వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.46.0-wmf.26 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/488 104 204118 555391 531413 2026-05-03T11:59:18Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555391 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>తక్కిన పత్రికలమాట నాకు తెలియదనుకోండి, తెనుగు పత్రికలు మాత్రం వారి యేపూ, వారి రూపూ, వారి చూపూ - వారు పూటూ, వారి పోటూ, వారి పాటూ - చివరికి వారి ప్రతీకదలికా నీహారవేశాలు కూడా విడిచి పెట్టకుండా, అదే వొక పరాయణం అన్నట్టు ప్రకటించాయి. వారి రూప చిత్రాలు చూపించాయి, భిన్నభిన్న అవస్థలవి. వారి తూకమూ, వారి యెత్తూ, వారి లావూ, వారి ఆహార నిద్రలూ, వారి అలవాట్లూ, వారి సరదాలూ క్షుణ్ణంగా వివరించాయి. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా - చివరికి కర్నూలునుంచిన్నీ వేలకువేలు - లక్షలకు లక్షలున్నూ మద్రాసు చేరుకున్నారు, వారికోసం. వారాలూ పక్షాలూ వుండిపోయా రక్కడ. తిండీ తిప్పలూ మరిచిపోయారు. మరిచిపోయారనికాదు, విడిచి పెట్టేశారు. మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చుపెట్టారు, డబ్బు. మరి, విద్యలంటే - శాస్త్రాలంటే - కళలంటే - పరిశోధన లంటే - నిర్మాణాలంటే - పోనీ బీదలంటే వొక్క గవ్వ అయినా రాలుస్తారా, వారు? ఊరు విడిచి పెడతారా? చెవిని పెట్టుకుంటారా, వాటి ప్రసక్తి అయినా. ఒక్క రాగం విసిరి ఐక్యానుసంధానం కలిగిస్తాడు గాయకుడు. ఒక్క భావం వొలిపించి ఆనందమేకాదు, సంస్కారమున్నూ కలిగిస్తాడు, కవి. ఒక్క నల్లరాయి గండనించి నిలువునా జీవం తొణికిసలాడిస్తాడు శిల్పి. ఒక్క కుంచె విసిరి ప్రపంచం అంతా యెదట నిలుపుతాడు చిత్రకారుడు. తమాషాకి కాదు, తమ మెదడు సుపరిష్కృతం చేస్తారు వారు. తమ హృదయం కదుపుతారు, గడియారం పెండ్యులం కదిపేటట్టు. మరి, ఆ రోజుల్లో, మద్రాసు చేరిన వారిలో యెందరు చేరతారక్కడ? ఎందరు సంచులు కోస్తారు వారికోసం? అసలు, ఆ కళావేత్తల నొకచోట చేర్చడానికి మాత్రం యెవరు పూనుకుంటారు? వారికివారే చేరుకున్నా, వారి అంతరశక్తుల నెవరు వివరిస్తారు, లోకకళ్యాణం కోసం? మరి, డోలు మీద దెబ్బపడితే? కనక, అలాంటివారి జేబులు కాళీకావాలంటే అలాంటి విద్యలే కావాలి. అలాంటి విద్యల్లో వొకటి స్వాధీనం అయింది నాకా కొద్ది పాటి పరిశ్రమతో. అయితే, అలాంటి క్షుద్రవిద్యలతో పొట్టపోసుకోడానికేనా నాకీ నిండు బతుకిచ్చాడు భగవంతుడు? "కాక, - ఆకటితో కడుపుమాడ్చుకోడానికా?” ఈ ప్రశ్నా వుంది, దాని తరవాతిదే యిది. అరుదుగా వచ్చే అవస్థ లివి మనిషికి. అరుదుగానైనా, కొందరికే వచ్చేవిన్నీ. నలుగురితో పాటయినవారికి రానూరావు, అర్ధమూ కావసలు.<noinclude><references/> {{rh|464||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> 75io7qq0mmtfk6qjtgjbtt335xwd0gc పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/489 104 204119 555392 531414 2026-05-03T12:02:10Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555392 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మనిషి విలవకి గణకాలివి. మనిషి యెత్తుకి తూకాలివి. మనిషి బతుక్కి సాఫల్యమో వైఫల్యమో కలిగించేవివి. మనిషిలో వుండే దైవికాంశ లోకానికి చూపిస్తాయివి. ఏమయినా, తిప్పి తిప్పి కొడతాయి, బులబులాగ్గా తేలిపోవు. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పవచ్చు. జటిలాలైన జీవితాలే యెన్నుకునే సమస్యలివి. కనక, వొక ఆట ఆడించే విడిచి పెడతాయి, చివరికి. ఆ ఆటలో పడిపోతా డా మనిషి, నిలుస్తాడా? ఆ సమస్యలు కావు, ఇదీ ప్రధానం. సముద్రంతో పోల్చారు పెద్దలు, సంసారం. వెలలేని రత్నాలూ వున్నాయి, భీకరాలైన జలజంతువులూ వున్నా యందులో. అవీ యివీ కూడా బహుళాలే, విరళాలు కావు. మరి, కళ్ళుమూసుకుని "హరోంహర" అంటూ అందులో వురకడమా, వెనక్కి తిరిగి, వూపిరి బిగపట్టుకుని పారిపోవడమా? మనిషి జీవశక్తికి వార్తికాలివి. అన్నీ సమస్యలూ, అన్నీ పరిష్కారాలే సంస్కారంలో. ఒక్కొక్క సమస్య అడ్డుతగులుతుం దొక్కొక్కడికి. ఒక్కొక్క పరిష్కారం గమ్యం చేరుస్తుం దొక్కొక్కణ్ణి. ఎవరికి వారికే దొరుకుతుం దేదో వొక సాధనం. సంస్కారాన్ని బట్టి వుంటుందా దొరకడం అయినా. ముద్దకొక వ్యంజనం కావాలి చక్రవర్తులకు, మృష్టాన్నం అయినంత మాత్రాన చాలదు. ఉప్పుగల్లుంటే చాలు, కడవలతో దోర్చేస్తాడు బీదవాడు గంజి. అదీకా, దిదీకాదు, వో - ట్ఠి గాలిమేసి యుగాలకు యుగాలు గడిపేస్తాడు మహర్షి. పుట్టుకకూ, దృక్పథానికీ ఫలితాలివి. సంస్కారాన్ని బట్టి వుంటుంది పర్యవసానం. దాని తరవాతిదీ, దాని కనుగణమున్నూ పురుషకారం. పండితుడైనవాడికి జీవనసరణి పరిష్కరించుకోడంలో వుంది, ప్రజ్ఞ. మరి, పండితుడంటే? అనుభవపరుడు, సంస్కారి, దీర్ఘదర్శి. శబ్దార్థాలు మాత్రమే తెలిసినవాడు కాడు. అయితే, పండితుడికిన్నీ అడ్డు తగలడం వుంది, పరిస్థితులు. సంసారంలో వున్నంతసేపూ, యేదీ, యిదమిత్థం అన్న నిర్ధారణ కందదు. లోయిల్లోకి జారవలసే వస్తుంది. శిఖరా లందుకోడమున్నూ పడుతూనే వుంటుంది. ఇక సమతలం దొరకడమా?<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||465}}</noinclude> n23v2gh58k22gdy59c2birlkes1bwu5 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/490 104 204120 555393 531415 2026-05-03T12:05:33Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555393 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>జీవిత ప్రారంభంలోనే దొరకవచ్చు, చాలా కాలం గడిస్తే గాని అందకపోవచ్చు, ఎప్పటికీ అందకపోయినా అందకపోవచ్చు కూడా. మరి, గమ్యం? మరి, ప్రాప్యం? అది మరిచిపోగూడదు. అదిగో, అందుకోసం బతకాలి, మనిషి. {{c|<big><big>7</big></big>}} “సరే” అన్నానంతే నేను "హైదరాబాదురాజ్యంలో సాహసానికి సాహసమూ, ఔదార్యానికిన్నీ ఔదార్యమూ హెచ్చు" అంటూ ప్రయాణమే కట్టేశాడు, సత్యనారాయణశాస్త్రి. ఏమిటేమిటో నిబంధనలు చెప్పాడు, ఏమిటేమిటో నిర్ధారణలూ చేశాడు, స్వతంత్రించి కంభం మెట్టుకి టిక్కెట్టు కొనేశాడు, రెయిలున్నూ యెక్కించేశాడు తీసుకువెళ్ళి నన్నతను. బెజవాడలో మారిన బండి తెల్లవారుతోందనగా కొండపల్లి దాటింది, అది మొదలు "పరాయిదేశం వెడుతున్నా" మన్నట్టుంది నాకు. ఇప్పటికిన్నీ, తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగినవాడికి, మొదటి మాటు, తునిదాటితే మరో ప్రపంచమూ, ఒంగోలు దాటితే మరో ప్రపంచమూ, నరసారావుపేట దాటితే మరో ప్రపంచమూ, కొండపల్లి దాటితే మరో ప్రపంచమున్ను. అసలు, ఏలూరుదాటితేనే భేదం కనపడుతుంది, అది అవగాహన కానిది కాదు. అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ కూడా కండగల తెనుగే; గాని, కాదేమో అనిపిస్తుందెక్కడి కక్కడే. అందుకు బెదరక, మళ్ళీ మళ్ళీ వెళ్ళాడా, తెనుగుభాష తన విశ్వరూపం కనపరుస్తుంది, ఆంధ్రత్వమున్నూ సమగ్రం అవుతుంది, వెళ్ళిన వాడికి. ఒక్కొక్క సీమలో వొక్కొక్క జీవకణం వుంది తెనుగు రక్తంలో, అన్నీ వొకచోటికి చేర్చగల - అన్నీ వొక్క తెనుగు వాడి రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకు రావాలి, అంతే. మొదటి మాటు విశాఖపట్నం వెళ్ళాన్నేను. అప్పటికి నాకున్నది వొక్కటే ప్రాణం. వారం రోజులున్నా నా మొదటి మా టక్కడ. రెండో ప్రాణం సంక్రమించిన ట్టనిపించింది, దాంతో నాకు. తరవాత నెల్లూరు వెళ్లాను, మూడో ప్రాణం సంక్రమించినట్టనిపించిం దక్కడ. అదయిన తరవాత కడపా, అనంతపురమూ, నంద్యాలా వెళ్ళాను, నాలుగో ప్రాణం సంక్రమించిన ట్టనిపించింది. చివరికి హనుమకొండ వెళ్ళాను, అయిదోప్రాణం కూడా నాకు సంక్రమించినట్టు - నా ఆంధ్రరక్త పరిపూర్ణం అయినట్టనుభూతం అయింది నాకు.<noinclude><references/> {{rh|466||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> j8y63olwlgqus5u7kw4lcdhroq7sv12 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/491 104 204121 555394 531445 2026-05-03T12:08:20Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555394 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇవాళ చూసుకుంటే, అయిదు ప్రాణాల నిండు జీవితమే నాది. అందుకు తగ్గ దార్ఢ్యం మాత్రం కూడలేదనే చెప్పా, లింకా. అందుకోసం నేను చేసుకున్న దోహదం బహూ తక్కువ, మరి. ఆంధ్రహృదయం- ఆంధ్రభాషపరంగా వ్యక్తం అవుతున్న జీవనసరణి నాకింకా బాగా అవగాహన కాలేదు. నా స్వప్రాంతపు పలుకుబడిలో యెంత జీవశక్తి వుందో, అక్కడక్కడి పలుకుబళ్ళలోనూ అంతంత జీవశక్తివుంది, వారాల్లోనూ మాసాల్లోనూ పట్టుబడేది కాదది. ఒక్కొక్కచోట ప్రచలితం అయే కాకువూ, వొక్కొక్క చోట ప్రయుక్తం అయే యాసా పుస్తకాలు చదివితే అందవు, వొకచోట కూచున్నా దొరకవు - పల్లెలూ పట్నాలూ తిరగాలి, అష్టాదశవర్ణాల వారిలోనూ పరభాషా వ్యామోహం లేనివారిని కలుసుకోవాలి, ఆ పలుకుబళ్ళు చెవులారా వినాలి, ఆ ప్రయోగవైచిత్రి సవిమర్శంగా పట్టుకోవాలి, ఆ వాదం - చిక్కని ఆ మధుర గంభీరనాదం అవగాహన చేసుకోవాలి, అన్నిటికీ ప్రధానంగా "ఇది నా సొంతభాష-మొదటిమాటు, నా తల్లి, నా జీవశక్తికి జత చేసిన – నాకు వాగ్ధార ఆవిర్భవింప చేసిన సంజీవిని అన్న ఆత్మీయతా, మమతా ఉద్బుద్ధాలు చేసుకోవాలి, ముందు." అప్పుడు గాని యే తెనుగువాడికీ నిండు ప్రాణం వుందని చెప్పడానికి వీల్లేదు. దానికోసం నా పరితాపం యిప్పటికీ. నిజం చెప్పవలసివస్తే, యే వొక్క శాస్త్రంలో సమగ్ర పరిజ్ఞానంలేని షట్ఛాస్త్ర పండితుని స్థితి నా దివాళ. అయినా, నా తెనుగుభాష శాస్త్రీయం - తాటా బూటం కాదు. నా తెనుగు భాషయుగయుగాలుగా ప్రవాహిని అయివుండినదిగాని, యివాళ, అభాషలోనుంచి వొక మాటా, యీ భాషలోనుంచి వొకమాటా యెరువు తెచ్చుకుని భారతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు. నా తెనుగుభాష సరస్వతికే తెవెచినుకు లందించింది గాని నిరుచప్పనిది కాదు. నా తెనుగుభాష ఎక్కడ పట్టినా చక్రవర్తుల రాజ్యాంగాలు నడిపిందిగాని, పరాన్న భుక్కుకాదు. నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలది గాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందీకాదు, అక్రమ దోహదాలతో పోషించబడవలసిందీ కాదు. యావద్భారతదేశంలోనూ, యీ విశాల విశ్వంలో కూడా తెనుగువాణ్ణిగా, నేనే నిర్వహించవలసిన కార్యక్రమం కొంత వుంది, - నా దృఢ విశ్వాసం యిది. అందుకోసం, అన్నిసీమల పలుకుబళ్ళూ బోధపరుచుకుని అన్నిసీమల జీవశక్తీ కూర్చుకుని స్వస్వరూప జ్ఞానంతో దృఢంగా నిలవగలగాలి నేను. సత్యనారాయణశాస్త్రికి వొక్క డబ్బుమీదే ఆశ. నాకు మాత్రం యీ ఆకాంక్ష కూడా వుంది, పూర్తిగా. కాగా, ఆ కమ్మంమెట్టులో, వొక్కొక్క మాట - వొక్కొక్క ప్రయోగం - వొక్కొక్క కాకువు కొత్తరక్తం పెట్టసాగింది నాకు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||467}}</noinclude> a5tum8is5d1geqetb512p7mkndl7xlp పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/492 104 204122 555395 531446 2026-05-03T12:11:13Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555395 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఆ ప్రాంతం నా తెనుగు దేశపు జీవగడ్డల్లో వొకటి. అక్కడ, నేను, నా ఆంధ్రసోదరులతో సంబంధం పెట్టుకోవాలి. ఈ ఆకాంక్ష - ఈ ఆత్రం - యీ పూనిక - వీటితో కమ్మంమెట్టు స్టేషనులో దిగాన్నేను. {{c|<big><big>8</big></big>}} "ఇలాంటి వాటికి, యిక్కడి తహస్సీలుదారుని చూడ్డం మంచిది ముందు" అన్నాడు, మాతో పాటు అక్కడే దిగిన ఆ వూరి పెద్దమనిషి వొకాయన. “సాధారణంగా, పండితులెవరు వచ్చినా ఆయన్ని తప్పుకుండా చూస్తారీవూళ్ళో" అనిన్నీ చెప్పాడాయన. అప్రయత్నంగానో సప్రయత్నంగానో యిలా వాకబుచేసుకుంటూనే పండితులెక్కడికి వెళ్ళినా. వారు సంపాదించుకున్న జాపితా సమగ్రమూ కావచ్చు, అసమగ్రమూ కావచ్చు కాని యీ వూళ్ళో వుండగానే ముందు వూరి రసికతా ఔదార్యమూ పరిమితి కట్టుకోడం - ఇదొక మంచి సంప్రదాయం, జాతీయ విద్యలు నేర్చుకున్నవారికి. తీరా వెళ్ళాక, అజాపితా కెక్కిన పెద్దమనుష్యులు కొందరు కనపడావచ్చు, కొందరుకనపడక పోవచ్చు. కనపడ్డ వారయినా సత్కరించావచ్చు, తిరస్కరించావచ్చు. "భాషామంజరి సమాప్తః" ఇక మాట్టాడవలసింది లేదు. ఆ వూళ్ళో మరి క్షణమైనా వుండనక్కరలేదు. వార్షికాలు సంపాదించుకునే నలుగు రైదుగురు గురువుల దగ్గర చదువుకుని వుండడం వల్లా, ఎందరో పండితుల ప్రవృత్తి చూసి వుండడం వల్లా యిప్పుడే కాదప్పుడే తెలిసివుండిన సంగతినాకిది. ఈ యెరుకతో భవిష్యత్తూహించుకుంటూ జట్కా యెక్కాం మేము. వెతుక్కుంటూ తహసీలుదారు బసకీ, అక్కణ్ణుంచీ కచేరీకీ వెళ్ళాం. రెయిలు సహచరుడు డాయన బ్రాహ్మడని చెప్పాడు. ఇంటికి వెళ్ళగా కచేరీకి వెళ్ళమన్నవారు, కొంచెమో గొప్పో సంస్కృతమున్నూ తెలిసినవాడని చెప్పారాయన. కాని ముస్లిము అన్నట్టున్నా డాయన వేషభాషల్లో. మామాటే సరిగా వినిపించుకోలేదా "అధికారి” ప్రారంభంలో నేనే మాట్టాడాను; గాని ఆ ధోరణి చూసి మొగం తిరిగి, యిటు తిరిగేశాన్నేను. సత్యనారాయణశాస్త్రి, అందుకున్నాడు, అవ్యవధిగా. కాని, చెవిటివాడిముందు శంఖం వూదడం అయిపోయిం దతనికి ప్రయత్నం కూడా.<noinclude><references/> {{rh|468||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> 5aj6eg97k70vi6pz9apbaxq79g1frqz పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/493 104 204123 555396 531448 2026-05-03T12:14:25Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555396 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అతను కూడా నిరాశ చేసుకునే లోపున నా బుద్ధి మరో చర్చ కందుకుంది. ఇక్కడి మన లౌక్యులు యురపియనుల్లా వుంటారు వేష భాషలో. హైదరాబాదు రాజ్యంలో మనవాళ్ళే ముస్లిములన్నట్లుంటారు. "యధారాజా తథాప్రజాః” "రాజానుమతో ధర్మః” ఈ మాటల కనుగుణమా యిది? అయితే, మైసూరూ, బడోదావంటి మన హిందువుల రాజ్యాలున్నాయిగదా; అక్కడా, అలాంటి చోటా దొరలూ, ముఖ్యంగా ముస్లిములూ మనలా వుంటారా వేషభాషల్లో? ఉండకపోతే యెంచేత? మనకి ఔదార్యంకిందా, సౌందర్య పిపాసకిందా, సౌకర్యాకాంక్షకిందా, లెక్కఅవుతుందో, భావదాస్యంకింద జమ అవుతుందా? నా జిజ్ఞాస యీ స్థితికి వచ్చాటప్పటికి “ఇక వెళ్ళిపోదాం" అన్నాడు సత్యనారాయణశాస్త్రికూడా, మొగం మొత్తి. "ప్రథమ కబళే మక్షికాపాతః” "ఉపశ్రుతి బాగాలే" దంటూ బాధపడ్డాడు సత్యనారాయణ శాస్త్రి. "కీడు తప్పిపోయిం"దన్నా న్నేను. ఇద్దరమూ బయలుదేరాం, మళ్ళీ జట్కా యెక్కి. తొమ్మిదిన్నర దాటింది, ముందు బస చేసుకోవాలి, భోజన సౌకర్యమున్నూ కల్పించుకోవాలి, తరవాత. "ఎక్కడి" కనడిగాడు, జట్కా మనిషి. “సత్రానికి పోనిమ్మన్నా”న్నేను. "అయ్యా, ఆగండి" అంటూ వొక మాట వినవచ్చిందింతలో, వెనకనించి. ఒక పెద్దమనిషి వచ్చి కలుసుకున్నాడు, మాట వెనకనే. “సభ మాట తరవాత చూసుకోవచ్చు, ముందు, భోజనానికి మాయింటికి దయచెయ్యండి" అన్నాడాయన. మొగమెరగని దూర ప్రాంతాన తన యింటికి భోజనానికి రమ్మని వొక అపరిచిత వ్యక్తి ఆహ్వానం. మేము తహస్సీలుదారుతో మాట్లాడినంతసేపూ ఆయనా వున్నాడక్కడ. మా సంభాషణ అంతా విన్నాడు. ఎందుకో, ఆయన మొగాన అసంతృప్తి అంకితం అయివుందప్పుడు. ఈ ఆహ్వానంతో "బోధపడిందది" అనుకున్నాన్నేను. తహసీలుదారు ప్రవృత్తే ఆయన కసంతృప్తి కలిగించి వుండాలి, మరి. ఏమయినా, వైదిక ధర్మానికి సంబంధించిన సదాచారం యీ భోజనానికి రమ్మనడం. ఆర్ష సంప్రదాయం.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||469}}</noinclude> kay0xk13x12lrlckr0h8ekzvyznmhpa పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/494 104 204124 555397 531449 2026-05-03T12:17:37Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555397 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఎక్కడో, బొత్తిగా నికృష్టులు తప్ప బ్రాహ్మలందరూ మన్నిస్తారిది. భరతభూమి అన్నపూర్ణ తల్లి. అన్నానికీ లోటు లేనిదిది, అన్నదానానికీన్నీ పేరుపడింది వెనకటికి. ఆ ప్రభు లలాంటి వాళ్ళు, ఆ రాజ్యాంగాలున్నూ అలాంటివి. మనకు స్వాతంత్ర్యం పోయింది, స్వధర్మమూ కలుషితమయిపోయింది. ఇవాళ కూడా “మనమేనా మనం?" అన్న స్థితిలో వున్నాం మనం. అంతేకాదు, ఇప్పుడు, మన నెత్తికెక్కివున్న పరధర్మవ్యామోహంతో మన స్వధర్మం తప్పుపట్టేస్థితిలో కూడా వున్నాం మనం. మన ధర్మం ప్రాతిపదికలున్నూ అర్థం చేసుకోలేని స్థితిలో కూడా వున్నాం. వాచా, మన ఆధ్యాత్మికతను పొగిడేవారే మన ప్రముఖులంతా, కాని, కర్మణా మాత్రం గోతులు తవ్వుతున్నారు దానికి వారు. అజ్ఞానం మాత్రమే కాదిది, దౌర్భాగ్యమున్ను. దీనికి నిష్కృతి వుందా? ఈ చర్చ మరొకప్పుడూ, మరో చోటాను. పోగా, ఆ పెద్దమనిషి ఆహ్వానించడం చూసి, ఎగిసిపడి చూశాడు సత్యనారాయణశాస్త్రి నాకేసి విరగబడిన్ని. “ఇప్పుడెలావుంది శకునం?" అనడిగా న్నేను. మాట్టాడలేకపోయా డతను, మెప్పుగా మాత్రం చూశాడు, పెదవులు బిగించుకునీ, తల పంకించుకుంటూను. చూడగా, నిశ్చలంగా చూస్తున్నాడా 'పెద్దమనిషి. సాహిత్యప్రియు డాయన. ఉన్నంతలో భోగీ, త్యాగిన్ని. ఆ ప్రాంతపు సాహిత్య వ్యవసాయోదంతం కొంత చెప్పాడాయన. విశేషించి, సర్కార్ల సాహిత్య వ్యవసాయమూ తెలుసు, ఆయనకు కొంతకి కొంత. నా మిథునానురాగం చదివి వున్నా డాయన. మా యెడల ఆయన కాదర భావం కలగడానికిది కొంత కారణమే, కాని నేత్రావధానం అనేటప్పటికి కరిగిపోయాడాయన. ఇంటికి వెళ్ళాక, ఆయన చూపించిన ఆదరభావం చకితుల్ని చేసింది మమ్మల్ని. కళ్ళతో మాట్టాడుకుంటూ మేమూ బాగా చకితుల్ని చేశాం కొంత సేపాయిన్ని. స్నానమూ భోజనమూ చేసి పడుకున్నాం. "మొగం కడుక్కోండి టీ పుచ్చుకుందాం" అంటూ గ్లాసులతో చక్కవచ్చాడాయన, మేము మేలుకోడం చూసి. అందించడం తడువుగా గ్లాసు కాళీ చేశాడు సత్యనారాయణ శాస్త్రి. చూసే వూరుకున్నాన్నేను, గ్లాసుకేసి. టీ అంటే బొత్తిగా యిష్టంలేదు నాకు.<noinclude><references/> {{rh|470||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> 8qqny7mtm4djpnxquy3rg0ylxrqi5gs పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/495 104 204125 555398 531450 2026-05-03T12:20:38Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555398 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఒకవిధంగా అనిష్టమూ, నిరసనభావమూ కూడా అదంటే. పుచ్చుకోగూడ దన్న నియమం లేదుగాని అంత వెగటు అదంటే, నాకు. చాలా వింతపడ్డాడందు కాతి థేయ. “మరి యెలాగా?" చాలా కించపడ్డాడు కూడా ఆయన. “మజ్జిగ యివ్వండి” అని అడిగి పుచ్చుకుని, ఆ సమస్య పరిష్కారం చేసుకున్నాన్నేను. అప్పుడన్నా డాయన, "మీ రిక్కడ యెన్నాళ్ళుండినా మజ్జన భోజనాదులు మాయింటోనే, సభ చేయించడం మాత్రం నావల్లకాదు, మరి” అని. దేవత సాక్షాత్కారించి వరం యిచ్చినట్టనిపించింది మాకది. తప్పనిసరి అయినప్పుడు హోటల్లో భోజనం చేస్తూనేవున్నాన్నేను, నెలల తరబడి కూడా, సత్యనారాయణశాస్త్రికి సుతరామూ యిష్టం లేదది. దాంతో, మేమిద్దరమూ కూడా ఆ ఆహ్వానమూ, ఆ ఆదరమూ గొప్ప సత్కారంగా భావించుకున్నాం. నే నడగ్గా, చూడవలసిన పెద్దమనుష్యుల జాపితా రాసి యిచ్చాడాయన, పదిపదిహేనుగురిది. వకీళ్ళు, వర్తకులు, ఆఫీసర్లు, డాక్టర్లు, సంపన్న గృహస్థులు - యిలా వుందది. అందర్నీ చూశాం. మళ్ళీ మళ్ళీ చూశాం. కాని "మా భాగే” అన్న వారు కనపడలేదు మాకు. "ఇదే మా మొదటి ప్రయత్నం. మా విద్య చూడండి. దమ్మిడీ కూడా యివ్వనక్కరలేదు మాకు" అని చెబుతూ కూడా తిరిగొం మరో రెండు దినాలు. విసిగిపోయాం. తల తిరిగిపోయే అవస్థలో కూడా పడ్డాం. వెళ్ళగా వెళ్ళగా, వొక యింటి తలవాకిట యిద్దరు పెద్ద మనుష్యులు కూచుని వున్నారు. మధ్యవయస్సులో వున్నా రిద్దరూ. నాగరికులు. కాని హిందువులా, ముస్లిములా? బీడీలు కాలుస్తున్నా రిద్దరూ కూడా. ఉర్దూలో మాట్టాడు కుంటున్నారు ధారాళంగా. వేషమున్నూ దానికి తగ్గట్టే వుంది. కాని, యిటు చూడగా, రంగవల్లికలున్నాయి గుమ్మాన. సాహసించి చీడీలెక్కగా "సర్కార్లనుంచి వచ్చారా మీరు?” అనడుగుతూ సాదరంగా ఆహ్వానించారు మమ్మల్ని. పూర్తిగానే టూకీగా మాత్రం చెప్పాను, మాసంగతి నేను. "నేత్రావధానం చూశావా నువ్వు?" అంటే "పోనీ నువ్వు చూశావా?" అంటూ, అని ఆకాంక్షించుకుంటూ అదంటే యెంతో కోరికవున్నట్టు వెల్లడించారు వారు.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||471}}</noinclude> bn3ma2pl4mfnhekl6kwq3u3rq8bo8nb పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/496 104 204126 555399 531453 2026-05-03T12:34:25Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555399 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"మీ కిష్టం వచ్చింది రాసి యివ్వండి" అనడిగి పుచ్చుకుని, సత్యనారాయణశాస్త్రి, కళ్ళతో చెప్పాడు నాకది. నే ననువదించాను. “అష్టావధానం చేసేదినేను” అని తెలుసుకుని, నాకో చీటీ రాసి యిచ్చి, నన్ను కూడా కళ్ళతో చెప్పమన్నారు వారు. సత్యనారాయణశాస్త్రి, అనువదించాడు. ఇద్దరూ డంగయిపోయారది చూసి. “సభ జరిగించవలసిందే" అని కూడా కూడబలుక్కున్నారు వారు. వారి నిశ్చయం తెలుసుకుని, వారి సెలవున్నూ పొంది గుమ్మాలు దిగాం మేము. పెదవులు బిగించుకుని, కనుబొమ్మ లెగరవేసుకుంటూ, తల కూడా యెగరవే సుకున్నాడు, సత్యనారాయణశాస్త్రి, నాకేసి చూస్తూ. {{c|<big><big>9</big></big>}} మర్నాడే సభ. రెయిలు కట్టకి పడమరగా, రేయిల్వే ప్లాటుఫారానికిన్నీ యెదురుగా వొక గ్రంథాలయం. అక్కడ జరిగింది సభ. ఎవర్నీ యెరగం మేము, పెద్దపెద్దలే వచ్చారని చెప్పారు, సభానిర్వాహకులు. మొదట్లో మేము కలుసుకున్న వారిలో నలుగు రైదుగుర్నే గుర్తించాన్నేను. ఏడెనమండుగురు వచ్చినట్టు చెప్పాడు, సత్య నారాయణశాస్త్రి. అన్నట్టు, తహసీలుదారున్నూ వచ్చా డాతిథేయివెంట. "నే" నంటే "నే" నంటూ పృచ్ఛకులుగా తయారయినారు చాలా మంది; కాని, వారిలో కొందరినీ, తక్కినవారిలో కొందరినీ నామినేటు చేశారు, సభా నిర్వాహకులు. ఆ సంఖ్యచూసి "పనులే యెనిమిది, పద్యం చెప్పడం వొకరికే" అన్నా నేను, నిర్మొగమాటంగా. "వల్లకా”దన్నారు సభ్యులు, చాలా మంది. "వీల్లే"దన్నా న్నేనుకూడా, దృఢంగా. ప్రతిష్టంభనం యేర్పడింది, దాంతో. “సభ జరగదేమో?” అన్నాడు. ఆత్రంగా, సత్యనారాయణశాస్త్రి, కళ్ళతో. "వారు జరపకపోతే నేనూ జరగనివ్వ"నన్నాను నిర్లక్ష్యంగా, నేనూ కళ్ళతోనే. నిజం చెబుతున్నాన్నేను, డబ్బు సంపాదించుకుందా మనే బయలుదేరాం మేము. కొన్ని చోట్ల నియమాలను భంగపరుచుకోవలసే వస్తుంది, స్వయంగానే ఆర్ధార్ధులకు, నాకు తెలుసు. కార్యహానే తటస్థించవచ్చు, వొప్పుకుంటాను కూడా. అయినా, నాపట్టు నేను విడిచిపెట్టుకో లేకపోయాను. అయితే, నేనొక దారిన వెళ్ళగా, సభా నిర్వాహకులు మరో దారిన వచ్చారు.<noinclude><references/> {{rh|472||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> 97r3ugc2qka6x4kkea68d73bic05rj9 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/498 104 204129 555400 531455 2026-05-03T12:54:12Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555400 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>శ్రమ కలిగించాం మేము. క్షమించి మాకు సెలవిప్పించండి" అంటూ కార్యక్రమం ముగించాన్నేను. గ్రంథాలయం శక్రటరీ వందనాలు చెప్పారు, వెంటనే. సభానిర్వాహకుల్లో వొక రందుకున్నా, రుత్తరక్షణాన. "తృప్తిగా మన యిళ్ళకు వెళ్ళిపోవచ్చు మనం శాస్త్రులుగార్లున్నూ ముందుకి వెళ్ళిపోతారు, నిశ్చితంగా. డబ్బు కోసం ఆశపడలేదు వారీ వూళ్ళో. ఇది పరమసత్యం. "మా విద్య చూడండి" అని మాత్రమే కోరారు వారు. మనం చూశాం. చాలా చాలా ఆనందించాం కూడా. అయితే, మన కంభం మెట్టులో రసికత వొక్కటి మట్టుకే కాదున్నది. డబ్బూ వుందెంతో కొంత, ఔదార్యమూ వుంది, యేవూరికీ తీసిపోనిది. కృతజ్ఞత చూపించుకోవలసిన బాధ్యతకూడా యెక్కువగానే వుంది మనకి. కనక, మనం వారిని సత్కరించడం చాలా అవసరం అనుకున్నాం మేము. ఈ అవధానం చూసి ఆనందించిన వాళ్ళమే చేద్దాం ఆ సత్కారం. ఆనందించినవారిలో కూడా యిష్టమూ అవకాశమూ వుండిన వాళ్ళమే చేద్దాం. ఆ చెయ్యడం అయినా యిప్పుడే చేద్దాం యెప్పుడో కాదు. ఎవరికి తోచింది వారివ్వండి" అంటూ పర్సుకూడా తీశారు ముందు, వారు. ఎవరెవరో కూడా తీశారు వెంటనే. ఒకట్లు - రెళ్ళు - మూళ్ళు - నాలుగులు - అయిదులు - వొకటి రెండు పదులు - ఎనభై రూపాయలకుపైగా వసూలయినా యక్కడి కక్కడ. అది నా చేతిలో పెట్టి ఉపచార వాక్యాలున్నూ చెప్పారు వారు. డబ్బు దొరికింది సరే అనుకోనిది, మొదటి మాటు నేత్రావధానమున్నూ బాగా చెయ్యగలిగాన్నే నందుకు చాలా గర్వించాను. "మీరు ఫలానా - ఫలానా వూళ్ళు వెళ్ళా” లంటూ సలహాలు చెప్పారు కొందరు. "బాగా సత్కారం జరుగుతుంది సందేహం లే" దనిన్నీ అన్నారు వారు. వెళ్ళిన చోటనల్లా, భంగపడకుండా అవధానం నెరవేరడం మొదటి సత్కారం నాకు. తరవాతిది డబ్బు. అదిన్నీ రాకపో దెంతో కొంత. ఆ రాష్ట్రంలో రెండు మూడు మాసాలు తిరుగుదామనీ, హైదరాబాదు నగరంలో కనీసం వొక్క మాసమయినా వుందా మనీ మా సంకల్పం. కాని, అది వుడుకో జ్వరమో మరి, కంభం మెట్టు ప్రవేశించిన రాత్రే ప్రారంభం అయింది, మా కిద్దరికీ. అన్నహితవు చెడింది. నిద్ర కరువయింది. అసలే మెయి నెల అది. దానికి సాయం, చినడకాల్చిన యినపగుండులాగ - వూరికి మధ్యగా - నున్నగా చెక్కిన పే-ద్దకోట కొండ.<noinclude><references/> {{rh|474||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> 30rbpzae5c4gzzd5b9yet9moq6ciwuo పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/500 104 204131 555402 531459 2026-05-03T13:00:49Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555402 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కాని, నాచేతిలో పడలేదది. దాని ఫలితమున్నూ బెజవాడతో చెల్లిపోయింది. అయినా, ఆయన ఔదార్యం నిలిచివుంది. అమ్మకం అయిపోయిన ఆ బడుగుదేహాన - అదిగో - పరిపూర్ణ మానత్వం స్వస్వరూపంతో తేజరిల్లుతోంది. అమరం అది. ద్వంద్వాతీతం. జగజ్యోతి. కఠోరతపస్సుచేసి, మహాయోగీశ్వరులే సాధించుకోతగ్గదిన్ని. ఎందరు గుర్తిస్తారిది? అసలు, ఎందరు గుర్తించగలరిది? లోకుల రుచులు బహుముఖాలు. వారి చేతలున్నూ అనేకవిధాలు. అనంతకోటి ప్రజానీకంలో యే యిద్దరికీ పొంతన వుండదిలాంటి సందర్భాల్లో. ఎంతో కొంత భేదం వుంటూనే వుంటుంది. అవిలంఘ్యాలైన అగాధాలు కల్పిస్తుందది మానవతలో. నలుగురూ చూశాటప్పుడేగాని, యెవరికీ యేమీ యివ్వలేరు, కొందరు. వీళ్ళూ-చాళ్ళూ-యెన్నో - యెంతెంతో చూసుకుని గాని యివ్వలేరు, కొందరు. "దేహి” అని దీనంగా అనిపించుకునిగాని యివ్వలేరు కొందరు. విసుక్కుంటూ - వొళ్ళు మండబెట్టుకుంటూ - దాన ధర్మాల వ్యవస్థను తిడుతూనేగాని యివ్వలేరు కొందరు. నిరసనగా చూస్తూ - నీచంగా మాట్టాడుతూ మీదికి గిరవటేస్తారు కొందరు. వీధే వెళ్ళేవారిని పిలిచి, ఏదో అనవసర ప్రసంగం చేస్తూ సాక్ష్యానికన్నట్టు వారిని దగ్గిర కూచోపెట్టుకుని, వారు వినేటట్టున్నూ అర్థిని చులకనచేస్తూ యిస్తారు కొందరు. ఇవన్నీ మనోవికారాలు. కోతి చేష్టలు. త్యాగం విలవ తక్కించుకోలేని వెకిలితనమున్ను. తామస ప్రవృత్తి యిదంతా. రహస్యంగా యిస్తారు కొందరు, మూడో కంటి వాడికి తెలియకుండా. ఎప్పుడుపడితే అప్పుడే - యెలా వుండినవా రలాగే - యిచ్చేస్తారు కొందరు. "దేహి” అన్న మాట వినలేక ముందే యిచ్చేస్తారు, కొందరు. ఎలాగో వొకలాగ యివ్వడమూ - ఇవ్వకుండా వుండలేక పోడమూ - ఇవి హృదయానికి సంబంధించిన కదలికలు. ఏమయినా, యివ్వడంలో కొంత త్యాగం వుంది, సందేహం లేదు. కొంత ఔదార్యం వుంది.<noinclude><references/> {{rh|476||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> g2sdxdf1uotrgbz2nn1f5zmp855kiza పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/501 104 204132 555403 531478 2026-05-03T13:05:57Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555403 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మానవత్వమున్నూ వుంది. కాని తామస ప్రవృత్తులది మాత్రం ముడిసరుకది. ఇక లోభులున్నారు. వారి విషయం చెప్పాలంటే అందరికీ సాధ్యం కాదు. చెప్పకపోడమే మంచి దసలు. వారి హక్కు భుక్తా లాక్షేపించడాని కెవరికీ అధికారం లేదు. కలం పట్టుక్కూచున్నాను కనక, నేనుమాత్రం చెప్పకుండా వుండలేను కొంచెమయినా, ఎవరికీ నిర్దేశం లేకుండా. లోభమూ ఔదార్యమూ కూడా బహు ముఖాలు. సిగ్గు బిడియాలు విడిచి, తానున్నూ తినడం మానుకుని వొక్కొక్క చిల్లిడబ్బే మూటలో వేస్తాడు లోభి. సిగ్గుపడుతూ – ముడుచుకుపోతూ - చేతిలో యేమివుంటే అదే యిచ్చేస్తాడుదారుడు. ఇద్దరికీ మాత్రం డబ్బుతోనే పరిగణన. అయితే, లోభి బతుక్కి, గడ్డిపరకకూడా అక్కర్లేదు తూచడానికి. ఉదారుడి బతుక్కి బంగారుకొండ అయినా చాలదు. {{c|<big><big>10</big></big>}} తింటూనూ వున్నాను తిరుగుతూనూ వున్నాను:, గాని రెండుమాసాలు పట్టింది నా ఆరోగ్యం వసిపడ్డానికి. రాజమహేంద్రవరంలో వుండినప్పుడు అజీర్తి బాధ పట్టుకుంది నాకు. వేంకట రామయ్యరు హోటల్లో వుప్మా కాఫీలూ, కుప్పుస్వామయ్య హొటల్లో మూడు పూట్లా భోజనమూ - ఇవీ ఇవీ అందుక్కారణాలు. జిహ్వచాపలం ముఖ్య కారణం. చాలా మాట్లను కున్నాను; కాని జయించుకో లేకపోయానది. తెల్లవారాటప్పటికి వచ్చేసేవారు చిలుకూరి వీరభద్రరావుగారు “మరి బయలుదేరండి" అంటూ రోడ్డుమీద నుంచునే నన్ను తొందర పెడుతూ. అప్పటికీ, గోదావరిలో యీతకొట్టి, స్నానంకూడా చేసుకుని, కనిపెట్టుకు నుంచునేవాణ్ణి గదికి తాళం వేసి, వీధి అరుగుమీద నేను. తామున్నూ స్నానం పూర్తిచేసుకునే వచ్చేవారు, వీరభద్రరావుగారు. హాల్లో బల్లలుండేవి, కాని, తిన్నగా గాడిపొయ్యి దగ్గరికి వెళ్ళి పీటలు పరిపించుకుని కూచునేవాళ్ళం మే మిద్దరమూ. అంటే, ఉప్మా మొదటివాయిలో మొదటిభాగం మాకు భుక్తపడేది. నలభైనాలుగేళ్ళ కిందటి మాటయిది, అలాంటి వుపమా దొరకలేదు, మళ్ళీ నాకు. ఉపమా అంటే అదేవుపమా - ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో - పెద్దపెద్ద హొటళ్ళలో కూడా దొరికేది ఉప్పుపిండి, అంతే.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||477}}</noinclude> s4trjwdlwem0e1jl3bjt1ypd9dvlkqu పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/502 104 204133 555404 531479 2026-05-03T13:10:55Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555404 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>సూర్యోదయ సమయాని కదయాక, తొమ్మిదింటికి కుప్పుసామయ్యరు హోటల్లో భోజనం. మళ్ళీ వొంటి గంటకీ, రాత్రి యెనిమిదింటికీ కూడా అలా భోజనమే. మధ్యాహ్నం మూడింటికి ఫలహారమూ, కాఫీని. దానాదీనా పట్టుకుంది నాకజీర్తి. రాజమహేంద్రవరం విడిచి యింటికి వెళ్ళి పోవలసి వచ్చింది ఆరోగ్యం సాధించుకోడానికి నేను. రాజమహేంద్రవరంలో యిద్దరుముగ్గురు పెద్ద డాక్టర్లే మందిచ్చారు నాకు, వ్యాధి తగ్గలేదు కొంచెమున్ను. ఇంటికి వెళ్ళాక, ఆయుర్వేదంలో నా మొదటి గురువు అంగర వెంకటాచార్యులుగా రొక లేహ్యం చేసియిచ్చి, ఇచ్ఛాపథ్యంతో మళ్ళీ వొక నెలలోనే వృకోదరుణ్ణి చేశారు నన్ను. వారి అనుగ్రహరూపంగా "నాగరఖండం” అన్న పేరితో అదే నే నిప్పుడు నా గంధర్వఫార్మసీలో వాడుతున్నది. వర్షాలు కురిసి నాట్లు బలపడ్డాక మళ్ళీ పదచలనం ప్రారంభించాన్నేను. వడ్డాది సూర్యనారాయణగారని, మాకు నాలుగు మైళ్ళలో వున్న బలభద్రపురం గ్రామంలో వొక సంపన్న నియోగి గృహస్థులు. అక్కడి హెడ్ కరణం వారు. అంతక్రితం "అష్టావధానం చూడాలని వుంద”న్నారు వొక మాటు నాతో వారు. ఆ మాట పురస్కరించుకునే వెళ్ళానప్పుడు నేను. "మీకు తగిన సత్కారం చెయ్యలే”నన్నారు వారు. "డబ్బుకోసం రాలేదునేను. మీకా కోరిక తీరివుండకపోతే తీర్చడానికే నారాక, 'తీరా చూశాక యే కొంచెమయినా డబ్బివ్వక పోతారా?' అన్న గడుసుభావం లేదు నా కే కోశానా. గృహస్థు మర్యాదగా అతిథ్యం మాత్రమే యివ్వండి నాకు, చాలు” అని చెప్పాన్నేను, స్పష్టంగా. "అయితే, వొకమాట చెప్పాలి ముందు. నా అష్టావధానంలో నేత్రావధానం వొక ఆంగం. నా సహచరుడున్నాడతను నిర్వహిస్తాడది. నే ననువదిస్తాను. నన్నే నిర్వహించమంటే అత ననువదిస్తాడది. కనక, అదిన్నీ కావాలంటే మాత్రం అతనుకూడా రావాలి. అతనికి మాత్రం పదిరూపాయలయినా ముట్టచెప్పవలసి వుంటుంది, మరి" అని కూడా చెప్పాను. అప్పుడక్కడ వొక రెడ్డిగారున్న వున్నారు. వారడగ్గా నేత్రావధానం వివరాలు చెప్పాన్నేను. "అయితే, అష్టావధానమూ చేయించ వలసిందే మీరు, నేత్రావధానం దాల్లో వుండేటట్టున్నూ చూడవలసిందే" అన్నారు వారు కరణంగారితో. ఆ రెడ్డిగారి ప్రోత్సాహంతో, వెంటనే జాబురాసి గ్రామ నౌకరునంపి, కడియపులంకనుంచి సత్యనారాయణ శాస్త్రిని రప్పించారు వారు. ఆ సాయంత్రమే అవధానం.<noinclude><references/> {{rh|478||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> gj49vzxxpst4l9jz7a4fl18dh8hddb1 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/503 104 204134 555405 531480 2026-05-03T13:14:53Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555405 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఊళ్ళో వున్న బ్రాహ్మలందరూ, రెడ్లు కొందరూ, సమీపం కావడం వల్ల బిక్కవోలునుంచిన్నీ సరసులు కొందరూ వచ్చారు. అక్కడా నేత్రావధానంలో నిర్వహించవలసి వచ్చింది, వ్యస్తాక్షరి. అవధానం చాలా చక్కగా నెరవేరింది, చివరికి. అంతా సంతోషించారు. సూర్యనారాయణగారు చెప్పగా, రెడ్డిగారున్నూ బలపరచగా వచ్చినవారిలో కొందరు తమకు తోచిందిచ్చి వెళ్ళారప్పటికి. పదమూడు రూపాయ లయిందా మొత్తం, అది సత్యనారాయణశాస్త్రి కిప్పించాన్నేను. ఆ రాత్రే పడవమీద వెళ్ళిపోయాడతను, భోజనానంతరం. మర్నాడు నేనూ ప్రయాణమైనాను; కానిరెండురోజులుండి పోవలసివచ్చింది నాకు. ఆ రెండురోజులూ నాకు విందులు జరిగాయి, నేను సాహిత్య ప్రసంగాలు చేశాను. రెండోనాటి సాయంత్రం నా ప్రసంగం ముగిశాటప్పటికి తరవాత తమచేతి కందాయని చెబుతూ పాతిక రూపాయలు నాకు సత్కరించారు కరణంగారు "మీ కేమివ్వగలం?" అని కించపడుతూ. సంప్రదాయ మహితమైన కుటుంబం వారిది, పండితుల నాదరించడమే చేతనైన వ్యక్తులువారు. ఎంతెంతో యిచ్చిన్నీ అలాగే మాట్టాడతారు, వా రెప్పుడూ. పాతిక వొకట్లు కాదు, పాతిక కోట్లిచ్చిన్నీ అలాంటి తృప్తి, అలాంటి ఉల్లాసమూ కలిగించలేరు పండితుల కెవరూ. దూరం వెళ్ళనక్కరలేదు ఆచుట్టుపట్ల గ్రామాల కరణాలందరూ వడ్డాదివారూ, బుద్ధవరపు వారూ, ముంజులూరివారూ, బంధకవివారూ, వాడ్రేవువారూ, ముష్టివారూ, నేలకంటివారూ, ఏనుగువారూ - అందరూ యుగంధర ప్రజ్ఞావంతులే - అందరూ సంపన్నులే - అందరూ ఉదారులే - మేమంటే అందరూ ప్రత్యేకాదరాభిమానా లున్నవారే. అష్టావధానం చేస్తానంటూ నేను వెడితే అందరూ నన్నాదరిస్తారు, సందేహం లేదు. కాని, ఏమి సాధించినట్టు అంతవరకూ చేసిన అవధానాల వల్ల నేను? డబ్బందామా, దానికోసం బుర్రచించుకుని అవధానాలే చెయ్యనక్కరలేదు, సాహిత్య ప్రసంగాలు చేసిన్నీ మంచిమంచి వార్షికాలు సంపాదించుకో గలన్నేను. కాక, - ఆశుకవిత్వాలూ, అవధానాలూ, బంధకవిత్వాలూ, చిత్రకవిత్వాలూ - ఇలాంటివి బయలుదేరి, మనవాళ్ళకి సిసలైన కవిత్వం గుర్తించకుండా చేశాయి. కవితాభిరుచే నాశనం చేశాయి. "పద్యమే కవిత్వం" అన్న దురభిప్రాయమున్నూ కలిగించాయి. దీంతో, అవధానాలంటే వై ముఖ్యమేకాదు, వైనమస్యమున్నూ కలిగిపోయింది నాకు. "మరి, గజంయెత్తు పుస్తకాలు రచించా"లన్న వ్రతం నెరవేర్చుకోడం యెప్పుడూ?<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||479}}</noinclude> 3s3v5sdndze6mq8grp9pp923dvju2yh పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/505 104 204136 555406 531483 2026-05-03T13:33:27Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555406 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>యాభై మాటల యింగ్లీషువాక్యం మాటామాటా విడగొట్టి యిచ్చాడు మా పింతల్లి కొడుకు వ్యస్తాక్షరి. నాకంటే మూడు రోజులే పెద్ద అతను. బి.ఏ. ఆనర్సులో పరీక్ష యిచ్చినవాడు. “ద The" అనే మాట యెన్నోమాట్లు వచ్చిందందులో. తప్పుతానేమో అని చాలా భయపడ్డాను; గాని అదీ సరిగానే వచ్చింది. అన్నీ అలాగే నెరవేరాయి. స్త్రీలూ పురుషులూ కూడా తామూ ఆనందించారు, నన్నూ మెచ్చుకున్నారు. విశ్లేషించి, దర్భా చలమయ్య శాస్త్రిగారు తా మానందించడంతో వూరుకోక "మాంచి ప్రజ్ఞే సంపాదించాడు మీవాడు" అన్నారు, మా అమ్మగారినీ మా నాయనగారినీ సంబోధించి. “అదేమంత ప్రజ్ఞలే” అన్నారు మా నాయనగారు, ఒక మూల తా మానందిస్తూనే. కాని వారి ఆనందం మీద "కులవిద్యలు విడిచి పెట్టాడువీడు" అన్న అసంతృప్తి దట్టంగానే కమ్ముకుని వుంది, నేను గమనించక పోలే దది. మా అమ్మగారు మాత్రం బ్రహ్మానంద పడ్డారు. స్త్రీల కందరికీ ముందు కూచున్నా రామె. ముందెక్కడో కూచున్నా రొక కొసగా; కాని "అక్కడ కాదు. యిక్కడా మీరు కూచోడం" అంటూ చెయ్యి పట్టుకుని, మా పెద్దన్నగారు ముందుకి తీసుకువచ్చి కూచోపెట్టా రామెని. "అబ్బాయి నెగ్గుతాడో వోడిపోతాడో?" అన్న ఆదుర్దా. "అందరి మొగాలూ తేటగానే వున్నా” యన్న ధీమా. "చల్లనిమాట వినబడా"లన్న యెదురుచూపు. ఇన్ని మనోవికారాలు కనపడ్డాయి, నాకా సమయాన, ఆమె మొగాన. స్త్రీలలో వొకచివర - మా పెద్దవొదినగారి వెనక వొదిగి కూచుంది, మాసీత. ఆమెదీ. యిదే స్థితి. చివరికి, నేను లేచి, ముందు తమకి పాదాభివందనం చెయ్యగా నన్ను పొదువుకుని పరవశ అయిపోయారు మా అమ్మగారు. ఆనంద విహలంగా నాకేసి వొక్కమాటుచూసి యింట్లోకి వెళ్ళిపోయింది మా సీత. అదిగో, మా అమ్మగా రలా పరవశ అయివున్న ఆ సమయాన మెచ్చుకున్నారు, దర్భా చలమయ్య శాస్త్రిగారు నన్ను. దీనిమీద, మా అమ్మగారు తల కొంచెం పంకించుకున్నట్టు కనపడింది, నాకు. "అదెందుకా?" అనుకుంటూనే వున్నాన్నేను "మీ పెద్దబ్బాయి దగ్గిర యింకో రెండు మూడేళ్ళయినా చదువుకుని వుంటే యింకా గొప్ప ప్రజ్ఞే సంపాదించివుండును మా చిన్నబ్బాయి" అనేశారామె, అంతలో. అది చలమయ్య శాస్త్రిగారికి ములుకన్నట్టు నాటింది.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||481}}</noinclude> 2xlzsv1x6cjxri4e301rney4i4pp8pt పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/507 104 204138 555407 531521 2026-05-03T13:39:06Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555407 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఈ స్థితిలో వుంది మన రచయితల స్థితి యిప్పుడు. గ్రంథకర్తల కిది అగత్యమా? పోనీ, శ్రేయస్కరమా? గ్రంథకర్తల రచనల విషయమై సహేతుకంగా మంచిచెడ్డలు నిర్ణయించే విమర్శకులుంటే యింత దుర్భరం కాకపోయి వుండును, మన దేశంలో యీ స్థితి. గ్రంథకర్తలుకా దీపని చెయ్యవలసినవారు. ఇతరుల రచనల విషయమై నిష్కర్షగా చెప్పాలంటే, కొన్ని చిక్కులున్నూ వుంటాయి రచయితలకు. గ్రంథం బాగున్నా చిక్కే, కొందరికి, బాగా లేకపోయినా చిక్కే. కనక, స్వతంత్రులైన రచయితలతోపాటు, సమర్థులైన విమర్శకులున్నూ బయలుదేరితేనే యే వాఙ్మయానికైనా సరి అయిన వికాసం. అయితే, రచయితల సంఖ్య పెరిగిపోడాని కవకాశం యెక్కువ, యే దేశంలోనూ కూడా. విమర్శకుల సంఖ్య మాత్రం అలా పెరగడానికి వీల్లేదు. కవుల్లో అధికారి తారతమ్యాలు సహజాలు. విమర్శకుల సంగతీ అంతే కొంతవరకూ, అయితే, యే కవి కంటేనూ కూడా మంచి పరిజ్ఞాత అయివుండాలి విమర్శకుడు. విమర్శకుడైనవాడు, మంచి పండితుడయి వుండాలి. రచనమీదికి దృష్టి పోనిచ్చుకో గూడదు. వాఙ్మయం విలవలు బాగా గుర్తించగలిగి వుండాలి. జాతి సౌభాగ్యమే తనకు ప్రాప్యం చేసుకోగలగాలి. ప్రాచీనమూ, నవీనమూ కూడా సాహిత్య శాస్త్రం బాగా తెలిసినవాడయి వుండాలి. అసహనపరుడు కాగూడదు. అగత్యం అయితే, ద్వేషం, వ్యక్తిపరంగా మాత్రమే చూపించుకోగల సంయమం కలవాడు కావాలి. మంచి బాగా గుర్తించి, ఆ రచన యెవరు చేసినా, ఆనంద తాండవం చెయ్యగలిగి వుండాలి. తనకి ప్రామాణికత ప్రధాన ధర్మం అనిన్నీ గుర్తించుకో గలిగాలి. రచన గొప్పదయితే, వికాసం జాతికి, తత్కర్తకుకాదు. రచన చెడ్డ దయితే నష్టమూ జాతికే అదీ కర్తకు కాదు. సుఖమో దుఃఖమో - ఇవి మాత్రమే రచయిత కందేవి. ఆత్మవిశ్వాసం, కీర్తికాంక్ష, ద్రవ్యాశ - ఇవి సహజాలు గ్రంథకర్తకు, వొప్పుకుంటాను. కాని, వాటికి మించిన సంయమమూ, హుందాతనమూ-ఇవి మిక్కిలీ అగత్యాలు గ్రంథకర్తకు. నిజానికి, జాతి యెదట రచయిత ప్రాముఖ్యం బహూతక్కువ.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||483}}</noinclude> dn2tntfc47ai8m4lnjyk5ce4ig4334y పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/508 104 204139 555408 531522 2026-05-03T13:40:58Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555408 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఈజ్ఞానం - ఈసత్యం గుర్తించగల శక్తి - లేకపోతే, రచయితా, విమర్శకుడూ కూడా “మడి దున్నుకు బతకవచ్చు” మునిగిపోయేది లేదు. రచనా, విమర్శా కూడా పొట్టపోసుకోడానిక్కావు, మరి. కవీ, రచయితా రచనచెయ్యడం, పఠితలకు ఆనందమూ, జ్ఞానమూ కలిగించడానికి. తన్మూలంగా పఠితల కున్నత భావాలబ్బి సభ్యత అలవడ్డానికి. సమిష్టిమీద జాతి దృఢపడ్డానికి. పండితుడు విమర్శ చెయ్యడం, రచనలో వున్న మంచీ చెడ్డా లోకానికి వివరించి చెప్పడానికి. తన్మూలంగా, ఆరచన యెడల పఠితల కాదర భావమో ఏవగింపో కలిగించడానికి. చివరికి, జాతికీ, ప్రలోభజనకమైన శీలం రూపుకట్టడానికి. ఇలాంటి సన్నివేశా లేర్పడాలంటే అందుకు రాజు పూనుకోవాలి. ఇప్పుడు, మనకి, రాజుల్లేరు కనక, తత్ద్సానీయులయిన నాయకుల విధి యిది. కవులకూ, రచయితలకూ, విమర్శకులకూ ఇలాంటి ఔదార్యమూ, విధి పరిజ్ఞానమూ, త్యాగనిరతీ మప్పడానికి నాయకుల అగత్యం చాలా వుంది. ప్రతిభా ప్రాగల్భ్యాలు, ఎంత వెనకబడ్డ జాతికీ వుంటాయి. అవి మానవనిర్మాణాలు కావు, మరి. వాటికి దోహదం మాత్రం కావాలి. వాటికి, సామయికమైన వినియోగమున్నూ చూపించాలి. అందుకు బాటలు వెయ్యాలి, విశాలమైనవి. ఇందుకున్నూ నాయకుల అగత్యం చాలావుంది. అయితే, నాయకు డింతవాడు కావాలంటే, మొదట, పండితుడయి వుండాలతను. ఈ పనంతా యే భాషలో జరుగుతుందో ఆ భాషలో సమర్థుడూ, ఆపైని సమ్యగ్దర్శీ, ప్రవక్తా, ప్రవర్తకుడున్నూ అయి వుండాలి. జాతి అగత్యాలు గుర్తించి వుండాలి. తన వాఙ్మయం చరిత్ర బాగా అవగాహన చేసుకుని వుండాలి. పరవాఙ్మయాల ఉన్నత్యవసతులూ బాగా గుర్తించుకుని వుండాలి. తన వాఙ్మయానికి రూపురేఖలు నిర్దేశించగలవాడు కావాలి. ఒకరికి మార్గదర్శికావాలి, ఒకరివెంటబడి బుర్రవంచుకుని పోయేవాడు కాగూడదు. నిష్కృష్టాలయిన అభిప్రాయాలున్నవాడు కావాలి, పరప్రత్యనేయబుద్ధి కా గూడదు. జాతీయత నిర్మించాలంటే పరిస్థితులూ, ఉపాయాలూ, సాధనాలూ దేశాలనుబట్టీ, జాతులనుబట్టీ, సంస్కారం అనుసరించి భిన్నభిన్నా లయివుంటాయి, మరి. మరి, ఏ జాతికాజాతి కిలాంటి నాయకు లేర్పడివుండకపోతే? గాలి సార్వత్రికం, ప్రాదేశం కాదు. దురిత విలంబితాలు పట్టవచ్చునేకాని, ప్రపంచం అంతటా వీస్తుందది. కనక, ప్రపంచంలో వొకచోట పుట్టిన నూత్నభావాలూ, నూత్నాభిరుచులూ మరోచోటా కమ్ముకుంటా యెప్పటికయినా.<noinclude><references/> {{rh|484||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> s963mvkduqls6mo342rj1nxiz31hop4 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/509 104 204140 555435 531523 2026-05-04T11:10:38Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555435 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అవి కవులనూ, రచయితలనూ స్వయంగా ఉద్రిక్తపరుస్తాయి. దానివల్ల, మాత్న నిర్మాణాలున్నూ జరిగిపోతా, యెక్కడి కక్కడ. ఏదేశంలో - ఏజాతికి - ఇలాంటి నాయకుడు లేడో ఆ దేశమూ ఆజాతీని, వెనకపడిపోయేవి. వీరేశలింగంగారు, రచన యెంత సుళువుగా చెయ్యవచ్చునో చేసి చూపించారు. ఎంత సులభ భాషలో చెయ్యవచ్చునో చూపించారు. అది యెన్ని రకాలుగా చెయ్యవచ్చునో చూపించారు. తన్మూలంగా, ప్రయోజనాలేకాక, ఆనందం కూడా ఎన్ని రకాలుగా కలుగుతుందో చూపించారు. వాఙ్మయం శక్తి యెంతటిదో, జాతి నది యెలా నడిపిస్తుందో కూడా చూపించారు. విమర్శ విషయమై కూడా వారు ఒక మార్గం వెయ్యక పోలేదు. అయితే, అది, తప్పుదారిన పడింది. ధ్వంసం చెయ్యడానికేగాని, సృష్టి చెయ్యడానికి పనికిరాలేదు, వారి వరవడి. వాఙ్మయంవారికి ప్రధానం కాకపోడం వల్ల వచ్చిన చిక్కింది. బ్రహ్మధర్మ ప్రచారం వారికది వొక సాధనం కావడం వల్ల కూడా వచ్చిన పుట్టిమునక యిది. వారి తరవాతనైనా సమర్థులు తదేకదీక్షితులు విమర్శకులు బయలుదేర లేదు, మనలో. అంచేత, మన ఆంధ్రజాతికూడా సహజంగా ప్రగమనశీలం కనక, మనకి పురోగమనమే యేర్పడింది, సందేహంలేదు. కాని, అది వొక సుపరిష్కృతపథానపడలేదు. ఇప్పటి కయినా, యిదయినా గ్రహించినవా రెందరున్నారు మనలో? దీనికి సాయం, తగినంతమంది పెద్దలు గ్రంథప్రకటనకు పూనుకోలేదు, మనవారిలో. గ్రంథ ప్రకటనకూడా వొక వ్యాపారమే అన్న చూపు లేకపోయింది వర్తకులకు. వావిళ్ళ వారొక్కరే కనపడతారందుకు, ఏకతానంగా పని చేసినవారు. అయితే, పూర్వ వాఙ్మయ ప్రకటనకే అంకితం చేసుకున్నారు ముఖ్యంగా తమ సేవలు, వారు. మరి, అది వుండనక్కరలేదూ? అయితే నవీన వాఙ్మయం అక్కరలేదూ అన్న ప్రశ్నా వస్తుంది. పూర్వం వాఙ్మయం వుండవలసిందే, దొరికినంత వరకూ అందరికీ అందుబాటూ కావాలది. పూర్వస్మృతి విడిచిపోగూడదు, మరి, నడుస్తున్న బతుకుపట్టించుకో నక్కరలేదూ? వ్యక్తుల బతుకు సావధికమే, మరి జాతి బతుకు? జాతి దృష్ట్యా చూస్తే, నడుస్తున్నదేకాదు, నడవ్వలసినదీ పట్టించుకోవాలి, బతుకు. ఈ విషయం గుర్తించినవారు కొమర్రాజు లక్ష్మణరావుగారొక్కరే, మనలో. అయితే, అకాలమృత్యువు పొట్టబెట్టుకుంది, వారిని.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||485}}</noinclude> d1kbpq63bmn4ksyjzyqvdlp8hubh919 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/510 104 204141 555436 531524 2026-05-04T11:12:55Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555436 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పోనీ అంటే, తరవాత, విజ్ఞానచంద్రికను చేపట్టినవారి కది అప్రధానం అయిపోయింది. కనీసం, అది, బతికివుండవలసిందన్న జ్ఞానమైనా లేకపోయింది, వారికి. దానాదీనా ఏమయిందీ? నవీన వాఙ్మయ ప్రకటనకు పూనుకున్నవారే లేకపోయారు. ఎవరిమట్టుకి వారే - గ్రంథం రచించినవారే తమ గ్రంథాలు ప్రకటించుకోవలసిన్నీ వచ్చింది. పోనీ అంటే, యేదేశంలోనూ కూడా, రచయిత అయిన వారికి, బీదతనమే రాసి పెట్టా డీశ్వరుడు. అంచేత, అప్పటికీ యిప్పటికీ నవీనుల రచనలెన్నో - సమర్థుల ఉద్గ్రంథాలెన్నో - జాతికి నవశక్తి సంఘటించ గల అమృత గుటికలవెన్నో అచ్చుకాకుండానే వుండిపోయా, యిప్పటికీ. పైపెచ్చు, అనుత్తమగ్రంథాలే బయటికి వచ్చాయి, వేలు. ఫలితం? జాతి అనుభవిస్తూనే వుందిప్పుడు. అయితే, తయారయిన గ్రంథాలన్నీ ఉత్తమాలేనా? నికృష్టాలని మాత్రం యెలాగా నిర్ధారణ చెయ్యడం అవి? ఈ సమస్య తీర్చేవారెవరు? కర్తలమాట ప్రమాణంకాదు. కొంతవరకూ పఠితృలోకం చెప్పగల దది. పూర్తిగా - స్పష్టంగా - నిష్కర్షగా చెప్పగలది మాత్రం కాలం. కనక, తయారయిన రచన అల్లా బయటికి రావాలి, ముందు. అచ్చుపడడం అందు కుపాయం, యిప్పుడు. కనక? నా వీరపూజ బయటికి రావాలి. అచ్చు పడాలి. లోకం చూడాలది, ముందు. ఈ ఆత్రం యెక్కువయింది, నాకు. ఎంతో ప్రయత్నించా నందుకోసం. మా ప్రాంతంలోనే యెన్నో వూళ్ళు తిరిగాను. ఎందరినో కలుసుకున్నాను. ఒకట్లు-రెళ్ళు—అయిదులు - సకృతుగా పదులు- ఇంతకంటే యిచ్చినవారు లేకపోయారు. ఆ యిచ్చినవారయినా అప్పుడూ అప్పుడూ యివ్వడం జరిగింది. ఆ వచ్చింది తిరగడానికే సరిపోయింది.<noinclude><references/> {{rh|486||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> tsignngeb16srlolmyatvuuwpbrdcb2 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/511 104 204142 555438 531525 2026-05-04T11:17:24Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555438 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>బట్టలు కొనుక్కోడానికీ - పుస్తకాలు కొనుక్కోడానికీ - సభలకు వెళ్ళడానికి - ఇలాగ స్వార్థానికిన్ని కర్చయిందెంతో కొంత. అంటే, మూడువందల రూపాయలు సంపాదించి గుట్టలు పెట్టడం సాధ్యంకాలేదు నాకు. కాని, అనుకోనివిధంగా అచ్చుపడి పోయిందది. వింత సంగతి వొక విధంగా, అది. {{c|<big><big>13</big></big>}} అది వివరించాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. వెనకాముందుల కలయికే వర్తమానం, మరి. పూర్వాపరసందర్భాలు కలిస్తేగాని, కథే లేదు కూడా. వెనకటిదీ ముందటిదీ సమన్వయం చేసుకోగలిగితే గాని, అనుభవమున్నూ యేర్పడదు, అసలు. ప్రతీ పూర్వవృత్తానికీ భవిష్యత్తులో ఒక సజాతీయ వ్యవహారం జరుగుతుందా ? జరగావచ్చు, జరక్కాపోవచ్చు, జరిగినా అది గుర్తించా లేకపోవచ్చు, మనిషి. కాని, యిందులో యేది లేకపోయినా, అనుభవమేకాదు, జీవితమూ లేదు. మరి, ప్రకృతం. రాజమహేంద్రవరంలో, కంచుమర్చివారి, రామచంద్రసిటీ (అప్పటికి, మిడిల్) హైస్కూలు భవనంలో దుగ్గిరాల సూర్యప్రకాశరావుగారి గోదావరీ మండలసభ జరిగింది. నిష్కర్షగా చెప్పలేను, ఎనిమిదోదని జ్ఞాపకం, నాకది. మోచర్ల రామచంద్రరావు పంతులుగా రధ్యక్షత వహించారు. చాలామంది వచ్చారు, జిల్లా అంతణ్ణుంచీ ప్రతినిధులు. కావడానికి జిల్లాసభేకాని, తక్కిన జిల్లాలనుంచిన్నీ వచ్చేవారు పెద్దలు చాలామంది, ఆరోజుల్లో. తెనుగు రాజకీయ జీవితానికి పాక్షికవిషమూ యెక్క లేదు, కులతత్వ పిశాచమూ ఆవహించలేదు, అప్పటికింకా. ఆరోజుల్లో, రాజమహేంద్రవరంలో, కే.యల్. ఎన్. సోమయాజులుగారు వర్థమానచంద్రులు గ్రంథప్రకాశకుల్లో. "రెయిల్వే లిట్రేచరు" బాపతు గ్రంథాలు ప్రకటించేవారు, వారు. స్కూలు వాచకాలున్నూ విరివిగా అమ్మేవారు. ఆ సందర్భంలో, పాఠశాల ఆవరణలో పుస్తకాల అంగడి తెరిచారాయన. ఎస్.పి.ఏ.ఎల్. బతికివుండిన దినాలవి. కనక, మిథునానురాగమూ తక్కిన నా గ్రంథాలూ ఆ అంగడిలో వుంచాన్నేను, కమిషను పద్ధతిమీద.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||487}}</noinclude> nxvs35jsxmmo0g3czybzzw6wib144cu పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/512 104 204143 555439 531527 2026-05-04T11:21:18Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555439 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మొదటి ఉదయం ఇక సభ ప్రారంభం అవుతుందనగా శ్రీరాజా వత్సరాయి రాయజగవర్మగారూ నేనూ మాట్టాడుకుంటున్నాం, ఆవరణలో వొకచోట నుంచుని. “మంచిబొమ్మ చిత్రించావు బ్రదర్" అంటూ వచ్చి నావీపు తట్టాడొక పెద్దమనిషి, ఆ సమయాన. తిరిగి చూశాను, అపరిచితు డాయన. మందహాసం చేస్తూ ఆయన పక్కనే నుంచున్నాడు మరో పెద్దమనిషి, ఆయన్ని మాత్రం కొంచెం యెరుగుదున్నేను. “నేను బొమ్మ చిత్రించడం యేమిటీ?" ఈ మాటే అడిగేశారు మిత్రులు రాయజగపతివర్మగారు. "స్థాణువులా అలా నుంచోడానికా నిన్ను తీసుకువచ్చాన్నేను?" అని, తాము వెంటబెట్టుకు వచ్చిన పెద్దమనిషిని ముందు కసిరే, "బ్రదర్, నా పేరు కౌతా శ్రీరామశాస్త్రి, యెప్పుడైనా విన్నావా?" అనడిగాడు, నా వీపు తట్టినాయన. చాలా మాట్లే విన్నా, నా మాటే చెప్పా నాయనకు. కలుసుకోవాలనీ ఉవ్విళ్ళూరుతున్నా నెన్నాళ్ళనుంచో, అదీ చెప్పాను. "నీ మిథునానురాగం మాట మాట్టాడుతున్నాన్నేను. బొమ్మ చిత్రించావంటే, చిత్తరువు గీశావని కాదు. మొదటి ప్రకరణం. యిప్పుడే చదివాన్నే, నది చక్కగా రూపుకట్టించావు నువ్వు" అని వివరాలు చెప్పాడాయన. "పేరిలో కొత్తదనం - ఆకృతిలో కొత్తదనం - రచనలో కొత్తదనం - ధోరణిలో కొత్తదనం - ఇవి నన్నాకర్షించాయి. నువ్విక్కడే వుండడం చూపించాడీ పెద్దమనిషి, నీతో స్నేహం కడదామని వచ్చా” నని చెబుతూనే, నా రెక్కపట్టుకుని, మరో చోటికి తీసుకు వెళ్ళి, పొదువుకుని నన్ను తన పక్కని కూచో బెట్టుకున్నాడాయన, వొక బల్లమీద. జనంతండాలు తండాలుగా వస్తున్నారు, గుంపులు గుంపులుగా మెట్లెక్కి మేడమీదికి వెడుతున్నారు. సభకూడా ప్రారంభం అయిపోయింది. శ్రీరామశాస్త్రి, ధోరణి అలాగే వెళ్ళిపోతోంది, అఖండ గోదావరీ ప్రవాహం వతుగా. కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, కొన్ని వినిపించడం లేదు, నాకు. “అక్కడ, రాయజగపతివర్మగారి మాటయేమిటీ?" అని నా ఆందోళన. ఇద్దరు మనుష్యులొకచోట మాట్టాడుకుంటూ వుంటే, మరోమనిషివచ్చి, వారిలో వొకరితో మరో విషయం వూదర గొట్టడం - ఇది చాలామందికి చేతనవును, మనలో. అటు, హఠాత్తుగా రావడంతోపాటు, ఇటు అమాంతంగా నన్ను లాక్కుపోడం - యిది విశేషం యిక్కడ, మరీ దారుణం యిది. ఇద్దరు మాట్టాడుకునేది రహస్యమే కానక్కరలేదు, చొరుచుకు వెళ్ళలేను వారి దగ్గిరికి. వారి సంభాషణ విననే అక్కరలేదు, వారి కడ్డుతగలడమే వొక దుస్సాహసం నా దృష్టిలో.<noinclude><references/> {{rh|488||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> 7o7mel4dw5xzgnt4two1f0z7ff6tlmd పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/514 104 204145 555441 531531 2026-05-04T11:28:55Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555441 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అనేశాను తరవాతి సంభాషణలోనే నువ్వని. చాలా సంతోషించా డతను. మళ్ళీ పొదువుకున్నా డతను. ఏదో నూత్నశక్తి జాగృతం అయింది నాలో, దాంతో. లోకంలో బహూ స్వల్పంగా వుంటారు, ఇలాంటి అమృతహృదయులు. అలాంటి వొక పెద్దమనిషితో నాకు మైత్రి - ఆత్మీయత లభించడం చాలా అదృష్టం. లక్షలు - కోట్లు - డబ్బు దొరికితే యిలా వుంటుందా మనిషికి? ఆ రెండురోజులూ కలిసే తిరిగాం మే మెక్కడికి వెళ్ళినా. ముందు, తాను నా కాత్మీయుడయి, తరవాత, తనకునన్నాత్మీయుణ్ణి చేసుకున్నా డతను. సంసారాల్లో మిక్కిలీ అరుదుగా - చాలా సకృతుగా - ఎంతో అపురూపంగా మాత్రమే వుంటా రిలాంటివారు. అయినా, మధ్యమధ్య "మీ"రని వచ్చేది నాకు మాట. ఎన్నోమాట్లు దిద్దాడతను, చివరికి, ఆ రెండురోజులూ గడిచాటప్పటికీ బాగా అలవాటయిపోయింది నాకు "ను"వ్వనడం అతణ్ణి. బంగాళాదేశమూ, బంగాళీభాషా, బంగాళీ వాఙ్మయమూ, బంగాళీజాతీ - ఎంతసేపు మాట్టాడినా యింతే ప్రపంచం అతనిది. అయితే "తెనుగువాళ్ళం మనం. అలా ముందంజ వెయ్యాలి ప్రతీదాల్లోనూ మనమును" అనేవాడత నెప్పుడూ. శారద పత్రిక నడిపి, ఉత్తమ సాహిత్య పత్రిక అంటే యెలా వుంటుందో అది తెలుగులోనే మనకు చూపించిన మహాత్యాగి అతను. ముందే తన మనసిచ్చేవా డెలాంటి వాళ్ళకీ. నాదీ యిదే పద్ధతి. అయితే, మనసు పుచ్చుకోతగ్గవాళ్ళు చాలా అరుదు, లోకంలో. సంశయాత్ములయే వుంటారు, చాలా మంది. చూసిన్నీ కనిపెట్టలేరు చాలామంది. పైగా, మనిసిచ్చెయ్యడం చూసి, లోకువ చేస్తారు చాలా మంది, దగా చేస్తారు, ద్రోహమున్నూ చేస్తారు. ఎందరో చేశారు నా కిలాంటివి. నా వల్ల మహోపకారాలు పొందినవారున్నూ చేశారు కొందరు. రచయితలయినవారున్నూ చేశారు. శ్రీరామశాస్త్రిన్నీ యెందరివల్లనో దగాపడి వుంటాడు, సందేహం లేదు. కాని, యిదొక ప్రవృత్తి. ముందే మనసిచ్చే ప్రవృత్తి జన్మక్రమాన్నిపట్టి వచ్చేది. ఆది మారదు.<noinclude><references/> {{rh|490||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> aub8t1s9dfp98fkxrxsij3dsqhstima పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/515 104 204146 555442 531532 2026-05-04T11:32:41Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555442 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>బతికినంత కాలమూ శ్రీరామశాస్త్రి అలాగే బతికాడు, నిశ్చలంగా. ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాడు. ఎందుకోసమూ పాకులాడేవాడు కాడు. డబ్బులేక బాధపడేవాడు. కాని, కక్కూర్తి - దైన్యం - దిగులు - నీరు కారిపోడం - ఇలాంటివి యెరగని మహానుభావు డతను. మంచిమంచి సాహిత్య సభలు జరుగుతూ వుండేవారోజుల్లో. ఆంధ్ర సాహిత్యమే ప్రధానమై వుండే దా రోజుల్లో, మన సాహిత్య పరులకున్నూ. ఆంధ్ర సాహిత్య వికాసంకోసమే పాటుపడేవారప్పుడు సాహిత్య ప్రియులున్ను, ఇతర సాహిత్యాల వికాసం చూసిన ఉత్సాహంతో. మిత్రులు, సూరి వేంకటనరసింహశాస్త్రి, అయ్యంకి వెంకట రమణయ్యగార్ల చేతుల్లో, గ్రంథాలయోద్యమం, నిత్యకల్యాణం పచ్చతోరణంగా వుండేదా రోజుల్లో. ఆంధ్రమహాసభకూడా యెందునా ఆంధ్రత్వం పోగొట్టు కోని రోజు లవి. మన ఆంధ్రుల్లో “నేను” “నాది” “నావాడు” అన్న ఆత్మ విశ్వాసం అంకురించి, మారాలేస్తున్న రోజులవి. కాస్త మంచి సాహిత్య సభ జరిగింది, నేనూ మా సత్తిరెడ్డిగారూ వెళ్ళామన్నమాటే తప్పకుండా. అక్కడక్కడల్లా శ్రీ రామశాస్త్రి ప్రత్యక్షమయేవా డన్న మాటే నాకు. మళ్ళీ అంత మమతా కనబరిచే వాడన్నమాటే నా మీద, అతను. అటుచూస్తే, అతనికీ ముట్నూరి కృష్ణారావుగారికి వొకటే ప్రాణమో అభేదమేనో, అసలు. ఒకమాటు కలుసుకున్నప్పుడు, “కవిపూజ" సందర్భంలో జరిగిన అవకతవకలు వివరించి "ఇందుకాయన యిప్పుడేమి చెబుతారో కనుక్కో బ్రదర్” అన్నాన్నేను. మరి అక్కడ యేం జరిగిందో "అది మరిచిపో బ్రదర్” అన్నాడతను, తరవాత కలుసుకున్నప్పుడు. చేసిన తప్పు వొప్పుకోడం కష్టం యెవరికయినా. బదులు చెప్పడం కూడా నామోషీ కొందరికి. పత్రికా సంపాదకత్వం అంటే ఆచార్యపీఠం అని నానమ్మకం. లౌక్యాలకూ స్వార్థానికీ స్థానం కాదది. సత్యం నిర్ధారణ చెయ్యలవసిన ధర్మాసనం అది. ముఖపిదానం చెయ్యవలసిన మాటుకాదు. ధర్మప్రచారం చెయ్యాలంటే వొక్క ప్రవచనమే సాధనం వెనకటి రోజుల్లో. పత్రిక అంటే, దాని కీడూ జోడూ అయిన మరో సాధనం యిప్పడు. సత్యానికీ ధర్మానికీ దాసుడు అయి వుండాలి సంపాదకుడు. అసత్యానికీ అధర్మానికీ దండధారిన్నీ అయి వుండాలి. ముఖ్యంగా స్వతంత్రుడు కావాలి.<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||491}}</noinclude> 1s3459ifq6d0tole1h6o56j9b3ue7p1 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/516 104 204147 555443 531567 2026-05-04T11:37:41Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555443 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>గురుపీఠం అధివసించి వుండాలి, వొకడి వెనకబడి పోయే పరప్రత్యయనేయబుద్ధి కా గూడదు. జాతికి, స్వార్థానికి ప్రగతిశీలమూ కలిగించాలి, పదార్థానికి అవధులూ చూపించాలి. ప్రవృత్తికే సాధనం మరి, పత్రిక. పత్రికా సంపాదకులను, ఆకాశం యెత్తునవుంచే మాట్టాడతాన్నేను, అయితే, వారు, నా ఆత్మగౌరవమూ, తమ హద్దూ గుర్తించుకో గలిగితేనే తరవాత కూడా నా ఆదరగౌరవాలు చెడకుంటాయి వారి యెడల. "మనలో మనమాట"గా యీ సంగతి శ్రీరామశాస్త్రికి వివరించి, తరవాత నేనా వూసే యెత్తుకోడం మానేశాను. మరి కొన్నాళ్ళకి, గోదావరీ మండల సభ రామచంద్రపురం కోటలో జరిగింది. పోలవరం జమీందారుగా రధ్యక్షులా సభకు. రామచంద్రపురం రాజాగా రాహ్వాన సంఘాధ్యక్షులు. అయితే, వారి కోరికమీద, వారి స్వాగతోపన్యాసం దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు చదివారు ముందు బాగా సాహిత్య వాసితంచేసి. ఆ సభకివచ్చి రెండురోజులూ వున్నారు ముట్నూరి కృష్ణారావుగారు. దూరాన, తర్జననిర్దేశంతో, వారికి చూపించాడు శ్రీరామశాస్త్రి నేను బాగా గుర్తించా నది. కాని, వొకపూట భోజనాలదగ్గిర పక్కపక్కగా కూచున్నాం, మరో పూట మహాసభలోకూడా పక్కపక్కగా కూచున్నాం, మధ్యమధ్య, వొకరినొకరం అప్రయత్నంగా చూసుకోనూ చూసుకున్నాం, కాని నాతో కృష్ణారావుగారూ మాట్లాడలేదు, కృష్ణారావుగారితో నేనూ మాట్టాడలేదు. ఎవరి మానాన వాళ్ళం బయలుదేరుతున్నాం, సభానంతరం. మా సత్తిరెడ్డిగారి కోసం సొంతబండి వచ్చి రెండెడ్లది, వారెక్కే వున్నారు. రాయజగపతివర్మగారూ నేనూ మాట్టాడుకుంటున్నాం, బండిక్కొంచెం యెడంగా. "బ్రదర్" అంటూ వూచలావచ్చి, "నీకసి మహా చెడ్డదోయ్" అన్నాడు శ్రీరామశాస్త్రి,, నా వీపుతట్టి. “ఇందులో యెవరు తక్కువ తిన్నారు బ్రదర్?" అని యెదురడిగాన్నేను. "కుర్రవాళ్ళు వినయవిధేయతలు కనబరచాలంటే, పెద్దల మనుకునేవారు టెక్కువిడిచి నడుచుకుంటేనే" అనిన్నీ చెప్పాన్నేను. “సరే, సరే” అంటూ వెళ్ళి కృష్ణారావుగా రెక్కివున్న జట్కా యెక్కాడు బ్రదర్ శ్రీరామశాస్త్రి, నేను రెడ్డిగారి బండెక్కాను. {{c|<big><big>14</big></big>}} అనేకమాట్లు—అనేకచోట్ల—కలుసుకున్నాం నేనూ శ్రీరామశాస్త్రిని తరవాత, పానుగంటి రామరాయణంగారి యాజమాన్యాన, విశాఖపట్నంలో జరిగిన మూడో ఆంధ్ర మహాసభ సందర్భాన కలుసుకోడం ప్రకృతం. భూపతిరాజు వేంకటపతిరాజుగా రాహ్వానసంఘాధ్యక్షులా సభకు.<noinclude><references/> {{rh|492||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude> gp5rtoff3kp3qcg0skedg1xv0ymxtb2 పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/517 104 204148 555444 531568 2026-05-04T11:43:18Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 555444 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కురుపాం మార్కెట్టులో జరిగిందది. మార్కెట్టింకా ప్రారంభం కాలేదు, భవనం మాత్రం తయారయి వుంది సర్వసిద్ధంగా. చుట్టూవున్న గదుల్లో ప్రతినిథులసభలూ, మధ్యగావున్న తెరపిలో అకాశం అంత పందిట్లో మహాసభను. ఇక వొక్కగంటలో సభ ప్రారంభం అవుతుందనగా వెళ్ళాన్నేను, రెయిలు దిగి. గదులన్నీ కిక్కిరిసి వున్నాయి, బస దొరకలేదు. వసారాలో శ్రీరామశాస్త్రి కనపడ్డాడు, నా బస విషయం మాట్టాడుకుంటున్నాం. పక్కనే వొక గదిగుమ్మాన నుంచునివున్నా రొక పెద్దమనిషి "మీ పేరెవ?"రనడిగారు వారు, నన్ను. నేను చెప్పాను. వెంటనే దగ్గిరికి వచ్చి, నాచెయ్యి పట్టుకుని "మేమున్న గదిలో ప్రవేశించండి" అంటూ ఆహ్వానించారు వారు నన్ను. చకితుణ్ణయినాన్నేను, ఆ ఆదరానికి. పొణకా పట్టాభిరామారెడ్డిగారు, మరెవరో కాదు. అప్పుడే - అక్కడే—ఆవిధంగానే మా మొదటి పరిచయం. లోపలికి తొంగి చూస్తినిగదా, వారి మేనల్లుడు మరపూరి పిచ్చిరెడ్డిగారూ, జమీన్‌రైతు పత్రిక సంపాదకులయివున్న నెల్లూరి వెంకట్రామా నాయుడుగారూ - యింకా మరికొందరు యువకులూ నిండివున్నారు. నేను సందేహించాను; కాని చోటుచేసి, నన్ను తమతో చేర్చుకున్నారు, రెడ్డిగారు. మనుమసిద్ధి సీమ కంతకూ వొక్క గునుపాటి యానాది రెడ్డి గారికి మాత్రమే నా కప్పటికి పరిచయం. రెండోవారు పట్టాభిరామారెడ్డిగారు. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం - ఇలాంటి ప్రజాహితోద్యమాల్లో రెడ్డి యువకులకందరికీ వొక్క పెట్టాభిరామారెడ్డి గారిది ముందంజ, అప్పట్లో. ఆ పూట సభ పూర్తయింది. శ్రీరామశాస్త్రిని తీసుకువెడుతూ, నన్ను కూడా తమ యింటికి భోజనానికి తీసుకువెళ్ళారు, ఆ వూరి యువక వకీలొకాయన. భోజనంచేసి అక్కడే పడుకున్నాం కాస్సేపు, మేము. నిద్ర రాలేదు మా కిద్దరికీ, యేమిటేమిటో సంభాషణ మాత్రం వచ్చింది. వాటిలో వీరపూజ విషయం వొకటి. వినివిని "మహాబాగా తెచ్చావు సమయానికీ ప్రస్తావన" అంటూ పడుకుని మాట్టాడుతున్నవా డల్లా వుబ్బెత్తుగా లేచి కూచ్చున్నాడు శ్రీరామశాస్త్రి. "గ్రంథకర్త లెందరో తమ గ్రంథా లచ్చుకాక బాధపడుతున్నారు మనవాళ్ళు. ఆ గ్రంథాల్లో ఉద్గ్రంథాలున్నూ కొన్ని వున్నాయి. అది గుర్తించారు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు. అలాంటివారికి సాయం చెయ్యాలని నిశ్చయించుకుని,<noinclude><references/> {{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||493}}</noinclude> 7pshkek0tmn19xe1csbbs09ldixsmbu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/305 104 211753 555419 555164 2026-05-04T05:55:39Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 555419 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> మనోజవిజయ భాణమ్, ధర్మపురి లక్ష్మీనృసింహ సుప్రభాతం, ప్రపత్తి, స్తోత్రం, మంగళా శాసనం జియ్యరు స్వామి చరిత్రం వంటి కావ్యాలు, తత్యార్థ ప్రకాశిక, అర్చిరాది మార్గం. శ్రీ వచన భూషణం, రహస్యతయం, వేదాంత దీపం, పూర్వ పక్ష సిద్ధాంత సంయోజనం వంటి గద్య రచనలు చేశారు. తెలుగులో కళాశాలాభ్యుదయము, మనస్సందేశము, ఆంధ్ర మహానాటకము, రామానుజ చరిత్ర కావ్యాలు విశిష్టాద్వైత మత సంగ్రహము, స్వీయ కవితానుజీవనము అన్న వచన రచనలు చేశారు. విశ్వకర్మ శతక ఖండన మండనము, గీతాచార్య మత ప్రభావము, పద్మావతీ పరిణయము, రుక్మిణీ కళ్యాణము, గరుడ గర్వాపహరణము, కృష్ణగారడి, ఆధ్యాత్మ భారత హరికథ, గాంధీ జీవిత చరిత్ర, ప్రజాస్వామ్యము, అభినవకుచేలోపాఖ్యానము, రత్నమాల, శతవిధ బంధ పద్య శతకము, శృంగార పంచ బాణ విజయబాణం వంటివి ముద్రితా ముద్రిత లభ్యాలభ్య రచనలు. 1940లో సేనావతి నరసింహాచార్యుల దగ్గర విద్యాభూషణ బిరుదు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి పండిత సన్మానం (1955) ఉభయ వేదాంతాచార్య బిరుదు పెద్ద జియ్యరు స్వామి వారి నుండి (1973) ప్రపంచ తెలుగు మహాసభల కవి సన్మానం--(1975) తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం (1992) మొదలు అనేక సాహితీ సంస్థల నుండి సన్మానాలు గౌరవాలు పొందారు. 40 అష్టావధానాలు, 5 శతావధానాలు చేసిన, చిత్రబింధ కవిత్వాలు రచించిన కృష్ణమాచార్యులు నైజాం రాష్ట్రాద్య శతావధాని బిరుదును పొందారు. అది వారికి అన్వర్థనామధేయమైంది. అలా కృష్ణమాచార్య శతావధానిగా వారు ప్రసిద్ధిని పొందారు. 16 సంవత్సరాలలో తొలి సంస్కృత శ్లోకం రచించిన వారు తన రచనా యాత్రను సంస్కృత మనోజ విజయభాణంతో ప్రారంభించారు. పెద్దపల్లి దగ్గరి నంబులాద్రి నరసింహ రథోత్సవమే ఇందులోని ఇతిష్పత్తం. తొలి తెలుగు కవిత కంద పద్యం. నాటి కరీంనగర్ను <poem> కరివర శుభక్ష్యా, కరమగుటన్ ప్రాంత భూప కమనీయభజత్ కరకం నికరములనుగన, కరినగరంబ నగ సార్థకరమై యొప్పన్ </poem> హరి భక్తులకు, రాజులకు పన్నులు చెల్లించే సంపన్నులకు నిలయం కరీంనగరమని వర్ణించారు. ఒకరోజు రాత్రి సరస్వతీ దేవి కలలో వచ్చి ఒక సమస్యను పూరించమని అడిగింది. ఉత్పలమాలలో పూరించారు. అలా ప్రారంభమైన వారి ధారణ, పూరణలు అష్టావధానాలు, శతావధానా చేయడానికి పురిగాల్చింది. 1928లో జరిగిన రాజా అనంతకిషన్ రావు ఏర్పాటు చేసిన శతావధానం మరో కారణం. అవధానం మంత్రోపాసన బలమన్న అభిప్రాయాన్ని కృష్ణమాచార్య శతావధాని కాదంటారు. అది ధారణ శక్తి ప్రజ్ఞాభ్యాసంతో కూడిందన్నది. వారికున్న స్పష్టమైన అభిప్రాయం. చిత్ర బంధ కవిత్వాలను రచించిన కృష్ణమాచార్యులు అందులో ఆధునిక దృష్టిని తన జాతీయాభావాన్ని ప్రదర్శించారు. వంద రకాలుగా చిత్ర కవితను నిర్వహించారు. 'చిత్రప్రబంధం' పేరుతో 1940 ప్రాంతంలోనే రచించిన ఈ రచన ఇటీవలె ముద్రితమైంది. భారతదేశ జాతీయ పతాకం, రాట్నం, గడియారం, విమానం, సైకిలు, నిచ్చెన వంటి చిత్రబంధ కవిత్వాలు ఈ చిత్ర ప్రబంధంలో కనిపిస్తాయి. ఇవి పూర్వులు రచించిన చిత్ర బంధ కవిత్వానికి భిన్నమైనవి. శ్రీశంకరులు, శ్రీరామమూచార్యులు, మధ్వాచార్యులు లేదా తాత్త్వికుల జీవిత చరిత్రలను కావ్యంగా మలచాలంటే వారి జీవిత విశేషాలు, చరిత్ర తెలిస్తే సరిపోదు. ఆయా తాత్త్వికులలోని తత్త్వం తెలిసి ఉండాలి. సిద్ధాంత రహస్యాలు, విశిష్టాద్వైత తత్త్వం పరిపూర్ణంగా తెలిసిన కృష్ణమాచార్యుల వారి వల్ల రామాను చరిత్రకు తాత్విక కావ్యంగా గౌరవం. దక్కింది. అనేక ఉపనిషత్తులు, స్తోత్రాలు, విశిష్టాద్వైత రహస్యాలు ఈ రచనలో స్వేచ్చా సేువాద రూపంలో కనిపిస్తాయి. గాంధీ తాత నీతి శతకంలో కృష్ణమాచార్యులవారి గాంధేయ వాదాన్ని చూడవచ్చు. విదేశీ వస్త్ర బహిష్కరణ, గాంధీ సమకాలీనులైన నాయకుల పట్ల కవికున్న దృక్పథం ఈ శతకంలో చూడవచ్చు. ఆంధ్ర మహా నాటకము హనుమాటన్నాటకానువాదము. 14 అంకాలున్న ఈ నాటకం 14లో కాలకు ప్రతీకగా నిర్మించారు. స్తుతి గీతములు<noinclude><references/> {{rh|తెలంగాణ |284 | తేజోమూర్తులు}}</noinclude> 0wg6xqxusdypdd2zo35nb8op5g5d2xs పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/306 104 211754 555421 552125 2026-05-04T06:00:57Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 555421 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> కొందరు వైష్ణవాచార్యులు వ్రాసిన రచనలకు అనువాదాలు. ఇంతటి ప్రౌఢ కవిత్వాన్ని రచించిన కృష్ణమాచార్యులు రుక్మిణి కళ్యాణము, గరుడ గర్వాపహారము, పద్మావతి పరిణయము వంటి పౌరాణికాలు, గాంధీజీ జీవితము ప్రజారాజ్యము వంటి సాంఘికాలను హరికథలుగా రచించారు. ఇవి ఆచార్యులవారికున్న ప్రాచీనాధుక దృక్కోణాన్ని చెబుతాయి. సంస్కృతం లో వారు రచించిన మనస్సందేశకావ్యం అర్చిరాది మార్గాన్ని కవితాత్మకంగా వివరించేది. గురువంశ మహా కావ్యములో నమ్మాళ్వారు, నాథముని, యామునాచార్యులు, శ్రీరామానుజులు, నంజియ్యరు నంబిళ్ళై, వేదాంతదేశికులు, వరవరమునుల వైభవాన్ని ఐదాశ్వాసాలలో వర్ణించారు. వీరిలో ఒక్క నమ్మాళ్వారు తప్ప మిగతా వారంతా వైష్ణవ ఆచార్యులు. జియ్యరు చరిత్ర పెద్ద జీయరు వారి జీవితాన్ని వర్ణించేది. సంపత్కుమార సంభవం మేల్కొటై క్షేత్ర మహాత్మ్యాన్ని తెలిపే కావ్యం. గురు పరంపరాగతమైన సాంప్రదాయిక విద్యను అభ్యసించినా బాల్య వివాహం, వితంతు వివాహం, జాతీయాభిమాన విషయాలలో ఆధునిక దృష్టి కలవారు కృష్ణమాచార్యులు. వితంతు వివాహం ప్రోత్సాహిస్తూ యువతకు ప్రబోధాత్మక కవితలను అందించారు. వేదార్థ సంగ్రహ సమీక్ష, రామానుజులవారి వేదాన్త దీపం, రంగ రామానుజుల విషయ వాక్య దీపిక, కృష్ణమాచార్యుల తత్త్వసారము వంటివి సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. ఆళ్వారులు సాహిత్యాన్ని అనువదించారు. సంస్కృతం తెలుగు భాషలలో, సంస్కృత తమిళ వేదాంతాలలో గాఢమైన పాండిత్యం ఉండడంవల్ల ఉభయ భాషా కవిగా, ఉభయ వేదాంత పండితులుగా ప్రసిద్ధి పొందారు. సంస్కృతం తప్ప మరొకటి భాష కాదనుకునే పండితుల కాలంలో పుట్టినా తెలుగు భాషలో సారస్వత రచన చేశారు. తెలుగులోనూ ఒక కావ్య సంప్రదాయానికే పరిమితం కాకుండా స్తుతిగీతాలు, హరికథలు, శతకాల వంటి దేశీ సారస్వతానికి పెద్దపీఠ వేశారు. ఇది వారి విశాల దృక్పథాన్ని సమన్విత దృష్టిని మన ముందు నిలుపుతుంది. 20వ శతాబ్దపు తెలంగాణ పండితులలో ప్రసిద్ధులు విశిష్టులు కృష్ణమాచార్య శతావధాని.<noinclude><references/> {{rh|తెలంగాణ |285 | తేజోమూర్తులు}}</noinclude> 8d2thh0yb67sbxmo0a3oo5af2z8iuvv పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/307 104 211755 555422 552126 2026-05-04T06:14:25Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 555422 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''80. కొత్తూరు సీతయ్య గుప్త '''</p>}} {{right|- డా॥ కర్నాటి లింగయ్య}} <poem> శంనొమిత్రః శంవరుణ!! శంనో భవత్పర్యమా శంనో ఇంద్రో బృహస్పతిః!! శంనో విష్ణు విష్ణురురుక్రమః</poem> దేశభక్తి, ప్రజాహిత చింతన మూర్తీభవించిన నిస్వార్థ నిరాడంబర ప్రజా సేవకులు శ్రీ కొత్తూరు సీతయ్య గుప్త. వారు పుట్టింది అతి సామాన్య కుటుంబంలో, ఒక చిన్న వ్యాపార సంస్థలో ఉద్యోగిగా జీవితం ఆరంభించారు. ఏ వ్యాపార సంస్థలో పనిచేసినా లక్షలు ఆర్జించే వ్యవహార దక్షులు. వృత్తిని బట్టి వ్యాపారస్తులైనా, ప్రవృత్తిని బట్టి దేశభక్తుడు, జాతీయవాది, గాంధీతత్త్వాభిమాని. ప్రజాహిత చింతనగల సంఘ శ్రేయోభిలాషి, నిజాం నిరంకుశ పరిపాలనకు వెరవని ధైర్యశాలి. ఆర్యసమాజ్ నిర్మాణానికి, ప్రచారానికి తన జీవితం అంకితం చేసిన చైతన్యశీలి. అనేక సాంఘిక, సాంస్కృతిక సేవా సంస్థల స్థాపనలో, నిర్వహణలో క్రియాశీల ప్రోత్సాహమిచ్చిన సంఘ సేవా పరాయణులు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజాసేవా రంగంలో వీరు ప్రముఖంగా కనిపిస్తారు. పూర్వపు హైదరాబాదు సంస్థానంలో తెలుగు ప్రజల అభ్యున్నతికి వారి న్యాయమైన హక్కులు, అధికారాలను సాధించడానికి అవిరళకృషి చేసిన జాతీయవాదులలో పేర్కొనదగిన ప్రజా సేవాతత్పరులు శ్రీ సీతయ్య గుప్త గారు. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన వివిధ ఉద్యమాలలో ఆయన నిర్వహించిన పాత్ర శ్లాఘనీయమైనది. నిజాం నిరంకుశ పరిపాలనను అంతరింపచేసి హైదరాబాదు భారత యూనియన్లో విలీనమైన తరువాత రాష్ట్ర నిర్మాణానికి నిర్విరామ కృషి సలిపి తన ఆకాంక్షను సాధింపగలిగిన ప్రముఖులు శ్రీ సీతయ్య గుప్త. హైదరాబాదు నగరంలో అనేక సామాజిక, సాంస్కృతిక, విద్యావిషయక, వాణిజ్యవర్తక, నిర్మాణ సేవా సంస్థల స్థాపనలోనూ, వాటి నిర్వహణలోనూ సీతయ్యగారు నిర్వహించిన పాత్ర అమోఘమైనది. జంట నగరాలలోని వర్తక ప్రముఖులలో వీరికి గల స్థానం విశిష్టమైనది. వర్తక, వాణిజ్య సంస్థలు నెలకొల్పటంతోపాటు, కార్మిక సంఘాలు కూడా స్థాపించి యజమానులు, కార్మికులు మధ్య సామరస్య సుహృద్భావాలను నెలకొల్పటానికి కృషి చేసిన నిర్మాణ కార్యకర్త, గాంధేయవాది శ్రీ సీతయ్యగారు. శ్రీ సీతయ్యగారు తేది 10-8-1911న హైదరాబాదు నగరానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న బహదూర్ గూడలో జన్మించారు. వీరి తండ్రి శ్రీ కొత్తూరు రామన్న, తల్లి శ్రీమతి అన్నమ్మ. అయిదుగురు అన్నదమ్ములలో సీతయ్యగారు నాల్గవ వారు. వీరు శంషాబాద్ వీధి బడిలో చదువుకున్నారు. శ్రీ వేంకటస్వామి గారనే ఉపాధ్యాయులు ఈయన గురువుగారు. తెలుగుతోపాటు ఆనాటి రాజభాష అయిన ఉర్దూ భాష నేర్చి, హిందీ ప్రావీణ్యత పొంది, సిద్ధాంత శాస్త్రి (బి.ఏ)తో<noinclude><references/> {{rh|తెలంగాణ |286 | తేజోమూర్తులు}}</noinclude> boin0mpba41003qdr995cdr2epq4rlj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/308 104 211756 555423 552127 2026-05-04T06:24:03Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 555423 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> సమానము అగు డిగ్రీని పొందినారు. భారత, భాగవతాది గ్రంథాలు, సుమతి శతకం, దాశరథి, వేమన శతకాలు కంంస్థం చేశారు. అమరమూ, ఆంధ్రనామ సంగ్రహం వంటి నిఘంటు గ్రంథాలు అధ్యయనం చేశారు. మరియు వ్యాపార సంబంధమైన లెక్కలు, గణిత శాస్త్రం నేర్చుకొన్నారు. శ్రీ సీతయ్య గుప్త గారు తల్లిదండ్రులను వారి చిన్నతనంలోనే కోల్పోయారు. 1928లో కుటుంబ బాధ్యత వారి భుజ స్కందములపై పడుటవలన వారు ఉద్యోగము చేయవలసివచ్చింది. అందుకే వారు శంషాబాదు నుండి హైదరాబాదు నగరమునకు తరలివచ్చి ఉస్మాన్ గంజ్లో శ్రీ కొడారపు లక్ష్మీనర్సయ్య గారి వ్యాపార సంస్థలో చిన్న గుమస్తాగా చేరారు. సీతయ్య గారి పని చూచి సేట్ గారు సంతృప్తి చెందారు. సంవత్సరమునకు రెండువందల రూపాయలు వేతనం ఇస్తామన్నారు. ఉద్యోగం ఖాయపరచుకొని ఉద్యోగంలో చేరి జాగ్రత్తగా కష్టపడి పనిచేసేవారు. కొద్దిరోజుల్లోనే ఆ సంస్థలో అన్ని విభాగాలలో జరిగే వ్యాపార కార్యకలాపాలు ఆయనకు కరతలామలకములైనవి. అకౌంట్లు, అజమాయిషీ తదితర వ్యాపార సంబంధ వ్యవహారాలలో వారు బాగా ఆరితేరారు. వీరికి ఏ పని అప్పగించినా ఆ పని అత్యంత బుద్ధి కుశలతతో, విశ్వాసము, నిజాయితీతో నిర్వహించి యజమాని మన్ననలకు పాత్రులైనారు. ఏ పనిచేసినా ఒకరు తప్పుపట్టడానికి వీలు లేకుండా సమర్థతతో దానిని నిర్వహించే వ్యక్తి అనిపేరు తెచ్చుకున్నారు సీతయ్య గుప్త గారు. ఉన్న ఉద్యోగ సంస్థ భాగస్వాములు విడిపోవటం వలన తదుపరి సొంత వ్యాపార సంస్థను స్థాపించి వర్తక ప్రముఖునిగా ప్రసిద్ధి చెందారు. 1930లో సీతయ్య గారికి వివాహం జరిగింది. వారికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. హైదరాబాదు విమోచన ఉద్యమంలో పాల్గొని స్వాతంత్య్ర సమరయోధునిగా పరిగణింపబడిరి. వీరు తల్లిదండ్రులను కోల్పోయినను అధైర్యము చెందక కష్టపడి పనిచేయటం ప్రారంభించిరి. ఆహార ధాన్యముల కమీషన్ వ్యాపారము చేయ మొదలిడి అందు గణనీయమైన స్థానము సంపాదించిరి వీరు. ఆం.ప్ర. ధాన్య వ్యాపార సంఘమునకు పన్నెండు సం.లు కార్యదర్శిగాను, తదుపరి పదకొండు సం.లు అధ్యక్షులుగాను పనిచేసి సంఘమునకు ఎనలేని సేవ యొనర్చిరి. వీరు కొంతకాలము చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీన్లో కార్యనిర్వాహక సభ్యులుగా ఉండి, ఆం.ప్ర. వ్యాపార సమాఖ్యకు అధ్యక్షులై ఆ సంస్థల అభ్యుదయమునకు పలు విధములుగా పాటుపడిరి. శ్రీ సీతయ్య గారు బాల్యము నుండియు సంఘ సేవా కార్యములందధికమైన శ్రద్ధ వహించుచు, పేదలను, దీనులను, కష్టముల నుండి కాపాడుటకు అవిరళమైన కృషి చేయుచుండిరి. వారి కార్య నిర్వహణ శక్తి అప్రతిమానమైనట్టిది. వీరు గుమస్తాగా పనిచేయు కాలమున తోటి గుమస్తాల ఇబ్బందులను తొలగించుట కొరకు గుమస్తాల సంఘమును స్థాపించి, యజమానులతో సంప్రదించి, గుమస్తాలకు అనేక సౌకర్యములను కల్గించియుండిరి. హైదరాబాదు పురపాలక సంఘమునకు మేయరుగా నుండిన శ్రీ ధరణిధర్ సంఘ్వీ, శ్రీ బాల్ రెడ్డి మున్నగు పెద్దల సహకారముతో గుమస్తాలకు వారపు సెలవుల సౌకర్యమును కలిగించారు. గుమస్తాల సంఘం పటిష్టంగావించియుండిరి. తరువాత వారి విషయములు తను ఎం.ఎల్.ఏ. గా ఉన్న కాలంలో ప్రభుత్వ దృష్టికి తెచ్చి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టమును అమలువర్చునట్లు ప్రయత్నించి కృతార్థులైరి. వీరి కృషి వలన చాలా కాలము నుండి ఎదుర్కొను సమస్యలు పరిష్కరింపబడుట సంభవించెను. శ్రీ సీతయ్యగారు దక్షిణ మధ్య రైల్వే సికిందరాబాదు విభాగమునకు అఖిల హైదరాబాదు హమాలీల సంఘమునకు తొమ్మిది సం.లు. అధ్యక్షులుగా ఉండి హమాలీల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సర్వ సౌకర్యములను కలిగించిరి. తదుపరి ఆం.ప్ర. ప్రభుత్వం శాసనసభ ద్వారా హమాలీల సౌకర్యములకు సంబంధించిన చట్టమును ఆమోదింపచేశారు. సంఘ సేవా పరాయణులైన శ్రీ గుప్తగారు క్రమంగా రాజకీయ రంగమున కూడా ప్రవేశించుట సంభవించెను. నిజాం ప్రభుత్వ కాలమున ఏర్పరచిన ఆంధ్ర మహాసభలో చేరి హైదరాబాదు జిల్లా మహాసభకు ఆరు సంవత్సరములు ఉపాధ్యక్షులుగా పనిచేసిరి. శ్రీ రామానంద తీర్థగారి ఆధ్వర్యమున రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశమునకు సంబంధించిన ఆహ్వాన సంఘమునకు వారు కార్యదర్శులుగా నియమింపబడిరి. సత్యాగ్రహోద్యమమును ఉధృతపరచినం<noinclude><references/> {{rh|తెలంగాణ |287 | తేజోమూర్తులు}}</noinclude> jrrf7cfimzmp2axpmazsu4rjrm2duhx పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/309 104 211757 555424 552128 2026-05-04T06:33:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 555424 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> దులకు నిజాం ప్రభుత్వంవారు వారెంట్ జారీ చేసిరి. అప్పుడు వీరు బెజవాడ సరిహద్దుల్లో ఉండి నైజాం ప్రభుత్వము నకు విరుద్ధంగా పనిచేసిరి. వీరు హైదరాబాదు పట్టణ కాంగ్రెస్ సంఘమునకు కార్యదర్శిగాను, రాష్ట్ర కాంగ్రెస్ సంఘమునకు కోశాధ్యక్షులుగాను రెండు సంవత్సరములు పనిచేసిరి. హైదరాబాదు పట్టణ పురపాలక సంఘంలో వీరు ఏడు సంవత్సరములు కౌన్సిలర్ గా ఉండిరి. తరువాత ఆం.ప్ర. రాష్ట్ర శాసనసభకు హిమాయత్ నగర్ నియోజక వర్గం నుండి వరుసగా రెండు పర్యాయములు శాసన సభ్యులు (ఎమ్.ఎల్.ఏ.)గా ఎన్నుకొనబడిరి. తన నియోజకవర్గము అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేసిరి. హైదరాబాదు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులుగా పదకొండు సం.లు. మరియు హైదరాబాదు నగర కాంగ్రెస్ సంఘము నకు అధ్యక్షులుగా ఎన్నుకొనబడిరి. శ్రీ సీతయ్య గుప్త గారు సాంఘిక, రాజకీయ వ్యవహారములందే గాక, సారస్వత విద్యారంగములందు కూడా సాటిలేని సేవలందించారు. హైదరాబాదు నందలి ఆంధ్రసారస్వత పరిషత్తురు వారు నాలుగు సంవత్సరములు కోశాధికారిగా ఉండిరి. ఆ సమయమున శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు, పులిజాల హనుమంతరావు గారు కార్యదర్శులుగా ఉండి తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి, చేసిరి. శ్రీ సీతయ్య గుప్త గారు తెలుగు భాషకు వలెనే హిందీ భాషకు కూడా ప్రాముఖ్యతనిచ్చి హైదరాబాదులో దక్షిణ హిందీ ప్రచార సభ స్థావించిన సభ్యులలో ఒకరు. హిందీ. ప్రచార సభకు శాశ్వత సభ్యులుగా ఎన్నుకోబడినారు. హిందీ ఆర్ట్స్ కళాశాల, కేశవ మెమోరియల్ ఉన్నత పాఠశాల, మహారాణిగంజ్లో ప్రాథమిక పాఠశాల వృద్ధికి కృషి చేస్తూ వివిధ పదవులను అలంకరించారు. శ్రీగుప్త గారు ధూల్ పేటలోని ప్రభాత్ హిందీ విద్యాలయమునకు అధ్యక్షులుగా ఉండిరి. ఈ విధముగా శ్రీ గుప్త గారు హైదరాబాదు నందలి పెక్కు విద్యా సంస్థలకును, గ్రంథాలయముబడును అందించిన సేవలు ప్రశంసనీయమైనవి. శ్రీ గుప్త గారు హైదరాబాదునందలి కాచిగూడలోని వైశ్య విద్యార్థి వసతిగృహ వ్యవస్థాపకులలో ప్రముఖులు. ఈ విద్యార్థి వసతి గృహమునకు పది సం.లు. ప్రధాన కార్యదర్శిగాను, పది సం.లు. అధ్యక్షులుగాను ఉండిరి. ఈ వైశ్య విద్యార్థి వసతిగృహ ట్రస్టు బోర్డుకు కూడా అధ్యక్షులుగా కొన్ని సం.లు. ఉండిరి. ఈ విద్యార్థి గృహమున కుల మత బేధము లేకుండా 300 మంది విద్యార్థులకు పైగా వసతి, భోజన సౌకర్యములు సమకూర్చుటకు కృషి చేసినారు. శ్రీ గుప్త గారు ఖైరతాబాదు నందలి వాసవీ సేవా కేంద్రమును 1971లో స్థాపించి దానికి అధ్యక్షునిగాను మరియు వాసవీ ఫౌండేషన్కు అధ్యక్షులుగా ఉండిరి. ఈ సంస్థ ఆధ్వర్యంలో మూడు సం.ల. బి.కామ్. ఆనర్సు తరగతులను నిర్వహించుచు పలువురి విద్యార్థులకు ఉపయోగపడునట్లుగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ & కామర్స్ కళాశాల స్థాపించి కార్యనిర్వాహక సంఘ అధ్యక్షులుగా ఉండి ఎనలేని సేవలందించారు. వైద్య రంగంలో ప్రజలకు సేవలందించే ఒక ఆశయంతో 1984లో వాసవీ మెడికల్ & రీసెర్చ్ సెంటర్ అను ట్రస్టును నెలకొల్పి దీనికి 2000 చదరపు గజాల స్థలమును కేటాయించిన ఘనత వారికి దక్కింది. ఈ సెంటర్లో హాస్పిటల్ నిర్మించి అన్నిరకాల వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచింది. ఈ సెంటర్లో ఎక్స్రే మొదలుకొని అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 1982లో వాసవీ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంకును స్థాపించారు. దానికి రెండు పర్యాయములు చైర్మన్ గా, పొట్టి శ్రీరాములు స్మారక సమితి, ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక సమితికి కార్యకర్తగా ఉండి ఆ మహనీయుని స్మారక సభలను ఘనంగా నిర్వహించారు. ఈ విధంగా శ్రీ గుప్తగారు పెక్కు రాజకీయ, సాంఘిక, విద్యా, సారస్వత గ్రంథాలయ సంస్థలయందు కార్యదర్శులు గానో, అధ్యక్షులుగానో, సభ్యులుగానో, ప్రముఖ స్థానములను అలంకరించుకుని వాటి నిరంతర అభ్యుద యమునకు కృషిచేశారు. మహిళల అభివృద్ధి కొరకు మహిళా సంఘాలను ఏర్పరచుటయేగాక కాచిగూడలో వైశ్యవిద్యార్ధిని (బాలికలు) వసతిగృహమును స్థాపించి సకల సౌకర్యములన్నింటినీ కల్పించారు. అలాగే వైశ్యజాతిలో కవులను ఒక దగ్గరకు చేర్చుటకు “వాసవీ సాహిత్య పరిషత్తు' 13-7-1977లో ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని కవులను, రచయితలను, కళా<noinclude><references/> {{rh|తెలంగాణ |288 | తేజోమూర్తులు}}</noinclude> tn1v5jjg8ea9h7g2x0vgh2kxh1g8fnt పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/310 104 211758 555425 552129 2026-05-04T06:33:43Z A.Murali 3019 555425 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>కారులను, పండితులను సంఘటితపరచి తెలుగు భాషను అభివృద్ధిపరచుటయే పరిషత్తు యొక్క ముఖ్య ఉద్దే కమన్నారు. ఈ సంస్థకు శ్రీ సీతయ్య గుప్త గారు గౌరవ అధ్యక్షులుగా ఉండి ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతయ్య గారు దళిత పక్షపాతి. అందుకే వీరు హైదరాబాదులోని బోరబండ గ్రామంలో "కొత్తూరి సీతయ్య నగర్" అని నామకరణం చేసి అనేకమంది హమాలీలకు గృహనిర్మాణం చేయించి సమాజంలో సేవాజ్యోతిగా నిలిచారు. ఆయన 87వ యేట శ్రీ ఈశ్వర నామ సం.ర శ్రావణ శుద్ధ పాడ్యమి, సోమవారం 04-08-1997లో తనువు చాలించారు. వారి స్ఫూర్తి మనందరిని ముందుకు నడిపిస్తుందని విశ్వసిస్తున్నాము. శ్రీ సీతయ్య గుప్తగారు త్రికరణశుద్ధిగల మానవతా మూర్తులు. దీనార్త జనులన్నా వారికి సానుభూతి మెండు. వారు ఏ పని చేపట్టినా దానిని అత్యంత సమర్థతతో హృదయపూర్వకంగా నిర్వహించుటకు ప్రయత్నించేవారు. కార్యదక్షతవలనే వారు చేపట్టిన పనులు చాలా గొప్పగా నిర్వహించారు. వారి జీవితంలో వారి ఆశయాలను సమర్థంగా నెరవేర్చారు. శ్రీ సీతయ్య గుప్త వారికి 'సర్దార్' 'వైక్కరత్న' 'సేవారత్న' మొదలగు బిరుదులు ప్రముఖ సంస్థల నుండి స్వీకరించారు. శ్రీ సీతయ్య గారు తెలుగు, హిందీ భాషలయందు గంటల తరబడి చాలా చక్కగా ఉపన్యాసం చేసేవారు. వీరు ధర్మమార్గ పరాయణులు, క్రమశిక్షణ పరాయణులు, దయామయులు, విద్యాసంపన్నులు, వినయమూర్తులు.. అందుచేతనే వారు హైదరాబాదు నగర పుర ప్రముఖులలో నాకరై తమ కులమువారి చేతనే గాక, అన్యులచేత కూడా ప్రశంసింపబడిరి. వారి హృదయాలలో స్థిరంగా నిలిచిపోయారు. వారు స్థాపించిన, నిర్వహించిన సంస్థలన్నీ 'మూడు పువ్వులు, ఆరు కాయలు'గా విరాజిల్లుతున్నాయి. అవి నేటి యువత, నేటితరం ఆస్వాదించుతున్నారు. తెలంగాణ (289) తేజోమూర్తులు ban<noinclude><references/> {{rh|తెలంగాణ |289 | తేజోమూర్తులు}}</noinclude> 6ehl6v43b2d3p0uhrzz20upl1i68w73 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/278 104 212723 555401 554960 2026-05-03T12:55:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555401 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>వసురుద్రాదిత్యాదిమరుద్విశేషంబులు, నశేషనిగమంబులు, నఖిల<ref>క. శుద్ధాంత, చ.ట. సిద్ధాంత</ref>సిద్ధాంతంబులు, సమస్తతీర్థసార్థంబులు, సకలమంత్రరహస్యంబులు, సర్వ<ref>క. గంధర్వస్వరసారస్యం, చ.ట. గాంధర్వసర్వస్వం</ref>గాంధర్వసర్వస్వంబులు, విశ్వవిశ్వాధికైశ్వర్యంబులు, సనశ్వరసంపదలం బొదలి సేవింపఁ బెంపు మెఱసి యుండె నని వెండియుఁ <ref>ట. పుండరీకుం</ref>గుండలికుండలుం డిట్లనియె.</poem>|ref=118}} '''టీక'''. శ్రీవత్సలాంఛనుఁడు = విష్ణువు; మెఱుంగు...దొర = మెఱయుచున్న వస్త్రమును ధరించిన గొల్లరాజు - శ్రీకృష్ణుఁడు; కర...శుక్తియున్ = చేతియం దున్న విచిత్రమైన సంచియు శంఖమును కలవాఁడును; విరచితవినతముక్తియున్ = కూర్చఁబడిన నమ్రుల మోక్షము కలవాఁడును; కుటిల...వికరుండును = వంగినవియు, మృదువైనవియు, నల్లనివియు నగు తలవెండ్రుకలు కలవాఁడును; కటి...యుగళుండును = మొలపై నుంచిన స్తంభములవంటి రెండు భుజములు కలవాఁడును; చటుల...నిగళుండును = క్రూరులైన రాక్షసుల మెడలకు సంకెల అయినవాఁడును; క్షుల్లకా...ద్వయుండును = చిన్నచిక్కపుకూడికచే (జాలెసంచిని కట్టుకొనుటచే) ఇంపయిన మెత్తని రెండు తొడలును కలవాఁడును; అద్వయుండును = తనకు రెండవది లేనివాఁడును; అనూనుండును = తక్కువ కానివాఁడును - గొప్పవాఁడును; అఖండవిగ్రహుండును = శాశ్వతజ్ఞానానందస్వరూపుఁడును; విగళితజగన్నిగ్రహుండును = నశింపఁజేయఁబడిన లోకభయము కలవాడును; పంచాబ్దంబును = ఐదేండ్లవయస్సు కలదియు; పంచ...సరసంబును = వేయిమంది మన్మథుల నతిక్రమించిన చక్కఁదనముచే ఇంపైనదియును; ఇచ్ఛాదిగంబరంబును = కోరి వస్త్రమును విడిచినదియు; ప్రాయంబు = వయస్సు; నవ...ప్రాయంబును = నవరత్నములప్రోఁగు అను కొండకు చరియవంటిదియు; బాహ్యా...విసృష్టంబు = బయటను, లోపలను ఎనిమిది ద్వారములచే విడువఁబడినదియు - (ద్వారాష్టకవిశిష్టంబు - అని యుండునేమో?) - ఎనిమిది ద్వారములు కలదియు; అదభ్రంబున్ = గొప్పదియు; అభ్రంకషంబున్ = ఆకాశము నంటుచున్నదియు; మహాప్రాసాదంబునందున్ = గొప్పసౌధమునందు; వాసవ...పింజరీకృతంబు — వాసవ = ఇంద్రుఁడు; వైశ్రవణ = కుబేరుఁడు; వైవస్వత = యముఁడు; ప్రముఖ = మొదలైన; మఖభున్ = దేవతలయొక్క; అలఘుకిరీట = గొప్పకిరీటములందలి; మణిగణ = మణులసమూహముయొక్క; ఘృణిమంజరీపింజరీకృతంబు = కాంతిసమూహముచే ఎఱుపు కలిసిన పసుపువన్నె కలదిగాఁ జేయఁబడినది; చరణ...మతల్లియై = రెండుకాళ్లనడుమ నిఱికించిన సన్ననిగొప్పనెలకోల (పశువులను త్రోలెడి కఱ్ఱ) కలవాఁడయి; భువన...వల్లియున్ = మూఁడులోకములకు కోరినకోరికల నిచ్చుటకు కల్పవృక్షమును; ఆకృతి = ఆకారము; అవికృతిభావంబునన్ = వికారము లేనట్లు - సహజముగా; అంగీకృతాధ్యాసీనుండై = అంగీకరింపఁబడిన ఉనికి కలవాఁడై - స్థిరముగా కూర్చున్నవాఁడై ; వ్యూహములు = గుంపులు; మరుద్విశేషంబులు = దేవతలు; అశేషనిగమంబులు = సమస్తవేదములు; సార్థంబులు = సమూహములు; సర్వ...సర్వస్వంబులు = సమస్తసంగీతసంపదలు; అనశ్వరసంపదలు = నాశములేని (స్థిరమైన) సంపదలు; కుండలికుండలుండు = పాము కుండలముగాఁ గల శివుఁడు. {{Telugu poem|type=క.|lines=<poem>నారద! ధృతహేమరసా, సారచ్ఛురితంబు విష్ణుసదనం బది వే దీరచితారాత్రికతతి, భూరమణీమణికిరీటముం <ref>చ. బురణించున్</ref>బురుడించున్.</poem>|ref=119}} '''టీక'''. ధృత...చ్ఛురితంబు = ధరింపఁబడిన బంగారురసప్రవాహముచే పూయఁబడినది - బంగారుపూత కలదనుట; విష్ణుసదనంబు = విష్ణునియిల్లు - దేవాలయము; వేధీరచితారాత్రికతతి =<noinclude><references/></noinclude> okk0kllexilhz6rqv4btgfjvx0poi6b పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/279 104 212724 555409 554961 2026-05-03T13:48:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555409 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తిన్నెపైఁ గూర్పఁబడిన హారతులగుంపు కలది; భూ...కిరీటమున్ = భూమియను స్త్రీయొక్క మణికిరీటమును; పురుడించున్ = అనుకరించును. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>అల తీర్థస్థలిక్షేత్ర, స్థలి లీలావిగ్రహద్వితీయయుతుఁడై భా సిలు పౌండరీకవల్లభుఁ, దలఁచినఁ గనుగొన్నఁగరగతము లిహపరముల్.</poem>|ref=120}} '''టీక'''. పౌండరీకవల్లభున్ = పుండరీకుని క్షేత్రమునకు ప్రభువగు శ్రీవిష్ణుని; కరగతములు = చేతికి చిక్కినది. {{Telugu poem|type=క.|lines=<poem>వినఁబడఁడు చెవులఁ గన్నులఁ, గనఁబడఁ డత్యుగ్రనారకవ్యథచేతన్ బొనుఁగుపడి జడియు వైష్ణవుఁ, డనవధిదురితప్రవర్తి యయ్యుఁ గుమారా!</poem>|ref=121}} '''టీక'''. అత్యుగ్ర...చేతన్ = మిక్కిలి భయంకరమగు నరకలోకమందలి బాధచేత; పొనుఁగుబడి = తేజోవిహీనుఁడయి; జడియు = తొలఁగునట్టి; వైష్ణవుఁడు = విష్ణుభక్తుఁడు; అనవధిదురితప్రవర్తి యయ్యున్ = హద్దులేని పాపముల నాచరించినవాఁ డయినను. {{Telugu poem|type=చ.|lines=<poem>ఇరుగడలం ద్విరూపములఁ గృష్ణుఁడు దైత్యనిరాకరిష్ణుఁ డ ప్పరుసున నుండ నన్నడిమిభాగమునందు వసింతు రెవ్వ రా నరులు మనుష్యరూపభరణంబునఁ క్రీడ యొనర్చు యక్షకి న్నరగరుడోరగద్యుచరనాథులుగాఁ గొని మ్రొక్కఁగాఁ దగున్.</poem>|ref=122}} '''టీక'''. ఇరుగడలన్ = తూర్పు, పడమరలు రెండుదిక్కులందును; దైత్యనిరాకరిష్ణుఁడు = రాక్షసులను తిరస్కరించువాఁడు - విష్ణువు; అప్పరుసునన్ = ఆరీతిని. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఎయ్యది దివ్యసేవ్యతర మెయ్యది మౌనిమనో౽భిగమ్యమౌ నెయ్యది నీవు నేను భజియింపఁగ నింపగు నెల్లనాఁడు నా దయ్యపువెల్గు సుమ్ము సతతస్థితి వెల్గెడుఁ <ref>క. పుండ</ref>బుండరీకవా గ్ధాయ్యలఁ బ్రజ్వరిల్లుచు జగత్త్రయదుష్కృతదాహదక్షమై.</poem>|ref=123}} '''టీక'''. మౌనిమనో౽భిగమ్యము = మునుల మనస్సులచే పొందఁదగినది; దయ్యపువెల్గు = దివ్యజ్యోతి; సతతస్థితిన్ = శాశ్వతముగా; పుండరీకవాగ్ధాయ్యలన్ = పుండరీకమునియొక్క మాటలనెడి హోమసాధకఋక్కులచేత; జగత్...దక్షమై = ముల్లోకముల పాపములను దహించుటకు సమర్థమై. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=మ.|lines=<poem>అలసంబుల్ మునిరాట్ప్రణీతములు ప్రాయశ్చిత్తముల్ పాతకం బుల నిర్జింపఁగ; విష్ణుభక్తియు తగున్ బో దానికిం బూనఁ; బా ములపల్గాటులు చీరలం దుడిచినం బోనేర్చునే మాంత్రికా కలితాహిప్రతివీరమంత్రపదరేఖాశ్లాఘచేతంబలెన్.</poem>|ref=124}} '''టీక'''. పాతకంబులన్ = పాపములను; నిర్జింపఁగన్ = జయించుటకు - నశింపఁజేయుటకు; మునిరాట్ప్రణీతములు = గొప్పమునులు ఏర్పఱచినవైన; అలసంబుల్ = మాంద్యము గలవి - అసమర్థములు; దానికిన్ = ఆపాపనాశనమునకు; తగున్, పో = తగియున్నదికదా! మాంత్రిక...బలెన్ = మంత్రగాండ్రు వేసిన విషము నశింపఁజేయు మంత్రపదముల ఉచ్చారణచేతవలె; పాముల పల్గాటులు = పాముల దంతములకాటులు; పోనేర్చునే? '''అలం'''. దృష్టాంతము.<noinclude><references/></noinclude> oebxxo1r0owqx2duoo8kjyeahwji0pz పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/280 104 212725 555410 554962 2026-05-03T21:34:49Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555410 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>జగదధిష్టానంబు సచ్చిదానందాత్మకము <ref>చ. నందాంగకము</ref>నందనందనాత్మకము క్షేత్ర తీర్థస్థితము పృథగ్దీపితంబు నృసింహరామమత్స్యాదివిగ్రహము లెట్టి యవి యనఁదగియుండు నట్టిద యగు దాని <ref>చ. ద్వైతి, ట. హైతి. క. హేతి</ref>హైతుకు లఘతమఃప్రోతమతులు గాంచి యర్చలయం దొకటిగాఁగఁ దలఁచి వికత్థనం బొనరించి గరుసు లేక</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>రౌరవంబుల డింది పారంబు లేక, వనరుతురు; గాని విజ్ఞానవంతులైన వారు శిలగాఁగఁ దలఁచ రెవ్వారు దృష్టి, గోచరబ్రహ్మ మని చూచి కొలిచియునికి.</poem>|ref=125}} '''టీక'''. జగదధిష్ఠానంబు = జగత్తు స్థానము గాఁగలది - జగమంతటను వ్యాపించినది; సచ్చిదానందాత్మకము = సత్తు, చిత్తుల స్వరూపము ఆనందముగాఁ గలది; పృథగ్దీపితంబు = వేఱుగా ప్రకాశించునది; అఘ...మతులు = పాపములను చీఁకట్లచే కుట్టబడిన (ఆక్రమించఁబడిన) బుద్ధికలవారు - జ్ఞానహీనులు; హేతుకులు = హేతువాదులు [పూర్వటీకలో 'హేతికులు = ఆయుధములు పూనినవారు' అని కలదు; ఆ మూలము, వ్యాఖ్యానమును అసంగతములు.]; వికత్థనంబు = లేనిపోనిపొగడ్త; గరుసు = హద్దు; డింది = మునిగి; పారంబు = అంతము; వనరుదురు = దుఃఖింతురు; శిలగాఁగన్ = ఱాతినిఁగా; దృష్టిగోచరబ్రహ్మము = కనుల కగపడుచున్న పరమాత్మ. {{Telugu poem|type=శా.|lines=<poem>ఆ వాణీరమణుండు ప్రార్థనము సేయన్ దేవకీదేవియం దావిర్భానము నొంది యేరికి నలభ్యంబైన<ref>ట. సేవన్</ref>ఠేవన్ జగ జ్జీవాతుస్థితి నుండు నిండుదొర విస్మేరాననున్ నిత్యసం సేవం దెల్చు జితేంద్రియుండు తమముం జించుం గనుం దత్త్వమున్.</poem>|ref=126}} '''టీక'''. వాణీరమణుండు = బ్రహ్మ; ఆవిర్భావమును, ఒంది = జనించి; ఠేవన్ = సొబగుతో; ['ఠేవన్ = విధమున' అని పూర్వటీక.] జగజ్జీవాతుస్థితిన్ = లోకము నుజ్జీవింపఁజేయు జీవనౌషధవిధమున; నిండుదొరన్ = పరిపూర్ణుని; విస్మేరాననున్ = చిరునవ్వుతో గూడిన ముఖము కలవానిని; నిత్యసంసేవన్ = సదా - నిత్యము సేవించుటచే, తెల్బు = తృప్తి పొందించు; స్తుతించునట్టి; తమమున్ = అజ్ఞానమును; చించున్ = చెదరఁగొట్టును - నశింపఁజేయును. {{Telugu poem|type=తే.|lines=<poem>భక్తిగద్గదరీతివాగ్భరము <ref>చ. లొలియ</ref>లొలయ, నటనమునఁ <ref>చ. ట. గూడ</ref>గూడి గోపికానాథుమ్రోల నిలిచి కీర్తించుపుణ్యుండు నళిన<ref>చ. బంధ</ref>బంధు, దళన మొనరించి తత్త్వపదమున కరుగు.</poem>|ref=127}} '''టీక'''. భక్తి...రీతిన్ = భక్తిచే గొంతుక హీనమగురీతిని; వాగ్భరములు = మాటలు - స్తుతులు; ఒలయన్; నటనమునన్ = నాట్యమునందు; నళినబంధుదళనము, ఒనరించి = సూర్యుని భేదించుట నొనర్చి - సూర్యమండలమును బ్రవేశించి [ముక్తులయాత్మ సూర్యమండలమును భేదించుకొని విరజానదిని దాఁటి పిదప బ్రహ్మపదమును పొందునని శ్రుతి.] {{Telugu poem|type=క.|lines=<poem>హరి సోపహారు లక్ష్మీ, శ్వరు నెవ్వరు చూతు రట్టివారలు సకలా మరపూజ్యులు; వారందునఁ, బొరసిన పుణ్యము లగణ్యములు గుణజలధీ!</poem>|ref=128}} '''టీక'''. సోపహారున్ = కానుకతోఁ గూడినవానిని [ఏదేని కానుక నిచ్చి, హరిని జూడవలెనని భావము.]; పొరసిన = పొంది; అగణ్యములు = లెక్కలేనివి. {{Telugu poem|type=క.|lines=<poem>ఇతిహాసపురాణకథా, <ref>చ. స్మృతి శ్రుతు</ref>శ్రుతిస్మృతులు నందగోపసుతుకట్టెదురన్ సతతము పఠియించు మహా, మతి పరమపదంబు నందు మతిమన్ముఖ్యా!</poem>|ref=129}}<noinclude><references/></noinclude> prpx536621fijamdt30qorj3v9jih47 555411 555410 2026-05-03T21:39:52Z దేవీప్రసాదశాస్త్రి 4290 555411 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>జగదధిష్టానంబు సచ్చిదానందాత్మకము <ref>చ. నందాంగకము</ref>నందనందనాత్మకము క్షేత్ర తీర్థస్థితము పృథగ్దీపితంబు నృసింహరామమత్స్యాదివిగ్రహము లెట్టి యవి యనఁదగియుండు నట్టిద యగు దాని <ref>చ. ద్వైతి, ట. హైతి. క. హేతి</ref>హైతుకు లఘతమఃప్రోతమతులు గాంచి యర్చలయం దొకటిగాఁగఁ దలఁచి వికత్థనం బొనరించి గరుసు లేక</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>రౌరవంబుల డింది పారంబు లేక, వనరుతురు; గాని విజ్ఞానవంతులైన వారు శిలగాఁగఁ దలఁచ రెవ్వారు దృష్టి, గోచరబ్రహ్మ మని చూచి కొలిచియునికి.</poem>|ref=125}} '''టీక'''. జగదధిష్ఠానంబు = జగత్తు స్థానముగాఁ గలది - జగమంతటను వ్యాపించినది; సచ్చిదానందాత్మకము = సత్తు, చిత్తుల స్వరూపము ఆనందముగాఁ గలది; పృథగ్దీపితంబు = వేఱుగా ప్రకాశించునది; అఘ...మతులు = పాపములను చీఁకట్లచే కుట్టబడిన (ఆక్రమించఁబడిన) బుద్ధికలవారు - జ్ఞానహీనులు; హేతుకులు = హేతువాదులు [పూర్వటీకలో 'హేతికులు = ఆయుధములు పూనినవారు' అని కలదు; ఆ మూలము, వ్యాఖ్యానమును అసంగతములు.]; వికత్థనంబు = లేనిపోనిపొగడ్త; గరుసు = హద్దు; డింది = మునిగి; పారంబు = అంతము; వనరుదురు = దుఃఖింతురు; శిలగాఁగన్ = ఱాతినిఁగా; దృష్టిగోచరబ్రహ్మము = కనుల కగపడుచున్న పరమాత్మ. {{Telugu poem|type=శా.|lines=<poem>ఆ వాణీరమణుండు ప్రార్థనము సేయన్ దేవకీదేవియం దావిర్భానము నొంది యేరికి నలభ్యంబైన<ref>ట. సేవన్</ref>ఠేవన్ జగ జ్జీవాతుస్థితి నుండు నిండుదొర విస్మేరాననున్ నిత్యసం సేవం దెల్చు జితేంద్రియుండు తమముం జించుం గనుం దత్త్వమున్.</poem>|ref=126}} '''టీక'''. వాణీరమణుండు = బ్రహ్మ; ఆవిర్భావమును, ఒంది = జనించి; ఠేవన్ = సొబగుతో; ['ఠేవన్ = విధమున' అని పూర్వటీక.] జగజ్జీవాతుస్థితిన్ = లోకము నుజ్జీవింపఁజేయు జీవనౌషధవిధమున; నిండుదొరన్ = పరిపూర్ణుని; విస్మేరాననున్ = చిరునవ్వుతో గూడిన ముఖము కలవానిని; నిత్యసంసేవన్ = సదా - నిత్యము సేవించుటచే, తెల్బు = తృప్తి పొందించు; స్తుతించునట్టి; తమమున్ = అజ్ఞానమును; చించున్ = చెదరఁగొట్టును - నశింపఁజేయును. {{Telugu poem|type=తే.|lines=<poem>భక్తిగద్గదరీతివాగ్భరము <ref>చ. లొలియ</ref>లొలయ, నటనమునఁ <ref>చ. ట. గూడ</ref>గూడి గోపికానాథుమ్రోల నిలిచి కీర్తించుపుణ్యుండు నళిన<ref>చ. బంధ</ref>బంధు, దళన మొనరించి తత్త్వపదమున కరుగు.</poem>|ref=127}} '''టీక'''. భక్తి...రీతిన్ = భక్తిచే గొంతుక హీనమగురీతిని; వాగ్భరములు = మాటలు - స్తుతులు; ఒలయన్; నటనమునన్ = నాట్యమునందు; నళినబంధుదళనము, ఒనరించి = సూర్యుని భేదించుట నొనర్చి - సూర్యమండలమును బ్రవేశించి [ముక్తులయాత్మ సూర్యమండలమును భేదించుకొని విరజానదిని దాఁటి పిదప బ్రహ్మపదమును పొందునని శ్రుతి.] {{Telugu poem|type=క.|lines=<poem>హరి సోపహారు లక్ష్మీ, శ్వరు నెవ్వరు చూతు రట్టివారలు సకలా మరపూజ్యులు; వారందునఁ, బొరసిన పుణ్యము లగణ్యములు గుణజలధీ!</poem>|ref=128}} '''టీక'''. సోపహారున్ = కానుకతోఁ గూడినవానిని [ఏదేని కానుక నిచ్చి, హరిని జూడవలెనని భావము.]; పొరసిన = పొంది; అగణ్యములు = లెక్కలేనివి. {{Telugu poem|type=క.|lines=<poem>ఇతిహాసపురాణకథా, <ref>చ. స్మృతి శ్రుతు</ref>శ్రుతిస్మృతులు నందగోపసుతుకట్టెదురన్ సతతము పఠియించు మహా, మతి పరమపదంబు నందు మతిమన్ముఖ్యా!</poem>|ref=129}}<noinclude><references/></noinclude> 076p6fasoo05ugnwknyvv1uff50sbee 555412 555411 2026-05-03T21:46:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 555412 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>జగదధిష్టానంబు సచ్చిదానందాత్మకము <ref>చ. నందాంగకము</ref>నందనందనాత్మకము క్షేత్ర తీర్థస్థితము పృథగ్దీపితంబు నృసింహరామమత్స్యాదివిగ్రహము లెట్టి యవి యనఁదగియుండు నట్టిద యగు దాని <ref>చ. ద్వైతి, ట. హైతి. క. హేతి</ref>హైతుకు లఘతమఃప్రోతమతులు గాంచి యర్చలయం దొకటిగాఁగఁ దలఁచి వికత్థనం బొనరించి గరుసు లేక</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>రౌరవంబుల డింది పారంబు లేక, వనరుదురు; గాని విజ్ఞానవంతులైన వారు శిలగాఁగఁ దలఁచ రెవ్వారు దృష్టి, గోచరబ్రహ్మ మని చూచి కొలిచియునికి.</poem>|ref=125}} '''టీక'''. జగదధిష్ఠానంబు = జగత్తు స్థానముగాఁ గలది - జగమంతటను వ్యాపించినది; సచ్చిదానందాత్మకము = సత్తు, చిత్తుల స్వరూపము ఆనందముగాఁ గలది; పృథగ్దీపితంబు = వేఱుగా ప్రకాశించునది; అఘ...మతులు = పాపములను చీఁకట్లచే కుట్టబడిన (ఆక్రమించఁబడిన) బుద్ధికలవారు - జ్ఞానహీనులు; హేతుకులు = హేతువాదులు [పూర్వటీకలో 'హేతికులు = ఆయుధములు పూనినవారు' అని కలదు; ఆ మూలము, వ్యాఖ్యానమును అసంగతములు.]; వికత్థనంబు = లేనిపోనిపొగడ్త; గరుసు = హద్దు; డింది = మునిగి; పారంబు = అంతము; వనరుదురు = దుఃఖింతురు; శిలగాఁగన్ = ఱాతినిఁగా; దృష్టిగోచరబ్రహ్మము = కనుల కగపడుచున్న పరమాత్మ. {{Telugu poem|type=శా.|lines=<poem>ఆ వాణీరమణుండు ప్రార్థనము సేయన్ దేవకీదేవియం దావిర్భానము నొంది యేరికి నలభ్యంబైన<ref>ట. సేవన్</ref>ఠేవన్ జగ జ్జీవాతుస్థితి నుండు నిండుదొర విస్మేరాననున్ నిత్యసం సేవం దెల్చు జితేంద్రియుండు తమముం జించుం గనుం దత్త్వమున్.</poem>|ref=126}} '''టీక'''. వాణీరమణుండు = బ్రహ్మ; ఆవిర్భావమును, ఒంది = జనించి; ఠేవన్ = సొబగుతో; ['ఠేవన్ = విధమున' అని పూర్వటీక.] జగజ్జీవాతుస్థితిన్ = లోకము నుజ్జీవింపఁజేయు జీవనౌషధవిధమున; నిండుదొరన్ = పరిపూర్ణుని; విస్మేరాననున్ = చిరునవ్వుతో గూడిన ముఖము కలవానిని; నిత్యసంసేవన్ = సదా - నిత్యము సేవించుటచే, తెల్బు = తృప్తి పొందించు; స్తుతించునట్టి; తమమున్ = అజ్ఞానమును; చించున్ = చెదరఁగొట్టును - నశింపఁజేయును. {{Telugu poem|type=తే.|lines=<poem>భక్తిగద్గదరీతివాగ్భరము <ref>చ. లొలియ</ref>లొలయ, నటనమునఁ <ref>చ. ట. గూడ</ref>గూడి గోపికానాథుమ్రోల నిలిచి కీర్తించుపుణ్యుండు నళిన<ref>చ. బంధ</ref>బంధు, దళన మొనరించి తత్త్వపదమున కరుగు.</poem>|ref=127}} '''టీక'''. భక్తి...రీతిన్ = భక్తిచే గొంతుక హీనమగురీతిని; వాగ్భరములు = మాటలు - స్తుతులు; ఒలయన్; నటనమునన్ = నాట్యమునందు; నళినబంధుదళనము, ఒనరించి = సూర్యుని భేదించుట నొనర్చి - సూర్యమండలమును బ్రవేశించి [ముక్తులయాత్మ సూర్యమండలమును భేదించుకొని విరజానదిని దాఁటి పిదప బ్రహ్మపదమును పొందునని శ్రుతి.] {{Telugu poem|type=క.|lines=<poem>హరి సోపహారు లక్ష్మీ, శ్వరు నెవ్వరు చూతు రట్టివారలు సకలా మరపూజ్యులు; వారందునఁ, బొరసిన పుణ్యము లగణ్యములు గుణజలధీ!</poem>|ref=128}} '''టీక'''. సోపహారున్ = కానుకతోఁ గూడినవానిని [ఏదేని కానుక నిచ్చి, హరిని జూడవలెనని భావము.]; పొరసిన = పొంది; అగణ్యములు = లెక్కలేనివి. {{Telugu poem|type=క.|lines=<poem>ఇతిహాసపురాణకథా, <ref>చ. స్మృతి శ్రుతు</ref>శ్రుతిస్మృతులు నందగోపసుతుకట్టెదురన్ సతతము పఠియించు మహా, మతి పరమపదంబు నందు మతిమన్ముఖ్యా!</poem>|ref=129}}<noinclude><references/></noinclude> m39i4yvcshq93o9fcq8i1n9gaec0ss2 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/281 104 212726 555413 554963 2026-05-04T02:06:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555413 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. మతిమన్ముఖ్యా! = బుద్ధిమంతులలో ప్రధానుఁడా! పరమపదంబున్ = వైకుంఠమును; అందున్ = పొందును. {{Telugu poem|type=క.|lines=<poem>తీర్థమున నాడి బ్రహ్మా, భ్యర్థితలీలావతారు భక్తాధారున్ బార్థసఖుఁ గొల్వఁగల మో, క్షార్థులకున్ గలవు సచ్చిదానందంబుల్.</poem>|ref=130}} '''టీక'''. ఆడి = స్నానమాడి; బ్రహ్మాభ్యర్పితలీలావతారున్ = బ్రహ్మచే పూజింపఁబడిన విలాసార్థపుటవతారము కలవానిని; భక్తాధారున్ = భక్తులకు ఆధారమైనవానిని; పార్థసఖున్ = అర్జునుని మిత్రమును; సచ్చిదానందంబుల్ = శాశ్వతజ్ఞానసంతోషములు; కలవు = కల్గును. {{Telugu poem|type=సీ.|lines=<poem>భ్రూణహుండును సురాపుఁడు బ్రహ్మఘాతియు గురుతల్పగుఁ డుస్తేయి గోవధోప జీవి పితృద్రోహి శిశు<ref>క. హంతృ, చ. హంత</ref>హంత పరదార<ref>క. రతులు, చ. రతుఁడు</ref>రతుఁడు నిందకుఁడు సర్వస్వభోక్త <ref>క. సత్యరిక్తుండును, చ. సత్పరిత్యక్తుండు</ref>సత్పరిత్యక్తుండు సర్వాభిమర్శి <ref>క. హేతికుడు, చ. హైతికుడు</ref>హైతుకుఁడు సర్వాపలాపకుఁ డశుచియు నిజధర్మవిద్వేషి, నీచుండు పాషండషండప్రవణుఁడు స్వేచ్ఛావిహారి</poem>|ref=}} {{Telugu poem|type=|lines=<poem>కృత మెఱుంగనివాఁడు సూనృతము లేని వాఁడు నమ్మినఁ జెడఁ జూచువాఁడు మొదలు పాపకారులకేనియుఁ బౌండరీక తీర్థహరిమూర్తియుగ మిచ్చు దివ్యపదము.</poem>|ref=131}} '''టీక'''. భ్రూణహుండును = కడుపులోని పిండమును చంపినవాఁడును; సురాపుఁడున్ = మద్యమును త్రాగువాఁడును; బ్రహ్మఘాతియు = బ్రాహ్మణహత్య చేసినవాఁడును; గురు...రతుఁడు = గురుద్రోహి, బంగారము దొంగిలించినవాఁడు, గోవులను జంపి జీవించు కసాయివాఁడు, తలిదండ్రులకు ద్రోహము చేయువాఁడు, బిడ్డలను చంపువాఁడు, పరస్త్రీలయెడ ఇష్టము కలవాఁడు; నిందకుఁడు = ఇతరులను నిందించువాఁడు; సర్వస్వభోక్త = అందరిసొత్తును భుజించువాఁడు; సత్ఫరిత్యక్తుండు = మంచివారిచే వెలివేయఁబడిన(విడువఁబడిన)వాఁడు [పూర్వటీకలో 'సత్యరిక్తుండు = నిజము లేనివాఁడు' అని యున్నది]; సర్వాభిమర్శి = అందరిని విమర్శించువాఁడు ['అన్నింటి నంటువాఁడు' అని పూర్వటీక]; హైతుకుఁడు = హేతువాది; సర్వాపలాపకుఁడు = సర్వమును దాఁచుకొనువాఁడు; పాషండ...ప్రవణుఁడు = నాస్తికులగు పాషండులయందును, నపుంసకులందును అసక్తుఁడగువాఁడు; కృతము = చేసిన యుపకారమును; సూనృతము = సత్యము; పౌండరీక...యుగము = పౌండరీకక్షేత్రమున నున్న విష్ణువుయొక్క రెండుమూర్తులును; దివ్యపదమున్ = మోక్షమును; ఇచ్చున్. {{Telugu poem|type=చ.|lines=<poem>అలఁతిపిపాళినవ్వు మధురాధరబింబఫలంబు తమ్మిఱే కుల నగు సోగకన్నులు ప్రకుంచితకుంతలచారుఫాలమున్ బలుచనిచెక్కులం గలయఁ బర్విన కుండలరత్నకాంతులున్ గల శిఖిపింఛలాంఛనుమొగంబు గనందగు ధూపవేళలన్.</poem>|ref=132}} '''టీక'''. అలఁతిపిసాళినవ్వు = చిన్న, చక్కని నవ్వు; మధురా...ఫలంబు = దొండపండు వంటి మధురమగు పెదవి; ప్రకుంచిత...ఫాాలమున్ = మిక్కిలి వంగియున్న జుట్టుగల (వంకర ముంగురులు గల) నుదురును; కలయఁబర్విన = అన్నియెడలను వ్యాపించిన.<noinclude><references/></noinclude> iy0vbis97798vu1de0a2clb40gdxy5j 555414 555413 2026-05-04T02:10:19Z దేవీప్రసాదశాస్త్రి 4290 555414 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. మతిమన్ముఖ్యా! = బుద్ధిమంతులలో ప్రధానుఁడా! పరమపదంబున్ = వైకుంఠమును; అందున్ = పొందును. {{Telugu poem|type=క.|lines=<poem>తీర్థమున నాడి బ్రహ్మా, భ్యర్థితలీలావతారు భక్తాధారున్ బార్థసఖుఁ గొల్వఁగల మో, క్షార్థులకున్ గలవు సచ్చిదానందంబుల్.</poem>|ref=130}} '''టీక'''. ఆడి = స్నానమాడి; బ్రహ్మాభ్యర్పితలీలావతారున్ = బ్రహ్మచే పూజింపఁబడిన విలాసార్థపుటవతారము కలవానిని; భక్తాధారున్ = భక్తులకు ఆధారమైనవానిని; పార్థసఖున్ = అర్జునుని మిత్రమును; సచ్చిదానందంబుల్ = శాశ్వతజ్ఞానసంతోషములు; కలవు = కల్గును. {{Telugu poem|type=సీ.|lines=<poem>భ్రూణహుండును సురాపుఁడు బ్రహ్మఘాతియు గురుతల్పగుఁ డుస్తేయి గోవధోప జీవి పితృద్రోహి శిశు<ref>క. హంతృ, చ. హంత</ref>హంత పరదార<ref>క. రతులు, చ. రతుఁడు</ref>రతుఁడు నిందకుఁడు సర్వస్వభోక్త <ref>క. సత్యరిక్తుండును, చ. సత్పరిత్యక్తుండు</ref>సత్పరిత్యక్తుండు సర్వాభిమర్శి <ref>క. హేతికుడు, చ. హైతికుడు</ref>హైతుకుఁడు సర్వాపలాపకుఁ డశుచియు నిజధర్మవిద్వేషి, నీచుండు పాషండషండప్రవణుఁడు స్వేచ్ఛావిహారి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>కృత మెఱుంగనివాఁడు సూనృతము లేని వాఁడు నమ్మినఁ జెడఁ జూచువాఁడు మొదలు పాపకారులకేనియుఁ బౌండరీక తీర్థహరిమూర్తియుగ మిచ్చు దివ్యపదము.</poem>|ref=131}} '''టీక'''. భ్రూణహుండును = కడుపులోని పిండమును చంపినవాఁడును; సురాపుఁడున్ = మద్యమును త్రాగువాఁడును; బ్రహ్మఘాతియు = బ్రాహ్మణహత్య చేసినవాఁడును; గురు...రతుఁడు = గురుద్రోహి, బంగారము దొంగిలించినవాఁడు, గోవులను జంపి జీవించు కసాయివాఁడు, తలిదండ్రులకు ద్రోహము చేయువాఁడు, బిడ్డలను చంపువాఁడు, పరస్త్రీలయెడ ఇష్టము కలవాఁడు; నిందకుఁడు = ఇతరులను నిందించువాఁడు; సర్వస్వభోక్త = అందరిసొత్తును భుజించువాఁడు; సత్ఫరిత్యక్తుండు = మంచివారిచే వెలివేయఁబడిన(విడువఁబడిన)వాఁడు [పూర్వటీకలో 'సత్యరిక్తుండు = నిజము లేనివాఁడు' అని యున్నది]; సర్వాభిమర్శి = అందరిని విమర్శించువాఁడు ['అన్నింటి నంటువాఁడు' అని పూర్వటీక]; హైతుకుఁడు = హేతువాది; సర్వాపలాపకుఁడు = సర్వమును దాఁచుకొనువాఁడు; పాషండ...ప్రవణుఁడు = నాస్తికులగు పాషండులయందును, నపుంసకులందును అసక్తుఁడగువాఁడు; కృతము = చేసిన యుపకారమును; సూనృతము = సత్యము; పౌండరీక...యుగము = పౌండరీకక్షేత్రమున నున్న విష్ణువుయొక్క రెండుమూర్తులును; దివ్యపదమున్ = మోక్షమును; ఇచ్చున్. {{Telugu poem|type=చ.|lines=<poem>అలఁతిపిపాళినవ్వు మధురాధరబింబఫలంబు తమ్మిఱే కుల నగు సోగకన్నులు ప్రకుంచితకుంతలచారుఫాలమున్ బలుచనిచెక్కులం గలయఁ బర్విన కుండలరత్నకాంతులున్ గల శిఖిపింఛలాంఛనుమొగంబు గనందగు ధూపవేళలన్.</poem>|ref=132}} '''టీక'''. అలఁతిపిసాళినవ్వు = చిన్న, చక్కని నవ్వు; మధురా...ఫలంబు = దొండపండు వంటి మధురమగు పెదవి; ప్రకుంచిత...ఫాాలమున్ = మిక్కిలి వంగియున్న జుట్టుగల (వంకర ముంగురులు గల) నుదురును; కలయఁబర్విన = అన్నియెడలను వ్యాపించిన.<noinclude><references/></noinclude> 4b5fa36heqlli3sp4mn2ns2em92b6yy పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/282 104 212727 555415 554964 2026-05-04T03:36:43Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555415 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>క్షణము క్షణార్ధంబైనఁ ద్రీ, క్షణలలితం బగు పయోధిశయనువదన మీ క్షణ మొనరించు కృతికి నా, క్షణమునఁగల వఖిలసుకృతజాతఫలంబుల్.</poem>|ref=133}} '''టీక'''. క్షణార్ధంబు = క్షణములో సగము; త్రీక్షణలలితంబు = మూఁడు కన్నులతో అందముగనున్న (ఆక్షేత్రమున విష్ణునకు మూఁడుకన్నులు గలవనుట); పయోధిశయనువదనము = విష్ణునిముఖమును; ఈక్షణము, ఒనరించు = చూచు; కృతికిన్ = కృతార్థునకు. {{Telugu poem|type=సీ.|lines=<poem>మువ్వంకమురువుతో మురళి యొక్కొకవేళ మ్రోయించు భువనైకమోహనముగఁ గ్రీడించు నొకవేళఁ దోడిబాలురఁ గూడి యక్షీణగతిఁ గుబేరాక్షకేళి సవరించు నొకవేళ జలవిహారము చాలఁ బ్రేమ భీమరథీగభీరవారిఁ <ref>క. కొలువు</ref>గొలువుండు నొకవేళ నలినసంభవపుండ రీకాస్మదాదులు ప్రీతిఁ గొలువ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నురగరిపువాహనమున నొక్కొక్కవేళ వేడ్క వేంచేసి మెఱయుఁ దిర్వీథులందు నెన్నికల్పంబు లరిగిన <ref>క. యేన</ref>నేనయేండ్ల వెలయు ప్రాయంబుగలకొయ్య విట్ఠలయ్య.</poem>|ref=134}} '''టీక'''. మువ్వంకమురువుతోన్ = మూఁడు వంకలు వచ్చునట్లు నిలిచిన (త్రిభంగి) చక్కఁదనముతో; భువనైకమోహనముగ = లోకమునంతటిని మోహమున మునుఁగునట్లు; అక్షీణగతిన్ = గొప్పరీతిని; కుబేరాక్షకేళి = బాలక్రీడావిశేషమును - వెన్నెలకుప్పయాఁటను; సవరించున్ = చేయును; భీమరథీగభీరవారిన్ = భీమరథీనదియొక్క లోతైననీటియందు; ఉరగరిపువాహనమునన్ = గరుడవాహనముపయిని; ఏనయేండ్లన్ = ఐదేండ్లతోనే; కొయ్య = ఒకరికి లొంగనివాఁడు. {{Telugu poem|type=శా.|lines=<poem>శ్రీరంగంబున ద్వారకన్ గయఁ గురుక్షేత్రంబున న్నైమిశా ఖ్యారణ్యాంజనశైలపుష్కరమహేంద్రానంతశయ్యా హరి ద్వారశ్రీపురుషోత్తమంబుల నయోధ్యన్ సేతు <ref>క. గంగాభి, చ.ట. గంగాబ్ధి</ref>గంగాబ్ధిసం గారూఢస్థలిఁ బౌండరీకమున దైత్యారాతి యుండుం గడున్.</poem>|ref=135}} '''టీక'''. గంగా...స్థలిన్ = గంగాసాగరసంమగమున గొప్పదైనచోట; దైత్యారాతి = విష్ణువు. {{Telugu poem|type=క.|lines=<poem>హరియుత్తరభాగంబునఁ, బురుషుఁడు దాఁ బాపమైనఁ బుణ్యం బైనన్ సురకానియంత చేసినఁ, బరిణతమై మేరుకుధరభారముఁ జూపున్.</poem>|ref=136}} '''టీక'''. సురకాని = చిన్నకాని; పరిహితమై = మాఱి - వృద్ధి పొంది; మేరుకుధరభారమున్ = మేరువుపర్వతపు బరువును (ఎత్తును). '''అలం'''. ఉపమ. {{p|ac|fwb}}కాకము, హంస, చిలుక, పాము, తేనెటీగ, ఆవు మోక్షమునొందిన కథ</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>సమ్మార్జనమున ధ్వాంక్షము, నుపలేపనంబున మరాళము, రంగమున విచిత్ర శుకము, దీపాంకురప్రకటనంబునఁ బాము, పదపద్మతీర్థానుభవముకతన సరఘయు, నూధస్యపరిషేచనంబున ధేనువు మోక్షంబుతెరువు <ref>చ. గలిగి</ref>గనియెఁ గాన నేతత్పరికల్పనంబునఁ బాండురంగాధినాథుఁ జేరంగవలయు</poem>|ref=}}<noinclude><references/></noinclude> ta80fpfdn490j9e96y15gr6puba7d3l 555416 555415 2026-05-04T03:38:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 555416 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>క్షణము క్షణార్ధంబైనఁ ద్రీ, క్షణలలితం బగు పయోధిశయనువదన మీ క్షణ మొనరించు కృతికి నా, క్షణమునఁగల వఖిలసుకృతజాతఫలంబుల్.</poem>|ref=133}} '''టీక'''. క్షణార్ధంబు = క్షణములో సగము; త్రీక్షణలలితంబు = మూఁడు కన్నులతో అందముగనున్న (ఆక్షేత్రమున విష్ణునకు మూఁడుకన్నులు గలవనుట); పయోధిశయనువదనము = విష్ణునిముఖమును; ఈక్షణము, ఒనరించు = చూచు; కృతికిన్ = కృతార్థునకు. {{Telugu poem|type=సీ.|lines=<poem>మువ్వంకమురువుతో మురళి యొక్కొకవేళ మ్రోయించు భువనైకమోహనముగఁ గ్రీడించు నొకవేళఁ దోడిబాలురఁ గూడి యక్షీణగతిఁ గుబేరాక్షకేళి సవరించు నొకవేళ జలవిహారము చాలఁ బ్రేమ భీమరథీగభీరవారిఁ <ref>క. కొలువు</ref>గొలువుండు నొకవేళ నలినసంభవపుండ రీకాస్మదాదులు ప్రీతిఁ గొలువ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నురగరిపువాహనమున నొక్కొక్కవేళ వేడ్క వేంచేసి మెఱయుఁ దిర్వీథులందు నెన్నికల్పంబు లరిగిన <ref>క. యేన</ref>నేనయేండ్ల వెలయు ప్రాయంబుగలకొయ్య విట్ఠలయ్య.</poem>|ref=134}} '''టీక'''. మువ్వంకమురువుతోన్ = మూఁడు వంకలు వచ్చునట్లు నిలిచిన (త్రిభంగి) చక్కఁదనముతో; భువనైకమోహనముగ = లోకమునంతటిని మోహమున మునుఁగునట్లు; అక్షీణగతిన్ = గొప్పరీతిని; కుబేరాక్షకేళి = బాలక్రీడావిశేషమును - వెన్నెలకుప్పయాఁటను; సవరించున్ = చేయును; భీమరథీగభీరవారిన్ = భీమరథీనదియొక్క లోతైననీటియందు; ఉరగరిపువాహనమునన్ = గరుడవాహనముపయిని; ఏనయేండ్లన్ = ఐదేండ్లతోనే; కొయ్య = ఒకరికి లొంగనివాఁడు. {{Telugu poem|type=శా.|lines=<poem>శ్రీరంగంబున ద్వారకన్ గయఁ గురుక్షేత్రంబున న్నైమిశా ఖ్యారణ్యాంజనశైలపుష్కరమహేంద్రానంతశయ్యా హరి ద్వారశ్రీపురుషోత్తమంబుల నయోధ్యన్ సేతు <ref>క. గంగాభి, చ.ట. గంగాబ్ధి</ref>గంగాబ్ధిసం గారూఢస్థలిఁ బౌండరీకమున దైత్యారాతి యుండుం గడున్.</poem>|ref=135}} '''టీక'''. గంగా...స్థలిన్ = గంగాసాగరసంగమమున గొప్పదైనచోట; దైత్యారాతి = విష్ణువు. {{Telugu poem|type=క.|lines=<poem>హరియుత్తరభాగంబునఁ, బురుషుఁడు దాఁ బాపమైనఁ బుణ్యం బైనన్ సురకానియంత చేసినఁ, బరిణతమై మేరుకుధరభారముఁ జూపున్.</poem>|ref=136}} '''టీక'''. సురకాని = చిన్నకాని; పరిహితమై = మాఱి - వృద్ధి పొంది; మేరుకుధరభారమున్ = మేరువుపర్వతపు బరువును (ఎత్తును). '''అలం'''. ఉపమ. {{p|ac|fwb}}కాకము, హంస, చిలుక, పాము, తేనెటీగ, ఆవు మోక్షమునొందిన కథ</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>సమ్మార్జనమున ధ్వాంక్షము, నుపలేపనంబున మరాళము, రంగమున విచిత్ర శుకము, దీపాంకురప్రకటనంబునఁ బాము, పదపద్మతీర్థానుభవముకతన సరఘయు, నూధస్యపరిషేచనంబున ధేనువు మోక్షంబుతెరువు <ref>చ. గలిగి</ref>గనియెఁ గాన నేతత్పరికల్పనంబునఁ బాండురంగాధినాథుఁ జేరంగవలయు</poem>|ref=}}<noinclude><references/></noinclude> spbkvzpf2py13bcqq1ojmunj1skfkj4 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/283 104 212728 555417 554965 2026-05-04T05:10:22Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555417 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>ననిన నారదుఁ డిట్లను ‘నభవ! జ్ఞాన విరహితంబులు జడములు, వీని కెట్లు మనుజకృత్యంబు చేకూరె మధువిరోధి యెట్లు వరమిచ్చె’ నని వేఁడ నీశుఁ డనియె.</poem>|ref=137}} '''టీక'''. సమ్మార్జనము = తుడుచుట; ధ్వాంతము = కాకి; ఉపలేపనంబునన్ = అలుకుటవలన; మరాళము = హంస; రంగమున = ముగ్గువలన; విచిత్రశుకము = రంగురంగుల చిలుక; దీపాంకురప్రకటనంబునన్ = చిన్నదీపమును కలిగించుటచే; పద...కతనన్ = పద్మములవంటి పాదములవలని జలము ననుభవమువలన; సరఘయున్ = తేనెటీఁగయు; ఊధస్యపరిషేచనంబునన్ = పాలయభిషేకమువలన; ధేనువు = ఆవు; కనియెన్ = పొందినవి; అభవ! = శివా! మధువిరోధి = విష్ణువు. {{Telugu poem|type=ఉ.|lines=<poem>మూర్తిమదిక్షుకార్ముకసముజ్జ్వలకీర్తియుఁబోని చంద్రికా స్ఫూర్తి వెలుంగఁజేయుచు నభోవనకేసరి చంద్రుఁ డుబ్బఁగాఁ గార్తికపూర్ణిమన్ యదుశిఖామణి ము న్నొకనాఁడు చూళికా నర్తితపింఛగుచ్చలసనంబున భీమరథీతటంబునన్.</poem>|ref=138}} '''టీక'''. మూర్తిమత్....కీర్తియుఁబోని = రూపు ధరించిన మన్మథుని ప్రకాశించుకీర్తివలె; చంద్రికాస్ఫూర్తిన్ = వెన్నెలవెలుఁగును; నభోవనకేసరి = ఆకాశమను అడవికి సింహమైనవాఁడు; చూళికా...లసనంబునన్ = సిగజుట్టున నాట్యమాడు నెమలిపించెముతో మనోహరమగునట్లు. '''అలం'''. ఉపమ, రూపకము. {{Telugu poem|type=మ.|lines=<poem>సురలీలావతులున్ నరాంగనలు చక్షుశ్శ్రోత్రకన్యల్ స్మర జ్వరపీడాశయలై తనుంగొలువ రాసక్రీడఁ బెన్{{ZWNJ}}ప్రోడయై కరలీనోర్మిక లంగుళీచలనరింఖత్కాంతులై క్రాలఁగా మురళీనాదవినోదకేళిఁ దవిలెన్ మోదం <ref>క. బుసారంబు, చ. బసారంబు</ref>బసాదంబుగన్.</poem>|ref=139}} '''టీక'''. సురలీలావతులున్ = దేవతాస్త్రీలును; చక్షుశ్శ్రోత్రకన్యల్ = నాగకన్యకలు; స్మరజ్వరపీడాశయలై = మన్మథజ్వరముచే పీడింపఁబడిన హృదయములు కలవారై; <ref>క. పెన్{{ZWNJ}}బ్రోడ, చ. పెన్{{ZWNJ}}బ్రోడలై</ref>పెన్{{ZWNJ}}ప్రోడయై = గొప్పనేర్పరియై; కరలీనోర్మికలు = చేతులందలి యుంగరములు; అంగుళీ...కాంతులై = వ్రేళ్లు కదలుటచే చలించు కాంతులయి; క్రాలఁగాన్ = ప్రకాశింపఁగా; మోదంబు = సంతోషము; అసాదంబుగన్ = ఎక్కువ కాఁగా [‘సాదంబుగన్ = గతి కాఁగా’ అని ముద్రితప్రతియుఁ, దద్వ్యాఖ్యానమును]. {{Telugu poem|type=క.|lines=<poem>ఆనాదము <ref>క. దవ్వున, త. దద్వన</ref>తద్వనజగ, తీనివసన్మౌనిహోమధేను <ref>క. పుకటి, చ. వొకటి</ref>వొకటి సాం ద్రానంద మొదవ విని తన, మేను మఱచి కురిసె నపరిమితదుగ్ధంబుల్.</poem>|ref=140}} '''టీక'''. ఆనాదము = ఆధ్వని; తద్వన...ధేనువు = అచటివనమున నివసించుచున్న మునిహోమధేనువు; సాంద్రానందము, ఒదవన్ = అధికసంతోషము కలుగఁగా; అపరిమితదుగ్ధంబుల్ = ఎక్కువైన పాలు. {{Telugu poem|type=ఉ.|lines=<poem>కాననగంధవాహవశగం బగుటన్ వెస నొండు <ref>చ. దత్పయః</ref>తత్పయః ఫేనకణంబు వచ్చి మురభేదను మౌళి నలంకరించె; శ్రీ జానియుఁ బాటమాని నిజసౌధమునందు సుఖంచుచుండె; నా ధేనువు లెస్సఁగా ముదిసి దేహము నూడ్చి భవాంతరంబునన్.</poem>|ref=141}}<noinclude><references/></noinclude> 772zkmuk4qzicpl4hwtq95wkdmph7fr పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/284 104 212729 555418 554966 2026-05-04T05:51:55Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555418 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. కాననగంధవాహవశగంబు = అడవిలోని గాలికి స్వాధీనమైనది; తత్పయఃఫేనకణంబు = ఆ పాలనురుగుబిందువు; ఒండు = ఒకటి; మురభేదనుమౌళిన్ = విష్ణునితలను; శ్రీజాని = లక్ష్మీభర్త - విష్ణువు; ముదిసి = ముసలిదయి; దేహమును, ఊడ్చి = శరీరమును విడిచి; భవాంతరంబునన్ = వేఱొకజన్మమునందు. {{p|ac|fwb}}సుశీల యను పతివ్రత చరిత్రము</p> {{Telugu poem|type=క.|lines=<poem>హరిమౌళిపతితనిజదు, గ్ధరసోర్కరఫేనకణకృతపరమసుకృత స్ఫురణంబున నొకవైష్ణవ, వరునకుఁ దనుజాత యగుచు వసుధం బుట్టెన్.</poem>|ref=142}} '''టీక'''. హరి...స్ఫురణంబునన్ = విష్ణువుతలపై పడిన తన పాలనురుగుబిందువువలనఁ గలిగిన గొప్ప పుణ్యవిశేషమున; తనుజాత = పుత్రిక; వసుధన్ = భూమిపై. {{Telugu poem|type=వ.|lines=<poem>సుశీలాభిధాన యగు నబ్బాల గుణగణభాస్వరయై యథోచితకాలంబున.</poem>|ref=143}} '''టీక'''. సుశీలాభిధాన = సుశీల యను పేరు కలది; గుణగణభాస్వర = గుణసమూహముచేఁ బ్రకాశించునది; యథోచితకాలంబునన్ = తగిన సమయమున - యుక్తకాలమున. {{Telugu poem|type=ఉ.|lines=<poem>తాళి విభుండు గట్టినమొదల్ పతిదేవత యా సుశీల పెన్ గోలతనంబునన్ మగఁడు కొట్టినఁ దిట్టిన <ref>క. రట్టు చేసినన్, చ. నడ్డపెట్టినం, ట. రట్టు పెట్టినన్</ref>రట్టు పెట్టినన్ దాళి దినంబుఁ దచ్చరణతామరసంబులు గొల్చు నేలయున్ బోలునె యీపె కంచుఁ గృతబుద్ధులు <ref>చ. పెద్దలు</ref>వృద్ధులు ప్రస్తుతింపఁగన్.</poem>|ref=144}} '''టీక'''. విభుండు = భర్త; తాళి = మంగళసూత్రము; కట్టినమొదల్ - కట్టినది మొదలుకొని; పతిదేవత = భర్తయే దైవమని యెంచునది; పెన్{{ZWNJ}}గోలతనంబునన్ = పెద్ద అమాయకత్వమున; రట్టు పెట్టినన్ = అల్లరి పెట్టినను; తాళి = సహించి; దినంబున్ = ప్రతిదినమును; తచ్చరణతామరసంబులు = అతనిపాదపద్మములు; కృతబుద్ధులు = బుద్ధిమంతులు; ప్రస్తుతింపఁగన్ = కొనియాడఁగా. {{Telugu poem|type=సీ.|lines=<poem>రూపహీనుఁడు మహాక్రోధనుఁ డతిలోభి బద్ధమత్సరుఁ డన్యబుద్ధి మాయి చంచలస్వాంతుండు సకలబంధువిరోధి బహుళపథోక్తిలంపటుఁడు శఠుఁడు సంతతావిశ్వాససస్యప్రరోహుండు గర్వపక్వతమస్తకస్థితుండు కలహాశ<ref>క. నుండు తర్క, చ.ట. నుఁడు కుతర్క</ref>నుఁడు కుతర్కక్రియాకుశలుండు సంగతోన్మాదోత్తమాంగకుండు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నగునయేనియు నటువంటి మగనితోడఁ గాఁపురము సేయు సతి దొడ్డగరిత <ref>క. యగుచు</ref>యగుచుఁ గసిడికోఁతకు నోర్చి లో <ref>క. విసిగి, చ. వికివి, శ.ర. విసివి</ref>విసివికొనక ధాత దూఱక తండ్రి<ref>శ.ర. చేఁతకు</ref>సేఁతకు వగవక.</poem>|ref=145}} '''టీక'''. మహాక్రోధనుండు = మిక్కిలి కోపము కలవాఁడు; అతిలోభి = పెద్దపిసినిగొట్టు; బద్ధమత్సరుఁడు = అసూయాపరుఁడు; అన్యబుద్ధి = వేఱు(చెడ్డ)బుద్ధి కలవాఁడు; మాయి = మోసగాఁడు; చంచలస్వాంతుండు = చలచిత్తము కలవాఁడు; బహు...లంపటుఁడు =(ప్రతివిషయమునకు) ఎక్కువ ఒట్టులు పెట్టుకొనుటయం దాసక్తి కలవాఁడు; శఠుఁడు = మూర్ఖుఁడు; సంతత...ప్రరో<noinclude><references/></noinclude> psqv0k7cq2r1b9p4rmf3r3x1qsljjim 555420 555418 2026-05-04T05:56:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 555420 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. కాననగంధవాహవశగంబు = అడవిలోని గాలికి స్వాధీనమైనది; తత్పయఃఫేనకణంబు = ఆ పాలనురుగుబిందువు; ఒండు = ఒకటి; మురభేదనుమౌళిన్ = విష్ణునితలను; శ్రీజాని = లక్ష్మీభర్త - విష్ణువు; ముదిసి = ముసలిదయి; దేహమును, ఊడ్చి = శరీరమును విడిచి; భవాంతరంబునన్ = వేఱొకజన్మమునందు. {{p|ac|fwb}}సుశీల యను పతివ్రత చరిత్రము</p> {{Telugu poem|type=క.|lines=<poem>హరిమౌళిపతితనిజదు, గ్ధరసోర్కరఫేనకణకృతపరమసుకృత స్ఫురణంబున నొకవైష్ణవ, వరునకుఁ దనుజాత యగుచు వసుధం బుట్టెన్.</poem>|ref=142}} '''టీక'''. హరి...స్ఫురణంబునన్ = విష్ణువుతలపై పడిన తన పాలనురుగుబిందువువలనఁ గలిగిన గొప్ప పుణ్యవిశేషమున; తనుజాత = పుత్రిక; వసుధన్ = భూమిపై. {{Telugu poem|type=వ.|lines=<poem>సుశీలాభిధాన యగు నబ్బాల గుణగణభాస్వరయై యథోచితకాలంబున.</poem>|ref=143}} '''టీక'''. సుశీలాభిధాన = సుశీల యను పేరు కలది; గుణగణభాస్వర = గుణసమూహముచేఁ బ్రకాశించునది; యథోచితకాలంబునన్ = తగిన సమయమున - యుక్తకాలమున. {{Telugu poem|type=ఉ.|lines=<poem>తాళి విభుండు గట్టినమొదల్ పతిదేవత యా సుశీల పెన్ గోలతనంబునన్ మగఁడు కొట్టినఁ దిట్టిన <ref>క. రట్టు చేసినన్, చ. నడ్డపెట్టినం, ట. రట్టు పెట్టినన్</ref>రట్టు పెట్టినన్ దాళి దినంబుఁ దచ్చరణతామరసంబులు గొల్చు నేలయున్ బోలునె యీపె కంచుఁ గృతబుద్ధులు <ref>చ. పెద్దలు</ref>వృద్ధులు ప్రస్తుతింపఁగన్.</poem>|ref=144}} '''టీక'''. విభుండు = భర్త; తాళి = మంగళసూత్రము; కట్టినమొదల్ - కట్టినది మొదలుకొని; పతిదేవత = భర్తయే దైవమని యెంచునది; పెన్{{ZWNJ}}గోలతనంబునన్ = పెద్ద అమాయకత్వమున; రట్టు పెట్టినన్ = అల్లరి పెట్టినను; తాళి = సహించి; దినంబున్ = ప్రతిదినమును; తచ్చరణతామరసంబులు = అతనిపాదపద్మములు; కృతబుద్ధులు = బుద్ధిమంతులు; ప్రస్తుతింపఁగన్ = కొనియాడఁగా. {{Telugu poem|type=సీ.|lines=<poem>రూపహీనుఁడు మహాక్రోధనుఁ డతిలోభి బద్ధమత్సరుఁ డన్యబుద్ధి మాయి చంచలస్వాంతుండు సకలబంధువిరోధి బహుళపథోక్తిలంపటుఁడు శఠుఁడు సంతతావిశ్వాససస్యప్రరోహుండు గర్వపక్వతమస్తకస్థితుండు కలహాశ<ref>క. నుండు తర్క, చ.ట. నుఁడు కుతర్క</ref>నుఁడు కుతర్కక్రియాకుశలుండు సంగతోన్మాదోత్తమాంగకుండు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నగునయేనియు నటువంటి మగనితోడఁ గాఁపురము సేయు సతి దొడ్డగరిత <ref>క. యగుచు</ref>యగుచుఁ గసిడికోఁతకు నోర్చి లో <ref>క. విసిగి, చ. వికివి, శ.ర. విసివి</ref>విసివికొనక ధాత దూఱక తండ్రి<ref>శ.ర. చేఁతకు</ref>సేఁతకు వగవక.</poem>|ref=145}} '''టీక'''. మహాక్రోధనుండు = మిక్కిలి కోపము కలవాఁడు; అతిలోభి = పెద్దపిసినిగొట్టు; బద్ధమత్సరుఁడు = అసూయాపరుఁడు; అన్యబుద్ధి = వేఱు(చెడ్డ)బుద్ధి కలవాఁడు; మాయి = మోసగాఁడు; చంచలస్వాంతుండు = చలచిత్తము కలవాఁడు; బహు...లంపటుఁడు = (ప్రతివిషయమునకు) ఎక్కువ ఒట్టులు పెట్టుకొనుటయం దాసక్తి కలవాఁడు; శఠుఁడు = మూర్ఖుఁడు; సంతత...ప్రరో<noinclude><references/></noinclude> a7p0l9cvy5va27p5k5f7vd5hanywafs పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/285 104 212730 555427 554967 2026-05-04T07:15:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 555427 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>హుండు = ఎల్లపుడును అపనమ్మిక యను పంటను పండించువాఁడు; గర్వ...స్థితుండు = గర్వమను పర్వతముయొక్క శిఖరమునఁ గూర్చుండువాఁడు; కలహాశనుఁడు = జగడాలకోరు; కుతర్కక్రియాకుశలుండు = చెడ్డ (వంకర) యుక్తులను వేసి మాట్లాడుటలో నేర్పరి; సంగతో...మాంగకుండు = తలయందు కూడిన పిచ్చి కలవాఁడు - పిచ్చియెత్తినవాఁడు; దొడ్డగరిత = ఉత్తమవనిత; కసిడికోఁతకున్ = రాపాడుటకు; ధాతన్ = బ్రహ్మను; దూఱక = నిందించక; తండ్రిసేఁతకున్ = తండ్రి చేసినపనికి - ఇట్టివానితోడి వివాహము కూర్చినందులకు; వగవక = విచారింపక. {{Telugu poem|type=శా.|lines=<poem>ఆ తీవ్రాంశునివేఁడి కోర్చి మను ఛాయాదేవియుంబోలె స త్పాతివ్రత్యగుణాభిరామ యగు నా భామాలలామంబు సం ప్రీతిం జేయు నసహ్యదర్శనములం బిర్వీకులం బెట్టు దు ర్జాతున్ <ref>క. వీతదయామతిన్, చ. వీతదయున్</ref>వీతదయున్ <ref>చ. ట. లలో 'బ్రియన్' కలదు. క. లో లేదు.</ref>బ్రియున్ దదుచితాచారంబుల న్నిచ్చలున్.</poem>|ref=146}} '''టీక'''. తీవ్రాంశుఁడు = సూర్యుఁడు; మరు = జీవించు; భామాలలామంబు = స్త్రీరత్నము, ఆసహ్యదర్శనములన్ = ఓర్వరానివానిని చూపించుటలచే; పిర్వీకులం బెట్టు = బాధించు; దుర్జాతున్ = చెడ్డవానిని; వీతదయున్ = దయలేనివానిని; ప్రియున్ = భర్తను; తదుచితాచారంబులన్ = వానికి అనుకూలములగు పనులను; ప్రీతిన్, చేయున్. {{Telugu poem|type=ఉ.|lines=<poem>కొన్ని గొణింగి ref>క. కొన్గినిసి, శ.ర. కొన్గునిసి</ref>కొన్గినిసి కొన్నితుటారము లాడి మానరా కెన్నిక నిన్నినాళ్ల కివి యిన్నని కూటికిఁ బిచ్చపాటి కొ మ్మన్న మహాప్రసాదమని హర్షరసోల్లసదాననాబ్జయై యన్నలినాక్షి భర్త <ref>క. యిడున, శ.ర. యిడిన</ref>యిడినన్నియ గైకొను <ref>క. మ్రుక్క, చ. ముక్క, శ.ర. ముక్క</ref>ముక్కధాన్యముల్.</poem>|ref=147}} '''టీక'''. అన్నలినాక్షి = ఆ సుశీల; గొణింగి = మనస్సులో సణిగి; కొన్ = కొన్ని; కినిసి = కోపించి; తుటారములు, ఆడి = నిందమాటలు ఆడి; మానరాక = (విధిలేక) మానివేయుటకు వలనుగాక; ఎన్నికన్ = లెక్కగా; ఇన్నినాళ్లకున్ = ఇన్నిరోజులకు; పిచ్చపాటి = తక్కువకొలఁత; కొమ్మన్నన్ = తీసికొనుమని పలుకఁగా; మహాప్రసాదము, అని = చిత్తము అని; హర్ష - అబ్జయై = సంతోషమున కలకలలాడు పద్మమువంటి ముఖము కలదయి; ముక్కధాన్యమున్ = ముక్కిపోయిన (ప్రాఁతగిల్లి, సారము చెడిన) వడ్లను; కైకొనున్ = గ్రహించును. {{Telugu poem|type=సీ.|lines=<poem>చతురసమ్మార్జనాచరణంబు దొలునాటి ప్రాఁచి<ref>చ. వహ్నియ</ref>వన్నియ <ref>చ. తొడుపు</ref>త్రోపువడుట గాఁగఁ గోమయగోముఖశ్రీ ముంగిట ఘటించుటలు సుఖమజ్జనకలన గాఁగఁ గమనీయపూర్ణకుంభముల పూజాకౢప్తి కుచలికుచాకల్పరచన గాఁగ నన్నసంపాదనార్హాగ్నిఁ బుట్టిన ధూమపటలి సంస్కారధూపంబు గాఁగ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>విఘటితకవాటకద్వారవిశదనయన, యర్చితాధరగేహళికాధరోష్ఠ భాండగోపనయవనికాంబరపరీత, యింతి గృహలక్ష్మి <ref>చ. నత్యంత</ref>యత్యంతకాంతిఁ దనరు.</poem>|ref=148}} '''టీక'''. చతుర...చరణంబు = నేర్పుగా కసవూడుచుట; ప్రాఁచివన్నియ = నిర్మాల్యము; త్రోపువదుట గాఁగన్ = తీసివేయురీతి కాఁగా; గోమయగోముఖశ్రీ = ఆవుపేడతో అలుకునట్టి అలంకారము; ఘటించుటలు = కూర్చుటలు; సుఖ...గాఁగన్ = సుఖస్నానవిధి కాఁగా; కమనీయ...<noinclude><references/></noinclude> g70oyn941955d8qium8be5a8y35gz1x పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/2 104 212902 555426 555381 2026-05-04T07:06:45Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555426 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}పీఠిక</p>}} స్వదేశాభిమానులయిన నాసోదరులారా! ఈ చిన్న పుస్తకమును తప్పక మీరు పరీక్షింతురని నమ్మకముతో దీని బ్రచురింపబూనుకొంటిని. ఇది చూపులకు చిన్న పుస్తకముగాని, బహుదినము లనేక గ్రంధములను బరిశీలించి విశేషశ్రమపడి వ్రాసితిని. ఇప్పటి విద్యావంతులయిన స్వదేశాభిమానులకందరికి యిది అత్యంత ప్రయోజనకారి. ధర్మశాస్త్రములు యథార్థముగా బ్రవతి౯పజేయబడినయెడల యిప్పుడు లోకమునకు హితకారులుగా మన విద్యావంతులెంచుచున్న సమస్తక్రియలకు అనుకూలములుగానే యున్నవిగాని ప్రతికూలములుగాలేవు. కొన్ని నూర్లసంవత్సరముల నుండి, యేవో కారణములచేత ధర్మశాస్త్రముల యథార్థ సంప్రదాయములనువిడిచి జనులు వారివారికి యిష్టమైనట్లు కొన్ని దురాచారములను గల్పించుకొని వానినే యిప్పటివరకు జరిగించుచు వచ్చినందున, ఆదురాచారము లిప్పుడు లోకబాధకములయి, ఎంత ఆరోచౌకములుగానయిననున్నవి. ఆయాచారములనే విడువరాదు, ఆని యొక నియమ మేర్పడినట్లుకూడ తోచుచున్నది. ఇందువలన ధర్మశాస్త్రమును పరిశీలించవలసిన యక్కరకూడను నశించినది. ఇప్పటి విద్యావంతులలో, కొందరు యీయీమధ్యకాల దురాచారములే ధర్మశాస్త్రములనుకొని భ్రమజెంది, ఆహా, ధర్మశాస్త్రము లెంత కఠినముగా నున్నవి; ఋషులని పేరుపెట్టుకొనినవారు ప్రజలకుమారకులయినారని దూషించుచున్నారు. మరి కొందరును అటువంటి భ్రమనేచెందియు లోకమునకు బాధకమాయెనేమి సాధకమాయెనేమి అట్లే జరగగవలసినదిగాని ఆయాచారములను మార్చరాదనుచున్నారు.<noinclude><references/></noinclude> 8fscn7nzagu1uytc725ef971xw6itiz పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/3 104 212903 555428 2026-05-04T07:18:11Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555428 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>Consequently they ceased from taking meals, or attending religious ceremonies, in the houses of those who dined with the brahmin in question, and asked the supporters of the Prayaschitta to prove its validity. For this purpose several meetings were held at which the objections urged against the Prayaschitta were met by me. The first Prakaranam of this treatise contains my answers to the several objections raised, which show that the Shastras sanction the readmission of the Brahmin by means of Prayaschitta. The second Prakaranam shows that the Prayaschitta, as it was conducted in the present case, is in accord with the ritual prescribed in the Shastra. Although primarily intended as a defence of this particular Prayaschitta, this book may be considered to be a brief exposition of the whole Shastra on Prayaschitta. In it are incidentally discussed some of the vital questions of Achara connected with Social Reform.<noinclude><references/></noinclude> 36ckfdog0om23rtj4mwbyxyxnvsdwl3 పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/4 104 212904 555429 2026-05-04T07:20:24Z Brjswiki 6801 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'The Shastras are now-a-days enshrouded in a thick mist of ignorance. Some modern reformers. on the one hand, are un der the preconceived notion that they are merely a mass of unconnected doctrines, totally out of keeping with the times, and that no measure of reform is possible on the lines therein laid down. Some bigo- ted Brahmins, on the other hand, mistak- ing usage for Shastra, interpret it so as to suit their views. But I have always b... 555429 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>The Shastras are now-a-days enshrouded in a thick mist of ignorance. Some modern reformers. on the one hand, are un der the preconceived notion that they are merely a mass of unconnected doctrines, totally out of keeping with the times, and that no measure of reform is possible on the lines therein laid down. Some bigo- ted Brahmins, on the other hand, mistak- ing usage for Shastra, interpret it so as to suit their views. But I have always been of the opinion that the Shastras, if follow- ed in their true light, will not only condemn every usage inconsistent with the welfare of Society, but will tolerate every reform calculated to promote it. My views on this subject have already been set forth in my two pamphlets, entitled Duracharapisa chabhanjani and Acharanirukti. The same views are also now illustrated in this little book. I hope it will meet with a fa- vourable reception at the hands of the public. Ellore, DASU SRIRAMULU. 12th Cctober 1891.<noinclude><references/></noinclude> 8mzuqtkpk15mlgwywgijn313xtz7fqq 555430 555429 2026-05-04T07:29:43Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555430 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>The Shastras are now-a-days enshrouded in a thick mist of ignorance. Some modern reformers. on the one hand, are under the preconceived notion that they are merely a mass of unconnected doctrines, totally out of keeping with the times, and that no measure of reform is possible on the lines therein laid down. Some bigoted Brahmins, on the other hand, mistaking usage for Shastra, interpret it so as to suit their views. But I have always been of the opinion that the Shastras, if followed in their true light, will not only condemn every usage inconsistent with the welfare of Society, but will tolerate every reform calculated to promote it. My views on this subject have already been set forth in my two pamphlets, entitled Duracharapisa chabhanjani and Acharanirukti. The same views are also now illustrated in this little book. I hope it will meet with a favourable reception at the hands of the public. {{right|DASU SRIRAMULU.}} Ellore, 12th October 1891.<noinclude><references/></noinclude> did3mfjkaq4oei0357rubeszvly27mu పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/5 104 212905 555431 2026-05-04T07:41:25Z Brjswiki 6801 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{left margin|8em}}<poem>పతితేనత్వజ్ఞానా! త్సంసర్గం కృతవత స్పభార్యస్య! గుంటూరు భానుమూర్తే: ప్రాయశ్చిత్తస్య యోగ్యతాంవచ్చి ౹౹౪౹౹</poem> </div> {{rule |6em }} సాధువులారా! కొద్ది కాలము క్రిందట గోదావరీమండల...' 555431 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>{{left margin|8em}}<poem>పతితేనత్వజ్ఞానా! త్సంసర్గం కృతవత స్పభార్యస్య! గుంటూరు భానుమూర్తే: ప్రాయశ్చిత్తస్య యోగ్యతాంవచ్చి ౹౹౪౹౹</poem> </div> {{rule |6em }} సాధువులారా! కొద్ది కాలము క్రిందట గోదావరీమండలములో యేలూరు తాలూకా కాపురస్థుడయిన గుంటూరు భానుమూతి౯ యను నొక ఒక వైదిక బ్రాహ్మణుడు పదియేండ్ల చిన్నదాని వివాహమాడెను. వివాహము జరిగిన కొన్నిదినములకు ఆ కన్యతఁడ్రి విధవలగు తన పెద్ద కుమా తెజాల కిరువురకు పునర్వివాహములు చేసి యుండుటచే పతితుడయ్యెనని యీ భానుమూతికా కి తెలిసెను. ఆ విషయమెరిగిన వారు అతనిని తమ యిండ్లకు భోజనాదుల శురానివ్వక గూడవచ్చిరి. అంతట నీభానుమూతి - ఏలూ రులోనుండు బ్రాహణులను తనకు ప్రాయశ్చిత్తము చేయించుడ ని వేడుకొనగా కొందరు ఆ విషయము ను మార్చి పెద్దలతో నా లోచన చేసిరి. ఆపుడు ముఖ్యముగా ॥ శ్రీ గుండు సుబ్ర హ్మణ్య చయినులుగారును నేనును యిట్టి విషయములో భాను మూతికి ప్రాయశ్చిత్తము చేసి భార్యా సమేతముగా నతనిని సంఘములో జేర్చుకొనవచ్చుననియు అది శాస్త్ర సభ్యుతమని యా చెప్పిన మీదట ఆశేకులు అందుకు సమ్మతించిరి. పిమ్ముడు ప్రాయశ్చిత్తము యథావిధిగా జరుపబడెను. ప్రాతశ్చిత్తము జరుగుటకు పూర్వము కొందరు వైదిక శిఖామణులు ప్రాయ శ్చిత్తము జరిగెనేని తనుకు కొంత ద్రవ్యలాభము కలుగున య<noinclude><references/></noinclude> 2ipidbwn29o6zzgsgv24r5n70ze6qj8 555432 555431 2026-05-04T08:15:16Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555432 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|10em}}<poem>పతితేనత్వజ్ఞానా! త్సంసర్గం కృతవత స్పభార్యస్య! గుంటూరు భానుమూర్తే: ప్రాయశ్చిత్తస్య యోగ్యతాంవచ్చి ౹౹౪౹౹</poem> </div> {{rule |6em }} సాధువులారా! కొద్ది కాలము క్రిందట గోదావరీమండలములో యేలూరు తాలూకా కాపురస్థుడయిన గుంటూరు భానుమూతి౯ యను నొక ఒక వైదిక బ్రాహ్మణుడు పదియేండ్ల చిన్నదాని వివాహమాడెను. వివాహము జరిగిన కొన్నిదినములకు ఆ కన్యతఁడ్రి విధవలగు తన పెద్ద కుమార్తె౯ల కిరువురకు పునర్వివాహములు చేసి యుండుటచే పతితుడయ్యెనని యీ భానుమూతి౯కి తెలిసెను. ఆ విషయమెరిగిన వారు అతనిని తమ యిండ్లకు భోజనాదులకురానివ్వక గూడవచ్చిరి. అంతట నీభానుమూతి౯ ఏలూరులోనుండు బ్రాహణులను తనకు ప్రాయశ్చిత్తము చేయించుడని వేడుకొనగా కొందరు ఆ విషయమునుగూర్చి పెద్దలతో నాలోచన చేసిరి. ఆపుడు ముఖ్యముగా బ॥ శ్రీ॥ గుండు సుబ్రహ్మణ్య చయినులుగారును నేనును యిట్టి విషయములో భానుమూతికి౯కి ప్రాయశ్చిత్తము చేసి భార్యా సమేతముగా నతనిని సంఘములో జేర్చుకొనవచ్చుననియు అది శాస్త్ర సమ్మతమనియు చెప్పిన మీదట ఆనేకులు అందుకు సమ్మతించిరి. పిమ్మట ప్రాయశ్చిత్తము యథావిధిగా జరుపబడెను. ప్రాయశ్చిత్తము జరుగుటకు పూర్వము కొందరు వైదికశిఖామణులు ప్రాయశ్చిత్తము జరిగెనేని తనుకు కొంత ద్రవ్యలాభము కలుగున<noinclude><references/></noinclude> php7o5f1g7njo7hgv7hhqqund236ogc పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/6 104 212906 555433 2026-05-04T08:31:42Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555433 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ని భ్రమజెంది వేచియుండిరిగాని యీ విషయములో వారియాట లెంతమాత్రము సాగనేరక పోయెను. ఆ హేతువుచేతనూ లేక నింకనే హేతువుచేతమో వైదికబృందములో ననేకులు ముందు ప్రాయశ్చిత్తమున కంగీకరించినవారే ప్రాయశ్చిత్తము జరిగిన వెనుక దాని నంగీకరించినవారి గృహములకు భోజనములకురాక, ప్రాయశ్చిత్త యోగ్యతనుగూర్చి సంశయయుక్తులయితిరని, సంశయ నివృత్త్యధ౯ము ప్రాయశ్చిత్తము నగీకరించిన వారిని సభచేరుటకయి ప్రార్థించిరి. అప్పుడు జరిగిన మొదటి సభలో సంశయముకల వైదికులపట్టున జంద్యాల గౌరీనాధశాస్త్రులవారు అను వారొకరు లేచి గుంటూరు భానుమూతి౯కి ప్రాయశ్చిత్తమేలేదని కొన్ని యాక్షేపణలుచేసిరి. వాని ఖండించుచు నేను బ॥ శ్రీ॥ గుండు సుబ్రహ్మణ్య చయనులవారి యనుజ్ఞ వడసి ముందువచ్చునుపన్యాసముచే ప్రాయశ్చిత్తముకలదని సిద్ధాంత పరచితిని. గౌరీనాధశాస్త్రులవారి ప్రశ్నలును, వానికి నేనిచ్చిన యుత్తరములును, నావలన తరువాత జరిగింపబడిన ప్రసంగమును, ఈ గ్రంధములో మొదటి ప్రకరణమువలన దెలియను. పిమ్మట గుంటూరు భానుమూతి౯కి చేయించిన ప్రాయశిత్తము యోగ్యమయినదేనని రెండవ ప్రకరణమువలన వెలియును. ఈరెండు ప్రకరణములుగల యుపన్యాసము: పతిక సంసర్గీ ప్రాయశ్చిత్త విషయశోపన్యాస మనబడును. {{right|విధేయుడు}} దాసు - శ్రీరాములు.<noinclude><references/></noinclude> q83ah5wi5vuop80qavcsckihyadql04 555434 555433 2026-05-04T08:32:26Z Brjswiki 6801 555434 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ని భ్రమజెంది వేచియుండిరిగాని యీ విషయములో వారియాట లెంతమాత్రము సాగనేరక పోయెను. ఆ హేతువుచేతనూ లేక నింకనే హేతువుచేతమో వైదికబృందములో ననేకులు ముందు ప్రాయశ్చిత్తమున కంగీకరించినవారే ప్రాయశ్చిత్తము జరిగిన వెనుక దాని నంగీకరించినవారి గృహములకు భోజనములకురాక, ప్రాయశ్చిత్త యోగ్యతనుగూర్చి సంశయయుక్తులయితిరని, సంశయ నివృత్త్యధ౯ము ప్రాయశ్చిత్తము నగీకరించిన వారిని సభచేరుటకయి ప్రార్థించిరి. అప్పుడు జరిగిన మొదటి సభలో సంశయముకల వైదికులపట్టున జంద్యాల గౌరీనాధశాస్త్రులవారు అను వారొకరు లేచి గుంటూరు భానుమూతి౯కి ప్రాయశ్చిత్తమేలేదని కొన్ని యాక్షేపణలుచేసిరి. వాని ఖండించుచు నేను బ॥ శ్రీ॥ గుండు సుబ్రహ్మణ్య చయనులవారి యనుజ్ఞ వడసి ముందువచ్చునుపన్యాసముచే ప్రాయశ్చిత్తముకలదని సిద్ధాంత పరచితిని. గౌరీనాధశాస్త్రులవారి ప్రశ్నలును, వానికి నేనిచ్చిన యుత్తరములును, నావలన తరువాత జరిగింపబడిన ప్రసంగమును, ఈ గ్రంధములో మొదటి ప్రకరణమువలన దెలియను. పిమ్మట గుంటూరు భానుమూతి౯కి చేయించిన ప్రాయశిత్తము యోగ్యమయినదేనని రెండవ ప్రకరణమువలన వెలియును. ఈరెండు ప్రకరణములుగల యుపన్యాసము: పతిక సంసర్గీ ప్రాయశ్చిత్త విషయశోపన్యాస మనబడును. {{right|విధేయుడు}} {{right|దాసు - శ్రీరాములు.}}<noinclude><references/></noinclude> jv6j8mhbfihdndd003ercml9pjnta02 పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/7 104 212907 555437 2026-05-04T11:14:48Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555437 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>నాతాత్పర్యమందు, ధర్మశాస్త్రముల ననుసరించి దురాచారములు పుట్టలేదుగనుక ఆదురాచారములను బుచ్చుకొని ధర్మశాస్త్రములను ఋషులను నిందించుటతప్పు. రెండవది. దురాచారములు లోకబాధకములు గనుక, దానికి ధర్మమనియెడి పేరే పెట్టరాదు. అవి విడువ కుండ జరిగించవలసినదనుటయు తప్పు. లోశ బాధకముగానున్న పనిచేయవలసినదని మన ధర్మశాస్త్రములు చెప్పనేచెప్పలేదు. అట్లుచెప్పినవి యేవయిననున్నట్లూ హించినను, అవి ప్రక్షిప్తములు; వానికి ఆధర్మశాస్త్రములని పేరు బెట్టవలెను. మధ్య నేర్పడిన దురాచారములు, లోకబాధకములుగాన విడువవలసినదే. ఈ యంశమును ధర్మశాస్త్రములు ఒప్పుకొనుచున్నవి. ఏ యంశమును గాని విచారించుటకు ధర్మశాస్త్రములను ప్రమాణములుగా బుచ్చుకొనవలెనుగాని మధ్యావారములు మత గ్రంధములు పుచ్చుకొనరాదు. ఇందునకు దృష్టాంతముగా యీ చిన్న యుపన్యాసము వ్రాయబడినది. ఈ పుస్తకమువలన, మన ధర్మశాస్త్రములు యెంత లోకక్షేమకరములుగానున్నవో తెలియును. ప్రాయశ్చిత్తము విషయమయి వేదశాస్త్ర పురాణేతిహాసాదు లేయేవిషయములలో నెట్లుగా చెప్పియున్నమో తెలియును. నా పిన్న బుద్ధికొలది శ్రీబ్రహ్మణ్యులయిన గుండు సుబ్రహ్మణ్వచయనుల వారి యాజ్ఞనుబుచ్చుకొని యీ పుస్తకమును వ్రాసితిని తప్పులు లేకపోవు, క్షమించగోరెదను. సంస్థ ఏలూరు {{right|విధేయుడు దాసు - శ్రీరాములు.}}<noinclude><references/></noinclude> h8hl9zsrew91r1eqztiy8zypqc83jr9 555440 555437 2026-05-04T11:21:54Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 555440 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>నాతాత్పర్యమందు, ధర్మశాస్త్రముల ననుసరించి దురాచారములు పుట్టలేదుగనుక ఆదురాచారములను బుచ్చుకొని ధర్మశాస్త్రములను ఋషులను నిందించుటతప్పు. రెండవది. దురాచారములు లోకబాధకములు గనుక, దానికి ధర్మమనియెడి పేరే పెట్టరాదు. అవి విడువ కుండ జరిగించవలసినదనుటయు తప్పు. లోశ బాధకముగానున్న పనిచేయవలసినదని మన ధర్మశాస్త్రములు చెప్పనేచెప్పలేదు. అట్లుచెప్పినవి యేవయిననున్నట్లూ హించినను, అవి ప్రక్షిప్తములు; వానికి ఆధర్మశాస్త్రములని పేరు బెట్టవలెను. మధ్య నేర్పడిన దురాచారములు, లోకబాధకములుగాన విడువవలసినదే. ఈ యంశమును ధర్మశాస్త్రములు ఒప్పుకొనుచున్నవి. ఏ యంశమును గాని విచారించుటకు ధర్మశాస్త్రములను ప్రమాణములుగా బుచ్చుకొనవలెనుగాని మధ్యాచారములు మత గ్రంధములు పుచ్చుకొనరాదు. ఇందునకు దృష్టాంతముగా యీ చిన్న యుపన్యాసము వ్రాయబడినది. ఈ పుస్తకమువలన, మన ధర్మశాస్త్రములు యెంత లోక క్షేమకరములుగానున్నవో తెలియును. ప్రాయశ్చిత్తము విషయమయి వేదశాస్త్ర పురాణేతిహాసాదు లేయేవిషయములలో నెట్లుగా చెప్పియున్నవూ తెలియును. నా పిన్న బుద్ధికొలది శ్రీబ్రహ్మణ్యులయిన గుండు సుబ్రహ్మణ్వచయనుల వారి యాజ్ఞనుబుచ్చుకొని యీ పుస్తకమును వ్రాసితిని తప్పులు లేకపోవు, క్షమించగోరెదను. ఏలూరు {{right|విధేయుడు}} {{right|దాసు - శ్రీరాములు}}<noinclude><references/></noinclude> p3t18vkasosjpndnrb17h1rxx0m7at4