వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.26 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk రచయిత:దాసు శ్రీరాములు 102 17748 555378 525280 2026-05-03T07:12:39Z Vjsuseela 1850 /* వికీసోర్సులో రచనలు */ 555378 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = దాసు |అసలుపేరు = శ్రీరాములు |పేరు_మొదటి_అక్షరం = ద |పుట్టిన_యేడు = 1846 |గిట్టిన_యేడు = 1908 |వివరణ = తెలుగు కవి, పండితుడు, న్యాయవాది |బొమ్మ= దాసు శ్రీరాములు (page 1 crop).jpg |వికీపీడియా_లంకె = దాసు శ్రీరాములు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= Category: Dasu Sriramulu }} ==రచనలు== వీరి రచనలలో పలు సాంప్రదాయ, అభ్యుదయ కావ్యాలు, పద్య రచనలు, శతకాలు, నాటకాలు ఇంకా కృతులు, జావళీలు, పదాలు, స్వరజితులు, మంగళహారతులు వంటి సంగీత రచనలు ఉన్నాయి. ==వికీసోర్సులో రచనలు== # [[చక్కట్ల దండ]]<ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:Chakkatladanda.pdf</ref>(శతకము 1894లో వ్రాసారు; మొదటి ప్రచురణ 1930లో, 2వ 1984 లో) # [[తెలుగునాడు_అను_ఆంధ్రవీధిలో_బ్రాహ్మణ_ప్రశంస|తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస]]<ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:తెలుగునాడు.pdf</ref>(మొదట ముద్రణ 1899లో ప్రచురితమైంది. 1974లో 6వ ముద్రణ). శ్రీరాములు 1892లో తెలుగు ప్రాంతంలోని వివిధ కులాలు, వర్గాల గురించి వివరించడానికి రాయడం ప్రారంభించారు. మొదటి భాగంలో బ్రాహ్మణ శాఖల గురించి వ్రాసి, మిగిలిన భాగాలు పూర్తి చేయలేకపోయారు). # [[బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు|బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాముల]]ు<ref>https://commons.m.wikimedia.org/wiki/File:బహుముఖ_ప్రజ్ఞాశాలి_మహాకవి_దాసు_శ్రీరాములు.pdf</ref> # శ్రీ భృంగరాజమహిమ, శ్రాద్ధ సంశయ విచ్చేది (1906 లో వ్రాయబడింది మరియు 1989 లో ప్రచురించబడింది).<ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:శ్రీభృంగరాజమహిమ.pdf</ref> - 'భృంగరాజ' (ఎక్లిప్టా ప్రోస్ట్రాటా) గుంటగలగర అను ఔషధ మొక్క లక్షణాలను వివరిస్తూ, ఆయుర్వేద ఔషధం తయారీని వివరిస్తూన్న ఈ చిరుపుస్తకాన్ని సంస్కృతం నుంచి అనువదించారు. దీనిని ఆదినాద సిద్ధుడు నవనాద సిద్ధునకు వివరించాడు. ## [[భృంగరాజ మహిమము|శ్రీ భృంగరాజమహిమము]] ## [[శ్రాద్ధసంశయ విఛ్చేది|శ్రాద్ధ సంశయ విచ్చేది]] # [[సూర్యశతకము (తెలుగు)|సూర్యశతకము]] <ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:శ్రీసూర్య_శతకము.pdf</ref>మొదట 1902లో రెండవ ముద్రణ 1979 లో ప్రచురించబడింది. మయూరకవి మొదట సంస్కృతంలో రచించిన 100 శ్లోకాలతో కూడిన ఈ శతకమును శ్రీరాములు తెలుగులోకి అనువదించారు. # [https://te.wikisource.org/wiki/గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_6/సంచిక_3/దాసు_శ్రీరామపండితులు దాసు శ్రీరామపండితులు] # [[సంగీతరస తరంగిణి]] 1907 (ఈ నాటకాన్ని ఆయన రెండో కుమారుడు దాసు నారాయణరావు అసంపూర్తిగా 3వ అధ్యాయం మధ్య వరకు వ్రాసారు. 1905లో మరణించిన తర్వాత శ్రీరాములు 1907లో పూర్తి చేశారు. దీనిని లైట్ ఆఫ్ ఆసియా నుంచి ఎడ్విన్ ఆర్నాల్డ్ స్వీకరించారు. == ఇతర రచనలు == # అనల్ప జల్పిత కల్ప కల్ప వల్లీ (పత్రిక ప్రచురణ 1880) # అచ్చ తెనుగు అభిజ్ఞాన శాకుంతలము<ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:అభిజ్నానశాకుంతలము.pdf</ref> # అచ్చతెలుగునీతిమాలిక # అభినవ గద్య ప్రబంధము (రచన 1893 ప్రచురణ 1974) <ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:అభినవ_గద్య_ప్రబంధము.PDF</ref>{{small scan link| అభినవ_గద్య_ప్రబంధము.PDF}} # ఆంధ్ర వీధి # ఆంధ్ర వీధీ దర్పణము # అభినయ దర్పణము # ఉత్తర రామ చరిత్రము # కురంగ గౌరీ శంకరము (నాటకము 1981 ప్రచురణ) <ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:Kurangagourishankara.pdf</ref> # కృతులు, పదములు, జావళీలు (స్వరరచనతో). <ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:కృతులుపదములుజావళీలు.pdf</ref> దేవాలయాల్లో నాట్యం ప్రదర్శిస్తున్న దేవదాసీల కోసం శ్రీరాములు అనేక పాదములు, జావళీలు రాశారు. 1991లో కేవలం జావళి, పదములతో కూడిన ఒక పుస్తకాన్ని శ్రీపాద పినాకపాణి గారు వెలువరించారు. ఆ తర్వాత కీర్తనలు, స్వరజితులు, తిల్లానాలు, పదములు జావళీలు, మంగళహారతులు తో సమగ్ర గ్రంథాన్ని సంగీత, నృత్య రూపకాల్లో పండితులు అందించిన స్వరరచనతో 2007లో ప్రచురించారు. {{small scan link|కృతులుపదములుజావళీలు.pdf}} # కృష్ణార్జున సమరము # జానకీ పరిణయం (నాటకము) # తర్క కౌముది అను న్యాయబోధ # త్రిమతములు # దురాచార పిశాచ భంజని<ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:దురాశపిశాచ_భంజని.pdf</ref> దురాచార పిశాచా భంజని (1890); ఆచార నిరుక్తి (1890); మరియు విగ్రహారాధనతారావళి, 27 పద్యాల సంకలనం అను 3 పుస్తకాలు 1991 లో ఒకే పుస్తకంగా ప్రచురించబడ్డాయి. దురాచార పిశాచా భంజని, ఆచార నిరుక్తి అనే గ్రంథాలు ప్రస్తుత సామాజిక దురాచారాలను ఖండిస్తూ రాశారు. విగ్రహారాధన తారావళి విమర్శకులకు ప్రతిస్పందనగా విగ్రహారాధన యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తుంది. # పతిత సంపర్గ ప్రాయశ్చిత్తోపన్యాసము (1891) {{small scan link|Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf}} # పాశ్చాత్య విద్యాప్రశంస # పునర్వివాహ విచారణ # మనోలక్ష్మీ విలాస నాటకము # మహాకవి దాసు శ్రీరాములు గారి కృతులు ఒక సమీక్ష <ref>https://commons.m.wikimedia.org/wiki/File:Dasu_Sreeramulu_gari_Krutulu_Oka_Sameeksha.pdf</ref> # మహాకవి దాసు శ్రీరాములు జయంతి సంచిక<ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:మహాకవిదాసుశ్రీరాములుజయంతిసంచిక.pdf</ref> # మహావీర చరిత్రము # మంజరీ మధుకరీయము # మాలతీ మాధవీయము # మాళవికాగ్ని మిత్రము # ముద్రా రాక్షసము # నమస్కార విధి # నౌకాయానము # రత్నావళి # సాత్రాజితీ విలాసము # స్వరజితులు # [[సంగీతరస తరంగిణి]] 1907 (ఈ నాటకాన్ని ఆయన రెండో కుమారుడు దాసు నారాయణరావు అసంపూర్తిగా 3వ అధ్యాయం మధ్య వరకు వ్రాసారు. 1905లో మరణించిన తర్వాత శ్రీరాములు 1907లో పూర్తి చేశారు. దీనిని లైట్ ఆఫ్ ఆసియా నుంచి ఎడ్విన్ ఆర్నాల్డ్ స్వీకరించారు.<ref>[https://archive.org/details/sangitarasataran022902mbp ఆర్కీవులో సంగీతరస తరంగిణి.]</ref> # లక్షణా విలాసము # వేదాచల మాహాత్మ్యము # వైశ్యధర్మ దీపిక # శ్రీ ఆంధ్ర దేవీభాగవతము <ref>https://te.wikisource.org/wiki/దస్త్రం:శ్రీఆంధ్రదేవీభాగవతము.pdf</ref>- ఈ గ్రంధము సంస్కృతం దేవీ భాగవతమునకు తెలుగు అనువాదం. మొదట 1907 లో ప్రచురించబడినది. రెండవ ముద్రణ 1928లో 3వది 1978లో ప్రచురించబడింది. ముందు సంస్కృతం నుంచి గ్రంధాన్ని అనువదించిన వారు ఇద్దరు పండితులు - ములుగు పాపారాధ్యుడు (18వ శతాబ్దపు కవి), తిరుపతి వేంకట కవులు (1896). 6000 కవితలతో కూడిన ఈ రచన కేవలం అయిదు నెలల్లోనే పూర్తయింది. ఈ దేవీ భాగవతం గ్రంధాన్ని గృహాలలో, దేవాలయాలు, మతపరమైన సమావేశాలలో విస్తృతంగా పఠించబడింది. {{small scan link|శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf}} # శ్రీ అభిజ్ఞాన శాకుంతలం (1898) కాళిదాసు రచించిన సంస్కృత నాటకాన్ని శ్రీరాములు తెలుగులోకి అనువదించారు. బి.ఎ(అండర్ గ్రాడ్యుయేట్) విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ సంస్కృత నాటకాన్ని 20 రోజుల్లోనే తెలుగు భాషలోకి అనువదించారు. == సంగీత రచనలు == ===కీర్తనలు=== <ref name=ss>http://www.sangeetasudha.org/othercomposers/dasusreeramulu.html</ref><ref name=ds>శ్రీరాములు,దాసు (2007). సంగీత నృత్యాభినయానుకూల కృతులు, పదములు-జావళీలు.136పు.హైదరాబాద్,మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి.</ref> # [[ఓ చంద్ర మౌళీ]] # [[కృత కృత్యా]] # [[గణాధిపతి]] # [[జనులార]] # [[జయ జయ విఘ్న]] # [[దేవదేవ రావదేర]] # [[నాదానంద రస]] # [[నీ సరి దైవము]] # [[పరమేశ్వర]] # [[మదారి కులాభంజనం]] # [[మానవతి జ్ణానవతి]] # [[మాయమ్మ మహిషాసుర]] # [[రాధికా మనోహర]] # [[రామ నామ మంత్రం]] # [[రామ నీకు నామీద]] # [[రామా నీ మహిమ]] # [[రావే తల్లి మా యింటికి]] # [[పరమేశ్వర]] # [[పుండరీక]] # [[పురుషోత్తమా]] # [[వామన రూప వందనము]] # [[సంస్మరామి సర్వదా]] ===స్వరజితులు=== # [[కోపమటారా నా పైని]] # [[సామి ఇది గజగామిని రా]] # [[సామి ఏమిరా సరసాన]] # [[సామి రారా సమయమురా]] ===తిల్లానా=== నా మది నెంతో నమ్మితి ===జావళీలు, పదములు=== <ref name=ss/><ref name=ds/> # [[అంత గీర్వాణము - నేనేరరా స్వామి]] # [[అడవి ముష్ణికాయ - అది నీకు ప్రియమాయె]] # [[అప్పటి మాటలకు - దుప్పటిచ్చె గాని]] # [[ఆ నలిన ముఖి - అందమదేమి]] # [[ఇద్దరి పొందేలరా - సామి]] # [[ఇటు రారా]] # [[ఇంత మోహమా సామి]] # [[ఏమని తెల్పుదునే - కోమలి]] # [[ఏమనెనే కోమలీ - తెలుపవే]] # [[కట్టివైతునా పడకింటిలో వాని]] # [[కామాంధకారము - కప్పెనా నీవింత]] # [[కోపమా సామి యేమిర - కోపమా]] # [[చల్లకు వచ్చి ముంత దా - చ నేలనే]] # [[తగు తగులేరా చిన్న - దాన తాళజాలరా]] # [[తత్తర పడనేల - తాళు తాళురా సామి]] # [[తెలియదే తెలియదే - తెలియదే]] # [[దయలేక నీవురాక యున్న - తాళ జాలరా]] # [[నను విడనాడుట - న్యాయమా సామి]] # [[నా నొసటనే పొడిచె - నా యేమిరా]] # [[నా మనోధనము జూరగొన్న వి - న్నాణపు దొంగకు మంగళం]] # [[నా సామి నీకిది - న్యాయమా]] # [[నిలునిలు మటుండుమీ - నాసామి]] # [[నీతోటి మాటలు - నాకేలరా సామి]] # [[నే గననా సామి - నే గననా]] # [[నేను నీదాన నా - మేను నీ దేనురా]] # [[నేనెరుగనా నీజాడ - నాసామి]] # [[పగవారికి నవ్వగ సందే]] # [[పాట బాడెద రార సామి - పరమానందమురా]] # [[పోయి వచ్చెద సామీ - అత్తింటికి]] # [[పోవోయి పోవోయి - పొలతులతో నింత]] # [[భామిని రాగదే]] # [[మగువ నేనెంత]] # [[మాటాడి పొమ్మనవే]] # [[మానవతి]] # [[ముద్దు ముద్దుగ]] # [[మనసిచ్చి నాతో]] # [[మూట లడిగితిన]] # [[ముంజేతి కంకణ]] # [[మనసుదీరెనా]] # [[ముక్కు పచ్చలారని]] # [[రమణి రో సముఖాన]] # [[వగ కాడ]] # [[వద్దు వద్దురా]] # [[వనితరో]] # [[వట్టూ బెట్టెద]] # [[వలచితిరా]] # [[వారి వారి జోలి]] # [[సరి సరి]] ===మంగళ హారతులు=== # [[నవ్వు మొగముతో నన్ను]] # [[నా మనోధనము జూరగొన్న]] ===దరువు=== # [[వచ్చెనడుగో]] (భామాకలాపము) ఈ రచనను ''పద్మభూషణ్ శ్రీమతి స్వప్నసుందరి'' (నాట్యకారిణి, నాట్య గురువు) 19వ శతాబ్దపు మొదట్లో రచింపబడిన వ్రాతప్రతిగా, ఒక శతాబ్దం పాటు ప్రదర్శింపబడిన భామాకలాపముగా గుర్తించారు. ==మూలాలు== [[వర్గం:దాసు శ్రీరాములు రచనలు]] t0fgne8q3kni2zik4fqpxfrv9kf4kw9 సూచిక:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf 106 118989 555375 373810 2026-05-03T05:23:30Z Vjsuseela 1850 555375 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=పతితసంసర్గిప్రాయశ్చిత్త విషయకోపన్యాసము |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:దాసు శ్రీరాములు|దాసు శ్రీరాములు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=హిందూ ప్రెస్ |చిరునామా=మద్రాసు |సంవత్సరం=1891 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist 1="శీర్షిక" 2to4="పీఠిక " 5to7="పీఠిక 1" 8="ఉపోద్ఘా" 9to54="ప్రధమ " 55to65="ద్వితీయ " /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 8o2hdfhpl7lq0vnh6e0w7yhxayeh52e పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/474 104 204104 555341 531379 2026-05-02T12:02:12Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555341 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>బంధకవిత్వమూ, చిత్రకవిత్వమూ, నిమిషకవిత్వమూ, శ్లేషకవిత్వముగా, ఆశుకవిత్వమూ, అవధానకవిత్వమూ - ఇత్యాదిగా విజృంభించాయా వెర్రితలలు. కాని, తిరుపతి వేంకటకవులు, పామరజనాకర్షణ ఆశించి ఆశుకవిత్వానికీ అవధానకవిత్వానికీ వూపిరి పోశారు. జీవితావధికాలే చేసుకున్నారు వారవి. ఇప్పటికీ ప్రచారం అవుతూనే వున్నా యేకొంచెమో అవి, వారి ప్రచారమే హేతు వందుకు. ఆది నా అదృష్టం అని మాత్రమే చెప్పాలి, అవధానాలంటే ప్రాజ్ఞాత వచ్చినప్పణ్ణుంచీ వెగటే నాకు. దీనికి సాయం, రామకృష్ణకవుల మంత్రోపదేశంతో - వీరపూజ రచన పురస్కరించుకుని కూడా, పద్యబంధం మీదే ఆరుచి పుట్టిపోయింది, నాకు. పరప్రత్యయనేయత బొత్తిగా తప్పించుకోలేని దశలో, పోలవరంలో, ఆదిమధ్యం భావనారాయణ స్వామిగారి కిచ్చిన మాట చెల్లించుకోడానికి మాత్రమే శ్రద్ధ పట్టాను తరవాత నేమాత్రమో అష్టావధానం విషయమై. అది చెల్లించుకోనూ చెల్లించుకున్నా నా స్వల్పదీక్షతో, నువ్వా నేనా అన్న సభలో. అప్పటికి మూడేళ్ళయింది ఆ చెల్లించుకునికూడా. సత్యనారాయణశాస్త్రి వెంట బడేదాకా ఆ స్మృతే లేదు నాకు మళ్ళీ. అప్పుడయినా, నుంచున్న పాటున డబ్బు సంపాదించవలసిన అగత్యం యేర్పడివుండకపోతే, అతనెంత బలవంత పెట్టినా నేనంగీకరించి వుండకపోదును. కొనవూపిరితో నైనా, ఎస్.పి.ఏ.ఎల్ నడుస్తూ వుండినా నేనందుకు తలవొగ్గి వుండకపోదును. నిజంగా, అష్టావధానాలు చెయ్యవలసిన అగత్యం యేర్పడ్డం వొక దుర్దశ నా జీవితాని కంతకూ. వచ్చిన పుట్టిమునక యేమిటంటే? ఎటుచూసినా, గాఢాంధకార బంధురం అయిపోయి వుండింది నాస్థితి, అప్పుడు. బయటపడా లందులో నుంచి. స్వభుజా బలంతో బయట పడాలి. మాసాల్లో కాదు, వారాల్లో నూకాదు, రోజుల్లో బయటపడాలి. హరిఃఓ మ్మంటూ కూచుని, పామరులను రంజింపజేసి, ఇవితి శ్రీ అంటూ లేచాటప్పటికే యెంతో కొంత డబ్బు నాచేతికి రప్పించగల శక్తి, నా దగ్గిరవుండిన దల్లా వొక్క అష్టావధాన ప్రక్రియే అయిపోయింది. అసంపూర్తిగా నయినా మరేదీ లేకపోయింది కూడా. కాని, తెలిసివుండిన్నీ - క్షుద్రం అని తానే నిర్ధారణ చేసుకుని వున్న పని చెయ్యడానికి, కేవలమూ డబ్బుకక్కూర్తితో తానే సిద్ధపడ్డం గర్హ్వం కాదూ? అయితే, యెంతోకొంత ప్రతిభ వుండిన్నీ - పరమ దుర్లభం అని తానే యెరిగివుండిన ఐహిక జీవితం తానే భగ్నం చేసుకోడానికి సిద్ధపడ్డం మాత్రం స్తవనీయం అవుతుందా?<noinclude><references/> {{rh|450||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> oatqzy7koudts20ai54ftlz54qa0n1u పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/475 104 204105 555342 531380 2026-05-02T12:05:52Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555342 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>వడిదుడుకు లేర్పడ్డప్పుడు జీవితానికి భంగపాటు తటస్థపడకుండా చూసుకోవడానికే ఆపద్ధర్మాలు. అవి శాశ్వతంగా అవలంబించ తగ్గవి మాత్రం కావు. ఎవరి కయినా - ఎంత అప్రయోజకుడి కయినా - దీర్ఘజీవితంలో గడ్డుదినాలు బహూ పరిమితంగానే వుంటాయి. అవి గడిచిపోతా, యేదోవిధంగా, నిలిచిపోవు. తరవాత, సరి అయిన - తాను వోహో అనిపించుకోతగ్గ - వృత్తి చూసుకోవాలి, బుద్ధి వుండినవాడు, నిదానించి, ఆ స్థితి తటస్థించేదాకా బతికి వుండడానికే ఆపద్ధర్మాలు. అవయినా, యిప్పటి మన నడవడికి బహూ భిన్నంగానే వుంటాయి. అవయినా, ధర్మసాంకర్యం కలక్కుండా వుంచడానికే యేర్పడ్డాయి; గాని విచ్చలవిడిగా సంచరించడానిక్కాదు, ఇప్పటిలాగ. ఏతావతా, - ఐహికం కష్టనిష్ఠురం. దుఃఖబహుళం. యాతనా భూయిష్టమున్నూ. పేదలకేగాదు, సాదలకున్నూ వున్నదే యిది. మనిషి సంపాదించుకోవలసిన మొదటి పరిజ్ఞానం యిది. జీవితం గడిచిన కొద్దీ - అనుభవం పెరిగినకొద్దీ బలపడుతుందిది. బుద్ధి వుంటే తాత్కాలిక విపత్తు చూసుకుని అంత భయపడవలసిన పనిలేదు. మోఘమైన నొకశక్తి యీ బుద్ధి. కష్టాలు రాసి పెట్టిన భగవంతుడే ప్రసాదించిందది. దాని కసాధ్యం లేదు. కష్టాలు సుఖాలుగా మారుస్తుందది. దుఃఖం ఉల్లాసంగా తేల్చేస్తుందది. యాతన సుఖంగా పరిణమింపచేస్తుందది. గర్వం చూపించుకోడం కాదు, ఏ కొంచెమో నాకుందది. అది వుండినందున నాకెంతో ఫలితం కనపడింది, ఎన్నో మాట్లు, నా కప్పటికే. ఒక్కొక్కడి కొక్కొక్క మార్గాన అనుభూతం అవుతుంది. రచనలో కనపడుతోంది నాకు. పెద్దలవల్ల తెలుసుకోవలసిన సుళువు లెన్నో సంపాదించుకున్నాను, స్వబుద్ధితోనూ, స్వయంకృషితోనూ నేను. ఆ రచన మానలేన్నేను. జీవిత పరమావధికం నాకది. నేను చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా, దేశీయు లది గుర్తించినా గుర్తించకపోయినా - నా జాతికి నేనే చెయ్యవలసిన దోహదం కొంత వుంది. రచనే అందుకు సాధనం నాకు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||451}}</noinclude> sqhlig3j4e4ykmpajgunywcjgb8aumy పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/476 104 204106 555343 531388 2026-05-02T12:09:02Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555343 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అది సాగించాలంటే కాలూ చెయ్యీ ఆడాలి, నాకు. అలా ఆడ్డానికి బువ్వకావాలి. కళాజీవి అయినవాడికి బువ్వ ప్రయోజనం అంతే. ఆహార నిద్రాదులు శరీర ధర్మాలు. అవి తప్పవు మనిషికి. కళాజీవికీ తప్పవు, భోగపరాయణుడికీ తప్పవు, విరాగికీ తప్పవు, ప్రతిభాశాలికీ తప్పవు, శుద్ధ మొద్దుకీ తప్పవు. అవి రాజయోగ్యంగా వుండాలనీ కాదు, ఉండకూడదనీ కాదు - ఈ వునికి లేమరికాలు కానేకాదు ప్రధానం. అవి యెలా వున్నా కాలక్షేపం చెయ్యగలడు కళాజీవి. వాటిలోకాదు, అతనికి తృప్తి ఆనందమూను. కళలోనే కనపడతా యతనికవి. కళలోనే అనుభూతాలున్నూ అవుతా యతని కవి. అతని బుద్ధీ, చిత్తవృత్తీ కళావలయంలోనే పరిభ్రమిస్తూ వుంటా యెప్పుడూ. శారీరిక ధర్మాలు వాటిని కలుషితం చెయ్యలేవు. చిత్తవృత్తి నిరోధకశక్తి వుండడం వల్లనే కళాత్మకం అయివుంటుం దతని ప్రవృత్తి. ఆ ప్రవృత్తికి శరీరం ఆలంబం. ఆ శరీరంకోసమే బువ్వ. ఆ బువ్వ అంతస్థు ఏమయినా కావచ్చు, అది మాత్రం ధన సాధ్యం. అందువల్లనే నాకున్నూ ధనతృష్ణ పట్టుకుంది. కళ సాధించుకునే అవస్థలోనే ఆర్జనకున్నూ పాటుపడవలసిన దౌర్భాగ్యం పట్టింది నాకు. నా కేర్పడ్డ దౌర్భాగ్యాల్లో యిదీ పెద్దది. పోనీ అనుకుంటే, అప్పటికప్పుడు నిర్ధారణ చేసుకోవలసి వచ్చిందందు కేదో వొకదారి. ఆక్షణంలో అవలంభించవలసి వచ్చిం దేదో వొక వృత్తిన్ని. కాని నాకేదీ కనపడ్డం లేదప్పటికి. కనపడ్డా నచ్చడం లేదు. నచ్చినా మనస్సు కెక్కడం లేదు. కాక - అప్పుడే కా దిప్పుడున్నూ నాకు బువ్వ పెట్టడం లేదు, రచన. నాకే కాదు, తాదాత్మ్యం అనుభవించగల యే తెలుగు రచయితకూ పెట్టడం లేదది. మరిగతి? మరి, యీ శరీరం సుష్టుగా ప్రవర్తించి కరచరణా లాడ్డానికి ఉపాయం? ఈ నిరాలంబస్థితిలో - ఈ గవేషణలో - నా దృష్టిపథానికి తెచ్చాడు. సత్యనారాయణశాస్త్రి, అష్టావధానం. “సరే” అనేశాన్నేను.<noinclude><references/> {{rh|452||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> qu0qekhiwqsqut4r1n50d4whimunqxd పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/477 104 204107 555344 531389 2026-05-02T12:12:45Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555344 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇష్టాపూర్తిగా కాదు, బాధపడుతూ అనేశాను. నన్ను నేనే తిట్టుకుంటూ - నా సంచితాన్ని నిందించుకుంటూ - అంగీకరించాను. అయితే, వొక్కటి మాత్రం చెప్పుకోవాలిక్కడ. పోలవరంలో వొకమాటు చేసివుండడం వల్ల - అక్కడ హోహో అనిపించుకునిన్నీ వుండడం వల్ల - దిలాసాగానే అంగీకరించా నతని ప్రతిపాదన. ఓనమాలు దిద్దుకోవలసిన అగత్యం లేకపోయింది, నాకందులో. నిద్రాహారాలు మరిచి సాధనచేసుకోవలసిన దుర్గతికూడా లేకపోయింది. ఒక్క దూకున సభకి - సభలోకి - వెళ్ళ వచ్చు, నిస్సంకోచంగా కూచో వచ్చు ధీమాగానే ప్రారంభించనే వచ్చు అవధానం. ఇదీ, అప్పటి. కీడులో నాకొక మేలు. {{c|<big><big>4</big></big>}} పోలవం అష్టావధానం జ్ఞాపకం వస్తే నా కిప్పటికీ పులకలు పేటెత్తుతాయి. ఆసన్నివేశం అనుభూతం అవుతున్నట్టుంటుంది, కళ్ళక్కట్టినట్టున్నూ వుంటుందా పరిస్థితి. శాలువు కప్పుకుని, సభలో నిటాగ్గానుంచుని, పృచ్ఛకులకేసి చూస్తూ "ఏమికావాలి మీకు?" అని అడుగుతున్నట్టున్నూ వుంటుంది. ఏ వొక రిద్దరో అప్పటికే అపరిచితులై వుండినవారు తప్ప, తతిమ్మా పృచ్ఛకులందరూ పడగొట్టాలన్న స్వర్థతో కసిగా చూస్తున్నట్టుకూడా వుంటుంది. ఒక నిర్దేశం లేదు, వొక సూచనలేదు, వొక ప్రయత్నం లేదు, వొక ఆలోచనలేదు, చూసినంత సేపూ వొక వినోదం చూశాను, కళ్ళనిండా - అప్పటి కప్పుడొక అగ్నిపరీక్షకు సిద్ధపడ్డాను, సర్వమూ మరిచి. జరిగిం దేమిటంటే? "ఇదిగో, నేను తయారయి వచ్చాను మరి, సభ చేయించం"డంటూ వెళ్ళి యెదట నుంచునేటప్పటికి చకితులయిపోయారు, భావనారాయణస్వామిగారు. అప్పటిదాకా ఆజ్ఞాపకమేలేదు వారికి. అప్పుడయినా "అప్పుడలా యెందుకన్నాము ?" అంటూ బాగా పశ్చాత్తాపపడు తున్నట్టుంది, వారివాలకం. అది యేమయినా, వారప్పుడు నన్నలా రెచ్చకొట్టి వుండక పోతే నా జీవితంలో అష్టావధాన ప్రసక్తే రాకపోయి వుండును. దానికోసం కొంత సాధనా చేసుకుని వుండకపోదును, అందు కోసం ప్రత్యేకించి పోలవరమూ వెళ్ళి వుండకపోదున్నేను. మరి, వారు సభ చేయించకపోతే? నా వుత్సాహం గాఢంగా దెబ్బతింటుంది. కొన్నాళ్ళయినా చాలా బాధ పడతాన్నేను. ఇది గుర్తించుకున్నారు వారు, మరి, కాదనలేకపోయారు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||453}}</noinclude> 976dlv5o2v4gmzgjj0np76cwv7jo5bc పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/478 104 204108 555347 531390 2026-05-02T12:17:11Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555347 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"ఏదో మాటవరసకంటే అదే పట్టుక్కూచ్చున్నా వేమిటయ్యా?" అంటూ యిటు తిరిగి నిన్నే నెపపెట్టవచ్చువారు. అలా తప్పించుకునేవారు - ఎదురు దెబ్బతీసేవారు చాలా మందే వున్నారు, లోకంలో. మానమూ అభిమానమూ చాలా తేలిక వస్తువులు వారి దృష్టిలో. మరి, వారి జన్మలు? ఇది చూసుకోరు వారు. భావనారాయణస్వామిగారు మాత్రం తమ మాట నిలబెట్టుకోడానికే పూనుకున్నారు. సహజంగా మితభాషులు వారు. మొగమాటం చాలా యెక్కువ, వారికి. మితభాషులయినవారు నలుగురితోనూ ధారాళంగా కలిసి తిరుగలేరు. ముందుకిన్నీ రారు దేనికీ. కలగా చేసుకో రెందుకూ. అక్కడికీ వొక పూటల్లా కిందా మీదా పడ్డారు వారు, తమలోతాము. చివరికి, డిప్యూటీ తహసీలుదారు దగ్గరికి తీసుకువెళ్ళారు, సాహసించి నన్ను. అది మన్యప్రాంతం కావడం వల్ల జనసంఖ్యా తక్కువే. అక్కడ, రామచంద్రపురం తాలూకా లాగ తెనుగు మీరి పోయిన ప్రాంతం కాదుకనక, వ్యవహారాలూ తక్కువే. కాగా, తహసీలుదారు, జిల్లామున్సబూ, సబ్ మేజిస్ట్రేటూ - ఈ ముగ్గురి విధులూనిర్వహించడం వొకరే. అప్పుడక్కడ ఆపదవుల్లో వుండినవారు పోతుల లక్ష్మీనరసయ్య నాయడుగారు. అష్టావధానం యెప్పుడూ చూడలేదు, ట, వారు, చూడాలని మాత్రం చాలా వుంది, ట, చాలా కాలంగా. ఇట్లు సరదా - అటు భావనారాయణస్వామిగారి ప్రోత్సాహం - దీంతో, సభ చేయించే బాధ్యత తాము వహించారు నాయడుగారు. రుచిగల విషయం అయితే, పలుకుబడి వుండినచోట, కర్తృత్వమూ కారయితృత్వమూ తప్పించుకోలేరు, రసికులైన వారు. ఇది యిలా పరిష్కారం కావడంతోనే, రెబ్బాప్రగడ పాపయ్యగారి దగ్గరికిన్నీ తీసుకువెళ్ళారు నన్ను, భావనారాయణస్వామిగారు. పాపయ్యగారు, అక్కడి ఎస్టేటు మానేజరు. భావనారాయణస్వామిగారి శక్తిసామర్థ్యాలు - ముఖ్యంగా, వారి సాహిత్యకృషీ, జాతకాలు చెప్పే వైదుష్యమూ బాగా తెలిసి వుండినవారుకనక, వారికి ప్రీతి పాత్రుణ్ణయి వుండడం వల్ల నేనూ సమర్థుణ్ణే అయివుంటానని భావించుకున్నారు పాపయ్యగారు. పండితులన్నా కవులన్నా వారికీ చాలా ఆదరమే. దాంతో, నాయడుగారితోపాటు, వారున్నూ బాగా శ్రద్ధ పెట్టారు సభవిషయమై.<noinclude><references/> {{rh|454||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> 6efn7v2r1rpbwqsuru6vhic75xf3sy5 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/479 104 204109 555348 531391 2026-05-02T12:21:07Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555348 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>జమీందారు, రాజా, శ్రీ కొచ్చర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావుగారు, పోలవరం విడిచి, యెప్పుడో కాకినాడలో మకాం పెట్టుకుని వుండినారు. అంచేత, అక్కడి జనులకు పాపయ్యగారే జమీందారన్న ఆదరగౌరవాలు. “ఫలానా విద్య తమకు తెలుసునా తెలియదా - అధవా - దానిమీద తమకు ప్రీతి వుందాలేదా" అని కాదు ప్రశ్న, విద్య యేదయినా అది పోషించడమే జమీందారు బాధ్యత. జమీందారంటే, తెనుగు దేశానికంటే సంబంధించినంత వరకూ మహారాజనే నిర్వచనం. సర్వతంత్ర స్వతంత్రమైన ప్రభుత్వం, ఇక్కడ. బహువచనం మీదే వుండేది, ఆదిలో. కాని, శతాబ్దులకిందే అంతరించిపోయింది. ఢిల్లీలో పాదుషాలూ, గోల్కొండ హైదరాబాదుల్లో నవాబులూ స్వతంత్ర ప్రభువులయి వుండినంతకాలమూ తెలుగు దేశంలోనూ వుండేవారు ప్రభువులు. ఆంగ్లేయు లిక్కడ స్థిరపడ్డంతో చాపచిరిగి చదర అయిపోయింది. మహారాజు లంతరించారు, జమీందార్లే వెలిశారందరూ. సామంతు లనిపించుకోడానికిన్నీ అర్హతలేనివారు జమీందార్లంటే. యోధులను గుమాస్తాగిరికి మప్పింది ఆంగ్లప్రభుత్వం, ప్రభువులను జీరాయితీ దార్లుగానూ రూపొందించింది. అయినా, అనువంశికాలైన లక్షణాలు నిలుపుకున్నారు, జమీందార్లు కొంతవరకూ. అంచేత, ప్రభువుల లక్షణాలు మనకూ పరిచితాలే కొంత వరకూ. రాజులు కాకపోయినా, తెనుగుదేశంలో, యిటీవల వారే "రాజా"లు కనక, జమీందార్లున్నూ తమ విధులు నిర్వర్తించుకున్నారు, కొంతవరకూ. ఇంత, - ప్రీతి వైయక్తికం. విద్యలు సార్వజనీనాలు. వాటి ప్రయోజనం, ముఖ్యంగా, జనులకు. కనకనే వాటి పోషణభారం ప్రభువుది. ఈ పరిజ్ఞానం వుండాలి, మనిషికి. అధికారమూ వుండాలి. ప్రభువు లక్షణాలివి. జనులను తమ అదుపాజ్ఞల్లో వుంచుకుంటూ, వారి కష్టార్జితం కొంత, పన్నులపేరిట నిర్బంధంగా వసూలు చెయ్యాలి, ప్రభువు. సుఖ సౌభాగ్యాలు కలిగించి, ఆ జనులను రంజింపనూ చెయ్యాలి. ఇది తప్పనివాడే మహారాజు. తప్పాడూ, మరి, తరాజే. అంచేత, పోలవరంలో జరిగే యే కార్యక్రమంలో నయినా, జమీందారుకి బాధ్యత వుందంటే, వారికి ప్రతినిధులు కనక, పాపయ్యగారే అవి నిర్వర్తించేవారు. చాలామట్టుకి, స్వతంత్రంగానే నిర్వహించే వారది.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||455}}</noinclude> s5j8itxtivxu1sfj64mz7csw3sfleil పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/481 104 204111 555350 531398 2026-05-02T12:29:30Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555350 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఎంతటికూడ్డానికయినా వారం పద్దినాలయినా పడుతుంది మరి, చూసుకోండి" అన్నారు. తుళ్ళి పడ్డా న్నేను. కాని, నిజమే, నాకోసం మళ్ళీ అంతటి సభ కూడ్డం అసంభవమే, వెంటనే. "సరే" అనేశాను. ఆలోచించుకోడానికే అవకాశంలేదు; గాని అగత్యమూ లేదు, నిజానికి. ఏ విషయమై అయినా, శక్తిసామర్థ్యాలకంటే ధైర్యసాహసాలెక్కువ నాకు నచ్చిన సందర్భంలో. కాకపోయినా, అంతా అప్పటిపరిస్థితులనుసరించి జరగవలసిందే; గాని తయారు కావడానికీ, జాగ్రత్తపడ్డానికీ యేమీలేదు, అష్టావధానానికి. ఉపాసన అనీ, మరేమిటేమిటో అనీ పెద్దకబుర్లు చెబుతారు కొందరు; కాని, అదంతా భేషజమూ నటనాను. కాక, - నాకొక మంచి అవకాశంకూడా కనపడింది, అప్పుడే నేనందుకు సిద్ధపడ్డంలో. వచ్చి వున్నవారిలోనే కొందరు సిద్ధపడతారు పృచ్ఛకులుగా, అప్పటి కప్పుడు. ఈ విషయమే తెలిసివుండదు వారి కంతకి ముందు. కుమ్మక్కు చేసుకుని వచ్చినవారుండరు, వారిలో వొక్కరూ గూడా. నా ప్రత్యుత్తరాల్లాగే వారి పృచ్చలున్నూ ఆశువులయి వుంటాయి. ఇది గుర్తించిన్నీ సిద్ధపడ్డాన్నేను. "అయిదు నిమిషాల్లో యీ కార్యక్రమం ముగిసిపోతుంది. తరవాత, శ్రీ వెంకటరామకృష్ణ శిష్యులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఇక్కడే - ఇప్పుడే అష్టావధానం చేస్తారు" అని ప్రకటించారు నాయడుగారు, వెంటనే. సభ అంతా ఉత్సాహోదగ్రం అయింది. ఒక్కరూ కదల్లేదు, అందరూ సావధానులయినారు. అనుకున్నవేళకి వార్షికోత్సవం ముగిసింది, అన్నవేళకి నా అవధానం ప్రారంభం అయింది. ఆ కార్యక్రమం ప్రెసిడెంటే, యీ కార్యక్రమానికిన్నీ ప్రెసిడెంటు. “నే” నంటే “నే”నంటూ పృచ్ఛకులుగా తయారైనారు, కొందరు. పెద్దలే సిద్ధపడ్డారు, కుర్రలు కారు. అయితే, నా అష్టావధాన ప్రక్రియలో వొక్కరికే - వొక్క పద్యమే చెప్పడం ఏక కాలాన, ఎనిమిదిపనులు - బాగా జాగ్రత్తపడవలసినవి - భంగపడకుండా నెరవేర్చడమే అష్టావధానం అంటే, ఎనమండుగురికి పద్యాలు చెప్పడం కాదు. పనులెనిమిది, పృచ్ఛకులున్నూ ఎనమండుగురు. నా గురువులు రామకృష్ణకవుల సంప్రదాయం యిది. పద్యాలుచెప్పడం వొక్కరికే కాదంటే, యెనమండుగురి కన్న నిర్ణయంమాత్రం యేమిటి? పద్యా లెనమండుగురికి చెప్పడం అయితే, అది, పంచదశావధానం అవుతుందిగాని, అష్టావధానమే కాదసలు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||457}}</noinclude> r2pqkrukaqqudhb8swkf2a9iz2bfsnf పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/482 104 204112 555351 531400 2026-05-02T12:34:39Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555351 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"వల్లకా"దంటూ వితండవాదానికి సిద్ధపడ్డారు మొదట కొందరు; కాని, నేను బదులు చెప్పవలసిన అగత్యం లేకుండానే అది పరిష్కారం అయిపోయింది. దీంతో, పృచ్ఛకులుగా సిద్ధపడ్డవారిని వడబొయ్యవలసి వచ్చింది. కాగా, పృచ్ఛకులుగా నిర్ధారణ కాగలిగినవారందరూ, పెద్దలూ, మెరికల్లాంటివారూ కావడం తటస్థపడింది. ఒక విధంగా అపాయకరమూ, మరోవిధంగా గౌరవావహమున్నూ యిది. సమర్థులయిన వారిని తృప్తిపరచడమే తృప్తిపరచడం, మరి. వెంటనే, పృచ్ఛకులు చుట్టూ కూచున్నారు, కుర్చీలమీద, నా కటూ ఇటూ. సబ్‌కోర్టు శిరద్దారు సమస్య యిచ్చారు, శార్దూల విక్రీడితంలో. గాదె దాసన్న పంతులుగారు (స్కూళ్ళ యినస్పెక్టరు) లోకాభిరామాయణాని క్కూచున్నారూ "శాస్త్రిగారూ, ప్రారంభిస్తామా” అనడుగుతూ. భావనారాయణస్వామిగారు దశావతారాల పేళ్ళు చెప్పమన్నారు కందంలో, వరస తప్పకుండా. ఎస్టేటు గుమాస్తా వొకాయన (పాపయ్యగారి నామినీ) గంటలకు బదులు కూతల క్కూచున్నారు, సైకిలు బూరా చేత బుచ్చుకుని. నాయడుగారు పురాణం చెప్పమంటూ కూచున్నారు, భాగవతం తెరుచుకుని. మేఘ సందేశం పాడ్డానిక్కూచున్నా డొక వకీలు విద్యార్థి. ఆచంట వెంకటరావుగారు (మా సోమప్ప ప్లీడరు) చదరంగం బలం సద్దుకూచున్నారు, ఎత్తు వెయ్యడానికి సిద్ధంగా. "నేనివ్వవచ్చా?” అనడుగుతూ అధ్యక్షులు సిద్ధపడ్డారు, వ్యస్తాక్షరికి. {{c|<big><big>5</big></big>}} కార్యకారణ సంబంధాలు పురస్కరించుకుని, భావనారాయణ స్వామిగారిమీదా, నాయడుగారిమీదా, పాపయ్యగారిమీద వొక్కొక్క పద్యం కట్టుకుని వున్నా నదివరకే నేను, ఆశువుగా అల్లుతున్నట్టుగా నటించలేదు. ప్రెసిడెంటుమీద మాత్రం అప్పటి కప్పుడు కట్టాను, - క. అష్టావధానమను। నుత్కృష్టక్రియ చూడనేగుదెంచిన ఘనుడీ మిస్టర్. జి.యల్.డి. క్రూజ్ హృష్టుండగునట్టు లిప్పుడే నొనరింతున్ అని. తనపేరు రావడం - అదిన్నీ సంగీతంలో రావడం - ఇది గుర్తించి చకితుడై, నాయడుగారి నడిగి సంగతి తెలుసుకుని తల పంకించుకున్నాడు, దొర. పద్యాలు పూర్తిచేసి నా సంగతి చెప్పుకున్నాను, ముందు. నా పూనిక హేతువున్నూ చెప్పుకున్నాను, తరువాత. "డబ్బుకోసం కాదు. భావనారాయణస్వామిగారి ఆజ్ఞ శిరసావహించడానికి మాత్రమే వచ్చా”నన్నాను చివరికి. నిర్దాక్షిణ్యంగా నమ్ముకున్నారు పృచ్ఛకులు వెంటనే, స్త్రీలూ పురుషులూ ఆబగా చూడసాగారు.<noinclude><references/> {{rh|458||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> lyck6unqizbph9t385xvnyslk1eu7a4 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/483 104 204113 555352 531401 2026-05-02T12:39:31Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555352 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>దాసన్న పంతులుగా రసలే వసపోసిన పిట్ట. సంవత్సరం నరగా మాకిద్దరికీ బాగా పరిచయం. అయినా, మొగమాటం దూరంగా పెట్టి, బహూ విషమంగా ప్రారంభించారు, వారు, సంభాషణ. మరో పృచ్ఛకునితో నేను వ్యవహరించాటప్పుడు “చూడండీ” అంటూ నా చెయ్యి పట్టుకుని లాగిన్నీ ప్రశ్నలవర్షం కురిపించసాగారు నామీద. ఆచంట వెంకటరావుగారున్నూ, నేను తమ దగ్గరికి వచ్చాటప్పటికి బింతువులు మార్చేసుక్కూచునేవారు, తమ కనుకూలంగా. ప్రెసిడెంటు సూచనమీద ఎన్నో మాట్లు మెల్లిగా వూదాడు బూరా, ఎస్టేటు గుమాస్తా. "స్త్రీణా మాద్యం ప్రణయవచనం విభ్రమోహిప్రియేషు" అన్నచోట బాగా వివరించి చెప్పమంటూ కూచున్నాడు, వకీలు విద్యార్థి. ఇంగ్లీషు పద్యం యిచ్చాడు వ్యస్తాక్షరి, వొక్కొక్క అక్షరమే విడివిడిగానూ, క్రమం తప్పించిన్ని. ఆదే నా మొదటి అవధానం. "అహమస్మి" అంటూ అంతమంది పెద్దమనుష్యులున్న సభలో, నిటాగ్గా నుంచోడమున్నూ అదే మొదటి మాటు, నాకు. మొదట కొంచెం జంకాను; కాని పావుగంట గడిచాటప్పటిక్కొంచెం దౌర్త్యం అవలంబించాను. భావనారాయణ స్వామిగారూ, దాసన్నపంతులుగారూ చకితులయి పోయారది చూసి. పురాణం చెప్పడంలో, అవ్యక్తుడన్న విశేషణం వచ్చింది భాగవంతున కొకచోట. “అంటే, తెలివితక్కువ వాడని కాదూ?" అంటూ యెదురు వాదం ప్రారంభించారు నాయడుగారు. "తెలియనివా"డన్నాను ద్వ్యర్థిగానేను, కావాలని. "అంటే, అజ్ఞాని అనే కాదూ?" అంటూ రెట్టించారు నాయుడుగారు. "బాగా తెనిగించి చెప్పాలంటే, నాకూ మీకూ, మరెవరికిన్నీ కూడా యెంతమాత్రమూ తెలియనివా"డన్నాను, చివరికి నేను. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా కరతాళధ్వనులతో ముఖరితం అయిపోతూ వచ్చింది, సభ అంతా. "స్త్రీణా మాద్యం-" అంటూ మళ్ళీ రెట్టించాడు వకీలు విద్యార్థి. వయస్సుకి చాలా చిన్నవాడాయన. వాలకం చూస్తే రంగేళీ పురుషు డన్నట్లున్నాడు. ధోరణి చూడగా సూచనచేస్తే గుర్తించలేని వాడన్నటున్నూవున్నాడు. అయితే, రెండువందలకు తక్కువగాలేరు, స్త్రీ లక్కడ. పిల్లలకంటే పెద్దలే యెక్కువగా వున్నారు వారిలో.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||459}}</noinclude> 63zy6z616j4yjdp2kb2ob5230uxn38o పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/484 104 204114 555353 531403 2026-05-02T12:44:14Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555353 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అందరు పురుషుల్లో నే శృంగారవిషయాలు వివరించడం అసభ్యం అనిపించు కుంటుందసలు. కాని యీ బిడియం వున్నట్టు లేదాయనకు. "వద్దువ"ద్దన్నారు భావనారాయణప్వొమిగారు. “తప్పుత"ప్పన్నారు పాపయ్యగారు, చిరాగ్గా. నాయడుగారు చాలా గట్టిగా అక్షేపించారు, చల్లచల్లగా. దాంతో వొదిలి పోయిందా బెడద. అవధానం కూడా పూర్తయింది. ఒక్కగంటా, ముప్ఫయి నిమిషాలు పట్టిందందుకు. నాకంటే సభ్యులూ, సభ్యులకంటే నేమా మహోత్సాహ తరంగాలమీద వూగిపోయాం. మాటి మాటికీ "సెబాసు"లు ప్రతిధ్వనించాయి. "అన్‌పాదమ్డు కేప్సుబేర్ ఫుల్ యే జెమ్ ఆఫ్ ఫ్యూరెస్టురే” ఇత్యాదిగా వ్యస్తాక్షరి వొప్పగించాను మొదట. చాలా వింతపడి, మిక్కిలి ఆనందించి, థాంక్సు చెబుతూ లేచి, ప్రీతిగా - ఉద్రేకంతో షేక్‌హాం డిచ్చాడు దొర. మెల్లిగా కూసినవీ, గట్టిగా కూసినవీ బూరా కూతల కూడా వివరంగా చెప్పినప్పుడు కరతాళ ధ్వనులకున్నూ పూనుకున్నాడాయన. తక్కిన పృచ్ఛకులున్నూ తమ గాఢ సంతృప్తి వెల్లడించారు. సభ్యులందరూ చాలా ఆనందించారు. నేను కృతజ్ఞత చెప్పుకున్నాను, చివరికి. నాయడుగారు లేచారు వెంటనే. “శాస్త్రిగారు తమ ప్రజ్ఞ చూపించారు. మనం మన రసికత చూపించుకోవాలిప్పుడు. వారికొక బంగారుమెడ లివ్వడం మనకు మర్యాదగా వుంటుందనుకుంటున్నాం మేము. దొరగారు మొదటే పది రూపాయలిచ్చారు. మనమున్నూ యెవరికి తోచింది వారు - తోచినంతే - తోస్తేనే యిద్దాం. నిర్బంధం లేదు. ఇప్పుడే యిద్దాం, కనీసం, రేపు సాయంత్రాని కయినా నాకందాలి" అన్నారు. అంటూనే పర్సుతీశారు, తామున్ను. పాపయ్యగారూ తీశారు, వెంటనే. ఎవరెవరో కూడా తీశారు. అప్పటికప్పుడు - అక్కడికక్కడ - యెనభై రూపాయలకు పైగా వసూలయినాయి. మర్నాటి సాయంత్రానికి మరికొంత చేరింది. ఒక జామారుకొని, తులంనర బంగారంతో ఆ వూళ్లోనే మెడలు చేయించి, మరోరెండు రోజులకు అదీ అదీ పాపయ్య గారిచేత నాకు బహూకరింపించారు. నాయడుగారు, తమ యింటనే చిన్న సమావేశం జరిగించి. చెయ్యిపట్టుకుని స్టీమరుదాకా వచ్చి, టిక్కట్టు తామే కొని, పొదివిపట్టుకుని స్టీమరెక్కించి, నన్ను కేబినులో కూచోపెట్టి, నా రెండు చేతులూ పట్టుకుని<noinclude><references/> {{rh|460||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> brrxahrzrzie5ihkg1cikgeb064jhzr పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/485 104 204115 555354 531406 2026-05-02T12:47:50Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555354 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"మిమ్మల్ని కష్టపెట్టాన్నేను. మీరు మాత్రం నన్నానంద పెట్టారు" అని ప్రశంసించి, ప్రీతిగా సాగనంపారు నన్ను, భావనారాయణస్వామి గారు. మా అమ్మగారూ మా సీతా సరేసరి, ఆ మెడలు తిప్పి తిప్పి చూసి, మళ్ళీ మళ్లీ ఉజ్జాయింపుగా తూకం కట్టి, చాలా చాలా ఆనందించారు మా నాయనగారున్ను, చాలా సేపు. కవిత్వం పరంగా నన్ను గుర్తించడమూ, తామానందించడమూ అదే మొదటి మాటు మా నాయనగారికి. {{c|<big><big>6</big></big>}} ఈ అనుభవం పునాదిగా, చాలా ధైర్యంగానే అంగీకరించాను, సత్యనారాయణశాస్త్రి ప్రతిపాదన. శ్రద్ధా పట్టాను, వెంటనే. శ్రద్ధ పెట్టానంటే, నేత్రావధాన ప్రక్రియ నేర్చుకోడానికే, అష్టావధానం విషయమై నేను కొత్తగా చెయ్యవలసిన సాధన యేమీ లేదు. కాగా, వెంటనే నేత్రావధానం గుర్తులు రాసి యిచ్చి వొక రోజల్లా నా చేత సాధన చేయించా డతను, దగ్గిర వుండి. దేవనాగరి అక్షరాలు గుర్తించడమూ, ధారాళమైన వాచక శక్తి సంపాదించడమూ రెండు దినాల్లో జరిగిపోయాయి నాకు, చిన్నప్పుడు. నేత్రావధాన ప్రక్రియకూడా రెండు రోజుల్లోనే బాగా స్వాధీనం అయిపోయింది నాకు. వేగమున్నూ వచ్చేసింది అతనితో సమానంగా. తెనుగుభాషకూ సంస్కృతభాషకూ యెన్ని కావాలో అన్నీ వున్నాయి, నేత్రావధానానికిన్నీ అక్షరాలు. కాని, కళ్ళతో చూపించడానికే గాని, కలంతో రాయడానికి వీలుపడవు, గుణింతం సంకేతాలు. కాక జంటకొక విధంగా వుంటాయా అక్షరం గుర్తులు కూడా. కనక, అది వొక లిపిగా వుపయోగపడదు. అది యెంత క్షుద్రప్రక్రియా, దాని గుర్తులూ అలాంటివే వొక సూత్రాని కందిరావు. ఏమయినా, నా కళ్ళక్కొంచెం బాధ కలగడమూ, దానికదే తగ్గిపోవడమూ కూడా జరిగిపోయిందా రెండు దినాల్లోనూ. విద్య మాత్రం మిగిలింది. విద్య అన్నందుకు మన్నించాలి, అడుక్కోడానికి బయలుదేరి, నడివీధిలో దొర్లుకుంటూ వీధులకు వీధులు దాటేస్తారు ముష్టివా ళ్ళదీ అలాంటి విద్యే. పరమక్షుద్రం అనే నా నమ్మకం యిప్పటికీ. అయితే, ద్వంద్వభూయిష్టం అయిన ఐహిక జీవితం నడుపు కోవాలంటే -సంఘర్షణాత్మకమైన సంఘంలో బతకాలంటే - నేల బారుగా వుండినంతకాలమూ<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||461}}</noinclude> 8bvus0v4ytlswcqjmfvs0k0mhr6xjyr పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/486 104 204116 555389 531411 2026-05-03T11:53:51Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555389 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అలాంటి క్షుద్రసాధనాలు కొన్ని ఆగత్యం అవుతూనే వుంటాయి, మనిషికి. సత్యనారాయణశాస్త్రి, చెప్పినట్టు, రసికులయిన వారికంటే, వినోదాలతో ఉబ్బి తబ్బిబ్బు లయిపోయేవారే యెక్కువ, లోకంలో. అసలు, లోకం అంటేనేవారు. లోక సామాన్యధర్మం అన్నది. వారినిబట్టే - వారికోసమే పుట్టింది కూడా. హృదయం స్పందించిందా, ఎంతెంత ఆదరగౌరవాలున్నూ చూపిస్తారు, రసికులు. కానుకలున్నూ యిస్తారు, వోపిన మట్టుకి. ఏమీ యివ్వలేకపోతే బాధయినా పడతారు, తమ భాగధేయం తిట్టుకుంటూ. వో-ట్ఠి వినోద ప్రియులకు వుంటుంది హృదయం, శరీర ధర్మానికి మాత్రమే దాని ప్రయోజనం. అది కరగదు, చలించదు. మస్తిష్కం మాత్రం వొక్క పొంగు పొంగుతుంది వినోదాలు చూసినప్పుడు, వారికి. ఆ పొంగుతోనే యెంతో కొంత డబ్బు విదువుతారువారు, ఆ విశేషానికింతా, యీ విశేషానికింతా అంటూ విభాగాలు చేసుకుంటూ. వాటిలో కొన్ని విశేషాలకు "సీత్ సొయింపాకమైనా” యివ్వరువారు. మళ్ళీ, ఆ స్మృతి అయినా వుండదు వారికిచ్చినా, వెళ్ళిపోతారు చేతులు దులుపుకుంటూ. హృదయానికి బదులు వారి డబ్బుకి మాత్రమే చలనం కలిగిస్తాయి, వినోదాలు. అదయిపోయింది, మరి, తరవాత? “పునరపి మరణం, పునరపి జననం-" అలాంటి వారిని గురించి చెప్పిందే యీ మాట. ఈ విధంగా, ఆ విద్యలు చూపించేవారికి డబ్బు అవసరమూ తీరుతుంది, ఏ కొంచెమో? కాని, మళ్ళీ, అదే ప్రశ్న. "అదే పరాయణమా మనిషి జీవితానికి?” ఏదో కారణంతో - ఏదో విధంగా - చేతులు మారుతూనే వుంటుంది డబ్బు. అసలు, ఆ చేతులు మారడంలో వుంది, దానికి విలవ. ఇనప్పెట్టిలో మూలుగుతున్నంతసేపూ డబ్బూ, మేటిలో అణగివున్న గడ్డిపరకా సమానమే. నదులు నిండడం కాదు ప్రధానం, సుపరిష్కృత మార్గాల్లో ప్రవహించాలవి. అలా జరిగినప్పుడే వాటికి విలవ. అలాగే, డబ్బున్నూ ప్రయాణాలు చేస్తేనే - యుక్తరీతిగా చేతులు మారితేనే లోకప్రవృత్తి. ఉదారుడైనవాడే గుర్తించ గలడిది. కనక, రిక్తుడే అయినా ఉదారుడు, జన్మకి సాఫల్యం సంఘటించుకోగలడు, ధనికుడైనా లోభికది సాధ్యం కాదు.<noinclude><references/> {{rh|462||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> 8efqhdn6kowkzvgj78o2di8viqa8mu9 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/487 104 204117 555390 531412 2026-05-03T11:56:10Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555390 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>లోభులు, కళ్ళతో గూడా చూసుకోలేరు డబ్బు, మనస్సెక్కడ చలించిపోతుందో అని. మూటమీద మూట కట్టడంలోనే వాడి పరాకాష్ఠ. అయితే, చూడకా తినకా కూడా ఆ లోభులు కూడబెట్టిన అ డబ్బుకున్నూ కాళ్ళు వస్తాయి, క్షణంలో, వాళ్ళ పారం పండాలి, అంతే. వినోదా లాశించేవారున్నూ ధన్యులే వొక విధంగా లోభుల కంటే - ఎందుకో వొకందుకు - ఎప్పుడో వొకప్పుడు - ఎంతో కొంత - లోభుల పరిభాషలో - వారున్నూ డబ్బు "తగలేస్తారు" కనక. కాని లోభులతో తారతమ్య పరీక్ష వచ్చినప్పుడే వారి త్యాగానికి పరిగణన - విద్యల ప్రస్తావనా, జాతి వికాసం కలిగించే ఏర్పాట్లు ప్రసక్తి వచ్చినప్పుడు మాత్రం వారూ భూభారం కిందే లెక్క, అడవులతోనూ, పర్వతాలతోనూ, సముద్రాలతోనూ పాటు. మంచిదేదో చెడ్డదేదో వారు గుర్తించలేరు, మరి. పైగా, బుద్ధికూడా దూరం దూరంగానే వుంటుంది వారికెప్పుడూ. మనస్సే నడిపిస్తుంది, వారిని. అది చంచలం. అదీ, కోతీ వొకటేరాశి. మరి, దానికి వశులయినవారు? ఏతావతా, - వినోదాలు కూడా బహువిధాలు. వాటిలో కొన్ని జిజ్ఞాస రేపెట్టేవిన్నీ వుండవచ్చు. గాలి వాటాన యెగిరిపోయేవే యెక్కువ. అదిగో, అలాంటి వాటికోసమే ఆరకం మనుష్యులు డబ్బు ఖర్చు పెట్టడం. ఆ ఖర్చుల కొక దారీ తెన్నూ వుండదు. ఒక అర్థం వుండదు. ప్రయోజనమున్నూ వుండదు, లేశమూ. వర్షపునీరు నిలవదు. వాగులు కడుతుంది. ఉరుకుతుంది, దూకుతుంది, సాగుతుంది, ప్రవహిస్తుంది, ఉప్పుటేట్లో కలుస్తుంది, చివరికి. లోభుల డబ్బూ అంతే. అది పెరుగుతుంది. రకరకాలు దానిచేరిక. పెరుగుతుంది పెరుగుతుంది, విరుగుతుంది చివరకి. ఒక్కటే మార్గాన దాని పోబడి. ప్రపంచం నాలుగు మూలలనుంచీ రెండేళ్ళో మూడేళ్ళో అయింది, కండలు తిరిగిన మనుష్యులు వచ్చి మద్రాసులో చెడ్డ కొట్టుకున్నారు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||463}}</noinclude> 87ghz5fcav7jbh554erk8664evvtri2 పుట:Cheppulu Kudutu Kudutu....pdf/41 104 212367 555367 554316 2026-05-03T01:23:14Z శ్రీరామమూర్తి 1517 555367 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}3. రామస్వామి మౌనం</p> {{Largeinitial|ఓ}} రోజు మధ్యాహ్నం పొలాల నుంచి ఇళ్ళకు వచ్చేసరికి ఎర్రపాలెం మాదిగలకు గ్రామానికి కొంచెం దూరంలో ఎవరో ప్రయాణంలో అలసిపోయి కూర్చున్నట్లు కనిపించాడు. "ఎవరీయన? అడుగుదాముండు అనుకున్నారు. వాళ్ళలో ఒకడు తమ యిళ్ళకు దగ్గరగా ఉన్న పెద్ద చెట్ల కిందకి రమ్మని పిలిచాడు. వాళ్ళ దగ్గరికి వస్తూనే అతను చెప్పాడు. "నా పేరు బండారు పుల్లయ్య. ఒంగోలు నుంచి వచ్చాను. ముక్తి మార్గం ఒకటి నాదగ్గరుంది. చెపుతాను వింటారా" అది సాయం సమయం. చెట్ల నీడ హాయిగా ఉంది. కొత్తదేదో కుతూహలకరమైనది వినడానికేం? ఆ చెట్ల కింద రామస్వామి కోవెల ఒకటి ఉంది. ఆ ఊరి మాదిగలు కొన్ని పర్వదినాలలో పూజలు చేస్తుంటారు. వినటానికి తయారయిన వాళ్ళు చిన్న చిన్న గుంపులుగా ఎవరికి అనుకూలంగా వాళ్ళు కూర్చున్నారు. గుడి అరుగు మీద చెప్పుల కాళ్ళను గుడిగోడలకు తాకించుతూ కూర్చున్నాడు పుల్లయ్య అందరూ విస్తుపోయారు. వాళ్ళు శాంతిప్రియులు. వాళ్ళ ముందు అతను దేవుడు రామస్వామి మీద తన ధిక్కారాన్ని ఆ విధంగా చూపించాడు. వాళ్ళకు కోపం రాలేదు గాని పుల్లయ్యకు ఏమవుతుందోనని భయపడ్డారు. వాళ్ళు ఆ గుడి సమీపంగా కాళ్ళకి చెప్పులతో వెళ్ళటానికి ఎన్నడూ సాహసించలేదు. లేకపోతే భగవంతుడు కోపగించి తమని సర్వనాశనం చేస్తాడు. పుల్లయ్య వాళ్ళ ఆశ్చర్యాన్ని భయాన్ని చూసి నవ్వాడు. "ఈ గుడిలో పవిత్రమైన దైవం ఉన్నాడా? భయపడకండి. నాకెలాంటి కీడూ కలగదు.” వాళ్ళా సాయంత్రమంతా అతన్ని చూస్తూనే ఉన్నారు. అతను జీసస్ క్రీస్తుని గురించి ధారాళంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు వింటున్నారు. అంతసేపూ అతని చెప్పులు కాళ్ళు రామస్వామి కోవెలను ధైర్యంగా తాకుతూనే ఉన్నాయి. ఆ దేవునిమీద వాళ్ళ గౌరవం తగ్గింది. పుల్లయ్యను గౌరవించదగ్గ అతిథిగా భావించసాగారు. చీకటి పడుతోంది. అతన్ని తమతో తినమనటానికి సంకోచం కలిగింది. ఆ క్రైస్తవులు చచ్చిన గొడ్ల మాంసం తినటం ఆరోగ్యం కాదని అవమానకరంగా భావిస్తారని అతను వాళ్ళతో నిస్సంకోచంగా చెపుతున్నాడు. అది వాళ్ళకి సంకోచం కలిగిస్తున్నా అతని అవసరాలు చూడాలని వాళ్ళకి ఉంది. మాదిగ పెద్ద అడిగాడు. ఉడికించిన అన్నం పులుసూ మాతో తింటారా లేకపోతే ఎవరైనా శూద్రుడి చేత వండించమంటారా అని అడిగాడు. హిందూ గురువులు ఉపదేశం యివ్వటానికి వచ్చినపుడు రెండో పద్ధతే పాటిస్తారు. పుల్లయ్య దాన్ని ఒప్పుకోలేదు. “ఏం ఫరవాలేదు. మీతోనే తింటాను" అన్నాడు. వాళ్ళలో ఒకడిగా తీసుకువెళ్ళారు. మాదిగ పెద్ద భార్య విస్తరాకు మీద వడ్డించింది. ఆ ఆకుని తిరిగి ఉపయోగించరు. పుల్లయ్య భోజనం అయాక ఆకుని ఎత్తి బయట పారేస్తారు. అపరిచితుల శుచి శుభ్రతలను గౌరవించటంగా వారా పద్ధతిని పాటిస్తారు. వెన్నెట్లో వాళ్ళంతా ఆ రాత్రి కూర్చున్నారు. క్రీస్తు పవిత్ర జీవితం గురించి చావు గురించి కథలను గంటలకొద్దీ విన్నారు. కొత్త మతం సూత్రాలను పుల్లయ్య యిచ్చిన వివరణలను శ్రద్ధగా విన్నారు. వాళ్ళంతకాలం జీవించిన చీకటితో పోలిస్తే అతను చెప్పినది గొప్ప కాంతిలా అనిపిస్తోందని వాళ్ళు ఒప్పుకున్నారు. పుల్లయ్యను మరో రెండు రోజులు ఉండమని అడిగారు. అదే సమయానికి గురువు తన శిష్యుల మంచి చెడ్డలు చూసిపోదామని అంతేకాకుండా సొంతలాభం చూసుకుందామని వచ్చాడు. కూర్చుంటూనే అడిగాడు. "కోడి కొయ్యండి! అన్నం వండండి! కూర చెయ్యండి! సారా తెండి! కుటుంబంలోని 'చిన్న పిల్లలు' గురువుగారు అలిసిపోయారు అని కాళ్ళు పట్టడం మొదలెట్టారు. దేవుడు కరుణిస్తాడని ఆశపడ్డారు. ఈ సారి గురువుకి అలవాటయినట్లు ఆతిథ్యంలో భక్తిశ్రద్ధలు లేకపోయాయి. నీళ్ళు పోసి కాళ్ళు కడిగారు. కాని ఆ నీటిని పాత్రలోకి తీసుకుని భగవదనుగ్రహం కోసం తాగలేదు. కోడిమాంసాన్ని సారాని భోజనంలో యిమ్మని మామూలుగానే ఆజ్ఞాపించినపుడు గురువుకి వ్యతిరిక్తత ఎదురయింది. అతను చెట్టుకింద కూర్చున్నపుడు ఎవ్వరూ మంత్రాలు అడగలేదు. పైగాపుల్లయ్య చెప్పినది చెప్పారు. క్రైస్తవులు కావాలనుకుంటే వాళ్ళ జుత్తు కత్తిరించుకోవాలి. ఒకస్వామి తమ ఇంట్లో ఉండటం కోసం తలమీద కొప్పు ఉంచుకోటం ఏ క్రైస్తవుడూ చెయ్యలేడు. పుల్లయ్య తన జేబులో ఎప్పుడూ ఒక కత్తెర ఉంచుకుంటాడు. అతను తిరుగుతున్నపుడు వందలాది కొప్పులు కత్తిరించవలసి వస్తుంది. గ్రామస్తులు తలలు వంచి "కత్తిరించెయ్యండి" అనేవారు. అందరూ ఆ కత్తిరింపు పనిలో ఉండగా గురువు లేచాడు. ఇటూ అటూ చూడలేదు. ఎవ్వరికీ చెప్పలేదు. వెళ్ళిపోయాడు. మళ్లీ తిరిగిరాలేదు. ఇదంతా నిశ్చితంగా పుల్లయ్యకి అనుకూలించింది. అనేక మాదిగ కుటుంబాలలో ప్రవేశం లభించింది. అతన్ని సాధారణంగా దగ్గరి చుట్టంగా భావించేవారు. మాదిగలు తమ వంశ సంబంధాలను చుట్టరికాలు కలుపుకోడంలో చూపిస్తారు. అవి ఎంత దూరపు చుట్టరికాలయినా వాటికి చాలా ప్రాముఖ్యత యిస్తారు. పుల్లయ్య కుటుంబం ఎప్పుడో ఓ మారు సంబంధం కలుపుకోటానికి రావటం యిరు కుటుంబాల మధ్య ఓ పెళ్ళి జరగటంతో అతనికి అనేక యింటి తలుపులు తెరచుకున్నాయి.<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|40|}}</noinclude> 65n1pqr9rdjcr0yzfxxlljomfcihouy పుట:Cheppulu Kudutu Kudutu....pdf/47 104 212373 555368 554368 2026-05-03T01:24:13Z శ్రీరామమూర్తి 1517 555368 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}2. దైవదర్శనాకాంక్ష</p> {{Largeinitial|ఉ}}ల్లూరి వారి కుటుంబం కీర్తి నలుదిశలా వ్యాపించింది. వాళ్ళ ధనాన్ని బట్టి కాదు. గొప్ప గొప్ప పనులు చెయ్యటంలో ముందున్నందుకు కాదు. వాళ్ళ భక్తి తత్పరతే దానికి కారణం. గురువు పోలయ్యకి పదహారు రూపాయల విలువైన ఆవుని వారు యిచ్చారు. ఒక గురువుకి యిచ్చే కానుకలలో ఇది చాలా గొప్పగా భావించబడింది. మతపరమైన అంకితభావానికి ఆ కుటుంబం ఖ్యాతి సంపాదించుకుంది. చిన్నపూడి పోలయ్య పూర్తిగా నిరక్షాస్యుడైనప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆదరాన్ని సంపాదించుకున్న మనిషి అయుంటాడు. అదే అతన్ని తతిమ్మా వాళ్ళ కన్నా భిన్నమైన వాడుగా చేసి గురువుని చేసింది. అతను ధ్యానముద్రలో ఉండేవాడు. స్వప్నాల స్వాప్నికుడు. ఓరోజు తెలివిగా ఓ ప్రశ్న లేవదీశాడు "కోటప్పకొండ స్వామి తతిమ్మా స్థలాలలోని స్వాములూ, జనం యింతగా పూజ చేస్తున్నారు గాని, మనుషులు తయారుచేసేవాళ్ళే. ఈ మనుషులు చేసిందెవరు? భూమ్యాకాశాలను చేసిందెవరు? దేవుని చూడకుండా నేను చనిపోవాలా?” అతని తండ్రి నజరయ్యను అనుసరించినవాడు. నజరయ్యను చూడటానికి అతని తండ్రి నజరయ్యను అనుసరించినవాడు. నజరయ్యను చూడటినికి అతని తండ్రి త్రిపురంతకం తీసుకువెళ్ళటం ఆ పోలయ్య తొలి జ్ఞాపకాలలో ఒకటి. బీదరికంలో సన్యాసిలా బ్రతికి ఎవరితోనయినా ఎప్పుడైనా దేముడు ఒక్కడే అన్న తన ముఖ్యసిద్ధాంతం గురించి మాటలాడటానికి సిద్ధంగా ఉండే నజరయ్యను ఆ బాలుడు పోలయ్య ఏనాడూ మరచిపోలేదు. ఆ బాలుడి మనసులో విగ్రహారాధన పట్ల వ్యతిరిక్తత, భగవంతుడిని చూడాలన్న అవిశ్రాంత కాంక్ష నజరయ్య నాటాడు. ఉల్లూరి కుటుంబానికి గురువైన పోలయ్యకి తన ఉపచారాలలో తన అజ్ఞానాన్ని గంభీరమైన గురుత్వంలో ఎలా కప్పిపెట్టుకోవాలో బాగా తెలుసు. వాళ్ళకి మంత్రాలు శ్లోకాలూ చెప్పేవాడు. రాజయోగి ప్రజల వేదాంతంలో ఇక్కడో ముక్క అక్కడో ముక్క నేర్చాడు. ప్రత్యేక సమయాలలో తన జ్ఞానాన్ని కొంచెం ప్రదర్శించేవాడు. అతను తనకి మించిన లోతులకి వెళ్తున్నానని తెలియగానే వెనక్కి తగ్గి ఒక రహస్యమయ వాతావరణాన్ని కల్పించేవాడు. అది సరళ స్వభావులకీ చాలా అద్భుతంగా అనిపించేది. మరోసారి యింకా ఎక్కువ చెపుతానని మాట యిచ్చేవాడు. ఆవిధంగా వారిలో కుతూహలాన్ని రేకెత్తించి తిరిగి వచ్చినపుడు ఏం చెపుతాడా అన్న కౌతుకంతో ఎదురు చూసేటట్టు చేసేవాడు. దేముడిని చూపిస్తానని చెప్పటం తన శిష్యులకి పోలయ్య యిచ్చిన వాగ్దానాలలో వాళ్ళని పట్టి ఉంచిన వాటిలో ఒకటి. ఆ కుటుంబంలో వయసు మీదబడిన తండ్రికి దేముడికి చూడాలన్న బలీయమైన కోరిక కలిగింది. అతనంటే అందరికీ గౌరవం. కొడుకులు తండ్రి కోరికని శ్రద్ధగా పట్టించుకున్నారు. వాళ్ళు పోలయ్యను సంప్రదించారు. అతను పదిహేను రూపాయలు ఇమ్మన్నాడు. వాళ్ళు ఇది చాలా ఎక్కువ అనుకున్నారు. ఆ తాంత్రిక రహస్యాన్ని సంపాదించుకోటానికి తాను ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నదీ మైనంలా కరిగిపోయేలా అద్భుతంగా వర్ణించాడు. తన ప్రయత్నాల ద్వారా ఆకుటుంబంలో ఒక్కరు దేముడిని చూడగలిగితే మొత్తం కుటుంబానికి నిస్సందేహంగా ముక్తి దొరుకుతుందని నొక్కి చెప్పాడు. చివరికి పోలయ్య పదకొండు రూపాయలకి ఒప్పుకున్నాడు. ఆ ప్రయత్నం చేసే రాత్రి నిశ్చయమయింది. పదిమంది ఆడామగా దేముడిని చూడాలన్న కాంక్షతో విశ్వాసంతో అర్ధరాత్రి వేళ ఉల్లూరి వారి ఇంటిలో కూర్చున్నారు. గోడకున్న గూటిలో రెండు చిన్న నూనె దీపం బుడ్లు వెలుగుతున్నాయి. అక్కడ కొద్దిపాటి వెలుతురిని యిస్తున్నాయి. గురువు మధ్యలో కూర్చున్నాడు. శిష్యులు చుట్టూ వృత్తాకారంలోకూర్చున్నారు. నజరయ్య మతం తాలూకు మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. అతని హడావుడి భయంకరంగా ఉంది. చూస్తున్న వాళ్ళంతా ఊపిరిబిగబట్టారు. కదలకుండా ఉండిపోయారు. చిట్టచివరికి ఆ క్షణం వచ్చేసింది. అందరినీ పొమ్మని సంజ్ఞచేశాడు. ఆ ముసలతనిని మాత్రం కూర్చోమన్నాడు. మరిన్ని మంత్రాలు చదివాడు. మరిన్ని విచిత్రమైన బొమ్మలు గీశాడు. ముసలతను ముక్కు చెవులూ, కళ్ళు మీద అంతకు ముందు పోలయ్య చెప్పినట్టుగా వేళ్ళు పెట్టుకున్నాడు. బాహిర ప్రపంచంతో ఆ విధంగా సంబంధాలు తెంచుకుని అంతరేంద్రియంతో భగవంతుడిని చూడాలని అతనికి అర్ధమయ్యింది. కొంత సమయం గడిచింది. పోలయ్య చెవిలో గొణిగాడు. నీకేమైనా కనిపిస్తోందా అని. "అంతా ఎర్రగా పచ్చగా కనిపిస్తోంది. మధ్యలో ఏదో మనిషి బొమ్మ ఉన్నట్టు కనిపిస్తోంది" అన్నాడు ముసిలతను. “అదే దేవుడు. నువ్వు చూశావు" అన్నాడు పోలయ్య ఆశ్చర్యంతో సంభ్రమంతో ముసిలాయన పిల్లలని కలిశాడు. మనవలు చుట్టూ ఆడుకుంటుండగా ఇంటి పట్టున కూర్చుని, అనేక రోజులు దాని గురించే ఆలోచించాడు. జనం వస్తున్నారు. వెళుతున్నారు. అంతా ఎలా కనిపించిందీ చెపుతున్నాడు. ఆ ముసిలాయనకి అదో గొప్ప తృప్తిని కలిగించే విషయమయింది. అంతా డబ్బులు ఖర్చుపెట్టినందుకు పిల్లలు విచారించలేదు.<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|46|}}</noinclude> 5c7jlxj0mk8i9fpxfj0jtpx7ckas3lw పుట:Cheppulu Kudutu Kudutu....pdf/65 104 212391 555365 554490 2026-05-02T23:32:48Z శ్రీరామమూర్తి 1517 555365 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}3. మతద్వేషి - అతని అంతం</p> {{Largeinitial|కూ}}చిపూడి గ్రామ సంతలో ఓ కొసన చెట్టు నీడలో అనేకమంది శూద్రులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మామూలుకన్న హెచ్చుగా వాళ్ళు ఉద్రేకంగా ఉన్నారు. “వాళ్ళకి మన బడి అంత బడి ఉంది. చదువుకుంటే మన పని ఎలా చేస్తారు?" ఇంకొక శూద్రుడు అన్నాడు. “నాకో ఎద్దుంది. చాలాకాలంగా జబ్బుగా ఉంది. అది చనిపోయింది. మాదిగలను పిలిచాక ఊరి బయటకు తీసుకువెళ్ళారు. చర్మం ఒలిచారు. మిగిలింది కప్పెట్టారు. వాళ్ళు యివ్వాల్సిన చెప్పుల కోసం అడిగాను. మునుపు యిచ్చినంత యివ్వమన్నారు. నేను మీకు మొత్తం ఎద్దుని యిచ్చాను గదా! అన్నాను. మీరు మాంసం ఎందుకు కప్పెట్టారు? అని కూడా అడిగాను. "ఆ కుళ్ళు మళ్ళీ మా వాడలోకి తీసుకెళ్ళం అన్నారు. వాళ్ళని ఏం చెయ్యాలి? తాత తండ్రుల నుంచి వస్తున్న ఆచారాన్ని వదిలేస్తున్నారు.” అన్నాడు మరొకడు. గ్రామ మునసబు, బల్లవంటి దుర్గయ్య నాయుడు, అందాకా మౌనంగా ఉన్నాడు. పక్కనున్న కండువా అందుకున్నాడు. తలకి చుట్టాడు. వెళ్ళటానికన్నట్టు లేచాడు. "బాప్టిజం కోసం పదిమంది ఒంగోలు వెళ్ళారు. రానీండి. వచ్చాక వాళ్ళని పూర్వంలా చేస్తాను. గుణపాఠం చెపుతాను" అన్నాడు. దుర్గయ్య నాయుడు మహాక్రూరుడు. ఓ మారు ఆరంభించాడంటే అంతు చూడకుండా వదలడు. మహా పట్టుదల మనిషి. అతను లేవటం చూశారు శూద్రులు. వాళ్ళకి అందులో తప్పు కనిపించలేదు. వాళ్ళూ వాళ్ల తాత తండ్రులు మాదిగలకి రక్షకులమని అన్నం పెడుతున్నామని అనుకునేవారు. “వాళ్ళు మనని అగౌరవించటం లేదు. ఆదివారం రాలేమన్నా వాళ్ళు మన కాళ్ళ వేళ్ళా పడుతున్నారు. మర్నాడు పనికి రానివ్వమని బతిమాలుతున్నారు. సాగదీస్తూ ఒకడు అన్నాడు. దుర్గయ్య నాయుడు మొహంలోని కోపాన్ని సరిగా పట్టించుకోకుండా ఒకడు అన్నాడు. "ఇదెలా ముగుస్తుంది? మన పనికి మరొకరిని చుకోవాలి.” మునసబు దుర్గయ్య నాయుడు కొన్నాళ్ళు పోయాక క్రైస్తవులైన పది మంది మాదిగ పెద్దలను పిలిచాడు. "మీరు ఒంగోలు వెళ్ళి క్రీస్తు పేరుతో నీటిలో మునిగారు. మీరు మైలపడ్డారు. మీరు యిక్కడ చెరువులో మునిగి ఆ మైలను కడుక్కుంటే తప్ప మిమ్మల్ని ఊళ్ళో అడుగు పెట్టనివ్వం” అన్నాడు. శూద్రుల ఊరికి మాదిగవాడకీ మధ్యన ఉంది చెరువు. గ్రామకరణం వచ్చాడు. ఏం ఆజ్ఞ యిచ్చినా అమలు చెయ్యటానికి తయారుగా ఉన్నారు వెట్టివాళ్ళు. చాలామంది శూద్రులు ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు. దుర్గయ్య నాయుడు తేలిగ్గా వదలడని వాళ్ళకు తెలుసు. ఆ పదమంది చుట్టాలూ స్నేహితులూ భయాందోళనలతో పరిగెత్తుకుంటూ వచ్చారు. భయంతో వణికిపోతూ కూడా మునసబు చెప్పినట్టు చెయ్యటానికి క్రైస్తవులు ఒప్పుకోలేదు. వాళ్ళ బోధకుడు తోడుగా నిలబడి ధైర్యం చెప్పాడు. గుంపు అంతా చెరువు వేపు నడిచింది. "వెళ్ళండి. నీటిలో మునగండి, ఒంగోలు మైల వదిలిపోవటం నేను చూడాలి” అన్నాడు దుర్గయ్యనాయుడు. వాళ్ళు ఒక్క అంగుళం కదలలేదు. వెట్టివాళ్ళని పిలిచి కర్రలు మెడలమీద పెట్టి నీటిలోకి తోసెయ్యమని అరిచాడు. వాళ్ళు ఏడుస్తున్నారు. వద్దువద్దంటున్నారు. న్యాయం కాదంటున్నారు. “ముంచెయ్యండి! మైల వదిలిపోవాలి అరిచాడు. అందరూ బలవంతంగా వాళ్ళని నీట్లోకి తోసేసారు. అవమానాలకు క్రౌర్యం తోడయింది. మునసబుకి అది చాలలేదు. అంతకు ముందు పూజలను క్రైస్తవులచేత మొదలెట్టించాలి. ఆ చెరువు గట్టున పోలేరమ్మ రాతి బొమ్మ ఉంది. అరుపులు కేకల మధ్య ఓ గేదెని మేకని తీసుకువచ్చారు. విగ్రహం ముందు నిలబెట్టారు. వెట్టివాళ్ళు నరికారు. వెచ్చటి రక్తం విగ్రహాన్ని తడిపింది. రక్తదాహం ఎప్పటికీ తీరని ఆ దేవత చాలా సంతోషిస్తుందని అనుకున్నారు. క్రైస్తవులని బలవంతంగా విగ్రహానికి మొక్కించారు. కొంచెం రక్తం తీసి నుదుట బొట్టు పెట్టారు. రాత్రంతా భయానకంగా గడిచింది. వాద్యాలతో పోలేరమ్మ దేవత గాధలని గాయకులు పాడారు. సారా మత్తులో జనం విగ్రహం చుట్టు ఆడారు. క్రైస్తవులని కూడా ఆడమన్నారు. లొంగిపోయారు. కాదంటే చావు తప్పదని వారికి తెలుసు. దొంగతనంలో ఇరికించి తాసిల్దారు ముందుకి లాక్కెళతానని మునసబు బెదిరించాడు. తము నేరం చెయ్యలేదని రుజువు చేసుకోటం కష్టం, అసంభవం అని వారికి తెలుసు. మాదిగవాడ నుంచి క్రైస్తవం తుడిచిపెట్టుకుపోయిందని శూద్రులు భావించారు. వాళ్ళు వాదించారు. "వాళ్ళలో ఎవరైనా కులాన్ని పోగొట్టుకుంటే పూజారి పూజలన్నీ చేసి నాలుక మీద బంగారం తీగతో కాలిస్తే అంతకుముందు చేసిన అపరాధాలు తొలగిపోతాయి గదా!” కులంలో వాళ్ళకి వర్తించే విధానాలు కులం నుంచి వెలివేయబడ్డ వాళ్లకి వర్తించటం అన్న ప్రశ్నే లేదు. అయితే ఇప్పుడు తీసుకున్న చర్యలు తప్పకుండా కఠినమైనవి. అలాంటి చోట వాదనలు సాగవు. క్రైస్తవులు నిరంతరం భయాందోళనలతో ఉంటున్నారు. తమ మత విశ్వాసాలు అనవసరంగా ప్రదర్శించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒంగోలు మిషనరీకి తమ మీద జరిగిన క్రూరమైన దాడి గురించి చెప్పుకున్నారు. వాళ్ళు గనుక ఎదురించితే నిలబడలేరని అతనికి తెలుసు. దాంతో<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|64|}}</noinclude> lmylqz1nhfasuoz6pkl2kf6jlvx1czw పుట:Cheppulu Kudutu Kudutu....pdf/71 104 212397 555363 554285 2026-05-02T23:09:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 555363 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}1. ఒక గొప్ప సంక్షోభం</p> {{Largeinitial|1876-78}}ల మధ్య కరువులో జీవించిన అనేక మంది నాకు తెలుసు. ఆ రోజులోని పిల్లలో చాలామందికి సరైన ఎదుగుదల లేకపోయింది. కొందరి ముఖాలమీదకి అకాల వృద్ధాప్యం వచ్చేసింది. అయితే ముసలివాళ్ళు ఒక కరువుని గుర్తుచేసుకొనేవారు. బహుశ అందులోఅసాధారణమైన భయానక దృశ్యాలు ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కరువులో మనుషులు మనుషులను తినేవారు అని అందరూ అనేవారు. నాకది నమ్మబుద్ధయేది కాదు. 1876-78ల మధ్య వేలాది మంది మరణించినా, ఆకలి కరాళ నృత్యం మనుషులని భీతావహం చేసినా ఎలాంటి నరమాంస భక్షణా చిహ్నాలనీ తను చూడలేదని నా భర్త చెప్పేవారు. దాంతో 1836 కరువు మనుషుల్ని తిన్న కరువుగా ఎవరైనా నాతో అంటే అది చూసిన వాళ్ళెవరైనా నీకు తెలుసా అని అడిగేదాన్ని. ఒకామె నాతో చెప్పింది. ఆమె తల్లి పొరుగింటి మనిషి, ఒక ఆడమనిషి తన బిడ్డను కుండలో పెట్టి ఉడకబెట్టడం చూశానని చెప్పిందట. ఇది నాతో చెబుతున్నప్పుడు ఆమె గొంతు చిన్నదయిపోయింది. ఇది చెప్పటానికి కూడా వీల్లేనంత భయానకమైనది. మాదిగలలో అధికశాతం ఏడాది పొడవునా ఆకలితో మాడారు. పంటలు పోయిన మొదటిసారే వాళ్ళ గడపలో ఆకలి ప్రవేశించింది. విత్తనం మొక్కవటానికి తగిన తడిని యివ్వకుండానే మరో వానాకాలం గడిచిపోయేసరికి వారి కష్టం ఇనుమడించింది. మాదిగలు శూద్రుల సహాయం కోసం వెళ్ళారు గాని పంచుకోవటానికి వాళ్ళ దగ్గర ఎలాంటి పంటా లేకపోయింది. వాళ్ళకే తిండానికి లేదు. బంగారమూ వెండీ తిండి కోసం అమ్ముకోడం ఆరంభించారు. కాని ఆకలిదప్పులతో పశువులు చనిపోతున్నాయి. ఆకలితో బక్కచిక్కిన ఆ పశువుల దుమ్ములని అంటుకొని ఉన్న మాంసంతో మాదిగలకి అప్పుడప్పుడు తిండి దొరికేది. కలబంద మొక్కల ఎర్రటి పళ్ళు తిండి అయ్యాయి. చాలామంది ఆకులూ అలములూ తినసాగారు. "బోర్డు, సన్నటి సీసా, లోపలి మట్టి" దగ్గరికి నిత్యం ఒంగోలు మిషనరీ రాక అతననుభవిస్తున్న ఆందోళనకి గుర్తు, దగ్గరవుతున్న కల్లోలాన్ని ఎదుర్కొనేందుకు అతను అనేక పద్ధతులను యోచించాడు. ఒంగోలుకి అతను వచ్చి పదేళ్ళయింది. అతను తన వాళ్ళని 3269 మంది క్రైస్తవులుగా లెక్కించాడు. దాదాపు అందరూ మాదిగలే. పంటలు సమృద్ధిగా ఉన్నపుడే వాళ్ళు ఎంత పేదవాళ్ళో దిక్కులేనివాళ్ళో అతనికి క్షుణ్ణంగా తెలుసు. అంతగా అతను వాళ్ళలో ఒకటయిపోయాడు. నానాటికి ఆ మిషన్ కాంపౌండ్‌లో పెరుగుతున్న శుష్కదేహాలు అతను వరండాలో కనిపించినపుడల్లా మేం చచ్చిపోతున్నాం. చచ్చిపోతున్నాం. అని అరవటం అతనిని ఏదో ఒకటి చేయమని వెన్నాడుతోంది. బోధకులు అరిగిపోయిన వాగ్దానాలతో వచ్చి వెళుతున్నారు. మిషన్ బంగ్లాలో జరుగున్నది వాళ్ళకి కొంత తెలుసు. అమెరికాకి సహాయార్ధం నివేదికలు పంపారు. మద్రాసులోని ప్రభుత్వంతో లేఖలు నడుపుతున్నారు. చిట్టచివరగా వాళ్ళని ఓ కబురుతో పంపించారు. తవ్వకానికి మిషనరీ ఒక కాంట్రాక్ట్ తీసుకుంది. రాజుపాలెంకి వస్తే కూలి సంపాదించుకుని తగినంత తిండి తెచ్చుకోవచ్చు. ఆంగ్ల ప్రభ్వుత్వం అనేక సహాయ చర్యలు చేపట్టింది. మద్రాసు నుంచి ఉత్తరంగా బెజవాడ వరకూ తూర్పు తీరంలో బకింగ్‌హోమ్ కాలవ నిర్మాణం ద్వారా పెద్ద ఎత్తున సహాయ చర్యలు ఆరంభించింది. ఈ కాలవలో మూడు మైళ్ళ భాగం తవ్వటానికి ఒంగోలు మిషనరీ కాంట్రాక్ట్ తీసుకుంది. ఒంగోలుకి పదిమైళ్ళు తూర్పున సముద్రం ఒడ్డుకి దగ్గరగా రాజుపాలెంలో సహాయ శిబిరం ఏర్పాటయింది. ఇరవై మంది కూలీలను తోడు తీసుకుని ఫ్రీచర్స్‌లో ఒకరిని కాంప్ నిర్మించటానికి ముందుగా పంపారు. గుడిసెల వరస ఎక్కడ వెయ్యాలో వీధులని ఎక్కడ చెయ్యాలో మిషనరీ వచ్చి చూపించాడు. వెదుళ్ళు, తాటిచెట్లు సముద్రపు ఒడ్డున విస్తారంగా ఉన్నాయి. గ్రామస్థులతో తాటాకులు, వెదురు వాసం కోసం మాట్లాడటానికి పంపారు. అంత లోతు లేకుండా నీటి మట్టం పైకి ఉండటం వల్ల నూతులు తవ్వారు. చుట్టుపక్కల కుమ్మర్లకి కుండల కోసం బయానా ఇచ్చారు. ఓ రాగి డబ్బుకి కుండలు కొనుక్కుని, ఎక్కడ పడితే అక్కడ దొరికే పుల్లలు ఎండుటాకులతో నిప్పు చేసుకుని ఆకలితో మాడుతున్న జనం వంట చేసుకోటానికి ఏర్పాట్లు జరిగాయి. అనుకున్న సమయానికి అనేక మంది క్షుధార్తులతో దూరదూరాల నుంచి ఫ్రీచర్స్ ఒంగోలుకి వచ్చారు. బస్తాలతో కోమట్లని రాజుపాలెంకి ముందే పంపాడు మిషనరీ, అక్కడ ఉన్న ఫీచర్‌కి ఒంగోలుకి వచ్చారు. బియ్యం బస్తాలతో కోమట్లని రాజుపాలెంకి ముందే పంపాడు మిషనరీ. అక్కడ ఉన్న ఫ్రీచర్‌కి మధ్యాహ్నానికి చాలామంది జనం వస్తారు. తయారుగా ఉండమని కబురంపాడు. రెండు గంటలలో జనం రావటం మొదలెట్టారు. అక్కడున్న బోధకునికి అతని సహాయకులకీ వస్తున్న జన సమూహం ఒక పెద్ద సముద్రతరంంగం వస్తున్నట్లు కనిపించింది. గుడిసెలు క్షణాల్లో నిండిపోయాయి. కుటుంబాలకి మొదట అవకాశం యిచ్చారు. జాగా లేనివాళ్ళు చెట్ట క్రింద పడుకున్నారు. ఆ రాత్రి ఫిర్యాదులు తగాదాలు చూడాలి! ప్రతివాళ్ళకీ ఆ రాత్రికి తిండి దొరికేలా ఏర్పాటు చేశాక మిషనరీ కాంప్‌కి వచ్చాడు. అందరినీ క్రమంలో పెట్టడానికి ప్రయత్నించాడు. ఆకలితో మాడిపోతున్న వాళ్ళతో ఎవరు వాదించగలరు? కుండలు<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|70|}}</noinclude> mbfyg76v4rza5366lrrhk1zfhr72ygy పుట:Cheppulu Kudutu Kudutu....pdf/72 104 212398 555364 554286 2026-05-02T23:31:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 555364 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>కావాలంటారు. ధాన్యం కోసం కుమ్ములాటలు, ముగ్గురు ఫ్రీచర్స్ (బోధకులు) గుడిసెల మధ్య అటూయిటూ తిరుగుతూనే ఉన్నారు. తిండి కోసం ఆదుర్దాలో తాటాకులు, వెదుళ్ళు వంటకి ఉపయోగించకుండా చూడవలసి వచ్చింది. ఈ వంటలలో ఏ మాత్రం పొరపాటు జరిగిన గుడిసెలు అంటుకుంటాయి. పొద్దుటే తవ్వకం మొదలయింది. ముప్పై మంది ఫ్రీచర్స్ ఓవర్‌సీర్లయారు. సామాన్యమైన గునపాలు, పారలూ పంచారు. మగాళ్ళు తవ్వుతూంటే ఆడవాళ్ళు మట్టిని తట్టలలో ఎత్తారు. ఓ పక్కకి తీసుకెళ్ళి దానిని ఒంపి వస్తున్నారు. తొలి రోజులలో ఫ్రీచర్స్ కూడా తవ్వాలని మిషనరీ పట్టుబట్టాడు. "మీరు తిరిగి వచ్చి బొబ్బలెక్కిన చేతులు చూపిస్తే తవ్వడం ఎంత కష్టమో మీకు తెలుసునని నాకు నమ్మకం కలుగుతుంది. అప్పుడే మీరు ఎవరి మీదా నిర్దయగా ఉండరు.” ఆకలిగొన్న ప్రజలను పనిచేయించటంలో కొందరు కఠిన వైఖరి తీసుకోవచ్చునని ఆయన భయపడ్డాడు. అనేకమంది ఓవర్‌సీర్లు బొబ్బలెత్తే వరకూ తవ్వి దొరకి చూపించామని; అప్పుడాయన "నువ్వు మంచి ఓవర్‌సీర్‌వవుతావని" అన్నాడని వాళ్ళు చెప్పారు. ఒంగోలులో కోమటి శెట్లు ఉన్నారు. రాజుపాలెంలో ఈ కాంప్ నుంచి లాభాలు చేసుకోవచ్చుననుకున్నారు. వండీ వండని తిండి గింజలను కాంప్‌లోకి తెచ్చారు. చవక గనక జనం కొన్నారు. రోగాలు పెరిగాయి. మందులు ఇవ్వటానికి వెళుతూంటే మిషనరీ ఆహారం గురించి ఆరా తీశాడు. "ఈ కాంప్‌లోకి పాడయిపోయిన తిండి గింజలను తెచ్చే కోమటిని నాకు చూపించండి" అన్నాడు. ఇద్దరు కోమట్లు కొత్త సరుకుతో వస్తున్నారని ఆయన గుడారానికి కబురు వెళ్ళింది. దొర వాళ్ళ వేపు రావటంతోనే సంచీలు పారేసి భయంతో పరుగుదీశారు. సంచులు తెరిచారు. పండీ పండని ధాన్యం బయటపడింది. స్వయంగా తన కాళ్ళతో ధాన్యాన్ని ఇసుకలో కుమ్మేసి మరెవరూ తినటానికి కనపడకుండా చేశాడు. ఆ తర్వాత ఆ కాంప్ దుకాణాలలో పరీక్షించి తినదగ్గదే అన్న తిండి గింజలు మాత్రం అమ్మారు. కూలులు బాగున్నాయి. కొంతకాలం పనిచేసిన వాళ్ళు ఇళ్ళకు వెళ్ళారు. చుట్టాలనీ మిత్రులనీ పంపారు. రోగులని ఎత్తుకుని తీసుకువచ్చాడు. అస్సలు పనిచేయలేని వాళ్ళకి కొంత సహాయం చేశారు. కాంప్‌లో సమృద్ధిగా ఉన్నప్పటికీ ఒక ప్రమాదం పొంచి ఉంది. కొందరు అప్పుడే వచ్చిన వారు ఆకలికి తట్టుకోలేక ఉడికీ ఉడకని అన్నం తిన్నారు. అలాగే పడుకుని చనిపోయారు. అనేకసార్లు అర్ధాకలితో ఉన్నవారు వస్తే వెంటనే తినకుండా ఆపటానికి ఫ్రీచర్స్ ప్రయత్నించారు. "కంగీ అనేది ఓ రకమైన గంజి లాంటిది తాగటానికి యిచ్చారు. కాని వాళ్ళు వినేవారు కాదు. "ఫరవాలేదు. నన్ను తిననీయండి. ఆకలితో చస్తున్నాను” అనేవారు. బోధకుల సలహాలు తిండి మీద తపనలో కోపం మాత్రం తెప్పించేవి. కొందరు ఎంత బక్కచిక్కిపోయారంటే, ఎంత తిన్నా ఆకలి తీరేది కాదు. తరచుగా తినేవారు. వాళ్ల ఆకలిదేహాలు తట్టుకోలేనంత తినేవారు. ఎక్కడో కదలకుండా పడి ఉంటే వెళ్ళి చూసేసరికి చనిపోయి ఉండేవారు. మరణాల సంఖ్య చాలా ఎక్కువ. రోజుకి ఎంతమంది చనిపోయేవారో ఎవరికీ తెలీదు. చనిపోయిన వాళ్ళని కప్పెట్టడం బ్రతికున్న వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. వాళ్ళు చెయ్యగలిగిందల్లా మోసుకుని వెళ్ళి పక్కనున్న బొమ్మజొమ్ముడు డొంకలలో పారేయటం. మిగిలిన పని రాబందులు, కుక్కలూ, నక్కలూ చేసేవి. బంధువులలో చనిపోయిన వాళ్ళు ఉండేవారు. ఆ గట్టి నేలలో గొయ్యి తీసి కప్పెట్టడానికి ఎవరూ ఉండేవారు కాదు. బాధ తాలూకు పదునుని అసహాయత్వపు నిరాశ తీసివేసినా ప్రేమ మాత్రం రెపరెపలాడుతూనే ఉండేది. ఇసకలో కొన్ని అడుగులు గొయ్యి తవ్వి మృతదేహాన్ని పూర్తిగా కప్పెట్టేవారు. రాత్రివేళ నక్కల ఊళలు భూతప్రేతాలు వికటాట్టహాసాలు దూరానికి వినిపించేవి. తెల్లారాక ఆ వైపుకి వెళ్ళటానికి శ్రద్ధ పెట్టేవారు కాదు. ఆ శిబిరంలో ప్రతి ఒక్కరి గుండె విషాదంగా ఉండేది. కొందరు పూర్తిగా భయంలో ఉండేవారు. శిబిరంలో కలరా ప్రవేశించింది. ప్రతి ముఖంలోనూ మృత్యువు తొంగిచూసేది. కాంప్‌కి వస్తున్న దోవలోనే తన భార్య ఎలా కలరాతో మరణించినదీ బోధకులలో ఒకరు నాకు చెప్పారు. భర్తగాని, అన్నదమ్ములు గాని బాగోగులు చూడడానికి లేని ఆడవాళ్లు ఉండేవారు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఉండేవారు. అనాధల పట్ల క్రైస్తవం ఎంత దయ చూపిస్తుందో వారు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. రోడ్ల మీద పడి చనిపోయే వారి ఎముకలు రోడ్లకి అటూ యిటూ పడుండేవి. వేడి చాలా తీవ్రంగా ఉండేది. వాళ్ళు తవ్వేచోట నీడ ఉండేది కాదు. "మా మననులు కృంగిపోయేవి. మా దొర జుత్తు ఆ ఏడే తెల్లబడిపోయింది. " అని బోధకులు చెప్పారు. ప్రతి ఫ్రీచర్ కింద వంద మంది పనిచేసేవారు. వాళ్ళు చేసిన పనికి అతనే బాధ్యుడు. ప్రతిరోజూ సాయంత్రం వాళ్ళు అతని నుంచి కూలి పుచ్చుకునేవారు. చాలామంది వచ్చిపోతున్నా తనకింద పనిచేస్తున్న బృందంతో అతనికి సామీప్యత ఉండేది. పగటిపూట కొంతమంది కొద్ది విశ్రాంతి కోసం అప్పుడప్పుడు కూర్చునేవారు. వారితో ఫ్రీచర్ కలిసి మాట్లాడేవాడు. వాళ్ళు కష్టాలు చెప్పుకునేవారు. కళ్ళలో అనంత విషాదంతో తడిపొడి మాటలతో చెల్లాచెదురైన కుటుంబాల గురించి చనిపోయిన వారి గురించి చెప్పుకునేవాడు. "మేమందరం చనిపోతున్నాం" అన్నది వారి చివరి మాటగా ఉండేది. ఆ సమయంలోనే ఓదార్పు కావాలి. "ఆ బోధకులు చెప్పిన ఓదార్పు మాటలు మరచిపోలేం. రక్తదాహంతో నిరంతరమూ భూమి మీదకే చూచే భూతాల గురించి ఎవ్వరూ ఆలోచించలేనంతగా ఉన్నాయి ఆ గడ్డు రోజులు. తిండి కోసం భూతాలన్నీ కలిసికట్టుగా భూమ్మీద బ్రతికున్న అన్నింటినీ చంపెయ్యటానికి గుమ్మిగూడితే ఎవరు ఆపగలరు?<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|71|}}</noinclude> rcirt0a746h0092t08cyqwxhrtp87i1 పుట:Cheppulu Kudutu Kudutu....pdf/73 104 212399 555366 554287 2026-05-03T01:21:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 555366 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>వాటన్నింటినీ ఎవరు శాంతింపజేయగలరు? మాదిగలలో ఉన్న సంప్రదాయాలు, దేవతలూ వీటిల్లో ఏ ఒక్కటైనా అన్నీ నడిపే హస్తం ఒకటుందని, అదే దయతో మార్గం చూపిస్తుందని వారిని ఓదార్చగలవా? నమ్మించగలవా? ఆశ కల్పించగలవా? విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళతో కలిసి కూర్చున్నవుడు బోధకులు చెప్పారు. "మా దేముడు కష్టాలను కల్పించడు. ఎందుకంటే ఆయన మానవుల కోసం దాహార్తుడై ఉన్నాడు. ఇవి మన మీదకు రావటాన్ని ఆయన నిరోధించలేదు. ఎందుకంటే మానవులు తప్పులు చేస్తున్నారు. వారికి ముక్తినివ్వని దేవుళ్ళుని పూజిస్తున్నారు. మన కోసం మరణించిన ఏసుక్రీస్తు మన కష్టాలన్నీ తన మీద వేసుకున్నాడు. ఆ తర్వాత బోధకులు తమ వద్ద ఎప్పుడూ ఉంచుకొనే కొత్త నిబంధన తీసుకుంటుంటారు. అందులో వాక్యాలు చదువుతారు. అవి జనాల బాధాకృత హృదయాలకు కష్టాలకు చల్లని లేపనం పూసినట్లుంటాయి. "నా వద్దకు రమ్ము" నీ బరువులను బాధలను కొనిరమ్ము. నేను నీకు విశ్రాంతినిచ్చెదను. "ఈ వాక్యాలు మరీ ముఖ్యంగా వారికి సేదదీర్చేవి. ఆ తర్వాత వారు పనికి తిరిగి వెళ్ళేవారు. కొంతసేపయాక అడిగేవారు. "నీ పవిత్ర గ్రంధంలోంచి ఆ పద్యం తిరిగి చదువు" వాళ్ల మతాలలో సంప్రదాయాలలో రామానుజ మతం కానీండి నజరయ్య మతం కానీండి అలాంటి వాఖ్యలు వారు ఎన్నడూ వినలేదు. వాళ్ళ పాత సంప్రదాయాల జ్ఞాపకాలను తవ్విపోస్తుంటే వాళ్ళ ఆలోచనలు స్తంభించిపోయేవి. వారి దుర్భర దుఃఖంలో స్వస్థతా స్పర్శ కోసం జీసస్ క్రీస్తు వైపు మరలారు. మూడు మైళ్ళ తవ్వకం ఒప్పందం ముగిసింది. ఎనిమిది నెలల పని ముగిసింది. వానలు వచ్చాయి. అనేక మంత్రాలతో విత్తులు నాటారు. కాని అవి నేలమీదే కుళ్లిపోయాయి. తూర్పువైపు వరండాలో దొర నిలబడి వాళ్ళ కుటుంబాలకోసం ఇళ్ళకి తీసుకువెళ్ళటానికి అందించేవాడు. దొరసాని పడమటి వరండాలో ఉండి ఆకలిగొన్న బిడ్డలతో వచ్చే స్త్రీలకు నిత్యం తిండి గింజలు యిచ్చేది. అయినా ఒంగోలులో మిషన్ బంగ్లాకి వచ్చే జన సంఖ్య చాలా ఎక్కువగా ఉండి సరిపోయేది కాదు. నలుగురు క్రైస్తవులు పోలీసులుగా దుస్తులు వేసుకుని పనిచేసేవారు. పని ఒత్తిడి హెచ్చుగా ఉండేది. పంట యింటి నుంచి బంగ్లాకి మధ్యాహ్న భోజనం తెచ్చే సేవకులు వాళ్ళ నెత్తిల మీద పైకి పట్టుకుని పాత్రలను తెస్తూ పరిగెత్తుకుని రావలసి వచ్చేది. ఎక్కడబడితే అక్కడ అన్నార్తులు వాటిని లాగేసుకునేవారు. కాంపౌండ్ చుట్టూ డొంకలలో ప్రతిరోజూ ఉదయం శవాలు దొరికేవి. వాళ్ళు సహాయానికి వచ్చినవారే కాని ఇంక వారికి ఎలాంటి సహాయమూ అక్కరలేదు. బోధకులు ఊళ్ళ నుంచి వచ్చి విషాదాన్ని ఏకరువు పెట్టేవారు. ముఖ్యంగా వృద్ధులూ చిన్నపిల్లలూ క్రైస్తవులలో చనిపోతున్నారని చెప్పేవారు. మిషనరీ యిక్కడికీ అక్కడికీ సహాయం చెయ్యటానికి వెళ్ళగలిగేవాడు కాదు. కేంద్ర స్థానంలో అతను ఉండితీరాలి. తనకి సహాయకులుగా బోధకులని పంపించవలసి వచ్చేది. క్రైస్తవులకి డబ్బులు యివ్వటానికి వాళ్ళు ఊళ్ళన్నీ తిరిగేవారు. వాళ్ళు దోవలో ఎదురుపడి ఒక భోజనానికి సహాయం చేయమని అడిగితే ఎవ్వరినీ తిరస్కరించటానికి వీల్లేదని ఆజ్ఞలు జారీచేశారు. సాయాన్ని కోరే వారిలో ఆశపోతులు లాక్కునేవాళ్ళూ కూడా వారికి ఎదురయేవారు. చిట్టచివరికి కుటుంబానుబంధాలలో సున్నితత్వం కూడా మొద్దుబారేది. ఒకే కుటుంబంలో వృద్ధులకీ బలహీనులకీ సహాయం అందుతుంటే బలమైనవారు వాళ్ళతో గొడవపడేవారు. వాళ్ళకీ సహాయం అందించినందుకు అసూయపడేవాడు. మళ్ళీ వానలు వచ్చాయి. ఎడ్లూ, పోతులూ చనిపోయాయి. మనుషులే నాగళ్ళను మెడల మీద వేసుకున్నారు. పంట ఎదుగుతుండగా మిడతల దండు వచ్చి సర్వనాశనం చేసింది. మద్రాసు రేవులోకి ఆహారం నిండిన ఓడలు వచ్చాయి. ప్రభుత్వం ప్రజలని రక్షించటానికి చెయ్యగలిగిందంతా చేసింది. మాన్షన్ హౌస్ ఫండ్ సహాయంతో ఒంగోలులో అడిగిన వాళ్ళకందరికీ జొన్న విత్తనాలను పదిరూపాయలకే బస్తాలు తీసుకువెళ్ళారు. మాదిగలకి రాబోయే పంటలో ఎంతో కొంత యిస్తానని మాట ఇచ్చారు. ఆ కరువులో అనేకమంది ఒంగోలు వచ్చి మిషనరీకి తమ కష్టాలను చెప్పుకున్నారు. సహాయంతో ఓదార్పుతో తిరిగివెళ్ళారు. ఆ తర్వాత సంవత్సరాలలో అనేకమంది ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. చివరికి మాదిగలతో సహా సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని ఆకలి నుంచి కాపాడేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటూ ఒంగోలు పట్టణంలో జరుగుతున్న కార్యక్రమం క్రైస్తవానికి ఉన్న బలాన్ని ప్రదర్శించింది. వేలాదిమంది కళ్ళలో ఆశ్చర్యం నింపింది. ప్రతి ఒక్కరూ "ఇది చాలా మంచి మతం" అన్నారు. అనేక మాసాల తర్వాత రాగులు పంట తొందరగా వచ్చింది. ఆ తర్వాత వారి తగినంత పండింది. ఒక గొప్ప సంక్షోభం ముగిసింది. దాని తదనంతర ప్రభావం ఏమిటి?<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|72|}}</noinclude> gjxxmdfdn7jhq11esoidit3uk557g4p పుట:Cheppulu Kudutu Kudutu....pdf/74 104 212400 555369 554288 2026-05-03T01:26:15Z శ్రీరామమూర్తి 1517 555369 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}2. ఆధునిక పెంతకోస్ట్</p> {{Largeinitial|క}}రువు ముగిసాక బోధకులు తమ తమ స్థలాలకు వెళ్లేసరికి అనేకమంది బాప్టిజానికి సిద్ధంగా ఉండటం కనిపించింది. అంతకు ముందు అర్ధమనస్కంగా ఆహ్వానించిన గ్రామాలు పూర్తిగా ద్వారాలు తెరిచాయి. కరువుకు ముందు అనేక ఏళ్ళుగా జీసన్ క్రీస్తు గురించి చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు తమకు క్రీస్తులో నమ్మకం కుదిరిందన్నారు. ఆ తొలి ఒంగోలు బోధకులందరూ చెప్పుకోదగ్గ బృందం. వారిలో ఎందరో సహజ నాయకులు. కొందరు ఎక్కువ విశ్రాంతి అవసరమైనవారయినా గొప్ప దైవభక్తిపరులు. "వారికి విశ్వాసం ఉంది. దేముడిని ప్రార్ధించితే ఆయన వారిని వింటాడు" అనేవారు జనం. చాలామందికి ఇవాంజలిస్ట్ వరం ఉండేది. ఇతరులు వెళ్ళనిచోట్లకి వెళ్ళేవారు. వాళ్ళు ప్రయాణం చేసిన చోటల్లా జనం “మనమీ కొత్త మతంలో చేరటం మనకు మంచిది" అనేవారు. చాలామంది బోధకులు ఫాస్టర్స్గా స్థిరపడ్డారు. మధ్యలో ఉన్న ఓ గ్రామాన్ని కేంద్రంగా చేసుకున్నారు. చుట్టూ ఉన్న ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించారు. మిషన్ స్టేషన్కి దూరంగా ఉన్నచోట్ల వాళ్ళంత వాళ్ళు పనిచేయగలిగేట్టు తన మనుషులలో బాగా పనిచేసేవాళ్ళను నియమించాడు మిషనరీ. పరిస్థితుల ఒత్తిడుల మధ్య నిలబడే సామర్ధ్యం చాలా మంది అభివృద్ధి చేసుకున్నారు. ఉత్సాహ తరంగం గట్టిగా పనిచేసే వాళ్ళతో బాటు అంత శక్తిమంతులు కాని వాళ్ళని కూడా వాళ్ళ శక్తికి మించిన పనులు చేయించింది. ఆ కాలంనాటి ఉత్సాహశక్తి అసాధారణమైనది. కరువుకి నాలుగేళ్ళ ముందు రామపట్నంలో ఒక ధియోలాజికల్ సెమినరీని ప్రారంభించారు. అందులో పనిచేసిన తొలికార్యక్రమంలో అనేకులు ఒంగోలులో ఒక ఏడాది పాటు కలిసి చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్నారు. కాని ఆ రోజులు ఎంత విలువైనవో వారికి తెలుసు. దాని గురించి విన్న వాళ్ళెందరో యింకా తెలుసుకోవాలని కబుర్లు పంపేవారు. చాలా కబుర్లు వస్తున్నాయి గనుక మీరు వెళ్ళి తీరాలని మిషనరీ చెప్పిన రోజు సమీపించింది. వారికి తిరిగి చదువుకునే సమయం వస్తుందని ఆయన మాట యిచ్చాడు గాని ఆ సమయం మళ్ళీ రాలేదు. వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళి బరువులు ఎత్తుకున్నారు గాని కనీసం ఒక్క. సంవత్సరమైనా వాటిని దించుకోలేకపోయారు. గొప్ప ఆలోచనతో వాక్పటిమతో గాని వారి బోధనలు ఉండేవి. కావు. కేవలం క్రీస్తు కథ ఆయనని సిలువ వెయ్యటం మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. ఆ ఆదిమ క్రైస్తవ రోజులలో అదే చాలా ఎక్కువగా ఉండేది. క్రీస్తు జీవితం, చావూ కథని ఎంతో హత్తుకునేలా చెప్పటంతో వారి మాటలకి ఆలోచనలకీ క్రీస్తుని కేంద్రబిందువుగా చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు 73 చేసింది. క్రీస్తుని అనుసంధానించే ఒక మృదువైన అంతశ్శక్తి ఒంగోలు తొలి క్రైస్తవులలో ఉండేది. అది చాలామందిలో అరుదు. వాళ్ళందరూ కలిసి కూర్చుని క్రీస్తు వేదనామయ గాథను ఒకరికొకరు చెప్పుకుని కన్నీరు పెట్టుకొనేవారు. “ఆ రోజుల్లో ఆయన (క్రీస్తు) మీద ప్రేమ అటువంటిది" అని నాతో అన్నారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి మిషనరీకి వచ్చారు. వందలు, వేలాది మంది బాప్టిజంకి సిద్ధంగా ఉన్న విషయం మాట్లాడాలని వచ్చారు. "కరువు ముగిసే వరకూ ఆగండి" అని మిషినరి చెప్పేవాడు. కరువుకి ఒంగోలులో యిచ్చే సహాయం యింక జరగదని ఆయన కబురు పంపించాడు. మరింత సహాయం దొరుకుతుందన్న ఆశతో కొందరు చేరవచ్చని ఆయన భయపడ్డాడు. పదిహేను నెలలుగా ఒక్క బాప్టిజం కూడా జరగలేదు. ఆయనకి తనేం చేస్తున్నదీ తెలుసు. అనేకమంది గుంపులుగా వచ్చి బాప్టిజం అడుగుతుంటే తిరస్కరించాడు. ఒకమారు లాకులు తెరిస్తే ఎవ్వరూ ఆ ప్రవాహాన్ని ఆపలేరని ఆయనకి తెలుసు. బోస్టన్లోని మిషన్ సెక్రటరీ నుంచి లేఖ వచ్చింది. "అడిగిన వారికి నువ్వు బాప్టిజం యివ్వటం లేదని వింటున్నాను. నీకిలా చేసే అధికారం ఎవరు యిచ్చారు?” 1878లో జూన్ లో తన సహాయకులకి లేఖలు రాశాడు మిషనరీ. ఒంగోలుకి ఉత్తరాన పదిమైళ్ళ దూరంలో గుండ్లకమ్మ నది ఒడ్డున చింతల తోపులో ఉన్న రహదారి బంగ్లా వద్దకు రమ్మన్నాడు. కలరా మశూచికం పల్లెటూళ్ళలో ఉండటం వల్ల అవి ఒంగోలులో వ్యాపించకుండా జాగ్రత్తపడ్డాడు. వాళ్లతో అత్యవసర విషయాలు మాట్లాడవలసిన క్రైస్తవులను మాత్రం తీసుకురమ్మన్నాడు. మతం మారాలనుకున్న వారిని వదిలేసి రమ్మన్నాడు. ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా బోధకుల వెనకే మతం మారాలనుకున్న వాళ్ళు వచ్చారు. వెల్లంపల్లికి మిషనరీ వచ్చేసరికి అనేకమంది బాప్టిజం కోసం వచ్చినవాళ్ళు ఎదురయ్యారు. ఆయన ఒక గోడ ఎక్కాడు. అందరి మొహాలలోకి చూశాడు. వాళ్ళకి యివ్వటానికి తన వద్ద మరేమాత్రం ధనం లేదని చెప్పాడు. యిళ్ళకి తిరిగివెళ్ళమని కోరాడు. "మాకు సహాయం అవసరం లేదు. బొబ్బలెక్కిన చేతులే మా పనికి సాక్ష్యం. మేం పని కొనసాగించాలనుకుంటున్నాం. కనుక మాకు బాప్టిజం యివ్వండి.” వాళ్లు అరిచారు. ఆయన సంకోచించాడు. వాళ్లు మళ్లీ అరిచారు. ఇంక వదిలేశాడు. బోధకులతో మాట్లాడాడు. జనం తరుపున వాళ్ళు కూడా వాళ్ల కోరికను తెలియజెప్పారు. క్రీస్తు చర్చిలో ప్రవేశించాలని ప్రార్ధించేవారిని ఆయన తిరస్కరించలేకపోయాడు. మొదటిరోజు ఒక మర్రిచెట్టు కింద ఇసుకలో అందరూ దగ్గరదగ్గరగా కూర్చున్నారు. అక్కడ అందరి అభిమానాన్ని దోచుకున్న పాటలలో అందరూ గొంతు కలిపారు. ఆశబ్దాల మధ్య<noinclude><references/></noinclude> ifooduidzjkmndgr9w98q2qj9x78ka3 555383 555369 2026-05-03T08:55:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 555383 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}2. ఆధునిక పెంతకోస్ట్</p> {{Largeinitial|క}}రువు ముగిసాక బోధకులు తమ తమ స్థలాలకు వెళ్లేసరికి అనేకమంది బాప్టిజానికి సిద్ధంగా ఉండటం కనిపించింది. అంతకు ముందు అర్ధమనస్కంగా ఆహ్వానించిన గ్రామాలు పూర్తిగా ద్వారాలు తెరిచాయి. కరువుకు ముందు అనేక ఏళ్ళుగా జీసస్ క్రీస్తు గురించి చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు తమకు క్రీస్తులో నమ్మకం కుదిరిందన్నారు. ఆ తొలి ఒంగోలు బోధకులందరూ చెప్పుకోదగ్గ బృందం. వారిలో ఎందరో సహజ నాయకులు. కొందరు ఎక్కువ విశ్రాంతి అవసరమైనవారయినా గొప్ప దైవభక్తిపరులు. "వారికి విశ్వాసం ఉంది. దేముడిని ప్రార్ధించితే ఆయన వారిని వింటాడు" అనేవారు జనం. చాలామందికి ఇవాంజలిస్ట్ వరం ఉండేది. ఇతరులు వెళ్ళనిచోట్లకి వెళ్ళేవారు. వాళ్ళు ప్రయాణం చేసిన చోటల్లా జనం “మనమీ కొత్త మతంలో చేరటం మనకు మంచిది" అనేవారు. చాలామంది బోధకులు ఫాస్టర్స్‌గా స్థిరపడ్డారు. మధ్యలో ఉన్న ఓ గ్రామాన్ని కేంద్రంగా చేసుకున్నారు. చుట్టూ ఉన్న ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించారు. మిషన్ స్టేషన్‌కి దూరంగా ఉన్నచోట్ల వాళ్ళంత వాళ్ళు పనిచేయగలిగేట్టు తన మనుషులలో బాగా పనిచేసేవాళ్ళను నియమించాడు మిషనరీ. పరిస్థితుల ఒత్తిడుల మధ్య నిలబడే సామర్ధ్యం చాలా మంది అభివృద్ధి చేసుకున్నారు. ఉత్సాహ తరంగం గట్టిగా పనిచేసే వాళ్ళతో బాటు అంత శక్తిమంతులు కాని వాళ్ళని కూడా వాళ్ళ శక్తికి మించిన పనులు చేయించింది. ఆ కాలంనాటి ఉత్సాహశక్తి అసాధారణమైనది. కరువుకి నాలుగేళ్ళ ముందు రామపట్నంలో ఒక ధియోలాజికల్ సెమినరీని ప్రారంభించారు. అందులో పనిచేసిన తొలికార్యక్రమంలో అనేకులు ఒంగోలులో ఒక ఏడాది పాటు కలిసి చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్నారు. కాని ఆ రోజులు ఎంత విలువైనవో వారికి తెలుసు. దాని గురించి విన్న వాళ్ళెందరో యింకా తెలుసుకోవాలని కబుర్లు పంపేవారు. చాలా కబుర్లు వస్తున్నాయి గనుక మీరు వెళ్ళి తీరాలని మిషనరీ చెప్పిన రోజు సమీపించింది. వారికి తిరిగి చదువుకునే సమయం వస్తుందని ఆయన మాట యిచ్చాడు గాని ఆ సమయం మళ్ళీ రాలేదు. వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళి బరువులు ఎత్తుకున్నారు గాని కనీసం ఒక్క సంవత్సరమైనా వాటిని దించుకోలేకపోయారు. గొప్ప ఆలోచనతో వాక్పటిమతో గాని వారి బోధనలు ఉండేవి కావు. కేవలం క్రీస్తు కథ ఆయనని సిలువ వెయ్యటం మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. ఆ ఆదిమ క్రైస్తవ రోజులలో అదే చాలా ఎక్కువగా ఉండేది. క్రీస్తు జీవితం, చావూ కథని ఎంతో హత్తుకునేలా చెప్పటంతో వారి మాటలకి ఆలోచనలకీ క్రీస్తుని కేంద్రబిందువుగా చేసింది. క్రీస్తుని అనుసంధానించే ఒక మృదువైన అంతశ్శక్తి ఒంగోలు తొలి క్రైస్తవులలో ఉండేది. అది చాలామందిలో అరుదు. వాళ్ళందరూ కలిసి కూర్చుని క్రీస్తు వేదనామయ గాథను ఒకరికొకరు చెప్పుకుని కన్నీరు పెట్టుకొనేవారు. “ఆ రోజుల్లో ఆయన (క్రీస్తు) మీద ప్రేమ అటువంటిది" అని నాతో అన్నారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి మిషనరీకి వచ్చారు. వందలు, వేలాది మంది బాప్టిజంకి సిద్ధంగా ఉన్న విషయం మాట్లాడాలని వచ్చారు. "కరువు ముగిసే వరకూ ఆగండి" అని మిషినరి చెప్పేవాడు. కరువుకి ఒంగోలులో యిచ్చే సహాయం యింక జరగదని ఆయన కబురు పంపించాడు. మరింత సహాయం దొరుకుతుందన్న ఆశతో కొందరు చేరవచ్చని ఆయన భయపడ్డాడు. పదిహేను నెలలుగా ఒక్క బాప్టిజం కూడా జరగలేదు. ఆయనకి తనేం చేస్తున్నదీ తెలుసు. అనేకమంది గుంపులుగా వచ్చి బాప్టిజం అడుగుతుంటే తిరస్కరించాడు. ఒకమారు లాకులు తెరిస్తే ఎవ్వరూ ఆ ప్రవాహాన్ని ఆపలేరని ఆయనకి తెలుసు. బోస్టన్‌లోని - మిషన్ సెక్రటరీ నుంచి లేఖ వచ్చింది. "అడిగిన వారికి నువ్వు బాప్టిజం యివ్వటం లేదని వింటున్నాను. నీకిలా చేసే అధికారం ఎవరు యిచ్చారు?” 1878లో జూన్‌లో తన సహాయకులకి లేఖలు రాశాడు మిషనరీ. ఒంగోలుకి ఉత్తరాన పదిమైళ్ళ దూరంలో గుండ్లకమ్మ నది ఒడ్డున చింతల తోపులో ఉన్న రహదారి బంగ్లా వద్దకు రమ్మన్నాడు. కలరా మశూచికం పల్లెటూళ్ళలో ఉండటం వల్ల అవి ఒంగోలులో వ్యాపించకుండా జాగ్రత్తపడ్డాడు. వాళ్లతో అత్యవసర విషయాలు మాట్లాడవలసిన క్రైస్తవులను మాత్రం తీసుకురమ్మన్నాడు. మతం మారాలనుకున్న వారిని వదిలేసి రమ్మన్నాడు. ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా బోధకుల వెనకే మతం మారాలనుకున్న వాళ్ళు వచ్చారు. వెల్లంపల్లికి మిషనరీ వచ్చేసరికి అనేకమంది బాప్టిజం కోసం వచ్చినవాళ్ళు ఎదురయ్యారు. ఆయన ఒక గోడ ఎక్కాడు. అందరి మొహాలలోకి చూశాడు. వాళ్ళకి యివ్వటానికి తన వద్ద మరేమాత్రం ధనం లేదని చెప్పాడు. యిళ్ళకి తిరిగివెళ్ళమని కోరాడు. "మాకు సహాయం అవసరం లేదు. బొబ్బలెక్కిన చేతులే మా పనికి సాక్ష్యం. మేం పని కొనసాగించాలనుకుంటున్నాం. కనుక మాకు బాప్టిజం యివ్వండి.” వాళ్లు అరిచారు. ఆయన సంకోచించాడు. వాళ్లు మళ్లీ అరిచారు. ఇంక వదిలేశాడు. బోధకులతో మాట్లాడాడు. జనం తరుపున వాళ్ళు కూడా వాళ్ల కోరికను తెలియజెప్పారు. క్రీస్తు చర్చిలో ప్రవేశించాలని ప్రార్ధించేవారిని ఆయన తిరస్కరించలేకపోయాడు. మొదటిరోజు ఒక మర్రిచెట్టు కింద ఇసుకలో అందరూ దగ్గరదగ్గరగా కూర్చున్నారు. అక్కడ అందరి అభిమానాన్ని దోచుకున్న పాటలలో అందరూ గొంతు కలిపారు. ఆశబ్దాల మధ్య<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|73|}}</noinclude> o3bqg8stry2cgc4hhf5d5h8ky8t9hj7 పుట:Cheppulu Kudutu Kudutu....pdf/75 104 212401 555384 554289 2026-05-03T09:13:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 555384 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సరైన సమన్వయం లేకపోవచ్చు గాని అందులో పాల్గొన్న వారందరి చిత్తశుద్దీ ద్యోతకమవుతోంది. కరువులో వారందరూ నేర్చుకున్న వాక్యాలు మిషనరీ బోధించాడు. "నా వద్దకు రమ్ము. నీ బరువు బాధలు కొని రమ్ము". గంటన్నరసేపు మాట్లాడాడు. ఎవరూ విసుగెత్తలేదు. వారి కష్టాలను వారితో సహా ఆయనా భరించాడు. కనుక ఒక సంపూర్ణ అనుభవంలో అందరూ భాగం వహించటం గూర్చి మాట్లాడగలిగాడు. గుండ్లకమ్మ నదీతీరాన ఆ ప్రార్ధన ఆ రోజులలో అత్యంత ప్రముఖమైనది. మరుసటిరోజు పొద్దుటే పెద్ద ఎత్తున ఎవరెవరో తెలుసుకునీ సమావేశం మొదలయింది. బోధకులందరినీ వారి వారి ప్రాంతాలవారీ జనాన్ని విడదీయమన్నాడు. ఒక్కొక్కరూ వాళ్ళ వాళ్ళు ప్రత్యేక రంగానికి చెందిన వాళ్లని తీసుకుని వేరువేరు చెట్ల కిందకి వెళ్ళారు. అలా అనేక గుంపులు ఏర్పడ్డాయి. కొన్నింటిలో వందలమంది ఉంటే కొన్నింటిలో కొందరే ఉన్నారు. ఒక్కో బోధకుడికీ అతని గ్రామంలోని మాదిగ కుల పెద్దలు, ఇతర కుటుంబ పెద్దలూ సహాయపడ్డారు. ఈ ఉద్యమంలో తెగ లక్షణాలు కనబడ్డాయి. ప్రతి సమూహమూ గ్రామాలుగా ఆ తర్వాత కుటుంబాలుగా విభజించారు. అయితే యీ తెగలక్షణం ప్రభావం కొద్దిగ మాత్రమే ఉంది. కొత్త జీవితంలోకి ప్రవేశించాడని వారికి సాక్ష్యంగా నిలబడేవారు లేకపోయారు. ఎవరికి వారే సాక్ష్యం. అందరి పరిస్థితీ అలాగే కనిపిస్తోంది. వెల్లుంపిల్లిలో ఆరోజులు గురించి పాత బోధకులను నేను అనేక ప్రశ్నలు వేశాను. అందులో ఒకరు అన్నారు. "దాదాపు వంద మందితో నేను ఒకపక్కన ఉన్నాను. దొర నా దగ్గరకు వచ్చి నీకు వీళ్ళందరూ తెలుసా అని అడిగారు. నాకు అందరూ తెలియదు అని చెప్పాను. నాతో కలిపి అందరినీ పర్యవేక్షించాడు. వాళ్ళు గ్రామాలకు ఆయన లోగడ వెళ్ళాడు. నాకు తెలియని వాళ్ళందరినీ ఆయన పంపెయ్యమన్నాడు. కాని వాళ్ళు వెళ్ళలేదు. శిబిరానికి చుట్టుపక్కల ఉండిపోయారు. అయితే నాకు తెలిసిన వాళ్ళ పేర్లే నేను రాశాను” ఇది సాధారణంగా జరిగే పద్ధతి. ఒక అసిస్టెంటు ఫ్రీచర్ కథని కొందరు చెప్పారు. ఇప్పటికి కూడా తను చేసిన దానిని పెద్దగా చేసి చెపుతాడు. అప్పుడు కూడా అదే లక్షణాన్ని ప్రదర్శించాడు. కనీసం అయిదు వందల మందిని తనతో తీసుకువచ్చాడు. మిషనరీ వాళ్ళని చూశాడు. ఆ ప్రదేశానికి బాధ్యత వహించే ఫ్రీచర్‌న్ పిలిచాడు. వీరు నిజమైన క్రైస్తవులుగా ఉంటారని నువ్వు ఎంతమందికి జవాబుదారీ వహిస్తావు. అని అడిగాడు. అతనో పది మందిని ఎంచాడు. మిగిలిన వారికి బాధ్యత వహించటానికి అతను సంకోచించాడు. అసిస్టెంట్ ఫ్రీచర్‌కి అది చాలా చెడ్డరోజు. దొర అతన్ని మందలించి అతన్ని అతనితో వచ్చిన వారినీ పంపేశాడు. నేను తరచు అడిగే ప్రశ్న ఏంటంటే “ఒక స్త్రీ గాని పురుషుడు గాని క్రైస్తవులు అని నువ్వు ఎలా చెప్పగలవు?” “మేం అనేక రకాలుగా చెప్పగలం. ప్రార్ధిస్తున్నపుడు, పాటలు పాడుతున్నపుడు వారిలో దివ్యజీవితం ఉందని మాకు తెలుసు. సారా మానేసి, గొడవలు వదిలి పెట్టి, చచ్చిన గొడ్డుమాంసం తినటం మానేసి, ఆదివారాలు విశ్రాంతి తీసుకుని వాళ్ళలో మార్పు కనిపిస్తుంది. అది కూడా మాకు తెలుసు" అన్నారు. వెల్లుంపిల్లిలో బాప్టిజం తీసుకున్న వారిలో చాలామంది కరువుకు ముందే నిజమైన క్రీస్తు విశ్వాసులు. ఏదో కారణాల వల్ల ఆగినవారు. ఒక మార్పు వచ్చిందని వారి మాటలను బట్టే ఫ్రీచర్స్ చెప్పగలిగేవారు. మతం ఇచ్చిన వారికన్నా నిరాకరించిన వారి పట్లే ఫ్రీచర్స హెచ్చుగా ఆందోళన పడుతున్నట్లు, శ్రద్ధ వహిస్తున్నట్లు కనిపించింది. వందలకొద్దీ జనాన్ని తిరిగి పంపేశారు. ఈ రోజున కూడా ఫ్రీచర్‌ని కొన్ని గ్రామాలలో అంటూంటారు. "మా జుత్తులు కత్తిరించమని మేం వెల్లంపల్లి వచ్చాం. బాప్టిజం ఇవ్వమన్నాం. యివ్వలేదు. అప్పుడు మీరు అంగీకరించిన వాళ్ళ దగ్గరకే వెళ్ళండి. మీరు మాకు అక్కరలేదు." 1878 జులై రెండవ తారీఖు మొదటిరోజున 614 మంది బాప్టిజంతో ప్రారంభం జరిగింది. తరువాత రోజున 2222 మంది, మూడోరోజున మరో 700 మంది, మూడు రోజులకీ కలిపి మొత్తం 3536. గుండ్లకమ్మ నదిలో నీరు ఆ సమయానికి బాగా లోతుగా ఉంది. ఒక్కోసారి యిద్దరు చొప్పున ఆరుగురు అర్హత పొందిన ఫ్రీచర్స్ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్కరి పేరూ పిలిచేవారు. ఎలాంటి ఆలస్యమూ అయోమయమూ లేకుండా ఒకరితర్వాత ఒకరుగా వచ్చారు. “నిన్ను తండ్రి నామమున, కుమారుడి నామమున, పవిత్ర ఆత్మనామమున నేను నీకు బాప్టిజం యిచ్చుచున్నాను." అని ఫ్రీచర్ ఒకరిని ప్రకటించగానే, రెండవ ఫ్రీచర్ ముందు మరొకరు సిద్ధంగా ఉండేవారు. చర్చి చరిత్రలో అత్యంత పవిత్రమైన పదాలను ఉచ్చరించే వారు బాప్టిజం తీసుకునేవారు. ఆ విధంగా ఒక రోజులో 2222 మంది బాప్టిజం స్నానం చేయించటం సాధ్యపడింది. మిషనరీ పక్కనే ఉండి సహాయం చేస్తూ మార్గదర్శకత్వం చేశాడు. ఆ రోజుల్లో ఒక్కరికి కూడా ఆయన స్వయంగా బాప్టిజం యివ్వలేదు. ఒక భారతదేశపు నది ఒడ్డున జరిగిన ఈ సంఘటనకి క్రైస్తవ ప్రపంచపు విశ్వాసాలకు మధ్య ఒక లంకెలా నిలబడ్డాడు. తన స్వదేశంలో అనేకమంది హృదయాలు భక్తితోను, సంతోషంతోనూ పొంగిపోతాయని ఆయనకు తెలుసు. అయితే విమర్శకులు కూడా ఉంటారు. క్రైస్తవ బోధనల తాలూకు అత్యంత ప్రాధమిక సమాచారం తప్ప మరేమి నేర్వని జన బాహుళ్యానికి తొందరపడి క్రీస్తు చర్చిలోకి ప్రవేశం కల్పించినందుకు ఆయన్ని తప్పుపట్టారు. ఇంత జనానికి క్రైస్తవ శిక్షణ యివ్వటానికి ఎన్నో సంవత్సరాల కఠిన పరిశ్రమ అవసరం. ఇంకా అనేకమంది వస్తున్నారు. ఏడాది ముగిసేసరికి 9606 మంది ఒంగోలు చర్చిలో చేరారు. మొత్తం సభ్యత్వం 13000 అయింది. ఆతర్వాత<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|74|}}</noinclude> f4zan0qj057w0yr9yao7eo112wiy1vr పుట:Cheppulu Kudutu Kudutu....pdf/76 104 212402 555388 554290 2026-05-03T11:38:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 555388 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సంవత్సరాలు కూడా ఆ ఏడాది కొనసాగింపే అయాయి. 1890 మరో మారు 1671 మంది ఒకేరోజున బాప్టిజం తీసుకున్న సంఘటన జరిగింది. అయితే కరువుకీ యీ ప్రజా ఉద్యమానికి సంబంధం ఏమిటి? ఆకలి కరాళ నృత్యం, కరువు భీభత్సం మధ్య రెండేళ్ళు నలిగిపోయిన జనాన్ని మిషనరీ అతని సహాయకులూ కేవలం మాటలలోనే కాకుండా చేతలలో కూడా చూపించిన బోధనలు నిస్సందేహంగా అనేకమందిని దయామయుడూ సర్వోన్నతుడూ అయిన క్రీస్తు వైపుమరల్చాయి. సర్వశక్తిమంతుడైన దేముడు కరువు వంటి సంక్షోభాన్ని కూడా తన పవిత్ర లక్ష్యానికి సాధనం చేసుకోగలడు. అయితే మాదిగలను క్రైస్తవం వైపు తరలించిన పరిస్థితులలో కరువు ఒకటయినప్పటికీ ఇది ఆరోగ్యకరమైన సామాన్యమైన పరిస్థితి కాదు. ఈ ఉద్యమానికి అనుకూలించిన పరిస్థితులలో ఇవ్వవలసిన దానికన్నా హెచ్చు ప్రాధాన్యతను కరువుకి యిచ్చినట్టు కనిపిస్తుంది. మొదట కరువు రావటం, సహాయ శిబిరం ఏర్పడటం, వేలాదిమంది బాప్టిజం తీసుకోవటం వరసగా జరగటం సత్యమే. ఈ వరస కార్యాకారణ సంబంధాన్ని చూపిస్తుంది. అయితే కరువు లేకపోయినప్పటికీ క్రైస్తవం వైపు తరలటం అనేది ఇంత భారీ ఎత్తుగా జరిగి ఉండేదని నేను నమ్ముతున్నాను. కరువు లేకపోతే గుండ్లకమ్మ నదీ తీరాన ఆ పెంటకోస్టు దినం జరిగి ఉండేది కాదు. కాని ఇదే మతాంతరులు కొద్దికొద్దిగా వచ్చి ఉండేవారు. సాధారణమైన పెరుగుదల జరిగి ఉండేది. ఒంగోలు మిషనరీ చరిత్రలో కరువు రెండవ అధ్యాయాన్ని హఠాత్తుగా తెరిచింది. నైతిక, ఆధ్యాత్మిక, సహజ ప్రపంచాలలోని అభివృద్ధి సూత్రాలకి ఈ హఠాత్పరిణామాలు నప్పవు. కరువుకు ముందు పదేళ్ళలోనూ బోధకులు అనుకూల పరిస్థితులలో చాలా శ్రమపడ్డారు. మిషనరీ తన సరిహద్దులను పెంచుకుని బలం కూడగట్టుకోగలిగాడు. సామాన్యమైన పెరుగుదల ఉండేది. మిషన్ శ్రద్ధ తీసుకోవటానికి అనుగుణంగా మతమార్పిడి జరిగేది. కరువూ దాని తరువాత పరిణామాలు లెక్కలకి మించినవి. కరువుకు ముందు సంవత్సరాల గురించి అనుభవజ్ఞులైన బోధకులు చెప్పాక నేను వారిని అడిగాను. "కరువు తర్వాత సంవత్సరాలలో సంగతులు చెప్పండి" అన్నాను. దానికి జవాబుగా వాళ్ళు మరో ప్రశ్న వేశారు. “చెప్పటానికి ఏముంది. వేలాది మంది రాలేదా జరిగినవి చిన్నాచితకా సంఘటనలు కావు గుర్తుంచుకోటానికి వివరాలు చెప్పటానికినూ” బలిష్టమైన ఉన్నతమైన జాతికి సైతం ఆకలి ఔన్నత్యాలకు తీసుకువెళ్ళగలిగే అనుభవం కాదు. పిడికెడు అన్నం కోసం అవమానితులైన మాదిగలు మరింత దిగజారిపోయారు. వాళ్ళకి ఏ గేదో, మేతో ఉండి వుంటే వాటిని కూడా పోగొట్టుకున్నారు. దుర్భర దారిద్ర్యంతో, రోగాలతో బక్కచిక్కిపోయినా, కరువు ముగిశాక తిరిగి బతికి బట్ట కట్టాలి. అతనిలో ఎంత ధృఢత్వం ఉన్నా ఉన్న దానికి గట్టి దెబ్బ తగిలింది. ఎవరు సాయం చేసినా వారి మీద ఆధారపడటానికి సిద్ధమయ్యాడు. ఈ స్థితిలో మిషన్ అతన్ని దగ్గరకు తీసుకుని అతనికి ధైర్యం చెప్పి మనిషిని చేసింది. ఆ సమయంలో మిషన్ ఎదుర్కొన్న గడ్డు సమస్యలు కరువు నుంచే ఉత్పన్నమయ్యాయని సులువుగా చెప్పవచ్చు. మిషన్‌లోని పాతవారు తమ వ్యక్తిగతానుభవాలు చెపుతున్నపుడు మత మార్పిడికి తప్పనిసరిగా దారితీసిన వాటినన్నింటినీ నేను శ్రద్ధగా గమనించాను. పాశ్చాత్య బుద్ధికి తప్పనిసరిగా దైవం పట్ల ఎరుక కలిగించిన అడుగులే ఈ మాదిగలకు కూడా ఎరుక కలిగించాయి. వారిపద్దతిలో వారు పాపం చేశామన్న అంగీకారంతో వచ్చారు. పశ్చాత్తాపం ఉంది. భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఈ ప్రజా ఉద్యమం మొదలయినపుడు ఈ అడుగులు అసంకల్పితంగా వ్యక్తి సమూహంతో కొంతవరకూ కొట్టుకుపోయాడు. మాదిగ సమాజం పునాదులతో సహా కదిలిపోయింది. వ్యక్తి అనుభవం మొత్తంలో మునిగిపోయింది. కరువుకు ముందు పదేళ్ళ లోతైన ధార్మిక జీవితాంశ దీనంతటికీ ముందు ఉంది. రాలిపోవలసినది ఒక్కమారుగా రాలిపోయినట్లయింది. కాని మాదిగలు రాజయోగి మతంలోని గురువులను వదిలేశారు. రామానుజ మతంలోని విగ్రహాలను మిషనరీకి తరలించారు. శివమతంలోని లింగాలను పాముల విగ్రహాలను బళ్ళకొద్దీ ఒంగోలు మిషన్ కాంపౌండ్‌లోకి తెచ్చారు. మాతంగికుటుంబం, ఆమె ఉపదేశానికి అయిన ఖర్చు పెట్టుకున్న వారితో సహా వచ్చి క్రైస్తవ బోధకుని అనుమతితో మాతంగి కర్రముక్కలు ముక్కలు చేశారు. తట్టను చించేశారు. నత్త గుల్లలు అలంకరించిన ఎల్లమ్మ కుండలు వందలాది మంది ధ్వంసం చేశారు. మాదిగల పాత సంప్రదాయాలన్నీ తుడచిపెట్టేసి మత విప్లవం క్రీస్తు తప్ప వారికి మరేమీ లేకుండా చేసింది. ఆధ్యాత్మిక జీవితమూ శక్తీ ఆ తరువాత సంవత్సరాలలో స్పష్టంగా కనిపించించింది. గొప్ప ధైర్యం, మత ద్వేషాలకు తలొగ్గకుండా భరించటం వంటి లక్షణాలతో ఉన్నతమైన ఉదాహరణలు నెలకొల్పబడ్డాయి. అయితే మానసికమైన నైతికమైన ఎదుగుదల స్తంభించిపోయి ఆధ్యాత్మికమైన అశ్రద్ధ కూడా ప్రబలింది. బంగారపు తాతయ్య ఒకామెను నా దగ్గరకు తెచ్చాడు. ఆమె ఓ అయిదేళ్ళ కుర్రాడిని నడిపించుకుని వచ్చింది. అప్పటికి కరువు ముగిసి అయిదేళ్ళయింది" నాకూ, నా ప్రభువు ఏసుక్రీస్తుకూ నా ప్రాంతంలో ఈమె గౌరవనీయురాలు. క్రైస్తవం తీసుకున్నపుడు ఈమె భర్త ఏమీ అనలేదు. పదహారేళ్ళ బంగారం లాంటి పెద్ద కొడుకు కొన్నాళ్ళకు చనిపోయాడు. భర్త ఈవిడను హింసించటం మొదలుపెట్టాడు. పాత స్వాములకు పూజలు మానినందువల్లనే తన కొడుకు చనిపోయాడని అన్నాడు. ఆ తర్వాత మరో బిడ్డ చనిపోయింది. నువ్వా కొత్త మతం వదిలెయ్యాలని పట్టుపట్టాడు.<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|75|}}</noinclude> q9kkmp2hhhcfuzd7tkvasfucao2l8su పుట:Cheppulu Kudutu Kudutu....pdf/77 104 212403 555385 554291 2026-05-03T09:24:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 555385 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>జుత్తు పట్టుకుని నేలమీద ఈడిచాడు. చెట్టుకు కట్టి కొట్టాడు. ఇన్ని కష్టాలలోనూ ఆమె విశ్వాసం సడలలేదు. భర్త ఈమెను వదిలి మరొకరితో వెళ్ళిపోయాడు. మీరీమెని స్కూల్లోకి తీసుకోండి” అని చెప్పాడు. ఈ సంఘటన మొత్తం దృశ్యాన్ని కాంతిమతం చేసే అపూర్వకాంతులలో ఒకటి. ఎవరైనా ఈ కాంతుల వెనక చీకట్లను రకరకాల దుష్టస్వభావాలను పట్టించుకున్నారా? వారి అజ్ఞానాన్ని అధోపతనాన్నీ తెలుసుకున్నారా? కొన్నేళ్ళ క్రితం నేను నా భర్తతో కలిసి గ్రామాలకు వెళ్ళాను. ఒక చింత చెట్టు కింద తన ఎదురుగా కూర్చున్న కొందరు మాదిగలకు ఆయన దైవబోధ చేస్తున్నాడు. ఆ గ్రామానికి చెందిన ఇరవై మంది క్రైస్తవులు తిరిగి విగ్రహారాధన వైపు మరలారు. వారితో ఆయన మాట్లాడుతున్నాడు. ఉదయమే ఆయన ఆ గ్రామానికి వెళ్ళాడు. వారు తిరిగి పూజిస్తున్న స్వాములను చూశాడు. వాళ్ళు తిరిగి తమ జుత్తు పెంచుకున్నారు. స్త్రీలు మురికి బట్టలతో చింపిరి జుత్తులతో దెబ్బలాడుకుంటూ బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. చచ్చిన గొడ్డుమాంసం తిరిగి వాడలోకి వచ్చింది. చెప్పటానికి వీల్లేనంత అసహ్యంగా చీదరగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితినంతటినీ మిషనరీ వివరించి ఒక అభ్యర్ధన చేశాడు. "పేదవారికి గురువు అయినందుకు సిగ్గుపడను. ఎందుకంటే రోగులకి చికిత్స చేయుము, పేదలలో సువార్త వినిపించుము అని క్రీస్తు చెప్పాడు. ఒక్కోమారు మీ ఊళ్ళలో మిమ్మల్ని చూస్తే నా మనులో ఒక బాధ మొలకెత్తుతుంది. ఇంత మురికి మనుషులకు గురువుగా దేముడు నన్నెందుకు నియమించాడా అని ప్రశ్నించుకున్నాను." అంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అనుకోకుండా ఆడవాళ్ళు తలలు దువ్వుకోవటం మొదలు పెట్టారు. ఈ భారతీయ పరియా తెగలలో అట్టడుగున ఉన్న వీరి మొహాలు పరిశీలిస్తుంటే ఎలాంటి బోధలకైనా వారెంత మొండిబారినా వారిలో కదలిక లేకుండాపోలేదు. వారి మొహాలలో సిగ్గు నేను చూడగలిగాను. వాళ్ళు వినటానికి సిద్ధంగా ఉన్నారు. వారిలోని ఈ కదలిక వారిలోని ఆధ్యాత్మిక జీవితం ఇంకా మిగిలి ఉందనటానికి నిదర్శనం. ఎందుకంటే ఆత్మలు చనిపోయిన వారు ఏదీ వినలేరు. పశుప్రాయంగా వందలాది సంవత్సరాలు దారితప్పిన వారు పాపం! ఇలాంటి గ్రామం మిషనరీకి ఒక్కటి కనిపిస్తే తన జనం చూసుకుని ఆయన గర్వపడే గ్రామాలు అనేకం కనిపిస్తాయి. శుభ్రతగా పొందికగా కనిపిస్తూ ఇళ్ళని ఉంచుకుంటూ వాళ్ళు ఆయన్ని కలుసుకోటానికి వచ్చేవారు. కుటుంబ పెద్దలు ఆయన్ని సాదరంగా ఆహ్వానించేవారు. గ్రామంలో ఒక పాఠశాల దానిలో చేతిలో పలకలతో పిల్లలూ ఉండటం ఆ గ్రామం స్థితికి చిహ్నం. మునసబు కరణాలు దొరకు సగౌరవంగా సలాములు చేసే వారు. క్రైస్తవుల ప్రవర్తన ఈ దొరకు ఆయన మతానికీ గౌరవం తెచ్చిపెట్టింది. ఆయన బోధిస్తుంటే జనం వచ్చేవారు. వారిలో శూద్రులు కూడా ఉండేవారు. ఓ పక్కన కూర్చుని శ్రద్ధగా వినేవారు. "మంచి మతం. మనం విందాం" అనుకునేవారు. అలాంటి గ్రామాలలో ఒక విధమైన ఆధ్యాత్మిక శక్తి ఉత్సాహమూ ఉండేవి. ఆఖరుకు ఒక ప్రశ్న కలుగుతుంది. "క్రైస్తవాన్ని తప్పించి భూమ్మీద మరే శక్తి అయినా అతి తక్కువ సమయములో ఒక్క తరంలో మొత్తం ఒక సమాజాన్ని అభివృద్ధి చేయగలదా?"<noinclude><references/> {{rh|చెప్పులు కుడుతూ.. కుడుతూ.. తెలుగు మాదిగల గాథలు|76|}}</noinclude> bj3yb2v0mnfd31e5kjuaddj460hjmh5 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/267 104 212710 555345 554933 2026-05-02T12:14:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555345 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>టీక.] ఆసవా...చక్రాంకుఁడు — ఆసవామోద = మద్యపరిమళముయొక్క; మాధుర్య = తియ్యదనమును; ధుర్య = సహించిన; అసురస్త్రీ = రాక్షసస్త్రీలయొక్క; కపోలద్వయీ = రెండుచెక్కిళ్ళయందలి; పత్రరేఖా = మరికలకు; అపకారక్రియా = అపకారము చేయుటయందు; క్రూర = కఠినమైన; చక్రాంకుఁడు = చక్రాయుధము చిహ్నముగాఁగలవాఁడు, దుర్వ....గుర్విచేన్ = మోయరాని దేహముకాంతిచే బరువైన; ఉర్విచేన్ = భూమివలన; కన్న = కనఁజేసిన - సంపాదించిన; పృథ్వాఖ్యసృథ్వీశముఖ్యుండు = పృధువను పేరుగల రాజురూపమునఁ బుట్టినవాఁడు; పుండ్రేక్షకోదండలక్షాభుఁడు = లక్షమంది మన్మథులకు పోలినవాఁడు; అంచద్దరస్మేరసారుండు = ఒప్పిదమైన చిరునవ్వుసారము కలవాఁడు; దారోత్తమల్ = ఉత్తమభార్యలు; పక్ష్మలాలాక్షీశిరోరత్నమున్ = శ్రేష్ఠురాలయిన ఉవిదయు; పంచాబ్దుఁడు = ఐదేండ్లవయసువాఁడు; ప్రోడలు = ప్రౌఢులు; బోడలు = మునులు; పెన్నిక్క= గొప్ప ఆశ్రయము - ఆశ్రయమైనవాఁడు; ఆవిష్కృతిన్, చూసి = ప్రత్యక్షమయి. {{Telugu poem|type=క.|lines=<poem>కనుదెఱచి తనదు<ref>ట. లోలన్</ref>లోనం, గను<ref>క. దేజము</ref>తేజము మ్రోలఁ గాంచి కమలాసనుఁ డా డినయట్ల నిక్క మయ్యెన్, విన; గన నిది క్రొత్త యనుచు వెస నుత్థితుఁడై.</poem>|ref=78}} '''టీక'''. తనదులోనన్ = తనహృదయమునందు; మ్రోలన్ = ఎదుటను; వెసన్ = వేగముగా; ఉత్థితుఁడై = లేచినవాఁడై. {{Telugu poem|type=సీ.|lines=<poemచామరధ్వజశంఖచాపప్రముఖచిహ్నలలితపదారణాలంకృతమహి దళితోపరిత్వగుజ్జ్వలదంశుమత్ఫలాస్తంభాభిరామోరుదండయుగళు వరదానముద్రాబ్జభరణభూషితకటిన్యస్తకుంచితసమున్నతభుజాఢ్యు సింహావలగ్నలక్ష్మీపరిహాసి<ref>చ. తోషిత</ref>తోయజగర్భగర్భవృత్తావలగ్ను></poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>జలదసంకాశునిర్వ్రీడజఘనదేశుఁ, గోటికందర్పలావణ్యగుణశరణ్యు విష్ణు నిజభక్తవర్ధిష్ణుఁ గృష్ణుఁ గాంచి, పఱచె సాక్రోశుఁ డగుచు నాబ్రాహ్మణుండు.</poem>|ref=79}} '''టీక'''. చామర...మహిన్ = చామరము, కేతువు, శంఖము, విల్లు మొదలగు చిహ్నములు కల పాదములుంచుటచే - (అట్టి పాదములతో నడచుటచే) (వానిచే) అలంకరింపఁబడిన భూమి కలవానిని; దళితో...యుగళున్ = ఒలువఁబడిన; ఉపరిత్వన్ = మీఁదితోలు కలదగుటవలన; ఉజ్జ్వలత్ = ప్రకాశించుచున్న; అంశుమత్ఫలాస్తంభ = అరఁటికంబములవలె; అభిరామ = మనోహరమైన; ఊరుదండయుగళున్ = దండములవంటి రెండుతొడలును కలవానిని; వర...భుజాఢ్యున్ = వరదానముద్రాబ్జధరణ = వరము, దానము, ముద్ర, పద్మము అను వానిని ధరించుటచే; భూషిత = అలంకరింపఁబడి; కటిన్యస్త = మొలయందుంచఁబడినదయి; కుంచిత = వంపఁబడిన; సమున్నతభుజాఢ్యున్ = మిక్కిలి పొడవైన భుజములు కలవానిని [శ్రీకృష్ణుఁడు వరాదులను ధరించి, ఒయ్యారముగ మొలపయి చేతులు వేసికొన్నాడని భావము.]; సింహా...వలగ్నున్ — సింహావలగ్నలక్ష్మీపరిహాసి = సింహమునడుమునందమును నవ్వుచున్నదయి; తోయజగర్భగర్భ = బ్రహ్మకు పుట్టువు కారణమయి; వృత్త = వర్తులమైన - గుండ్రమైన; అవలగ్నున్ = నడుము కలవానిని; జలదసంకాశున్ = మేఘమువంటివానిని - మేఘశ్యాముని; నిర్వ్రీఢజఘనదేశున్ = సిగ్గు లేని కటికలవానిని - దిగంబరుని; కోటికందర్పలావణ్యున్ = కోటిమంది మన్మథులచక్కఁదనము కలవానిని; గుణశరణ్యున్ = గొప్పగుణములు కలవానిని; విష్ణున్ = సర్వవ్యాపకుని; నిజభక్తవర్ధిష్ణున్ = తనభక్తులను వృద్ధి పొందించువానిని; ఆ బ్రాహ్మణుండు = ఆ పుండరీకుఁడు; సాక్రోశుఁ డగుచున్ = (రక్షణకొఱకు) అఱచుచున్నవాఁ డగుచు; పఱచెన్ = పరుగిడిపోయెను. [ఇట 'సాక్రోశుఁడు = తిట్టుటతో కూడినవాఁడు' అని వెనుకటి వ్యాఖ్య కలదు. అది అత్యంతాననుగుణము.] '''అలం'''. ఉదాత్తము, ఉపమ.<noinclude><references/></noinclude> i91gh12cc74cm9z6zk20sdf26xnkmld 555346 555345 2026-05-02T12:14:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 555346 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>టీక.] ఆసవా...చక్రాంకుఁడు — ఆసవామోద = మద్యపరిమళముయొక్క; మాధుర్య = తియ్యదనమును; ధుర్య = సహించిన; అసురస్త్రీ = రాక్షసస్త్రీలయొక్క; కపోలద్వయీ = రెండుచెక్కిళ్ళయందలి; పత్రరేఖా = మరికలకు; అపకారక్రియా = అపకారము చేయుటయందు; క్రూర = కఠినమైన; చక్రాంకుఁడు = చక్రాయుధము చిహ్నముగాఁగలవాఁడు, దుర్వ....గుర్విచేన్ = మోయరాని దేహముకాంతిచే బరువైన; ఉర్విచేన్ = భూమివలన; కన్న = కనఁజేసిన - సంపాదించిన; పృథ్వాఖ్యసృథ్వీశముఖ్యుండు = పృధువను పేరుగల రాజురూపమునఁ బుట్టినవాఁడు; పుండ్రేక్షకోదండలక్షాభుఁడు = లక్షమంది మన్మథులకు పోలినవాఁడు; అంచద్దరస్మేరసారుండు = ఒప్పిదమైన చిరునవ్వుసారము కలవాఁడు; దారోత్తమల్ = ఉత్తమభార్యలు; పక్ష్మలాలాక్షీశిరోరత్నమున్ = శ్రేష్ఠురాలయిన ఉవిదయు; పంచాబ్దుఁడు = ఐదేండ్లవయసువాఁడు; ప్రోడలు = ప్రౌఢులు; బోడలు = మునులు; పెన్నిక్క= గొప్ప ఆశ్రయము - ఆశ్రయమైనవాఁడు; ఆవిష్కృతిన్, చూసి = ప్రత్యక్షమయి. {{Telugu poem|type=క.|lines=<poem>కనుదెఱచి తనదు<ref>ట. లోలన్</ref>లోనం, గను<ref>క. దేజము</ref>తేజము మ్రోలఁ గాంచి కమలాసనుఁ డా డినయట్ల నిక్క మయ్యెన్, విన; గన నిది క్రొత్త యనుచు వెస నుత్థితుఁడై.</poem>|ref=78}} '''టీక'''. తనదులోనన్ = తనహృదయమునందు; మ్రోలన్ = ఎదుటను; వెసన్ = వేగముగా; ఉత్థితుఁడై = లేచినవాఁడై. {{Telugu poem|type=సీ.|lines=<poem>చామరధ్వజశంఖచాపప్రముఖచిహ్నలలితపదారణాలంకృతమహి దళితోపరిత్వగుజ్జ్వలదంశుమత్ఫలాస్తంభాభిరామోరుదండయుగళు వరదానముద్రాబ్జభరణభూషితకటిన్యస్తకుంచితసమున్నతభుజాఢ్యు సింహావలగ్నలక్ష్మీపరిహాసి<ref>చ. తోషిత</ref>తోయజగర్భగర్భవృత్తావలగ్ను</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>జలదసంకాశునిర్వ్రీడజఘనదేశుఁ, గోటికందర్పలావణ్యగుణశరణ్యు విష్ణు నిజభక్తవర్ధిష్ణుఁ గృష్ణుఁ గాంచి, పఱచె సాక్రోశుఁ డగుచు నాబ్రాహ్మణుండు.</poem>|ref=79}} '''టీక'''. చామర...మహిన్ = చామరము, కేతువు, శంఖము, విల్లు మొదలగు చిహ్నములు కల పాదములుంచుటచే - (అట్టి పాదములతో నడచుటచే) (వానిచే) అలంకరింపఁబడిన భూమి కలవానిని; దళితో...యుగళున్ = ఒలువఁబడిన; ఉపరిత్వన్ = మీఁదితోలు కలదగుటవలన; ఉజ్జ్వలత్ = ప్రకాశించుచున్న; అంశుమత్ఫలాస్తంభ = అరఁటికంబములవలె; అభిరామ = మనోహరమైన; ఊరుదండయుగళున్ = దండములవంటి రెండుతొడలును కలవానిని; వర...భుజాఢ్యున్ = వరదానముద్రాబ్జధరణ = వరము, దానము, ముద్ర, పద్మము అను వానిని ధరించుటచే; భూషిత = అలంకరింపఁబడి; కటిన్యస్త = మొలయందుంచఁబడినదయి; కుంచిత = వంపఁబడిన; సమున్నతభుజాఢ్యున్ = మిక్కిలి పొడవైన భుజములు కలవానిని [శ్రీకృష్ణుఁడు వరాదులను ధరించి, ఒయ్యారముగ మొలపయి చేతులు వేసికొన్నాడని భావము.]; సింహా...వలగ్నున్ — సింహావలగ్నలక్ష్మీపరిహాసి = సింహమునడుమునందమును నవ్వుచున్నదయి; తోయజగర్భగర్భ = బ్రహ్మకు పుట్టువు కారణమయి; వృత్త = వర్తులమైన - గుండ్రమైన; అవలగ్నున్ = నడుము కలవానిని; జలదసంకాశున్ = మేఘమువంటివానిని - మేఘశ్యాముని; నిర్వ్రీఢజఘనదేశున్ = సిగ్గు లేని కటికలవానిని - దిగంబరుని; కోటికందర్పలావణ్యున్ = కోటిమంది మన్మథులచక్కఁదనము కలవానిని; గుణశరణ్యున్ = గొప్పగుణములు కలవానిని; విష్ణున్ = సర్వవ్యాపకుని; నిజభక్తవర్ధిష్ణున్ = తనభక్తులను వృద్ధి పొందించువానిని; ఆ బ్రాహ్మణుండు = ఆ పుండరీకుఁడు; సాక్రోశుఁ డగుచున్ = (రక్షణకొఱకు) అఱచుచున్నవాఁ డగుచు; పఱచెన్ = పరుగిడిపోయెను. [ఇట 'సాక్రోశుఁడు = తిట్టుటతో కూడినవాఁడు' అని వెనుకటి వ్యాఖ్య కలదు. అది అత్యంతాననుగుణము.] '''అలం'''. ఉదాత్తము, ఉపమ.<noinclude><references/></noinclude> b1oo5gstm6kb39uftpn4hkz9u2skqx3 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/268 104 212711 555357 554934 2026-05-02T14:27:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555357 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>పఱచిన దేవకీసుతుఁడు పక్కున నవ్వినఁ <ref>చ. గ్రుమ్మిఱిల్లిపై</ref>గ్రమ్మఱిల్లి మైఁ దఱచుగ రోమహర్షణ ముదంచితభక్తిభరాలసత్వ మే ర్పఱచుచుఁ గోల్మొగిడ్చి <ref>చ.ట. పలుబల్కు</ref>పలుపల్కుల తళ్కులసన్నవెన్నెలన్ బఱవురుఁ బ్రస్తుతించె ముని బంధవిభంజను భక్తరంజనున్.</poem>|ref=80}} టీక. క్రమ్మఱిల్లి = మరలివచ్చి; మైన్ = దేహమున; రోమహర్షణము = గగుర్పాటు; ఉదంచిత...సత్వము = ఎక్కు వయిన భక్త్యతిశయమువలని కలఁతపాటు; పలుపల్కులతళ్కులన్ = ఎక్కువమాటలకాంతులచే ['తళ్కుల = కళకళలాడుచున్న' అని పూర్వటీక.]; సన్నవెన్నెలల్ = సన్నని వెన్నెలలవంటి కాంతులను; పఱుపుచున్ = వ్యాపింపఁజేయుచు; బంధవిభంజనున్ = సంసారబంధములను నశింపజేయువానిని; భక్తిరంజనున్ = భక్తులకు సంతోషపఱచువానిని - శ్రీకృష్ణుని; ముని = మునియైన పుండరీకుఁడు; ప్రస్తుతించెన్ = కొనియాడెను. {{Telugu poem|type=మాలిని.|lines=<poem>విధి శివ సనకాదుల్ వేదముల్ గూడి నిన్నో మధుమథన! యితం డిమ్మాడ్కివాఁ డంచు నెన్నన్ విధురు లయినచోటన్ నేర్చునే గాఢమోహాం బుధి వడిఁ బడుచు న్నాబోఁటి నీవాట మెన్నన్.</poem>|ref=81}} '''టీక'''. మధుమథన! = మధువను రాక్షసుని సంహరించినవాఁడా! ఇమ్మడ్కివాఁడు = ఈరీతి నుండువాఁడు; ఎన్నన్ = గుర్తెఱుఁగుటకు; విధురులు = వికలత్వము నొందినవారు - నిష్ప్రయోజకులు; గాఢమోహాంబుధిన్ - దట్టమైన అజ్ఞానసాగరమున; నీ వాటము = నీ మహిమను; నాబోఁటి = నావంటివాఁడు; నేర్చునే! '''అలం'''. అర్థాపత్తి. {{Telugu poem|type=తరల.|lines=<poem>హరిహయోపలభూధరాకృతి నంద మొందినయట్టి నీ యురుభృగుస్తుతిపాత్రమున్ గటకోజ్జ్వలంబు <ref>చ. నఘౌఘ</ref>నఖౌఘర త్నరుచిమిత్రము నైన పాదమునం జనించిన గంగ ని త్యరతిఁ బూని తలంకుఁ దాపనిదాఘవృత్తినివృత్తికిన్.</poem>|ref=82}} '''టీక'''. హరి...కృతిన్ = ఇంద్రనీలమణిపర్వతాకారముగ; ఉరుభృగుస్తుతిపాత్రమున్ = గొప్పచరియలచేఁ గొనియాడఁదగినది, గొప్పవాఁడగు భృగుమహర్షిచేఁ గొనియాడఁబడినది యును; కటకోజ్జ్వలంబున్ = కొండమీఁది చదరపునేలచేఁ బ్రకాశించునది, కడియముచేఁ బ్రకాశించునదియును; నఖౌఘరత్నరుచిరంబున్ = గోళ్ల వంటిరత్నములపొందిక కలదియు - గోళ్లనెడి రత్నములపొందిక కలదియు; జనించిన = పుట్టిన; తాప...నివృత్తికిన్ = తాపత్రయమనెడి వేసవికాలపుఁబ్రవర్తనము పోవుటకయి; తలంతున్. [వేసవితాపము పోవుటకు వర్ష మావశ్యకము; ఆ వర్షమునకు సహాయకారణ మయినది పర్వతము; కాన తద్ధ్యానమిట శ్లేషచే సమర్థితము; తాపత్రయనాశనమునకు విష్ణుపాదభజనమే శరణ్యమని భావము.] '''అలం'''. శ్లేష, రూపకము. {{Telugu poem|type=భుజంగప్రయాతము.|lines=<poem>స్ఫురన్నాభిగర్తప్రభూతాంబుజాతో, దరక్షోణిలో వేల్పుతాతన్ విధాతన్ నిరాతంకసర్గైకనిర్ణేతఁ గంటన్, హరీ! తాతకుం దాతవై యుంట యొప్పున్.</poem>|ref=83}} '''టీక'''. స్ఫురత్...క్షోణిలోన్ = ప్రకాశించు నాభియును గోతియందు పుట్టిన తామరపూవు గర్భభాగమునందు; వేల్పుతాతన్ = దేవతలకు తాత అయినవానిని; విధాతన్ = బ్రహ్మను; నిరా...<noinclude><references/></noinclude> j3dq0ozii4bjpgwqqjh3lyjwvldtsam పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/269 104 212712 555358 554935 2026-05-02T19:37:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555358 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>...నిర్ణేతన్ = అడ్డులేనివృత్తికి నిర్ణాయకుఁడైనవానిని; కంటన్ = కనుటచే - పుట్టించుటచే; తాతకున్ = తండ్రికి; బ్రహ్మకు; తాతవై =- తండ్రివయి; '''అలం'''. కావ్యలింగము. {{Telugu poem|type=స్రగ్విణి.|lines=<poem>నీతిమై వైన్యభూనేతవై రత్నసం, ఘాతదివ్యౌ<ref>క. షధ, చ. షధి</ref>షధిగ్రామముల్ భూతహృ త్ప్రీతిఁ <ref>చ. గన్పట్టి</ref>గన్పట్టవే స్ఫీతహర్హోత్కటన్, భూతధాత్రీగవిన్ బూతనాఘాతనా!</poem>|ref=84}} '''టీక'''. వైన్యభూనేతవై = వేనుండనురాజుయొక్క పుత్రుఁ డగు పృథుచక్రవర్తివయి ['వైన్యభూనేత = వైన్యుఁడనురాజు - పృథుచక్రవర్తి అని పూర్వటీక]; రత్నసంఘాతదివ్యౌషధిగ్రామముల్ = రత్నములసమూహములు, ఓషధులసమూహములను; భూతహృత్ప్రీతి = ప్రాణుల మనస్సులకు సంతోషము కలుగునట్లుగా; స్పీతహర్షోత్కటన్ = అధికసంతోషమున మదించినదానిని; భూతధాత్రీగవిన్ = భూమియను ఆవును; కన్పట్టవే! = కనుపడునట్లు చేయలేదా! పూతనాఘాతనా? = పూతనయను రాక్షసిని చంపినవాఁడా! [పూర్వము పృథుచక్రవర్తి భూమిని గోవుగాను, హిమవంతమును దూడగాను, మేరువును (పాలు) పిదుకు గొల్లవానినిగాను జేసి, రత్నములను, ఓషధులను పితికించెనని గాథ. ఆ చక్రవర్తి వేనునికొడుకు; భగవంతుని అవతారము.] {{Telugu poem|type=లయగ్రాహి.|lines=<poem> ఆగమసముద్ధరణరాగరసలంపట! సుధాగమనియామక! రసాగరిమకారీ! భోగపదవీనిహితభాగవత! భూగగనభాగపరిపూర్ణపరభాగవపురగ్రా! త్యాగగుణధుర్య! మునియాగపరిరక్షక! హలాగతసమిద్విజయ! సౌగతమతార్హో ద్యోగ! కలికాలకలుషాగకులిశాంక! కొనసాగినకృపన్ మనుపు యోగిహిత! మమ్మున్.</poem>|ref=85}} '''టీక'''. ఆగమ...లంపట! = వేదముల నుద్ధరించుటయందలి ప్రేమ యను రసమున (నీరమున) తగిలియున్నవాఁడా! (ఇందు మత్స్యావతారము సూచికము.] సుధాగమనియామక! = అమృతప్రాప్తిని నియమించినవాఁడా - కూర్మమూర్తీ! (ఇందు కూర్మావతారము గోచరించుచున్నది.] రసాగరిమకారీ! = భూమికి గొప్పతనమును కలిగించినవాఁడా? ఆపన్నమగు భూమిని రక్షించినవాఁడా! [ఇట వరాహావతారము గ్రాహ్యము] భోగవదవీనిహితభాగవత! = ఐశ్వర్యమార్గమున ఉంచఁబడిన (గొప్ప భోగముల నొసంగిన) గొప్పభక్తుఁడు (ప్రహ్లాదుఁడు) కలవాఁడా! [ఇట నృసింహావతారము ఊహ్యము.] భూ...వపురగ్రా! = భూమ్యాకాశములు నిండిన మహోత్కృష్టమైన పాదములు కలవాఁడా! [ఇందు వామనావతార మూహ్యము.] [ఇచట పూర్వటీకలో 'వపురగ్రా = దేహముకొన గలవాఁడా!' అని యున్నది.] త్యాగగుణధుర్య! = గొప్పగా దానము చేయు గుణముచే పేరు పడినవాఁడా! [ఇందు పరశురామావతారము సూచితము. పరశురాముఁడు రాజులను చంపి సంపాదించిన భూమిని కశ్యపునకు దానము చేసిననుట.] ముని...రక్షక! = మునియైన విశ్వామిత్రుని యాగమును రక్షించినవాఁడా! [ఇట రామావతారము స్పష్టీకృతము.] హలాగతసమిద్విజయ! = నాగఁటివలన వచ్చిన యుద్ధవిజయము కలవాడా! [ఇందు బలరామాపతారము స్పష్టము; అతనికి హలము ఆయుధము.] సౌగతమతార్హోద్యోగ! = బౌద్ధమతమునకుఁ దగిన ప్రయత్నము కలవాఁడా! [ఇచట బౌద్ధావతారము గ్రాహ్యము.] కలి...శాంక! = కలికాలమునందలి పాపములనెడి పర్వతములకు వజ్రాయుధమైనవాడా! [ఇందు కల్క్యవతారము సూచితము; ఇ ట్లీపద్యమున దశావతారములును వర్ణితములు.] మనుపు = రక్షింపుము. '''అలం'''. రూపకము!<noinclude><references/></noinclude> pgply6fsq69hwreuni26nxelom1uzak 555359 555358 2026-05-02T19:37:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 555359 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>...నిర్ణేతన్ = అడ్డులేనివృత్తికి నిర్ణాయకుఁడైనవానిని; కంటన్ = కనుటచే - పుట్టించుటచే; తాతకున్ = తండ్రికి; బ్రహ్మకు; తాతవై =- తండ్రివయి; '''అలం'''. కావ్యలింగము. {{Telugu poem|type=స్రగ్విణి.|lines=<poem>నీతిమై వైన్యభూనేతవై రత్నసం, ఘాతదివ్యౌ<ref>క. షధ, చ. షధి</ref>షధిగ్రామముల్ భూతహృ త్ప్రీతిఁ <ref>చ. గన్పట్టి</ref>గన్పట్టవే స్ఫీతహర్హోత్కటన్, భూతధాత్రీగవిన్ బూతనాఘాతనా!</poem>|ref=84}} '''టీక'''. వైన్యభూనేతవై = వేనుండనురాజుయొక్క పుత్రుఁ డగు పృథుచక్రవర్తివయి ['వైన్యభూనేత = వైన్యుఁడనురాజు - పృథుచక్రవర్తి అని పూర్వటీక]; రత్నసంఘాతదివ్యౌషధిగ్రామముల్ = రత్నములసమూహములు, ఓషధులసమూహములను; భూతహృత్ప్రీతి = ప్రాణుల మనస్సులకు సంతోషము కలుగునట్లుగా; స్పీతహర్షోత్కటన్ = అధికసంతోషమున మదించినదానిని; భూతధాత్రీగవిన్ = భూమియను ఆవును; కన్పట్టవే! = కనుపడునట్లు చేయలేదా! పూతనాఘాతనా? = పూతనయను రాక్షసిని చంపినవాఁడా! [పూర్వము పృథుచక్రవర్తి భూమిని గోవుగాను, హిమవంతమును దూడగాను, మేరువును (పాలు) పిదుకు గొల్లవానినిగాను జేసి, రత్నములను, ఓషధులను పితికించెనని గాథ. ఆ చక్రవర్తి వేనునికొడుకు; భగవంతుని అవతారము.] {{Telugu poem|type=లయగ్రాహి.|lines=<poem> ఆగమసముద్ధరణరాగరసలంపట! సుధాగమనియామక! రసాగరిమకారీ! భోగపదవీనిహితభాగవత! భూగగనభాగపరిపూర్ణపరభాగవపురగ్రా! త్యాగగుణధుర్య! మునియాగపరిరక్షక! హలాగతసమిద్విజయ! సౌగతమతార్హో ద్యోగ! కలికాలకలుషాగకులిశాంక! కొనసాగినకృపన్ మనుపు యోగిహిత! మమ్మున్.</poem>|ref=85}} '''టీక'''. ఆగమ...లంపట! = వేదముల నుద్ధరించుటయందలి ప్రేమ యను రసమున (నీరమున) తగిలియున్నవాఁడా! (ఇందు మత్స్యావతారము సూచికము.] సుధాగమనియామక! = అమృతప్రాప్తిని నియమించినవాఁడా - కూర్మమూర్తీ! (ఇందు కూర్మావతారము గోచరించుచున్నది.] రసాగరిమకారీ! = భూమికి గొప్పతనమును కలిగించినవాఁడా? ఆపన్నమగు భూమిని రక్షించినవాఁడా! [ఇట వరాహావతారము గ్రాహ్యము] భోగవదవీనిహితభాగవత! = ఐశ్వర్యమార్గమున ఉంచఁబడిన (గొప్ప భోగముల నొసంగిన) గొప్పభక్తుఁడు (ప్రహ్లాదుఁడు) కలవాఁడా! [ఇట నృసింహావతారము ఊహ్యము.] భూ...వపురగ్రా! = భూమ్యాకాశములు నిండిన మహోత్కృష్టమైన పాదములు కలవాఁడా! [ఇందు వామనావతార మూహ్యము.] [ఇచట పూర్వటీకలో 'వపురగ్రా = దేహముకొన గలవాఁడా!' అని యున్నది.] త్యాగగుణధుర్య! = గొప్పగా దానము చేయు గుణముచే పేరు పడినవాఁడా! [ఇందు పరశురామావతారము సూచితము. పరశురాముఁడు రాజులను చంపి సంపాదించిన భూమిని కశ్యపునకు దానము చేసిననుట.] ముని...రక్షక! = మునియైన విశ్వామిత్రుని యాగమును రక్షించినవాఁడా! [ఇట రామావతారము స్పష్టీకృతము.] హలాగతసమిద్విజయ! = నాగఁటివలన వచ్చిన యుద్ధవిజయము కలవాడా! [ఇందు బలరామాపతారము స్పష్టము; అతనికి హలము ఆయుధము.] సౌగతమతార్హోద్యోగ! = బౌద్ధమతమునకుఁ దగిన ప్రయత్నము కలవాఁడా! [ఇచట బౌద్ధావతారము గ్రాహ్యము.] కలి...శాంక! = కలికాలమునందలి పాపములనెడి పర్వతములకు వజ్రాయుధమైనవాడా! [ఇందు కల్క్యవతారము సూచితము; ఇ ట్లీపద్యమున దశావతారములును వర్ణితములు.] మనుపు = రక్షింపుము. '''అలం'''. రూపకము!<noinclude><references/></noinclude> bp1eq85h9hkyae0snwtzuoalshqrckl పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/270 104 212713 555360 554936 2026-05-02T21:09:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555360 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>రవిధామంబులు సిద్ధమంత్రములు చంద్రజ్యోత్స్నికల్ సన్మణి ప్రవరశ్రేణులు భవ్యభేషజతతుల్ పాథోధరంబుల్ సుధీ భవనిస్తారక! సేమ మిచ్చి జగమున్ బాలించు మర్యాద నీ యవతారంబు లశేషలోకహితచర్యాధుర్యసంచారముల్.</poem>|ref=86}} '''టీక'''. ఈ పద్యమునం దవతారంబుల యౌత్కృష్ట్యము రూపకమూలమున రూపింపఁబడు చున్నది. రవిధామంబులు = సూర్యుని తేజస్సులు; చంద్రజ్యోత్స్నికల్ = చంద్రుని వెన్నెలలు; సన్మణిప్రవరశ్రేణులు = ఉత్తమమాణిక్యముల (చింతామణుల) గుంపులు; భవ్యభేషజతతుల్ = గొప్పకుందులసమూహములు; పాథోధరంబుల్ = నీటిని ధరించు మేఘములు; సుధీభవనిస్తారక! = విద్వాంసులను (తత్త్వవేత్తలకు) జన్మమునుండి తప్పించి కాపాడువాఁడా! అశేషసంచారముల్ = సమస్తజీవులమేలికొరకు ప్రవర్తించునట్టివైన; [ఈ పదమును సూర్యకాంతులు మొదలగువాని కన్నింటికిని విశేషణముగా గ్రహింపనగును.] నీయవతారంబులు; సేమమిచ్చి; మర్యాదన్ = మర్యాదతో; జగమున్; పాలించున్. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>అంజనపుంజనవ్యతరమై తగు నీ తీరుమేనికప్పుక ల్మిం జులుకంగఁ జేకుఱుఁజమీ కమలేక్షణ! సూక్ష్మదృక్కు <ref>క. లౌఁ గంజ</ref>లౌ కంజభవాదివృద్ధులకు గాఢతరాక్షరలక్ష్మి <ref>చ. యంద</ref>యెందుఁ గా నం జనుఁగాదె కప్పుకతనన్ మును దోఁపని యక్షరస్థితుల్.</poem>|ref=87}} '''టీక'''. అంజన...తరమై = కాటుకకుప్పవలె మనోజ్ఞమయి; తిరు...కల్మిన్ = శుభప్రద దేహమునలుపుశోభవలన; చులుకంగన్ = సులభముగా; సూక్ష్మదృక్కులు = సూక్ష్మదృష్టి కలవారు - బుద్ధిమంతులు; కంజ...వృద్ధులకున్ = బ్రహ్మ మొదలగు పెద్దలకు; గాఢ...లక్ష్మి = ఉత్కృష్టమును నాశము లేనిదియు నగు (మోక్ష)సంపద; చేకురుఁజుమీ! = కలుగునుగదా! కప్పుకతనన్ = నలుపువలన నల్లనిరంగు పూయుటవలన; మును, దోఁపని = పూర్వము (మొదట) కనఁబడని; అక్షరస్థితుల్ = అక్షరములపోలికలు; ఎందున్; కానంజనుఁగాదె! = కనవీలగునుగదా! [(తాళ)పత్రములపయి వ్రాయఁబడిన యక్కరములపోలిక తొలుత తెలియకపోఁగా, దానిపై నల్లనిరంగు పూయుదురు; అపుడు అక్షరములన్నియు స్పష్టముగా కన్పడును.] '''అలం'''. దృష్టాంతము. {{Telugu poem|type=క.|lines=<poem>కమిచి యణురేణుతృణకా, ష్ఠములం బరిపూర్ణవృత్తి సమ<ref>క. కూరెను, చ.ట. కూరిన</ref>కూరిన నీ యమితమహామహిమాబ్ధికిఁ, గమలభవప్రముఖు లెన్నఁగా బుద్బుదముల్.</poem>|ref=89}} '''టీక'''. కమిచి = గ్రహించి - లోపల నణఁచుకొని; అణు...ములన్ = అణువులు, రేణువులు, గడ్డి, కఱ్ఱ మొదలగువానివలన; సమకూరిన = ఏర్పడిన; అమితమహామహిమాబ్ధికిన్ = హద్దులేని మాహాత్మ్య మనుసముద్రమునకు; కమలభవప్రముఖులు, ఎల్లన్ = బ్రహ్మ మొదలగు దేవత లందఱును; ఎన్నఁగాన్ = లెక్కించఁగా; బుద్బుదముల్ = నీటిబుగ్గలు. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=పృథ్వి.|lines=<poem>జగత్పతి! భరత్పదాబ్జయుగభక్తిసంయుక్తి<ref>క. తో, చ.ట. లో</ref>లో, గగుర్పొడువ నన్యథా గతి యెఱుంగ కెవ్వాఁడు నీ యగణ్యగుణకీర్తనం బధిగమించుట మించెనే, నగాధభవసాగరం బతఁడు దాఁటు నొక్కెత్తునన్.</poem>|ref=89}}<noinclude><references/></noinclude> f76jjjdsy0a8brnd2x6553nsgv5ewb2 555361 555360 2026-05-02T21:10:29Z దేవీప్రసాదశాస్త్రి 4290 555361 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>రవిధామంబులు సిద్ధమంత్రములు చంద్రజ్యోత్స్నికల్ సన్మణి ప్రవరశ్రేణులు భవ్యభేషజతతుల్ పాథోధరంబుల్ సుధీ భవనిస్తారక! సేమ మిచ్చి జగమున్ బాలించు మర్యాద నీ యవతారంబు లశేషలోకహితచర్యాధుర్యసంచారముల్.</poem>|ref=86}} '''టీక'''. ఈ పద్యమునం దవతారంబుల యౌత్కృష్ట్యము రూపకమూలమున రూపింపఁబడు చున్నది. రవిధామంబులు = సూర్యుని తేజస్సులు; చంద్రజ్యోత్స్నికల్ = చంద్రుని వెన్నెలలు; సన్మణిప్రవరశ్రేణులు = ఉత్తమమాణిక్యముల (చింతామణుల) గుంపులు; భవ్యభేషజతతుల్ = గొప్పకుందులసమూహములు; పాథోధరంబుల్ = నీటిని ధరించు మేఘములు; సుధీభవనిస్తారక! = విద్వాంసులను (తత్త్వవేత్తలకు) జన్మమునుండి తప్పించి కాపాడువాఁడా! అశేషసంచారముల్ = సమస్తజీవులమేలికొరకు ప్రవర్తించునట్టివైన; [ఈ పదమును సూర్యకాంతులు మొదలగువాని కన్నింటికిని విశేషణముగా గ్రహింపనగును.] నీయవతారంబులు; సేమమిచ్చి; మర్యాదన్ = మర్యాదతో; జగమున్; పాలించున్. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>అంజనపుంజనవ్యతరమై తగు నీ తీరుమేనికప్పుక ల్మిం జులుకంగఁ జేకుఱుఁజమీ కమలేక్షణ! సూక్ష్మదృక్కు <ref>క. లౌఁ గంజ</ref>లౌ కంజభవాదివృద్ధులకు గాఢతరాక్షరలక్ష్మి <ref>చ. యంద</ref>యెందుఁ గా నం జనుఁగాదె కప్పుకతనన్ మును దోఁపని యక్షరస్థితుల్.</poem>|ref=87}} '''టీక'''. అంజన...తరమై = కాటుకకుప్పవలె మనోజ్ఞమయి; తిరు...కల్మిన్ = శుభప్రద దేహమునలుపుశోభవలన; చులుకంగన్ = సులభముగా; సూక్ష్మదృక్కులు = సూక్ష్మదృష్టి కలవారు - బుద్ధిమంతులు; కంజ...వృద్ధులకున్ = బ్రహ్మ మొదలగు పెద్దలకు; గాఢ...లక్ష్మి = ఉత్కృష్టమును నాశము లేనిదియు నగు (మోక్ష)సంపద; చేకురుఁజుమీ! = కలుగునుగదా! కప్పుకతనన్ = నలుపువలన నల్లనిరంగు పూయుటవలన; మును, దోఁపని = పూర్వము (మొదట) కనఁబడని; అక్షరస్థితుల్ = అక్షరములపోలికలు; ఎందున్; కానంజనుఁగాదె! = కనవీలగునుగదా! [(తాళ)పత్రములపయి వ్రాయఁబడిన యక్కరములపోలిక తొలుత తెలియకపోఁగా, దానిపై నల్లనిరంగు పూయుదురు; అపుడు అక్షరములన్నియు స్పష్టముగా కన్పడును.] '''అలం'''. దృష్టాంతము. {{Telugu poem|type=క.|lines=<poem>కమిచి యణురేణుతృణకా, ష్ఠములం బరిపూర్ణవృత్తి సమ<ref>క. కూరెను, చ.ట. కూరిన</ref>కూరిన నీ యమితమహామహిమాబ్ధికిఁ, గమలభవప్రముఖు లెన్నఁగా బుద్బుదముల్.</poem>|ref=88}} '''టీక'''. కమిచి = గ్రహించి - లోపల నణఁచుకొని; అణు...ములన్ = అణువులు, రేణువులు, గడ్డి, కఱ్ఱ మొదలగువానివలన; సమకూరిన = ఏర్పడిన; అమితమహామహిమాబ్ధికిన్ = హద్దులేని మాహాత్మ్య మనుసముద్రమునకు; కమలభవప్రముఖులు, ఎల్లన్ = బ్రహ్మ మొదలగు దేవత లందఱును; ఎన్నఁగాన్ = లెక్కించఁగా; బుద్బుదముల్ = నీటిబుగ్గలు. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=పృథ్వి.|lines=<poem>జగత్పతి! భరత్పదాబ్జయుగభక్తిసంయుక్తి<ref>క. తో, చ.ట. లో</ref>లో, గగుర్పొడువ నన్యథా గతి యెఱుంగ కెవ్వాఁడు నీ యగణ్యగుణకీర్తనం బధిగమించుట మించెనే, నగాధభవసాగరం బతఁడు దాఁటు నొక్కెత్తునన్.</poem>|ref=89}}<noinclude><references/></noinclude> fpt7hi649m347d05kw9zupj8vdqtjfs పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/271 104 212714 555362 554937 2026-05-02T22:21:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555362 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. జగత్పతి! = లోకప్రభువగు విష్ణువా! భవత్...సంయుక్తి = నీరెండు పాదకముల భక్తియుక్తి; లోన్ = హృదయములో; అన్యథాగతి = వేఱేదిక్కు; ఎఱుంగక = తెలిసికొనక - తలంపక; అగణ్యగుణకీర్తనంబు = లెక్కింపరాని గుణములస్తుతిని; అధిగమించుటన్ = పఠించుటచే; మించెనేన్ = మించినట్లయితే; ఒక్కెత్తునన్ = ఒక్కసారిగా; అగాధభవసాగరంబు = లోఁతైన సంసారసముద్రమును; దాఁటున్. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=క.|lines=<poem>భవదంఘ్రిదూరునకుఁ బుణ్యవసతి సులభంబె? వెఱతు <ref>క. నయ్య, చ. నన్య</ref>నన్యభవంబుల్ సవరింప; యుష్మదర్చా, ప్రవణమతిం జేయు <ref>క. నన్ను, చ.ట. నను</ref>నను <ref>క. బరధామ, చ. పరమధామ, ట. పరంధామ</ref>బరమధామపతీ!</poem>|ref=90}} '''టీక'''. పరమధామపతీ! = పరమపదమగు వైకుంఠమునకు ప్రభువా! భవదంఘ్రిదూరునకున్ = నీపాదములకు దూరమైనవానికి - నిన్ను కొలువనివానికి; అన్యభవంబుల్ = వేఱుజన్మములు - పునర్జన్మములు; సవరింపన్ = ఎత్తుటకు; వెఱతున్ = భయపడుచున్నాను; ననున్ = నన్ను; యుష్మ...మతిన్ = నీపూజయం దాసక్తమైన బుద్ధి కలవానినిగా; చేయు = చేయుము. [ములోపము] {{Telugu poem|type=క.|lines=<poem>జయ విజయ<ref>క. పూర్ణపార్శ్వ, చ. పూర్వవిభవ</ref>పూర్వవిభవ! వి, జయ జయకల్పనధురీణ! సమదదనుజరా డ్జయ! సంరక్షితభువనా!, జయ జయ! సగుణా! గుణాత్మ! జయ శార్ఙ్గధరా!</poem>|ref=91}} ''''టీక'''. విజయపూర్వవిభవ! = విజయము పూర్వముగా (ముందుగా) గల సంపద కలవాఁడా! [నీ కెచ్చట విజయము కలిగినను తోడనే సంపదయు లభించుననుట.] జయ! = జయము పొందుము; జయకల్పనధురీణ! = జయము కూర్చుటయందు బాధ్యత వహించువాఁడా! విజయ! = విజయమును పొందుము; సమద...జయ! మదించిన రాక్షసరాజులను జయించినవాఁడా! సంరక్షితభువనా! = రక్షింపఁబడిన లోకములు కలవాఁడా! సగుణా! = గుణవిశిష్టుఁడా! శార్ఙ్గధరా! = శార్ఙ్గ మను విల్లు ధరించినవాఁడా! {{Telugu poem|type=సీ.|lines=<poem>నడతు నీక్షేత్రంబునకుఁ; జెయి చాచి యర్చింతు నీ నమ్మినసేవకు<ref>చ. లన</ref>లను; మ్రొక్కుదు నీపాద<ref>చ. ములక</ref>ములకు; జిహ్వావీథి నీనామములు <ref>వకాణింతు, శ.ర. వక్కణింతు</ref>వక్కణింతు నెపుడు; నర్పింతు నీసేవకై సర్వదేహంబుఁ; జింతింతు నీలీలఁ జిత్తసరణిఁ; దనివోక నీచక్కఁదనము సంవీక్షింతు; నీయవధానంబు నెమ్మి విందు;</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బ్రహ్మరుద్రాదులకుఁ గానఁబడని నీవు, నేడు నామ్రోల నిలిచితి నీలవర్ణ! వర్ణనాతీతమత్ప్రాగ్భవప్రవృత్త, పుణ్యపరిపాక మేరికిఁ బొగడఁదరమె!</poem>|ref=92}} '''టీక'''. వక్కణింతును = పలుకుదును; చిత్తసరణి = మనోమార్గమునందు; తనివోక = తనివితీరక = తృప్తితీరక; నీయవధానంబున్ = నీహెచ్చరికను - నిన్ను గూర్చిన ప్రసంగమును; వర్ణనా...పరిపాకము = వర్ణించనలవికాని నాపూర్వజన్మకృతపుణ్యములపంట. {{Telugu poem|type=ఉ.|lines=<poem>నిత్యస్ఫూర్తిసనాథులైరి విధికంఠేకాలముఖ్యుల్ కృత క్షిత్యానంద! <ref>చ. యనాథ</ref>యనాదిమూర్తివగు నీచేఁ దత్సనాథత్వసం పత్త్యావిష్కృతి నాకునుం గలుగుఁ దత్ప్రాయుండనే కాన, <ref>చ.ట. యీ</ref>నీ మృత్యుక్రూరభయంబుఁ బాసితిని జుమ్మీ నీదయాసంపదన్.</poem>|ref=93}}<noinclude><references/></noinclude> 4dvzmbignnscb9lzabt3jvvcgiz8x3c పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/272 104 212717 555370 554954 2026-05-03T02:52:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555370 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. కృతక్షిత్యానంద! = చేయఁబడిన భూమ్యానందము కలవాఁడా! - భూప్రజలకు ఆనందమును కల్గించువాఁడా! అనాదిమూర్తివగు = ఆదివేనిస్వరూపముగల - అనాదివగు; నీచేన్ = నీవలన; విధి...ముఖ్యుల్ = బ్రహ్మ, శివుఁడు మొదలగు దేవతలు; విద్యస్ఫూర్తిసనాథులు, ఐరి = శాశ్వతమైన స్ఫురణతోఁ గూడినవారు - ఎల్లపుడును ఉండువారు - అయిరి; తత్ప్రాయుండనే, కాన = (నేనును) వారివంటివాఁడనే యగుటచే - వారివలెనే నేనును నీభక్తుఁడ నగుటచే; తత్...ఆవిష్కృతి = నిత్యస్ఫూర్తితోఁ గూడుట యను సంపద ఆవిష్కరించుట ('ఆ కూడుకొన్నతనపు కలిమియొక్క వెలయుట' అని పూర్వటీక.]; కలుగున్. {{Telugu poem|type=మ.|lines=<poem>అని లోకత్రయమోహనుండగు రమాప్రాణేశు నెమ్మోమునం దనచూడ్కుల్ నిగుడంగ భూమిసురరత్నం బూరకున్నంత <ref>చ.ట. యే</ref>నే మునుగా ధాతృసమన్వితాఖలమరున్ముఖ్యుల్ దగన్ మ్రొక్కి మో డ్పునకే లింపుగ నమునీశ్వరుగుణంబుల్ సారె గీర్తించినన్.</poem>|ref=94}} '''టీక'''. లోకత్రయమోహనుండు = ముల్లోకములను మోహింపఁజేయువాఁడు ముల్లోకములను చక్కనివాఁడు; రమాప్రాణేశుఁడు = విష్ణువు; ఊరకున్నంతనే = ఊరకయుండఁగా, నేన్, మునుగాన్ = నేనాదిగా; ధాతృ...ముఖ్యుల్ = బ్రహ్మతోఁ గూడి వచ్చిన దేవముఖ్యులు; ఇంపుగన్ = ఇంపుగా నుండఁగా; సారె = మాటిమాటికిని. {{Telugu poem|type=క.|lines=<poem>విని ముగ్ధహాసరుచిరా, ననుఁడై తనచుట్టునున్న నానామరరా జనికాయముతోఁ బలుకున్, దనుజారి మహీసురాస్యదత్తేక్షణుఁడై.</poem>|ref=95}} '''టీక'''. దనుజారి = రాక్షసులకు వైరియగు విష్ణువు; ముగ్ధ...ననుఁడై =చిరునవ్వుచేఁ జక్కని ముఖము కలవాఁడై; మహీ...క్షణుఁడై = బ్రాహ్మణుఁడైన పుండరీకుని ముఖముపయి ఉంచిన చూపు కలవాఁడై; నానా...నికాయముతోన్ = అనేకులైన దేవతాశ్రేష్ఠులసమూహముతో. {{Telugu poem|type=సీ.|lines=<poem>దాంతుండు సత్య<ref>చ. సందా</ref>సంధాధురంధరుఁడు మద్భక్తుండు పితృహితోద్యముఁడునైన యిద్ధరామరసూతి కీప్సితం బొసఁ<ref>చ. గు</ref>గ నే వచ్చుచో మీరెల్లవారు నితని కర్మిలి సా<ref>చ. హార్య</ref>హాయ్య మాచరించుటకునై యేతెంచినారు; నా కెవ్వరేని హితులు వారలపనులెల్ల మీయవి కానఁ <ref>క. పర</ref>బరతాపతప్తులు పరము<ref>ట. లేక</ref>దేక</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>ముదితు లస్మత్ప్రశంసాభిముఖులునైన, వారు నాభక్తులగువారు; వారియందుఁ బ్రీతిగలవారి నే నుద్ధరింతుఁ గీడు, వలన; వారలకంటె నవశ్య <ref>ట. మగుదు</ref>మగుట.</poem>|ref=96}} '''టీక'''. దాంతుండు = ఇంద్రియనిగ్రహము కలవాఁడు; సత్యసంధాధురంధరుఁడు = సత్యవాది; పితృహితోద్యముఁడు = తండ్రికి హితమైన ప్రయత్నము కలవాఁడు; ధరామరసూతికిన్ = బ్రాహ్మణపుత్రునకు; అర్మిలిన్ = ప్రీతితో; పర...తాపతప్తులు = ఇతరులబాధచే బాధపడువారు; పరముదేకముదితులు = ఇతరులసంతోషమున సంతసించువారు. {{Telugu poem|type=క.|lines=<poem>సద్భక్తసేవచేతన్, మద్భావము తుష్టిఁగన్నమాడ్కిఁ దరుశిలా ద్యుద్భూతప్రతిమార్చల, ముద్భరితము గాదు నిక్కముగఁ దలపోయన్.</poem>|ref=97}} '''టీక'''. మద్భావము = నామనస్సు; తరు...ర్చలన్ = మ్రాను, ఱాయి మొదలగువానినుండి ఏర్పడిన విగ్రహములపూజలచేత; ముద్భరితము = సంతోషముతో గూడినది.<noinclude><references/></noinclude> p4ac42srqrw5ucxvxww1hqm6m3oi24t 555371 555370 2026-05-03T02:52:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 555371 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. కృతక్షిత్యానంద! = చేయఁబడిన భూమ్యానందము కలవాఁడా! - భూప్రజలకు ఆనందమును కల్గించువాఁడా! అనాదిమూర్తివగు = ఆదివేనిస్వరూపముగల - అనాదివగు; నీచేన్ = నీవలన; విధి...ముఖ్యుల్ = బ్రహ్మ, శివుఁడు మొదలగు దేవతలు; విద్యస్ఫూర్తిసనాథులు, ఐరి = శాశ్వతమైన స్ఫురణతోఁ గూడినవారు - ఎల్లపుడును ఉండువారు - అయిరి; తత్ప్రాయుండనే, కాన = (నేనును) వారివంటివాఁడనే యగుటచే - వారివలెనే నేనును నీభక్తుఁడ నగుటచే; తత్...ఆవిష్కృతి = నిత్యస్ఫూర్తితోఁ గూడుట యను సంపద ఆవిష్కరించుట ('ఆ కూడుకొన్నతనపు కలిమియొక్క వెలయుట' అని పూర్వటీక.]; కలుగున్. {{Telugu poem|type=మ.|lines=<poem>అని లోకత్రయమోహనుండగు రమాప్రాణేశు నెమ్మోమునం దనచూడ్కుల్ నిగుడంగ భూమిసురరత్నం బూరకున్నంత <ref>చ.ట. యే</ref>నే మునుగా ధాతృసమన్వితాఖలమరున్ముఖ్యుల్ దగన్ మ్రొక్కి మో డ్పునకే లింపుగ నమునీశ్వరుగుణంబుల్ సారె గీర్తించినన్.</poem>|ref=94}} '''టీక'''. లోకత్రయమోహనుండు = ముల్లోకములను మోహింపఁజేయువాఁడు ముల్లోకములను చక్కనివాఁడు; రమాప్రాణేశుఁడు = విష్ణువు; ఊరకున్నంతనే = ఊరకయుండఁగా, నేన్, మునుగాన్ = నేనాదిగా; ధాతృ...ముఖ్యుల్ = బ్రహ్మతోఁ గూడి వచ్చిన దేవముఖ్యులు; ఇంపుగన్ = ఇంపుగా నుండఁగా; సారె = మాటిమాటికిని. {{Telugu poem|type=క.|lines=<poem>విని ముగ్ధహాసరుచిరా, ననుఁడై తనచుట్టునున్న నానామరరా జనికాయముతోఁ బలుకున్, దనుజారి మహీసురాస్యదత్తేక్షణుఁడై.</poem>|ref=95}} '''టీక'''. దనుజారి = రాక్షసులకు వైరియగు విష్ణువు; ముగ్ధ...ననుఁడై =చిరునవ్వుచేఁ జక్కని ముఖము కలవాఁడై; మహీ...క్షణుఁడై = బ్రాహ్మణుఁడైన పుండరీకుని ముఖముపయి ఉంచిన చూపు కలవాఁడై; నానా...నికాయముతోన్ = అనేకులైన దేవతాశ్రేష్ఠులసమూహముతో. {{Telugu poem|type=సీ.|lines=<poem>దాంతుండు సత్య<ref>చ. సందా</ref>సంధాధురంధరుఁడు మద్భక్తుండు పితృహితోద్యముఁడునైన యిద్ధరామరసూతి కీప్సితం బొసఁ<ref>చ. గు</ref>గ నే వచ్చుచో మీరెల్లవారు నితని కర్మిలి సా<ref>చ. హార్య</ref>హాయ్య మాచరించుటకునై యేతెంచినారు; నా కెవ్వరేని హితులు వారలపనులెల్ల మీయవి కానఁ <ref>క. పర</ref>బరతాపతప్తులు పరము<ref>ట. లేక</ref>దేక</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>ముదితు లస్మత్ప్రశంసాభిముఖులునైన, వారు నాభక్తులగువారు; వారియందుఁ బ్రీతిగలవారి నే నుద్ధరింతుఁ గీడు, వలన; వారలకంటె నవశ్య <ref>ట. మగుదు</ref>మగుట.</poem>|ref=96}} '''టీక'''. దాంతుండు = ఇంద్రియనిగ్రహము కలవాఁడు; సత్యసంధాధురంధరుఁడు = సత్యవాది; పితృహితోద్యముఁడు = తండ్రికి హితమైన ప్రయత్నము కలవాఁడు; ధరామరసూతికిన్ = బ్రాహ్మణపుత్రునకు; అర్మిలిన్ = ప్రీతితో; పర...తాపతప్తులు = ఇతరులబాధచే బాధపడువారు; పరముదేకముదితులు = ఇతరులసంతోషమున సంతసించువారు. {{Telugu poem|type=క.|lines=<poem>సద్భక్తసేవచేతన్, మద్భావము తుష్టిఁగన్నమాడ్కిఁ దరుశిలా ద్యుద్భూతప్రతిమార్చల, ముద్భరితము గాదు నిక్కముగఁ దలపోయన్.</poem>|ref=97}} '''టీక'''. మద్భావము = నామనస్సు; తరు...ర్చలన్ = మ్రాను, ఱాయి మొదలగువానినుండి ఏర్పడిన విగ్రహములపూజలచేత; ముద్భరితము = సంతోషముతోఁ గూడినది.<noinclude><references/></noinclude> kurd1rwwa1z20q1f36gi0hl9gldtkan పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/273 104 212718 555372 554955 2026-05-03T03:43:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555372 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>వలనా యేటికి నాశ్రయించి మనఁగా వానీరమున్ నీరమున్? దలవెఱ్ఱే పచరింప నేటికి సమిద్దానంబు దానంబు? న చ్చలమా యేటికి నెత్తిగొట్టుకొనఁగా సన్న్యాసమున్ న్యాసమున్? గలిఁ దేఁజాలు మదీయభక్తి రుచి భక్తశ్రేణి కశ్రాంతమున్.</poem>|ref=98}} '''టీక'''. వానీరము = నీటిప్రబ్బలిచెట్టును; నీరమున్ = నీటిని; తలవెఱ్ఱే = పిచ్చియా? పచరింపన్, ఏటికిన్? = చేయనేల? సమిద్దానంబు = సమిధలనిచ్చుట - హోమము; అచ్చలమా? = పట్టుదలయా? సన్న్యాసమున్ = లౌకికసంబంధములకు పూర్తిగ విడుచుట; న్యాసము = అంగన్యాసాదికము; అశ్రాంతమున్ = ఎల్లపుడును; కలిన్ = కలికాలమందు; మదీయభక్తి = నాయెడఁ గల భక్తి; రుచిన్ = తేజస్సును; తేఁజాలున్ = కలిగింపఁగలుగును. {{Telugu poem|type=తే.|lines=<poem>సర్వధర్మవిహీనప్రచారుఁడైన, నాత్మ మద్భక్తి గలదేని యతఁడ చూవె నాకు నత్యంతహితుఁడు సుశ్లోకరతుఁడు, నిఖిలధర్మప్రవర్తననిశ్చితుండు.</poem>|ref=99}} '''టీక'''. ఆత్మన్ = మనస్సున; సుశ్లోకరతుఁడు = మంచికీర్తియం దాసక్తుఁడు; నిఖిల...నిశ్చితుండు = సమస్తధర్మములను నెఱువేర్చుటలో నిశ్చయము కలవాఁడు. {{Telugu poem|type=ఆ.|lines=<poem>అస్మదంకధారి యగు భక్తవ<ref>చ. రమేశు</ref>రుమేను, నాకుఁ గూర్చినట్లు నాకులార! వదలకే వసించు వైకుంఠనగరంబు, నందుఁ గొలుప దంతరంగమునకు.</poem>|ref=100}} '''టీక'''. నాకులార! = దేవతలారా! అస్మదంశధారి = నాచిహ్నములగు శంఖచక్రాదులను ధరించినవాఁడు; కూర్చినట్లు = ఇష్టపడునట్లు; కొలుపదు = సరిపడదు. {{Telugu poem|type=క.|lines=<poem>నాయందు భక్తుఁ డుండున్, బాయక యే నధివసింతు భక్తునియందున్ మాయిరువురకుం గలుగున్, గాయప్రాణానుకూల్యకౌశల్యంబుల్.</poem>|ref=101}} '''టీక'''. పాయక = విడువక; కాయ...కౌశల్యంబుల్ = దేహమునకు, ప్రాణమునకును గల్గు సంబంధములు. {{Telugu poem|type=ఆ.|lines=<poem>మహితపుణ్యులైన మద్భక్తవరులకుఁ, గానివాఁడు నాకుఁ గానివాఁడు భాగవతుల నన్ను భావించి <ref>క. యొకట, చ.ట. యొకటి</ref>యొకటిగాఁ, గన్నవాఁడు నన్ను గన్నవాఁడు.</poem>|ref=102}} '''టీక'''. భాగవతులన్ = భక్తులను; ఒకటిగాన్ = భేదము లేనట్లుగా. {{Telugu poem|type=క.|lines=<poem>మీయెడ మద్భక్తిగుణో, చ్ఛ్రాయముఁ గనుగొంటి నేను సత్యంబు బహూ పాయంబుల మద్భక్తుని, కై యిట <ref>చ. యేతెంచు</ref>కేతెంచుటన్ వియచ్చరులారా!</poem>|ref=103}} '''టీక'''. వియచ్చరులారా! = దేవతలారా! మత్...చ్ఛ్రాయమున్ = నాయెడ భక్తియొక్క ఆధిక్యమును. {{Telugu poem|type=మ.|lines=<poem>సురకర్మంది హిరణ్యదైత్యసుతు వ్యాసున్ శౌనకున్ శ్రీపరా శరు రుక్తాంగదు నంబరీషు సరమాజానిన్ వసిష్ఠున్ బురం దరపుత్రున్ శుకు దాల్భ్యు భీష్ము వెఱుగొందంజేయు మద్భక్తిత తరుఁ డీపుణ్యుఁడు పుండరీకు;డితనిన్ <ref>క. భావింతు, చ.ట. బాలింతు</ref>బాలింతు మేలీవులన్.</poem>|ref=104}}<noinclude><references/></noinclude> p2ykaym6palw7wlam8g6bjnbqvcdtsr 555373 555372 2026-05-03T03:45:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 555373 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>వలనా యేటికి నాశ్రయించి మనఁగా వానీరమున్ నీరమున్? దలవెఱ్ఱే పచరింప నేటికి సమిద్దానంబు దానంబు? న చ్చలమా యేటికి నెత్తిగొట్టుకొనఁగా సన్న్యాసమున్ న్యాసమున్? గలిఁ దేఁజాలు మదీయభక్తి రుచి భక్తశ్రేణి కశ్రాంతమున్.</poem>|ref=98}} '''టీక'''. వానీరము = నీటిప్రబ్బలిచెట్టును; నీరమున్ = నీటిని; తలవెఱ్ఱే = పిచ్చియా? పచరింపన్, ఏటికిన్? = చేయనేల? సమిద్దానంబు = సమిధలనిచ్చుట - హోమము; అచ్చలమా? = పట్టుదలయా? సన్న్యాసమున్ = లౌకికసంబంధములకు పూర్తిగ విడుచుట; న్యాసము = అంగన్యాసాదికము; అశ్రాంతమున్ = ఎల్లపుడును; కలిన్ = కలికాలమందు; మదీయభక్తి = నాయెడఁ గల భక్తి; రుచిన్ = తేజస్సును; తేఁజాలున్ = కలిగింపఁగలుగును. {{Telugu poem|type=తే.|lines=<poem>సర్వధర్మవిహీనప్రచారుఁడైన, నాత్మ మద్భక్తి గలదేని యతఁడ చూవె నాకు నత్యంతహితుఁడు సుశ్లోకరతుఁడు, నిఖిలధర్మప్రవర్తననిశ్చితుండు.</poem>|ref=99}} '''టీక'''. ఆత్మన్ = మనస్సున; సుశ్లోకరతుఁడు = మంచికీర్తియం దాసక్తుఁడు; నిఖిల...నిశ్చితుండు = సమస్తధర్మములను నెఱువేర్చుటలో నిశ్చయము కలవాఁడు. {{Telugu poem|type=ఆ.|lines=<poem>అస్మదంకధారి యగు భక్తవ<ref>చ. రమేశు</ref>రుమేను, నాకుఁ గూర్చినట్లు నాకులార! వదలకే వసించు వైకుంఠనగరంబు, నందుఁ గొలుప దంతరంగమునకు.</poem>|ref=100}} '''టీక'''. నాకులార! = దేవతలారా! అస్మదంశధారి = నాచిహ్నములగు శంఖచక్రాదులను ధరించినవాఁడు; కూర్చినట్లు = ఇష్టపడునట్లు; కొలుపదు = సరిపడదు. {{Telugu poem|type=క.|lines=<poem>నాయందు భక్తుఁ డుండున్, బాయక యే నధివసింతు భక్తునియందున్ మాయిరువురకుం గలుగున్, గాయప్రాణానుకూల్యకౌశల్యంబుల్.</poem>|ref=101}} '''టీక'''. పాయక = విడువక; కాయ...కౌశల్యంబుల్ = దేహమునకు, ప్రాణమునకును గల్గు సంబంధములు. {{Telugu poem|type=ఆ.|lines=<poem>మహితపుణ్యులైన మద్భక్తవరులకుఁ, గానివాఁడు నాకుఁ గానివాఁడు భాగవతుల నన్ను భావించి <ref>క. యొకట, చ.ట. యొకటి</ref>యొకటిగాఁ, గన్నవాఁడు నన్ను గన్నవాఁడు.</poem>|ref=102}} '''టీక'''. భాగవతులన్ = భక్తులను; ఒకటిగాన్ = భేదము లేనట్లుగా. {{Telugu poem|type=క.|lines=<poem>మీయెడ మద్భక్తిగుణో, చ్ఛ్రాయముఁ గనుగొంటి నేను సత్యంబు బహూ పాయంబుల మద్భక్తుని, కై యిట <ref>చ. యేతెంచు</ref>కేతెంచుటన్ వియచ్చరులారా!</poem>|ref=103}} '''టీక'''. వియచ్చరులారా! = దేవతలారా! మత్...చ్ఛ్రాయమున్ = నాయెడ భక్తియొక్క ఆధిక్యమును. {{Telugu poem|type=మ.|lines=<poem>సురకర్మంది హిరణ్యదైత్యసుతు వ్యాసున్ శౌనకున్ శ్రీపరా శరు రుక్తాంగదు నంబరీషు సరమాజానిన్ వసిష్ఠున్ బురం దరపుత్రున్ శుకు దాల్భ్యు భీష్ము వెఱుగొందంజేయు మద్భక్తిత త్పరుఁ డీపుణ్యుఁడు పుండరీకుఁ; డితనిన్ <ref>క. భావింతు, చ.ట. బాలింతు</ref>బాలింతు మేలీవులన్.</poem>|ref=104}}<noinclude><references/></noinclude> ge3m7rcnq58xuipru8exhd08c6rzef0 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/274 104 212719 555374 554956 2026-05-03T04:50:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555374 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. సురకర్మందిన్ = నారదుని; హిరణ్యదైత్యసుతున్ = ప్రహ్లాదుని; సరమాజానిన్ = విభీషణుని; పురందరపుత్రున్ = అర్జునుని; వెఱఁగు, ఒందంజేయు = ఆశ్చర్యపడునట్లు చేయు - వారికంటె గొప్పభక్తిని జూపు; మేలీవులన్ = గొప్పవరములచేతను. ఈపద్యమునకు 'ప్రహ్లాద నారద పరాశర పుండరీక, వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్; రుక్షాంగ దార్జున వసిష్ఠ విభీషణాదీన్, పుణ్యా నిమాన్ పరమభాగవతాన్ స్మరామి' అను శ్లోకము మూలము. {{Telugu poem|type=ఆ.|lines=<poem>వినుఁడు మీకునేని గనరాని <ref>క. యీహి, చ.ట. యీప్సి</ref>యీప్సితం, బీతపస్వివరుని కిత్తు నేఁడ దెద్ది వేఁడె భక్తుఁ డద్దియ యొసఁగంగఁ, గట్టినాఁడఁ గేలఁ గంకణంబు.</poem>|ref=105}} '''టీక'''. ఈప్సితంబు = అభీష్టము - కోరిక. {{Telugu poem|type=క.|lines=<poem>అని దేవకీకుమారుఁడు, మునివదనముఁ జూచి పలుకు మోదాంబుదగ ర్జనమునఁ బ్రసాదసాగర; జనితధ్వని యనఁగ నిగుడు సరసారభటిన్.</poem>|ref=106}} '''టీక'''. మోదాంబుదగర్జనమునన్ = సంతోషమేఘముయొక్క ఉఱమువలన; ప్రసాద...ధ్వని = అనుగ్రహ మను సముద్రమున పుట్టిన ధ్వని; సరసారభటిన్ = చక్కని వాక్పద్ధతితో; పలుకున్. '''అలం'''. ఉత్ప్రేక్ష. {{Telugu poem|type=ఉ.|lines=<poem>నీపితృభక్తి నీతపము నీవనిశంబు నొనర్చునర్చ యు ద్దీపితహర్షుఁ జేసె జగతీసురవందన! నన్ను, నీకు నా రూపము భక్తిమత్సదనరోహణశైలము చాల<ref>చ. దక్కె</ref>దక్కఁ గాం క్షాపరిపూర్తిగా వర మొసంగెద వేఁడు యథారుచి<ref>క. ప్రభన్, చ.ట. ప్రథన్</ref>ప్రథన్.</poem>|ref=107}} '''టీక'''. అనిశంబున్ = ఎల్లపుడును; ఉద్దీపికహర్షున్ = ఎక్కువ సంతోషము కలవానిని; భక్తిమత్సదనరోహణశైలము = భక్తి కలవారి (భక్తుల) ఇండ్లలోని రోహణ (రత్నములు గల) పర్వతము; కాంక్షాపరిపూర్తి = కోరిక నెఱువేఱుట; కాన్ = అగునట్లు; యథారుచిప్రథన్ = నీకోరికకు అనుగుణముగా. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=క.|lines=<poem>భాగ్యమనై యిహపరపరి, భోగ్యార్థమనై యగణ్యపుణ్యమనై వై రాగ్యజ్ఞానోన్నతులగు, యోగ్యతములపాల వాలియుండుదుఁ జుమ్మీ!</poem>|ref=108}} '''టీక'''. భాగ్యమనై = సంపదనయి, ఇహ...ర్థమనై = ఈలోకమునను, పరలోకమునను కూడ అనుభవింపఁదగిన వస్తువునయి; అగణ్యపుణ్యమనై = లెక్కలేని పుణ్యస్వరూపము కలవాఁడనయి; వైరాగ్య...న్నతులు = వైరాగ్యముచేతను, జ్ఞానముచేతను గొప్పవారు; వాలి = వంగి; ప్రేమ గలిగి; ఉండుదున్ = ఉందును. {{Telugu poem|type=వ.|lines=<poem>విశేషించి నీయెడం బ్రసన్నుండనై యున్నవాఁడ; నభీష్టవృష్టిఘనాఘనంబగు మదీయఘృణాగుణంబునకు భాజనంబ వైతివి; జగజ్జాలంబున వస్తుజాలంబు నీకు దుర్లభంబు లేదని పలుకు యదువల్లభువలనం బ్రబోధితుండై.</poem>|ref=109}} '''టీక'''. ప్రసన్నుండనై = అనుగ్రహించినవాఁడనయి; అభీష్ట...ఘనంబు = కోరికలను వర్షమునకు వర్షాకాలపుమేఘము; మదీయఘృణాగుణంబునకున్ = నాయొక్క దయాగుణమునకు; భాజనంబవు = పాత్రమవు; ప్రబోధితుండై = మెలఁకువ పొందింపఁబడినవాఁడు - ప్రోత్సహింపఁబడినవాఁడు; '''అలం'''. రూపకము.<noinclude><references/></noinclude> g84xt7vwbh84cyjopdkpaxnvg6v9d7n పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/275 104 212720 555376 554957 2026-05-03T05:59:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555376 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>పుండరీకుఁడు పల్కు 'బుద్బుదాభములైన సిరులు నిన్ గామింప, జేరి కల్ప విటపిఁ గుల్మాషముల్ వేఁడు వెఱ్ఱిగలాఁడె? నిఖిలదుర్లభుఁడగు నీవు నన్నుఁ గరుణింతు, వరమిత్తు, గాతు, నీడేరుతు నని యున్కి భయ మేది? యద్భుతార్థ మర్థింతు, నిపుడున్నయట్ల యస్మన్నామచిహ్నితైతన్మహాక్షేత్రతీర్థ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మధ్యతలమున నిలువు నామనవి జేసి, సకలజనులకు మోక్షరాజ్యము నొసఁగుచు, నిదియ నాకోర్కె జగదేకహితము నిదియ, దీనిమీఱిన సిరియొల్ల దేవదేవ!'</poem>|ref=110}} '''టీక'''. బుద్బుదాభములు = నీటిబుగ్గలవంటివి; సిరులు = సంపదలను; కామింపన్ = కోరఁగా; కల్పవిటపిన్ = కల్పవృక్షమును; కుల్మాషముల్ = గుగ్గిళ్లను; కలాఁడె? = ఉండునా? నిఖిలదుర్లభుఁడు = అందరికిని లభింపనివాఁడవు; అస్మత్...తలమునన్ = నాపేరితో చిహ్నితములైన (నాపేరుగల) యీ క్షేత్రముయొక్కయు తీర్థముయొక్కయు మధ్యప్రదేశమునందు; నామనవిఁ జేసి = నాప్రార్ధనవలన; మీఱిన = అతిశయించిన; ఒల్లన్ = అంగీకరింపను. {{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు నతండు చాపలాతిశయంబునఁ జర్వితచర్వణంబుగా సర్వసుపర్వ దుష్ప్రాపం<ref>చ. బున</ref>బగు నీ రూపంబు కృపాపరతంత్రం బగుచు నాకు నగపడుటకు భూతవ్రాతంబులు ప్రభూతాద్భుతరసమసృణమాససంబు లగుచు నున్నయవి, భవదీయంబగు నకారణ<ref>క. సుకృతత్వ, చ.ట. సుకృతిత్వ</ref>సుకృతిత్వంబునకు నియంతయుం గలండె? యుత్తరం గంబగు సంసారతరంగమాలి మునుంగుచుఁ బొనుంగుపడి యనంగీకృతవిజ్ఞాన జ్ఞా<ref>చ. నంబులై</ref>నవిలాసులై దోసంబులం జేసిన కరువులనందగు నలసులకు వెల సులభంబు నధిక ఫలంబునగు యుష్మదర్శనంబు భవభయకర్శనంబు నుపసర్గజలదవర్గస్పర్శ<ref>చ. నంబున</ref>నంబు సప్తవర్ణదర్శననిదర్శ<ref>చ. నఁబగు</ref>నంబు నగుఁగాక! ఏతత్{{ZWNJ}}క్షేత్రంబు నీయాజ్ఞ నశేషక్షేత్ర విశేషోత్తంసం బగుంగాక! ఈ తీర్థంబు నస్మన్నామాంకితసమర్ధనంబున నుత్తమం బగుంగాత<ref>చ.ట. యని</ref>మని.</poem>|ref=111}} '''టీక'''. చర్వితచర్వణంబుగాన్ = చెప్పినదానినే మఱలఁ జెప్పునట్లుగా; సర్వసుపర్వదుష్ప్రాపంబు = సమస్తదేవతలకును పొందరానిది; భూతవ్రాతంబులు = జీవరాసులు; ప్రభూత...మానసంబులు = ఎక్కువ ఆశ్చర్యముచే చిక్కనైన మనస్సుకలవి; సుకృతిత్వంబునన్ = మేలుచేయుపద్ధతికి; నియంత = నియమించువాఁడు - ఆజ్ఞాపించువాఁడు; ఉత్తరంగంబగు = పైకిలేచు (విజృంభించు) అలలు గల; సంసారకరంగమాలిన్ = సంసారసాగరమున; పొనుంగుపడి = తేజస్సుచెడి; అనంగీ...విలాసులై =నఆగ్రహింపని (ఎఱుఁగని) విజ్ఞానజ్ఞానములలీలలు కలవారయి; దోసంబులన్ = దోషములతో - పాపములతో; కరువులు = పోతపోయు అచ్చులు; భయభయకర్శనంబు = పునర్జన్మభయమును క్షీణింపఁజేయునది; ఉపసర్గజలదవర్గస్పర్శనంబు = ఉపద్రవములను మేఘములగుంపునకు గాలి యగునది; అపవర్గదర్శననిదర్శనంబు = మోక్షదర్శనమునకు తార్కాణమైనది; అశేషక్షేత్రవిశేషోత్తంసంబు = గొప్పక్షేత్రము లన్నిటియందును ఉత్తమమైనది; అస్మన్నామాంకితసమర్ధనంబునన్ = నాపేరిచే చిహ్నిరమగునట్లు నెఱవేర్చుట(చేయుట)చేత. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆనతమౌళియై <ref>క. యటలు, చ.ట. యిటుల</ref>యిటులఁ బ్రార్థన సేయు మునీంద్రు శాంబరీ మానుషవేషధారి దయమానమనఃస్థితి <ref>చ. బిగ్గె</ref>బిగ్గ నవ్వుచున్</poem>|ref=}}<noinclude><references/></noinclude> b629eez41ror9jvwt0inxhh82rfkhc6 555377 555376 2026-05-03T06:00:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 555377 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>పుండరీకుఁడు పల్కు 'బుద్బుదాభములైన సిరులు నిన్ గామింప, జేరి కల్ప విటపిఁ గుల్మాషముల్ వేఁడు వెఱ్ఱిగలాఁడె? నిఖిలదుర్లభుఁడగు నీవు నన్నుఁ గరుణింతు, వరమిత్తు, గాతు, నీడేరుతు నని యున్కి భయ మేది? యద్భుతార్థ మర్థింతు, నిపుడున్నయట్ల యస్మన్నామచిహ్నితైతన్మహాక్షేత్రతీర్థ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మధ్యతలమున నిలువు నామనవి జేసి, సకలజనులకు మోక్షరాజ్యము నొసఁగుచు, నిదియ నాకోర్కె జగదేకహితము నిదియ, దీనిమీఱిన సిరియొల్ల దేవదేవ!'</poem>|ref=110}} '''టీక'''. బుద్బుదాభములు = నీటిబుగ్గలవంటివి; సిరులు = సంపదలను; కామింపన్ = కోరఁగా; కల్పవిటపిన్ = కల్పవృక్షమును; కుల్మాషముల్ = గుగ్గిళ్లను; కలాఁడె? = ఉండునా? నిఖిలదుర్లభుఁడు = అందరికిని లభింపనివాఁడవు; అస్మత్...తలమునన్ = నాపేరితో చిహ్నితములైన (నాపేరుగల) యీ క్షేత్రముయొక్కయు తీర్థముయొక్కయు మధ్యప్రదేశమునందు; నామనవిఁ జేసి = నాప్రార్ధనవలన; మీఱిన = అతిశయించిన; ఒల్లన్ = అంగీకరింపను. {{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు నతండు చాపలాతిశయంబునఁ జర్వితచర్వణంబుగా సర్వసుపర్వ దుష్ప్రాపం<ref>చ. బున</ref>బగు నీ రూపంబు కృపాపరతంత్రం బగుచు నాకు నగపడుటకు భూతవ్రాతంబులు ప్రభూతాద్భుతరసమసృణమాససంబు లగుచు నున్నయవి, భవదీయంబగు నకారణ<ref>క. సుకృతత్వ, చ.ట. సుకృతిత్వ</ref>సుకృతిత్వంబునకు నియంతయుం గలండె? యుత్తరం గంబగు సంసారతరంగమాలి మునుంగుచుఁ బొనుంగుపడి యనంగీకృతవిజ్ఞాన జ్ఞా<ref>చ. నంబులై</ref>నవిలాసులై దోసంబులం జేసిన కరువులనందగు నలసులకు వెల సులభంబు నధిక ఫలంబునగు యుష్మదర్శనంబు భవభయకర్శనంబు నుపసర్గజలదవర్గస్పర్శ<ref>చ. నంబున</ref>నంబు సప్తవర్ణదర్శననిదర్శ<ref>చ. నఁబగు</ref>నంబు నగుఁగాక! ఏతత్{{ZWNJ}}క్షేత్రంబు నీయాజ్ఞ నశేషక్షేత్ర విశేషోత్తంసం బగుంగాక! ఈ తీర్థంబు నస్మన్నామాంకితసమర్ధనంబున నుత్తమం బగుంగాత<ref>చ.ట. యని</ref>మని.</poem>|ref=111}} '''టీక'''. చర్వితచర్వణంబుగాన్ = చెప్పినదానినే మఱలఁ జెప్పునట్లుగా; సర్వసుపర్వదుష్ప్రాపంబు = సమస్తదేవతలకును పొందరానిది; భూతవ్రాతంబులు = జీవరాసులు; ప్రభూత...మానసంబులు = ఎక్కువ ఆశ్చర్యముచే చిక్కనైన మనస్సుకలవి; సుకృతిత్వంబునన్ = మేలుచేయుపద్ధతికి; నియంత = నియమించువాఁడు - ఆజ్ఞాపించువాఁడు; ఉత్తరంగంబగు = పైకిలేచు (విజృంభించు) అలలు గల; సంసారకరంగమాలిన్ = సంసారసాగరమున; పొనుంగుపడి = తేజస్సుచెడి; అనంగీ...విలాసులై =నఆగ్రహింపని (ఎఱుఁగని) విజ్ఞానజ్ఞానములలీలలు కలవారయి; దోసంబులన్ = దోషములతో - పాపములతో; కరువులు = పోతపోయు అచ్చులు; భయభయకర్శనంబు = పునర్జన్మభయమును క్షీణింపఁజేయునది; ఉపసర్గజలదవర్గస్పర్శనంబు = ఉపద్రవములను మేఘములగుంపునకు గాలి యగునది; అపవర్గదర్శననిదర్శనంబు = మోక్షదర్శనమునకు తార్కాణమైనది; అశేషక్షేత్రవిశేషోత్తంసంబు = గొప్పక్షేత్రము లన్నిటియందును ఉత్తమమైనది; అస్మన్నామాంకితసమర్ధనంబునన్ = నాపేరిచే చిహ్నితమగునట్లు నెఱవేర్చుట(చేయుట)చేత. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆనతమౌళియై <ref>క. యటలు, చ.ట. యిటుల</ref>యిటులఁ బ్రార్థన సేయు మునీంద్రు శాంబరీ మానుషవేషధారి దయమానమనఃస్థితి <ref>చ. బిగ్గె</ref>బిగ్గ నవ్వుచున్</poem>|ref=}}<noinclude><references/></noinclude> 3v8xa63l1m65asyisq5x8lvpavedg2p పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/276 104 212721 555382 554958 2026-05-03T08:35:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555382 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>వీనులఁ దాఁకు గన్గడల వేమఱు చూచుచుఁ బల్కుఁ జిల్కుపూఁ దేనియ సోనవెల్లువలఁ దెప్పలఁ దేలెడు మేలిపల్కులన్.</poem>|ref=112}} '''టీక'''. ఆనతమౌళియై = వంచినతల కలవాఁడై; శాంబరీమానుషవేషధారి = మాయామానుషవిగ్రహమును ధరించినవాఁడు - శ్రీకృష్ణుఁడు; దయమానమనఃస్థితిన్ = దయతలఁచిన మనోవ్యాపారమున; బిగ్గన్ = గట్టిఁగా; చిల్కు...వెల్లువలన్ = కారుచున్న పూవుఁదేనెవానవలని ప్రవాహములందు; తెప్పలఁ దేలెడు = ఓలలాడెడి; మేలిపల్కులన్ = మంచిమాటలతో; పల్కున్. {{Telugu poem|type=సీ.|lines=<poem>అతిదుర్లభంబు వేఁడితి దుర్లభఁడనైన <ref>క. నే, చ.ట. యే</ref>యే నీకుఁ దక్కుట మౌనివర్య! త్వత్ప్రియార్థముగ నీస్థలమునఁ బరివారయుక్తుండనై నిల్చియున్ననన్ను సేవించువారెల్లఁ జిరపుణ్యవంతులు నిహపరసుఖలాభహృష్టమతులు కలికాలకల్మషగరళకూటాటోపకాకోలకంఠులు <ref>చ. కలిత</ref>గళితభవులు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నయ్యెదరు; సర్వదివ్యోత్తమాస్మదాజ్ఞఁ బూని <ref>చ. యా</ref>యీక్షేత్రమును దీర్థమును సమస్త భువనవర్ణితవిఖ్యాతిఁ బొదలుగాత <ref>యెల్ల</ref>మెల్ల పుణ్యస్థలములకు నెక్కు డగుచు.</poem>|ref=113}} '''టీక'''. దుర్లభుఁడను = లభింపనివాఁడను; దక్కుటన్ = అధీనుఁడ వగుటచే; ఇహ...మతులు = ఈలోకపుసుఖములతోను, పరలోకముఖములతోను సంతోషించిన మనస్సు కలవారు;కలి...కంఠులు = కలికాలమునందలి పాపము లనెడి విషసమూహములయొక్క విజృంభణమునకు శివులైనవారు - కలికాలపాపములను నశింపఁజేయువారు; గళికభవులు = నశించినజన్మ కలవారు - జన్మరహితులు; ఎల్లపుణ్యస్థలములకున్ = అన్నిపుణ్యస్థలములకంటె; ఎక్కుడు = గొప్పది; పొదలుఁగాత! = ప్రసిద్ధమగుఁగాత! {{Telugu poem|type=క.|lines=<poem>త్వన్నామచిహ్నితంబగు, నిన్నేలయె తెల్లదీవి; యేనుండుటకున్ మన్నించి భక్తవాంఛా, భ్యున్నతు లొసఁగుటయె నాకు యుక్త<ref>చ.ట. ముల్</ref>వ్రతమున్.</poem>|ref=114}} '''టీక'''. ఇన్నేలయె = ఈక్షేత్రమే; తెల్లదీవి = శ్వేతద్వీపము; మన్నించి = గౌరవించి; యుక్తవ్రతమున్ = తగిన నియమముకూడ. {{Telugu poem|type=సీ.|lines=<poem>విను ధాతృసుత! యప్పు డనిమిషు లసురారి కృపకు నచ్చెరువంది కేలు మొగిచి 'పరమేశ! యో భక్తపరతంత్ర! భావానువర్తి! పరబ్రహ్మ! వరద! నిన్ను నరచేతిమణిఁ జేసి యవనివారలకెల్ల నపవర్గ మొసఁగు నీయయ్య <ref>చ. యెట్లు</ref>నెట్లు వోలు విశ్రాణనసాలంబు యాచకకాంక్షితమాత్రాప్తికారణంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem><ref>చ. నీక</ref>నీకె తగు నీత<ref>చ. నీక</ref>నికె తగు నిఖిలగమ్య పూజ వడయంగఁ బూజించి పొగడువడయ' నని మురద్వేషిఁ, బుండరీకుని బొగడుచుఁ జనిరి సమ్మర్దముగఁ నిజ<ref>ట. సదన</ref>స్థానములకు.</poem>|ref=115}}<noinclude><references/></noinclude> c30jpj15lsahm00s4sn3t6pr46l6ilj పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/277 104 212722 555386 554959 2026-05-03T10:27:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555386 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ధాతృసుత! = నారదుఁడా! అపవర్గము = మోక్షము; విశ్రాణరసాలంబు = ఈఁతమ్రాను - కల్పవృక్షము; యాచక...కారణంబు = యాచకులు కోరినకోరికలను మాత్రము ఇచ్చునది - అధికముగా ఈయనిది; మురద్వేషిన్ = విష్ణుని. {{Telugu poem|type=ఆ.|lines=<poem>పొగడి రఖిలమునులు జగము లానందించె, నాఁటపాట చూసి రమరరమణు లా దినంబు సుదిన <ref>చ.ట. మయ్యె</ref>మయ్యు దుర్దినమయ్యె, విబుధతరులతాంతవృష్టి గురియ.</poem>|ref=116}} '''టీక'''. అమరరమణులు = అప్సరసలు; సుదినము = మంచిదినము - మంచిరోజు; దుర్దినము = చెడ్డరోజు - మేఘములు కప్పుటచే చీఁకటియైన రోజు; విబుధ...వృష్టి = కల్పవృక్షపు పూలవాన. '''అలం'''. విరోధాభాసము. {{Telugu poem|type=సీ.|lines=<poem>శిఖిపింఛధారియై చేదోయి కటి నిల్పి హరితీర్థమునఁ బశ్చిమాభిముఖు:డు క్షేత్రంబునందుఁ బ్రాగ్దిగభిముఖుఁడునై రెండు మూర్తులు దాల్సుచుండు; నతని పదపీఠమై యొప్పు ఫణిభర్త; రమ గొల్పు హ్రీ యన శ్రీ యన రెండుగడలఁ జామరహస్తలై; ఛందోమయాకృతి ఖగలోకనాథుఁ <ref>చ. డుగ్ర</ref>డగ్రమున వెలయు;</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దక్షిణంబున సనకప్రధానమునులుఁ, దాను బొగడుచు సేవించుఁ దమ్మిచూలి; యేను రుద్రులు సేవింతు మెడమవలన; వెనుక నుండుదు రింద్రాదివిబుధవరులు.</poem>|ref=117}} '''టీక'''. శిఖిపింఛధారియై = నెమిలిపురిని (తలపై) ధరించినవాఁడై; చేదోయి = రెండుచేతులు; ప్రాగ్దిగభిముఖుఁడు = తూర్పుదిక్కునకు ఎదురుగా ఉన్నవాఁడు; ఫణిభర్త = సర్పరాజు - శేషుఁడు; రమ = లక్ష్మీదేవి; రెండుగడలన్ = రెండుదిక్కులందును; ఛందోమయాకృతిన్ = వేదస్వరూపముతో; ఖగలోకనాథుఁడు = గరుడుఁడు; అగ్రమున = ఎదుట; తమ్మిచూలి = బ్రహ్మ. {{Telugu poem|type=వ.|lines=<poem></poem>|ref=}} వత్సా! శ్రీవత్సలాంఛనుభక్తవత్సలత్వంబు నీవు నెఱింగినయదియకదా! విను మత్తెఱంగున మెఱుంగు టొల్లియ గొల్లదొర కరకలితచిత్ర<ref>చ. భస్మజల</ref>భస్త్రజలజశుక్తియు, విరచితవినత<ref>చ. యుక్తి</ref>ముక్తియుఁ, గుటిలకోమలవినీలకుంతలనికరుండును, నపరిమితకరుణా కరుండును,గటితటఘటితదోఃస్తంభయుగళుండును, జటులనిశాట<ref>చ. దళ</ref>గళనిగళుండు ను, మకరకుండలమండితకపోలఫలకుండును, యదుకులతిలకుండును, క్షుల్లకా<ref>చ. సిక్య</ref>శిక్య సఖ్యాభిరామమృదులోరుద్వయుండును, సద్వయుండును, బుండరీకప్రభృతి మునిజనసేవ్యమానుండును, ననూనుండును, నఖండజ్ఞానానందైకవిగ్రహం డును, విగళితజగన్నిగ్రహుం<ref>క. డునై. చ. డునునై</ref>డునునై; పంచాబ్దంబును, <ref>క. పంచ</ref>బంచశరసహస్రాతి శాయి విలసనసరసంబును, నిచ్ఛాదిగంబరంబును నైన ప్రాయంబును, నవరత్న సానుప్రాయంబును, బాహ్యాభ్యంతరికద్వా<ref>చ. రాంతక</ref>రాష్ట్రకవిసృష్టంబు, నదభ్రంబు, నభ్రం కషంబును నగు మహాప్రాసాదంబునందు వాసనవైశ్రవణ<ref>క. లో 'వరుణ' లేదు.</ref>వరుణవైవస్వతప్రముఖ మఖభుగలఘుకిరీటమణిగణఘృణిమంజరీపింజరీకృతంబగు శేషపీఠంబు నధిష్టించి, చరణద్వయాంతరాళోపలాలితగోయష్టిలతామతల్లియై భువనత్రితయకామితకల్ప వల్లియునైన తన యాకృతి యవికృతభావంబునం బ్రభవింపఁ దత్క్షేత్రతీర్థమధ్యం బుల నంగీకృతాఖ్యాసీనుండై వాసుదేవాదివ్యూహంబులు, జ్ఞానక్రియాదిశక్తులు,<noinclude><references/></noinclude> 3t8hk0eemrsy2n1jpgwn0z0iox5wqkg 555387 555386 2026-05-03T10:28:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 555387 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ధాతృసుత! = నారదుఁడా! అపవర్గము = మోక్షము; విశ్రాణరసాలంబు = ఈఁతమ్రాను - కల్పవృక్షము; యాచక...కారణంబు = యాచకులు కోరినకోరికలను మాత్రము ఇచ్చునది - అధికముగా ఈయనిది; మురద్వేషిన్ = విష్ణుని. {{Telugu poem|type=ఆ.|lines=<poem>పొగడి రఖిలమునులు జగము లానందించె, నాఁటపాట చూసి రమరరమణు లా దినంబు సుదిన <ref>చ.ట. మయ్యె</ref>మయ్యు దుర్దినమయ్యె, విబుధతరులతాంతవృష్టి గురియ.</poem>|ref=116}} '''టీక'''. అమరరమణులు = అప్సరసలు; సుదినము = మంచిదినము - మంచిరోజు; దుర్దినము = చెడ్డరోజు - మేఘములు కప్పుటచే చీఁకటియైన రోజు; విబుధ...వృష్టి = కల్పవృక్షపు పూలవాన. '''అలం'''. విరోధాభాసము. {{Telugu poem|type=సీ.|lines=<poem>శిఖిపింఛధారియై చేదోయి కటి నిల్పి హరితీర్థమునఁ బశ్చిమాభిముఖు:డు క్షేత్రంబునందుఁ బ్రాగ్దిగభిముఖుఁడునై రెండు మూర్తులు దాల్సుచుండు; నతని పదపీఠమై యొప్పు ఫణిభర్త; రమ గొల్పు హ్రీ యన శ్రీ యన రెండుగడలఁ జామరహస్తలై; ఛందోమయాకృతి ఖగలోకనాథుఁ <ref>చ. డుగ్ర</ref>డగ్రమున వెలయు;</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దక్షిణంబున సనకప్రధానమునులుఁ, దాను బొగడుచు సేవించుఁ దమ్మిచూలి; యేను రుద్రులు సేవింతు మెడమవలన; వెనుక నుండుదు రింద్రాదివిబుధవరులు.</poem>|ref=117}} '''టీక'''. శిఖిపింఛధారియై = నెమిలిపురిని (తలపై) ధరించినవాఁడై; చేదోయి = రెండుచేతులు; ప్రాగ్దిగభిముఖుఁడు = తూర్పుదిక్కునకు ఎదురుగా ఉన్నవాఁడు; ఫణిభర్త = సర్పరాజు - శేషుఁడు; రమ = లక్ష్మీదేవి; రెండుగడలన్ = రెండుదిక్కులందును; ఛందోమయాకృతిన్ = వేదస్వరూపముతో; ఖగలోకనాథుఁడు = గరుడుఁడు; అగ్రమున = ఎదుట; తమ్మిచూలి = బ్రహ్మ. {{Telugu poem|type=వ.|lines=<poem>వత్సా! శ్రీవత్సలాంఛనుభక్తవత్సలత్వంబు నీవు నెఱింగినయదియకదా! విను మత్తెఱంగున మెఱుంగు టొల్లియ గొల్లదొర కరకలితచిత్ర<ref>చ. భస్మజల</ref>భస్త్రజలజశుక్తియు, విరచితవినత<ref>చ. యుక్తి</ref>ముక్తియుఁ, గుటిలకోమలవినీలకుంతలనికరుండును, నపరిమితకరుణా కరుండును,గటితటఘటితదోఃస్తంభయుగళుండును, జటులనిశాట<ref>చ. దళ</ref>గళనిగళుండు ను, మకరకుండలమండితకపోలఫలకుండును, యదుకులతిలకుండును, క్షుల్లకా<ref>చ. సిక్య</ref>శిక్య సఖ్యాభిరామమృదులోరుద్వయుండును, సద్వయుండును, బుండరీకప్రభృతి మునిజనసేవ్యమానుండును, ననూనుండును, నఖండజ్ఞానానందైకవిగ్రహం డును, విగళితజగన్నిగ్రహుం<ref>క. డునై. చ. డునునై</ref>డునునై; పంచాబ్దంబును, <ref>క. పంచ</ref>బంచశరసహస్రాతి శాయి విలసనసరసంబును, నిచ్ఛాదిగంబరంబును నైన ప్రాయంబును, నవరత్న సానుప్రాయంబును, బాహ్యాభ్యంతరికద్వా<ref>చ. రాంతక</ref>రాష్ట్రకవిసృష్టంబు, నదభ్రంబు, నభ్రం కషంబును నగు మహాప్రాసాదంబునందు వాసనవైశ్రవణ<ref>క. లో 'వరుణ' లేదు.</ref>వరుణవైవస్వతప్రముఖ మఖభుగలఘుకిరీటమణిగణఘృణిమంజరీపింజరీకృతంబగు శేషపీఠంబు నధిష్టించి, చరణద్వయాంతరాళోపలాలితగోయష్టిలతామతల్లియై భువనత్రితయకామితకల్ప వల్లియునైన తన యాకృతి యవికృతభావంబునం బ్రభవింపఁ దత్క్షేత్రతీర్థమధ్యం బుల నంగీకృతాఖ్యాసీనుండై వాసుదేవాదివ్యూహంబులు, జ్ఞానక్రియాదిశక్తులు,</poem>|ref=}}<noinclude><references/></noinclude> 89bpn3w1pblh32mjt40up223o70v160 పుట:Sangitarasataran022902mbp.pdf/98 104 212899 555349 2026-05-02T12:24:36Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555349 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఎరుగుదువేకదా యేనూగర్భిణీనని పురుడైనదాటించి పోవైతివిగా॥ ॥నాధా॥ మగబిడ్డబుట్టిన మాటైనదెలిసికో తగదాయెనా నీ మతం మిమతమో॥ ॥నాధా॥ బుద్ధు — ఎందుకుదుఃఖించెదవు కర్మవశంబులై సుఖదుఃఖంబులుండు కామినీ నీవును సౌగతంబుపూని జ్ఞానంబున నిర్వాణంబునందుము శిష్యగణంబుతో నిన్నును లెక్కల _ఁగొంటిని కపిలవస్తువునం చేయుండి స్త్రీజనంబుల కహింసాదులుపదేశించుచుండుము. నీకుపదేశంబు జేయుకొరకును పురజనులకు నామతంబువెల్లడిచేయుటకును రెండు మాసంబులిచ్చటసేయుండెద. లోపలికిఁబొమ్ము' రాహులుని లేవ నెత్తి (ముద్దు బెట్టుకొని) చ॥ ఎరుగుదునీవు నాతనువ వేయనియేడ్చెదవేలయూరకొ మ్మెరుగవులోకయూత్రత్వదభీప్సితసిద్ధిఘటిల్లు రాజవై ధరఁబొగడొందినామతము దప్పకయేలుముకొల్వుగద్దెపై పరతరసౌఖ్యహేతువగు బాటకుజేరెదుగాక రాహులా॥ {{right|'''(ఇద్దలు నిష్క్రమణము)'''}} యశో — (దుఃఖము) నాయనా నీకీరూపెక్కడవచ్చినదోయి ఆహా దైవమా నాకేమిగతి చెప్పెదవు బిడ్డా నీ వేయేడుగడయని నమ్మితిగదా నాకన్నులుచేసుకొనిన పాపము నిన్ను సింహాసనంబునఁ గూర్చుండగాజూడనైతిగదా. బుద్దు - {{left margin|5em}}<poem>క॥ అమ్మాయేటికిదుఃఖము నమ్మితిజగమెల్లనేలజాలినవాడు౯ బొమ్మయనుకొమ్మునిర్వా ణమ్మునుజెందంగగలఁడె జ్ఞానరహితుడై॥</poem> </div> దయా సత్య శౌచాదివిహీనుండై స్వార్థపరాయణత్వమున సింహాసనస్థుండగుటచే బునర్జన్మపీడితుండుగావుట యెన్నటికిందప్పదు నిరాకార నిరామయంబగు సవ్యయసాదనంబగు మార్గంబిదియని సమ్ముము నీవుదుఃఖింపఁబనిలేదు దయాహింసావర్ణనంబులు ఆచరణంబునను బ్రచారణంబునను బరమధర్మంబుని స్త్రీ సముదాయంబుల కుపన్యసించును నీగోడలితోడుగూడ జీవితంబుంగపుము. అదిగో అయ్యగారువచ్చుచున్నారు. గౌత — (లోపలికి వెళ్లును)<noinclude><references/></noinclude> sb8l0eug0gztdrzxyniw1msdftp8kxo పుట:Sangitarasataran022902mbp.pdf/99 104 212900 555355 2026-05-02T13:05:36Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555355 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>శుద్ధో - (వచ్చిచూచి తలయూచి కొంచెమాలోచించి దయతోను దఃఖముతోను కోపముతోను). {{left margin|5em}}<poem>ఉ॥ ఔరకుమార చేసినమహావ్రాతముల్ జపహోమదానముల్ భూరిధరామరప్రతతి పూజలునాకిటువంటిపుత్తునిం గూరిచెనేరదండమును గుండికగంతయుబొంతదాల్పగా గోరికయెట్లుప్పు రిపుకోటికిగోరికదీరెనేటికి౯</poem> </div> బుద్ధు — (తండ్రిపొదములకు నమస్కరించి) {{left margin|5em}}<poem>క॥ పరమార్థమొకటిచెప్పెద పరలోకములెల్ల సకలబాధలకొరకే తిరమైనదిజన్మపరం పరమెందనిముక్తి లోకపాలకతండ్రీ॥</poem> </div> ఈతుచ్చ భోగంబులవలన నేమిప్రయోజనము వేయిమాటలేల నవద్వీపములంబరిపాలించినను మనుజుని యాశకుమేరయున్నదా ఏల ఈయాశ పరోపకారచింతయేకదా పుణ్యంబు ఇంద్రియనిగ్రహంబును శమదమాదిగుణసంపత్తియు సమదర్శనంబును భూతదయయు అహింసయు బ్రజ్ఞానసాధనంబురై మోక్షంబు నిచ్చుగావున నేజేసినతప్పులేదు క్షమించి నామార్గము నెల్లరునవలంబించునట్లను గ్రహింపుము. శాంతి శాంతి శాంతి. యశో — (బాలునితోవచ్చి, మంగళమిచ్చును) {{Center|{{p|fs125}}పాట. సురటి.</p>}} సదాస్తుకుశుభమంగళమ్ - నిరాకుళమ్ మదాదిరిపుగుణ - భీదానిరర్గళమ్॥ ॥సదా॥ దయాసత్యశౌచభూషితాయ - భయభాంతిశంకారహితాయ గయాకలిత సౌగతసుమతాయ - గయావట సమీపస్థితాయ॥ ॥సదా॥ తధాగతాయధర్మరాజాయ - పదాగ్రపతితసకలరాజాయ విదారితాంబుచరధ్వజూయ - వదాన్యశుద్ధోదవతనుజాయ॥ ॥సదా॥ సమస్తజననుఖసాధనాయ - ప్రమాదాదిదుర్గుణమధవాయ శమాదిసద్గుణధనాయజినాయ- రమాధీశనవమావతరణాయ॥ ॥సదా॥ {{Center|{{p|fs150}}బుద్ధనాటకము సంపూర్ణము.</p>}}<noinclude><references/></noinclude> am0cbzi7f5znkj6mcwmfg5r6a6rs1d3 555356 555355 2026-05-02T13:06:45Z Brjswiki 6801 555356 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>శుద్ధో - (వచ్చిచూచి తలయూచి కొంచెమాలోచించి దయతోను దఃఖముతోను కోపముతోను). {{left margin|5em}}<poem>ఉ॥ ఔరకుమార చేసినమహావ్రాతముల్ జపహోమదానముల్ భూరిధరామరప్రతతి పూజలునాకిటువంటిపుత్తునిం గూరిచెనేరదండమును గుండికగంతయుబొంతదాల్పగా గోరికయెట్లుప్పు రిపుకోటికిగోరికదీరెనేటికి౯</poem> </div> బుద్ధు — (తండ్రిపొదములకు నమస్కరించి) {{left margin|5em}}<poem>క॥ పరమార్థమొకటిచెప్పెద పరలోకములెల్ల సకలబాధలకొరకే తిరమైనదిజన్మపరం పరమెందనిముక్తి లోకపాలకతండ్రీ॥</poem> </div> ఈతుచ్చ భోగంబులవలన నేమిప్రయోజనము వేయిమాటలేల నవద్వీపములంబరిపాలించినను మనుజుని యాశకుమేరయున్నదా ఏల ఈయాశ పరోపకారచింతయేకదా పుణ్యంబు ఇంద్రియనిగ్రహంబును శమదమాదిగుణసంపత్తియు సమదర్శనంబును భూతదయయు అహింసయు బ్రజ్ఞానసాధనంబురై మోక్షంబు నిచ్చుగావున నేజేసినతప్పులేదు క్షమించి నామార్గము నెల్లరునవలంబించునట్లను గ్రహింపుము. శాంతి శాంతి శాంతి. యశో — (బాలునితోవచ్చి, మంగళమిచ్చును) {{Center|{{p|fs125}}పాట. సురటి.</p>}} {{left margin|5em}}<poem>సదాస్తుకుశుభమంగళమ్ - నిరాకుళమ్ మదాదిరిపుగుణ - భీదానిరర్గళమ్॥ ॥సదా॥ దయాసత్యశౌచభూషితాయ - భయభాంతిశంకారహితాయ గయాకలిత సౌగతసుమతాయ - గయావట సమీపస్థితాయ॥ ॥సదా॥ తధాగతాయధర్మరాజాయ - పదాగ్రపతితసకలరాజాయ విదారితాంబుచరధ్వజూయ - వదాన్యశుద్ధోదవతనుజాయ॥ ॥సదా॥ సమస్తజననుఖసాధనాయ - ప్రమాదాదిదుర్గుణమధవాయ శమాదిసద్గుణధనాయజినాయ- రమాధీశనవమావతరణాయ॥ ॥సదా॥</poem> </div> {{Center|{{p|fs150}}బుద్ధనాటకము సంపూర్ణము.</p>}}<noinclude><references/></noinclude> 64os9y7lqi7249otdwv990lz24o4t6h పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/1 104 212901 555379 2026-05-03T07:39:21Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555379 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}పతితసంసర్థిప్రాయశ్చిత్త</p>}} {{Center|{{p|fs125}}విషయకోపన్యాసము</p>}} {{rule |6em }} {{Center|{{p|fs125}}గోదావరిజిల్లా ఏలూరులో ఫస్ట్ గ్రేడ్ ప్లీడరుగు</p>}} {{Center|{{p|fs125}}దాను - శ్రీ రామపండితుని చే</p>}} {{Center|{{p|fs125}}రచయంపబడినది</p>}} {{rule |6em }} {{Center|{{p|fs125}}AN ADDRESS IN TELUGU</p>}} {{Center|'''ON'''}} {{Center|{{p|fs125}}A PRAYASCIUTTA AT ELLORE</p>}} {{Center|{{p|fs125}}BY</p>}} DASU SRIRAMULU PANTULU {{Center|'''First Grade Pleader'''}} {{Center|{{p|fs125}}MADRAS</p>}} {{Center|{{p|fs125}}Print at the Hindu Press, No. 11. Main Road 1</p>}} {{Center|{{p|fs125}}1891</p>}} {{Center|{{p|fs125}}గ్రంథ ప్రతులు</p>}} {{Center|{{p|fs125}}గ్రంథకర్త గారివద్ద దొరుకును</p>}} {{Center|{{p|fs125}}వేల ౪ అణాలు</p>}}<noinclude><references/> {{p|fs150}}</p></noinclude> 3uvc3q4urng1k7orr0alh606bb731tg 555380 555379 2026-05-03T07:41:21Z Brjswiki 6801 555380 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}పతితసంసర్థిప్రాయశ్చిత్త</p>}} {{Center|{{p|fs125}}విషయకోపన్యాసము</p>}} {{rule |6em }} {{Center|{{p|fs125}}గోదావరిజిల్లా ఏలూరులో ఫస్ట్ గ్రేడ్ ప్లీడరుగు</p>}} {{Center|{{p|fs125}}దాను - శ్రీ రామపండితుని చే</p>}} {{Center|{{p|fs125}}రచయంపబడినది</p>}} {{rule |6em }} {{Center|{{p|fs125}}AN ADDRESS IN TELUGU</p>}} {{Center|'''ON'''}} {{Center|{{p|fs125}}A PRAYASCIUTTA AT ELLORE</p>}} {{Center|{{p|fs125}}BY</p>}} {{Center|{{p|fs125}}DASU SRIRAMULU PANTULU</p>}} {{Center|'''First Grade Pleader'''}} {{Center|{{p|fs125}}MADRAS</p>}} {{Center|{{p|fs125}}Print at the Hindu Press, No. 11. Main Road 1</p>}} {{Center|{{p|fs125}}1891</p>}} {{Center|{{p|fs125}}గ్రంథ ప్రతులు</p>}} {{Center|{{p|fs125}}గ్రంథకర్త గారివద్ద దొరుకును</p>}} {{Center|{{p|fs125}}వేల ౪ అణాలు</p>}}<noinclude><references/> {{p|fs150}}</p></noinclude> o59kug1vc1t4p99850lxvmvdt2i8faj పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/2 104 212902 555381 2026-05-03T07:51:48Z Brjswiki 6801 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center|{{p|fs125}}పీఠిక</p>}} స్వదేశాభిమానులయిన నాసోదరులారా! ఈ చిన్న పుస్తకమును తప్పక మీరు పరీక్షింతురని నమ్మకముతో దీని బ్రచురింపబూనుకొంటిని. ఇది చూపులకు చిన్న పుస్తకముగాని, బహుదినమ...' 555381 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}పీఠిక</p>}} స్వదేశాభిమానులయిన నాసోదరులారా! ఈ చిన్న పుస్తకమును తప్పక మీరు పరీక్షింతురని నమ్మకముతో దీని బ్రచురింపబూనుకొంటిని. ఇది చూపులకు చిన్న పుస్తకముగాని, బహుదినము లనేక గ్రంధములను బరిశీలించి విశేషశ్రమపడి వ్రాసితిని. ఇప్పటి విద్యావంతులయిన స్వదేశాభిమానులకందరికి యిది అత్యంత ప్రయోజనకారి. ధర్మశాస్త్రములు యథార్థముగా బ్రవతి౯పజేయబడినయెడల యిప్పుడు లోకమునకు హితకారులుగా మన విద్యావంతులెంచుచున్న సమస్తక్రియలకు అనుకూలములుగానే యున్నవిగాని ప్రతికూలములుగాలేవు. కొన్ని నూర్లసంవత్సరముల నుండి, యేవో కారణములచేత ధర్మశాస్త్రముల యథార్థ సంప్రదాయములనువిడిచి జనులు వారివారికి యిష్టమైనట్లు కొన్ని దురాచారములను గల్పించుకొని వానినే యిప్పటివరకు జరిగించుచు వచ్చినందున, ఆదురాచారము లిప్పుడు లోకబాధకములయి, ఎంత ఆరోచౌకములుగానయిననున్నవి. ఆయాచారములనే విడు వరాదు, ఆని యొక నియమ మేర్పడినట్లుకూడ తోచుచున్న ది. ఇందువలన ధర్మశాస్త్రమును పరిశీలించవలసిన యొక్క రాకూడను నశించినది. ఇప్పటి విద్యావంతులలో, కొండకు యీయీమధ్య కాల దురాచారము లే ధర్మ శాస్త్రములనుకొని భ్రమ జెంది, ఆహా, ధర్మశాస్త్రము లెత కఠినముగా నున్నవి; ఋ షులని పేరు పెట్టుకొనిన వారు ప్రజలకు మారకులయి వారిని దూ షించుచున్నారు. మరి కొందరును అటువంటి భ్రమ నేచెందియు లోకమునకు బాధకమాయెనేమి సాధకమాయె నేమి ఆ 8వ గవలసినదిగాని ఆయాచారములను మార్చరాదనుచున్నారు.<noinclude><references/></noinclude> pcdoq8ixlh86u6lx7tkevtxff9yg1c8