమన్న అభిప్రాయాన్ని కృష్ణమాచార్య శతావధాని కాదంటారు. అది ధారణ శక్తి ప్రజ్ఞాభ్యాసంతో కూడిందన్నది. వారికున్న స్పష్టమైన అభిప్రాయం. చిత్ర బంధ కవిత్వాలను రచించిన కృష్ణమాచార్యులు అందులో ఆధునిక దృష్టిని తన జాతీయాభావాన్ని ప్రదర్శించారు. వంద రకాలుగా చిత్ర కవితను నిర్వహించారు. 'చిత్రప్రబంధం' పేరుతో 1940 ప్రాంతంలోనే రచించిన ఈ రచన ఇటీవలె ముద్రితమైంది. భారతదేశ జాతీయ పతాకం, రాట్నం, గడియారం, విమానం, సైకిలు, నిచ్చెన వంటి చిత్రబంధ కవిత్వాలు ఈ చిత్ర ప్రబంధంలో కనిపిస్తాయి. ఇవి పూర్వులు రచించిన చిత్ర బంధ కవిత్వానికి భిన్నమైనవి. శ్రీశంకరులు, శ్రీరామమూచార్యులు, మధ్వాచార్యులు లేదా తాత్త్వికుల జీవిత చరిత్రలను కావ్యంగా మలచాలంటే వారి జీవిత విశేషాలు, చరిత్ర తెలిస్తే సరిపోదు. ఆయా తాత్త్వికులలోని తత్త్వం తెలిసి ఉండాలి. సిద్ధాంత రహస్యాలు, విశిష్టాద్వైత తత్త్వం పరిపూర్ణంగా తెలిసిన కృష్ణమాచార్యుల వారి వల్ల రామాను చరిత్రకు తాత్విక కావ్యంగా గౌరవం. దక్కింది. అనేక ఉపనిషత్తులు, స్తోత్రాలు, విశిష్టాద్వైత రహస్యాలు ఈ రచనలో స్వేచ్చా సేువాద రూపంలో కనిపిస్తాయి. గాంధీ తాత నీతి శతకంలో కృష్ణమాచార్యులవారి గాంధేయ వాదాన్ని చూడవచ్చు. విదేశీ వస్త్ర బహిష్కరణ, గాంధీ సమకాలీనులైన నాయకుల పట్ల కవికున్న దృక్పథం ఈ శతకంలో చూడవచ్చు. ఆంధ్ర మహా నాటకము హనుమాటన్నాటకానువాదము. 14 అంకాలున్న ఈ నాటకం 14లో కాలకు ప్రతీకగా నిర్మించారు. స్తుతి గీతములు ఉ తెలంగాణ (284 తేజోమూర్తులు డుండడుంచుతురుము<noinclude><references/> {{rh|తెలంగాణ |284 | తేజోమూర్తులు}}</noinclude> 6jjdpp57e3mf2arku1zwbu3zho85hs9 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/9 104 212446 555124 554664 2026-04-28T12:08:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555124 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}గ్రంథపరిచయము</p> {{p|al|fwb}}గ్రంథము — కర్త</p> గ్రంథనామమునుబట్టి 'పాండురంగమాహాత్మ్యము' తక్కిన మాహాత్మ్యములవంటి సామాన్యగ్రంథమని తలఁపరాదు; ఇది ప్రాచీనకాలపు ప్రౌఢప్రబంధములలో ఎన్నిక కెక్కినది; ఆంధ్రపంచకావ్యములపట్టికలో పద్దు వేయించుకొన్నది. ఈ ప్రబంధమును కృతిపొందిన విరూరి వేదాద్రిమంత్రి గ్రంథకర్తతోఁ బలికినట్లుగా చెప్పఁబడిన — {{Telugu poem|type=సీ.|lines=<poem>తగ సంస్కృతము తెలుఁగుగఁ జేయఁ దెనుఁగు సంస్కృతముగఁ జేయఁగ జతురమతివి; నలుదెఱంగుల నెన్నఁగల కావ్యధారల ఘనుఁడ వాశువునందుఁ గరము మేటి; వఖిలభూమిపాలకాస్థానకమలాకరోదయతరుణసూర్యోదయుఁడవు; శైవ వైష్ణవ పురాణావళీనానార్థములు నీకుఁ గరతలామలకనిభము;</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>లంద్రభూమీకుచాగ్రహారాభమైన, శ్రీతెనాల్యగ్రహారనిర్ణేత; వగ్ర శాఖికాకోకిలమ వీవు; సరసకవివి, రమ్యగుణకృష్ణ! రామయ రామకృష్ణ!</poem>|ref=}}⁠ {{Telugu poem|type=క.|lines=<poem>కౌండిన్యసగోత్రుఁడ వా ఖండలగురునిభుఁడ వఖిలకావ్యరససుధా మండనకుండలుఁడవు భూ మండలవినుతుఁడవు లక్ష్మమావరతనుజా!</poem>|ref=}} {{Telugu poem|type=క.|lines=<poem>యశము గలిగించు నీమృదు విశదోక్తులఁ బౌండరీక, విభుచరితఁ జతు ర్దశభువనవినుతముగ శుభ వశమతి నాపేర నుడువు వరతత్త్వనిధీ.</poem>|ref=}} ⁠అను పద్యములను బట్టియు, “ఇది శ్రీమత్పరమపదనాథ నిరవధికకృపాపరిపాకపరిచిత సరసకవితాసనాథ రామకృష్ణకవినాథ ప్రణీతంబయిన —" అను నాశ్వాసాంతగద్యభాగములంబట్టియు ఈ ప్రబంధమును తెనాలిరామకృష్ణకవి రచియించెనని స్పష్టపడుచున్నది. {{p|al|fwb}}రామలింగఁడే రామకృష్ణుఁడు</p> ఉద్భటారాధ్యచరిత్రమును రచించిన తెనాలి రామలింగకవియు, ఈ రామకృష్ణకవియు నభిన్నులని కొందఱిమతము, భిన్నులని కొందఱితలంపు. ఈ కవినామము తొలుత రామలింగఁడనియు, అప్పు డీతఁడు శైవుఁడనియు, కొంతకాలమున కీతఁడు వైష్ణవము పుచ్చుకొని తనపేరు రామకృష్ణుఁడని మార్చుకోనెననియు ప్రతీతి కలదు. శ్రీ వీరేశలింగముపంతులుగారు మున్నగు కొంద ఱీ యైతిహ్యమును నమ్మిరి. కొందఱు భేదవాదులు తమవాదమునకు బలకరముగా క్రింది యంశములను చూపుదురు.<noinclude><references/></noinclude> r6gqi4prkd8xodusaqn0p9rkj1x6se4 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/10 104 212447 555126 554665 2026-04-28T12:58:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555126 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} (i) పాండురంగమాహాత్మ్యపుగద్యమునకు విలక్షణముగ 'ఉద్భటారాధ్యచరిత్రమున గద్య' “ఇది శ్రీమదేలేశ్వరగురువరేణ్య చరణారవిందషట్చరణ సకలకళాభరణ రామనార్యసుపుత్ర సుకవిజనమిత్ర కుమారభారతిబిరుదాభిరామ రామలింగయ ప్రణీతంబైన” అనియున్నది. (ii) రామలింగనికిఁ గల 'కుమారభారతి' అను బిరుదము పాండురంగకృతికర్తకు లేదు. అందు కృతిపతి కవినిగూర్చి "శారద నీరూపము” అని సంబోధించి నట్లున్నది. (iii) రామలింగనిగురువు ఏలేశ్వరుఁడు; పాండురంగకృతికర్తగురువు భట్టరు చిక్కాచార్యులు. కాని, కొంత విమర్శించి చూచినచో పయి కారణములు భేదవాదమునకు సమర్థకములు కాఁజాలవని తోఁచుచున్నది. తొలుతఁ జెప్పఁబడిన యైతిహ్యమును బట్టి యీ కవి శైవుఁడుగా నున్నపుడు రామలింగఁడై యుండెననియు, నప్పు డితని గురు వేలేశ్వరుఁడై యుండెననియు, నీకవి వైష్ణవుఁడైనపిదప రామకృష్ణుఁడని తనపేరు మార్చుకొనెననియు, చిక్కాచార్యులను గురువుగా గ్రహించెననియు చెప్పికొనవచ్చును. ఉద్భటారాధ్యచరిత్ర మీతని పిన్నవయసున రచింపఁబడినదగుటచే నప్పు డితనికి 'కుమారభారతి' అను బిరుద ముండెననియు, పాండురంగకృతి రచనాకాలమునాఁటి కీ కవి వయసుమీఱినవాఁ డగుటచే దానికి బదులు కవి శారదాస్వరూపుఁడే యగుట 'శారద, నీరూపము' అని కృతిభర్త చెప్పవలనుపడెననియు గ్రహింపనగును. కవికులగోత్రాదులఁబట్టి చూచినయెడల వీరిరువురును అభిన్ను లనియే చెప్పవలసి వచ్చుచున్నది. <div style="column-count:2"> <poem><small>ఉద్భటకృతికర్త</small> కౌండిన్యగోత్రుఁడు శుక్లయజుర్వేది తండ్రి రామయ తల్లి లక్ష్మమ <small>పాండురంగకృతికర్త</small> కౌండిన్యగోత్రుఁడు శుక్లయజుర్వేది తండ్రి రామయ తల్లి లక్ష్మమ</poem></div> తెనాలి రామభద్ర కవికృతమగు 'ఇందుమతీపరిణయము'న {{Telugu poem|type=ఉ.|lines=<poem>“...... కవితా ఘనతామహు మత్పితామహున్ రామయ రామకృష్ణకవిరాజుఁ దలంచి, నుతించి మ్రొక్కెదన్.</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>తదనుసంభవమణిని సుదక్షిణాప, రిణయ ముఖకావ్యరచనాధురీణు నాంధ్ర కవికదంబములోనఁ బ్రఖ్యాతిఁ గన్న, యన్నయకవీంద్రు ధీసాంద్రు నభినుతింతు.</poem>|ref=}} {{Telugu poem|type=|lines=<poem>.... .... .... .... ..... .... ...</poem>|ref=}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రౌఢి మీ పెదతాత పాండురంగాదిసత్కృతులు చేసెను రామకృష్ణ సుకవి అనుజుఁ దన్నప్ప మీ పినతాత రచియించెఁ బరఁగ సుదక్షిణాపరిణయంబు</poem>|ref=}}<noinclude><references/></noinclude> kulgsslg4dmkbwoi1dc7f2upwipiu0g పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/11 104 212448 555128 554666 2026-04-28T13:56:55Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555128 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మీతాత శ్రీగిరి చాతురీవిఖ్యాతి శ్రీశైలమాహాత్మ్యకృతి యొనర్చె కడిమి మీతండ్రి యిమ్మడి రామకృష్ణాఖ్యుఁడనఁ గీర్తిఁగనె సంస్కృతాంధ్రములను</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ఔర యనిపించి మాయన్న వీరరాఘ, వాఖ్యకవి సర్వకవితామహత్త్వమునను ని న్ననూచానసంతాను నెన్నఁదరమె, ప్రాజ్ఞహృదయాబ్జరనివి రామభద్రసుకవి.”</poem>|ref=}} అని యున్నది. దీనినిబట్టి చూడఁగా పాండురంగమాహాత్మ్యాదులను రచించిన తెనాలి రామకృష్ణకవియును, సుదక్షిణాపరిణయమును రచించిన తెనాలి అన్నయకవియును అన్నదమ్ములని యేర్పడుచున్నది. ఏతదనుకూలముగనే సుదక్షిణాపరిణయమున {{Telugu poem|type=గీ.|lines=<poem>“నవ్యసుగుణాభిరామ తెనాలిరామ, పండితాగ్రణి సత్పుత్రు భవ్యమిత్రు హరపదాంభోజ సౌముఖ్యు, నన్నపాఖ్యు, నన్న బిలిపించి యాదరోన్నతి వహించి.</poem>|ref=}} {{Telugu poem|type=|lines=<poem>... ... ... ... ...</poem>|ref=}} {{Telugu poem|type=గద్యము.|lines=<poem></poem>|ref=}} ఇది శ్రీమత్తెనాలి రామేశ్వర శాశ్వతకృపాకటాక్షలక్షిత కవితాభిరామ రామయపండిత కుమార సహజశైవాచారసంపన్న ధీమదన్నయనామధేయప్రణీతంబైన సుదక్షిణాపరిణయము నందు—" అని యున్నది. ఈ పయిభాగమువలనఁగూడ రామకృష్ణుఁడును, అన్నయయును అన్నదములగుట సుస్పష్టము,. ఇరువురును రామయపండితుని కుమారులే! తెనాలి వారే!! మఱియు అన్నయ 'పాలగుమి భీమగురుని సద్భక్తిఁ గొలుతు' అని చెప్పుటచే తెనాలివారు సహజముగా శైవులనియు, పాలగుమివారి శిష్యులనియుఁ దెలియుచున్నది. ఉద్భటారాధ్యచరిత్ర రచనాకాలమునాఁటికి రామలింగకవి పాలగుమివారి (పాలగుమిలేశ్వరుని) శిష్యుఁడగుట ప్రసిద్ధముకదా! తెనాలి యన్నయ తనగ్రంథమున తనయన్నయగు రామకృష్ణుని స్తుతింపలేదు. అంతమాత్రమున వీరిరువురి సౌదర్యవిషయమున సందేహింపఁబనిలేదు. అన్న మతాంతరస్వీకరణ మొనరించెనన్న అనాదరమున సుదక్షిణాపరిణయకర్త రామకృష్ణునిఁ బేర్కొనక యుండవచ్చును. రామభద్రకవి స్పష్టముగ వీరిరువురును సోదరులే యని వివరించియే యున్నాఁడు. రామకృష్ణకవి తన మతముమార్పును తెలుపుకొనకున్నను, పాండురంగమాహాత్మ్యమునఁ జెప్పఁబడిన 'శైవవైష్ణవపురాణావళీ నానార్థరచనాపటిష్ఠైకరమ్యమతివి' అను భాగమునుబట్టి యాతని శైవప్రబంధరచనాపాటవముకూడ వ్యక్త మగుటయు, నతని మతాంతరస్వీకృతి విశదమగుటయు సహృదయ వేద్యములు. ఉద్భటారాధ్యచరిత్రమును, పాండురంగమాహాత్మ్యమును ఏకకర్తృకములని చెప్పుట కీ రెండు గ్రంథములకును గల పోలికలు ప్రమాణము కాఁదగును. అందుఁ గొన్ని మాత్ర మిచట చూపఁబడును —<noinclude><references/></noinclude> qx5i7j9o7gk3haz50lluvz39dydqlcx 555129 555128 2026-04-28T13:57:17Z దేవీప్రసాదశాస్త్రి 4290 555129 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మీతాత శ్రీగిరి చాతురీవిఖ్యాతి శ్రీశైలమాహాత్మ్యకృతి యొనర్చె కడిమి మీతండ్రి యిమ్మడి రామకృష్ణాఖ్యుఁడనఁ గీర్తిఁగనె సంస్కృతాంధ్రములను</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ఔర యనిపించి మాయన్న వీరరాఘ, వాఖ్యకవి సర్వకవితామహత్త్వమునను ని న్ననూచానసంతాను నెన్నఁదరమె, ప్రాజ్ఞహృదయాబ్జరనివి రామభద్రసుకవి.”</poem>|ref=}} అని యున్నది. దీనినిబట్టి చూడఁగా పాండురంగమాహాత్మ్యాదులను రచించిన తెనాలి రామకృష్ణకవియును, సుదక్షిణాపరిణయమును రచించిన తెనాలి అన్నయకవియును అన్నదమ్ములని యేర్పడుచున్నది. ఏతదనుకూలముగనే సుదక్షిణాపరిణయమున {{Telugu poem|type=గీ.|lines=<poem>“నవ్యసుగుణాభిరామ తెనాలిరామ, పండితాగ్రణి సత్పుత్రు భవ్యమిత్రు హరపదాంభోజ సౌముఖ్యు, నన్నపాఖ్యు, నన్న బిలిపించి యాదరోన్నతి వహించి.</poem>|ref=}} {{Telugu poem|type=|lines=<poem>... ... ... ... ...</poem>|ref=}} {{Telugu poem|type=గద్యము.|lines=<poem>ఇది శ్రీమత్తెనాలి రామేశ్వర శాశ్వతకృపాకటాక్షలక్షిత కవితాభిరామ రామయపండిత కుమార సహజశైవాచారసంపన్న ధీమదన్నయనామధేయప్రణీతంబైన సుదక్షిణాపరిణయము నందు—"</poem>|ref=}} అని యున్నది. ఈ పయిభాగమువలనఁగూడ రామకృష్ణుఁడును, అన్నయయును అన్నదములగుట సుస్పష్టము,. ఇరువురును రామయపండితుని కుమారులే! తెనాలి వారే!! మఱియు అన్నయ 'పాలగుమి భీమగురుని సద్భక్తిఁ గొలుతు' అని చెప్పుటచే తెనాలివారు సహజముగా శైవులనియు, పాలగుమివారి శిష్యులనియుఁ దెలియుచున్నది. ఉద్భటారాధ్యచరిత్ర రచనాకాలమునాఁటికి రామలింగకవి పాలగుమివారి (పాలగుమిలేశ్వరుని) శిష్యుఁడగుట ప్రసిద్ధముకదా! తెనాలి యన్నయ తనగ్రంథమున తనయన్నయగు రామకృష్ణుని స్తుతింపలేదు. అంతమాత్రమున వీరిరువురి సౌదర్యవిషయమున సందేహింపఁబనిలేదు. అన్న మతాంతరస్వీకరణ మొనరించెనన్న అనాదరమున సుదక్షిణాపరిణయకర్త రామకృష్ణునిఁ బేర్కొనక యుండవచ్చును. రామభద్రకవి స్పష్టముగ వీరిరువురును సోదరులే యని వివరించియే యున్నాఁడు. రామకృష్ణకవి తన మతముమార్పును తెలుపుకొనకున్నను, పాండురంగమాహాత్మ్యమునఁ జెప్పఁబడిన 'శైవవైష్ణవపురాణావళీ నానార్థరచనాపటిష్ఠైకరమ్యమతివి' అను భాగమునుబట్టి యాతని శైవప్రబంధరచనాపాటవముకూడ వ్యక్త మగుటయు, నతని మతాంతరస్వీకృతి విశదమగుటయు సహృదయ వేద్యములు. ఉద్భటారాధ్యచరిత్రమును, పాండురంగమాహాత్మ్యమును ఏకకర్తృకములని చెప్పుట కీ రెండు గ్రంథములకును గల పోలికలు ప్రమాణము కాఁదగును. అందుఁ గొన్ని మాత్ర మిచట చూపఁబడును —<noinclude><references/></noinclude> 0v52npy85b2lkkjayamrmg8jzc9vclq పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/12 104 212449 555133 554667 2026-04-28T18:54:37Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555133 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>ఈ కవులున్ బాఠకులున్ బ్రధానులు సుధీగణ్యుల్ పురాణజ్ఞులున్ వివిధార్థుల్ సఖులున్ బురోహితులు నుర్వీనాథులున్ జోన్యులున్ ధవళాక్షుల్ గొలువంగ నిండుకొలువై దైవారు హర్షంబుతో నవధానంబున నుండి శంకరకథావ్యాసక్తి భాసిల్లుచున్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 1-23]}} {{Telugu poem|type=మ.|lines=<poem>కవులుం బాఠకులున్ బ్రధానులు నలంకారజ్ఞులున్ బ్రాజ్ఞులున్ ధవళాక్షుల్ భజియింప నిండుకొలువై తారేందు తారావళీ ధవళంబైన సువర్ణకుంభయుతసౌధంబందు నాస్థానమై వివిధామ్నాయపురాణగుంభనకథల్ వించున్ బ్రమోదంబునన్.</poem>|ref=}} {{right|[పాండు. 1-21]}} {{Telugu poem|type=గీ.|lines=<poem>.... ... ... ... ... ... ... ... .... ... లబ్జముఖి.....౦దఁజేయు, బ్రహ్మవిద్యావిదూరుఁడై బ్రాహ్మణుండు.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 1-124]}} {{Telugu poem|type=గీ.|lines=<poem>... ... ... ... ... ... ... ... ... నిగమఘంటాపథైకాధ్వనీనబుద్ధి, బ్రహ్మవిద్యానవద్యుండు బ్రాహ్మణుండు.</poem>|ref=}} {{right|[పాండు. 2-6]}} {{Telugu poem|type=చ.|lines=<poem>వ్రతములు చేసి పెక్కు లుపవాసములున్ మఱిపెక్కు లుప్పిఁడుల్ ధృతి నొనరించి కూర్మిఁ బరదేశులఁ దల్లియపోలెఁ బ్రోచి మా నితగతి మింటిదయ్యముల నేలకుఁ దెచ్చి కుమారుఁ గాంచెఁ ద త్పతి..................రుగుఁ జామపతివ్రత సంతసంబునన్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 5-21]}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఆమహీసురులేమకు నతులనిష్ఠ నింగివేల్పుల నేలకు నేలవేల్పు కొలము నింగికిఁ దెచ్చుచుఁ గొలువఁ బుత్త్రు, డొక్కఁ డుదయించెఁ దత్కృపాభ్యుదయమహిమ.</poem>|ref=}} {{right|[పాండు. 3-5]}} {{Telugu poem|type=సీ.|lines=<poem>నెరవెండ్రుకలు దువ్వి నిలువకొప్పు ఘటించి కుసుమదామము మీఁద గుస్తరించి నుదుట గందపుఁజుక్క నూల్కొల్పి నీలాలపోగంట్లు చెలిదోయిఁ బొందుపరిచి, తరళమై బంగారుతాయెత్తు గల ముత్తెములపేరు పేరురంబున ధరించి, కటిఁ దాళిగోణాముకడచుంగు ధరఁ జీర పట్టుదట్టీ ద్రిండుగట్టి నడుమ</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>కేల డాఁపలిచిటికెనవ్రేలియందు, నలఁతిపగడాలయుంగర మనువుకొలిపి గౌరవంబీని కలికిసింగార మొదవ, నారజంబుగఁ జరియించు నతఁడు మఱియు.</poem>|ref=}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>బోఁడికెమూఁపుపైఁ గరము పొందగఁజేసి కరంబు మ్రోయు నం బాడిగ లోలి మెట్టి కరపద్మము క్రొవ్విరిచెండు మాటికిన్ వేడుకఁ బారమీటుచు నవీననఖాంకవిలాసలక్ష్మితోఁ గూడిన మేను పమ్ముకొనఁ గ్రుమ్మరుచుండు నతండు వీథులన్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-121,122]}} {{Telugu poem|type=చ.|lines=<poem>తలఁగడు గంగమర్దనము ధౌతపటావరణంబు సంస్కృతో జ్జ్వలకలమాన్నభోజనము చందనచర్చ ప్రసూనదామకం బులు కపురంపువీడ్యమును భూషణపంక్తులు గల్గి నిచ్చలున్ బులుకడుగంగఁబడ్డ నునుముత్యముఁబోలుచు వాలుచుం బురిన్.</poem>|ref=}}<noinclude><references/></noinclude> 914musj0ffv2fp6wg74wi6r1rd3lxki పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/13 104 212450 555134 554668 2026-04-28T20:56:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555134 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>కలదు, లేదను వాదముల కోర్చి మీనుమీసమువంటి యొంటిజందెము మెఱవఁగ బహుసంకుమదపంకపాణింధమంబైన తాళిగోణపుఁజంగు నేల జీరఁ గడలేని వీడ్యంపుఁ గప్పుచుందురు కాని మోవి పల్లొత్తుల ముసుగుదన్న సానతాఁకులు గల్గు సూనాస్త్రుశంఖంబుగతి నఖరేఖాంకగళము దనర</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సఖులు పరిహాసకులు వెంటఁ జనఁగ యువతి, భుక్తనిర్ముక్తపరిధానయుక్తుఁ డగుచు నగరఘంటాపథంబున నగుచుఁ దిరుగు, నొఱపుగల ఠీవి జాతిమాత్రోపజీవి.</poem>|ref=}} {{right|[పాండు. 3-6,10]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>"కోకకుఁ గూటికై యొకనిఁ గొల్చి తదీరితవాక్యపద్ధతిన్ గైకొని...............................</poem>|ref=}} {{right|[ఉద్భటా. ఆ. 2-91]}} {{Telugu poem|type=క.|lines=<poem>పలువకుఁ గూటికిపై నీ, చులవేడు బోడ చొరవఁజొచ్చు నతఁడు —" ......................................</poem>|ref=}} {{right|[పాండు. 3-21]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>మానితలీల సజ్జనునిమాడ్కి మహీసురుఁ డప్పురంబులో మానవపంక్తిలోఁ గలసి మచ్చికయై తలలోని నాల్కయై ధీనిధి యాతఁడో యనఁగఁ దేకువఁ దేజము గాంచి యుండెఁ బెం పూనఁగఁ గొన్ని వాసరము.........................తటన్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-141]}} {{Telugu poem|type=క.|lines=<poem>తలలోపల నాలుక పూ, సలలో దారంబు పాలఁ జల్లిన నీరుం బలె వెలియెఱుఁగక మనసులు, గలసి యభేదముగఁ గాఁపుకడ నతఁడుండెన్.</poem>|ref=}} {{right|[పాండు. 3-59]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆరయఁ బాలవంటి కుల మాఱడిఁబోవఁగనిచ్చి వీటిలో నారజమై చరించు వసుధామరనందనుఁ డిట్టివారు నె వ్వారును జీరికిం గొనక, ..................జుల్కఁగా నీరసవృత్తిఁ జూచి; రతినింద్యుఁడు వీఁడని యేవగింపుచున్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-134]}} {{Telugu poem|type=గీ.|lines=<poem>కాఁపురము నాకుఁ గడుఁబెద్ద కంచియంత, యిల్లు శ్రీధాన్యకటకమై హెచ్చు........."</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-253]}} {{Telugu poem|type=తే.|lines=<poem>కాఁపుఁగోడలు కంచంత కాఁపురంబు, పాలవంటికులంబు గాడ్పఱచి చనియె– .............................................</poem>|ref=}} {{right|[పాండు. 3-81]}} {{Telugu poem|type=క.|lines=<poem>భజన చెడి దానిపొత్తున, భుజియించెను మధువుఁ ద్రావెఁ బొల యంటె వెసన్ ద్యజియించెఁ దగిననడవడి, కుజనుండై ధరణిసురుఁడు కుత్సితబుద్ధిన్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-231]}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఎన్నిజన్మంబులేనియుఁ జన్నపిదప, గాని ప్రాసింపరాని ధరానిలింప జాతి గడెలోన నప్పాపజాతి తొఱఁగి, కల్లుపెల్లాను వేఁటాడుఁ గఱచు నెఱచి.</poem>|ref=}} {{right|[పాండు. 3-84]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>కేతువు నీటముంచి తమకించి ధనుర్లత మళ్లఁబెట్టి వి ఖ్యాతబలంబుఁ జెట్టులను గట్టి గుణంబునఁ గల్గు పక్షముల్ వే తరలించి యంపగమి వేఁడక మూలకుఁ ద్రోచి యమ్మనో జాతుఁడు తత్పురిం గలుగు శైవులపైఁ జన లోఁగునెంతయున్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 1-152]}}<noinclude><references/></noinclude> 64tjkp3au9l3w9rd1c9rwn5gdr7cf47 555135 555134 2026-04-28T21:01:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 555135 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>కలదు, లేదను వాదముల కోర్చి మీనుమీసమువంటి యొంటిజందెము మెఱవఁగ బహుసంకుమదపంకపాణింధమంబైన తాళిగోణపుఁజంగు నేల జీరఁ గడలేని వీడ్యంపుఁ గప్పుచుందురు కాని మోవి పల్లొత్తుల ముసుగుదన్న సానతాఁకులు గల్గు సూనాస్త్రుశంఖంబుగతి నఖరేఖాంకగళము దనర</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సఖులు పరిహాసకులు వెంటఁ జనఁగ యువతి, భుక్తనిర్ముక్తపరిధానయుక్తుఁ డగుచు నగరఘంటాపథంబున నగుచుఁ దిరుగు, నొఱపుగల ఠీవి జాతిమాత్రోపజీవి.</poem>|ref=}} {{right|[పాండు. 3-6,10]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>"కోకకుఁ గూటికై యొకనిఁ గొల్చి తదీరితవాక్యపద్ధతిన్ గైకొని...............................</poem>|ref=}} {{right|[ఉద్భటా. ఆ. 2-91]}} {{Telugu poem|type=క.|lines=<poem>వలువకుఁ గూటికినై నీ, చులవేడం బోడ చొరవఁజొచ్చు నతఁడు —" ......................................</poem>|ref=}} {{right|[పాండు. 3-21]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>మానితలీల సజ్జనునిమాడ్కి మహీసురుఁ డప్పురంబులో మానవపంక్తిలోఁ గలసి మచ్చికయై తలలోని నాల్కయై ధీనిధి యాతఁడో యనఁగఁ దేకువఁ దేజము గాంచి యుండెఁ బెం పూనఁగఁ గొన్ని వాసరము.........................తటన్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-141]}} {{Telugu poem|type=క.|lines=<poem>తలలోపల నాలుక పూ, సలలో దారంబు పాలఁ జల్లిన నీరుం బలె వెలియెఱుఁగక మనసులు, గలసి యభేదముగఁ గాఁపుకడ నతఁడుండెన్.</poem>|ref=}} {{right|[పాండు. 3-59]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆరయఁ బాలవంటి కుల మాఱడిఁబోవఁగనిచ్చి వీటిలో నారజమై చరించు వసుధామరనందనుఁ డిట్టివారు నె వ్వారును జీరికిం గొనక, ..................జుల్కఁగా నీరసవృత్తిఁ జూచి; రతినింద్యుఁడు వీఁడని యేవగింపుచున్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-134]}} {{Telugu poem|type=గీ.|lines=<poem>కాఁపురము నాకుఁ గడుఁబెద్ద కంచియంత, యిల్లు శ్రీధాన్యకటకమై హెచ్చు........."</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-253]}} {{Telugu poem|type=తే.|lines=<poem>కాఁపుఁగోడలు కంచంత కాఁపురంబు, పాలవంటికులంబు గాడ్పఱచి చనియె– .............................................</poem>|ref=}} {{right|[పాండు. 3-81]}} {{Telugu poem|type=క.|lines=<poem>భజన చెడి దానిపొత్తున, భుజియించెను మధువుఁ ద్రావెఁ బొల యంటె వెసన్ ద్యజియించెఁ దగిననడవడి, కుజనుండై ధరణిసురుఁడు కుత్సితబుద్ధిన్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-231]}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఎన్నిజన్మంబులేనియుఁ జన్నపిదప, గాని ప్రాసింపరాని ధరానిలింప జాతి గడెలోన నప్పాపజాతి తొఱఁగి, కల్లుపెల్లాను వేఁటాడుఁ గఱచు నెఱచి.</poem>|ref=}} {{right|[పాండు. 3-84]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>కేతువు నీటముంచి తమకించి ధనుర్లత మళ్లఁబెట్టి వి ఖ్యాతబలంబుఁ జెట్టులను గట్టి గుణంబునఁ గల్గు పక్షముల్ వే తరలించి యంపగమి వేఁడక మూలకుఁ ద్రోచి యమ్మనో జాతుఁడు తత్పురిం గలుగు శైవులపైఁ జన లోఁగునెంతయున్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 1-152]}}<noinclude><references/></noinclude> f4mqmp0dn2mq6k6644in7xci3i1mzkp 555136 555135 2026-04-28T21:05:36Z దేవీప్రసాదశాస్త్రి 4290 555136 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>కలదు, లేదను వాదముల కోర్చి మీనుమీసమువంటి యొంటిజందెము మెఱవఁగ బహుసంకుమదపంకపాణింధమంబైన తాళిగోణపుఁజుంగు నేల జీరఁ గడలేని వీడ్యంపుఁ గప్పుచుందురు కాని మోవి పల్లొత్తుల ముసుగుదన్న సానతాఁకులు గల్గు సూనాస్త్రుశంఖంబుగతి నఖరేఖాంకగళము దనర</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సఖులు పరిహాసకులు వెంటఁ జనఁగ యువతి, భుక్తనిర్ముక్తపరిధానయుక్తుఁ డగుచు నగరఘంటాపథంబున నగుచుఁ దిరుగు, నొఱపుగల ఠీవి జాతిమాత్రోపజీవి.</poem>|ref=}} {{right|[పాండు. 3-6,10]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>"కోకకుఁ గూటికై యొకనిఁ గొల్చి తదీరితవాక్యపద్ధతిన్ గైకొని...............................</poem>|ref=}} {{right|[ఉద్భటా. ఆ. 2-91]}} {{Telugu poem|type=క.|lines=<poem>వలువకుఁ గూటికినై నీ, చులవేడం బోడ చొరవఁజొచ్చు నతఁడు —" ......................................</poem>|ref=}} {{right|[పాండు. 3-21]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>మానితలీల సజ్జనునిమాడ్కి మహీసురుఁ డప్పురంబులో మానవపంక్తిలోఁ గలసి మచ్చికయై తలలోని నాల్కయై ధీనిధి యాతఁడో యనఁగఁ దేకువఁ దేజము గాంచి యుండెఁ బెం పూనఁగఁ గొన్ని వాసరము.........................తటన్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-141]}} {{Telugu poem|type=క.|lines=<poem>తలలోపల నాలుక పూ, సలలో దారంబు పాలఁ జల్లిన నీరుం బలె వెలియెఱుఁగక మనసులు, గలసి యభేదముగఁ గాఁపుకడ నతఁడుండెన్.</poem>|ref=}} {{right|[పాండు. 3-59]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆరయఁ బాలవంటి కుల మాఱడిఁబోవఁగనిచ్చి వీటిలో నారజమై చరించు వసుధామరనందనుఁ డిట్టివారు నె వ్వారును జీరికిం గొనక, ..................జుల్కఁగా నీరసవృత్తిఁ జూచి; రతినింద్యుఁడు వీఁడని యేవగింపుచున్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-134]}} {{Telugu poem|type=గీ.|lines=<poem>కాఁపురము నాకుఁ గడుఁబెద్ద కంచియంత, యిల్లు శ్రీధాన్యకటకమై హెచ్చు........."</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-253]}} {{Telugu poem|type=తే.|lines=<poem>కాఁపుఁగోడలు కంచంత కాఁపురంబు, పాలవంటికులంబు గాడ్పఱచి చనియె– .............................................</poem>|ref=}} {{right|[పాండు. 3-81]}} {{Telugu poem|type=క.|lines=<poem>భజన చెడి దానిపొత్తున, భుజియించెను మధువుఁ ద్రావెఁ బొల యంటె వెసన్ ద్యజియించెఁ దగిననడవడి, కుజనుండై ధరణిసురుఁడు కుత్సితబుద్ధిన్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 2-231]}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఎన్నిజన్మంబులేనియుఁ జన్నపిదప, గాని ప్రాసింపరాని ధరానిలింప జాతి గడెలోన నప్పాపజాతి తొఱఁగి, కల్లుపెల్లాను వేఁటాడుఁ గఱచు నెఱచి.</poem>|ref=}} {{right|[పాండు. 3-84]}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>కేతువు నీటముంచి తమకించి ధనుర్లత మళ్లఁబెట్టి వి ఖ్యాతబలంబుఁ జెట్టులను గట్టి గుణంబునఁ గల్గు పక్షముల్ వే తరలించి యంపగమి వేఁడక మూలకుఁ ద్రోచి యమ్మనో జాతుఁడు తత్పురిం గలుగు శైవులపైఁ జన లోఁగునెంతయున్.</poem>|ref=}} {{right|[ఉద్భటా. 1-152]}}<noinclude><references/></noinclude> 4046ccyv2sbnz7fw1vveyr2os3rp9qo పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/14 104 212451 555137 554669 2026-04-29T00:01:58Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555137 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>నిలువున నొలిపించె విలువంగడము నెల్ల శరములయాయంబుఁ బొరయు టుడిపెఁ దగ శబ్దమాత్రపాత్రముఁ జేసి గుణలత మ్రాఁకునఁ గట్టించె మౌలబలముఁ గంచుకివశము గావించె సేనానాథుఁ గమరించె సహచరుఁ గటికియెండఁ బ్రతిపక్షభావసంగతుఁడని హితుఁ జూచె వరకేతనము కీర్తిభరము డులిపె</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>ధర్మనిర్మలబుద్ధి సుశర్మఁ గదిసి, గెలువఁగా లేక చని కోపగించి మదనుఁ డుఱక; తనవార లతనికి నోడుమనిరె? పతికిఁ గీడౌట బంట్లపాపంబుకాదె!</poem>|ref=}} {{right|[పాండు. ఆ. 5-98]}} ఇట్టి వింక నెన్నియేని కలవు. ఈ రీతినే రామకృష్ణకవికృతమగు ఘటికాచలమాహాత్మ్యమునకును, ఉద్భటారాధ్యచరిత్రమునకును చాల పోలికలు కలవు, మచ్చునకు రెండు మాత్ర మిట నీయఁబడుచున్నవి. {{Telugu poem|type=సీ.|lines=<poem>మొకరితేఁటులు మూతి ముట్టవు లేనియర్ శ్రీమధుశాసి కర్పించికాని కోకిలమ్ములు చిగురాకులు గొఱుకపు శ్రీవనమాలి కర్పించికాని లేఁబచ్చికల్ కబళింపవు హరిణముల్ శ్రీనీలమూర్తి కర్పించికాని ఫలభుజిక్రియలకుఁ జిలుకలు దలఁపవు శ్రీమాధవునకు నర్పించికాని,</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>యితరజంతువులును హరిమతిఁ దలంచి, కాని యే వర్తనమునకుఁ బూన వనిన నా తపోవనమాహాత్మ్య మభినుతింప, నలవియే వేమొగంబులచిలువకైన.</poem>|ref=}} {{right|[ఘటికాచలమాహాత్మ్యము]}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అచలసుతాభర్త కర్పించి మఱి కాని మృగములు లేఁబూరి మేయవచ్చట ససమలోచనునికు నర్పించి మఱి కాని యళులు క్రొవ్విరితేనె లాన వచట అంధకధ్వంసికి నర్పించి మఱి కాని కోయిల లిగురాకు కొఱుక వచట నంగజారాతికి నర్పించి మఱి కాని చిలుకలు పండ్లు భుజింప వచట</poem>|ref=}} {{Telugu poem|type=గీ.|lines=<poem>తక్కుఁగల జంతువులు శంభుఁ దలఁచికాని, యుచితవర్తనములఁ గోరి యుండ వచట వదనములు వేయుఁ గలయంతవానికైన, నా యరణ్యంబు గొనియాడ నలవియగునె?</poem>|ref=}} {{right|[ఉద్భటారాధ్యచరిత్ర]}} {{Telugu poem|type=మ.|lines=<poem>శుకముల్ ప్రామినుకుల్ గుణించు; గణియించుం ధర్మమర్మేతిహా సకథల్ శారిక; లీరికల్ గొనుమనీషన్ శేషభాషావిశే షకళాశాస్త్ర ముపన్యసించు; బకముల్ సాత్రాజితీప్రాణనా యకనామాళి; నళుల్ పఠించు సతతోద్యద్గీతికాచాతురిన్.</poem>|ref=}} [ఘటికాచలమాహాత్మ్యము] {{Telugu poem|type=ఉ.|lines=<poem>సానుగుణంబుఁ గ్రోల్చుఁ బికశాబకపంక్తులు శైవధర్మముల్; ప్రేమ నుపన్యసించు శుకబృందము లీశ్వరయోగశాస్త్రముల్; కోమలరీతి శారికలు గూడి పఠించు వినోదలీలలన్; గామవిరోధిఁ బాడు నధికంబుగ నచ్చట భృంగపోతముల్.</poem>|ref=}} {{right|[ఉద్భటారాధ్యచరిత్రము]}} {{p|al|fwb}}ఇంటిపేరు</p> రామకృష్ణకవియింటిపేరు 'తెనాలివా' రని పాండురంగమాహాత్మ్యమునందలి 'శ్రీతెనాల్యగ్రహారనిర్ణేతవు' అనుదానినిబట్టి తెలియుచున్నది. అంతకుఁ బూర్వమున ఆ వంశమువారియింటిపేరు 'గార్లపాటివా'రని ప్రసిద్ధము. శ్రీగురుజాడ శ్రీరామ<noinclude><references/></noinclude> ta1w1vmtfpvm8pg08vv5rg7rrgmecn9 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/15 104 212452 555139 554670 2026-04-29T00:14:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555139 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మూర్తిగారును, శ్రీవీరేశలింగముగారును అట్లే చెప్పియున్నారు. తెనాలిలో శ్రీ రామలింగేశ్వరస్వామివారి యాలయమున నొక యుత్సవవిగ్రహము పీఠముమీఁదఁ గల {{Telugu poem|type=శ్లో.|lines=<poem>"శ్రీ తెనాలినగరే వ్యరాజయ, ద్గార్లపాటిపుర రామపండిత: శుక్లమాఘసితపంచమీగురౌ రామలింగ ముమయోత్సవాకృతిమ్.”</poem>|ref=}} అను శ్లోక మీ యంశమును బలపఱచుచున్నది. గార్లపాటి రామయపండితుఁడు తెనాలి నగరమున శ్రీ రామలింగేశ్వరస్వామియొక్కయు, శ్రీపార్వతీదేవియొక్కయు ఉత్సవవిగ్రహములను ప్రతిష్టించెనని మీఁదిశ్లోకమున కర్ధము. ఈ రామయపండితుఁడే రామకృష్ణుని తండ్రి. ఈ రామయ గొప్ప శివభక్తుడని యీ శ్లోకమే విశదపఱచుచున్నది. {{p|al|fwb}}కవికాలము — గ్రంథరచనాకాలము</p> ఉద్భటారాధ్యచరిత్రపు కృత్యవతరణికనుబట్టి యా గ్రంథము కొండవీడు దుర్గాద్యక్షుఁడుగా నుండిన నాదెండ్ల గోపమంత్రి కడ ముఖ్యోద్యోగిగా నున్న యూరె దేచమంత్రికి కృతిగా నీయఁబడినట్లు తెలియుచున్నది. గోపమంత్రి శ్రీకృష్ణదేవరాయలమంత్రి యగు సాళువ తిమ్మరుసుమంత్రికి మేనల్లుఁడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ. శ. 1515వ సం. న కొండవీటిదుర్గమును జయించినపిదప, దానిని పాలించుటకు తిమ్మరుసు తన మేనల్లుఁడగు నీ గోపమంత్రిని నియమించెను. ఈ గోపమంత్రి సుప్రసిద్ధుఁడు. ఇతఁడు దేచమంత్రికి క్రీ.శ. 1517వ సం. న ఒక యగ్రహారమును దాన మొనర్చెను. దేచమంత్రి శైవాచారపరాయణుఁడు. ప్రోలనారాధ్యుని వంశస్థుడగు చంద్రశేఖరవాచంయమునియొక్కయు, మహావిద్వాంసుఁడగు <ref>శ్రీశంకరాచార్యకృత సౌందర్యలహరికి వ్యాఖ్య వ్రాసిన విద్వాంసుఁడు</ref>లొల్ల లక్ష్మీధరపండితునియొక్కయు శిష్యుఁడు. లక్ష్మీధరపండితుని యనుగ్రహమున పాండిత్యమును సంపాదించి ఈ దేచమంత్రి 'శివపంచస్తని'కి వ్యాఖ్య రచించెను. ఈ యంశమును {{Telugu poem|type=శ్లో.|lines=<poem>“స చాయం దేవయామాత్యో మహిమస్తవపంచికాం, లక్ష్మీధరకటాక్షేణ కురుతే గురుతేజసా.”</poem>|ref=}} అను శ్లోకము చాటుచున్నది. దేచమంత్రి గోపమంత్రివలన అగ్రహారాదిసమ్మానములను పొంది, ప్రసిద్ధుడైన పిదపనే ఉద్భటారాధ్యచరిత్రమును కృతి నందియుండును. ఆ కాల మించుమించుగా క్రీ.శ. 1535 అని తలఁచవచ్చును. ఉద్భటారాధ్యరచనాకాల మిదియే యై యుండవచ్చును. ఈ మీఁది విషయమునుబట్టి రామకృష్ణకవి శ్రీకృష్ణదేవరాయలకాలమున ఆతనిసభలో నుండె నన్న లోకప్రతీతి యథార్థమే గానీ, కల్పితము కాదని స్పష్టమగుచున్నది. {{right|}}<noinclude><references/></noinclude> i2ejklbl86xx5qyp5hvn7f7rmid6ckk పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/16 104 212453 555140 554671 2026-04-29T00:24:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555140 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పాండురంగమాహాత్మ్యమును కృతిపొందిన విరూరి వేదాద్రిమంత్రి కందాళ అప్పలాచార్యుల శిష్యుఁడు; మంగయగురువరాజు కుమారుఁడగు పెదసంగభూపాలునొద్ద వ్రాయసకాఁడు. చిత్రభారతకృతిపతి తండ్రి పెదతండ్రులును, వైజయంతీవిలాసకర్తయగు సారంగు తమ్మకవియు ఈ కందాళ అప్పలాచార్యులకు శిష్యులు. క్రీ. శ. 154?-పరాభవసంవత్సరమున గండికోటప్రభువు కందాళ అప్పలాచార్యులకు భూదాన మొసఁగిన శాసనమొకటి కలదఁట! రామకృష్ణకవి తన గ్రంథమున 'భట్టరు చిక్కాచార్యులు' తనగురువని చెప్పియున్నాఁడు. ఈ చిక్కాచార్యులకుఁ బెక్కురు శిష్యు లుండిరి. చాతుర్వాటికామాహాత్మ్యము, ఆనందకాననమాహాత్మ్యము మున్నగు గ్రంథములను రచించిన లింగమగుంట రామకవియును [తెనాలి రామకృష్ణుని అల్లుఁడు], అతని తమ్ముఁడగు లింగమగుంట తిమ్మకవియును ఈ చిక్కాచార్యులకు శిష్యులు, రామకృష్ణకవులచే 'కామందకము'ను కృతి గొన్నవాఁడును, కొండ్రాజు తిమ్మరాజు కుమారుడును, పెదసంగభూపాలుని మేనల్లుఁడును అగు వేంకటాద్రియును చిత్రాచార్యుని శిష్యుఁడే. ఈ వేంకటాద్రి క్రీ. శ. 1584 వ సం. న కామందకమును కృతి బొందెను. కాన పాండురంగమాహాత్మ్యరచనము అంతకంటే కొన్నియేండ్లు ముందుగా జరిగియుండవచ్చును. పై యంశములనుబట్టి రామకృష్ణుఁడు శైవుఁడుగా నున్నప్పుడు క్రీ.శ. 1535 ప్రాంతమున ఉద్భటారాధ్యచరిత్రమును రచించి దేచమంత్రికి కృతి యొసఁగెననియు, తర్వాత వైష్ణవుఁడుగా మాఱినపిదప 'ఘటికాచలమాహాత్మ్యము'ను రచించెననియు, ఉద్భటచరిత్రరచన యైన పిదప రమారమి ముప్పదియేండ్లకు - అనఁగా క్రీ.శ. 1565 ప్రాంతమున) పాండురంగమాహాత్మ్యమును రచించెననియు చెప్పవీలగుచున్నది. పాండురంగమాహాత్మ్యమన (పుట 239) 'గిరికానుషక్తబుద్ధి నుపరిచరునింబోలు' (ఆ 4. ప 242) అని వసుచరిత్రవిషయమును, 'గురుభీతమతికి నాముక్తమాల్యదకు నెన యగుచున్' (ఆ 4. ప 241) అని యాముక్తమాల్యదయును సూచింపఁబడినందున, పయి గ్రంథద్వయము రచింపఁబడినపిదపనే యియ్యది వ్రాయఁబడినట్లు వ్యక్తమగుచున్నది. ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయల రచన యగుటచేఁ బ్రాచీనమగుట యుక్తమే. కాని వసుచరిత్ర విషయమునఁ గొంతసందేహము కలుగవచ్చును. కాని అది 1563-70 ప్రాంతమున వెనుగొండను పాలించిన తిరుమలదేవరాయల కంకితమగుటచేత దానిరచన యంతకుఁ బూర్వమే జరిగియుండవలెను. పాండురంగమాహాత్మ్యమును ఇంచుమించుగ నాకాలపుదే యగుట నివి రెండును సమకాలీనములనియు, అట్టియెడ నొకదానిలో నింకొకటి సూచింపఁబడుట దోషము కాదనియు గ్రహింపనగును. ఇంతకును ఉపరిచరవసువు వృత్తాంతము మహాభారతమున నున్నదే కాని క్రొత్తది కాదు. కావున దానినే రామకృష్ణకవి సూచించెననియుఁ జెప్పవచ్చును. {{right|}}<noinclude><references/></noinclude> cdfxuraq6qacswf5k8hq05aolgqmie0 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/17 104 212454 555141 554672 2026-04-29T02:56:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555141 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కాగా రామకృష్ణకవి శ్రీకృష్ణదేవరాయల యాస్థానమున నుండుట యసంభావ్యము కానందునను, వసుచరిత్ర వృత్తాంతప్రశంస యసంగతము కానందునను, ఇతఁడు క్రీ.శ. 16వ శతాబ్ది ప్రారంభమున (1505 ప్రాంతమున) జన్మించి, 1575-80 ప్రాంతమువఱకును జీవించియుండెనని నిశ్చయముగాఁ జెప్పవచ్చును. {{p|al|fwb}}కృతులు — ముద్రితములు, అలబ్ధములు</p> రామకృష్ణుఁడు రచించిన గ్రంథములు మూఁడుమాత్ర మింతవఱకు లభించినవి, ఆ మూఁడును ముద్రితములు. ఉద్భటారాధ్యచరిత్రము ముక్త్యాలలోని సరస్వతీపత్రికలో ప్రకటింపబడి, పిదప ప్రత్యేకగ్రంథరూపమును దాల్చినది. ఘటికాచలమాహాత్మ్యము 1892వ సం. న కళావతీముద్రాక్షరశాలలో ముద్రింపఁబడినది. పాండురంగమాహాత్మ్యము తొలుత శ్రీనివర్తివారిచేతను, శ్రీ వావిళ్లవారిచేతను కొంతభాగము ముద్రింపఁబడి, పిదప శ్రీమాన్ శ్రీ తెన్మఠం శ్రీరంగాచార్యులుగారి లఘుటీకతోఁగూడ పూర్తిగ ముద్రింపబడి, ఇందనుక ఐదుకూర్పులను పొందినది. తెనాలి రామలింగకవికృతులగు కందర్పకేతువిలాసము, హరిలీలావిలాసము అను ప్రబంధములనుండి కొన్ని పద్యములు ప్రబంధరత్నావళియందు ఉద్దరింపఁబడినవి. ఆ గ్రంథములుమాత్ర మింతవఱకును దొఱకలేదు. "పాండురంగవిజయము” అను వేఱొకగ్రంథము నీ కవి రచించినట్లు ప్రతీతి. అది పాండురంగమాహాత్మ్యమే యై యుండునేమో! 'పాండురంగవిజయము'లోనివని ఉదహరింపఁబడిన పద్యములు మాత్రము పాండురంగమాహాత్మ్యమునఁ గానరాకున్నవి. {{p|al|fwb}}రామకృష్ణునిఁ గూర్చిన కథలు</p> తెనాలి రామలింగని కథలని దక్షిణదేశమునందంతటను ప్రసిద్ధములయి కొన్ని కథలు ప్రచారమున నున్నవి. అందుఁ జాలవఱకును శ్రీకృష్ణదేవరాయలకును, అతని యాస్థానవిద్వత్కవులకును సంబంధించి యున్నవి. వీనిని శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగారు తమ 'కవిజీవితముల'లో ఇచ్చియున్నారు. రామకృష్ణకవి రాయలకాలమున లేడని తలఁచిన విమర్శకులు కొంద ఱీ కథలన్నియుఁ బుక్కిటిపురాణములని తలంచిరి. కానీ యీవఱకు నిర్ణయింపఁబడిన కవి కాలమునుబట్టి యీ కవి రాయలసభలో ఉండుటకు ఆక్షేపణ లేదు. కొందఱు పరిశోధకులు, విమర్శకులును ఈ యంశమును గ్రహించి శ్రీ శ్రీరామమూర్తిగారు వ్రాసిన కథలు కొన్ని యథార్థములే యని నమ్ముచున్నారు. అన్నియుఁ గాకున్నను, కొన్నియైనను నమ్మఁదగియే యున్నవని చెప్పక తప్పదు. ఆ కథలు సాధారణముగా భట్టుమూర్తి, అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, ధూర్జటి మున్నగు కవులను వెక్కిరించు గాథలతో నిండియున్నవి. వానికిఁ దగిన చాటువులును కలవు. శ్రీకృష్ణదేవరాయలకాలమునాఁటికి రామకృష్ణకవి యువకుఁడు; స్వభావముచేతనే స్వతంత్రుఁడును, వికటస్వభావము కలవాఁడును అగుటచే ఈతఁడు ఇతరకవులను సమయానుసారముగ అధిక్షేపించుట అసంభవ మెంతమాత్రమును కాదు. {{left|}}<noinclude><references/></noinclude> 12crrg04t29r7kc7uw5zntvobvcp03e పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/18 104 212455 555142 554673 2026-04-29T03:12:44Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555142 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రామకృష్ణుఁడు తనచరమదశలో తరణోపాయముగను, తనకవిత్త్వపరీక్షకు నికషోపలగను ప్రౌఢప్రబంధమగు పాండురంగమాహాత్మ్యమును రచించెను. అందు హాస్యమున కెట్టి యవకాశమును — అందును అట్టి వయసున — లేదు. అట్లయ్యును ఈతఁడు, తన స్వభావమును పూర్తిగ విడువలేక అందందు తన కొంటెతనమును వ్యక్తము చేయుచునే యున్నాఁడు. మచ్చునకు రెండు పద్యము లుదాహరింపఁబడుచున్వి.న అతులనిష్ఠతో తపస్సు చేసిన పుండరీకమహామునికి భగవంతుఁడు ప్రత్యక్షము కాఁగా ముని ఆతనిని పెక్కువిధముల స్తుతించెను. అందు దశావతారస్తుతిలో బౌద్ధావతారవర్ణన మీ క్రిందిరీతి నున్నది — {{Telugu poem|type=చ.|lines=<poem>'ప్రతిదినకేశలుంచనపురాయిడి నెట్టిన బట్ట గట్టి పైఁ బుతపుతమంచునున్న కుఱుబోడతలన్ ధరియింప నోడియున్ సతమగు సొమ్ము గాన విడఁజాలవుగా శిఖిపింఛవల్లి, సౌ గతమతధుర్య! దానిఁ గటిఁ గట్టుము; పుట్టము మిన్న కేటికిన్.'</poem>|ref=}} {{right|[పాండు. ద్వితీయా. 64]}} నెమిలిపించెము శ్రీకృష్ణునకు నీడరాని కేశాలంకారము. బౌద్ధావతారసమయమున బట్టకట్టి నున్ననైన తలపై దానిని ధరింప నెట్లును వీలు లేదు. సతమగు నగను వీడుటకును వలను కాదు. కావున మొలకుఁ గట్టిన బట్టను విప్పి వేసి, ఆ వస్త్రమునకు బదులుగా శిఖిపింఛమును ధరించుట మేలు. అట్లు చేయుటవలన వస్త్రధారణఫలమును సిద్ధించును. మొల కట్టవలసిన బట్ట, తలయే కట్టుటచే (బట్టతల యగుటచే) వేఱే వస్త్రధారణ మనావశ్యక మని భావము. పయివర్ణనమున రామకృష్ణుఁడు తన స్వభావసిద్ధమగు హాస్యమును వెల్లడించెననుట స్పష్టము. ఈ వర్ణనము ప్రత్యక్షమైన భగవంతునిఁ గొనియాడుచు పుండరీకునివంటి ముని చేయుట వికటమేకదా! సహజదుర్బుద్ధియగు నిగమశర్మ తనయక్క చేసిన హితబోధకు లోఁబడి సానుకూలుఁడై మంచిదారిని పడినట్లు నటించియు నొకనాఁటిరాత్రి యందఱును నిద్రింపఁగా వారి నగలను దొంగిలి పరారి యయ్యెను. మఱునాఁటివఱువాత అతనిబంధువులు పోయిన తమ నగలఁ గూర్చి విచారించు సందర్భమున నీ క్రిందిపద్య మున్నది. {{Telugu poem|type=సీ.|lines=<poem>'శోకించు వృద్ధభూసురుఁ డాత్మపితృదత్త దర్భముద్రికకుఁ జిత్తంబు కలఁగ నత్తగారిచ్చిన హరిసుదర్శనపుఁబేరునకు ముత్తయిదువ పనటఁ బొందుఁ గ్రొత్తగాఁ జేయించుకొన్న ముక్కఱకునై యడలు దుర్వారయై యాఁడుబిడ్డ జామాత వెతఁబొందు వ్యామోహియై నవగ్రహకర్ణవేష్టనభ్రంశమునకు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem></poem>|ref=}} నెంత దుర్బుద్ధి! యెత దుర్భ్రాంతి! యహహ!, సర్వధనములు నద్దురాచారశీలుఁ డూచుముట్టుగ నిలుదోఁచి యుఱికిచనుట, యెఱఁగరోకాక, యవ్వేళ యెఱుక గలదె! {{right|[పాండు. తృతీయా. 50]}}<noinclude><references/></noinclude> 1gjnbx0zoc84ypykd94fjyzacoe22wq 555143 555142 2026-04-29T03:13:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 555143 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రామకృష్ణుఁడు తనచరమదశలో తరణోపాయముగను, తనకవిత్త్వపరీక్షకు నికషోపలగను ప్రౌఢప్రబంధమగు పాండురంగమాహాత్మ్యమును రచించెను. అందు హాస్యమున కెట్టి యవకాశమును — అందును అట్టి వయసున — లేదు. అట్లయ్యును ఈతఁడు, తన స్వభావమును పూర్తిగ విడువలేక అందందు తన కొంటెతనమును వ్యక్తము చేయుచునే యున్నాఁడు. మచ్చునకు రెండు పద్యము లుదాహరింపఁబడుచున్వి.న అతులనిష్ఠతో తపస్సు చేసిన పుండరీకమహామునికి భగవంతుఁడు ప్రత్యక్షము కాఁగా ముని ఆతనిని పెక్కువిధముల స్తుతించెను. అందు దశావతారస్తుతిలో బౌద్ధావతారవర్ణన మీ క్రిందిరీతి నున్నది — {{Telugu poem|type=చ.|lines=<poem>'ప్రతిదినకేశలుంచనపురాయిడి నెట్టిన బట్ట గట్టి పైఁ బుతపుతమంచునున్న కుఱుబోడతలన్ ధరియింప నోడియున్ సతమగు సొమ్ము గాన విడఁజాలవుగా శిఖిపింఛవల్లి, సౌ గతమతధుర్య! దానిఁ గటిఁ గట్టుము; పుట్టము మిన్న కేటికిన్.'</poem>|ref=}} {{right|[పాండు. ద్వితీయా. 64]}} నెమిలిపించెము శ్రీకృష్ణునకు నీడరాని కేశాలంకారము. బౌద్ధావతారసమయమున బట్టకట్టి నున్ననైన తలపై దానిని ధరింప నెట్లును వీలు లేదు. సతమగు నగను వీడుటకును వలను కాదు. కావున మొలకుఁ గట్టిన బట్టను విప్పి వేసి, ఆ వస్త్రమునకు బదులుగా శిఖిపింఛమును ధరించుట మేలు. అట్లు చేయుటవలన వస్త్రధారణఫలమును సిద్ధించును. మొల కట్టవలసిన బట్ట, తలయే కట్టుటచే (బట్టతల యగుటచే) వేఱే వస్త్రధారణ మనావశ్యక మని భావము. పయివర్ణనమున రామకృష్ణుఁడు తన స్వభావసిద్ధమగు హాస్యమును వెల్లడించెననుట స్పష్టము. ఈ వర్ణనము ప్రత్యక్షమైన భగవంతునిఁ గొనియాడుచు పుండరీకునివంటి ముని చేయుట వికటమేకదా! సహజదుర్బుద్ధియగు నిగమశర్మ తనయక్క చేసిన హితబోధకు లోఁబడి సానుకూలుఁడై మంచిదారిని పడినట్లు నటించియు నొకనాఁటిరాత్రి యందఱును నిద్రింపఁగా వారి నగలను దొంగిలి పరారి యయ్యెను. మఱునాఁటివఱువాత అతనిబంధువులు పోయిన తమ నగలఁ గూర్చి విచారించు సందర్భమున నీ క్రిందిపద్య మున్నది. {{Telugu poem|type=సీ.|lines=<poem>'శోకించు వృద్ధభూసురుఁ డాత్మపితృదత్త దర్భముద్రికకుఁ జిత్తంబు కలఁగ నత్తగారిచ్చిన హరిసుదర్శనపుఁబేరునకు ముత్తయిదువ పనటఁ బొందుఁ గ్రొత్తగాఁ జేయించుకొన్న ముక్కఱకునై యడలు దుర్వారయై యాఁడుబిడ్డ జామాత వెతఁబొందు వ్యామోహియై నవగ్రహకర్ణవేష్టనభ్రంశమునకు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నెంత దుర్బుద్ధి! యెత దుర్భ్రాంతి! యహహ!, సర్వధనములు నద్దురాచారశీలుఁ డూచుముట్టుగ నిలుదోఁచి యుఱికిచనుట, యెఱఁగరోకాక, యవ్వేళ యెఱుక గలదె!</poem>|ref=}} {{right|[పాండు. తృతీయా. 50]}}<noinclude><references/></noinclude> aq437zbx9gw1iwmo8ihz0gkqv1cqzpd 555144 555143 2026-04-29T03:13:46Z దేవీప్రసాదశాస్త్రి 4290 555144 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రామకృష్ణుఁడు తనచరమదశలో తరణోపాయముగను, తనకవిత్త్వపరీక్షకు నికషోపలగను ప్రౌఢప్రబంధమగు పాండురంగమాహాత్మ్యమును రచించెను. అందు హాస్యమున కెట్టి యవకాశమును — అందును అట్టి వయసున — లేదు. అట్లయ్యును ఈతఁడు, తన స్వభావమును పూర్తిగ విడువలేక అందందు తన కొంటెతనమును వ్యక్తము చేయుచునే యున్నాఁడు. మచ్చునకు రెండు పద్యము లుదాహరింపఁబడుచున్నవి. అతులనిష్ఠతో తపస్సు చేసిన పుండరీకమహామునికి భగవంతుఁడు ప్రత్యక్షము కాఁగా ముని ఆతనిని పెక్కువిధముల స్తుతించెను. అందు దశావతారస్తుతిలో బౌద్ధావతారవర్ణన మీ క్రిందిరీతి నున్నది — {{Telugu poem|type=చ.|lines=<poem>'ప్రతిదినకేశలుంచనపురాయిడి నెట్టిన బట్ట గట్టి పైఁ బుతపుతమంచునున్న కుఱుబోడతలన్ ధరియింప నోడియున్ సతమగు సొమ్ము గాన విడఁజాలవుగా శిఖిపింఛవల్లి, సౌ గతమతధుర్య! దానిఁ గటిఁ గట్టుము; పుట్టము మిన్న కేటికిన్.'</poem>|ref=}} {{right|[పాండు. ద్వితీయా. 64]}} నెమిలిపించెము శ్రీకృష్ణునకు నీడరాని కేశాలంకారము. బౌద్ధావతారసమయమున బట్టకట్టి నున్ననైన తలపై దానిని ధరింప నెట్లును వీలు లేదు. సతమగు నగను వీడుటకును వలను కాదు. కావున మొలకుఁ గట్టిన బట్టను విప్పి వేసి, ఆ వస్త్రమునకు బదులుగా శిఖిపింఛమును ధరించుట మేలు. అట్లు చేయుటవలన వస్త్రధారణఫలమును సిద్ధించును. మొల కట్టవలసిన బట్ట, తలయే కట్టుటచే (బట్టతల యగుటచే) వేఱే వస్త్రధారణ మనావశ్యక మని భావము. పయివర్ణనమున రామకృష్ణుఁడు తన స్వభావసిద్ధమగు హాస్యమును వెల్లడించెననుట స్పష్టము. ఈ వర్ణనము ప్రత్యక్షమైన భగవంతునిఁ గొనియాడుచు పుండరీకునివంటి ముని చేయుట వికటమేకదా! సహజదుర్బుద్ధియగు నిగమశర్మ తనయక్క చేసిన హితబోధకు లోఁబడి సానుకూలుఁడై మంచిదారిని పడినట్లు నటించియు నొకనాఁటిరాత్రి యందఱును నిద్రింపఁగా వారి నగలను దొంగిలి పరారి యయ్యెను. మఱునాఁటివఱువాత అతనిబంధువులు పోయిన తమ నగలఁ గూర్చి విచారించు సందర్భమున నీ క్రిందిపద్య మున్నది. {{Telugu poem|type=సీ.|lines=<poem>'శోకించు వృద్ధభూసురుఁ డాత్మపితృదత్త దర్భముద్రికకుఁ జిత్తంబు కలఁగ నత్తగారిచ్చిన హరిసుదర్శనపుఁబేరునకు ముత్తయిదువ పనటఁ బొందుఁ గ్రొత్తగాఁ జేయించుకొన్న ముక్కఱకునై యడలు దుర్వారయై యాఁడుబిడ్డ జామాత వెతఁబొందు వ్యామోహియై నవగ్రహకర్ణవేష్టనభ్రంశమునకు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నెంత దుర్బుద్ధి! యెత దుర్భ్రాంతి! యహహ!, సర్వధనములు నద్దురాచారశీలుఁ డూచుముట్టుగ నిలుదోఁచి యుఱికిచనుట, యెఱఁగరోకాక, యవ్వేళ యెఱుక గలదె!</poem>|ref=}} {{right|[పాండు. తృతీయా. 50]}}<noinclude><references/></noinclude> cqv926wxxb9wljs4x6x55uefdxhaccf పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/19 104 212456 555145 554674 2026-04-29T03:27:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555145 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చెడుతిరుగుడులు తిరుగుచు, సర్వనాశన మొనర్చుచున్న నిగమశర్మను దారికిఁ దెచ్చుటకై ఆతనియక్క ఐదారుకోసుల దూరమున నున్న తమయూరినుండి కాఁపుర మెత్తిపెట్టి పుట్టినింటికి భర్తతోను, బిడ్డలతోను వచ్చినది; నిగమశర్మకు నయమునను, భయమునను హితబోధ చేసి అతనిని మంచిదారికి త్రిప్పినది. అతఁడును వెనుకటిరీతి మర్యాదగా ప్రవర్తింపసాగెను. ఇట్టి మార్పునకుఁ గారణము ఆమెయే, తన బుద్ధిచాతుర్యమున కామె గర్వింపవలసినది; అందఱిచేతను పొగడికలను పొందవలసినది. ఇట్టియెడ నిగమశర్మ యొకయర్దమరేయి అందఱినగలను ఊచముట్టుగ దోఁచుకొనిపోయినపుడు బందుగు లందఱును తమతమ యాభరణములకై విలపించుచుండఁగా ఈమెయు తన ప్రయత్నము వమ్మగుటకుఁ గాక, నగకొఱకు విలపించుటయు, అందును అత్యల్పమూల్యమగు ముక్కఱకు వాపోవుటయు, అందఱును సామాన్యముగ విలపించుచుండఁగా ఈమె దుర్వారయై యడలుటయు రామకృష్ణకవి వికటతను విశదము చేయుచున్నవి. {{p|al|fwb}}గ్రంథనామము</p> పాండురంగక్షేత్రమాహాత్మ్యమును ప్రతిపాదించు నీ ప్రబంధమునకు 'పాండురంగమాహాత్మ్యము' అను పేరున్నట్లు ఆశ్వాసాంత గద్యములను బట్టి తెలియుచున్నది. దీనికి 'పౌండరీకమాహాత్మ్యము' అను నామాంతరమున్నట్లు 'అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన పౌండరీకమాహాత్మ్యంబునకు' అను గ్రంథారంభగద్యవలన తెలియుచున్నది. దైవమును బట్టి పాండురంగమాహాత్మ్యమనియు, భక్తుఁడగు పుండరీకుని కారణమున పౌండరీకమాహాత్మ్యమనియు దీనికి పేళ్లు గలిగినవి. కాని పాండురంగమాహాత్మ్యమను పేరే ఆంధ్రలోకమున ప్రసిద్ధమై యున్నది. {{p|al|fwb}}మూలము</p> కృతిపతి యగు వేదాద్రిమంత్రి రామకృష్ణునితోఁ బల్కిన {{Telugu poem|type=ఉ.|lines=<poem>“స్కందపురాణనీరనిధి కౌస్తుభమై ప్రభవించు దేవకీ నందను సత్కథోద్యమము నవ్యకవిత్వకళాకలాపమన్ గుందనముం ఘటించి కడుఁగ్రొత్తగు సొమ్మొనరించి, విష్ణుసే వం దులకించు నప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా!”</poem>|ref=}} {{right|[పాండు. 1-26]}} అను పద్యమునుబట్టి యీ ప్రబంధమునకు స్కందపురాణమునందలి కథ మూలమని తెలియుచున్నది. 'పాండురంగమాహాత్మ్య'మను నొకక్షేత్రమాహాత్మ్యము గీర్వాణభాషలో గూర్పఁబడినది కలదు. అది తొమ్మిది యధ్యాయముల చిన్నగ్రంథము. స్కాందపురాణాంతర్గతమఁట! దాని మాతృక పూనాలోని భండార్కర్ పరిశోధనాలయమునఁ గలదు. దాని ప్రతియొకటి కాకినాడలోని 'ఆంధ్రసాహిత్యపరిషత్తు'లోఁ గలదు. గ్రంథములోని విషయమునుబట్టి చూడ, అయ్యది రామకృష్ణకవి యాంధ్రప్రబంధము<noinclude><references/></noinclude> 68qqdi50spxwobpkxm4ooletp2g3zm2 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/20 104 212457 555146 554675 2026-04-29T03:46:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555146 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ననుసరించి వ్రాయఁబడినట్లు తోఁచుచున్నది. అయ్యదియే మూలమని ప్రచారము చేసి, తన్మూలమున 'రామకృష్ణునిప్రతిభను, శక్తిని కొంచెపఱచుట కెవ్వరో యిట్లు మూలమును కల్పించి, అయ్యది ప్రచారము పొందునట్లు చేసి యుండవలెను. తెలుఁగునకు సంస్కృతమూలము కల్పింపఁబడుట శ్రీ కాళహస్తిమాహాత్మ్యమునెడను కాననగును. ఆ మూలగ్రంథముయొక్క యాద్యంతభాగము లివి — {{Telugu poem|type=|lines=<poem>'''ప్రారంభము''' — “పాండురంగమాహాత్మ్యమ్</poem>|ref=}} స్కంద ఉవాచ — {{Telugu poem|type=శ్లో.|lines=<poem>మాహాత్మ్యం కథితం సమ్యగ్దీ నానా ముత్తమోత్తమం, గంగాదీనాం మునిశ్రేష్ఠాః కిమన్యచ్ఛ్రోతు మిచ్చధ</poem>|ref=}} మునయ ఊచుః — {{Telugu poem|type=శ్లో.|lines=<poem>సర్వోత్తమం యది క్షేత్రం తీర్థం చైకత్ర విద్యతే, ఉత్కృష్టం దైవతం చాపి తన్నో పద మహామునే!</poem>|ref=}} సూత ఉవాచ — {{Telugu poem|type=శ్లో.|lines=<poem>అగస్త్యాదిమహర్షీణాం వచఃశ్రుత్వాథ షణ్ముఖః, ధ్వాత్వా తాదృగ్విధం క్షేత్రం తీర్థం దైవం న దృష్టవాన్.</poem>|ref=}} స్కంద ఉవాచ — {{Telugu poem|type=శ్లో.|lines=<poem>నాహం తథావిధం క్షేత్రం తీర్థం దైవతమేవ చ, ధ్యాయన్పస్యామి మునయ స్సర్వోత్కృష్టం సుదుర్లభమ్. తదాగచ్ఛత గచ్ఛామో గిరిజావల్లభం భవమ్, ద్రష్టుమేతం మహాపద్మం కైలాసనిలయం పృథక్. ఆశ్చర్యం ను మమాప్యత్ర ప్రశ్నార్థాధిగమే మహాన్, జాయతే మునిశార్దూలాః స హి నో పక్ష్యతే శివః.</poem>|ref=}} {{Telugu poem|type=|lines=<poem>'''గ్రంథాంతము''' —</poem>|ref=}} {{Center|నవమోధ్యాయః}} ఈశ్వర ఉవాచ — {{Telugu poem|type=శ్లో.|lines=<poem>న చచార మహావిష్ణోర్మందిరోపరి గంధధీః, తం దృష్ట్వా క్షేత్రపాలో౽ సౌచుకోప చ ననాద చ. ఉత్థపాత మహావేగాత్ స్తేనపత్ ఖచరః స్వయమ్, ఆరురోహ్య(?) విమానంతు బభంజ నిపపాతనః. తం గృహీత్వా మహాసత్త్వో నిపాత్య ధరణీతలే, విచకర్ష మహాబాహుః సర్పరాజం యథా ఖగః. మరణాభిముఖం దృష్ట్వా భైరవేణార్దితం ప్రభుః, విద్యాధరం దేవయోనిం మహావిష్ణుర్భవా......</poem>|ref=}} {{Center|<poem>ఇతి శ్రీ స్కందపురాణే ఉమామహేశ్వరసంవాదే ఉత్తరసంహితాయాం పాండురంగమాహాత్మ్యే నవమో౽ధ్యాయః. పాండురంగమాహాత్మ్యం సంపూర్ణమ్.</poem>}} </div><noinclude><references/></noinclude> ij65q1196a9s6z03lr2ez2peel6v0oz పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/21 104 212458 555148 554676 2026-04-29T04:41:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555148 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఆంధ్రపాండురంగమాహాత్మ్యమునఁ గల నిగమశర్మోపాఖ్యానము, రాధికావృత్తాంతము, సుశీల మున్నగువారి కథలు, సుశర్మోపాఖ్యానము, ఆయుత నియుతుల వృత్తాంతములును సంస్కృతమున లేవు; మిగిలిన వృత్తాంతములు సంగ్రహముగఁ జూపఁబడినవి. ఆంధ్రప్రబంధమునఁ గల పదములు సంస్కృతమూలమునఁ గానవచ్చుచున్నవి. కాని దానింబట్టి సంస్కృతమూలమున కిది యనువాదమనుట యుక్తిదూరము. ఆంధ్రమునందు 'తద్ఘోరతా, దనవేగంబున భగ్నమయ్యెఁ గటివేల్లత్ క్షుల్లకాశిక్యమున్.' (పుట 351) అని యుండఁగా — దానిని సరిగా అర్థము చేసికొనక మూలమున 'క్షులుకానాం చ శిక్యం చ భగ్నమద్యాపిదృశ్యతే' అని కూర్పఁబడినది. ఇట్టివి చాల కలవు. విస్తరభీతి నవి విడువఁబడినవి. {{p|al|fwb}}కథాసారము</p> {{p|ac|fwb}}ప్రథమాశ్వాసము</p> శౌనకాది మహామునులు సూతుం జూచి క్షేత్ర - దైవత - తీర్థములు మూఁడును సమప్రధానములై యుండు స్థలముం గూర్చి తెల్పుమని కోరఁగా నతఁ డిట్లు వచించెను. 'తొల్లి యగస్త్యమహాముని లోపాముద్రతోఁ గూడ క్షేత్రరాజమగువారాణసియందు వసించుచుండ సూర్యచంద్రాదుల గమనమును నిరోధించుచుందుడు వింధ్యపర్వతము గర్వము నణంపవలెనని దేవత లా మహామునిని ప్రార్థించిరి. అగస్త్యుఁడు వారి ప్రార్థనము నంగీకరించి శిష్యులు వెంట రా బయలుదేరి వెళ్లి వింధ్యపర్వతము గర్వము నణఁచి దక్షిణముగాఁ బోయి కొల్లాపురిలోని మహాలక్ష్మిని సేవించెను. పిదప నా దేవియానతి ననుసరించి తుంగభద్రను దాఁటి స్వామిమలకుఁ బోయి కుమారస్వామిని సేవించెను. అతనిం గొనియాడి, యా గుహునివలన సమస్తక్షేత్రమాహాత్మ్యములను తెలిసికొని యగస్త్యుఁ డిట్లనెను 'స్వామీ! మీదయవలన పుణ్యస్థలమాహాత్మ్యముల నన్నింటిని దెలిసికొంటిని. తీర్థ - దైవత - క్షేత్రములు మూఁడును మేళవించి యున్నచో టేదైనఁ గలదా? దాన్ని గూర్చి తెల్పుఁడు,' అని యడుగఁగా కుమారస్వామి సుదీర్ఘముగ నాలోచించియు నట్టిస్థలమును కానలేక 'మహామునీ! నీ వడిగిన యర్థము నాకు గోచరము కాలేదు. మన యీ సందేహమును దీర్ప పరమేశ్వరుఁడే సమర్థుఁడు; మనము కైలాసమున కేఁగి యాతనిని దర్శించి మన సందియముఁ బాపికొంద' మని పల్కి మునిగణముతోను, పరివారముతోను బయలుదేరి కైలాసనగమున కరిగెను. అంతకు ముందుఁ బార్వతియు శివు నిదే ప్రశ్న యడుగఁగా నతఁ డట్టి స్థలము గూర్చి తెలుప సిద్ధముగా నున్నందున మునులతోఁ గూడ వచ్చిన కుమారునకును బార్వతితోపాటు క్షేత్ర - దైవత - తీర్థములు కలిసియుండు స్థలమును దెలుప నెంచి, తొట్టతొలుత వెన్నునిఁ దన మనస్సులో ధ్యానించి యిట్లు చెప్ప మొదలిడెను.<noinclude><references/></noinclude> 8z42l2lk3urfmd44n9ra4ld7y3osjq7 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/22 104 212459 555149 554677 2026-04-29T05:03:46Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555149 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}ద్వితీయాశ్వాసము</p> ఘర్మవీరానది నదిలోఁ గలిసినచోట దక్షిణతీరమునఁ గల తీర్థ, క్షేత్రములు పౌండరీకములని ప్రసిద్ధములు కలవు. అచట దేవదేవుఁడగు లక్ష్మీవల్లభుఁడు పాండురంగనామమునఁ బ్రసిద్ధుఁడై యుండును. అయ్యదియే మీ రభిలషించిన యుత్తమస్థలము. ఆదికల్పమునందలి పదునెనిమిదవ ద్వాపరము కడపట పుండరీకుఁడను ముని యచ్చోట ఘోరతపం బొనరింప శ్రీకృష్ణుఁడు ప్రత్యక్షమై కావలసిన వరమడుగఁగోరెను. పుండరీకుఁ డా దేవుని, ఆ లలితరూపముతో నచటనే యుండునట్లును, అచటి తీర్థక్షేత్రములు తనపేరిట పౌండరీకములయి యుండునట్లును వరము ప్రార్థించెను. శ్రీకృష్ణుఁ డట్లే యగుఁగాక యని వర మొసఁగెను. ఆక్షేత్రమును గూర్చి మఱియు నిట్లు శివుఁడు వివరించి పలికెను — ఆక్షేత్రము లోకోత్తరమైనది. దానికి నాలుగు లోవాకిళ్లు గలవు. తూర్పువాకిట సరస్వతియు, దక్షిణద్వారమున నారదుఁడును గలరు. దక్షిణదిశ నైదుకోట్లనాగకన్యక లారతు లిచ్చుచునుందురు. పడమటివాకిట భువనేశ్వరీదేవియు, నుత్తరద్వారమున దుర్గాదేవియు నున్నారు. ఇట్టి క్షేత్రము క్షేత్రాంతరములకంటె నుత్తమోత్తమము. తొల్లి త్రిదంష్ట్రుఁడను రాక్షసుఁడు కోపముతో గద నెత్తి పాండురంగని యెడమప్రక్కపై వ్రేయఁగా ఆ దేవుఁడు దానిని తూలించి, యా రాక్షసునిఁ జంపెను. ఆ గదావేగమునకు పాండురంగనిమొల నున్న జాలెసంచి తెగిపోయి యిప్పటికి నచ్చటనే పడి యున్నది. ఆక్షేత్రమునకుఁ బడమట పద్మతీర్థమును, శంఖ - పద్మనిధులును గలవు. అచటనే పిప్పలాకారమున నరనారాయణు లున్నారు. పాండురంగని కీశాన్యదిశను కుండలతీర్థము కలదు. అచట అశ్వత్థరూపమున నరసింహుఁ డున్నాఁడు. గోపిక యొకర్తె యచట శ్రీకృష్ణునిఁగూర్చి తపస్సు చేయఁగా నా దేవుఁడు ప్రత్యక్షమయ్యెను. అప్పటి తత్తరపాటులో నామె కేశబంధము వీడెను; నీవి కొంత జాఱెను. ఆమె శ్రీకృష్ణునియడుగులను గట్టిగాఁ బట్టుకొని ఆవిధముగానే అచట నుండునట్లు వర మడుగఁగా అతఁ డట్లే వర మొసఁగెను. ఆ స్థలమే ముక్తకేశినీక్షేత్రము. ఆ దిక్కుననుండియే భైమీనది పొంగి పొరలుచు క్షేత్రముపైకి వచ్చుచుండఁగా, పాండురంగఁడు తన పాదములపైనుండి ప్రవహించున ట్లాజ్ఞాపించెను. అదియే బైమీతీర్థమని ప్రసిద్ధమై యున్నది.<noinclude><references/></noinclude> rj90os3qy6atsfq0evuparll0si4u7u 555150 555149 2026-04-29T05:04:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 555150 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}ద్వితీయాశ్వాసము</p> ఘర్మవీరానది నదిలోఁ గలిసినచోట దక్షిణతీరమునఁ గల తీర్థ, క్షేత్రములు పౌండరీకములని ప్రసిద్ధములు కలవు. అచట దేవదేవుఁడగు లక్ష్మీవల్లభుఁడు పాండురంగనామమునఁ బ్రసిద్ధుఁడై యుండును. అయ్యదియే మీ రభిలషించిన యుత్తమస్థలము. ఆదికల్పమునందలి పదునెనిమిదవద్వాపరము కడపట పుండరీకుఁడను ముని యచ్చోట ఘోరతపం బొనరింప శ్రీకృష్ణుఁడు ప్రత్యక్షమై కావలసిన వరమడుగఁగోరెను. పుండరీకుఁ డా దేవుని, ఆ లలితరూపముతో నచటనే యుండునట్లును, అచటి తీర్థక్షేత్రములు తనపేరిట పౌండరీకములయి యుండునట్లును వరము ప్రార్థించెను. శ్రీకృష్ణుఁ డట్లే యగుఁగాక యని వర మొసఁగెను. ఆక్షేత్రమును గూర్చి మఱియు నిట్లు శివుఁడు వివరించి పలికెను — ఆక్షేత్రము లోకోత్తరమైనది. దానికి నాలుగు లోవాకిళ్లు గలవు. తూర్పువాకిట సరస్వతియు, దక్షిణద్వారమున నారదుఁడును గలరు. దక్షిణదిశ నైదుకోట్లనాగకన్యక లారతు లిచ్చుచునుందురు. పడమటివాకిట భువనేశ్వరీదేవియు, నుత్తరద్వారమున దుర్గాదేవియు నున్నారు. ఇట్టి క్షేత్రము క్షేత్రాంతరములకంటె నుత్తమోత్తమము. తొల్లి త్రిదంష్ట్రుఁడను రాక్షసుఁడు కోపముతో గద నెత్తి పాండురంగని యెడమప్రక్కపై వ్రేయఁగా ఆ దేవుఁడు దానిని తూలించి, యా రాక్షసునిఁ జంపెను. ఆ గదావేగమునకు పాండురంగనిమొల నున్న జాలెసంచి తెగిపోయి యిప్పటికి నచ్చటనే పడి యున్నది. ఆక్షేత్రమునకుఁ బడమట పద్మతీర్థమును, శంఖ - పద్మనిధులును గలవు. అచటనే పిప్పలాకారమున నరనారాయణు లున్నారు. పాండురంగని కీశాన్యదిశను కుండలతీర్థము కలదు. అచట అశ్వత్థరూపమున నరసింహుఁ డున్నాఁడు. గోపిక యొకర్తె యచట శ్రీకృష్ణునిఁగూర్చి తపస్సు చేయఁగా నా దేవుఁడు ప్రత్యక్షమయ్యెను. అప్పటి తత్తరపాటులో నామె కేశబంధము వీడెను; నీవి కొంత జాఱెను. ఆమె శ్రీకృష్ణునియడుగులను గట్టిగాఁ బట్టుకొని ఆవిధముగానే అచట నుండునట్లు వర మడుగఁగా అతఁ డట్లే వర మొసఁగెను. ఆ స్థలమే ముక్తకేశినీక్షేత్రము. ఆ దిక్కుననుండియే భైమీనది పొంగి పొరలుచు క్షేత్రముపైకి వచ్చుచుండఁగా, పాండురంగఁడు తన పాదములపైనుండి ప్రవహించున ట్లాజ్ఞాపించెను. అదియే బైమీతీర్థమని ప్రసిద్ధమై యున్నది.<noinclude><references/></noinclude> e3sl88ap8n7bnt272zwbvfngydzz4i4 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/23 104 212460 555152 554678 2026-04-29T07:11:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555152 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} నరసింహుం డచట ముప్పదిరెండుబాహువులతో నున్నాఁడు. అగస్త్య గాణాపత్యము లను తీర్థములు నచటనే గలవు. గాణాపత్యతీర్థమునకుఁ దూర్పున సంకర్షణతీర్ధమును, దానికిఁ దూర్పున జాబాలితీర్థమును, దాని తరువాత బ్రహ్మతీర్థమును గలవు. బ్రహ్మతీర్థముకడ బ్రహ్మయు, సరస్వతియు వసింతురు. వారికి దక్షిణమున కలశీతీర్థమును, దానికి దక్షిణమున పితృతీర్థమును, దానికి దక్షిణముగా చక్రతీర్థమును, దానికి దక్షిణమున లక్ష్మీతీర్థమును, దానికి దక్షిణమున కౌమోదకీ, పద్మ, శంఖ, చక్రతీర్థములును గలవు. లక్ష్మీతీర్థాదు లయిదును శక్తిపంచక మనఁబడుచున్నవి. విష్ణువు సంగముఁడను రాక్షసుని చంపినచోట సంగతీర్థము కలదు. అచట పుష్పావతి యను నది సంగమించును. దానికిఁ బిదప రామ, దేవ - సూర్య - సరస్వతీ తీర్థములు కలవు.' పరమశివుఁ డీ రీతిని మునులకును, గుమారునికి, సుమకును దెల్పెనని సూతుఁడు శౌనకాదుల కెఱిఁగించెను. వారి క్షేత్రతీర్థాది మాహాత్మ్యములను విని మిగుల సంతసించిరి. పిదప శౌనకుఁడు సూతుం జూచి 'మహాత్మా! విష్ణు వేల యదుకులమున నందునిపట్టియై పుట్టెను? అతని చరిత్ర మెట్టిది? రాధ యెవ్వతె! రాధాకృష్ణులసంబంధ మెట్టిది? శివునిదేహమునుండి భైమి యెట్లొదవెను? విష్ణుని మంత్రరహస్య మెయ్యది? ఈ యంశములన్నియు మాకు వినిపింపవలయునని ప్రార్థింపఁగా సూతుఁ డిట్లనెను — 'తొల్లి శంకరుఁడు నారదునకు పుండరీకముని చరిత్రమును వివరముగాఁ దెల్పెను. దానిని మీకు వినిపింతును. అది వినిన మీ సందేహము లెల్లను తీరును.' సూతుఁ డిట్లు పలుకుచు మున్ను తాను వేదవ్యాసునివలన వినినదాని నిట్లు చెప్పసాగెను. 'ఇదివఱకుఁ జెప్పినట్లు కుమారుఁడు మునులతోఁగూడఁ దన సందేహములను తీర్చుకొని పోవుచుండఁగా, శివునివద్దకు వచ్చుచున్న నారదుఁడు వారిని జూచి తనలో 'కుమారుఁడును, మునులును పరమశివునియొద్ద కిప్పు డే కారణమున వచ్చిరో? ఏదే నొక గొప్ప సందియముఁ దీర్చుకొన వచ్చి, తమపని నెఱవేర్చుకొని మఱలుచుండవచ్చును” అని యనుకొని వేవేగ శివుని దర్శించి, యతనిఁ బలుతెఱంగులఁ గొనియాడి యిట్లు ప్రార్థించెను — 'దేవా! కుమారాదు లిటనుండి పోవుచుండుట చూచితిని, వారు మి మ్మేమి ప్రార్థించిరి? మీ రేమి సమాధాన మిచ్చితిరి? ఆ యంశమును నాకు వివరముగాఁ దెల్ప వేడుకొనుచున్నాను.' అప్పుడు శివుడు పార్వతియుఁ, గుమారుఁడును, మునులును కోరిన యర్థమును దెల్పఁగా నారదుఁడు తనకు నట్టి నుత్తమోత్తమస్థలమును దెలిసికొను కోరిక కలదు; కాన వివరింపఁ గరఁగా శివుఁ డాతనికి పాండురంగక్షేత్రవృత్తాంతమును దెల్ప మొదలిడి యచటి నరసింహక్షేత్రము గొప్పతనముం దెల్పుచు తదనుబంధముగ నొకయితిహాసము నిట్లని చెప్పఁదొడఁగెను.<noinclude><references/></noinclude> fnv8874kmt32ba1dlzia1wksnrvo39v పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/24 104 212461 555153 554679 2026-04-29T07:20:05Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555153 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}తృతీయాశ్వాసము</p> కళింగదేశమునందలి పీఠికాపురమున వేదవేదాంగవేత్తయు, నుత్తమశీలుఁడును అగు సభాపతియను బ్రాహ్మణోత్తముఁ డుండెను. నిగమశర్మ అతని పుత్రుఁడు. నిగమశర్మ చిన్నవయస్సుననే సమస్తవిద్యలను నేర్చి విద్వాంసుఁడైనను, పోకిరియయి తిరుగుచు, ఇంటఁగల వస్తువుల నన్నింటిని విక్రయించుచు, భూములను గుదువబెట్టుచు సంపదను నాశనము చేయుచుండెను. ఇంటిగడప త్రొక్కుటయే యరుదుగ నుండెను. వానికి బుద్ధి చెప్పి, దారికిఁ దీసికొని రాఁదలఁచి యతనియక్క భర్తతోను, బిడ్డలతోను తన పుట్టినింటికి వచ్చి, చుక్క తెగిపడినవడువున నొకప్పు డింటికి వచ్చిన తమ్ముని మంచిమాట లాడి, నిలిపి, సమస్తోపచారములు నొనర్చి హితము నుపదేశించెను. నిగమశర్మయను ఆమెహితమును విన్న వానివలె నటించి కొలఁదిదినములు వినయ, విధేయతలతో మెలఁగుచు నొకనాఁటిరాత్రి అందఱును నిదురించుచుండఁగా వారి ఆభరణముల నన్నింటిని అపహరించి యడవిదారిని పోవుచుండెను. అడవిలో నొకదొంగలగుంపు నిగమశర్మ నడ్డగించి, అతనిని చావఁగొట్టి యతనికడనున్న యాభరణముల నన్నింటిని తీసికొనెను. కదలలేక మెదలలేక పడియున్న నిగమశర్మ నొకకాఁపు తనయింటికిఁ దీసికొనిపోయి తగిన చికిత్స చేయించి, గాయములు మాన్పి కాపాడెను. ఆ యింటఁగల అందకత్తెయగు నొకకాఁపుపడతి నిగమశర్మను మరులుకొని, అతనిని మరులుకొలిపెను; అతఁడు ధర్మమును దలఁపక రహస్యముగ నామెతోఁ గ్రీడించుచుండెను. ఇట్లు కొన్నిరోజులు చన నాతఁ డాపడఁతిని లేవఁదీసికొని యెటకేని పోవఁ దగినయదను నరయుచుండెను. ఒకప్పు డాయూర జరిగిన జాతరలోఁ బాల్గొని నడురేయి నందఱును గాఢనిద్రలో మున్గి యుండఁగా నిగమశర్మయు, నతని ప్రియురాలగు నా కాఁపుపడఁతియు నిలు వీడిపోయిరి, వా రొకయడవికిఁ బోయి, అచ్చటి బోయజాతిలోఁ గలిసిపోయిరి. నిగమశర్మ కిరాతుడయి వేఁటాడి యాహారము సంపాదించుచుండెను. వారిరువురును అచటఁ గొంతకాలము గడపిన పిదప నాకాఁపుపడఁతి మరణించెను. పిదప నిగమశర్మ యొకచండాలవనితం గూడి యామెవలన సంతానముంగూడఁ బడసెను. ఒకనాఁ డతఁడు వేఁటకుఁబోయి యుండఁగా అతని గుడిసె కాలిపోయెను. అందుండిన యతని భార్యాపుత్రులు మరణించిరి. అతఁ డది గాంచి, మిగుల వాపోయి, మతి చెడి, యాహారనిద్రల నుజ్జగించి దేశములఁ గ్రుమ్మరుచుఁ దుదకు శ్రీనరసింహుఁ డున్నక్షేత్రముం బ్రవేశించి ప్రాణములు విడిచెను. యదుదూత లతనిని కట్టి, కొట్టుచు ఘోరముగఁ బాధించుచుఁ దమలోకమునకుఁ దీసికొని పోవుచుండఁగా వారు పెట్టుబాధలకుఁ దాళఁజాలక నిగమశర్మ గట్టిగా నటిచెను. అంతకు మున్ను విష్ణువుచే రక్షార్థ మచట నుంచఁబడిన చక్రము అతని మొఱ విని తొందరగా వచ్చి యమదూతలను దఱిమి, నిగమశర్మ బంధములను త్రెంచెను. అంత విష్ణుదూతలు వచ్చి నిగమశర్మను సగౌరవముగ శ్వేతద్వీపమునందలి పరమపదమునకుఁ దీసికొనిపోయిరి. అతఁడు వైకుంఠమున కుముదుఁ<noinclude><references/></noinclude> h8feverob7tc67bql2x3s8g9dozelmt పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/25 104 212462 555155 554680 2026-04-29T08:12:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555155 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>డను పరమభాగవతుఁడయి యున్నాఁడు. అతఁడు పాతకి యయ్యును నరసింహక్షేత్రమున మరణించుటచే నట్టి యుత్తమోత్తమపదవిని పొందెను. ఆ క్షేత్రమునకు దక్షిణభాగమున నేను నివసింతును. ఎట్టి మహాపాతకము లొనరించినవారైనను సరే, అచ్చట మరణించినచో ఇంద్రపదవిని పొందుదురు. శివుఁ డిట్లు తెల్పఁగా విని సంతసించి నారదుఁడు తీర్థ - క్షేత్ర - దైవతములను గూర్చి తెలుపఁగోరఁగా నిట్లు తెల్పెను — 'నృసింహక్షేత్రము నెదుట చంద్రభాగానది కలదు. ఇంద్రుఁడు మున్నచట తపం బొనరించి యింద్రభోగముల ననుభవించెను. ఆనృసింహక్షేత్రము చేరువనే పౌండరీకక్షేత్ర మున్నది. దాని మాహాత్మ్య మిట్టిది, అట్టిదని వర్ణింపనలవి కాదు. దానికిఁ దూర్పుభాగమున సరస్వతియుఁ, బడమట భువనేశ్వరియుఁ జివఱిభాగములు కాఁగా ఆ క్షేత్రమను ధనుస్సును చేతధరించి శార్{{ZWNJ}}ఙ్గపాణియగు విష్ణువు తీర్థము లను బాణములను దొడిగి పాపములను లక్ష్యములను బడఁగొట్టి భక్తులఁ గాపాడుచుండును. ఆ క్షేత్రమునడుమ పాండురంగఁడనుపేర శ్రీకృష్ణుఁడు వెలసియుండును.' శివుఁ డిట్లు పలుకఁగా నారదుఁడు 'నిఖిలజగద్భరితుండగు విష్ణువు ఆ స్థలమున వెలయుటకుఁ గారణ మే'మని ప్రశ్నింపఁగా పరమేశ్వరుఁ డిట్లు చెప్పఁదొడంగెను. 'పూర్వము పుండరీకుఁడను మహాముని యచ్చోట ఘోరమగు తపస్సు చేయుచుండఁగా, దానివలనఁ గల్గిన తాపమునకు లోకము లట్టుడికిన ట్లుడికిపోవుచుండ బ్రహ్మ యా సంగతిని విన్నవింప విష్ణువుదరి కేఁగెను. ఆ సమయమునందే దుష్టజనులను మోయఁజాలని భూదేవి తనస్థితిని వెన్నునకు విన్నవించుటకు క్షీరాబ్ధిమధ్యమునందలి శ్వేతద్వీపములోని వైకుంఠమున కేఁగి యచట దేవదేవుని దర్శించి, స్తుతించి తనగోడు వెళ్లఁగ్రక్కెను. విష్ణు వామెసంగతిని విని తాను మాయామానుషమూర్తి యై భూలోకమున నవతరించి, రాక్షసప్రాయులగు రాజులను సంహరించి, భూభారము మాన్చెదనని భూదేవి కభయమిచ్చి, పుండరీకునికిఁ బ్రత్యక్షమయి వర మొసంగి యాతనితపస్సును మాన్పెదనని బ్రహ్మకును వాగ్దానము చేసి పంపివేసెను. పిదప శ్రీహరి యాదవకులమున దేవకీవసుదేవుల తపఃఫలముగఁ గృష్ణుఁడయి పుట్టి ఘోరరాక్షసులను, దుష్టనృపాలురను పెక్కురను సంహరించి బాల్యమాది అనేకాద్భుతకృత్యముల నొనర్చుచుండెను. ఆ రీతి నవతరించిన శ్రీకృష్ణుని సంతోషమునకై బ్రహ్మ యొకశక్తిని పంపఁగా నది నందుని మఱిఁదియగు శతగోపుని పుత్రికయై లోకోత్తరసౌందర్యమున రాధ యనునామమున వర్ధిల్లుచుండెను. ఆ రాధాకృష్ణుల హృదయములలోఁ బరస్పరము ప్రేమ యంకురించెను. {{p|ac|fwb}}చతుర్థాశ్వాసము</p> మాధవుఁడే తనకు భర్త కావలెనని రాధ గోవర్ధనాచలసమీపమునఁ గల ఋణవిమోచనతీర్థమున ఆయాఋతువుల ననుసరించి ఘోరనియమమునఁ దప మాచ<noinclude><references/></noinclude> lcpdsszd3iofuxc518e4ehtqxgylvg4 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/26 104 212463 555156 554681 2026-04-29T08:24:46Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555156 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రించుచుండెను. శరత్కాలమున విష్ణు వామెకుఁ బ్రత్యక్షమై యామెకోరిక నీడేర్చెను. పుండరీకుఁడు ఘోరతపము చేయుచుండఁగా బ్రహ్మ యాతనికిఁ బ్రత్యక్షమయి 'విష్ణువు నేఁడో రేపో యతనికిఁ బ్రత్యక్షమగు'నని తెల్పెను. పుండరీకుఁడు తపము చేయుచున్న క్షేత్రము దేవర్షినరగణసేవిత మగుననియు, దేవుఁడు ముక్తి నొసఁగుననియుఁ దెల్పెను. ఆముని బ్రహ్మమాటఁ దలఁచుకొనుచు భగవంతుని ధ్యానించుచుండఁగా మూఁడవనాఁడు విష్ణు వాతనికి బ్రత్యక్షమయ్యెను. దేవునియద్భుతతేజమును గని బెదరి యఱచుచుఁ బుండరీకుఁడు పాఱిపోవుచుండఁగా కృష్ణుఁడు నవ్వెను. పుండరీకుఁడు వెనుకకు మరలి దేవునిఁ గని వేయివిధములఁ గొనియాడెను. విష్ణువు వెనుకనే వచ్చిన మే మందరమును పుండరీకుని గుణములను బ్రశంసించితిమి. శ్రీకృష్ణుఁడు నతనిభక్తిని బ్రశంసించి వరములు వేడఁగోరెను. పుండరీకుడు వేఱేమియుఁ గోరక 'ఈ క్షేత్ర - తీర్థములు గొప్పగా నుండవలెను. నీదర్శన మిచట భవభయకర్శసంబయి జనులకు లభించుఁగాక! ఈతీర్థక్షేత్రములు నాపేరితో వెలయుఁగాక!' అని ప్రార్థింపఁగా విష్ణు వట్లే వరము లొసఁగెను. విష్ణు వా తీర్థమునఁ బశ్చిమాభిముఖుఁడై రెండుచేతులను గటిపై నుంచుకొని వెలసెను. ప్రాగభిముఖుఁడయియు నుండును. ఇట్లు రెండుమూర్తులతో వెలసెను. ఫణిభర్త యాతని పాదపీఠము. లక్ష్మీదేవి — హీ శ్రీరూపముల రెండుకడల నతనిని సేవించుచున్నది. ఎదుట గరుడుఁ డుండును. దక్షిణభాగమున సనకాదులును, బ్రహ్మయును, ఎడమవైపు నేనును, రుద్రులును, ఇంద్రాదులు వెనుకభాగమున నుందుము. నారదా! వెన్నునివాత్సల్యమును నీవు నెఱుఁగుదువు. ఆ దేవుఁడు దిగంబరుఁడయి పంచాబ్దంబుల యీఁడువాఁడై యుండును. వాసవాదులు తన్ను గొల్వఁగా శేషపీఠము నధిష్ఠించి, రెండుకాళ్లనడుమను గోయష్టి నిరికించుకొని యుండును. అతఁడు నాల్గు బాహ్యద్వారములును, నాలు గంతర్ద్వారములును గల మహాసౌధమున నుండును. ఆదేవదేవుని దర్శించినచో ఎట్టి పాతకములైనను నశించును. తొల్లి గోవు, కాకి, హంస, చిలుక, పాము, తేనెటీఁగయును ఆదేవుని సేవించి యుత్తమజన్మముల నొంది చివఱ ముక్తిఁ బడసినవి. నీ కావృత్తాంతములఁ దెల్పెదను వినుము. పాండురంగఁడు భీమరథీతీరమున మురళీగాన మొనర్చుచుండఁగా దానిని విని పరవశమైన గోవొకటి పాలు స్రవించెను. ఆదుగ్ధబిందువొకటి యెగిరి శ్రీకృష్ణునిశిరస్సుపైఁ బడెను. అందువలన నా ధేనువునకు దేవునకు క్షీరాభిషేక మొనరించిన సుకృతము కలిగెను. ఆ ధేనువు ముదుసలిదై మరణించి మఱుజన్మమున సుశీలయనుపేరితో నొక విష్ణుభక్తునకుఁ బుత్రికగా జన్మించెను. యుక్తవయస్సున నామె లోభియుఁ గ్రూరుఁడు నగు నొక బ్రాహ్మణున కిచ్చి పెండ్లి చేయఁబడెను. భర్త యెన్నిబాధలు పెట్టిన నామె సహించుచు గొప్ప పతివ్రత యని పేరుమోసెను. ఒకనాఁడామె భర్త గ్రామాంతరమున కేఁగిన సమయమున శ్రీకృష్ణుఁ డొక పొట్టివడుగు<noinclude><references/></noinclude> jxid3g4kjqttno607sxm696rwq15wng పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/27 104 212464 555157 554682 2026-04-29T08:52:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555157 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వేసమున నతిథియై వచ్చెను. ఆతడు తనకాకలి యెక్కువగా నున్నదనియు, వంట యగువఱకును వేచి యుండఁజాలననియుఁ జెప్పి చల్దియన్నమునే తినుటకు సిద్ధపడెను. ఆమె పెట్టినయన్నము అతనికిఁ జాలనందున సుశీల — భర్త యేమి చేసినఁ జేయనిమ్మని సాహసించి — అతఁడు కానరాకుండ దాచియుంచుకొనిన భక్ష్యముల నతిథికిఁ బెట్టెను. అందునను వటువునకుఁ దృప్తి కలుగలేదు. సుశీల మిగుల నాశ్చర్యపడుచు నాయతిథి సామాన్యమానవుఁడు కాఁడనియు, భగవంతుఁడే యా రూపమున వచ్చెననియు భావించి కావలసిన వంటకములను సిద్ధము చేయ నగ్నిదేవునిఁ బ్రార్థించెను. అతని ప్రభావమునఁ బెక్కురకముల వంటలు తయారైనవి. అపు డామెభక్తికి మెచ్చి, వటువు కృష్ణుఁడుగా మాఱి యామెకుఁ బ్రత్యక్షమయి, యామె వెనుకటిజన్మవృత్తాంతమును తెల్పి యిట్లనెను 'నీభక్తికి సంతసిల్లితిని, నిన్ను పరీక్షింపఁదలఁచియే యిట్లు వచ్చితిని. నీభర్తయు కఠినుఁడుగా నుండుటకును నేనే కారణము. పూర్వ మకృతసత్క్రియుఁడను బ్రాహ్మణుఁడు పాపాత్ముఁ డొకఁ డుండెను. ఒకప్పు డతఁ డుత్సవసమయమున నాకు నివేదించిన యన్నమును గాంచెను. ఆ సుకృతదేశమున నతఁ డుత్తమ బ్రాహ్మణవంశమునఁ బుట్టి విద్యల నభ్యసించి నిన్ను వివాహమాడెను. నిన్ను పరీక్షింపఁగోరియే అతనిని లోభిగను, కఠినునిగ నొనర్చితిని. నేఁటినుండియు నతఁ డత్యుత్తముఁ డగును. నీ కేవురుపుత్రు లుత్తములు కల్గుదురు. నీవు నూఱేండ్లు జీవించి పిదప భర్తతోఁగూడ మోక్షము పొందఁగలవు.' విష్ణు విటు పల్కి యంతర్హితుఁ డయ్యెను. పిదప సుశీలభర్త యుత్తమరీతిఁ బ్రవర్తించెను. కాకి యొకటి పాండురంగని దేవాలయముచేరువఁ గల రావిచెట్టుపయి వసించుచు, నొకప్పుడు విట్టలాలయాంగణమునఁ గల బలిపీఠముపై వేసిన మెతుకులు తినుటకై చెట్టునుండి యెగురుచు రాఁగా, దాని లెక్కలవలని గాలిచే దుమ్ము పోయి, కాకికి దేవాలయము తుడిచిన పుణ్యము లభించెను. ఆకాకి మరుజన్మమున సుశీల కొకపుత్రుఁడై జన్మించెను. ఒకహంస యా దేవాలయసమీపమున వసించుచు నొకప్పుడు మండుటెండకుఁ దాళఁజాలక యచట తటాకమున మునిగి, యా గుడిలోఁ బ్రవేశించి, ఱెక్క లల్లార్పఁగా, వానివలన రాలిన నీటితుంపరలు అచ్చోటఁ బడినవి. గాలికి దుమ్ము నెగిరిపోయెను. అందువల్ల హంసకు గుడిని అలికిన పుణ్యము లభింపఁగా నదియు సుశీల కొకపుత్రుఁడై పుట్టెను. ఒక హరిదాసి చిత్రవర్ణములుగల చిలుక నొకదానిం బెంచుచుండెను. ఒకనాఁ డది పంజరమునుండి తప్పించుకొని, ఆ హరిదాసిముత్యాలహారమును ముక్కునఁ గఱచుకొని యెగిరిపోయెను. ఆమెయు నామెచెలికత్తెలును చిలుకం బట్టుకొన నెంత యత్నించినను లాభము లేకపోయెను. చిలుక గుడిలోపలి యొక దండెముపై వ్రాలి ముత్యములను ముక్కుతోఁ బొడువఁగా నవి క్రింద రాలెను. కానఁ జిలుకకుఁ పాండు<noinclude><references/></noinclude> ds988f28wrd20f68j7ot9ge20p0b2j6 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/28 104 212465 555160 554683 2026-04-29T09:50:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555160 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రంగనfగుడిలో ముత్యాలముగ్గులు పెట్టిన పుణ్యము లభించి, అది సుశీల కొకకుమారుఁడై పుట్టెను. ఎచటినుండియో పామొకటి విట్టలాలయమును బ్రవేశింప, అందున్న యెలుకయొకటి భయపడి దేవునిపాదపీఠముక్రింద దూరెను. పా మచటికి వచ్చి, విట్టలునిపాదములపై నున్న యొకమొగలిపూవులోనిపుప్పొడి నాఘ్రాణించెను. అందువల్ల పామునకు ఆనందము కల్గి అది పడగ విప్పెను. అప్పుడు అందున్న మణి ప్రకాశించి పామునకు దీపారాధన మొనర్చిన పుణ్యము లభించి, అదియు సుశీల కొకకొడుకయి పుట్టెను. దేవాలయసమీపోద్యానమున తేనెటీఁగలగుం పొకటి తిరుగుతుండఁగా నం దొక యీఁగ భగవంతునికి పూజింపఁబడిన యర్ఘ్యాంబువు కల పుష్పములోని మధువును గ్రోలఁగా, దానికి భగవత్పాదతీర్థముఁ ద్రాగిన ఫల మబ్బి, అదియు సుశీల కొకపుత్రుఁడయి పుట్టెను. సుశీల యా పుత్రులను బెంచి, భగవద్భక్తిని బోధించి, ముదుసలియైనపిదప ముక్తిఁ బొందెను. విట్టలున కీశాన్యదిశను క్షేత్రపాలుఁడగు కాలభైరవుఁ డుండును. ఒకప్పుడు గంధర్వుఁడొకఁడు గర్వించి విమాన మెక్కి గుడిపైనుండి పోవుచుండఁగా, భైరవుఁడు కోపించి పై కెగిరి, వానిని క్రింది కీడ్చి చంప సిద్ధపడెను. దయామయుఁడగు పాండురంగఁ డతనిని వారించి, గంధర్వునిఁ గాపాడెను. గంధర్వుఁడు విట్టలుని మిగులఁ గొనియాడి తన యిచ్చఁబోయెను. భక్తులు తొలుత క్షేత్రపాలుని, ఆపిదపనే పాండురంగనిఁ జూడవలెను. {{p|ac|fwb}}పంచమాశ్వాసము</p> పరమేశ్వరుఁ డిట్లు చెప్పఁగా విని నారదుఁడు మిగుల సంతసించి 'దేవా! ఆక్షేత్రమునకుఁ గల ద్వారము లేవి? ఆయాయియెడల నెవ్వ రెవ్వరున్నారు? ఆయాస్థలవిశేషము లేవి? వానిని వివరింపవలెనని కోరఁగా శివుఁ డిట్లు చెప్పెను 'సుఖమాలికా, భీమరథులు కలిసినచోటు ముఖ్యమైన తీర్థము, ఆ క్షేత్రమునకుఁ దూర్పుద్వారముగ సరస్వతియు, సిద్ధేశ్వరమను శివలింగమును కలవు, పుష్పావతీ, సంగమతీర్థములు దక్షిణద్వారము. బోయ యొకఁ డొకజింకను దఱుముచు దానిగుండెకు గాఢముగఁ దాటున ట్లొకవాఁడిబాణము నేసెను. ఆ జింక యా బాధతోఁ బరుగెత్తుచు సంగమతీర్థమున మునిఁగి, మరణించి విద్యాధరరాజయి మింటి కెగసెను. అది చూచి యాశ్చర్యపడుచు, నాబోయయు అందు స్నానము చేసి, నీరు క్రోలి, నిష్పాపుఁడై శరీరము విడిచి, దివ్యత్వము పొందెను. తొల్లి యచ్చోట సంగముఁడను రక్కసి రాతిక్రింద దాఁగియుండఁగా విష్ణువా తనిని బయటి కీడ్చి చంపెను. పశ్చిమద్వారమున భువనేశ్వరియు నుత్తరద్వారమున మహిషాసురమర్దని యను దుర్గయు నున్నారు. అచ్చట తరణియు, భైమియును గలి<noinclude><references/></noinclude> 3veajlkijzzr5rh268od9wjjnbacax8 555161 555160 2026-04-29T09:50:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 555161 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రంగనిగుడిలో ముత్యాలముగ్గులు పెట్టిన పుణ్యము లభించి, అది సుశీల కొకకుమారుఁడై పుట్టెను. ఎచటినుండియో పామొకటి విట్టలాలయమును బ్రవేశింప, అందున్న యెలుకయొకటి భయపడి దేవునిపాదపీఠముక్రింద దూరెను. పా మచటికి వచ్చి, విట్టలునిపాదములపై నున్న యొకమొగలిపూవులోనిపుప్పొడి నాఘ్రాణించెను. అందువల్ల పామునకు ఆనందము కల్గి అది పడగ విప్పెను. అప్పుడు అందున్న మణి ప్రకాశించి పామునకు దీపారాధన మొనర్చిన పుణ్యము లభించి, అదియు సుశీల కొకకొడుకయి పుట్టెను. దేవాలయసమీపోద్యానమున తేనెటీఁగలగుం పొకటి తిరుగుతుండఁగా నం దొక యీఁగ భగవంతునికి పూజింపఁబడిన యర్ఘ్యాంబువు కల పుష్పములోని మధువును గ్రోలఁగా, దానికి భగవత్పాదతీర్థముఁ ద్రాగిన ఫల మబ్బి, అదియు సుశీల కొకపుత్రుఁడయి పుట్టెను. సుశీల యా పుత్రులను బెంచి, భగవద్భక్తిని బోధించి, ముదుసలియైనపిదప ముక్తిఁ బొందెను. విట్టలున కీశాన్యదిశను క్షేత్రపాలుఁడగు కాలభైరవుఁ డుండును. ఒకప్పుడు గంధర్వుఁడొకఁడు గర్వించి విమాన మెక్కి గుడిపైనుండి పోవుచుండఁగా, భైరవుఁడు కోపించి పై కెగిరి, వానిని క్రింది కీడ్చి చంప సిద్ధపడెను. దయామయుఁడగు పాండురంగఁ డతనిని వారించి, గంధర్వునిఁ గాపాడెను. గంధర్వుఁడు విట్టలుని మిగులఁ గొనియాడి తన యిచ్చఁబోయెను. భక్తులు తొలుత క్షేత్రపాలుని, ఆపిదపనే పాండురంగనిఁ జూడవలెను. {{p|ac|fwb}}పంచమాశ్వాసము</p> పరమేశ్వరుఁ డిట్లు చెప్పఁగా విని నారదుఁడు మిగుల సంతసించి 'దేవా! ఆక్షేత్రమునకుఁ గల ద్వారము లేవి? ఆయాయియెడల నెవ్వ రెవ్వరున్నారు? ఆయాస్థలవిశేషము లేవి? వానిని వివరింపవలెనని కోరఁగా శివుఁ డిట్లు చెప్పెను 'సుఖమాలికా, భీమరథులు కలిసినచోటు ముఖ్యమైన తీర్థము, ఆ క్షేత్రమునకుఁ దూర్పుద్వారముగ సరస్వతియు, సిద్ధేశ్వరమను శివలింగమును కలవు, పుష్పావతీ, సంగమతీర్థములు దక్షిణద్వారము. బోయ యొకఁ డొకజింకను దఱుముచు దానిగుండెకు గాఢముగఁ దాటున ట్లొకవాఁడిబాణము నేసెను. ఆ జింక యా బాధతోఁ బరుగెత్తుచు సంగమతీర్థమున మునిఁగి, మరణించి విద్యాధరరాజయి మింటి కెగసెను. అది చూచి యాశ్చర్యపడుచు, నాబోయయు అందు స్నానము చేసి, నీరు క్రోలి, నిష్పాపుఁడై శరీరము విడిచి, దివ్యత్వము పొందెను. తొల్లి యచ్చోట సంగముఁడను రక్కసి రాతిక్రింద దాఁగియుండఁగా విష్ణువా తనిని బయటి కీడ్చి చంపెను. పశ్చిమద్వారమున భువనేశ్వరియు నుత్తరద్వారమున మహిషాసురమర్దని యను దుర్గయు నున్నారు. అచ్చట తరణియు, భైమియును గలి<noinclude><references/></noinclude> cuqsolplqa5re67kjqqplpskf014tgv పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/29 104 212466 555162 554684 2026-04-29T09:59:58Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555162 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యును. అచట స్నానముచేసిన సమస్తకలుషములు పోవును. ఈ నాలుగు నంతర్ద్వారములు. ఇవిగాక నాల్గు బహిర్ద్వారములు కలవు. పశ్చిమమున కరవీరపురము, భద్రకాళిక, కోటీశ్వరలింగము, పుణ్యజలనది, నారాయణీదేవియుఁ గలరు. దక్షిణద్వారమున కృష్ణానదియొడ్డున శూర్పలాఖ్యతీర్థమును, శివుఁడును గలరు. తూర్పుద్వారమునఁ బుష్కరిణీనది తన కుత్తరముగాఁ బ్రవహింపఁగా త్రివిక్రముఁ డుండును. ఉత్తరద్వారమున నృసింహుఁ డుండును. పూర్వము బ్రహ్మపుత్త్రుఁడగు సనందనుఁడు శిష్యసహితముగ హస్తిపురి కేఁగి ధర్మరాజును దర్శించఁగా, నారాజు మునిని మిగుల గౌరవించి బంధుమిత్రాదివధ వలనఁ గల్గిన పాపము నశించు మార్గముఁ దెల్పఁగోరఁగా ఆ ముని పౌండరీకక్షేత్రమునకు వెళ్లఁగోరెను. ధర్మరా జట్లొనర్చి, తన పాపమును బోనడిచెను. పాండురంగని కుత్తరముగా 100 విండ్లదూరమున బోధిద్రుమరూపమున నృసింహుఁ డున్నాఁడు. అఁట కుండలతీర్థ మున్నది. అందు మునిఁగి నృసింహుని దర్శించువారికి రాజసూయఫలము లభించును. వేలకొలఁది దేవకన్యక లచట నృసింహునకు నీరాజన మిచ్చుచుందురు. అఁట మరణించువారు ముక్తులగుదురు. అట్లగుటకుఁ గప్పయైన యముతపుత్రుఁడే తార్కాణము. విష్ఠలునికిఁ బడమట పద్మతీర్ధము కలదు. త్రిదంష్ట్రుఁడను రాక్షసుని చంపుటకయి మున్ను వెన్నుఁ డచ్చట పద్యాయుధమును దాఁచియుంచెనఁట! అందు స్నాన మాడినవారికి ముక్తి గలుగును. సుశర్మ యను క్రూరకిరాతుఁ డొకనాఁడు సపరివారముగ వేఁట కేఁగి దప్పిగొని పద్మతీర్థమునఁ దానమాడి, యా నీరు త్రాగెను., కొంతకాలమున కతనికి మృత్యువు రాఁగా చిత్రగుప్తుఁడు తా నదివఱకు వ్రాసియుంచిన సుశర్మ పాపములపట్టికను తెప్పించి చూడఁగా నం దొకటియు లేకపోయెను. అతఁ డచ్చెరువంది యముని కీ యంశము తెల్పఁగా నతఁడు మఱల శ్రద్ధగా ప్రతిపుటయు పరిశీలింపఁగోరెను. చిత్రగుప్తుఁడు పరిశీలించి యొకయెడ తనవ్రాతకు బదులుగ 'ఈతఁ డొకనాఁడు పద్మతీర్థమున మున్గినందున నీతని పాపములన్నియు నశించినవి' అను విష్ణునివ్రాఁతఁ గనుగొని యమునికిఁ దెల్పెను. పద్మతీర్థప్రభావమును యముఁడును కొనియాడి సుశర్మను గౌరవించెను. సుశర్మ స్వర్గమున కేఁగి భోగము లనుభవించి, తిరిగి భూలోకమున నుత్తమకుటుంబమునఁబుట్టి, పాండురంగనిగుడి నూడ్చుచు సుఖముగఁ బెక్కేండ్లు గడపెను. ఆ సుకృతమునఁ జంద్రలోకమున కేఁగి పెక్కుసుఖము లనుభవించి, పిదప సుకీర్తి యను రాజుగాఁ బుట్టి గొప్పభక్తుడై నిండువయస్సుననే సన్యసించి యవసానమున మోక్షము పొందెను. కృతయుగమున నొక్కకోరయు, త్రేతలో రెండుకోరలును, ద్వాపరమున త్రిదంష్ట్రలును గల్గిన మాయావి యగు నొకరాక్షసుఁ డుండెను. వాఁడు కృతయుగమున హిరణ్యకశిపునకు పార్ష్ణిగ్రాహి యనుపేరఁ బుత్రుఁడై నృసింహునిచేఁ జంపఁ<noinclude><references/></noinclude> 54pguwzxbkevhgvhf9khkdvlwmp5n68 555163 555162 2026-04-29T10:00:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 555163 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యును. అచట స్నానముచేసిన సమస్తకలుషములు పోవును. ఈ నాలుగు నంతర్ద్వారములు. ఇవిగాక నాల్గు బహిర్ద్వారములు కలవు. పశ్చిమమున కరవీరపురము, భద్రకాళిక, కోటీశ్వరలింగము, పుణ్యజలనది, నారాయణీదేవియుఁ గలరు. దక్షిణద్వారమున కృష్ణానదియొడ్డున శూర్పలాఖ్యతీర్థమును, శివుఁడును గలరు. తూర్పుద్వారమునఁ బుష్కరిణీనది తన కుత్తరముగాఁ బ్రవహింపఁగా త్రివిక్రముఁ డుండును. ఉత్తరద్వారమున నృసింహుఁ డుండును. పూర్వము బ్రహ్మపుత్త్రుఁడగు సనందనుఁడు శిష్యసహితముగ హస్తిపురి కేఁగి ధర్మరాజును దర్శించఁగా, నారాజు మునిని మిగుల గౌరవించి బంధుమిత్రాదివధ వలనఁ గల్గిన పాపము నశించు మార్గముఁ దెల్పఁగోరఁగా ఆ ముని పౌండరీకక్షేత్రమునకు వెళ్లఁగోరెను. ధర్మరా జట్లొనర్చి, తన పాపమును బోనడిచెను. పాండురంగని కుత్తరముగా 100 విండ్లదూరమున బోధిద్రుమరూపమున నృసింహుఁ డున్నాఁడు. అఁట కుండలతీర్థ మున్నది. అందు మునిఁగి నృసింహుని దర్శించువారికి రాజసూయఫలము లభించును. వేలకొలఁది దేవకన్యక లచట నృసింహునకు నీరాజన మిచ్చుచుందురు. అఁట మరణించువారు ముక్తులగుదురు. అట్లగుటకుఁ గప్పయైన యముతపుత్రుఁడే తార్కాణము. విష్ఠలునికిఁ బడమట పద్మతీర్ధము కలదు. త్రిదంష్ట్రుఁడను రాక్షసుని చంపుటకయి మున్ను వెన్నుఁ డచ్చట పద్మాయుధమును దాఁచియుంచెనఁట! అందు స్నాన మాడినవారికి ముక్తి గలుగును. సుశర్మ యను క్రూరకిరాతుఁ డొకనాఁడు సపరివారముగ వేఁట కేఁగి దప్పిగొని పద్మతీర్థమునఁ దానమాడి, యా నీరు త్రాగెను., కొంతకాలమున కతనికి మృత్యువు రాఁగా చిత్రగుప్తుఁడు తా నదివఱకు వ్రాసియుంచిన సుశర్మ పాపములపట్టికను తెప్పించి చూడఁగా నం దొకటియు లేకపోయెను. అతఁ డచ్చెరువంది యముని కీ యంశము తెల్పఁగా నతఁడు మఱల శ్రద్ధగా ప్రతిపుటయు పరిశీలింపఁగోరెను. చిత్రగుప్తుఁడు పరిశీలించి యొకయెడ తనవ్రాతకు బదులుగ 'ఈతఁ డొకనాఁడు పద్మతీర్థమున మున్గినందున నీతని పాపములన్నియు నశించినవి' అను విష్ణునివ్రాఁతఁ గనుగొని యమునికిఁ దెల్పెను. పద్మతీర్థప్రభావమును యముఁడును కొనియాడి సుశర్మను గౌరవించెను. సుశర్మ స్వర్గమున కేఁగి భోగము లనుభవించి, తిరిగి భూలోకమున నుత్తమకుటుంబమునఁబుట్టి, పాండురంగనిగుడి నూడ్చుచు సుఖముగఁ బెక్కేండ్లు గడపెను. ఆ సుకృతమునఁ జంద్రలోకమున కేఁగి పెక్కుసుఖము లనుభవించి, పిదప సుకీర్తి యను రాజుగాఁ బుట్టి గొప్పభక్తుడై నిండువయస్సుననే సన్యసించి యవసానమున మోక్షము పొందెను. కృతయుగమున నొక్కకోరయు, త్రేతలో రెండుకోరలును, ద్వాపరమున త్రిదంష్ట్రలును గల్గిన మాయావి యగు నొకరాక్షసుఁ డుండెను. వాఁడు కృతయుగమున హిరణ్యకశిపునకు పార్ష్ణిగ్రాహి యనుపేరఁ బుత్రుఁడై నృసింహునిచేఁ జంపఁ<noinclude><references/></noinclude> j74c20dnrkeve1212cgkafr39dzr9bj పుట:Sangitarasataran022902mbp.pdf/77 104 212878 555122 2026-04-28T11:59:15Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555122 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మంచిపుణ్య స్త్రీ — (వచ్చి) ఏమి షేఅది పూవిసిరికొడతావేమిషీ మంచిపల్కులు చెపుతూవుంఛే వినలేవాయేమిషి నేనేగాగాపడి మేకలను యేలాగైతే నేమి కుయిక్కుమన్పించి సోమిదేవమ్మను అయినాననా యేమిషి ఊవిఱ్ఱవీగుఛావు ఓ శేపు విందామే యిదిగోచూశావు (మెల్లగా) రాజుకొడుకల్లేవున్నాడే ఆంచక్కాను ఆమాటలుచూడు అమృతగుటకలేమే విందాము వూరుకోనే. ధూర్త స్త్రీ — నీకేమి తెలియదులే మావారుయెన్ని కట్టలుతిరగవేసారనుకున్నా వేమిషి. ఆయనకు తెలిసిన వేదాంతాలకంటే యీయన యెక్కువచెపుతాడుషే పోనియ్యిగాని శుక్కరారమేమిషి వ్రతమేమిషి ఉపవాసమేమిషి యజ్ఞమేమిషి అంఛాడేమే మరి. మంచి పుణ్యస్త్రీ - నోషేవు తొందరపడకే వింఛూవుందాంగా చూశావుషే ఏమిను ధురధ్వని యెంతఅందంగావుంచున్నయ్యోచూడు ఆజానుబాహుడు ఇన్ని శుభలక్షణములుగల యీమహానుభావుడు యిష్ఠదిరుగుచున్నాడేమోషుమా. బుద్ధు - అమ్మా నేనీ ప్రాంతమున దిరుగుచుండుట కుద్దేశించినజోగిని నాభిక్ష కావలయుననిరాలేదు తోచినమంచిమాటలు నాలుగు చెప్పుచుండును అనుదినము ఈవాడలందు సంచరించగలను రేపు మరలవచ్చెద సెలవు. పుణ్యస్త్రీ - స్వామి మీరుస్వాములవారువలెనున్నారు ఈరోజున మాయింటికి భిక్షకు దయచేస్సారా. ధూర్త్మస్త్రీ — ఓషో ముందుగా నేనుగాదుషేచూసింది మాయింటి వస్సారు. బుద్ధు — అమ్మలారా! తగువేల యెప్పుడువచ్చినను వచ్చెద మాంసాహార సురాపానాదులు వర్ణించియున్న యందరిగృహములకుంబోయెద అయినను సాయిచ్చవచ్చినప్పుడు మీకాయాసము ఎప్పుడైనను కలుగుసేమోకాని ప్రకృతమున కంతశ్రమయిచ్చునదిలేదు తల్లీ పోయెద. {{right|'''(అందరు విష్క్రమణము)'''}} {{rule |6em }} {{Center|{{p|fs125}}ద్వితీయరంగము ౼ శృంగారవనము</p>}} {{rule |6em }} {{Center|{{p|fs125}}మనుష్య వేషములతో</p>}} {{Center|'''(మన్మధుఁడు, వసంతుఁడు ప్రవేశము)'''}} మన్మ — వసంతా! యేమి యీశృంగారవనము నేనీలోకమునందుగల స్త్రీ పురుషుల<noinclude><references/></noinclude> eg620eia7f5cicyu6m4s1u0i0tlqn8r 555123 555122 2026-04-28T12:01:59Z Brjswiki 6801 555123 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మంచిపుణ్య స్త్రీ — (వచ్చి) ఏమి షేఅది పూవిసిరికొడతావేమిషీ మంచిపల్కులు చెపుతూవుంఛే వినలేవాయేమిషి నేనేగాగాపడి మేకలను యేలాగైతే నేమి కుయిక్కుమన్పించి సోమిదేవమ్మను అయినాననా యేమిషి ఊవిఱ్ఱవీగుఛావు ఓ శేపు విందామే యిదిగోచూశావు (మెల్లగా) రాజుకొడుకల్లేవున్నాడే ఆంచక్కాను ఆమాటలుచూడు అమృతగుటకలేమే విందాము వూరుకోనే. ధూర్త స్త్రీ — నీకేమి తెలియదులే మావారుయెన్ని కట్టలుతిరగవేసారనుకున్నా వేమిషి. ఆయనకు తెలిసిన వేదాంతాలకంటే యీయన యెక్కువచెపుతాడుషే పోనియ్యిగాని శుక్కరారమేమిషి వ్రతమేమిషి ఉపవాసమేమిషి యజ్ఞమేమిషి అంఛాడేమే మరి. మంచి పుణ్యస్త్రీ - నోషేవు తొందరపడకే వింఛూవుందాంగా చూశావుషే ఏమిను ధురధ్వని యెంతఅందంగావుంచున్నయ్యోచూడు ఆజానుబాహుడు ఇన్ని శుభలక్షణములుగల యీమహానుభావుడు యిష్ఠదిరుగుచున్నాడేమోషుమా. బుద్ధు - అమ్మా నేనీ ప్రాంతమున దిరుగుచుండుట కుద్దేశించినజోగిని నాభిక్ష కావలయుననిరాలేదు తోచినమంచిమాటలు నాలుగు చెప్పుచుండును అనుదినము ఈవాడలందు సంచరించగలను రేపు మరలవచ్చెద సెలవు. పుణ్యస్త్రీ - స్వామి మీరుస్వాములవారువలెనున్నారు ఈరోజున మాయింటికి భిక్షకు దయచేస్సారా. ధూర్త్మస్త్రీ — ఓషో ముందుగా నేనుగాదుషేచూసింది మాయింటి వస్సారు. బుద్ధు — అమ్మలారా! తగువేల యెప్పుడువచ్చినను వచ్చెద మాంసాహార సురాపానాదులు వర్ణించియున్న యందరి గృహములకుంబోయెద అయినను నాయిచ్చవచ్చినప్పుడు మీకాయాసము ఎప్పుడైనను కలుగుసేమోకాని ప్రకృతమున కంతశ్రమయిచ్చునదిలేదు తల్లీ పోయెద. {{right|'''(అందరు విష్క్రమణము)'''}} {{rule |6em }} {{Center|{{p|fs125}}ద్వితీయరంగము ౼ శృంగారవనము</p>}} {{rule |6em }} {{Center|{{p|fs125}}మనుష్య వేషములతో</p>}} {{Center|'''(మన్మధుఁడు, వసంతుఁడు ప్రవేశము)'''}} మన్మ — వసంతా! యేమి యీశృంగారవనము నేనీలోకమునందుగల స్త్రీ పురుషుల<noinclude><references/></noinclude> t7m7slrs5yu20gu69jlta8vx6c2g66v పుట:Sangitarasataran022902mbp.pdf/78 104 212879 555125 2026-04-28T12:48:43Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555125 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>నందరిని వశీకృతులంజేసికొంటిని నాఇక్షుకోదండంబునుండి వెడలు పుష్పబాణంబులు దగిలినవాఁడు కామినీగృహకుంభదాసుండుగాని వాడెవ్వఁడైన గలఁడా శంభుఁడు, స్వయంభుఁడు ఆదివిష్ణువుసైతము గౌరీ సరస్వతీ లక్ష్మీకాంతం కౌఁగిళ్లంజిక్కి క్షణమెడబాయలేక చిక్కుకొని నిరంతరము వారింగొల్చుచునదేకదా భూలోకంబునం గపిలవస్తుపురంబునంబుట్టి శ్రాద్ధోదని యొక్కడు నిషామవ్రతంబుపట్టి యశోధరయను గర్భిణీయగు తన భార్యను విడిచి అహింస దయ లోకంబున వెలయింపంజేసెదనని పట్టుపట్టియున్నాడు. వేని సేవిధంబుననైన జయించి యైదునిమిషములలో కాముకుంజేయగలవాఁడను నీవు సహాయుండవుగా నుండుము. వసం — చిత్తము. {{Center|{{p|fs125}}పాట. ఖమాచ్</p>}} {{left margin|5em}}<poem>హాయ్ హాయ్ హాయ్ హాయ్ అఖిలభూజనానందకరము వసంతమూ శుకపికశిఖండిశోభితమూ వసంతమూ మకరాంకశిలీముఖభూతమూ వసంతమూ ప్రకటశిరీషకుసుమవాసితము భళీ భళీ భళి భళిరే యీవసంతమూ</poem> </div> బుద్ధు — (వచ్చి) ఓహో యీవనము వామనము నాకర్షించుటలేదు. ఇందుగల వింతలేమున్నవి ఇవికామవికారహేతువులు కాని యివినన్నేమిచేయఁగలవు యీ మామిడికిందగూర్చుండి కొంతసేపు ధ్యానంబుజేసికొనియెదగాక (చెట్టుక్రింద పద్మాసనస్థుఁడై ధ్యానముద్రలోనుండును) మన్మథు — (మేల్లగా చెట్లచాటునకువచ్చి బుద్ధుంజూచి) వసంతా నీవనంబున నచ్చచ్చట౯ శుకపికమయూర భసరాదులం బ్రేరేచి యొక్క ముద్దులాడి సీమాయాప్రాభావంబున సృజించిపంపుము. ఈసౌద్ధాదని బింకంబు నేనుమట్టుపరచెద. వసంతు — చిత్తము ప్రభూ. (అని నిష్క్రమణము) సుందరి — (వచ్చి బుద్ధునిసమీపించి) ఆహా యేమి యీసుకమారశరీరుడు. ఇప్పుడు పరమధ్యాననిష్ఠుడైయున్నాడు. వీనిధ్యానము నేరీతిగామస్తలు కానీ మన్మధ మహారాజు కలఁడుగదా నేను వసంతునివలన సృజింపఁబడిన వాసంతినై యుండి<noinclude><references/></noinclude> awye3yoyysn7u084xxb2bvxui667f7p పుట:Sangitarasataran022902mbp.pdf/79 104 212880 555127 2026-04-28T13:18:13Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555127 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కంతు మహారాజు సేవజేయుటయు అతని ముదలనిర్వహించుటయు విధికదా వీని నావలకుఁజిక్కించుకొనలేకపోడునా. మన్మను - వాసంతీ! నీకుభయమేల నేనుమెల్లగా వీనిపై బాణప్రయోగంబుసేయు చుండెద నీవు ముందుగా అంగసంయోగాదుల కారంభింపక మధురగానాదులచే యోగనిద్ర నుండి లేపును ఎట్లంకెకురాడుచూచెదము. వాసంతి - చిత్తము మన్మధమహారాజా! {{Center|{{p|fs125}}పాట. పీలు</p>}} {{left margin|5em}}<poem>రారాయిటురారా రాజాకుమారా సౌరైరనీమోమూ చందమామ రా ఇక్కడనెక్క ముద్దిచ్చిలేవరా చక్కవినీమోవి చక్కెరఠీవీ ఇతరులనేమెల్ల నిటుజూడవేరా వ్రతమిదినిన్ను నే వలచితిగదరా</poem> </div> బుద్ధు — ఎవ్వరది ఏమియాల్లరి కొంచెముదూరముగాపోయి నేడనైన నీవేడుకలుచూచు కొనుము ఇచ్చట ప్రయోజనములేదు. అమ్మా మాతల్లీ నీపాదములకు మొక్కుచున్నాను. వాసంతి - హరిహరిహరీ ఎంతనిర్దయుఁడవు జీవహింసపాపరుఁడవుగా గన్నట్టుచున్నావే నిది హృదయముకాదా నల్లశిలా నీకైవలచి నీమనోహరాకారమువలన నాకర్షింపఁబడి నీయెద్దఁజేరి ఇతరులజేరను నిన్నేకలపెదనని వ్రతమవలంబించివచ్చితినే అట్టి నను తల్లీ అమ్మాయని నిరాకరించిన నీయట్టికట్టిడి యెందైనఁగలఁడా నీవు నన్నిప్పుడే పరిగ్రహింపవేని యీరేల పూలచెట్లకిందఁబడియున్న చితుకులంచేర్చికొని నీయెదుటనే మరణముమెందెద ఈహింసవలన నీవుకృతార్ధుండరగుడువుగాత. మన్మధు - (తనలో) ఈజగన్మోహినియగు వాసంతి యెదుటనిలచియుండగా నాకోదండంబునుండి పుష్పబాణపరంపరలు గురియుచుండగా వసంతుఁడుపన్నిన ప్రద్యుమ్న వ్యూహంబున శుకపికశాలికామయూరబంభిరాది సేవాసమూహంబునట్టనడు మంజిక్కువడియు మలయమారుత గంధగజంబుపై దుముకుంచుండ చలింపకయున్న వీనిమనస్సు నేవిధంబున జయింపంగలను కానీ యెట్లుండునొ చూచుచుండెదను.<noinclude><references/></noinclude> ts09ho0tisxofm0jesfrr8l5in86en0 555151 555127 2026-04-29T06:18:35Z Brjswiki 6801 555151 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కంతు మహారాజు సేవజేయుటయు అతని ముదలనిర్వహించుటయు విధికదా వీని నావలకుఁజిక్కించుకొనలేకపోడునా. మన్మను - వాసంతీ! నీకుభయమేల నేనుమెల్లగా వీనిపై బాణప్రయోగంబుసేయు చుండెద నీవు ముందుగా అంగసంయోగాదుల కారంభింపక మధురగానాదులచే యోగనిద్ర నుండి లేపును ఎట్లంకెకురాడుచూచెదము. వాసంతి - చిత్తము మన్మధమహారాజా! {{Center|{{p|fs125}}పాట. పీలు</p>}} {{left margin|5em}}<poem>రారాయిటురారా రాజాకుమారా సౌరైరనీమోమూ చందమామ రా॥ ॥రా॥ ఇక్కడనెక్క ముద్దిచ్చిలేవరా చక్కవినీమోవి చక్కెరఠీవీ॥ ॥రా॥ ఇతరులనేమెల్ల నిటుజూడవేరా వ్రతమిదినిన్ను నే వలచితిగదరా॥రా॥</poem> </div> బుద్ధు — ఎవ్వరది ఏమియాల్లరి కొంచెముదూరముగాపోయి నేడనైన నీవేడుకలుచూచు కొనుము ఇచ్చట ప్రయోజనములేదు. అమ్మా మాతల్లీ నీపాదములకు మొక్కుచున్నాను. వాసంతి - హరిహరిహరీ ఎంతనిర్దయుఁడవు జీవహింసపాపరుఁడవుగా గన్నట్టుచున్నావే నిది హృదయముకాదా నల్లశిలా నీకైవలచి నీమనోహరాకారమువలన నాకర్షింపఁబడి నీయెద్దఁజేరి ఇతరులజేరను నిన్నేకలపెదనని వ్రతమవలంబించివచ్చితినే అట్టి నను తల్లీ అమ్మాయని నిరాకరించిన నీయట్టికట్టిడి యెందైనఁగలఁడా నీవు నన్నిప్పుడే పరిగ్రహింపవేని యీరేల పూలచెట్లకిందఁబడియున్న చితుకులంచేర్చికొని నీయెదుటనే మరణముమెందెద ఈహింసవలన నీవుకృతార్ధుండరగుడువుగాత. మన్మధు - (తనలో) ఈజగన్మోహినియగు వాసంతి యెదుటనిలచియుండగా నాకోదండంబునుండి పుష్పబాణపరంపరలు గురియుచుండగా వసంతుఁడుపన్నిన ప్రద్యుమ్న వ్యూహంబున శుకపికశాలికామయూరబంభిరాది సేవాసమూహంబునట్టనడు మంజిక్కువడియు మలయమారుత గంధగజంబుపై దుముకుంచుండ చలింపకయున్న వీనిమనస్సు నేవిధంబున జయింపంగలను కానీ యెట్లుండునొ చూచుచుండెదను.<noinclude><references/></noinclude> klw4fjf2wv9er3w2yki9b437uoiueqw పుట:Sangitarasataran022902mbp.pdf/81 104 212881 555154 2026-04-29T07:29:39Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555154 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>దష్టబుద్ధా నిపనిచూచుకొనుము {{right|'''(అని నిష్క్రమణము)'''}} {{Center|'''(రాళ్లవానకుఱియును మహావాయువువీదును చెట్లుపడినట్టుకనపడును)'''}} బుద్ధు - ఓహో యేమి యీవాన యేమి యీగాలి యేమి యీరాళ్లు కానీ యీపొదచాటున కూర్చుండెదను వాయుర్ధిష్టకార్యంబు నెరవేర్చు కొనకమున్నే యంతంబునుందెదగాబోలును ఏది యెట్లుజరిగిన నేమిసేయంగలవాఁడను చూచుచుండుటయే నాపని (ధ్యానము) వాన వెలియుచున్నది. వేచి నేటికి యేడు అహోరాత్రములు నిద్రాహారములు లేక రాళ్లుపడి శరీరంబంతయు గాయములయ్యు బ్రతికియుంటిగదా యీ రాలిన ఫలంబులు భక్షించి యీనీళ్లు పానముచేసితినా కొంచెము శక్తి వచ్చును. {{right|'''(అని నిష్క్రమణము)'''}} {{rule |6em }} {{Center|{{p|fs125}}తృతీయరంగము — పురమార్గము</p>}} {{rule |6em }} {{Center|'''(గొల్లవాఁడు, మేక, బుద్ధుడు ప్రవేశము)'''}} బుద్ధు — (మేకను దయతోపట్టుకొని దువ్వుచుగూర్చుండును). గొల్ల - తాసెతాసె నీదొమ్మదగలా అట్టామోతాయే యేనీగొంతుగోయ నిన్నుతోడెలెయ్యా ఇట్ట యిట్ట యిట్ట యిట్ట టుర్రు టుర్రు టుర్రు ఏఁ విఁ అదిగో అదిగో మల్లుమంటే మల్లవు యాచి యాచి తిరుగోసి బామ్మర్లు మట్టుకొని ముక్కూ నోరూ మూత్తార్లే యేర్చేటప్పుడు తెలుత్తుంది వోరయ్యో వోరయ్యో అడ్డం రా మోకయ్యో మేక మేక మేక పోనియ్యయ్యా తోలుకుమోతానాయేంటి (అని గద్దించును). బుద్ధు — వెరీగొల్లా తొందరపడ్డావేమి మేక కాలుకుఁటుచున్నది నడవలేకయున్నది నీ వెక్కడికి దోలుకొని పోతావో అక్కడికి నేనుయెత్తుకొని వస్తానులే. గొల్ల — యేంతయ్యో నీఖెందుకంకేను యినవేమియ్యా ఆధి ఆబొందేటి ఆగంధేంటి ఆకాయగడ్డలేంటి అఁ అంటాగుందా ఆఁ ఆవశాఖదేవికి సద్ధిగంజికా యేంబో అన్నీశరేకాని అంతాయిద్ధిరం యేంశయ్యా నీఖేందుకుమోవయ్యా దొంగా<noinclude><references/></noinclude> hxizzcyea7ip1wl53trbgop8p8gk8xk పుట:Sangitarasataran022902mbp.pdf/82 104 212882 555158 2026-04-29T09:30:58Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555158 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>లెవుండా వేంఠయ్యా యియ్యాల యీ మేఖను కుయిక్క మాన్పించా లెననాయేఁ పోపోవయ్యా. బుద్ధు — తమ్ముడా! నేనటువంటివాఁడను కాను. గొల్ల - అదిగో తమ్ముడా అంకూవుంఢావు ఆఁ ఆఁ అదేఁఠయ్యా నీవ్వోడవు నేమోణ్ని నా పెళ్లాము కూడా వత్తాందిగందా మరదలా యిటార అంటావు చరేభాగావుండదిలే. బొద్ధు - వోరీ తమ్ముడా నీభార్య నాకుతోడబుట్టువు గాని మరియొకటికాదు సంశయింపకము యీ మేకను యెక్కడికి దోలుకొని పోయెదవు. గొల్ల — (నవ్వి) ఏంరిబాబూ యిరీ నేంతమ్ముణ్నేంది నా పెళ్లాము తోడబుట్టినదేఁ యేపిచ్చెత్తిందాయేం. విడువు విడువయ్య విడువునుంకేను. బుద్ధు - నేను ప్రపంచములోనుండు స్త్రీలను పురుషులను సహోదరులుగాను కావించి ప్రవర్తించుజోగివాడను అందరు సమానమే మాకిచారమిదే కోపముచేయకుము ఈ మేకను ఎక్కడికి దోలుకుపోయెదవో చెప్పుము. గొల్ల - అట్టచెప్పుబాబూ మరిగల్తేను మారాజుగారు యాగం శాత్తూవుండారు యియ్యేల పచ్చువు పడ్తాగంటారంట అదేందా నాకు తెలియదు ఖాని ముక్కు చేవులు నోరు అన్నీ మూసి చంపుతారు అగ్గిలో బామ్మర్లు గొఱ్ఱులుగొణిగినట్టు గొణుక్కుంటా యేలుస్తారు తర్వాత తలాకాత్తంతా తింటారు. బుద్ధు - ఎంత పాపము! ఎంతపాపము! పోదాముపద రాజుగారికి కోపమువచ్చునే ఘో నేనీమేకను యెత్తుకొనెదలే! {{right|'''(నిష్క్రమణము)'''}} {{rule |6em }} {{Center|{{p|fs125}}చతుర్థరంగము ౼ రాజగృహము</p>}} {{rule |6em }} {{Center|'''బింబిసారు మహారాజు హోమకుండము'''}} {{Center|(ఇద్దరు బ్రాహ్మణులు కుండమువద్ద దూరముగా నొక గొల్లవాఁడు గడ్డముక్రింద కర్రతో}} {{Center|మేకను యెత్తుకొని బుద్ధుడు ప్రవేశము)}} గొల్ల - ఏంతిభాభూ బామ్మనయ్య నేసంవుండారు వక్కెంటికైనా తెల్లగా వుండకూడ దంటారు అట్టే పూరికే యెక్కడనుడితే అక్కడివుంతయ్యా యేంత యిందు<noinclude><references/></noinclude> 4goh8vw216bsd5kjwmp9y8rw2ea77bn పుట:Sangitarasataran022902mbp.pdf/83 104 212883 555159 2026-04-29T09:32:31Z Brjswiki 6801 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కోసమే ఒక నల్లమరకను నల్లమోతుకు చంపాధించానుబాఘా చకనల్లమిల్ల పెట్టిఁది దాన్ని దీస్కొచ్చారు దీనికి యిచ్చేదేంటో యిట్లామె డెయిస్తే మో తాను బాధూ, బ్రాహ్మ—(దగ్గ-కువచ్చి) ఏమిటి...' 555159 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>కోసమే ఒక నల్లమరకను నల్లమోతుకు చంపాధించానుబాఘా చకనల్లమిల్ల పెట్టిఁది దాన్ని దీస్కొచ్చారు దీనికి యిచ్చేదేంటో యిట్లామె డెయిస్తే మో తాను బాధూ, బ్రాహ్మ—(దగ్గ-కువచ్చి) ఏమిటిగా వరహా మామూలు యిప్పిస్తాలే రేపు పోరాదా యేమి ఇప్పుడేమి తొందర. గొల్ల—బాబో యేండయ్యో జోగయ్యచేత్తులు గారు రాలేదుటాయ్యా బాబూ, బాహ్మ—వచ్చినారు యెవ్వరైతేనేమిరా (మెల్లగా) సమంతది, సమంమీదికాదు. గొల్ల— అవుకుమాని భాధూ మామూలు సూడ గాదంటయ్యా నరహా అంశానేమి F కొద్దు భాభూ మి గొల్ల మీద మడ్తుంది పరావద్దు చూడాయిప్పింఛఁడి. బ్రాహ్మ—ఓరి వెర్రివాడ సీకు తెలియదు (మెల్లగా) నీకు మాడి యిప్పిస్తాపో మేకను దింపించు. గొల్ల—జోగులయ్య గారు దింఫండిభాభూ. బుద్ధు — (బింబిసాం మహా రాజు కై చేయిసాచి) మహారాజా ! యీమేక వెందుకు బ్రాహ్మ - -యజారము, బాదు దీని నేమిచే సెదరు. బ్రాహ్మ—వేదోక్త మంత్రములతో హననముచేసి వేల్చెదరు. బుద్ధు— గీః అయ్యయో అన్న లారణయాత్మఁంచు కరుణయమవస్తువున్న గో కలిగెనేని స్వస్త్ర యోజనపరులై స్వర్గముందు పానుమృగల మే& లఁeఁ వడగ; నె పాట, ఫారసీమోస్తరు. *పటుపాపమహా ఈపకుహింసా ఎండయందోస మే తమాసా యిదీయేల యేలు అయ్యాద్యౌరు. కేమి ఆపదఁజేసె చాలాగ మూలూ* జాలి మాలి కూలి జానీ కూలగా పేజీపడా ఈలా నెం సా వంసా మేలగు నా యి దేల<noinclude><references/></noinclude> dvk6rx07jqcpkkug3v817re47s97svs 555165 555159 2026-04-29T11:44:15Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555165 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కోసమే ఒక నల్లమరకను నల్లమోతుకు చంపాధించానుబాఘా చకనల్లమిల్ల పెట్టిఁది దాన్ని దీస్కొచ్చారు దీనికి యిచ్చేదేంటో యిట్లామెడెయిస్తే మోతానుబాభూ. బ్రాహ్మ — (దగ్గరకువచ్చి) ఏమిటిగా వరహా మామూలు యిప్పిస్తాలే రేపు పోరాదా యేమి ఇప్పుడేమితొందర. గొల్ల — బాబో యేంతయ్యో జోగయ్యచేత్తుల్లు౯ గారు రాలేదుటాయ్యా బాబూ. బాహ్మ — వచ్చినారు యెవ్వరైతేనేమిరా (మెల్లగా) సఘంమాది, సఘంమీదికాదు. గొల్ల — అవునుమాని భాభూ మామూలుమాడగాదంటయ్యా వరహా అంటానేమి నా కొద్దుభాభూ మిగొల్లరిమీద మడ్తుంది వరావద్దు మాడాయిప్పించండి. బ్రాహ్మ — ఓరివెర్రివాడ సీకు తెలియదు (మెల్లగా) నీకు మాడాయిప్పిస్తాపో మేకను దింపించు. గొల్ల — జోగులయ్య గారు దింఫండిభాభూ. బుద్ధు — (బింబిసారమహారాజుకై చేయిసాచి) మహారాజా! యీమేక నెందుకు తెప్పించితిరి. బ్రాహ్మ - యజ్ఞార్థము. బుద్దు - దీనినేమిచేసెదరు. బ్రాహ్మ — నేదోక్త మంత్రములతో హననముచేసి నేల్చెదరు. బుద్ధు — {{left margin|5em}}<poem>గీ అయ్యయో అన్న లారణయాత్మఁంచు కరుణయమవస్తువున్న దో కలిగెనేని స్యప్రయోజనపరులై స్వర్గమనుచు సాధుమృగలమేకలంజంపదగునె</poem> </div> {{Center|{{p|fs125}}పాట. ఫారసీమోస్తరు</p>}} {{left margin|5em}}<poem>పాపముపాపముహా ఈపశుహింసా ఎండయందోసమే మీ తమాసా యిదీయేల యేల అయ్యయ్యోమనకేమి ఆపదఁజేసె చాలాగ మూలూగ జాలిమాలితూలి వ్రాలి కూలగా పేలీపడా ఈలా మెం సాదు చంపా మేలగునా యిదేల</poem> </div><noinclude><references/></noinclude> sl7gpu6aidoni5ghhttfx1ufs59qp0l