వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.6
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
రచయిత:తిరుపతి వేంకట కవులు
102
20956
559669
520153
2026-06-15T13:34:26Z
Rajasekhar1961
50
/* రచనలు */
559669
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = తిరుపతి
|అసలుపేరు = వేంకట కవులు
|పేరు_మొదటి_అక్షరం = త
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ = [[రచయిత:దివాకర్ల తిరుపతి శాస్త్రి|దివాకర్ల తిరుపతి శాస్త్రి]] (1872-1919) మరియు [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి |చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి]] (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = తిరుపతి వేంకట కవులు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[కామేశ్వరీ శతకము]] (1925) {{small scan link|Kameshwaraishata020621mbp.pdf}}
* [[భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/కామేశ్వరీశతకము]] (ముద్రణ: 1926)
* బాల రామాయణము (1955) {{small scan link|BalaRamayanamu.pdf}}
* [[శతావధానసారము]] (1908) {{small scan link|Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf}}
* [[మృచ్ఛకటిక]] (5వ కూర్పు: 1948) {{small scan link|Mruchha-Katika(Telugu).pdf}}
* [[దేవీ భాగవతము]] (1920) {{small scan link|Devi-Bhaghavathamu.pdf}}
* [[శ్రీ తిరుపతి వేంకటేశ్వర కృతులు]] 3 - నాటకములు (1934) {{small scan link|Tirupati Venkata Kavula Natakamulu.pdf}}
** పాండవజననము
** పాండవ ప్రవాసము
** పాండవోద్యోగము
** పాండవ విజయము
** పాండవాశ్వమేధము
** ప్రభావతీ ప్రద్యుమ్నము
** దంభవామనము
** అనర్ఘనారదము
** సుకన్య
** పాండవ రాజసూయము
* శ్రవణానందము (1956) <ref>[https://archive.org/details/in.ernet.dli.2015.395555 డిజిటల్ లైబ్రరీ వారి ప్రతి.]</ref>
* సారస్వత విమర్శలు (1935) [https://archive.org/details/in.ernet.dli.2015.329678/page/n1]
* లక్షణా పరిణయము (1907) {{small scan link|లక్షణా పరిణయము.pdf}}
* బుద్ధ చరిత్రము (1956)
==రచయితల గురించిన రచనలు==
* [[ఆంధ్ర రచయితలు/తిరుపతి వేంకట కవులు]]
==బయటి లింకులు==
* [https://archive.org/details/TirupatiVenkataKavulaKrutulu తిరుపతి వేంకట కవుల కృతులు, ఐదు భాగాలు ఆర్కీవులో.]
aerx07z9n7d7f41le03njollc2qv3b7
559670
559669
2026-06-15T13:35:33Z
Rajasekhar1961
50
/* రచనలు */
559670
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = తిరుపతి
|అసలుపేరు = వేంకట కవులు
|పేరు_మొదటి_అక్షరం = త
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ = [[రచయిత:దివాకర్ల తిరుపతి శాస్త్రి|దివాకర్ల తిరుపతి శాస్త్రి]] (1872-1919) మరియు [[రచయిత:చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి |చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి]] (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = తిరుపతి వేంకట కవులు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[కామేశ్వరీ శతకము]] (1925) {{small scan link|Kameshwaraishata020621mbp.pdf}}
* [[భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/కామేశ్వరీశతకము]] (ముద్రణ: 1926)
* బాల రామాయణము (1955) {{small scan link|BalaRamayanamu.pdf}}
* [[శతావధానసారము]] (1908) {{small scan link|Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf}}
* [[మృచ్ఛకటిక]] (5వ కూర్పు: 1948) {{small scan link|Mruchha-Katika(Telugu).pdf}}
* [[దేవీ భాగవతము]] (1920) {{small scan link|Devi-Bhaghavathamu.pdf}}
* [[శ్రీ తిరుపతి వేంకటేశ్వర కృతులు]] 3 - నాటకములు (1934) {{small scan link|Tirupati Venkata Kavula Natakamulu.pdf}}
** పాండవజననము
** పాండవ ప్రవాసము
** పాండవోద్యోగము
** పాండవ విజయము
** పాండవాశ్వమేధము
** ప్రభావతీ ప్రద్యుమ్నము
** దంభవామనము
** అనర్ఘనారదము
** సుకన్య
** పాండవ రాజసూయము
* శ్రవణానందము (1956) <ref>[https://archive.org/details/in.ernet.dli.2015.395555 డిజిటల్ లైబ్రరీ వారి ప్రతి.]</ref>
* సారస్వత విమర్శలు (1935) [https://archive.org/details/in.ernet.dli.2015.329678/page/n1]
* లక్షణా పరిణయము (1907) {{small scan link|లక్షణా పరిణయము.pdf}}
* బుద్ధ చరిత్రము (1956) {{small scan link|19560101 BudhaCharitramu Telugu pdf.pdf}}
==రచయితల గురించిన రచనలు==
* [[ఆంధ్ర రచయితలు/తిరుపతి వేంకట కవులు]]
==బయటి లింకులు==
* [https://archive.org/details/TirupatiVenkataKavulaKrutulu తిరుపతి వేంకట కవుల కృతులు, ఐదు భాగాలు ఆర్కీవులో.]
64n5ple8f9iu40cla9b9338al8saqy9
సూచిక:Artharakshamani018205mbp.pdf
106
60752
559794
191758
2026-06-16T10:37:52Z
Rajasekhar1961
50
559794
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[ఆర్తరక్షామణి]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:వడ్డాది సుబ్బారాయుడు|వడ్డాది సుబ్బారాయుడు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=రాజమహేంద్రవరము
|సంవత్సరం=1935
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist
1=-
2="ముఖచిత్రం"
3to5="అవతారిక"
6=1
27to29="భక్తచింతామణి"
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
cggp4x3gybhrm1lu5kdm8uppdyph621
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/96
104
125417
559712
558858
2026-06-15T15:18:26Z
Vjsuseela
1850
559712
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>మొదటిహల్లూ ద్విరుక్తం కావటం గమనించాలి. (2) విశేషణంగావాడే ద్వితీయాది.విభక్త్యంగం రెండో రకం: (8) సంఖ్యావాచక విశేషణాలు మూడోరకం.(4) - ఎఱ్ఱు/- ఎడు అనే మానార్థక ప్రత్యయాలు చేరిన విశేషణాలు నాలుగోరకం, ఉదా, మాన్-ఎఱ్ఱు ( SII 10.28.8-10, 971), మాన్-ఎడు (పై. 5.12.11, 1074). (5) విశేష్యంమీది ము ప్రత్యయ స్థానంలో వినిమాయక పదాంశ మైన 'పు' వర్ణకం చేరిన విశేషణాలు అయిదోరకం. ఉదా. వేప్ - ఊర్ (EI 14,158-55.8, 145-46), వేం-బళ్ళి (పై 30.280-84.6,972). ఈ విశేష ణాలు బహువిరళంగా ఉండేవి. (6) అజంత విశేష్యంమీద అజాది విశేష్యానికి ముందు టుగాగమం కాగా ఏర్పడ్డ విశేష ణంఆరోరకం. ఉదా. ఇరుకు-ట్ - ఊరి (పై . 31.74-80.89-40;668). (7) విశ్లేష్య విశేషణ లక్షణాలు రెండూ కలవి ఏడోరకం. ఉదా. ఉరువు-పల్లి (పై 3.277.17,466). (8) కేవలం విశేషణంగా మాత్రమే ప్రయోగింపబడేవి ఎనిమిదోరకం. ఉదా. చె + చెరుప్ (భారతి 1.110–22.13–14, 315-410), చిట్జ్-వీరు (JAHRS 5.51-58.18,788).(9) క్రియాపదాలుగా కూడా ఉండే ధాతుజ విశేషణాలు తొమ్మిదోరకం. ఉదా:(i) భూతకాలిక విశేషణాలు - ఇచ్చిన (EI 27,225-28.4, 575-600), ఉపేక్షించిన (కా.వ. మం. 1.2.8.20, 898-984), (ii) తద్ధర్మార్థ కవిశేషణాలు : మను-వార్డు ( SII 10.589.88,825-50). వక్రంబు రాదెంచు-వేర (పై - 85.5–8, 10). ఇక్కడి 'రాదెంచు' అనే రూపం గమనార్హం (iii) వ్యతిరే కార్థక విశేషణాలు : పెటని-వారు (పై. 688.2-8, 8), కొలది లేని - కొట్టంబుల్
భారతి. 5. 92.11,848–49).
{{gap}}ఇవిగాక నామవాచకం మీద అగుధాతు భూతకాలిక విశేషణరూపం 'అయిన' చేర్చి నిర్మించిన విశేషణాత్మక పదబంధాలు చాలా విరళంగా కనిపిస్తాయి.
ఉదా. ఉత్తమోత్తమున్- అయిన (BI 27.281-84.4, 625-50). శాసనస్థ నిదర్శనాలను బట్టి ఈ పదబంధనిర్మాణం క్రీ. శ. ఏడో శతాబ్దిలో కడప మండలంలో ఆరంభమై, 8-10 శతాబ్దులమధ్యకాలంలో దక్షిణకోస్తాకు వ్యాపించి,
పదకొండో శతాబ్దికి యావదాంధ్రదేశంలో వాడుకలోకి వచ్చినట్లు తెలుస్తుంది.
{{gap}}3.40. అవ్యయాలు: మూడురకాల అవ్యయాలు శాసనభాషలో కనిపి స్తాయి. (1) విశ్లేష్య ప్రాతిపదికకు 'కా' అనే అసంపూర్ణ క్రియారూపాలు చేరి ఏర్పడ్డవి. ఇవి అసంఖ్యాకం. (2) సర్వనామాలుగా భావించబడేవి. ఉడా. ఇట్ల
(6)<noinclude><references/></noinclude>
r14ihms8bh70jguslsxp6ffpvd8ncmq
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/98
104
125462
559634
559414
2026-06-15T12:50:46Z
Sumedhag28
7359
559634
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="WikiPBR" /></noinclude>{{rh|ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం||83}}
తాయి. ఉదా. (i) అ.క్రి.ధా. + -చు: చెఱి-చిన (తె. శా. 1.163-65.75-58),
892-922), ఈ మార్పు జరిగేటప్పుడు ధాతుగత డకారం ఱకారంగా మారేది. ఇది క్రీ. శ. ఎనిమిదో శతాబ్దినుంచీ కనిపిస్తున్నది. (ii) అ. క్రి. ధా. -చు>-పుః చమ్-పిన
(EI 27.234-36.20, 625-50), ఈ మార్పు జరిగేటప్పుడు ధాతుగతచకారానికి నకారం ఆదేశమవుతుంది. (iii) ఆ.క్రి.ధా. + ఇంచు: రా-వ్- ఇంచి (తె.శా. 1.163-65, 26 892-922).
'''3.43. ప్రేరణార్థకాలు ;''' ప్రేరణార్థకక్రియలు రెండు విధాల ఏర్పడేవి :
(i) సకర్మకధాతువుకు -ఇంచు ప్రత్యయంచేరిగాని [ఉదా. కట్ట్-ఇఞ్చి (భారతి 5.473-84.4,848), కావ్ -ఇఞ్చి (EI 30.69-71.4, 699-700), సకర్మకధాతుగతమైన చకారానికి పకారాదేశంవచ్చిగాని [ఉదా. కుడి-పిన (పై. 27 280-31.6 625-50),
పం-పు (పై. 211-25.7-8, 575-600)]. ఈమార్పులు జరిగేటప్పుడు పకారానికి ముందు నకారం అదేశం కావటమో (ఉదా. చొచ్-చు>చొన్-పు), ధాతుగతచకారానికి ముందున్న నకారం మకారంగా మారటమో (ఉదా. పన్-చు> పమ్-పు) జరిగేవి.
'''3.44. ప్రాతిపదికల పర్యాయరూపత : పదమధ్యసంధి :''' కాలార్థక ప్రత్యయాలు చేరేటప్పుడు క్రియాప్రాతిపదికల స్వరూపాల్లో కొన్ని రకాలమార్పులు వచ్చేవి.అవి పదమధ్యసంధులే అయినా ప్రాతిపదికల పర్యాయరూపత ఒకేచోట నిరూపించటంలో లాఘవ ముంది. కాబట్టి సంధి ప్రకరణంలోకాక వీటిని ఇక్కడే వివరిస్తున్నాం. ఈలాంటి మార్పులు ముఖ్యంగా ఎనిమిదిరకాలు. (1) భూతకాలిక ప్రత్యయాలైన ఇ, ఎలు గాని చేదర్ధక ప్రత్యయగతమైన ఇకారంగాని చేరినప్పుడు ధాతుగతయకారం సకారంగా మారేది. ఉదా. కేస్-ఇ. (పై. 30,69-71.5, 699-700), అఱిన్-ఇన (SII 10.599.25, 625-50), కేన్-ఇరి (పై. 47.2,7), వ్రాన్-ఎ (పై. 599.22, 625 -50), విడిస్-ఇన (శా. ప. మం. 1 2-3.15, 898-934). (2) ధాతుగతమైన ఉకారం ఇకారంగాను, ఇకారం అకారంగాను ప్రత్యయాదినున్న ఇ,ఎ,ల ముందు బహుళంగా మారేవి. ఉదా. (i) -ఉ>ఇ : కుడిప్-ఇన ( EI 27.230-31.6, 625-50), పొడిచ్>ఇ (SII 10.23.5, 719-20). ఉడిచ్-ఎ (భారతి 5.618, 897), చెఱిచ్ - ఇనను (తె. శా. 1.163.65.57-58, 892-922). ఈ మార్పుజరగని రూపాలు లేకపోలేదు. ఉదా. పొడుచ్-ఇ (SII 10.632.3, 725-75). (ii)<noinclude><references/></noinclude>
iyckxcpgw7aparvs9ukfdfpe27fo474
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/115
104
126169
559618
401079
2026-06-15T12:31:58Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */
559618
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|100||తెలుగు భాషా చరిత్ర}}
లేకున్న వేణ్ణికొణ్డుమ్ (33-34), పరోపకారంబుపొణ్డె నా నీ కొరవి యన్నది... (35-36).
'''3.77. మణిప్రవాళశైలి :''' సంస్కృతాంధ్ర పదబంధాల్ని మేళవించి వాక్యరచన చేయటానికి 'మణిప్రవాళశైలి' అని పేరు. పాల్కుర్కి సోమనాథుడి కాలం నుంచి తెలుగు సాహిత్యంలో ఈపద్ధతి విరళంగానే కనిపిస్తుండేది. శాసనాల్లో క్రీ. శ. ఏడో శతాబ్దినుంచి ఈరకం వాక్యాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఉదా. క్షేత్రం ఖణ్డుగవడ్ల సహితమ్ ( EI 10. 100-8.28, 674 ), ... ఏఱువ విషయం బేళన్ తస్య మాతాదత్తం ... శతపంచాశత్ క్షేత్రమ్ (పై. 29.160-64. 8-9,680); రేవశమ్మ౯స్య గుడి (SII 10.603.2-8); ... కొడుకు పల్లవా చార్జ్యస్య లికితం ( EI 27.203-6.24-26, 850 ); కొఱ్ఱబోయు తటాక౭ (పై. 9.47.59,945-46).
'''3.78. పృథక్కరణం :''' జాతి ద్రవ్యాదుల్ని పృథక్కరించి చెప్పటానికి సప్తమీవిభక్తి ప్రత్యయాన్నో, అనుబంధాన్నో వాడటం చాలా ప్రాచీన కాలంనుంచి వాడుకలో ఉంది. ఉదా. శ్రీ సోఱమహారాజు ల్లొళన ఇన్సుఱోలి అణపోతులు (వ్యాా. నం. 301-10.1-2, 600-25); బాదిరాజుల అన్దు పళ్ళెయరి కొడుకు (EI 27.203-6.6-8, 850).
'''3.79. కాలస్థల నిర్జేశం :''' 'ఉండు' ధాతువు క్త్వార్ధకరూపంతో ఆరంభదశను, చతుర్ధీ ప్రత్యయంతో అంతిమదశనూ నిరూపిస్తూ కాలస్థలనిర్దేశం చేయటం అనాదిసిద్ధంగా ఉంది. ఉదా. ఒంగోడునుండి ఱిగదేబుపళ (i)కు పోవు పన్థా (భారతి 1.139-36.16-17,696-709); చేబ్రోలనుండి బెజవాడ జాత్రకు వచ్చి (శా. ప. మం. 1.2-3.22-23, 899-934). ఈక్త్యార్ధకరూపం కాలక్రమాన 'నుంచి'గా మారి నేటి వాడుకలోకి వచ్చింది.
'''3.80 ఉపసంహారం :''' శాసనైకాధారమయిన ప్రాచీనాంధ్రభాషను శాస్త్రీయపద్ధతుల్లో పరిశీలించినప్పుడు ఇంతకాలంగా లోకంలో ప్రామాణికవాక్యాలుగా చెలామణి అవుతున్న కొన్ని దుర్భమలు తొలిగిపోతాయి. నన్నయ్యకు ముందు తెలుగుభాష 'ద్రవస్థితి'లో ఉండేదనీ (సోమయాజి 1948; 36,143.233, 234), దాన్ని అతడు సంస్కరించి 'ప్రమాణీకరించా'డనీ ( పై. 98,148-55,203-29,235), చాణుక్యులకాలంలో తెలుగు 'రాజభాష'గా 'అధికారభాష'గా<noinclude><references/></noinclude>
0hoo15c2bh3trrgzxq1kz9fuvt0kh45
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/114
104
126170
559617
401078
2026-06-15T12:31:21Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ స్పేసింగ్ మరియు ప్రూఫ్ రెడ్ చేయబడినది
559617
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం||99}}
'''3.75. కర్మణి ప్రయోగము :''' సంస్కృత భాషాప్రభావంవల్ల తెలుగులోకి వచ్చిన కర్మణి ప్రయోగంగల వాక్యాలు మూడుమాత్రమే క్రీ. శ. తొమ్మిది శతాబ్ది నుంచి దొరుకుతున్నాయి. ఉదా. పట్టం కట్టబడిన వాన్ఱు (పై. 10.629.5-6, 625); అతని చేయంబడిన ధమ్ము౯వుల (తె. శా. 1.163-65,55-56, 892-922); వైదుంబుళచేతం బట్టం కట్టబడి యేలి (SII 10. 640 4-5,9/10).
'''3.76. పదబంధాలు :''' కావ్యభాషలో కనిపించేరకం పదబంధాలు శాసనాల్లో కొన్ని కనిపిస్తాయి. ఉదా. విడిచిన బసిణ్డి నూఱు గద్యాణంబులు (JAHC 3,16-21.14-16, 678); ప్రసాదచేసిరి (EI 27-236-38.12-13, 700-25 ); సురలోకంబేజ్గె (SII 10.639.10, 825); సుఖంబుణ్డి (తె. శా. 1.163-65.23-24, 892-922 ); సుఖంబుమనువారు (పై. 68),అతని కొఱ్పించిన చెఱువులు (పై. 53-54); అతనిచేయంబడిన ధమ్ము౯వులు (పై. 55. 56), నీ చేసిన యుపకారంబునకుం (పై. 27-29); చలిపందిరిచేసె (SII 6.586.8-9, 1074); చెఱువునుం గుడియించి సేయించె (పె.7); తమ ప్రతిష్టసేసిన ... ఈశ్వరాలయంబునకు (పై. 10.644.66-70, 1060); తను వేయించిన...తటాకంబున (పై. 61-65); విజయదిత్య దేవరత్తించిన... మణ్డపము (పై. 11.8-11, 1089) వెలకుం గొనివిడిచిన యిల్లు (పై. 651,13, 1090-91).
'''పోలిక :''' 'పోలు' ధాతురూపాలతో పోలికను చెప్పేవారు. ఉదా. ఈశ్వరునకుం గాత్తి౯ కేయుణ్డుం బోలె (భారతి 5.618.3, 850); బెజయితదేవని కూంతు సరియ పోల్పం గాంత లెందు (RPS 28-29 11,1065), భూమిదేవిం బోల్ రేవలదేవికనిన సోమలదేవి (పై. 4-4). దొరికిన ఈ మూడు ప్రయోగాలూ పద్యశాసనాల్లోవే.
'''సంవాదం :''' ఆంగ్లంలోలాగా తెలుగులో ప్రత్యక్షపరోక్ష సంవాద పద్ధతిలేదు. సంవాద పద్ధతి ఉందిగాని ఇందువల్ల క్రియారూపాదుల్లో ఏవిధమైన మార్చురాదు. ఒక్కకొరవి శాసనంలో మాత్రమే (తె. శా. 1.]163-65..... 892-922) సంవాదవాక్యలు లభించాయి. ఉదా. నీవు నా ప్రాణసమానుణ్డవైన చెలివి (26-27), నీచేసిన యుపకారంబునకుం బ్రత్యుపకారంబు చేయవలయుం (27-30), నీకేమి వలయుం దాని వేణ్డికొమ్మ్ (30-32): నీ శ్రీ నాకెల్లం గలద్ (32-33), ఏమి<noinclude><references/></noinclude>
jglfjmc7kzzttq21h20l17vz4xt8a1a
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/113
104
126171
559607
401077
2026-06-15T12:25:21Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రెడ్ చేయబడినది
559607
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|98||తెలుగు భాషా చరిత్ర}}
29-31, 625.50), శవన బోళకు...మఱుపొలము పన్నస ఆడి యిచ్చితిరి (AR 283/1949-50.4-8 8). (ii) కర్మలేనివి : కఞ్చగార్లు కొట్టిరి (EI 30.69-71.8, 699-700), ప్రభురామున్ఱుక్ఱోచె ( NI 2.606-7.13-14, 8 ) మంగడ్ల కొమ్మన కొలచి పెట్టె కట్టె ( SII 6.250.7. 742-99 ). (iii) వాక్యాంతంలో కర్త : ఉదా. ప్రసాదచేసిరి తొల్బకామి రట్టగుళ్ళు ( EI 27 236-33 12-15, 700-25), దీవియ పెట్టెం బద్మావతియును (పై. 4.314-18.21, 1075. 76). రెండోవాక్యం పద్యశాసనంలోది. (iv) వాక్యాంతంలో కర్మ ఉదా. గణ్డర ముత్రాజు ... పొడిచిపడియె ఱోజ్కుళాకు ( SII 10.640. 3-6, 9/10), మల్లణ్డెత్తించె గుడియు మఠంబునుం గాత్తి౯కేయునకు (శా.ప.మం. 1.2-3-27-29, 898.934). రెండోది పద్యశాసనంలోని వాక్యం. (V) కర్మ-కర్త-క్రియ : ఉదా. శ్రీసతికి దత్తి హంగుణువుళ దేవణయిచె (AR 182/1933-34, pt. II, lc, 41 1-8,7). (vi) కర్తృ పద పునరుక్తి : ఉదా. పెటనివారు... ఆఱిసినవారు పాపంబు గొణ్డు వెటనివారు (SII 10.633.2-5, 8) (vii). విశేష్యం -విశేషణం : ఉదా. నిల్పె విద్ధమయ్య విప్రకవచమ్బు (NI 1.287.4,650), శ్రీయుద్ధమల్లు ణ్డెత్తించె నమితతేజుండు (శా. ప. మం. 1.2.43-44, 898-934). వీటిలో రెండో వాక్యం పద్యశాసనంలోనిది. (viii) పరోక్షకర్మ, ప్రత్యక్షకర్మ ; ఉదా. గణ్డుదేవరకు నముదునకు దారపోచి యిచ్చినాణ్ణు (AR 77/1956-57. 13-15, 1096) (ix) క్రియ-అవ్యయం : ఉదా. సితమణి బన్దమిచ్చె సన్మణియుతముగన్ (RPS 25-29.6,1065). ఇది పద్యశాసనంలోది.
'''3.74. యత్తదర్ధక యోగం :''' సంస్కృత మర్యాదానుసారి అయిన యత్తదర్థక ప్రయోగం గల వాక్యాలు నాలుగే లభిస్తున్నాయి. ఈరకం వాక్యాలు క్రీ. శ. 9/10 శతాబ్దినుంచి మాత్రమే-అందులోనూ విరళాతి విరళంగా-కనిపిస్తున్నాయి. ఉదా. ''నీకేమి వలయు దాని వేణ్ణికొమ్మ్'' (తె.శా. 1.163-65.30-32, 892-922), ''ఎవ్వణ్డేని రక్షిఞ్చు వానిద ధమ్ము౯వు'' (JAHRS 1.81-85.7, 10); ఈవృత్తి ఎవ్వా౦డేని అపవారించిన నాని పితృపితాంమహంలు 60 వేలే౦డ్లు నయకనరకానం పడుదురు ( SII 10.4.12-14 1008 ); వేగినాణ్టి కెవ్వరు రాజులైరి వారుం భూవ౯స్థితిం దప్పక పాలించువారు ( పై. 6.102.34 88, 1006).<noinclude><references/></noinclude>
dcu9r1zlkcqdpwocnch76p4ycs2pweu
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/112
104
126172
559602
401076
2026-06-15T12:20:49Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రెడ్ చేయబడినది
559602
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|ప్రాచీనాంధ్రం : శాసన భాషాపరిణామం||97}}
తెలుగులోకి వచ్చిన యత్తదర్థక కర్మణ్యర్థక ప్రయోగాలు చాలా విరళంగా ఉండేవి. ఈ సాధారణ పదవిన్యాస క్రమానికి విరుద్ధమైన ప్రయోగాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి.
'''3.71. క్రియాభ్యాసం :''' ప్రాచీనాంధ్రంలో మొట్టమొదట నామాఖ్యానమే గాని క్రియాఖ్యానం లేనేలేదని ఒక నమ్మకముంది (''సోమయాజి'' 1948;143,144,150). అలాంటి క్రియాశూన్యత లేదని నిరూపించటానికే ఎక్కువ నిదర్శనలు లభిస్తాయి. నిజానికి ఇందుకు కావలసిన ఉదాహరణలన్నిటినీ ఇవ్వాలంటే శాసనాలన్నిటినీ ఎత్తి రాయాల్సి వుంటుంది. మచ్చుకు క్రీ. శ. ఏడోశతాబ్ది శాసనాలనుంచి కొన్ని మాత్రం రాస్తాం : బోళచేత శవణ ''గొణిరి'' (ఆం. ప. 1941-42,2,600-25), విషయబోళ కొజిలి (వై. క, కమ్మరి వినియణ ''వ్రాసె'' (SII 10.599 21-22, 625-50), కుమారశమ్మా౯రికి ఉదకపూవ్వ౯జ్కేసి ఇచ్చిరి (EI 30.69-71.5, 689-700 ), కఞ్చగార్లు ''కొట్టిరి'' (పై. 8), గొరవళ్
మెచ్చిచే ''నిచ్చిరి'' (NI. 3. 1152-55.35-36,7). ప్రథమపురుష బహువచనం, మధ్యమ పురుష బహువచనం, ప్రథమపురుమైక వచనం, ఉత్తమ పురుష బహువచనం, మథ్యమపురుషైక వచనం అనే దిగుడు వరసలో సమాపక క్రియలున్న పూర్ణ వాక్యాలు శాసనాల్లో కనిపిస్తాయి.
'''3.72. నామాభ్యాసం :''' క్రియాభ్యాసం కన్న విరళంగా నామాభ్యాసం కనిపిస్తుంది. ఇది మూడు విధాలు. (1) క్రియాపదరహితం : ఉదా. ఇన్దోఱు దీనికి సక్షి (ఆం. ప. 1941-42.4-5,600-25), పెగ్గడ మేడ వ్రాలు (SII 6.250.7, 742-98), దీని అరి నల్తుముడ్లు (AR 233/1949-50.9, 8).
(ii) ధాతుజ విశేషణయుక్తం : ఉదా. కుణ్డికాళ్ళుళ ఇచ్చిన పన్నస ఇరవదియది నాల్కు మఱున్తుఱ్లు నేల (EI 27.225-28.11.14,575-600), లోకమ నిల్పిన స్తానంబు (SII 10.56.2-3, 7 ). (iii) సార్వనామిక విశేష్యయుక్తం : ఉదా. నీవు నా '' ప్రాణసామానుణ్డవైన చెలివి'' (తె. శా. 1.163-65,26.27, 792.922).
'''3.73. విలక్షణవాక్యరచన :''' ఇంతకు ముందు చెప్పిన సాధారణలక్షణాలు పూర్తిగా సరిపడని పదవిన్యాసక్రమం 9 రకాలుగా కనిపిస్తుంది. (i) కర్తలేనివి: ఉదా. వానపోతుల ముచ్చియకు ... ఇచ్చిరి ... నేల ( SII 10.598,
(7}<noinclude><references/></noinclude>
4fdwq0f1i4j1nxtjtvj2861e1orh86k
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/111
104
126173
559599
401074
2026-06-15T12:11:29Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */
559599
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|96||తెలుగు భాషా చరిత్ర}}
'''3.69. మిశ్రపదాలు :''' క్రీ. శ. ఏడో శతాబ్దినుంచి 'మిశ్ర సమాసా'లని, 'వైరిపదా' లని, చెప్పబడే మిశ్రపదాలు లభిస్తూనే ఉన్నాయి. వ్యాకరణాలు నిషేధించినా ఈ పరిస్థితిలో మార్పులేదు. తత్సమ దేశ్యాలతో ఏర్పడ్డ మిశ్రపదాలు సంఖ్యాధికంగా ఉండేవి, తద్భవదేశ్యాలు కలిసిన పైవాటికన్నా సగానికి సగం తక్కువగా ఉండేవి. అయితే ఈ పదమిశ్రణం కావ్యభాషలోనూ పద్యశాసనాల్లోనూ అత్యల్పం; గద్యశాసనాల్లో అత్యధికం ఇది నాలుగు రకాలు. ఉదా. (i) దేశ్యతద్భవ మిశ్రణం; కణ్డసామి (EI 31.74-80.36,669), గొల్లపల్లు (SII 4.1016.2, 1087), మావ్వ౯లగరుడణ్డు (రా. ప. సం. 187-89.7-8,1018), మొగమాడువ్ (శా. ప. మం. 1.2-3 42, 898-934). (ii) దేశ్యతత్సమ మిశ్రణం : అమృతపడి (NI 8. 1072.17,1088), గణ్డభైరవ (SII 10.647.23-24, 1097), జయమాడ (పై. 6.109. 29,1076), పోర్ముఖరామ (పై. 10.599, 1-2, 625-50), మానవత్తి౯క (భారతి 3.33 -94.45,1060). (iii) తత్సమ తద్భవ మిశ్రణం : ఉదారబుద్ధి (SII 10.638.3,9/ 10), ఘనరాచమణి (NI 3.1152-55.20-30,7) చౌషష్టి (భారతి 5. 618.3,850), లోవా దణ్జు (SII 4.1161.5, 1072), సవ్వ౯బాద పరియారువు (రా. ప. సం. 71-72 19-20,847), (iv) దేశ్య తత్సమ తద్భవ మిశ్రణం : వేణవోజన్ఱు (EI 240-42.18-20, 725), దేవొనొజ్ఞలకూ (JAHRS 1.81-85.4,10).
'''3.70. పదవిన్యాసక్రమం :''' ఉచ్చారణపద్ధతి, విరామం, స్వరం మొదలైనవి శాసనకాలంలో ఏవిధంగా ఉండేవో సరిగా తెలీదు కాబట్టి ఆనాటివాక్య నిర్మాణాన్ని గురించి విపులంగా చెప్పటం సాధ్యం కాదు. అయితే లేఖనంలోని పునరావృత రేఖలను బట్టి వాక్యాల ఆద్యంతాలను గుర్తించి వాటి నిర్మాణంలో కనిపించే కొన్ని ప్రత్యేకలక్షణాలను వివరించవచ్చు. ఉద్ధేశ్య విధేయపూర్వక వాక్యరచన సాధారణంగా ఉండేవి. కానీ అక్కడక్కడ ఆ క్రమం మారేది. కర్త సాధారణంగా ప్రథమావిభక్తిలో ఉండేది. కర్మ ప్రాణివాచకమయితే ద్వితీయా చతుర్ధుల్లో ఏదో ఒక దాంట్లోను, జడవాచక మయితే ప్రథమలోను ఉండేది. విధేయం ఉద్ధేశానికి ముందు, అవ్యయం క్రియకు మునుపు, విశేషణం విశేష్యానికి పూర్వాన, పరోక్షకర్మ ప్రత్యక్షకర్మకు వెనకా సాధారణంగా ఉండేవి. నామాఖ్యాన క్రియాఖ్యాన పద్ధతులు రెండూ ఉండేవి. కొన్ని సమయాల్లో ధాతుజవిశేవణాలను కూడా వాడని నామాఖ్యాన పద్ధతి కనిపిస్తుంది, సంస్కృత సాహితీ ప్రభావంవల్ల<noinclude><references/></noinclude>
jrqgll26z9m91jjiz55hmnkv90sr82l
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/109
104
126177
559591
390910
2026-06-15T12:03:57Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */
559591
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>శ్రీ తెలుగు భాషా చర్విత
+72), (1) విట్ట్-అప (50 6.250.7, 149.98 ఏ (1, మార్-అయ్య (07
8.1152-55,8ల,7%, కొచ్చ్ంఇయ ( 8] 827.288-00,4,600-28 3, కొజ్డ్-
ఆయా-కు (57 8 160.4, 4208) ఎజ్-ఎయ (32 18,58-60.12, ₹49ల),
వీట్లో ఇకారాది సపదాంశం గల రూపాలు పదకొండో శతాద్దికిముందు. బహు
విరళంగాను పదకొండో శతాబ్దిలో-ముఖ్యంగా గోదావరీ మండలంలో _ చాలాబహు
శంగాను కనిపిస్తాయి. ఎకారాదివి కన్నడనీమకు దగ్గరలో ఉన్న తెలుగు ప్రాంతాల్లో
అధిక్రాధికంగా ఉండేవి ; [ప్రత్మ్యయగత ఎకార _పభావంవల్డ |పతయాద్యచ్చుతాలవీ]
'కరణంచెందిఉంటుంది. (1) మబున్గ-పిడుకు (వై. 27.281-84.8, 625-560),
మాజ్-పిడుగు. ( వై. 28ిక-880.10-16, 02550 ). () అణంపోతుంలు
(వ్యా. శం. 801-10.2, 600-256)
సంస్కృత సమమైన “అంబా” (ప్రత్యయంగల పదం ఒక్కటి మ్నాతమే
స్రీనాచక (ప్రత్యయంతో దౌరికింది. ఊదా మేట్ జా ఆంబా (52 క180-
89.27.8ల6-45).
స్రీపురషోభయవాచకాలయిన (ప్రత్యయాలు అయిదు మ్మాతం లభించాయి.
ఉదా, (1) పు, తాత్-అమ్మ (వై. 10-100-6.290,674):. స్రీ. కుల్ట్-అమ్మ
( 522 10.400.12-18,8 ); వు. వేజ్ _ అబ్ _ ఒజన్టు ( 52 27,240
కలి, 18.20,725) : స్రీ. బిజేక్.అవ్వూ. (౮4౩5 90.106-201. కి 9570);
(ఫ్రుపు. దేవ్-అజ్జీ (గ 125.4 10) : స్త్రీ. భూమ్-అజ్జియును. (5౯
శ్1088.% 1095; (గూ పు,పడ్-అలు (పై, 6.1885.4 1090 : స్ర్రీ.మన్మత్-
ఆప (వై. 10.560.1,7); (1) పు, కూచ-పోటింకి ( 3727.242.44.12,760 ):
శ్రీ- సన్తి -పోటి (వై. 28క-86.7,025-50 ). పైవాటిలోని ఆబ్డు-అవ
(ప్రత్యయాలు రెండూ మూలదక్షిణ (దావిడళబ్ధింేఆళ్/*4ఆజ్ (== శేవ్యక్రి) నుంచి
ఏర్పడ్డవి. స్త్రీపురుషనామాలు రెంటిలోనూ పునరు క్త ప్రత్యయాలు కొన్ని సమ
యాల్లో కనిపిస్తాయి. ఉదా, పు. విద్డ్-ఆమ్-ఆయ్య (22 1284, 650 ),
తిక్క్-అప్-ఆయ్య ( ౨2 10.6 81048 ); . స్త్రీ. మీన్-వ్ఆ-అమ్మ (వై.
ఈ,18ి,8, 10, పాంవ్-అక్-అమ్మంకు (మై. 111.9, 1084). అయితే ఈ
పద్ధతి బహు విరళంగా ఉండేది.
పూజ్యతను నూచించటానికి బహువచన లు (ప్రత్యయాన్ని అధికంగా వాడే
వారు. అదిగాక మరి నాలుగు (ప్రత్యయాలు శాసనాల్లో కనివిస్తాయి.. వాటిలో<noinclude><references/></noinclude>
647ye5xfi6idcxep4lnw5f4ghx9ik8l
559640
559591
2026-06-15T12:54:30Z
Sumedhag28
7359
559640
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude> 94 తెలుగు భాషా చర్విత
+72), (1) విట్ట్-అప (50 6.250.7, 149.98 ఏ (1, మార్-అయ్య (07
8.1152-55,8ల,7%, కొచ్చ్ంఇయ ( 8] 827.288-00,4,600-28 3, కొజ్డ్-
ఆయా-కు (57 8 160.4, 4208) ఎజ్-ఎయ (32 18,58-60.12, ₹49ల),
వీట్లో ఇకారాది సపదాంశం గల రూపాలు పదకొండో శతాద్దికిముందు. బహు
విరళంగాను పదకొండో శతాబ్దిలో-ముఖ్యంగా గోదావరీ మండలంలో _ చాలాబహు
శంగాను కనిపిస్తాయి. ఎకారాదివి కన్నడనీమకు దగ్గరలో ఉన్న తెలుగు ప్రాంతాల్లో
అధిక్రాధికంగా ఉండేవి ; [ప్రత్మ్యయగత ఎకార _పభావంవల్డ |పతయాద్యచ్చుతాలవీ]
'కరణంచెందిఉంటుంది. (1) మబున్గ-పిడుకు (వై. 27.281-84.8, 625-560),
మాజ్-పిడుగు. ( వై. 28ిక-880.10-16, 02550 ). () అణంపోతుంలు
(వ్యా. శం. 801-10.2, 600-256)
సంస్కృత సమమైన “అంబా” (ప్రత్యయంగల పదం ఒక్కటి మ్నాతమే
స్రీనాచక (ప్రత్యయంతో దౌరికింది. ఊదా మేట్ జా ఆంబా (52 క180-
89.27.8ల6-45).
స్రీపురషోభయవాచకాలయిన (ప్రత్యయాలు అయిదు మ్మాతం లభించాయి.
ఉదా, (1) పు, తాత్-అమ్మ (వై. 10-100-6.290,674):. స్రీ. కుల్ట్-అమ్మ
( 522 10.400.12-18,8 ); వు. వేజ్ _ అబ్ _ ఒజన్టు ( 52 27,240
కలి, 18.20,725) : స్రీ. బిజేక్.అవ్వూ. (౮4౩5 90.106-201. కి 9570);
(ఫ్రుపు. దేవ్-అజ్జీ (గ 125.4 10) : స్త్రీ. భూమ్-అజ్జియును. (5౯
శ్1088.% 1095; (గూ పు,పడ్-అలు (పై, 6.1885.4 1090 : స్ర్రీ.మన్మత్-
ఆప (వై. 10.560.1,7); (1) పు, కూచ-పోటింకి ( 3727.242.44.12,760 ):
శ్రీ- సన్తి -పోటి (వై. 28క-86.7,025-50 ). పైవాటిలోని ఆబ్డు-అవ
(ప్రత్యయాలు రెండూ మూలదక్షిణ (దావిడళబ్ధింేఆళ్/*4ఆజ్ (== శేవ్యక్రి) నుంచి
ఏర్పడ్డవి. స్త్రీపురుషనామాలు రెంటిలోనూ పునరు క్త ప్రత్యయాలు కొన్ని సమ
యాల్లో కనిపిస్తాయి. ఉదా, పు. విద్డ్-ఆమ్-ఆయ్య (22 1284, 650 ),
తిక్క్-అప్-ఆయ్య ( ౨2 10.6 81048 ); . స్త్రీ. మీన్-వ్ఆ-అమ్మ (వై.
ఈ,18ి,8, 10, పాంవ్-అక్-అమ్మంకు (మై. 111.9, 1084). అయితే ఈ
పద్ధతి బహు విరళంగా ఉండేది.
పూజ్యతను నూచించటానికి బహువచన లు (ప్రత్యయాన్ని అధికంగా వాడే
వారు. అదిగాక మరి నాలుగు (ప్రత్యయాలు శాసనాల్లో కనివిస్తాయి.. వాటిలో<noinclude><references/></noinclude>
rng72c5ibokbnzdnfhq5jbdpjc8yin5
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/110
104
126178
559594
390911
2026-06-15T12:07:39Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */
559594
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>(ప్రాచీనాంధ్రం ; కాసనథాషా పరిణామం 0గ్ర
చివరిది (- గార్యు/-వారు) ఇప్పటికి. నిలిచింది. ఉదా, (1) జేయమ్-ఆయ్యరు
(మై. 10.528.6, 9265-50). ఇది తమిళంనుంచి ఎరువుగా వచ్చింది. (11) కణమణ
ఎయ్-ఆరు (హ్ 80 69-71.8, 899-700), ఇది *అవర్. శబ్దభవం కావచ్చు.
(19 రేవణ-కాలు (థె. 27.221-25.7,575-000), కుజ్జి.కాళ్ట (పై. 225
వి8ి,8, 575-600). “కుణ్ణిపొదాః' అనే సంస్కృతళద్దానికి ఇది ఎరువు అనువాద
మనటం సంభావ్యం. (ప్రై పోశజ్యం-గార్-ఇ (తె. 5.127-81.29. 692.922),
విట్టపరడ్డి*వార్ -ఇకి (వ22 6.250.8.742-94).... వీటిలో. రెండోది అధిక
వూజ్యతను సూచిస్తుంది.
తి.68. పదజూలం : సంప్రదాయవ్యాకరణాలు భాషలోన్ని పదజాలాన్ని
తత్సమ, తద్భవ,దేశ్యాలనే మూడు (ప్రధానభాగాల కింద విభజించాయి. అవి
ఇచ్చిన నిర్వచనాలతోగాని వాటి విభజన (ప్రణాశికతోగాని నిమిత్తం లేకుండా,
థెలుగుతోకి వన్చిన ఎరువుమాటలూ వాటి పదాంళాలు తెలుగు వర్ణమాలలో మార్చు
లేకుండా ఇమిడిపోతే తద్భవమనీ, లేకపోతే తత్సమననీ, ఆరెండు రకాల పదాం
శాలూ కలిసి ఏర్పడ్డపదం మ్మిశ్రమపదమనీ ఇక్కడ పరిగణిస్తున్నాం. పూర్వ
వ్యాకరణాలు ప్రాతిపదికనేగాని [ప్రత్యయాలను ఈ సందర్భంలో గణించలేదు.
ఇక్కడ పదాంళాలనుబట్టి విభజన జరుగుతుంది, ఆలేక్కన దేశ్యదేశ్యేతర పద
జాలాన్ని పోల్చి చూస్తే తెలుగులో ఇమిడిపోయిన ఎరువు మాటలు క్రీ. శ. 8-10
శతాబ్ధులమధ్య మొత్తం పదజాలంలో నూటికి 20-26 పాళ్ళు ఉండగా 10, 11
శతాబ్దుల్లో నూటికి 50 ఫాన్ళ అయినాయి. కావ్యభాషా (ప్రభావమే ఇందుకు
ముఖ్య కారణం. ఎరువు మాటల్లో అత్యధికభాగం సంస్కృత 1ప్రాకృతాలనుండి
వచ్చినవే.
సంస్కృతం నుంచి ఎరువుగొ వచ్చిన మాటల్లో ముఖ్యంగా రెండు మార్పులు
శనిపిస్తాయి 2 ఒకటిఆర్థవిపరిణామం, రెండు సంస్కృత వ్యాకరణ విరుద్ధత. ఉదా.
(గ్ర) అర్థవిపరిణామానికి ; వక్రమ్బు ( = అడ్డు, 2/2 1.267.2,0850), కరణమ్
(౫ (గ్రామాధికారి. 51! 10. 6క5.49-50,1060), జీవితంబు (= జీతం, కౌ,లా,
1.168-05.62-68, 892-929), నియోగముల్( జాజిల్హాలు 520 10.645.
58,1080) మొదలై నవి. (1) వ్యాకరణ విరుద్ధతకు : (ప్రధాని (ఫై. ఓ.1010.,
105), మనోవల్లభి, వనజన్నేతి (22 4.581418. 21,1075=76), ఊరమారి
(527 8.108.29,107 మొదలై నవి,<noinclude><references/></noinclude>
01tlbyadxqd309v4t3rfismmi60y0gi
559597
559594
2026-06-15T12:10:01Z
Sumedhag28
7359
స్పేసింగ్ సరి చేయబడినది
559597
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>(ప్రాచీనాంధ్రం ; కాసనథాషా పరిణామం 0గ్ర
చివరిది (- గార్యు/-వారు) ఇప్పటికి. నిలిచింది. ఉదా, (1) జేయమ్-ఆయ్యరు (మై. 10.528.6, 9265-50). ఇది తమిళంనుంచి ఎరువుగా వచ్చింది. (11) కణమణ
ఎయ్-ఆరు (హ్ 80 69-71.8, 899-700), ఇది *అవర్. శబ్దభవం కావచ్చు. (19 రేవణ-కాలు (థె. 27.221-25.7,575-000), కుజ్జి.కాళ్ట (పై. 225 వి8ి,8, 575-600). “కుణ్ణిపొదాః' అనే సంస్కృతళద్దానికి ఇది ఎరువు అనువాద
మనటం సంభావ్యం. (ప్రై పోశజ్యం-గార్-ఇ (తె. 5.127-81.29. 692.922), విట్టపరడ్డి*వార్ -ఇకి (వ22 6.250.8.742-94).... వీటిలో. రెండోది అధిక
వూజ్యతను సూచిస్తుంది.
తి.68. పదజూలం : సంప్రదాయవ్యాకరణాలు భాషలోన్ని పదజాలాన్ని తత్సమ, తద్భవ,దేశ్యాలనే మూడు (ప్రధానభాగాల కింద విభజించాయి. అవి ఇచ్చిన నిర్వచనాలతోగాని వాటి విభజన (ప్రణాశికతోగాని నిమిత్తం లేకుండా, థెలుగుతోకి వన్చిన ఎరువుమాటలూ వాటి పదాంళాలు తెలుగు వర్ణమాలలో మార్చు
లేకుండా ఇమిడిపోతే తద్భవమనీ, లేకపోతే తత్సమననీ, ఆరెండు రకాల పదాం శాలూ కలిసి ఏర్పడ్డపదం మ్మిశ్రమపదమనీ ఇక్కడ పరిగణిస్తున్నాం. పూర్వ వ్యాకరణాలు ప్రాతిపదికనేగాని [ప్రత్యయాలను ఈ సందర్భంలో గణించలేదు. ఇక్కడ పదాంళాలనుబట్టి విభజన జరుగుతుంది, ఆలేక్కన దేశ్యదేశ్యేతర పద
జాలాన్ని పోల్చి చూస్తే తెలుగులో ఇమిడిపోయిన ఎరువు మాటలు క్రీ. శ. 8-10 శతాబ్ధులమధ్య మొత్తం పదజాలంలో నూటికి 20-26 పాళ్ళు ఉండగా 10, 11
శతాబ్దుల్లో నూటికి 50 ఫాన్ళ అయినాయి. కావ్యభాషా (ప్రభావమే ఇందుకు ముఖ్య కారణం. ఎరువు మాటల్లో అత్యధికభాగం సంస్కృత 1ప్రాకృతాలనుండి
వచ్చినవే.
సంస్కృతం నుంచి ఎరువుగొ వచ్చిన మాటల్లో ముఖ్యంగా రెండు మార్పులు శనిపిస్తాయి 2 ఒకటిఆర్థవిపరిణామం, రెండు సంస్కృత వ్యాకరణ విరుద్ధత. ఉదా. (గ్ర) అర్థవిపరిణామానికి ; వక్రమ్బు ( = అడ్డు, 2/2 1.267.2,0850), కరణమ్
(౫ (గ్రామాధికారి. 51! 10. 6క5.49-50,1060), జీవితంబు (= జీతం, కౌ,లా, 1.168-05.62-68, 892-929), నియోగముల్( జాజిల్హాలు 520 10.645.
58,1080) మొదలై నవి. (1) వ్యాకరణ విరుద్ధతకు : (ప్రధాని (ఫై. ఓ.1010.,105), మనోవల్లభి, వనజన్నేతి (22 4.581418. 21,1075=76), ఊరమారి
(527 8.108.29,107 మొదలై నవి,<noinclude><references/></noinclude>
622r98c39tf8pe8r6bz6jl4i0cfrmfz
559598
559597
2026-06-15T12:11:03Z
Sumedhag28
7359
559598
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>(ప్రాచీనాంధ్రం ; కాసనథాషా పరిణామం 0గ్ర
చివరిది (- గార్యు/-వారు) ఇప్పటికి. నిలిచింది. ఉదా, (1) జేయమ్-ఆయ్యరు (మై. 10.528.6, 9265-50). ఇది తమిళంనుంచి ఎరువుగా వచ్చింది. (11) కణమణ
ఎయ్-ఆరు (హ్ 80 69-71.8, 899-700), ఇది *అవర్. శబ్దభవం కావచ్చు. (19 రేవణ-కాలు (థె. 27.221-25.7,575-000), కుజ్జి.కాళ్ట (పై. 225 వి8ి,8, 575-600). “కుణ్ణిపొదాః' అనే సంస్కృతళద్దానికి ఇది ఎరువు అనువాద
మనటం సంభావ్యం. (ప్రై పోశజ్యం-గార్-ఇ (తె. 5.127-81.29. 692.922), విట్టపరడ్డి*వార్ -ఇకి (వ22 6.250.8.742-94).... వీటిలో. రెండోది అధిక
వూజ్యతను సూచిస్తుంది.
'''3.68. పదజూలం''' : సంప్రదాయవ్యాకరణాలు భాషలోన్ని పదజాలాన్ని తత్సమ, తద్భవ,దేశ్యాలనే మూడు (ప్రధానభాగాల కింద విభజించాయి. అవి ఇచ్చిన నిర్వచనాలతోగాని వాటి విభజన (ప్రణాశికతోగాని నిమిత్తం లేకుండా, థెలుగుతోకి వన్చిన ఎరువుమాటలూ వాటి పదాంళాలు తెలుగు వర్ణమాలలో మార్చు
లేకుండా ఇమిడిపోతే తద్భవమనీ, లేకపోతే తత్సమననీ, ఆరెండు రకాల పదాం శాలూ కలిసి ఏర్పడ్డపదం మ్మిశ్రమపదమనీ ఇక్కడ పరిగణిస్తున్నాం. పూర్వ వ్యాకరణాలు ప్రాతిపదికనేగాని [ప్రత్యయాలను ఈ సందర్భంలో గణించలేదు. ఇక్కడ పదాంళాలనుబట్టి విభజన జరుగుతుంది, ఆలేక్కన దేశ్యదేశ్యేతర పద
జాలాన్ని పోల్చి చూస్తే తెలుగులో ఇమిడిపోయిన ఎరువు మాటలు క్రీ. శ. 8-10 శతాబ్ధులమధ్య మొత్తం పదజాలంలో నూటికి 20-26 పాళ్ళు ఉండగా 10, 11
శతాబ్దుల్లో నూటికి 50 ఫాన్ళ అయినాయి. కావ్యభాషా (ప్రభావమే ఇందుకు ముఖ్య కారణం. ఎరువు మాటల్లో అత్యధికభాగం సంస్కృత 1ప్రాకృతాలనుండి
వచ్చినవే.
సంస్కృతం నుంచి ఎరువుగొ వచ్చిన మాటల్లో ముఖ్యంగా రెండు మార్పులు శనిపిస్తాయి 2 ఒకటిఆర్థవిపరిణామం, రెండు సంస్కృత వ్యాకరణ విరుద్ధత. ఉదా. (గ్ర) అర్థవిపరిణామానికి ; వక్రమ్బు ( = అడ్డు, 2/2 1.267.2,0850), కరణమ్
(౫ (గ్రామాధికారి. 51! 10. 6క5.49-50,1060), జీవితంబు (= జీతం, కౌ,లా, 1.168-05.62-68, 892-929), నియోగముల్( జాజిల్హాలు 520 10.645.
58,1080) మొదలై నవి. (1) వ్యాకరణ విరుద్ధతకు : (ప్రధాని (ఫై. ఓ.1010.,105), మనోవల్లభి, వనజన్నేతి (22 4.581418. 21,1075=76), ఊరమారి
(527 8.108.29,107 మొదలై నవి,<noinclude><references/></noinclude>
bndon01i3ij1sun7r94njxset24qbms
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/116
104
127497
559624
401081
2026-06-15T12:35:35Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రీడ్ చేయబడినది
559624
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|ప్రాచీనాంధ్రం : శాసన భాషా పరిణామం||101}}
ఉండేదని, తెలుగుమీద మొదట ప్రాకృతప్రభావమూ తరవాత సంస్కృత ప్రభావమూ అధికంగా ఉండేవనీ అనుకొనేవారు. అత్యంత ప్రాఛీన శాసనకాలంనాటికే తెలుగు ప్రత్యేక భాషగా విలక్షణ నిర్మాణంతో ఉండేదని తెలుస్తుంది. భాష ఎప్పుడూ తనకు స్వతస్సిద్ధమయిన వ్యవస్థతోనే ఉంటుంది. ఆ వ్యవస్థను గుర్తించి వర్ణించటమే వ్యాకరణాల పని వ్యవస్థే లేనప్పుడు వర్ణన సాధ్యం కానేకాదు; వర్జన సాధ్యమైనప్పుడు ఆ వ్యవస్థ, ద్రవస్థితి అనే మాటలకు అర్ధమేలేదు. రాజాదుల ఆజ్ఞలు కొన్ని తెలుగులో ఉన్నంతమాత్రాన తెలుగు రాజభాషగా ఉండేదని చెప్పలేము. పరిపాలన సౌలభ్యంకోసం గాని, తమ దానధర్మాదులను తమను ప్రస్తుతించుకోటానికి గాని తెలుగులో శాసనాలువేసి ఉంటారు. ఇప్పటి అధికారభాష ఆంగ్లమైనా సామాన్య ప్రజలకు తెలియవలసిన విషయాలను ప్రభుత్వం తెలుగులో ప్రకటించటానికి ఆనాటి పరిస్థితికి భేదంలేదు. అలాగే ప్రాకృత ప్రభావం తొలిదశ లో ఎక్కువగా ఉన్నదనటానికి గూడా ఆధారాలు దొరకలేదు.
'''3.81. ప్రాగాంధ్రదశ :''' దొరికిన శాసనాల్లో అత్యంత ప్రాచీనమైన దాని కాలంనాటికే తెలుగులో కొన్ని ప్రధాన పరిణామాలు జరిగేయి. ధాతువుకూ ప్రత్యయాలకూ మధ్య అచ్చులు చేరటం. వర్ణవ్యత్యయ అచ్సంకోచాలవల్ల పదాదిని సరళాలూ సంయుక్తాక్షరాలు ఏర్పడటం, వర్జసమీకరణంవల్ల పరుషాలు ద్విరుక్తం కావటం, తాలవ్యీకరణంవల్ల కకారం చకారం కావటం వంటివి కొన్ని ప్రధాన పరిణామాలు.
'''3.82. ప్రాక్సాహిత్యదశ :''' చరిత్రకాలంలో జరిగిన మార్పులను బట్టి క్రీ. పూ. 200- క్రీ. శ. 1100 మధ్యనున్న తెలుగుభాషాచరిత్రను మూడుదశలుగా విభజించవచ్చు మొదటిది. క్రీ. పూ. 200- క్రీ. శ. 6 శతాబ్ధుల మధ్యదశ; దీని ప్రాక్సాహిత్యదశ అనవచ్చు. ఈకాలంలో ఱకారం ప్రత్యేకవర్ణంగా ఉండేది. రేఫఱకారాలు ఓకే వర్ణంగా మిళితం కావటం మధ్యాంధ్రదేశంలో ఆరంభమయింది. దేశీయమైన పరసవర్ణాదేశానికి బదులు అనుస్వారాన్ని ఉపయోగించి లేఖనపద్ధతిని సులభీకరించటం మొదలయింది. పదాంతసంధి ఉండేదికాదు. పదమధ్యసంధులు మొదలైనాయి. గసడదవాదేశం వైకల్పికంగా ఉండేది. మొత్తంమీద తరవాతి కాలంలోని భాషకు నిరూపకమైన విలక్షణనిర్మాణక్రమం, ప్రత్యేకభాషాక్రమం ఏర్పడ్డాయి. సంస్కృతసంపర్కం, ప్రభావం బాగా ఉండేవి.
'''3.83. సాహిత్యదశ :''' క్రీ. శ. 7-9 శతాబ్దుల మధ్యకాలంలో తెలుగుభాషలో సాహిత్యదశ ఆరంభమయింది. వ్యావహారిక సాహిత్య మాండలికాలు<noinclude><references/></noinclude>
metn8pceeo0p6966ns3oy74g959uoap
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/120
104
127538
559628
401232
2026-06-15T12:42:51Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రీడ్ చేయబడినది
559628
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|శాసన భాషా పరిణామం||105}}
బ్రాహ్మణ, వహ్ని మొదలగు శబ్దాల్ని ప్రాక్సృతభాషలలో ప్రాచీనకాలం లోనే బ్రామ్హణ, వన్హి అని ఉచ్చరించే వారట, ఈయుగంలో కూడా అలాగే ఉచ్చరించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. వన్హి ( S1I 4.675.36, 1140) మొ. వి. నరసింహ శబ్దాన్ని నరసింహ్మ అని విలోమపద్ధతిలో వ్రాసి ఉండటంచేత దీనిని నరసిమ్హ అని ఉచ్చరించినట్లు ఊహించవచ్చు.
'''4.3. ఱకారం :''' ఈ యుగంలో ఱ కారం కొన్ని సంజ్ఞావాచకాల్లోనే కనబడుతుంది. అదీ సాధారణంగా విశాఖ-శ్రీకాకుళం ప్రాంతానికే పరిమితం. ఉదా : నిఱు జెఱ్వు ( SII 10.684 3,1133 ) , తాలాంఱ ( పై. 10.674.10, 1131), చోఱగంగ (పై. 10.665.7, 1124 ). పై ఉదాహరణలన్నీ 12 వ శతాబ్దిలొనివే. 13 వ శతాబ్దిలో ఱుత్తిక (పై. 10,262.9, 1218) తప్ప వేరే ప్రయోగాలు లేవు. 14వ శతాబ్దిలో అసలు బొత్తుగా కనబడదు. ఈ ఱకార ప్రయోగం 12వ శతాబ్దిలో విశాఖ-శ్రీకాకుళ ప్రాంతంలోనే కనిపించినా 13వ శతాబ్దిలోని ఱుత్తిక శబ్దం పశ్చిమ గోదావరిలోని తణుకు తాలూకాలో కనిపిస్తుంది. పై శతాబ్దాలకు నిడుం జెఱువు. తాలాండ, డుత్తిక అనే రూపాలు తరచుగా కనిపిస్తాయి. పై శబ్డాలన్నీ సంఙ్ఞావాచకాలే కాబట్టే ఇవన్నీ కేవలం వ్రాతలోనే నిల్చిఉన్నాయనీ అవి ఉచ్చారణలో లేవనీ చెప్పవచ్చు. అదీగాక సఱపంగలవాండు (SII 5.1083.1, 1108), విహారవాఱ (పై. 10.690. 8, 1139)మొ రూపాల్లో డకారానికి బదులు ఱకారం వ్రాతలో ఉంది. కాబట్టి పై ప్రా౦తంలో ప్రాచీన లేఖనా పద్ధతి నిల్చి ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఱకారాన్ని వర్ణంగా తీసుకోనక్కరలేదు.
'''4.4. ఛకారం :''' ఛకారం శాసనాల్లో కనిపిస్తుంది. కాని దాన్ని వర్ణంగా తీసుకోనక్కరలేదు. ఎందుకంటే చకారం ద్విత్వమయ్యే టప్పుడూ, అనుస్వారం తర్వాత వచ్చేటప్పుడూ సాధారణంగా ఛకారంగా వ్రాయబడి ఉంది. ఉదా. ఇచ్చిరి/ఇచ్చిరి, సమర్పించిరి/సమర్పింఛిరి. ఇట్టి ప్రయోగాలు సాధారణంగా. విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. ఇట్లు ఈ ప్రాంతంలో రెండు రూపాలు పర్యాయంగా కనబడ్డంచేత ఛకారాన్ని చకారానికి రూపాంతరం అనవచ్చు. కాని దాన్ని వర్ణంగా చెప్పనక్కరలేదు.
'''4.5. [చ,చ]లు :''' చవర్జం నేడు తాలవ్యాచ్చుల ముందు తాలవ్యంగాను<noinclude><references/></noinclude>
2u428ryhcy0551j943s8g2yik2c33sv
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/117
104
127541
559627
401082
2026-06-15T12:41:33Z
Sumedhag28
7359
/* అచ్చుదిద్దారు */ ప్రూఫ్ రెడ్ చేయబడినది
559627
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Sumedhag28" /></noinclude>{{rh|102||తెలుగు భాషా చరిత్ర}}
ఏర్పడటం, పద్యశాసనాలు తలచూపటం, లేఖనం నుంచి నిర్మాణ్మక్రమం వరకూ అన్నిటిలోనూ కొత్త పరిణామాలు వచ్చి స్థిరపడటం ఈ ద్వితీయదశలోని ప్రధాన లక్షణాలు. సంస్కృత ప్రభావంవల్ల రేఫమీది హల్లుల్ని ద్విరుక్తంచేసి రాయటమనే సంప్రదాయం వచ్చింది. అరసున్న కొత్త ధ్వనిగా స్వతంత్రంగా మొలకెత్తింది. పద్య శాసనాలవల్లనే దాన్ని పునర్నిర్మించటం సాధ్యమయ్యేది. ద్విరుక్తాద్విరుక్తహల్లులున్న జంటమాటలు పుట్టుకొచ్చాయి. పదాదిన యవకారాలను వాడటం మొదలైంది. ఱకారం వర్ణత్వం కోల్పోయి అచ్చులమధ్య డకారంగానూ, సంయుంక్తాక్షరాల్లో రేఫగానూ పరిణమించింది. అజ్మధ్య డకారం ణకారంగా మారటం ఆరంభమయింది. సంయక్తాక్షరాల్లో రేఫ వకారపరంగా ఉంటే వకారం లోపించటం, ఇతర హల్లులతో ఉంటే తానే జారిపోవటం మొదలయింది. 'న్ఱ’ అనే సంయుక్తధ్వని 'ణ్ణ'గా మారింది. వ్యుత్పత్తులు స్పష్టంగా తెలిసిన దేశ్యపదాల్లో పదాదిసరళాలు కనిపించటం ప్రారంభమయింది. శకటరేఫ ప్రత్యేకవర్ణత్వం పోగొట్టుకుని రేఫతో మేళనం పొందింది. అత్సంధి వైకల్పికంగా ఉండేది. గసడదవాదేశం బహుళంగా మారింది. దృతసంధి పద్యరచనల్లో నిత్యంగాను, గద్యంలో వైకల్పికంగాను ఉండేది. అమహదేకవచన ప్రత్యయం 'బు' అనేది 'ము, వు, మ్ము'లుగా పరిణమించింది. మిశ్రసమాస కల్పనం జోరుగా సాగింది. కర్మణి ప్రయోగమూ, యత్తదర్ధక ప్రయోగమూ సంస్కృతంనుంచి ఎరువుగా వచ్చిపడ్డాయి. 'మణిప్రవాళశైలి' ఆచారంలోకి వచ్చింది. నాలుగోవంతు మాటలు ఎరువుగా వచ్చాయి.
'''3.84. కావ్యభాషాదశ :''' క్రీ. శ. 10, 11 శతాబ్దుల్లో కావ్యభాషా ప్రభావంవల్ల వాడుకభాషలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఇది భాషాచరిత్రలో కావ్యభాషాదశ. ఈ కాలంలో బయలుదేరిన మార్పులు క్రీ.శ. 1100 నాటికి భాషలో స్థిరపడలేదు. ఈ దశలో వచ్చిన పెద్దమార్పు పదజాలానికి సంబంధించింది. ఎరువుమాటల సంఖ్య మొత్తంలో సగానికి సగంగా ఉంది. తద్ధర్మార్థక విశేషణ ప్రత్యయం 'ఎడి/-ఎడు' అనేది 'ఏ/-ఏటి'గా మారటం మొదలయింది. మహద్వాచకాల ప్రథమపురుషైకవచనంలోని తచ్చబ్ధవకారం లోపించటం ఆరంభమయింది. అమహత్ప్రత్యయం 'ము' లోపించటం, దానికి ముందున్న స్వరం దీర్ఘం కావటం మొదలయింది. నామాంతంలోని '-ఇయ'లో ఆద్యచ్చు లోపించటం మొదలయింది. వర్ణవ్యత్యయంవల్ల రెండు హ్రస్వాచ్చులు పక్కపక్కల చేరినప్పుడు అవి దీర్ఘాచ్చుగా మారటం ఆరంభమయింది.<noinclude><references/></noinclude>
q3od0id0gnqn4xp3qwvgtc7a8lmg67u
పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/12
104
141977
559749
421159
2026-06-15T20:38:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559749
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యాతారార్కసుధాంశువై కమలజాతాకల్పమై యెప్పుడున్
జ్యోతిశ్చక్రముఁ బోలెఁ గ్రాలవలదా సొం(పారి కావ్యం బిలన్).</poem>|ref=17}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యిష్టదేవతాప్రార్థనంబును, గురుప్రశంసయుఁ, గవీశ్వరప్రస్తుతియుఁ, గుకవినిరాకరణంబునుం జేసి యొక్క కవితావిధానంబు శైవంబుగా సుకుమారచరిత్రంబు (చెప్పంబూనిన యవసరంబున) స్వస్తి శ్రీపర్వతస్వయంభూ శ్రీలింగచక్రవర్తి శ్రీమన్మల్లికార్జునమహాదేవుని ముఖమండపంబున సుఖాసీనులయి యంచుగండ(దేవ) పృథ్వీమహా(మహత్తును, నానాదేశాగతానేక బ్రాహ్మణ)భక్తప్రకరంబులును, విజయసదృక్షులగు శుద్ధక్షత్రియులును, ధనపతిసమానసంపద్భాసితులగు వైశ్యులును, నిర్వక్రపరాక్రములగు వీరభటులును, <ref>తాళపత్రమున లేదు</ref>(శంకరపురాధ్యక్షులును), స్థానా(ధికారులును, బాహత్తరి)నియోగంబును, గుండలి దండ లాసక <ref>తా. ప్రేరణ ప్రేక్ష్యకంబులైన</ref>ప్రేరణి ప్రేంఖణంబులైన చతుర్విధనృత్తగీతవాద్యాభిజ్ఞులును, గళావిలాస<ref>ము. కరుణాబంధుర</ref>కరణాసనబంధురబంధభేదంబులం <ref>ము. గంధర్వసంగర</ref>గందర్పసంగరప్రవీణలయిన (కురంగలోచనలును బలసి)యుండ, శ్రీశాంతభిక్షావృత్తియతీశ్వరుండు శివకథావిధానంబులఁ <ref>తా. బ్రొద్దుపుచ్చుచు</ref>బ్రొద్దులు పుచ్చుచుఁ దన మూలభృత్యుండగు <ref>ము. పువ్వలపు</ref>నుప్పలపు ముమ్మడిదేవయ్య శాంతునిం గనుంగొని నీ పేర (నంకితంబుగా నంధ్రభాషా) కవిత్వంబున నీ కథ యుపన్యసింపుమనిన మహాప్రసాదంబని సత్కవిసార్వభౌముండగు శ్రీనాథకవివరేణ్యుని గృపావిశేషంబునం గాంచి శ్రీమన్మల్లికార్జున మహాదేవ(దేవు పాదపద్మారాధకులగు) అంచుగండముఖ్య <ref>ము. వరుణా... ... ... లోష్ఠ</ref>రేవణసిద్ధ యేకోరామేశ్వర పండితారాధ్యాది చాతుర్వర్ణ్యంబులం గలిగిన మ(తంబుల) యందు (పండితారాధ్యహస్తసంభూత వంశంబులయందు నుద్భవం)బందిన మల్లినాథగురుండు.</poem>|ref=18}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>లింగార్చనక్రియాలీల నే ప్రొద్దును
గరికాల<ref>తా. భూనాథు</ref>చోడని కరణివాఁడు
జంగమారాధనాసక్తి మై(నేపార
బల్లాణభూనాథు పాడివాఁడు
పరమశైవాచారపాండిత్యవిస్ఫూర్తి
సంగన బసువయ్య) సరణివాఁడు
వరధర్మచాతురీవైభవఖ్యాతిచే
<ref>ము. సేనమ</ref>చెన్నమరాయని చెలువువాఁడు</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ననఁగ నిద్ధాత్రి నింపారు నఖిలకళల
సకలనిర్మాణవిద్యాప్రశస్తుఁ డనఁగ
మానితైశ్వర్యసంప్రాప్త(మహితయశుఁడు)
మల్లికార్జునయోగిసమాజ<ref>ము. పరుఁడు</ref>వరుఁడు.</poem>|ref=19}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆతని వంశంబునఁ బ్ర-
<ref>ము. ఖ్యాతిగఁ జరితప్రతాప</ref>ఖ్యాతచరిత్రప్రతాపకలనాధర్ముం
డాతతవిక్రమశీలుఁడు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
2uc2m33rgatawg36urhbjn1pp8luzr8
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/21
104
151824
559720
442614
2026-06-15T16:31:12Z
Vjsuseela
1850
/* పాఠ్యం లేనిది */
559720
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Vjsuseela" /></noinclude><noinclude><references/></noinclude>
k5e0hsvtgy26zqylo7htv9gmmyrwsj6
పుట:Andhra Granthalayam 1940 03,06 01 Volume No 01 Issue No 03,04 1.pdf/5
104
154906
559768
514040
2026-06-16T03:40:05Z
Vjsuseela
1850
559768
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vjsuseela" /></noinclude>[[దస్త్రం:Gidugu Venkata Ramamurthy from Andhra Granthalayam 1940 03,06 01 Volume No 01 Issue No 03,04 1 (page 5 crop).jpg|center|300px]]
{{Center|మహామహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ, రావుసాహెబ్ </br>
కీ.శే.గిడుగు వెంకటరామమూర్తి పంతులు}}
{{rh|జననం||మరణం}}
{{rh|12-8-1863||22-1-1940}}<noinclude></noinclude>
aeqaa24dopuulcd9uwzn9i4gvx58kzs
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/88
104
160819
559647
477902
2026-06-15T13:01:34Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559647
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" />180 గ్రంథాలయ సర్వస్వము.</noinclude><section begin="88A" />బూర్వము, పాణిని భగవానుఁడు తన యవతారముపసంహరించుకొనియెననియు నెఱుఁగనయ్యెడిని.
మహాభారతసంహిత యిప్పటి వ్యానునిచేఁగాని తచ్ఛిష్యపుత్రుఁడుగు లౌమహర్షిణిచేఁగాని యుగ్రశ్రవసునిచేఁగాని రచింపఁబడినది కావున, నాలుగువేలేండ్లకు వెనుకఁ బుట్టినదని సందేహమించుకయు లేదు. కావునఁ బాణిని యిప్పటికించుమించు 4500 యేండ్లకు వెనుకటి
వాఁడని మహాభారతమునఁ దేలుచున్నది.{{right|(మిగిలియున్నది)}}
<section end="88A" />
<section begin="88B" />{{p|fs150|ac}}{{Double underline|లోవైను విశ్వవిద్యాలయము - గ్రంథ భాండాగారము}}</p>
{{Center|పెద్దిభొట్ల కామయ్య గారిచే వ్రాయబడినది}}.
కొలఁది మాసముల క్రిందట, శాంతిపూర్ణంబై సర్వకళానిలయంబై జ్ఞానోత్పత్తిమూలంబై మనోరంజకంబై విరాజిల్లుచుండెడి"లోవైను" పట్టణ ప్రస్తతి స్థితిగతులు
తిలకించినయెడల ఎట్టి ఱాతి గుఁడెయైన నీరు గాక పోదు.
దాని నామస్మరణము చేసిన క్షణమే అనేక దౌర్జన్యములు
కనులకుఁ బొడకట్టును. ఆహా! లోవైను పట్టణమా!
జర్మనుల రాక్షసకృత్యముల కొన్నిటికి పాల్పడితివి ! నీళిల్పుల నిపుణత్వమును వెల్లడిచేయు చిత్తరువులచే నొప్పారు గోపురఁబు కెల్ల నేలమట్టమయ్యెఁ గదా! నీ గొప్ప
భవనంబులెల్ల అగ్నిపాలయ్యెఁగదా ! విద్యావిశారదుల
చేతను సజ్జనబృందంబు చేతను పూజలందుచుండెడు నీవిశ్వ
విద్యాలయంబు నేఁటికి నామావశిష్టంబయ్యెఁ గదా!ఆహా!
ఎంత ఘోరము! లోకఁబులో నెల్ల ఖ్యాతివడసి యెల్లరును
కనుల నద్దుకొనుచుండెడు విలువలేని గ్రంధరాజముల
తో నిండి వెలయచుండు నీ పుస్తక భాండాగారఁబు
భస్మీకృతంబయ్యెఁగదా! ఇట్టి నీ విశ్వవిద్యాలయ గ్రంథభాండాగార చరిత్ర తెలిసికొనుట యెల్లరకు విధిగదా.
లోవైను పట్టణము 'బెల్జియము' దేశమునందొక గొప్పపట్టణము. బర్గండి దేశాధిపుఁడైన నాల్గవజాను తన మఖ్యపట్టణమగు"లోవైను”లో విద్యావ్యాప్తి చేయనుద్యుక్తుఁడై 'పంచమ మార్టిను' అను పేరంబరఁగు †<ref>క్రైస్తవుల జగద్గురువు</ref> పోపుతో మనవిచేసికొనఁగా, ఆయన 1425 సంవత్సరములో వర్తక సంఘపువారు నిర్మించిన చావడులలో మొదట విశ్వవిద్యాలయమును స్థాపించెను. దీనిలో ప్రారంభమున న్యాయశాస్త్రము, మతశాస్త్రము, వైద్యశాస్త్రము, గణితశాస్త్రము, దేశచరిత్రము, భాషాశాస్త్రము మున్నగువానిని నేర్పుచుండెడివారు. తరువాత 'జరోమ్బుస్ లీడె౯' అను ధనవంతుడు లాటను హిబ్రూ, గ్రీకుభాషలు నేర్పునిమిత్తము కొంత ధనమొసంగి 1518
సంవత్సరములో 'ఇరాస్మస్' అను విద్యావిశారదుని ఉపాధ్యాయునిగా నేర్పాటుచేసెను. ఈవిశ్వ విద్యాలయములో విద్యనభ్యసించినవారు గొప్ప శాస్త్రవేత్తలై ఖ్యాతి వడసిరి. ఈ విధమున ఈ విశ్వవిద్యాలయము వృద్ధి చెంది 16వ శతాబ్దములో ప్యారిసు విశ్వవిద్యాలయముతో సాటివచ్చెను. అప్పుడు, దానిలో 6000 విద్యార్ధులుండిరి.
ఈప్రకారము అభివృద్ధి పొందుచున్న లోవైను
విశ్వవిద్యాలయమును 1797 వ సంవత్సరములో ఫ్రెంచి
యరాజకులు రూపుమాపిరి. తరువాత కొన్ని సంవత్సరములకు బెల్జీయము దేశపు ‘బిషప్పు'లు అందఱునుకూడి
'పదునాఱవ గ్రెగొరి' అను పోపు వద్దకు వెళ్ళి మరల విశ్వ విద్యాలయము స్థాపింపవలెనని ప్రార్ధించిరి. అందుమీఁద 1984 లో 'మ్యాలయిన్సు' నగరమునందు విశ్వ
విద్యాలయము స్థాపింపబడినది. తరువాత'లోవైను'పట్టణ
పారిశుద్ధ సంఘమువారు పూర్వపు స్థలమునకు మార్పవేఁడుటచే అది మరల 'లోవైను'కు వచ్చెను. తదనంతరము క్రమక్రమముగా వృద్ధిపొందుచుండెను. దానితో సంబంధముగల కళాశాలలు 18వ శతాబ్దములో 42 మాత్ర<section end="88B" /><noinclude><references/></noinclude>
pk4x8oneq1vu94uqcciif09ji05rf46
559649
559647
2026-06-15T13:02:39Z
Brjswiki
6801
/* మూల్యాంకన చేసారు */
559649
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Brjswiki" /></noinclude><section begin="88A" />బూర్వము, పాణిని భగవానుఁడు తన యవతారముపసంహరించుకొనియెననియు నెఱుఁగనయ్యెడిని.
మహాభారతసంహిత యిప్పటి వ్యానునిచేఁగాని తచ్ఛిష్యపుత్రుఁడుగు లౌమహర్షిణిచేఁగాని యుగ్రశ్రవసునిచేఁగాని రచింపఁబడినది కావున, నాలుగువేలేండ్లకు వెనుకఁ బుట్టినదని సందేహమించుకయు లేదు. కావునఁ బాణిని యిప్పటికించుమించు 4500 యేండ్లకు వెనుకటి
వాఁడని మహాభారతమునఁ దేలుచున్నది.{{right|(మిగిలియున్నది)}}
<section end="88A" />
<section begin="88B" />{{p|fs150|ac}}{{Double underline|లోవైను విశ్వవిద్యాలయము - గ్రంథ భాండాగారము}}</p>
{{Center|పెద్దిభొట్ల కామయ్య గారిచే వ్రాయబడినది}}.
కొలఁది మాసముల క్రిందట, శాంతిపూర్ణంబై సర్వకళానిలయంబై జ్ఞానోత్పత్తిమూలంబై మనోరంజకంబై విరాజిల్లుచుండెడి"లోవైను" పట్టణ ప్రస్తతి స్థితిగతులు
తిలకించినయెడల ఎట్టి ఱాతి గుఁడెయైన నీరు గాక పోదు.
దాని నామస్మరణము చేసిన క్షణమే అనేక దౌర్జన్యములు
కనులకుఁ బొడకట్టును. ఆహా! లోవైను పట్టణమా!
జర్మనుల రాక్షసకృత్యముల కొన్నిటికి పాల్పడితివి ! నీళిల్పుల నిపుణత్వమును వెల్లడిచేయు చిత్తరువులచే నొప్పారు గోపురఁబు కెల్ల నేలమట్టమయ్యెఁ గదా! నీ గొప్ప
భవనంబులెల్ల అగ్నిపాలయ్యెఁగదా ! విద్యావిశారదుల
చేతను సజ్జనబృందంబు చేతను పూజలందుచుండెడు నీవిశ్వ
విద్యాలయంబు నేఁటికి నామావశిష్టంబయ్యెఁ గదా!ఆహా!
ఎంత ఘోరము! లోకఁబులో నెల్ల ఖ్యాతివడసి యెల్లరును
కనుల నద్దుకొనుచుండెడు విలువలేని గ్రంధరాజముల
తో నిండి వెలయచుండు నీ పుస్తక భాండాగారఁబు
భస్మీకృతంబయ్యెఁగదా! ఇట్టి నీ విశ్వవిద్యాలయ గ్రంథభాండాగార చరిత్ర తెలిసికొనుట యెల్లరకు విధిగదా.
లోవైను పట్టణము 'బెల్జియము' దేశమునందొక గొప్పపట్టణము. బర్గండి దేశాధిపుఁడైన నాల్గవజాను తన మఖ్యపట్టణమగు"లోవైను”లో విద్యావ్యాప్తి చేయనుద్యుక్తుఁడై 'పంచమ మార్టిను' అను పేరంబరఁగు †<ref>క్రైస్తవుల జగద్గురువు</ref> పోపుతో మనవిచేసికొనఁగా, ఆయన 1425 సంవత్సరములో వర్తక సంఘపువారు నిర్మించిన చావడులలో మొదట విశ్వవిద్యాలయమును స్థాపించెను. దీనిలో ప్రారంభమున న్యాయశాస్త్రము, మతశాస్త్రము, వైద్యశాస్త్రము, గణితశాస్త్రము, దేశచరిత్రము, భాషాశాస్త్రము మున్నగువానిని నేర్పుచుండెడివారు. తరువాత 'జరోమ్బుస్ లీడె౯' అను ధనవంతుడు లాటను హిబ్రూ, గ్రీకుభాషలు నేర్పునిమిత్తము కొంత ధనమొసంగి 1518
సంవత్సరములో 'ఇరాస్మస్' అను విద్యావిశారదుని ఉపాధ్యాయునిగా నేర్పాటుచేసెను. ఈవిశ్వ విద్యాలయములో విద్యనభ్యసించినవారు గొప్ప శాస్త్రవేత్తలై ఖ్యాతి వడసిరి. ఈ విధమున ఈ విశ్వవిద్యాలయము వృద్ధి చెంది 16వ శతాబ్దములో ప్యారిసు విశ్వవిద్యాలయముతో సాటివచ్చెను. అప్పుడు, దానిలో 6000 విద్యార్ధులుండిరి.
ఈప్రకారము అభివృద్ధి పొందుచున్న లోవైను
విశ్వవిద్యాలయమును 1797 వ సంవత్సరములో ఫ్రెంచి
యరాజకులు రూపుమాపిరి. తరువాత కొన్ని సంవత్సరములకు బెల్జీయము దేశపు ‘బిషప్పు'లు అందఱునుకూడి
'పదునాఱవ గ్రెగొరి' అను పోపు వద్దకు వెళ్ళి మరల విశ్వ విద్యాలయము స్థాపింపవలెనని ప్రార్ధించిరి. అందుమీఁద 1984 లో 'మ్యాలయిన్సు' నగరమునందు విశ్వ
విద్యాలయము స్థాపింపబడినది. తరువాత'లోవైను'పట్టణ
పారిశుద్ధ సంఘమువారు పూర్వపు స్థలమునకు మార్పవేఁడుటచే అది మరల 'లోవైను'కు వచ్చెను. తదనంతరము క్రమక్రమముగా వృద్ధిపొందుచుండెను. దానితో సంబంధముగల కళాశాలలు 18వ శతాబ్దములో 42 మాత్ర<section end="88B" /><noinclude><references/></noinclude>
bkrx0fq5m990gwzi7jhcbnm0q4lk8a0
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/86
104
160927
559604
462507
2026-06-15T12:21:39Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
559604
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>(పాటలిపుత్రము శోణానది ననుసరించియున్నది) అనునీ మొదలగు సుదాహరణములు భావ్యమందుఁ గనఁబడుటచే శోణానదీ తీరము నందున్నటులు తెలియుచున్నది. తరువాత నీనగరము గంగాతటమునందు వాసితమయినది. కధాసరిత్సాగరమందో, పాణిని
సమయము నందే గంగాతీరమున నీనగరమున్నటులు వర్ణింపఁబడుటనీ గ్రంధము విమర్శకులకు, ఇతిహాస పర్యాలోచకుల
సంతోషము కొఱకు వ్రాయఁబడినదని తోఁపకమానదు.
'''భారతరీతిగాఁ బాణిని 4500 మీళ్లు వెనుకటివాఁడు.''' ఈ పాణినిభగవాఁడు, నిరుక్తకారుఁడగు యాన్కునికంటెఁ బూర్వుఁడని నిరుక్తమువలననే తెలియుచున్నది. నిరుక్త ప్రధమాధ్యాయమందు,
{{left margin|5em}}<poem>'పరస్సన్ని కర్ష స్సంహితా'</poem> </div>
అను పాణిని ముని చెప్పిన సంహిత యనువదింపఁ బడినది. నిరుక్తము నుండియే పాణిని కైకొనఁగూడదా'? యని శంకింపవచ్చుఁగాని యది సాహసమాత్రమే. నిరుక్త ప్రయోజనమును జెప్పునపుడు పదవిభాగ ప్రయోజనమును బ్రతిపాదించుచు, యాస్కభగవానుఁడు,
{{left margin|5em}}<poem>'నపదవి భాగోవ్యాకరణ సాధ్యః:౼ అపితు యథాయధం విభక్తేషు
పదేషు సంహితానుసారి కార్యవిధాయకంవ్యాకరణమ్'</poem> </div>
అని పరమతము చేతనే యిరుతెగల సంహితల లక్షణమును జెప్పియున్నాఁడు. మఱియు.
{{left margin|5em}}<poem>‘పదప్రకృతిస్సంహితా'</poem> </div>
అను నీ రెండవ సంహితాలక్షణమును నిరుక్తమందనువదింపఁబడినది. ఈ 'పదప్రకృతిస్సంహితా'యను లక్షణము శౌనకుని ప్రాతిశాఖ్యలోనిది. ఇట్లగుట యాస్కుడు శౌనకుని కిటీవలివాడు. ఈ శౌనకుఁడును, (ప్రాతిశాఖ్యకర్త) వ్యాధికి సమకాలికుఁడు.
ఏలయనఁగాఁ బ్రాతిశాఖ్యనుందు,
{{left margin|5em}}<poem>'ఉభేవ్యాడిస్సమస్వరే
'వ్వాడిర్షా సిక్వమానునాపిక్యంవా”</poem> </div>
ఈ మొదలగు సూత్రములలో వ్యాడిపేరు కానంబడుచున్నది. వ్యాడికృతమయిన (వికృతవల్లి' యందు శౌనకమతమను వదింపఁబడినది. కావున, వ్యాడియు శౌనకుఁడును సమకాలికులు.
మఱియు, నన్ని ప్రాతిపదికములును ధాతుజములగునా? కాదా? అని విచారించుచు,
''''నసర్వాణీతి గార్గ్యోవైయాకరణానాంచే కే'''' (అన్నియుఁ గావని గార్డ్యుఁడును వైయాకరణులలోఁ గొందఱు) ఆని యాన్కుఁడు పన్యసించినాఁడు. పాణినీయ వ్యాకరణమునందు, వ్యుత్పత్త్యవ్యుత్పత్తి పక్షములు రెండును స్వీకరింపఁబడుటవలన, యాస్కో పన్యస్తము పాణినీయ మతమనియే భాసించుచున్నది.
పాణిని యాస్కుశబ్దమును సాధింపదొరకొనినాఁడు కావున, నిరుక్తకారుఁడగు యాస్కునికంటెఁ బాణిని యిటీవలివాఁడేలకాఁడు? అని శంకింపవచ్చుఁగాని, 'మధువిద్యా ప్రవక్తయగు మఱోక యాస్కభగవానుఁడు' వేదమునందు ఋషిగాఁ జెప్పఁబడినాఁడు. 'యస్క'
అనునది గోత్రము పేరు. తత్సాధనముకొఱకు, పాణిని పయత్నించుఁగాక. ఆ గోత్రమునందుదయించిన విశిష్ట పురుషులనేకులు
పాణినికిఁ బూర్వపర కాలములందుందురు. కావున నిరుక్తకారుఁడగు యాస్కుని కిటీవలివాఁడు పాణినికాఁడు.
ఇంతియకాక, నిరుక్తమందసేకస్థలములఁ బాణిని పరిభాషితములయిన కృత్తద్ధితసమాసాదిశబ్దములు కానంబడుచున్నవి. కావునను,
పాణిని యాన్కునికంటెఁ బూర్వుఁడయి తీరవలయును.
ఇచట నొకటి చెప్పవలయును. పాణిని యొకరిమతమును గ్రహీంపవలసినపుడు వారిపేరు చెప్పకుండఁడు. 'లోపశ్శాకల్యన్య' ఈ చాక్రవర్మణస్య' ఈ మొదలగు ననేక మాత్రములందు, తత్తత్ప్రవత౯కుల నామములను చ్చరించి పాఠకులకుఁ బ్రాచీనార్యుల
కీతి౯ని వినిపించి నాఁడు. అటుల భగవంతుఁడగు పాణిని గ్రహింపకయే<noinclude><references/></noinclude>
cui7g5381ccdu4rk4i8c5h0guma6itw
పుట:Grandaalaya Sarvasvamu - Vol.1, No.2 (1916).pdf/87
104
160928
559639
462508
2026-06-15T12:54:27Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
559639
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>యున్నచో నామహాత్ముల పేరయినను, ఎఱుఁగువంతటి పుణ్యమెవ్వరు నాజి౯ంచియేయుండరు.
నిరుక్త కారుఁడగు యాస్కభగవానుఁడు భారత సంహితయందు, ఇటులు చెప్పఁబడినాఁడు.
{{left margin|5em}}<poem>'శిపివిష్టేతిచాఖ్యాయాం హీన రోమాచయే భవేత్
తేనాబిష్టంతు యత్కించిత్ శిపివిష్టేతి చస్మృతః
యాస్కో మామృషి రవ్యగ్రోఽనేక యజ్ఞేషుగీతవాన్
శిపివిష్ట ఇతిహ్యస్మాత్ గుహ్యనామధరోహ్యయమ్
స్తుత్వామాంశిపివిష్టేతి యాస్కఋషిరుదారధీః
మత్ప్రసాదాదధోనష్టం నిరుక్తమభిజగ్మివాన్</poem> </div>
{{left margin|10em}}(శాంతి-మో-ధ) </div>
అని యాన్కునిపేరు కనఁబడుటచేతను, యాస్కభగవానుఁడు తననిరుక్తమునందు, శిపివిష్టనామ నిర్వచనము చేయుటచేతను, మహాభారత సంహిత నొనరించిన కవికంటెఁ బూర్వుఁడో లేక సమకాలికుండో యని యూహింపనయ్యెడిని.
ఇప్పుడు సింహావలోకన మొనరించి వ్యాడినిఁ గూర్చి చూతము. పాణినికంటె వ్యాడి యిటీవలివాఁడని నిర్థారింపఁగాఁ బ్రబలతరప్రమాణ మేమియు లేదు కాని చాలఁగాలము తద్విచారణ మొనరింపవలసియున్నది. సామశ్రమిమహాశయుఁ డీవిషయమై:౼
{{left margin|5em}}<poem>ఆపిళలి పాణినీయ వ్యాడీయ గౌతమీయాః ఏకం
పదమ్ వర్ణయిత్వాసర్వాణి పూర్వపదాని, తత్రనజ్ఞాయ
తే కన్య పూర్వపదస్య స్వరేణభవితవ్యమ్'</poem> </div>
{{left margin|10em}}(౬-3-3౬-సూత్రభావ్యం) </div>
అని పతంజలి భావ్యమున, అభ్యర్ధించ' అను నూత్రానుసారము, ఆపిశలి ప్రభృతులను సమయక్రమముగాఁ బౌర్యాపర్యముగా నిర్దేశింపఁబడుటచే, ఆపిశలి తరువాతఁ బాణినియు, బాణినితరువాత వ్యాడియునని తేలుచున్నదని వ్రాసినారు. మఱియొక యాధారము
దొరుకునంతవట్టు మనమీయుక్తినే నమ్మవలసియున్నది. వ్యాడియు శౌనకుఁడును సమకాలికులనియు బాణిని నికంటే వ్యాడి యాస్కుఁడు
శౌనకున కీవలివాఁడనియు నిదివఱకు తెలిసికొనినారము; యాన్కుఁడు, వ్యాసునికంటెఁ బూర్వుఁడా? తత్సమకాలికుఁడాయని తేలవలసి యున్నది. ఇదివఱకు, పారాశర్యశిలాలిభ్యాం భిషనటసూత్రమే' అను సూత్రమువలనఁ బాణిని పారాశర్యునకీతలి వాఁడని యెఱిఁగి యుంటిమి. యాస్కునికంటెఁ బాణిని పూర్వుఁడనియు నెఱిఁగియుంటిమి కావునఁ బారాశర్యుఁడును బాణినియు సమకాలికులుకాని పాణిని యీవలివాఁడు కాఁడనియు దేలుచున్నది. పూర్వసందర్భమంతయు నెమరువకుఁ దెచ్చుకొన్నచోఁ బాణిని ముదుసలితనముననో నిండు జవ్వనముననో పారాశర్యుఁడుండెననియుఁ బారాశర్య సమకాలికుఁడు యాన్కుఁడనియు, యాస్కసమ వయస్కులో కొంచెము పెద్దలో వ్యాడి శౌనకులయి యుందురనియుఁ దేలినది. కావునఁ బాణీనియు వ్యాణి, శౌనకుఁడు, పారాశర్యుఁడు యాస్కుఁడును గొంచె మించు మించు సమకాలికులని స్ఫుటమగుచున్నది, పారాశ్యునికంటే పాణిని పెద్దవాఁడని యుహించుచో, దేవీభాగవతమందలి పాణిని విషయమయిన భూతకాలప్రయోగమును సమర్ధింపవలసినంతటి యవసరము లేక న్యాయముగనే యుండును,
మఱియు,ఁ బాణిని వ్యాను నెఱుఁగు నేకాని తత్పుత్రుఁడగు, శుకునెఱుఁగడు. ఏలన ‘వై యాసకి’ యను రూపమును పాణిని ముట్టుకొనలేదు. ఇటులనే
{{left margin|5em}}<poem>'గవియధిభ్యాంస్ధిరే' (౮-3-౬౫)
'వాసు దేవార్జునభ్యాంవున్' (౪-౩-౯౮)</poem> </div>
అను సూత్రములందు, యుస్థిర వాసుదేవార్జునాగుల పేరులు వ్రాయఁబడియెను. `కాని 'ఏజేఃఖన్' అను సూత్రమునందు
జనమేజయ శబ్దమును గ్రహింపలేదు. కావున వ్యాసునికంటెఁ బాణిని పెద్దవాఁడనియు (సమవయన్కుఁడయినను గావచ్చును)<noinclude><references/></noinclude>
nv4c5pt2xsugdg0h9y6kfjh6joo3twl
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/20
104
169602
559719
559584
2026-06-15T16:30:02Z
Vjsuseela
1850
559719
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" />180
గ్రంథాలయ సర్వస్వము.</noinclude><section begin="20A" />మ. చెవుల౯ సోఁకియు సోఁకజాలని విపంచీస్వాదునిస్వాన మా
రవముల్, కర్కశమర్దల ధ్వనులుఁ దేర్పంజాలు నే ? మ్రోడుల
జివురుల్ పుట్టఁగ, మూలమూలలకు నుజ్జీవంబు వర్షించు వై
ణలికుుడొక్కఁడు నేఁడు పుట్టవలె బృం దారణ్య దేశంబుల౯.
సీ. యమునాతరంగ రంగములందు నటియించు, స్వచ్ఛందవృత్తిబీ జములఁ గాని ;
తొలుచూలి యాలవత్సలపు: జన్గవలందుఁ, దొరఁగు దుగ్ధముల మాంధుకులఁగాని ;
చివురాకుగాటు రుచించు కోకిల శాబకముల కషాయ కంఠములఁగాని;
పండు వెన్నెలల వీడ్వడు కదంబపు: బూ లఁ దెలియు కొం శొంటి పొుందికలఁగాని;
తే. గీ, ప్రకృతి పరిణామములకు లోపడక యట్లె
కాననయ్యెడు; మానవ మానసము లె
మఱచిపోయి నవి; పుడొక మాఱు మరల
వెదుకుఁగాక యా "విస్మృతం-
“ విస్మృత వేణుగీతి.”
<section end="20A" />
<section begin="20A" /><section end="20A" />
<section begin="20B" />{{Css image crop
|Image = Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf
|Page = 20
|bSize = 458
|cWidth = 281
|cHeight = 52
|oTop = 275
|oLeft = 73
|Location = center
|Description =
}}
{{p|fs150|ac}}శ్రీ పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు</p>
{{c|[పాలపర్తి నరసింహము గారిచే వ్రాయబడినది.]}}
{{gap}}రవితేజము ముందర నక్షత్రకాంతి బహ్వల్పమై కనుపించును. అట్లని మనము నక్షత్రముయొక్క ప్రయోజనమును నిరసింపఁ గలమా? ఖగోళమండలమునకు సూర్యుఁడెంత
యావశ్యకమో నక్షత్రముగూడ నంత యావశ్యక మే! మినుకు మినుకు మని ప్రకాశించు
తారలం బోలిన సామాన్య ప్రజ్ఞావంతులగు
సత్పురుషు లనేకులు ప్రపంచమున జన్మించు
చుందురు. బుద్ధి వైభవమునం దేమి, గుణ
సంపదయం దేమి, సేవాత్యాగములం దేమి,
వీరలు విఖ్యాత చరిత్రులగు ' మహాపురుషులతోఁ బోల్పఁదగి యుండకు. కాని యిట్టి
పురుష పుంగవులు సంఘాభివృద్ధికై చేసెడు
పని నెవ్వరు కాదనఁ గలరు? శ్రీ సీతారామయ్యగారు నిరుపమాన
ప్రజ్ఞాస మేతులగు
మహానుభావులలోఁ జేరిన వారు గాకపోయి
నను సామాన్య ప్రజ్ఞాన్యులగు, సాధువులు
లనుటకు లేశమైనను సందియము లేదు.
[[దస్త్రం:Pillarisetty Setaramayya from Grandhalaya Sarvasvamu.jpg|300px|center]]
{{Center|కీర్తి శేషులైన పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు.}}
{{gap}}శ్రీ సీతారామయ్యగారు ఆది వెలమ కులమునందు జనన మొందిరి. వీరి తండ్రిగారి పేరు బలరామయ్య నాయుడుగారు. తల్లిగారి నామము తాయారమ్మగారు. విశ్వవిద్యాలయపు పరీక్షలందేరి పట్టములఁ బడసినవారు గాకపోయినను శ్రీ బలరామయ్య నాయఁడుగారు చిత్రలేఖన విద్య నేర్చి తమ నిరంతర పరిశ్రమ పరాయణత్వము చేత లోకలు ఫండు శాఖలో ఓవరుసీరు పదవిని సంపా<section end="20B" /><noinclude><references/></noinclude>
me3n8madgqc4c1xooujmvlykg19be46
559769
559719
2026-06-16T03:44:31Z
Vjsuseela
1850
559769
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" />180
గ్రంథాలయ సర్వస్వము.</noinclude><section begin="20A" />మ. చెవుల౯ సోఁకియు సోఁకజాలని విపంచీస్వాదునిస్వాన మా
రవముల్, కర్కశమర్దల ధ్వనులుఁ దేర్పంజాలు నే ? మ్రోడుల
జివురుల్ పుట్టఁగ, మూలమూలలకు నుజ్జీవంబు వర్షించు వై
ణలికుుడొక్కఁడు నేఁడు పుట్టవలె బృం దారణ్య దేశంబుల౯.
సీ. యమునాతరంగ రంగములందు నటియించు, స్వచ్ఛందవృత్తిబీ జములఁ గాని ;
తొలుచూలి యాలవత్సలపు: జన్గవలందుఁ, దొరఁగు దుగ్ధముల మాంధుకులఁగాని ;
చివురాకుగాటు రుచించు కోకిల శాబకముల కషాయ కంఠములఁగాని;
పండు వెన్నెలల వీడ్వడు కదంబపు: బూ లఁ దెలియు కొం శొంటి పొుందికలఁగాని;
తే. గీ, ప్రకృతి పరిణామములకు లోపడక యట్లె
కాననయ్యెడు; మానవ మానసము లె
మఱచిపోయి నవి; పుడొక మాఱు మరల
వెదుకుఁగాక యా "విస్మృతం-
“ విస్మృత వేణుగీతి.”
<section end="20A" />
<section begin="20A" /><section end="20A" />
<section begin="20B" />{{Css image crop
|Image = Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf
|Page = 20
|bSize = 458
|cWidth = 281
|cHeight = 52
|oTop = 275
|oLeft = 73
|Location = center
|Description =
}}
{{p|fs150|ac}}శ్రీ పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు</p>
{{c|[పాలపర్తి నరసింహము గారిచే వ్రాయబడినది.]}}
{{gap}}రవితేజము ముందర నక్షత్రకాంతి బహ్వల్పమై కనుపించును. అట్లని మనము నక్షత్రముయొక్క ప్రయోజనమును నిరసింపఁ గలమా? ఖగోళమండలమునకు సూర్యుఁడెంత
యావశ్యకమో నక్షత్రముగూడ నంత యావశ్యక మే! మినుకు మినుకు మని ప్రకాశించు
తారలం బోలిన సామాన్య ప్రజ్ఞావంతులగు
సత్పురుషు లనేకులు ప్రపంచమున జన్మించు
చుందురు. బుద్ధి వైభవమునం దేమి, గుణ
సంపదయం దేమి, సేవాత్యాగములం దేమి,
వీరలు విఖ్యాత చరిత్రులగు ' మహాపురుషులతోఁ బోల్పఁదగి యుండకు. కాని యిట్టి
పురుష పుంగవులు సంఘాభివృద్ధికై చేసెడు
పని నెవ్వరు కాదనఁ గలరు? శ్రీ సీతారామయ్యగారు నిరుపమాన
ప్రజ్ఞాస మేతులగు
మహానుభావులలోఁ జేరిన వారు గాకపోయి
నను సామాన్య ప్రజ్ఞాన్యులగు, సాధువులు
లనుటకు లేశమైనను సందియము లేదు.
[[దస్త్రం:Pillarisetty Setaramayya from Grandhalaya Sarvasvamu.jpg|400px|center]]
{{Center|కీర్తి శేషులైన పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు.}}
{{gap}}శ్రీ సీతారామయ్యగారు ఆది వెలమ కులమునందు జనన మొందిరి. వీరి తండ్రిగారి పేరు బలరామయ్య నాయుడుగారు. తల్లిగారి నామము తాయారమ్మగారు. విశ్వవిద్యాలయపు పరీక్షలందేరి పట్టములఁ బడసినవారు గాకపోయినను శ్రీ బలరామయ్య నాయఁడుగారు చిత్రలేఖన విద్య నేర్చి తమ నిరంతర పరిశ్రమ పరాయణత్వము చేత లోకలు ఫండు శాఖలో ఓవరుసీరు పదవిని సంపా<section end="20B" /><noinclude><references/></noinclude>
m0fquinr9shewfctejxhnprklnlbnz6
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/23
104
169603
559727
559551
2026-06-15T17:23:28Z
Vjsuseela
1850
/* మూల్యాంకన చేసారు */
559727
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vjsuseela" /></noinclude>దింపఁ గలిగిరి. నోబిలు కళాశాలలో నున్నతవిద్య నభ్యసించుచు శ్రీ సీతారామయ్యగారు తమ బాల్యమును మచిలీపట్టణమునందుఁ గడిపిరి. ఈ పురమునందలి బలరాముని పేటలో వేణుగోపాలస్వామి యాలయ ముండెను. తమ కులస్థు లందరివలెనే సీతారామయ్యగారును నీ స్వామియెడలఁ దమ చిన్నతనమునందు విశేషభక్తిని గలిగి యుండిరి. ఈ తరుణమునం దాపేటలో నొక ప్రార్థన సమాజ ముండెను. జె. వెంకట నారాయణ నాయఁడుగా రీ సమాజమునం దధికశ్రద్ధతో
బనిచేయు చుండిరి. వీరి సాంగత్యవిశేషముచే సీతారామయ్యగారి హృదయ క్షేత్రమునందు
బ్రహ్మధర్మ బీజములు ప్రవేశించెను. నాఁట నుండి వీరి భక్తి గోపాలస్వామినుండి మఱలి
యేకేశ్వరుని వైపునకుఁ బోఁ జొచ్చెను. అనారోగ్య కారణముచే వీరు చదువు చాలించుకొన వలసిన వారైరి. విద్యాభ్యాసమును మానిన పిమ్ముట వీరు తమ తండ్రిగా రుద్యోగమునం దున్న తెనాలి పురమందుఁ గొంతకాలము గడపిరి. ఇక్కాలమునందు వీరీ తెనాలియం దొక ప్రార్ధన సమాజమును
నెలకొల్పి తదభివృద్ధికై పూనికతోఁ గృషి చేసిరి. ఒకప్పు డీ పురమున పెద్దజాతర యొకటి జరిగెను. నిర్నిమిత్తముగా ననేక సాధుజంతువుల హింసకు, గారణమయ్యెడు నీ జాతరనుండి జనుల మనస్సుల మఱల్చుటకు వీరెంతయో ప్రయత్నించిరి. ఒకనాఁడీ జాతరవద్దకుఁ బోఁగా నచ్చట మేకలు, గొఱ్ఱెలు, కోళ్లు వందల కొలదిగా దేవత యొక్క ప్రీత్యర్థము వధింప బడుచుండెను. ఱాతిబండల
వంటి హృదయములు సయితము కరిగి నీరై పారునట్లు ఆప్రదేశమునందు నోరెరుగని జంతువుల రక్తము పెద్ద ప్రవాహమయి యెఱ్ఱగా బాఱుచుండెను. అతి ఘోరమై హృదయ విదారకమైన యీ దృశ్యము సీతారామయ్యగారి మనస్సునం దొక గొప్ప మాఱుపును గలిగించెను. ఆయన యిట్లుతనలోఁ జింతింపఁ దొడగెను. “అమాయకములగు జంతువులను జంపవద్దని గదా నే నిప్పుడు బోధించు చున్నది. ఇట్టి పశువులెన్ని మనుష్యుని యాహారము నిమిత్తమై నిత్యమును వధింపఁబడు చున్నవి?
మాంసాహారమును భుజించెడు నే నెట్లీ జనులకు దయామహిమను బోధింపఁ గలను? నాలో కరుణా లేశ ముండెనేని మాంసభోజనము చేయఁగలనా?” ఈచందమున నిజస్వాంతమునందుఁ గొంత తర్కించుకొని మాంసాహారమును ఆయన విసర్జించెను. తలిదండ్రులు సీతారామయ్యగారి నీ నియమమున నుండి తొలిఁగింపవలెనని యెంతయో ప్రయత్నించిరి. కాని వారి యత్నము ఫలించినదిగాదు. తాను మరణించుటకు నయిదారు సంవత్సరములకుఁ బూర్వము వఱకు సీతారామయ్యగారు మాంసమును భుజింప లేదు. వైద్యుల యొక్క యుపదేశము వలన వీరు తమ జీవితముయొక్క శేషభాగమునఁ దమ నియమమును మాన్పుకొన వలసిన వారైరి. మత విషయమునందే గాక సీతారామయ్యగారు సంఘసంస్కార విషయమునందుఁ గూడ నెక్కుడు శ్రద్ధను గల్గి యుండిరి. దయనీయులగు వితంతు కాంతల వివాహములకై వీరు సంపూర్ణ ప్రోత్సాహము నొసంగు వారు. 1901 సంవత్సరమునఁ దన కులస్థులలో మొదటి స్త్రీ పునర్వివాహము జరిగెను. ఈ
యుద్వాహమునకు వీరే ముఖ్య కారకులుగా నుండిరి. వివాహము చెన్నపురిలో జరుగవలసి<noinclude><references/></noinclude>
4ej5tt9k8wvkfd19k32xm03sa9a7rp1
పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/24
104
169604
559735
478058
2026-06-15T18:17:22Z
Vjsuseela
1850
/* అచ్చుదిద్దారు */
559735
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>యుండుటచే, వధువును స్వస్థలమునుండి య
చటికిఁ దీసుకొని పోవుట యత్యంత ప్రయా
సకరమయ్యెను. సకల కష్టములతోఁ బోరా
డి వీ రుద్వాహము జరుగునట్లు చూచిరి.
సీతారామయ్యగారికి విశేష వర్ణనా చాతుర్యము కలదు. ఈ వివాహ కధను వీరు తమ
స్నేహితులకుఁ బలుమాలు చెప్పుచుండు
వారు. వధువునకు వివాహేచ్ఛ యెట్లు కలి
గినదియు, వరు డెట్లు లభించినదియు, వధువు
ను చెన్నపురికి గొనిపోవుటలో దమ కుల
స్థులు కలిగింపఁ జూచిన కష్టములను, మొద
లైన విషయముల నెల్లఁ బూసగ్రుచ్చినట్లు
రసభరితముగాఁ జెప్పునపుడు స్నేహితులమైన
మేము ఆయన చేతిలోని కీలుబొమ్మలమై
యొకప్పుడు కడుపుబ్బ నవ్వుచుందుము. వేఱొ
కప్పుడు కన్నులమెట నీరు కార్చుచుందుము;
ఇంకొకప్పుడు సత్కార్యోత్సాహముతో ను
ప్పొంగుచుందుము. ఈ యుద్వాహ సందర్భ
మున మఱియొక సంగతి చెప్పవలసియున్నది.
వివాహానంతరము బందరులో వెలమ కులస్థుల
పెద్ద సభ యొకటి జరిగెను. సీతారామయ్య
గార్ బహిష్కార విషయ మచట నాలోచిం
పఁబడెను. కుల పెద్దలు
పునర్వివాహము
చేసికొన్న వారితోఁ గలసి యుండెదవా ? సం
ఘమునం దుండెదవా? ” యని వీరిని ప్రశ్నిం
చిరి. పునర్వివాహము గావించుకొన్న వారి
తోడనే కలసి యుండెదనని ధైర్యముతో
ను త్తరమిచ్చి తమ మనోబలమును బ్రకటించిరి. నాఁటనుండియు వీరు సంస్కారపక్ష
మునఁ జేరి పనిచేయుచుండిరి. హిందూ సంఘ
మున కత్యంతావశ్యకమైన యీ సంస్కార
మును వ్యాపింపఁ జేయుటకు మిగులఁ బ్రయ
త్నించిరి. వీరి ప్రోత్సాహమువలననే పద్మ
"సాలెలలో రెండు స్త్రీ పునర్వివాహములు జరిగెను.
{{gap}}తమ తండ్రిగారిని చీరాలకు మాఱ్చుటచే
సీతారామయ్యగారును తెనాలి వదలి చీరాలకుఁ జనిరి. ఇచటనుండి యొక సంవత్సరము
తరువాత తమ్ముని విద్యాభ్యాస కారణమునఁ
దమ నివాసమును బాపట్లకు మాఱ్చుకొనిరి.
ఈ ప్రాంతములలోఁ గడపినకాలము వీరి జీవితములో మిగుల మూల్యవంతమైనదని చెప్ప
వచ్చును. చీరాలయుదేమి బాపట్లయందేమి
ఈ రెండు పురములకు మధ్యనున్న యీ
పూరిపాలెమునందేమి, వీరు తమ సుగుణసంప
తిచే ననేక స్నేహితుల నేర్పఱచుకొనిరి.
ఈ మూడు స్థలములందలి ప్రార్థన సమాజములకును వీరు ప్రాణసదృశులుగా నుండిరి.
మరోహరమైన 'కంఠ స్వరముకు గలిగి, నిర్మ
లమైన దైవభక్తి నిగలిగి వీరు తమ మృదు
మధురగానముచే సకల జనులలో భక్తిని
బురికొల్పుచుండిరి. "కేవల ముపదేశములతో
దృప్తిఁ జెందక వీరెల్లరి వద్దకుఁ జని వారి కష్ట
నిష్ఠురములలోఁ దోడ్పడుచుండువారు. సాహా
య్యము చేయవలసిన యవసరములం దేవిధ
ములైన భేదములను పాటించెడివారు కారు.
బీదలైనను భాగ్యవంతులయినను, బ్రాహ్మణులయినను పంచములయినను, హిందువుల
యినను క్రైస్తవులయినను తుదకు హితుల
యినను అహితులయినను గూడ వీరు గణన
చేయక యెల్లవారికిని దన యోపినకొలఁది
సాయము చేయుచుండిరి. తమ సంస్కారాభి
ప్రాయముల వలనఁ గొందఱికి ద్వేషపాత్రుల
యినను దమ నయవినయాది గుణసంపదచే
“నందఱకును, బ్రేమపాత్రులై యొప్పిరి. శ్రీరా<noinclude><references/></noinclude>
3jghj3e9n9as3y2f00snc8ramhgeynw
సూచిక:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf
106
185581
559742
555769
2026-06-15T18:38:24Z
Rajasekhar1961
50
559742
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=లక్ష్మణరాయ వ్యాసావళి
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=విజయవాడ
|సంవత్సరం=1965
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist
1="ముఖచిత్రం"
5to6="విసూ"
7=1
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
srv8dpuxmc4dq2ryxboswzsy6b8rg1m
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/218
104
212661
559711
554884
2026-06-15T14:54:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559711
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. అగణిత...రామంబు = లెక్కలేని గుణములచే మనోహరమైనది; మీనధామంబు = సముద్రము; సంగ్రామాభీరుండగు = యుద్ధమున వెనుదివియని; పెనువాలుగంటులం గనుపట్టి = ('''శూరపక్షమున''') పెద్దకత్తులవలని గాయంబులచేఁ జూపట్టి; ('''సముద్రపక్షమున''') పెద్దలైన వాలుగలను చేఁపలసంబంధముచేఁ జూపట్టి; కుశలముక్తంబగు = నేర్పరి యగు భటునిచే విడువఁబడిన; విశిఖంబునుం బోలెన్ = బాణముపగిది; ఎల్ల కందువలను = ('''బాణపక్షమున''') అన్ని జాడలను - గుఱులను, ('''సముద్రపక్షమున''') అన్నిచోట్లను; మీఱి = దాటి; [ˈకందువలను = జాడలచేతను, సంకేతస్థలములచేతను' అని పూర్వటీక.] పాటల...బై = లేఁతయెఱ్ఱకాంతి గలిగినదై; ('''సముద్రపక్షమున''') ఎఱ్ఱచేఁపలు గలదై; జరఠవిలోచనంబునుంబోలెన్ = ముసలివానికంటివలె; నీరుపాపలం బొదువుట గలిగి = ('''కంటిపక్షమున''') నీరు, కంటిపాపలపయి వ్యాపించుట గలిగి, ('''సముద్రపక్షమున''') నీటిబిడ్డలను పెంచుట కల్గి; [ˈపాటలస్ఫురితంబు = పండఁబాఱుటను తోఁపించునది' అని పూర్వటీక.] పుడమివేలుపుఁ బోలెన్ = బ్రాహ్మణునిరీతిని; బలియింటివాకిట నడంగి = ('''బ్రాహ్మణపక్షమున''') అధికారము కలవాని యింటిముంగిట నిలిచి, ('''సముద్రపక్షమున''') బలిచక్రవర్తియింటి (పాతాళపు) వాకిటనుండి; వీరభద్ర...బగు = వీరభద్రుని (చేతిలోని) గదచే చీల్చఁబడిన; పూషార్కు...బోలెన్ = పూషార్కునిగుహవంటి నోటిరీతిని; పలువరుస బిగిదెరల నొరలి = ('''పూషార్కపక్షమున''') పండ్లవరుస బిగువు వదలఁగా, ('''సముద్రపక్షమున''') అనేకములగు వరుసల బిగువుతోడి కెరటములతో ధ్వనించి; మతంగకులకన్యకం బోలెన్ = మాలపడుచురీతిని; పలుకందగు నిలుకడ దాల్చి = ('''పడుచుపక్షమున''') నిందింపఁదగు నిలకడను బొంది, ('''సముద్రపక్షమున''') చెప్పఁదగిన (కొనియాడఁదగిన) నిలుకడఁ బొంది; విభావరీవిరామసమయంబునం బోలెన్ = తెల్లవాఱుజాముపగిదిని; వెల్లదీవియలన్ మించుటకున్ గుఱియై = ('''కాలపక్షమున''') తెల్లఁబాఱిన దీపములచే అతిశయించుటకు లక్ష్యమయి, ('''సముద్రపక్షమున''') శ్వేతద్వీపములచే మించుటకు లక్ష్యమై; ['శ్వేతద్వీపమును ఆక్రమింపఁజేయుటకు' అని పూర్వటీక.] కుముదో...లును = తెల్లగలువలోపలిభాగముపలె మిక్కిలి తెల్లవియు; నీలోత్పల...లును = నల్లకలువలగుంపువలె నల్లనివియును; శుక...లును = చిలుకముక్కువలె లేఁతయెఱుపురంగు కలవియు; ఒక్కొక్కచక్కిన్ = ఒక్కొక్కచోట; ముక్తా...బులు = మంచిముత్యములవలె చిత్రవర్ణములు గల లోపలిభాగములు కలవియు; ['శబరోదరంబులు = చేఁపకడుపులు, నీటి లోపలిభాగములు' అని పూర్వటీక.] [ఈ పైవన్నియును ముందు రాఁబోవు తరంగకిశోరముల విశేషణములు] ఆరుణోపలపట్టంబులన్ = కెంపులపలకలపయి; పొట్ట పెంచుచున్ = దేహమును పెంచుచు; ఇట్టలంబుగల్ - అధికముగా; మిట్టించు = పైకెగయు; వేలా...వలనన్ = ఒడ్డునందలి గాలినుండి పుట్టిన క్రొత్తతుంపురులవలన; నలినభవాండంబునకున్ = బ్రహ్మాండమునకు; కర్పూరకరండభావంబున్ = కర్పూరపుబరిణె యగుటకును; ఉత్పాదించుచున్ = కలిగించుచు; [అలలు ఎఱ్ఱని కెంపుపలకకుఁ దగిలి మీఁదికి లేవఁగా, ఒడ్డునుండి వీచినగాలి ఆ యలలపై వ్యాపించి నీటితుంపరల నెగఁజిమ్మఁగా, ఆ తుంపరలు కర్పూరమువలెను, కెంపుపలక భరణివలెను ఉన్నదని భావము.] ఉత్తాల...షంబులగు = పొడవైన చీఁకటిమ్రానియాకుల నల్లనికాంతిచే ఒడ్డు నొరయఁచున్నవై; బాల...మతల్లికనన్ = ప్రశస్తమైన లేఁతనాచుతీగలతో; అల్లిబిల్లికొను = పెనఁగొను; ఉల్లోలప్రవాళశాఖాశిఖలవలనన్ = మిక్కిలి ఎక్కువగాఁ దిరుగుచున్న పగడపుఁదీగలకొనలవలన; ['ఉల్లోల = పెద్దయలలలోని' అని పూర్వటీక.] ఉదవాసక్లేశంబునన్ = నీళ్లయందే నివసించుటవలని శ్రమచేత; ఉడ్డుకుడిచి = ఊపిరి త్రిప్పలేక - తికమకలాడి; పుటమెగయుచున్ = దాఁటుచు; ఉద్దామ...వ్యాజంబునన్ = పెద్దపొగవరుసయను మిషచే; ఈడాడన్ = ఇక్కడక్కడ; పొడచూపు = కన్పించు; నిబిడ...శంకన్ = దట్టమైన బడబాగ్నిజ్వాలలగుం పను సందేహమును; అంకురితంబు సేయుచున్ = కలిగించుచు; [అంకురితము = మొలచినది' అని పూర్వటీక.] [నల్లనిపాఁచితీగలు ఎఱ్ఱని పగడపుమ్రానికొమ్మలకుఁ జుట్టుకొనఁగా, ఆకొమ్మలు మిక్కిలి యెక్కువగాఁ గదలాడు<noinclude><references/></noinclude>
3uqe8mjs63elayp55bs0mpsts9d3wai
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/219
104
212662
559745
554885
2026-06-15T19:25:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559745
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చున్నవి; అట్లుండుట - నీటిలో నివసింపలేక బడబాగ్ని బయటికి రాఁ బ్రయత్నించుచున్నట్లున్నది. పాఁచితీగలు పొగలవలెను, ప్రవాళశాఖలు అగ్నిజ్వాలలవలెను ఉన్నవని భావము.] సలిల...అరుణంబులు అగు — సలిలకరటి = నీటియేనుఁగులయొక్క; చటులకర = మిక్కిలివాడియైన; రదనశిఖర = దంతములకొనలచే; విఘట్టితగర్భ = భేదింపఁబడిన లోపలిభాగములు గల; గిరి = కొండలయందలి; గైరిక = జేగురుమట్టియొక్క; సంక్రమణ = అంటుకొనుటచే; అరుణంబులు అగు = ఎఱ్ఱవైన; తరంగకిశోరంబులచేతన్ = పిల్లయలలచేత; పిహితావకాశంబై = కప్పఁబడిన యెడము కలదై - అంతటను వ్యాపించినదయి; లక్ష్మీ...రంజితంబును = లక్ష్మీనారాయణుల శరీరములందు పూయఁబడిన దట్టముగు కుంకుమపుప్పొడిచే ఎఱ్ఱనైనదియును; తదీయ ...పీడనంబు నగు = వారిపొరలికవలనఁ బుట్టిన బాధయే అలంకారముగ గలిగినది యగు; తలిమకలంబువిలసనంబున్ = పడకయొక్క ప్రకాశమును; వశీకరించుచు = వశపఱచుచు - తాను పడకగా నేర్పడుచు; [పాలసముద్రము విష్ణుని పాన్పనుట] సాత్త్వికుక్రియన్ = సత్త్వగుణము కలవానివలె; విధువిజృంభణముదితంబును = ('''సాత్త్వికపక్షమున''') విష్ణుని విజృంభణమువలన సంతోషించినది, ('''సముద్రపక్షమున''') చంద్రోదయమువలన సంతసించినది; పంటకారుపగిదిన్ = శరత్కాలమువలె; ప్రసన్నశరంబును = ('''కాలపక్షమున''') వికసించిన రెల్లు కలది, ('''పంటపక్షమున''') నిర్మల మగు జలము కలది; ['ప్రనన్నశరీరము = తేటపాఱిన దేహము కలది' అని పూర్వటీక.] సత్యలోకంబు నాకృతిన్ = సత్యలోకముఁవలె; కమలభూయిష్టంబును = ('''సత్యలోకపక్షమున''') బ్రహ్మకు ఇష్టమయినది. ('''సముద్రపక్షమున''') ఎక్కువనీరు కలది; [ˈకమలములచేత అతిశయించినదిˈ అని పూర్వటీక.] విలాసినీకరంబుకరణిన్ = విలాసముగల స్త్రీచేతివలె; వివిధ...కంబును = ('''కరపక్షమున''') వివిధములగు మణుల కాంతిసమూహముచే ప్రకాశించు ముద్రికలు కలది, ('''సముద్రపక్షమున''') వివిధములగు రత్నముల కాంతిసమూహమున రంజించు అలలు కలది; పరబ్రహ్మంబువిధంబునన్ = పరమాత్మవలె; ఆహార్యపదంబునై = ('''బ్రహ్మపక్షమున''') చలించనిస్థితి కలది, ('''సముద్రపక్షమున''') కొండలకు స్థానమైనదియు నయి; ఒదవు = కలుగు - ఉండు; ఆఱవకడలి = లవణేక్షుసురాసర్సిద్దధిక్షీరజలార్ణవములలో ఆఱవదగు పాలసంద్రము; పుడమిముద్దియకున్ = భూదేవికి; తద్దయున్ = మిక్కిలి.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఎన్నఁగ నింత రత్నచయ మింత గభీరిమ యింత దానసం
పన్నత యింతశుద్ధి యని బ్రహ్మయు నోరు మెదల్పలేని య
త్యున్నతిఁ గన్న పెన్గడలి నుత్థితమై వెలిదీవి చెన్నగున్
వెన్నెలయేటిలోనఁ బ్రభవించిన కప్రఁపుగొండకైవడిన్.</poem>|ref=151}}
'''టీక'''. రత్నచయము = రత్నములగుంపు; గభీరిమ = లోఁతు; దానసంపన్నత = వదాన్యత - త్యాగము; నోరు మెదల్పలేని = వర్ణింపజాలని; అభ్యున్నతిన్ = గొప్పతనమును; పెన్గడలిన్ = పెద్దదైన - పాలసముద్రమున; ఉత్థితమై = లేచిన్ననదై - పుట్టినదై; వెలిదీవి = శ్వేతద్వీపము; చెన్నగున్ = ప్రకాశించును. '''అలం'''. ఉదాత్తము, ఉపమ.
{{Telugu poem|type=శా.|lines=<poem>ధూతాతంక మపేతపంకము బుధస్తుత్యంబు నిత్యంబు వి
ఖ్యాతం బాతపశీతవాతసహసాంద్రానందయోగీంద్రసం
కేతం బాతతభూతి భూతిలకలక్ష్మీకారి<ref>చ. కోరంబు</ref>తోరంబునై
శ్వేతద్వీపము దీపితంబగు జగత్సేవ్యైకభవ్యోన్నతిన్.</poem>|ref=152}}
'''టీక'''. ధూతాతంకము = పోయిన భయము కలది; అపేతపంకము = పోయిన పాపములు కలది; ఆతత...సంకేతంబు = ఎక్కువయైన చలిని, గాలిని సహింపఁజేసి, ఎల్లపుడును ఆనందము కల్గిన యోగీంద్రులు చేరఁదగిన చోటు; ['సంకేతము = గుఱుతు కలది' అని పూర్వటీక.] ఆతతభూతి = ఎక్కువ<noinclude><references/></noinclude>
qqj308th6y13a91lu72o5r5ffyuhhz8
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/220
104
212663
559746
554886
2026-06-15T19:50:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559746
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సంపద కలది; భూతిలకలక్ష్మీకారి = భూమికి తిలకముయొక్క సంపదకు కూర్చునది - భూమి యను పడఁతికి తిలక మైనది; తోరంబు = గొప్పది; జగత్సేవ్యైకభవ్యోన్నతి = లోకముచే సేవింపఁదగిన మిక్కిలి గొప్పగౌరవముతో; శ్వేతద్వీపము; దీపితంబగున్ = ప్రకాశించును. '''అలం'''. పరికరము, రూపకము.
{{Telugu poem|type=ఆ.|lines=<poem>వణఁకుగుబ్బలికిని వైడూర్యశృంగంబు
మొలచినట్లు మిన్ను మోచియున్న
తెల్లదీవియందు దీపించు వైకుంఠ
పురము కనకవప్రపరివృతంబు.</poem>|ref=153}}
, వణఁడుగుబ్బలికిని వైడూర్యశృంగంబు, మొలచినట్లు మిన్ను మోచియున్న
తెల్ల దీనియందు దీపించు వైకుంఠ, పురము కనకవప్రపరివృతంబు.
'''టీక'''. వణకుగుబ్బలికిని = హిమాలయమునకు; మిన్ను మోచియున్న = ఆకాశమునంటియున్న; శ్వేతద్వీపమున; కనకవప్రపరివృతంబు = బంగరుప్రాకారముతోఁ గూడినదైన.
తెల్లనిమంచుకొండపయి పచ్చనివైడూర్యశిఖరమున్నట్లు, తెల్లనిశ్వేతద్వీపమునఁ బచ్చని
బంగారుకోటగోడలుకల వైకుంఠనగర మున్నదని యర్థము. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>సారసువర్ణనీరమయసాలవిశాలము నీలవర్ణసం
చారచమత్క్రియాచరణశాలియునై పురి చెన్నగున్ మహా
మేరువుకౌఁగిటం బొలుపు మీఱి మహోత్కటకూటసంచర
ద్వారణరాజమై సొబగు దాల్చిన రోహణశైలమో యనన్.</poem>|ref=154}}
సారసువర్ణ నీరమయసాలవిశాలము నీలవర్ణసం
చారచమత్త్రియాచకణశాలియునై పురి చెన్నగు మహా
మేరువుకొఁగిటం బొలుపుమీఱి మహోత్కటకూటసంచర
ద్వారణరాజమై సొబగు దాల్సిన రోహణశైలమో యనన్.
'''టీక'''. సార...విశాలము = చక్కని బంగారు నీటిపూఁత గల ప్రాకారముచేత విశాలమైనది; నీలవర్ణ...శాలియు నై = విష్ణుదేవునియొక్క సంచారముచే చమత్కారము కలుగునదియునైన; పురి = వైకుంఠము; పొలుపు మీఱి = చక్కదనము మీఱి; మహోత్కట...రాజమై = మిక్కిలి ఎత్తయిన శిఖరములపయి సంచరించు గొప్పయేనుఁగు గలదై; సొబగు దాల్చిన = అందగించిన; రోహణశైలమో యనన్ = రోహణాద్రియో అనునట్లు; చెన్నగున్ = ప్రకాశించును. [ఇచట సాలము మేరువువలెను, పురము రోహణమువలెను, విష్ణువు గజమువలెను ఉన్నట్లు వర్ణింపఁబడినది.] '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=సీ.|lines=<poem>త్రైవిక్రమాంఘ్రి మున్ <ref>క. తవిలి</ref>దవిలి వీడిన పద్మ
జాండఖండములీల నలరుఁ గోట
పలుమాఱు గమఠాధిపతి పూని డించు మం
దరములభాతి సౌధములు వెలయు
నిజవిహారార్ధంబు నృహరియై హరిచేయు
వసతులో యనఁ గేళివనము లెసఁగు
శాంబరీమత్స్యసంచారోచితాపర
శరధులక్రియ <ref>క. పద్మ</ref>బద్మసరసు లమరు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నఖిలభువనాంతరాళపురాధిదేవ
తావితానంబు తత్సేవకై <ref>ట. వసించు</ref>చరించు
సరణిఁ జూపట్టుదురు శరత్సమయపూర్ణ
రాజవదనలు వైకుంఠరాజధాని.</poem>|ref=155}}
'''టీక'''. వైకుంఠరాజధానిన్ = వైకుంఠనగరమునందు; కోట; మున్ = పూర్వము; త్రైవిక్రమాంఘ్రిన్ = త్రివిక్రమస్వామియగు విష్ణునియొక్క పాదమును; వీడిన = జారిపడిన; పద్మజాండఖండములీల = బ్రహ్మాండగోళపుతునుకవలె; అలరున్ = ప్రకాశించును; పలుమాఱు = పెక్కుసార్లు - అనేకయుగాంతరములయందు; కమఠాధిపతి = ఆదికూర్మము; పూని = ప్రయత్నించి; డిందు = తనపైనుండి దించునట్టి; మందరములభాతిన్ = మందరపర్వతములరీతిని; సౌధములు = మేడలు; వెలయున్; నృహరియై = నరసింహుఁడై; హరి = విష్ణువు; నిజవిహారార్థంబు = తాను విలాసమున సంచరించుటకొఱకు; చేయు వసతులో = చేయునట్టి నివాసములో యనురీతిని; కేళివనములు = ఉద్యానములు; శాంబరీ...క్రియన్ = మాయామత్స్యమగు మత్స్యావతారవిష్ణుని సంచారమునకుఁ దగిన వేఱుసముద్రములరీతిని; పద్మసరసులు = పద్మతటాకములు; ఎసఁగున్ = ప్రకాశించును; అఖిల...వితానంబు = సమస్తలోకములలోని పురములలోని అధిదేవతలగుంపులు; తత్సేవకై = విష్ణుని సేవించుటకు;<noinclude><references/></noinclude>
0euufogzxn82wyzidqhrebnp5b1s11d
559747
559746
2026-06-15T19:50:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559747
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సంపద కలది; భూతిలకలక్ష్మీకారి = భూమికి తిలకముయొక్క సంపదకు కూర్చునది - భూమి యను పడఁతికి తిలక మైనది; తోరంబు = గొప్పది; జగత్సేవ్యైకభవ్యోన్నతి = లోకముచే సేవింపఁదగిన మిక్కిలి గొప్పగౌరవముతో; శ్వేతద్వీపము; దీపితంబగున్ = ప్రకాశించును. '''అలం'''. పరికరము, రూపకము.
{{Telugu poem|type=ఆ.|lines=<poem>వణఁకుగుబ్బలికిని వైడూర్యశృంగంబు
మొలచినట్లు మిన్ను మోచియున్న
తెల్లదీవియందు దీపించు వైకుంఠ
పురము కనకవప్రపరివృతంబు.</poem>|ref=153}}
'''టీక'''. వణకుగుబ్బలికిని = హిమాలయమునకు; మిన్ను మోచియున్న = ఆకాశమునంటియున్న; శ్వేతద్వీపమున; కనకవప్రపరివృతంబు = బంగరుప్రాకారముతోఁ గూడినదైన.
తెల్లనిమంచుకొండపయి పచ్చనివైడూర్యశిఖరమున్నట్లు, తెల్లనిశ్వేతద్వీపమునఁ బచ్చని
బంగారుకోటగోడలుకల వైకుంఠనగర మున్నదని యర్థము. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>సారసువర్ణనీరమయసాలవిశాలము నీలవర్ణసం
చారచమత్క్రియాచరణశాలియునై పురి చెన్నగున్ మహా
మేరువుకౌఁగిటం బొలుపు మీఱి మహోత్కటకూటసంచర
ద్వారణరాజమై సొబగు దాల్చిన రోహణశైలమో యనన్.</poem>|ref=154}}
'''టీక'''. సార...విశాలము = చక్కని బంగారు నీటిపూఁత గల ప్రాకారముచేత విశాలమైనది; నీలవర్ణ...శాలియు నై = విష్ణుదేవునియొక్క సంచారముచే చమత్కారము కలుగునదియునైన; పురి = వైకుంఠము; పొలుపు మీఱి = చక్కదనము మీఱి; మహోత్కట...రాజమై = మిక్కిలి ఎత్తయిన శిఖరములపయి సంచరించు గొప్పయేనుఁగు గలదై; సొబగు దాల్చిన = అందగించిన; రోహణశైలమో యనన్ = రోహణాద్రియో అనునట్లు; చెన్నగున్ = ప్రకాశించును. [ఇచట సాలము మేరువువలెను, పురము రోహణమువలెను, విష్ణువు గజమువలెను ఉన్నట్లు వర్ణింపఁబడినది.] '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=సీ.|lines=<poem>త్రైవిక్రమాంఘ్రి మున్ <ref>క. తవిలి</ref>దవిలి వీడిన పద్మ
జాండఖండములీల నలరుఁ గోట
పలుమాఱు గమఠాధిపతి పూని డించు మం
దరములభాతి సౌధములు వెలయు
నిజవిహారార్ధంబు నృహరియై హరిచేయు
వసతులో యనఁ గేళివనము లెసఁగు
శాంబరీమత్స్యసంచారోచితాపర
శరధులక్రియ <ref>క. పద్మ</ref>బద్మసరసు లమరు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నఖిలభువనాంతరాళపురాధిదేవ
తావితానంబు తత్సేవకై <ref>ట. వసించు</ref>చరించు
సరణిఁ జూపట్టుదురు శరత్సమయపూర్ణ
రాజవదనలు వైకుంఠరాజధాని.</poem>|ref=155}}
'''టీక'''. వైకుంఠరాజధానిన్ = వైకుంఠనగరమునందు; కోట; మున్ = పూర్వము; త్రైవిక్రమాంఘ్రిన్ = త్రివిక్రమస్వామియగు విష్ణునియొక్క పాదమును; వీడిన = జారిపడిన; పద్మజాండఖండములీల = బ్రహ్మాండగోళపుతునుకవలె; అలరున్ = ప్రకాశించును; పలుమాఱు = పెక్కుసార్లు - అనేకయుగాంతరములయందు; కమఠాధిపతి = ఆదికూర్మము; పూని = ప్రయత్నించి; డిందు = తనపైనుండి దించునట్టి; మందరములభాతిన్ = మందరపర్వతములరీతిని; సౌధములు = మేడలు; వెలయున్; నృహరియై = నరసింహుఁడై; హరి = విష్ణువు; నిజవిహారార్థంబు = తాను విలాసమున సంచరించుటకొఱకు; చేయు వసతులో = చేయునట్టి నివాసములో యనురీతిని; కేళివనములు = ఉద్యానములు; శాంబరీ...క్రియన్ = మాయామత్స్యమగు మత్స్యావతారవిష్ణుని సంచారమునకుఁ దగిన వేఱుసముద్రములరీతిని; పద్మసరసులు = పద్మతటాకములు; ఎసఁగున్ = ప్రకాశించును; అఖిల...వితానంబు = సమస్తలోకములలోని పురములలోని అధిదేవతలగుంపులు; తత్సేవకై = విష్ణుని సేవించుటకు;<noinclude><references/></noinclude>
4u467u5zf8r2q3bzdinruhd1c061zqf
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/221
104
212664
559748
554887
2026-06-15T20:32:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559748
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చరించుసరణిన్ = తిరుగుచుండునట్లు; శరత్...వదనలు = శరత్కాలపు సంపూర్ణచంద్రులవంటి ముఖములు కలస్త్రీలు; చూపట్టుదురు. '''అలం'''. ఉదాత్తము, ఉపమ, ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=సీ.|lines=<poem>జలధివీచీవాత్యఁ జలిదాఁకెఁగా యని
యక్కున నందంద యలమి యలమి
ప్రామఱ్ఱియా కొత్తిరాయిడిఁ బొందెఁగా
యని సన్నపొత్తుల నునిచి యునిచి
వాపోయి వాపోయి వసివాడి యాఁకటఁ
బెగడెఁగా యని యుగ్గు పెట్టి పెట్టి
పెనుఁజీఁకటులు గ్రమ్ము పెన్బైట వసియించి
వెఱచెఁగా యని పుల్ల విఱిచి విఱిచి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మంచిలక్షణముల పుట్టుమచ్చవాఁడు
నేత్రములు విప్పనట్టి యీ<ref>శ.ర. నెత్రుకందు</ref>నెత్రుగందు
<ref>క. వఱల, చ.ట. వరద</ref>వరద నేతెంచె నెవ్వరివాఁడొ యనుచు
విలయహరిఁ దెచ్చి పెనుతు రవ్వీటిసతులు.</poem>|ref=156}}
'''టీక'''. అవ్వీటిసతులు = ఆ పట్టణము (వైకుంఠము)లోని స్త్రీలు; మంచి...వాఁడు = శుభలక్షణములతో గూడిన (శ్రీవత్సమను) పుట్టుమచ్చ కలవాఁడు; నేత్రములు విప్పనట్టి = కన్నులయినను తెరవనట్టి; ఈ నెత్రుగందుల = ఈ పుట్టుగుడ్డు; వరదన్ = వరదలో - ప్రవాహమునఁ గొట్టుకొని; ఎవ్వారివాఁడొ! = పాప మెవ్వరిపిల్లవాఁడో!; అని; విలయహరిన్ = ప్రళయకాలమందలి విష్ణువును; తెచ్చి; జలధివీచీవాత్యన్ = సముద్రపుకెరటములమీఁది చలిగాలిచే; చలిదాఁకెఁగా యని; అక్కునన్ = ఱొమ్మునన్; అందంద = మఱిమఱి; అలమియలమి = అదిమియదిమి; (ఆ వెచ్చదనముచేఁ జలి పోవునని భావము) ప్రామఱ్ఱియాకు ఒత్తి = ప్రాఁతదైన (శయ్య యగు) వటపత్రము మృదుదేహమున కొత్తుకొని; రాయిడిఁ బొందెఁగా యని = ఒరసికొనిపోయెనని; సన్నపొత్తులున్ = మెత్తని పొత్తిగుడ్డలపయి; ఉనిచియునిచి = ఉంచియుంచి; వాపోయి వాపోయి = మిక్కిలి ఏడ్చి; వసివాఁడి = మిక్కిలి యలసిపోయి; ఆఁకట బెగడెఁగా యని = ఆఁకలిచే బెంగటిల్లెనని; ఉగ్గు = బిడ్డలకుఁబోయు చనుబాలు కలిపిన ఆముదము, నేయి మొదలగునది; పెనుఁజీఁకటులు గ్రమ్ము = గాఢాంధకారములు వ్యాపించు; పెన్{{ZWNJ}}బైటన్ = బట్టబయట; వెఱచెఁగా యని = జడుసుకొనెనని; పుల్ల విరిచి విరిచి = దృష్టి తీసి తీసి; పెనుతురు = పెంచుదురు. ప్రళయకాలమునందును వైకుంఠనగరమున కెట్టి యిక్కట్టును లేదనియు, నందలి జనులు అపుడును సుఖముగ నుందురనియు భావము. '''అలం'''. స్వభావోక్తి, ఉదాత్తము.
{{Telugu poem|type=వ.|lines=<poem>మరియు నప్పురంబు పలుదెరలు తిరిగివచ్చుట నాఖేటస్థలంబును, నర్తనప్రదేశం
బునుం<ref>చ. బోలి</ref>బోలె; లెస్స వారిం గలిగి గజగ్రహణసంవిధానంబును, సుజనునింబోలెఁ;
బెక్కుపట్టులఁ గనుపట్టి కురువిందమందిరంబును, కశ్యపమునీశ్వరునింబోలె; హరికి
గిరిగుహయును; మాధవునకు నుపవనవిశేషంబును; <ref>క. చక్రికి, చ. ఇదిమొదలు 'రాజమార్గంబునం’వఱకు లేదు.</ref>జక్రికి శ్రీఖండతరుకోట
రంబును నై యడరం బుడమినిడువాలుగంటి తడవుమెచ్చుచుం జొచ్చి వియచ్చర
సంబాధబంధురంబు నిసర్గశృంగారతరంగితంబు నగు రాజమార్గంబునం జని చని
ముందట నేత్రసన్నిహితజగత్త్రయంబునుంబోలె బహువిధజనాకీర్ణంబై యుదీర్ణ
వైభవంబున వర్ణింపఁదగి బృందారకద్విరదంబుచందంబున వలభిదారూఢోపరి
భాగంబును; జాంగలక్షేత్రంబువైచిత్రి యవనికామహితంబును; నాటకసంధా
నంబుకైవడి శుద్ధమిశ్రవిష్కంభసంభృతంబును; దధీచిశరీరంబుకరణి సురభిగో<ref>చ. ముస్తాల</ref>ము</poem>|ref=}}<noinclude><references/></noinclude>
nyzhzimv0txrdm1xclxf482ldmlwawg
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/222
104
212665
559764
554888
2026-06-16T01:53:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559764
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ఖావిద్ధంబునై యొప్పు <ref>క. గూఢపాదతల్పు, చ. గూఢపాత్తల్పు</ref>గూఢపాత్తల్పుదివ్యభవనంబు దఱిసి విరసజనహృదయం
బులం దగులువడని బ్రహ్మవిద్యయుంబోలె న<ref>క. జిహ్వా, చ. జిహ్మ</ref>జిహ్మప్రకారంబున సప్తకక్ష్యాంత
రంబు లతిక్రమించి ముందట.</poem>|ref=157}}
'''టీక'''. (1) పలుదెరలు తిరిగివచ్చుటన్ = పెక్కు అడ్డములు దాఁటి వచ్చుటచే; అభేటస్థలంబును = వేటాడుచోటును ('''పురపక్షమున''' తెరలు = అడ్డువలలు); నర్తనప్రదేశంబునుంబోలెన్ = నాట్యరంగము (ఈ యర్థమున తెఱ = తెఱచీర) ను బోలి; (2) లెస్సవారిం గలిగి = ('''పట్టణపక్షమున''') మంచినీటిని గలిగి; గజగ్రహణసంవిధానంబును = ఏనుఁగులను పట్టుకొను పద్ధతిని (ఈయెడ లెస్సవారి = మంచిగొయ్యి - గజబంధనస్థానము); సుజనునింబోలెన్ = మంచివానిని (ఇయ్యెడ మంచివారిన్ = మంచిమనస్సు కల జనులను బోలి; [పూర్వటీకలో నిచ్చట 'సంవిధానము = కబళము, మంచియాజ్ఞ గలది' అని యున్నది. అనఁగానేమో తెలియలేదు.] (3) పెక్కుపట్టులం గనుపట్టి = ('''నగరపక్షమున''') చాలా నివాసస్థానములలో - ఇండ్లలో కనఁబడి; కురువిందమందిరంబును = అద్దపుటింటిని (ఈపక్షమున పెక్కుపట్టులనఁగా పలుతావులయందు); కశ్యపమునీశ్వరుని (ఈపట్టున పెక్కుపట్టులం గనుపట్టుట యనఁగా పెక్కువిధముల బంధుత్వమును కలిగియుండుట - ప్రపంచములోని జీవజాలము లన్నింటికిని కశ్యపుఁడే మూలపురుషుఁ డనుట) బోలియు. [ఇఁకమీఁద వచ్చు మూఁడుపోలికలు విరోధమూలకములు.]
(i) హరికిన్ = విష్ణునకు; గిరిగుహయున్ = కొండగుహయైనదియు; [ఇది విరోధము; దానిని
పోగొట్టుటకు హరిశబ్దమునకు సింహ మను నర్థము గ్రాహ్యము.] (ii) మాధవునకున్ = లక్ష్మికి భర్త యగు విష్ణువునకు; ఉపవనంబును = ఉద్యానవనమైనదియు; [ఇది విరోధము; దానిం బోగొట్టుటకు మాధవశబ్దమునకు 'వసంతర్తువుˈ అను నర్థము గ్రాహ్యము] ( iii) చక్రికిన్ - చక్రాయుధము గల విష్ణునకు; శ్రీఖండతరుకోటరంబును = చందనవృక్షపుతొఱ్ఱ యైనదియు; [ఇది విరోధము; దానిఁ బోగొట్టుటకు 'చక్రి'కి 'పాము' అను నర్థము గ్రాహ్యము.] అడరన్ = ప్రకాశింపఁగా; పుడమినిడువాలుగంటి = భూమి యను పొడవువాలికకన్నులు గల పడఁతి; తడవు = చాలసేపు; చొచ్చి = ప్రవేశించి; వియచ్చరసంబాధబంధురంబున్ = దేవతల సమ్మర్దముచే మనోహరమైనదియు; నిసర్గశృంగారతరంగితంబు నగు = స్వభావసిద్ధమగు నలంకారములచే నింపుగొల్పునదియునైన; నేత్ర...బునుంబోలెన్ = కన్నులయెదుట నుంచఁబడిన మూఁడులోకములు వలె, నాయకుఁడు లేని ముల్లోకములవలెననియు; బహువిధజనాకీర్ణంబై = అనేకవిధములుగా నున్న జనులతో నిండియున్నవై; [విష్ణుసేవార్థము ముల్లోకముల జనులును వచ్చిరనుట.] ఉదీర్ణవైభవంబునన్ = గొప్పఐశ్వర్యముతో; [ఇఁకమీఁది నాల్గు పోలికలు శ్లేషమూలకములు.] బృందారకద్విరదంబుచందంబునన్ = ఐరావతముపగిది; వలభిదారూడోపరిభాగంబును = ఇంద్రునిచే [ˈవ-బˈలకు అభేదమును గ్రహింపవలెను.] అధిష్ఠింపఁబడిన వీఁపు కలది; విష్ణునిభవనము (వలభి+దారు+ఊఢ+ఉపరిభాగంబు =) ముంజూరుపట్టెపయి ఉంచఁబడిన మీఁదిభాగము కలది; లాంగలక్షేత్రంబువైచిత్రిన్ = మెట్టపొలమువిధమున; యవనికామహితంబును = (యవ+నికామ+హితంబును) యవధాన్యముచే మిక్కిలి హితమైనది, లేదా బ్రహ్మదర్భచే గొప్పదైనదియు; ('''భవనపక్షమున''') యవనికలచే (తెఱలచే) అలంకరించబడినది; ['యవనికామహితంబు = ఓమముచేత పూజ్యమయినది, తెరచీరచేత దొడ్డది' అని పూర్వటీక.] నాటకసంవిధానంబుకైవడిన్ = నాటకరచనముపగిది; శుద్ధ...సంభృతంబును = శుద్ధవిష్కంభము, మిశ్రవిష్కంభములతోఁ గూడినదియు; ('''భవనపక్షమున''') శుద్ధముగాను (ప్రత్యేకముగాను) మిశ్రముగాను (వేఱొకదానితోఁ గలసియు) నున్న గడెమ్రానిచే గూర్పఁబడినది. దధీచిశరీరంబుకరణిన్ = దధీచిమహర్షి దేహమువలె; సురభిగోముఖావిద్ధంబునై = మనోహరమగు సురభిగోముఖాదులచే చూడఁబడినదై, ('''భవనపక్షమున''') మంచివాసనగల ద్రవ్యముచే అలుకఁబడినది. గూఢపాత్తల్చు = పాము పడకగాఁ గల<noinclude><references/></noinclude>
f1kvatdffb9lusbp8qu0y6jav0zmsdf
559765
559764
2026-06-16T01:54:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559765
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ఖావిద్ధంబునై యొప్పు <ref>క. గూఢపాదతల్పు, చ. గూఢపాత్తల్పు</ref>గూఢపాత్తల్పుదివ్యభవనంబు దఱిసి విరసజనహృదయం
బులం దగులువడని బ్రహ్మవిద్యయుంబోలె న<ref>క. జిహ్వా, చ. జిహ్మ</ref>జిహ్మప్రకారంబున సప్తకక్ష్యాంత
రంబు లతిక్రమించి ముందట.</poem>|ref=157}}
'''టీక'''. (1) పలుదెరలు తిరిగివచ్చుటన్ = పెక్కు అడ్డములు దాఁటి వచ్చుటచే; అభేటస్థలంబును = వేటాడుచోటును ('''పురపక్షమున''' తెరలు = అడ్డువలలు); నర్తనప్రదేశంబునుంబోలెన్ = నాట్యరంగము (ఈ యర్థమున తెఱ = తెఱచీర) ను బోలి; (2) లెస్సవారిం గలిగి = ('''పట్టణపక్షమున''') మంచినీటిని గలిగి; గజగ్రహణసంవిధానంబును = ఏనుఁగులను పట్టుకొను పద్ధతిని (ఈయెడ లెస్సవారి = మంచిగొయ్యి - గజబంధనస్థానము); సుజనునింబోలెన్ = మంచివానిని (ఇయ్యెడ మంచివారిన్ = మంచిమనస్సు కల జనులను బోలి; [పూర్వటీకలో నిచ్చట 'సంవిధానము = కబళము, మంచియాజ్ఞ గలది' అని యున్నది. అనఁగానేమో తెలియలేదు.] (3) పెక్కుపట్టులం గనుపట్టి = ('''నగరపక్షమున''') చాలా నివాసస్థానములలో - ఇండ్లలో కనఁబడి; కురువిందమందిరంబును = అద్దపుటింటిని (ఈపక్షమున పెక్కుపట్టులనఁగా పలుతావులయందు); కశ్యపమునీశ్వరుని (ఈపట్టున పెక్కుపట్టులం గనుపట్టుట యనఁగా పెక్కువిధముల బంధుత్వమును కలిగియుండుట - ప్రపంచములోని జీవజాలము లన్నింటికిని కశ్యపుఁడే మూలపురుషుఁ డనుట) బోలియు. [ఇఁకమీఁద వచ్చు మూఁడుపోలికలు విరోధమూలకములు.]
(i) హరికిన్ = విష్ణునకు; గిరిగుహయున్ = కొండగుహయైనదియు; [ఇది విరోధము; దానిని పోగొట్టుటకు హరిశబ్దమునకు సింహ మను నర్థము గ్రాహ్యము.] (ii) మాధవునకున్ = లక్ష్మికి భర్త యగు విష్ణువునకు; ఉపవనంబును = ఉద్యానవనమైనదియు; [ఇది విరోధము; దానిం బోగొట్టుటకు మాధవశబ్దమునకు 'వసంతర్తువుˈ అను నర్థము గ్రాహ్యము] ( iii) చక్రికిన్ - చక్రాయుధము గల విష్ణునకు; శ్రీఖండతరుకోటరంబును = చందనవృక్షపుతొఱ్ఱ యైనదియు; [ఇది విరోధము; దానిఁ బోగొట్టుటకు 'చక్రి'కి 'పాము' అను నర్థము గ్రాహ్యము.] అడరన్ = ప్రకాశింపఁగా; పుడమినిడువాలుగంటి = భూమి యను పొడవువాలికకన్నులు గల పడఁతి; తడవు = చాలసేపు; చొచ్చి = ప్రవేశించి; వియచ్చరసంబాధబంధురంబున్ = దేవతల సమ్మర్దముచే మనోహరమైనదియు; నిసర్గశృంగారతరంగితంబు నగు = స్వభావసిద్ధమగు నలంకారములచే నింపుగొల్పునదియునైన; నేత్ర...బునుంబోలెన్ = కన్నులయెదుట నుంచఁబడిన మూఁడులోకములు వలె, నాయకుఁడు లేని ముల్లోకములవలెననియు; బహువిధజనాకీర్ణంబై = అనేకవిధములుగా నున్న జనులతో నిండియున్నవై; [విష్ణుసేవార్థము ముల్లోకముల జనులును వచ్చిరనుట.] ఉదీర్ణవైభవంబునన్ = గొప్పఐశ్వర్యముతో; [ఇఁకమీఁది నాల్గు పోలికలు శ్లేషమూలకములు.] బృందారకద్విరదంబుచందంబునన్ = ఐరావతముపగిది; వలభిదారూడోపరిభాగంబును = ఇంద్రునిచే [ˈవ-బˈలకు అభేదమును గ్రహింపవలెను.] అధిష్ఠింపఁబడిన వీఁపు కలది; విష్ణునిభవనము (వలభి+దారు+ఊఢ+ఉపరిభాగంబు =) ముంజూరుపట్టెపయి ఉంచఁబడిన మీఁదిభాగము కలది; లాంగలక్షేత్రంబువైచిత్రిన్ = మెట్టపొలమువిధమున; యవనికామహితంబును = (యవ+నికామ+హితంబును) యవధాన్యముచే మిక్కిలి హితమైనది, లేదా బ్రహ్మదర్భచే గొప్పదైనదియు; ('''భవనపక్షమున''') యవనికలచే (తెఱలచే) అలంకరించబడినది; ['యవనికామహితంబు = ఓమముచేత పూజ్యమయినది, తెరచీరచేత దొడ్డది' అని పూర్వటీక.] నాటకసంవిధానంబుకైవడిన్ = నాటకరచనముపగిది; శుద్ధ...సంభృతంబును = శుద్ధవిష్కంభము, మిశ్రవిష్కంభములతోఁ గూడినదియు; ('''భవనపక్షమున''') శుద్ధముగాను (ప్రత్యేకముగాను) మిశ్రముగాను (వేఱొకదానితోఁ గలసియు) నున్న గడెమ్రానిచే గూర్పఁబడినది. దధీచిశరీరంబుకరణిన్ = దధీచిమహర్షి దేహమువలె; సురభిగోముఖావిద్ధంబునై = మనోహరమగు సురభిగోముఖాదులచే చూడఁబడినదై, ('''భవనపక్షమున''') మంచివాసనగల ద్రవ్యముచే అలుకఁబడినది. గూఢపాత్తల్చు = పాము పడకగాఁ గల<noinclude><references/></noinclude>
pg4nqkrczb3rxfg1176ky187h5ywkm3
559767
559765
2026-06-16T02:44:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559767
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ఖావిద్ధంబునై యొప్పు <ref>క. గూఢపాదతల్పు, చ. గూఢపాత్తల్పు</ref>గూఢపాత్తల్పుదివ్యభవనంబు దఱిసి విరసజనహృదయం
బులం దగులువడని బ్రహ్మవిద్యయుంబోలె న<ref>క. జిహ్వా, చ. జిహ్మ</ref>జిహ్మప్రకారంబున సప్తకక్ష్యాంత
రంబు లతిక్రమించి ముందట.</poem>|ref=157}}
'''టీక'''. (1) పలుదెరలు తిరిగివచ్చుటన్ = పెక్కు అడ్డములు దాఁటి వచ్చుటచే; అభేటస్థలంబును = వేటాడుచోటును ('''ఈపక్షమున''' తెరలు = అడ్డువలలు); నర్తనప్రదేశంబునుంబోలెన్ = నాట్యరంగము (ఈ యర్థమున తెఱ = తెఱచీర) ను బోలి; (2) లెస్సవారిం గలిగి = ('''పట్టణపక్షమున''') మంచినీటిని గలిగి; గజగ్రహణసంవిధానంబును = ఏనుఁగులను పట్టుకొను పద్ధతిని (ఈయెడ లెస్సవారి = మంచిగొయ్యి - గజబంధనస్థానము); సుజనునింబోలెన్ = మంచివానిని (ఇయ్యెడ మంచివారిన్ = మంచిమనస్సు కల జనులను బోలి; [పూర్వటీకలో నిచ్చట 'సంవిధానము = కబళము, మంచియాజ్ఞ గలది' అని యున్నది. అనఁగానేమో తెలియలేదు.] (3) పెక్కుపట్టులం గనుపట్టి = ('''నగరపక్షమున''') చాలా నివాసస్థానములలో - ఇండ్లలో కనఁబడి; కురువిందమందిరంబును = అద్దపుటింటిని (ఈపక్షమున పెక్కుపట్టులనఁగా పలుతావులయందు); కశ్యపమునీశ్వరుని (ఈపట్టున పెక్కుపట్టులం గనుపట్టుట యనఁగా పెక్కువిధముల బంధుత్వమును కలిగియుండుట - ప్రపంచములోని జీవజాలము లన్నింటికిని కశ్యపుఁడే మూలపురుషుఁ డనుట) బోలియు. [ఇఁకమీఁద వచ్చు మూఁడుపోలికలు విరోధమూలకములు.]
(i) హరికిన్ = విష్ణునకు; గిరిగుహయున్ = కొండగుహయైనదియు; [ఇది విరోధము; దానిని పోగొట్టుటకు హరిశబ్దమునకు సింహ మను నర్థము గ్రాహ్యము.] (ii) మాధవునకున్ = లక్ష్మికి భర్త యగు విష్ణువునకు; ఉపవనంబును = ఉద్యానవనమైనదియు; [ఇది విరోధము; దానిం బోగొట్టుటకు మాధవశబ్దమునకు 'వసంతర్తువుˈ అను నర్థము గ్రాహ్యము] ( iii) చక్రికిన్ - చక్రాయుధము గల విష్ణునకు; శ్రీఖండతరుకోటరంబును = చందనవృక్షపుతొఱ్ఱ యైనదియు; [ఇది విరోధము; దానిఁ బోగొట్టుటకు 'చక్రి'కి 'పాము' అను నర్థము గ్రాహ్యము.] అడరన్ = ప్రకాశింపఁగా; పుడమినిడువాలుగంటి = భూమి యను పొడవువాలికకన్నులు గల పడఁతి; తడవు = చాలసేపు; చొచ్చి = ప్రవేశించి; వియచ్చరసంబాధబంధురంబున్ = దేవతల సమ్మర్దముచే మనోహరమైనదియు; నిసర్గశృంగారతరంగితంబు నగు = స్వభావసిద్ధమగు నలంకారములచే నింపుగొల్పునదియునైన; నేత్ర...బునుంబోలెన్ = కన్నులయెదుట నుంచఁబడిన మూఁడులోకములు వలె, నాయకుఁడు లేని ముల్లోకములవలెననియు; బహువిధజనాకీర్ణంబై = అనేకవిధములుగా నున్న జనులతో నిండియున్నవై; [విష్ణుసేవార్థము ముల్లోకముల జనులును వచ్చిరనుట.] ఉదీర్ణవైభవంబునన్ = గొప్పఐశ్వర్యముతో; [ఇఁకమీఁది నాల్గు పోలికలు శ్లేషమూలకములు.] బృందారకద్విరదంబుచందంబునన్ = ఐరావతముపగిది; వలభిదారూఢోపరిభాగంబును = ఇంద్రునిచే [ˈవ-బˈలకు అభేదమును గ్రహింపవలెను.] అధిష్ఠింపఁబడిన వీఁపు కలది; విష్ణునిభవనము (వలభి+దారు+ఊఢ+ఉపరిభాగంబు =) ముంజూరుపట్టెపయి ఉంచఁబడిన మీఁదిభాగము కలది; లాంగలక్షేత్రంబువైచిత్రిన్ = మెట్టపొలమువిధమున; యవనికామహితంబును = (యవ+నికామ+హితంబును) యవధాన్యముచే మిక్కిలి హితమైనది, లేదా బ్రహ్మదర్భచే గొప్పదైనదియు; ('''భవనపక్షమున''') యవనికలచే (తెఱలచే) అలంకరించబడినది; ['యవనికామహితంబు = ఓమముచేత పూజ్యమయినది, తెరచీరచేత దొడ్డది' అని పూర్వటీక.] నాటకసంవిధానంబుకైవడిన్ = నాటకరచనముపగిది; శుద్ధ...సంభృతంబును = శుద్ధవిష్కంభము, మిశ్రవిష్కంభములతోఁ గూడినదియు; ('''భవనపక్షమున''') శుద్ధముగాను (ప్రత్యేకముగాను) మిశ్రముగాను (వేఱొకదానితోఁ గలసియు) నున్న గడెమ్రానిచే గూర్పఁబడినది. దధీచిశరీరంబుకరణిన్ = దధీచిమహర్షి దేహమువలె; సురభిగోముఖావిద్ధంబునై = మనోహరమగు సురభిగోముఖాదులచే చూడఁబడినదై, ('''భవనపక్షమున''') మంచివాసనగల ద్రవ్యముచే అలుకఁబడినది. గూఢపాత్తల్చు = పాము పడకగాఁ గల<noinclude><references/></noinclude>
9t2qa90kxbmz36hmbnon2rgyxmruwdv
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/223
104
212666
559766
554889
2026-06-16T02:40:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559766
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విష్ణునియొక్క; తఱిసి = సమీపించి; విరసజనహృదయంబులన్ = చెడ్డమనుష్యులమనస్సులందు; తగులువడని = అంటని; బ్రహ్మవిద్యయుంబోలెన్ = పరమాత్మజ్ఞానమువలె; అజిహ్మప్రకారంబునన్ = వంకర లేనిరీతిని - తిన్ననినడకతో; సప్తకక్ష్యాంతరంబులు = ఏడు లోపలినగళ్లను; అతిక్రమించి = దాటి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>నవసుధాపరిఖాంబునివహ ముబ్బెడుచోట
మెఱఁగుఁబుత్తడికోట మించుచోట
నిగిడి యీఁగులకెంపు నెలకట్టుగలచోటఁ
గల్వకావిరి కారుగ్రమ్ముచోటఁ
నలరు ముమ్మొనలకట్టావు లూరెడుచోటఁ
గెలకులకొలఁకులు దొలఁకుచోట
గంధర్వగాంధర్వ<ref>చ. గాంధమంపగు</ref>గంధ మింపగుచోట
గరుడకేతనములు గ్రాలుచోటఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>బరమయోగివరేణ్యు నిర్భరసమాధి
సౌఖ్వసంపద నిరపాయసంప్రదాయ
సిద్ధిఁ <ref>క. దులకించు, చ.ట. దిలకించు</ref>దిలకించుచోట నశేషభవన
వివిధధర్మంబు లావిర్భవించుచోట.</poem>|ref=158}}
'''టీక'''. నవ...నివహము = క్రొత్తదైనయమృతపుటగడ్తలోని జలప్రవాహము; మెఱఁగుఁబుత్తడికోట = తళతళలాడు బంగారుకోట; నిగిడి = విజృంభించి; ఈఁగులకెంపునెలకట్టు = చింతామణితోఁ జేయఁబడిన కట్టడపుఁబని; కల్వకావిరి = కలువలనల్లనికాంతి; కారుగ్రమ్ముచోటన్ = దట్టముగా వ్యాపించుచోట; అలరు ముమ్మొనలకట్టావులు = పూవులయగ్రభాగములనుండి పెద్దశ్వాసములు (పరిమళయుక్తవాయువులు) ఊరెడుచోటన్ = ఎడతెగక పుట్టుస్థలమున; కెలఁకులకొలఁకులు = ప్రక్కనున్న చెఱువులు; తొలఁకుచోటన్ = తొనుకుచున్న (నీటితో నిండి యందమైన)చోట; గంధర్వ...గంధము = గంధర్వులపాటలయొక్క అతిశయము; ['గాంధర్వగంధము = పాటలవలని వాసన' అని పూర్వటీక.] క్రాలుచోటన్ = ప్రకాశించుచోట; పరమ...సమాధి = గొప్పయోగీశ్వరుని హెచ్చగు యోగనిష్ఠయొక్క; సౌఖ్యసంపద; నిరపాయసిద్ధిన్ = అపాయము లేనట్టి సిద్ధిని; తిలకించుచోటన్ = కనుగొనుచోట, ['తులకించు = ప్రకాశించు' అని పూర్వటీక.] అశేష...ధర్మంబులు = సమస్తలోకముల ధర్మములన్నియును; ఆవిర్భవించుచోటన్ = (పుట్టు) ఉత్పత్తియగుచోట - (వైకుంఠమున) ముందు పద్యమున అన్వయము. '''అలం'''. ఉదాత్తము.
{{Telugu poem|type=క.|lines=<poem>బహుయోజనవిస్తీర్ణము
బహునారీజనయుతంబు బహూవిధమహిమా
వహము నగు నొక్కకేళి
గృహమున నానందకోరకితమానసుఁడై.</poem>|ref=159}}
'''టీక'''. కేళీగృహమునన్ = విలాసమందిరమున; ఆనంద...మానసుఁడై = సంతోషముచే చిగురెత్తిన మనస్సు కలవాఁడై (కర్త - విష్ణువు).
{{Telugu poem|type=మ.|lines=<poem>కలదోఃకంకణఝంకృతంబుల మరుత్కన్యల్ సుధాబిందుపి
చ్ఛిలనీహారమయూఖ<ref>చ. పింఛ</ref>బింబసదృశస్విన్నాననశ్రేణి వ
ర్తిల నొయ్యొయ్యన <ref>చ.ట. యూఁప</ref>నూఁప నూఁగు ఫణభృత్ప్రేంఖోళికన్ లచ్చిని
<ref>చ. ట్టలవుం</ref>ట్టలపుంజన్గవఁ <ref>చ.ట. పొల్ప</ref>బోలు ము<ref>చ. న్పెరుగు</ref>న్నొరగు మున్ డాచేసి యుల్లాసియై.</poem>|ref=160}}
'''టీక'''. మరుత్కన్యలు = దేవతాస్త్రీలు; సుధా...శ్రేణి — సుధాబిందుపిచ్ఛిల = అమృతబిందువులచే పేరుకొనిన; నీహారమయూఖబింబ = చంద్రబింబముతో; సదృశ = పోలియున్న; స్విన్నాననశ్రేణి = చెమటపట్టిన ముఖముల సమూహము; వర్తిలన్ = ప్రవర్తిల్లఁగా - ఉండఁగా; కలదోఃకంకణఝంకృతంబులన్ = చేతులయందలి కంకణముల గలగలమను మధురధ్వనులతో; ఒయ్యొయ్యనన్ = మెల్లఁగా; ఊఁపన్; ఊఁగు = ఊఁగుచున్నట్టి; ఫణిభృత్ప్రేంఖోళికన్ = పాము అను నుయ్యాలయందు;<noinclude><references/></noinclude>
6hnlwgorgq16gns3x9ertnw0no1qjed
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/224
104
212667
559771
554890
2026-06-16T04:00:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559771
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లచ్చి...బోలు = లక్ష్మీదేవియొక్క ఎత్తయిన (ఉన్నతమైన) స్తనద్వయమువలెనున్న; మున్నొరగు = ముందుంచుకొను దిండును; మున్ డా చేసి = ముందుభాగమున దగ్గఱగా (ఆధారముగా) నుంచుకొని; ఉల్లాసియై = సంతోషించువాఁడై - ఆనందించువాఁడై.
[దేవతాస్త్రీలు సర్పపుటుయ్యాల నూపఁగా అందు విష్ణువు ముందఱిదిండును ముందుంచి దాని
నానుకొని సంతోషమున నున్నాఁడని భావము.] '''అలం'''. స్వభావోక్తి, ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>దీపించువానిఁ ద్రిభువన
దీపకుఁ డగువానిఁ జంద్రదినకరమయవీ
క్షాపాతదళితనిజభ
క్తాపద్ధ్వాంతప్రవాహుఁ డనదగువానిన్.</poem>|ref=l6l}}
'''టీక'''. దీపించువానిన్ = ప్రకాశించువానిని; త్రిభువనదీపకుఁడు = ముల్లోకములను ప్రకాశింపఁజేయువాఁడు; చంద్ర...ప్రవాహుఁడు — చంద్రదినకరమయ = చంద్రసూర్యులరూపున నున్న; వీక్షా = చూపులయొక్క; పాక = (వ్యాపనమున) పడుటవలన; దళిత = ఛేదింపఁబడిన; భక్తాపద్ధ్వాంతప్రవాహుఁడు = భక్తుల యాపద లను చీఁకటిపరంపరలు గలవాఁడు. '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=తే.|lines=<poem>నగవు నురువులు మణిపూరనలినహంసి
<ref>క. కుంతల, చ. కుండల</ref>కుండలగ్రాహములు నేత్రకుముదరుచియుఁ
గలుగు తనుకాంతికాళిందిఁ గన్న తరుణ
తరణియును బోని యురమురత్నంబువాని.</poem>|ref=162}}
'''టీక'''. [ఈపద్యమున శ్రీవిష్ణుని నల్లనిదేహము యమునానదిగా వర్ణింపఁబడుచున్నది.] ఈదేవునితనుకాంతి యను కాళిందికి (యమునకు)] నగవు నురువులు = తెల్లనినవ్వులే నురుగులు; మణిపూరనళినహంసి = మణులప్రవాహములే (గుంపులే) పద్మములును, హంసలును; కుండలగ్రాహములు = (చెవుల నలంకరించిన) మకరకుండలములే మొసళ్ళు; నేత్రకుముదరుచియున్ = కన్నులే కలువలకాంతి కలవి; (ఇవి) కలుగు, తనుకాంతికాళిందిన్; కన్న; తరుణకరణియునుబోని = లేఁతసూర్యునివలెనున్న; ఉరము రత్నంబువానిన్ = వక్షఃస్థలమునందలి కౌస్తుభమణిక్యము కలవానిని - శ్రీవిష్ణుని. [ఇందు మణిపూరకమును పద్మమునకు శ్రీకృష్ణుఁడు హంస యగుటయు, కుండలియు సూచితములు.] [ముందుపద్యముతో అన్వయము.] '''అలం'''. రూపకము, ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>పుండరీకతపోజాతభువనపీడ
విన్నపము సేయు నజునంసవీథిఁ గేలు
సాచి హేమాద్రి<ref>క. కంధరాసక్త. శ.ర.</ref>కందరాసక్తమేఘ
మాలికంబగు గగనంబుఁ బోలువాని.</poem>|ref=163}}
'''టీక'''. పుండరీక...పీడన్ = పుండరీకుని తపస్సువలనఁ గలిగిన ప్రపంచబాధను; విన్నపము చేయు నజునంసవీథితోన్ = మనవి చేయుచున్న బ్రహ్మభుజముపై; కేలు సాచి = చేయి వేసి; హేమాద్రి...మాలికంబగు = మేరువుపర్వతపుచరియపై వ్యాపించిన మేఘపంక్తులు గల; గగనంబుఁ బోలువానిన్ = ఆకాశమువలె నున్నవానిని; [ముందు పద్యముతో సమన్వయము.] [విష్ణువు ఆకాశమువలెను, అతనిబాహువు మేఘములవరుసవలెను, బ్రహ్మ మేరువువలెను ఉన్నట్లు వర్ణితము.] '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>లలితలక్ష్మీనఖాం<ref>క. కుర, చ. కూర</ref>కూరలాల<ref>చ. శమన</ref>సమున
గమ్రకల్హారదళగంధగౌరవమున
నతులనైపథ్యరత్నచంద్రాతపమున
నొప్పు మీఱిన నునుసేసకొప్పువాని.</poem>|ref=164}}
'''టీక''', లలిత...లాలసమునన్ = లక్ష్మీదేవి చక్కనికొనగోళ్లతో దువ్వుటచేతను; కమ్ర...గౌరవమునన్ = మనోజ్ఞమగు కల్హార(ఎఱుపు కలిసిన తెలుపురంగు కలిగి మిక్కిలి పరిమళముతో నిండియున్న కలువల)ముల రేకులయొక్క ఎక్కువపరిమళముతోను; అతుల...తమునన్ = బాగుగా<noinclude><references/></noinclude>
ep3j25b5867y43g7w1ndh00jhsvqydt
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/225
104
212668
559775
554891
2026-06-16T06:28:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559775
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నలంకరింపఁబడిన రత్నములవలని వెన్నెల (వెన్నెలవంటి కాంతి)తోను; ఒప్పుమీఱిన = బాగుగానున్న; నునుసేసకొప్పువానిన్ = చిన్నకొండెసిగ గలవానిని; మీఁదిపద్యముతో నన్వయము.
[విష్ణునితలను లక్ష్మీదేవి బాగుగా దువ్వి జుట్టు వేసి, అందు కల్హారదళములను, రత్నములను అలంకరించినదని భావము.]
{{Telugu poem|type=తే.|lines=<poem>ఊరుయుగళంబుమీఁదఁ జెల్వారు నడిమి
తానవంబునెపంబున దనుజనదన
నిర్మితస్తంభసంభవనిజపురాణ
పురుషహరిలీల దెలిపెడు పొలుపువాని.</poem>|ref=165}}
'''టీక'''. ఊరుయుగళంబుమీఁద = రెండుతొడలపైని; చెల్వారు = ప్రకాశించు; నడిమితానవంబునెపంబునన్ = మధ్యముయొక్క సన్నదన మనుమిషచే; దనుజ...లీలన్ = రాక్షసుఁడగు హిరణ్యకశిపుని యింటిస్తంభమునుండి పుట్టిన తనపూర్వపుగాథ - (నృసింహావతారచరిత్రము) విలాసమును; తెలిపెడు పొలుపువానిన్ = తెలుపుచున్న అందము కలవానిని; మీఁదిపద్యముతో అన్వయము. [విష్ణునియూరువులు స్తంభములవలెను, నడుము సింహపునడుమురీతిని ఉన్నవనుట.] '''అలం'''. అపహ్నుతి.
{{Telugu poem|type=తే.|lines=<poem>అభినవాయాతుఁ దనపుత్రు నజునిఁ గాంచి
సంతసంబున నాభివేశంతజలజ
ముబ్బి వెలిగ్రాయు పుప్పొడియొఱపు నెఱపు
<ref>ట. హరిది</ref>హళఁదిపుట్టంబు కటిసీమ <ref>క. నమరు, చ. నలరు</ref>నలరువాని.</poem>|ref=166}}
'''టీక'''. అభినవాయాతున్ = అప్పుడే వచ్చిన; ['అభినవాయాతున్ = క్రొత్తగా వచ్చినవానిని' అని పూర్వటీక.) అజుని = బ్రహ్మను; నాభివేశంతజలజము = (కర్త) నాభియను మడుగునందలి తామరపూవు; ఉబ్బి = పొంగి; వెలిగ్రాయు = వెడలఁగ్రక్కునట్టి; పుప్పొడియొఱపున్ = పుప్పొడియందమును; నెఱపు = వ్యాపింపఁజేయునట్టి; హళఁదిపుట్టంబు = పసుపువన్నెబట్ట; [ముందున కన్వయము.] విష్ణువు పుప్పొడివలె పచ్చనైన వస్త్రమును ధరించెనని భావము. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>అడుగునడుగులఁ బొడము చిహ్నంపుమీల
మేనిచిప్పలువోలె నానానిలింప
కనకకోటీరహీరాగ్రఘర్షణమున
మెఱుఁగు వచ్చిన నఖపంక్తి మించువాని.</poem>|ref=167}}
'''టీక'''. అడుగునడుగులన్ = అఱపాదములందు; పొడము - పుట్టిన - ఉన్న; చిహ్నంపుమీల మేని చిప్పలువోలెన్ = చిహ్నములుగా నున్న మత్స్యములవీఁపులవలె [ఉపమేయము నఖపంక్తి]; నానా...ఘర్షణమునన్ = వివిధదేవతలయొక్క బంగారుకిరీటములందలి వజ్రములయంచుల యొరపిడిచేత; మెఱుఁగువచ్చిన; నఖపంక్తిన్ = గోళ్లచే; మించువానిన్ = అతిశయించువానిని [ముందున కన్వయము.] '''అలం'''. ఉపమ, ఉదాత్తము.
{{Telugu poem|type=తే.|lines=<poem>ఆద్యుఁ బ్రణవస్వరూపు వేదాంతవేద్యు
మోక్షవిద్యోపదేష్టనిర్ముక్తజనను
విష్ణుఁ బ్రభవిష్ణు నిత్యవర్ధిష్ణుఁ గాంచి
మ్రొక్కె నారీజనోచితంబుగ ధరిత్రి.</poem>|ref=168}}
'''టీక'''. ఆద్యున్ = మూలపురుషుని; ప్రణవస్వరూపున్ = ఓంకారస్వరూపుని; వేదాంతవేద్యున్ = ఉపనిషత్తులచే నెఱుఁగఁదగువానిని; మోక్షవిద్యోపదేష్టన్ = ముక్తికొఱకగు విద్యను బోధించువానిని; నిర్ముక్తజననున్ = విడువఁబడిన పుట్టుక కలవానిని - జన్మరహితుని; ప్రభవిష్ణున్ = ప్రభువును; సర్వవర్ధిష్ణున్ = అంతటను వృద్ధిపొందు (పెరుగు)వానిని; విష్ణున్ = సర్వవ్యాపకుఁడగు భగవంతుని; ధరిత్రి = భూమి (కర్తృపదము); నారీజనోచితంబుగన్ = స్త్రీలకుఁ దగినరీతిగా; మ్రొక్కెన్. '''అలం'''. పరికరము.<noinclude><references/></noinclude>
ntc3fdjm0csfvi62qhkaqd49coz3euo
559776
559775
2026-06-16T06:29:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559776
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నలంకరింపఁబడిన రత్నములవలని వెన్నెల (వెన్నెలవంటి కాంతి)తోను; ఒప్పుమీఱిన = బాగుగానున్న; నునుసేసకొప్పువానిన్ = చిన్నకొండెసిగ గలవానిని; మీఁదిపద్యముతో నన్వయము.
[విష్ణునితలను లక్ష్మీదేవి బాగుగా దువ్వి జుట్టు వేసి, అందు కల్హారదళములను, రత్నములను అలంకరించినదని భావము.]
{{Telugu poem|type=తే.|lines=<poem>ఊరుయుగళంబుమీఁదఁ జెల్వారు నడిమి
తానవంబునెపంబున దనుజనదన
నిర్మితస్తంభసంభవనిజపురాణ
పురుషహరిలీల దెలిపెడు పొలుపువాని.</poem>|ref=165}}
'''టీక'''. ఊరుయుగళంబుమీఁద = రెండుతొడలపైని; చెల్వారు = ప్రకాశించు; నడిమితానవంబునెపంబునన్ = మధ్యముయొక్క సన్నదన మనుమిషచే; దనుజ...లీలన్ = రాక్షసుఁడగు హిరణ్యకశిపుని యింటిస్తంభమునుండి పుట్టిన తనపూర్వపుగాథ - (నృసింహావతారచరిత్రము) విలాసమును; తెలిపెడు పొలుపువానిన్ = తెలుపుచున్న అందము కలవానిని; మీఁదిపద్యముతో అన్వయము. [విష్ణునియూరువులు స్తంభములవలెను, నడుము సింహపునడుమురీతిని ఉన్నవనుట.] '''అలం'''. అపహ్నుతి.
{{Telugu poem|type=తే.|lines=<poem>అభినవాయాతుఁ దనపుత్రు నజునిఁ గాంచి
సంతసంబున నాభివేశంతజలజ
ముబ్బి వెలిగ్రాయు పుప్పొడియొఱపు నెఱపు
<ref>ట. హరిది</ref>హళఁదిపుట్టంబు కటిసీమ <ref>క. నమరు, చ. నలరు</ref>నలరువాని.</poem>|ref=166}}
'''టీక'''. అభినవాయాతున్ = అప్పుడే వచ్చిన; ['అభినవాయాతున్ = క్రొత్తగా వచ్చినవానిని' అని పూర్వటీక.) అజుని = బ్రహ్మను; నాభివేశంతజలజము = (కర్త) నాభియను మడుగునందలి తామరపూవు; ఉబ్బి = పొంగి; వెలిగ్రాయు = వెడలఁగ్రక్కునట్టి; పుప్పొడియొఱపున్ = పుప్పొడియందమును; నెఱపు = వ్యాపింపఁజేయునట్టి; హళఁదిపుట్టంబు = పసుపువన్నెబట్ట; [ముందున కన్వయము.] విష్ణువు పుప్పొడివలె పచ్చనైన వస్త్రమును ధరించెనని భావము. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>అడుగునడుగులఁ బొడము చిహ్నంపుమీల
మేనిచిప్పలువోలె నానానిలింప
కనకకోటీరహీరాగ్రఘర్షణమున
మెఱుఁగు వచ్చిన నఖపంక్తి మించువాని.</poem>|ref=167}}
'''టీక'''. అడుగునడుగులన్ = అఱపాదములందు; పొడము = పుట్టిన - ఉన్న; చిహ్నంపుమీల మేని చిప్పలువోలెన్ = చిహ్నములుగా నున్న మత్స్యములవీఁపులవలె [ఉపమేయము నఖపంక్తి]; నానా...ఘర్షణమునన్ = వివిధదేవతలయొక్క బంగారుకిరీటములందలి వజ్రములయంచుల యొరపిడిచేత; మెఱుఁగువచ్చిన; నఖపంక్తిన్ = గోళ్లచే; మించువానిన్ = అతిశయించువానిని [ముందున కన్వయము.] '''అలం'''. ఉపమ, ఉదాత్తము.
{{Telugu poem|type=తే.|lines=<poem>ఆద్యుఁ బ్రణవస్వరూపు వేదాంతవేద్యు
మోక్షవిద్యోపదేష్టనిర్ముక్తజనను
విష్ణుఁ బ్రభవిష్ణు నిత్యవర్ధిష్ణుఁ గాంచి
మ్రొక్కె నారీజనోచితంబుగ ధరిత్రి.</poem>|ref=168}}
'''టీక'''. ఆద్యున్ = మూలపురుషుని; ప్రణవస్వరూపున్ = ఓంకారస్వరూపుని; వేదాంతవేద్యున్ = ఉపనిషత్తులచే నెఱుఁగఁదగువానిని; మోక్షవిద్యోపదేష్టన్ = ముక్తికొఱకగు విద్యను బోధించువానిని; నిర్ముక్తజననున్ = విడువఁబడిన పుట్టుక కలవానిని - జన్మరహితుని; ప్రభవిష్ణున్ = ప్రభువును; సర్వవర్ధిష్ణున్ = అంతటను వృద్ధిపొందు (పెరుగు)వానిని; విష్ణున్ = సర్వవ్యాపకుఁడగు భగవంతుని; ధరిత్రి = భూమి (కర్తృపదము); నారీజనోచితంబుగన్ = స్త్రీలకుఁ దగినరీతిగా; మ్రొక్కెన్. '''అలం'''. పరికరము.<noinclude><references/></noinclude>
qqtesqocqcbcmcfnccolqh6c96v1gi0
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/226
104
212669
559778
554892
2026-06-16T07:20:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559778
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>మ్రొక్కి <ref>క. వినుతించె, చ. వినిపించె</ref>వినిపించెఁ దనమది
నెక్కొను నెగులెల్ల నేలనెలఁతుక కన్నీ
రొక్కొక్కబొట్టు మెఱుఁగుం
చెక్కుల <ref>క. దిగ, చ. డిగ</ref>డిగజాఱఁ గోరఁ జిమ్ముచు హరికిన్.</poem>|ref=169}}
'''టీక'''. నేలనెలఁతుక = భూదేవి; తనమదిన్ = తనమనస్సులో; నెక్కొను = పాదుకొనియున్న; నెగులెల్లన్ = దుఃఖమునంతటిని.
{{Telugu poem|type=క.|lines=<poem>బలువ్రేగు<ref>చ. నొవ్వి</ref>నొప్పి నిమ్మై
నిల పలికిన పలుకుకతన హృదయము గలఁగెన్
నలినోదరునకు విలయా
నలయాతాయాతచలితనీరధివోలెన్.</poem>|ref=170}}
'''టీక'''. బలువ్రేగునొప్పిన్ = అధికభారమునగు బాధచే; ఇమ్మై = యుక్తమై - స్పష్టమై; ఇల పలికిన పలుకుకతన్ = భూదేవి పలికిన మాటలవలన; నలినోదరునకున్ = పద్మనాభుఁడగు విష్ణునకు; విలయా...నీరధివోలెన్ = ప్రళయకాలము గాలియొక్క రాకపోకల (ప్రసారణములన) వలన చలించు సముద్రమువలె; హృదయము; కలఁగెన్ = కలఁకపడెను. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున నమ్మధుమథనుండు వసుంధరమీఁదంగల కనికరంబునం దరంగితం
బగు నంతరంగంబు తదభిరక్షణంబున కభిముఖంబుఁ గావించి యటమున్న
యకాండప్రళయంబగు పుండరీకుతపోదహనంబు దురవగాహంబును, ద్రిభువన
దాహ<ref>ట. దోహలంబు</ref>దోహళంబు నగునని విన్నపంబు చేసి డాసియున్నవిరించిం గించిత్ప్రహ
సితాననుండై కనుంగొనుచు.</poem>|ref=171}}
'''టీక'''. అమ్మధుమథనుండు = మధురాక్షసుని చంపిన ఆ విష్ణువు; తరంగితంబగు = పొంగిపొరలిన; అంతరంగంబు = మనస్సు; అభిముఖంబు = ఎదురైనది - అనుకూలమైనది; అఁటమున్న = అంతకుఁ బూర్వమే; ఆకాండప్రళయంబగు = కాలము కాని కాలమునఁ బుట్టిన ప్రళయమైన; దురవగాహంబును = తెలిసికొన నసాధ్యమును; త్రిభువనదాహదోహళంబును = ముల్లోకములను గాల్ప సమర్థమైనదియు; కించిత్ప్రహసితాననుండై = చిరునవ్వుతోఁ గూడిన ముఖము కలవాఁడై.
{{Telugu poem|type=సీ.|lines=<poem>శాంభరీకచ్చపేశ్వరకంఠసందీప్త
తాపింఛవల్లీమతల్లి యనఁగఁ
బవనపారణపతి స్ఫాటికస్తంభజం
భద్విషణ్మణిసాలభంజి యనఁగ
సవనవరాహదంష్ట్రాఖనిత్రప్రోత
కనకాక్షఘనకాల<ref>ట. కండ</ref>ఖండ మనఁగఁ
గకుబంతకరివరస్కంధసింధుద్వీప
సాంసారికాసితహంసి యనఁగ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>భూరిభూభృచ్ఛిఖోద్యన్మయూరి యనఁగ
నృగుభగీరథభరతాదినృపభుజాగ్ర
ఘటితకాలాగరుస్థానకం బనంగఁ
దగువసుంధర గృపఁ బల్కు దైత్యభేది.</poem>|ref=172}}
'''టీక'''. శాంబరీ...మతల్లి = శాంబరీకచ్ఛపేశ్వర - కపటకూర్మముయొక్క కూర్మరూపుఁడగు విష్ణునియొక్క; కంఠ = మెడపై; సందీప్త = ప్రకాశించునట్టి; తాపింఛవల్లీమతల్లి = చీఁకటిమ్రానిరెమ్మ; పవన...సాలభంజిక — పవనపారణపతి = గాలియే ఆహారముగాఁ గల పాములకు రాజైన అనంతుఁడను; స్ఫాటికస్తంభ = స్ఫటికమయమగు స్తంభమునందలి; జంభద్విషణ్మణిసాలభంజిక = ఇంద్రనీలములతో చెక్కిన బొమ్మ; [ˈసాలభంజిక = పుత్తడిబొమ్మ' అని పూర్వటీక.] సవన...ఖండము — సవనవరాహ = యజ్ఞవరాహమూర్తియొక్క; దంష్ట్రాఖనిత్ర = కోరయను గొడ్డలిచేత; ప్రోత = గ్రుచ్చఁబడిన; కనకాక్షఘనకాలఖండము = హిరణ్యాక్షుని కారిజము; కకుబంత...హంసి — కకుబంతకరివర = దిక్కులచివఱ నుండు గొప్పగజములయొక్క - దిగ్గజములయొక్క; స్కంధ = స్కంధభాగములనెడి; సింధుద్వీప =<noinclude><references/></noinclude>
ceblur3hv1ttfcvs9qg05e3xggnx6v0
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/227
104
212670
559780
554893
2026-06-16T08:39:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559780
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఏఁటిదిబ్బలయందలి; సాంసారికాసితహంసి = కాఁపురముగా నున్న నల్లని యాఁడుహంస; భూరిభూభృత్సిఖోద్యన్మయూరి = గొప్పపర్వతములశిఖరములపైఁ దిరుగు నాఁడునెమలి; [ˈవిస్తారమయిన కొండలనెడి శిఖలు పుట్టుచున్న ఆఁడునెమలి' అని పూర్వటీక. ఇది అననుగుణము.] నృగు...స్థానకంబు = నృగుఁడు, భగీరథుఁడు, భరతుఁడు మొదలగు రాజులమూఁపులపయి నున్న నల్లని యగురు మొదలగువానిపూఁత; (ఇవి యన్నియు భూమికి విశేషణములు.) వసుంధరన్ = భూమిని గూర్చి; దైత్యభేది = విష్ణువు. '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=శా.|lines=<poem>ఓయంభోరుహపత్రనేత్ర! మది నీయుద్వేగమున్ మాను దై
తేయప్రాయనృపాన్వవాయముల మర్దింతున్ భవ<ref>చ. ద్భాగమున్</ref>ద్భారమున్
బాయంద్రోయుదుఁ జేయుదున్ సుఖులగా మద్భక్తియుక్తాత్ములన్
మాయామానుషమూర్తినై పొడమి నానావిక్రమక్రీడలన్.</poem>|ref=173}}
'''టీక'''. ఓ అంభోరుహపత్రనేత్ర! = తామరపూవురేకులవంటి కన్నులుకల ఓ భూదేవీ! మదిన్ = మనస్సులో; ఈయుద్వేగమున్ = ఈయలజడిని; దైతేయప్రాయనృపాన్వవాయములన్ = రాక్షససమానులగు రాజులవంశములను; మర్దింతున్ = సంహరింతును; భవద్భారమున్ = నీబరువును; ప్రాయంద్రోలుదున్ = పోఁగొట్టుదును; మాయామానుషమూర్తినై = మాయవలన మనుష్యుఁడనుగా; పొడమి = పుట్టి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>క్రూరాసిధారావిదారితద్విపకుంభ
కూటముక్తాశుక్తిగోస్తనములఁ
బటుగదాపాతనిర్భగ్నసైంధవశిర
స్స్రవదస్రకుంకుమ<ref>చ. స్థానకములు</ref>స్థానకముల
శరలూనరథకేతుసౌవర్ణకింకిణీ
కుసుమగుచ్ఛచ్ఛటాగుంభనముల
ముసలమర్దితపదాతిసహస్రభూషాన
వీనరజః<ref>చ. పటా</ref>పటీవేల్లనముల</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>విజయలక్ష్మికి నైపథ్యవిభవ మొసఁగి
చటులరోషకషాయితాశయవిరోధి
యూథమథనక్రియాహేతుయుద్ధకేళిఁ
దేలి నీ కిత్తు నానంద<ref>క. మోలతాంగి, చ. మే లతాంగి</ref>మే లతాంగి!</poem>|ref=174}}
'''టీక'''. క్రూరాసి...గోస్తనములన్ — క్రూరాసిధారా = వాడియైనకత్తియంచుచే; విదారిత = నఱకఁబడిన; ద్విప = ఏనుఁగులయొక్క; కుంభ = కుంభస్థలములయొక్క; కూట = శిఖరములనెడి; ముక్తాశుక్తి = ముత్యములచిప్పలచేనైన; గోస్తనములన్ = నలుబదిపేటల ముత్యాలహారములచేతను; పటు...స్థానకములన్ — పటుగదాపాత = బలిష్ఠమగు గదదెబ్బచే; నిర్భిన్న = పగులఁగొట్టఁబడిన; సైంధవశిరః = గుఱ్ఱముల తలలనుండి; స్రవత్ = కాఱుచున్న; అస్ర = రక్తమను; కుంకుమస్థానకములన్ = కుంకుమపుఁబూఁతలచేతను; శర...గుంభనములన్ — శరలూన = బాణములచేఁ కొట్టబడిన; రథకేతుసౌవర్ణకింకిణీ = రథముల జెండాలకుఁ గల బంగారు చిఱుగంటలనెడి; కుసుమగుచ్ఛచ్ఛటాగుంభనములతోన్ = పూలగుత్తులగుంపుల కూర్పులచేతను; ముసల...వేల్లనములన్ — ముసలమర్దిత = ముసల మను నాయుధములచే మర్దింపబడిన; పదాతిసహస్ర = వేలకొలఁది నున్న భటులకు; భూషా = నగయైన; నవీనరజః = క్రొంగ్రొత్తదుమ్ము అనెడి; పటావేల్లనములన్ = మేలిమునుఁగులచేతను; నైపథ్యవిభవము = అలంకారసంపదను; ఒసఁగి = ఇచ్చి; చటుల...కేళిన్ = చలించుచున్న రోషముచే శత్రువులగుంపుయొక్క సంహారమునకు కారణమైన యుద్ధవిహారమున; లతాంగి!; ఏన్ = నేను; నీకున్; ఆనందమిత్తున్ = సంతోషమును గలుగఁజేయుదును. [శత్రువులను సంహరించి నీ బరువు తగ్గించెదననుట.]<noinclude><references/></noinclude>
0tkmvnli59wazb3z4pct8v3y1ccbiac
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/228
104
212671
559797
554894
2026-06-16T10:56:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
559797
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>మత్కృతంబులు, మదీయరచితంబులు నగు నగణితాహవక్రీడనంబుల సక్రోధ
విరోధివధం <ref>చ. బాచ</ref>బొనరించి తదీయకంఠనాళకరాళరుధిరధారాసారంబుల నీకుం
దాపోపశమనం బాపాదించెదం బాప<ref>చ. కార</ref>కారినిరసనంబు నాకు నవశ్యకృత్యం బగుట
యెఱుంగవే! <ref>క. యుత్తరం, చ. యుత్తరంగం, ట. యంతరంగం</ref>యుత్తరంబగు భవద్భారంబు తొలంగించుటయ కాదు సముత్పా
దితత్రిభువనోపప్లవంబగు పుండరీకతపోదహనవిహారంబు వారించు తలంపు నున్న
యది యిన్నలువ యిప్పు డిట మున్న తన్నిమిత్తం బని పనివిన్నవాఁడ, యెన్నిక
దినంబుల నిన్నియు శుభోదర్కంబు లయ్యెడు నని పుడమిపడఁతియడ లుడిపి
సగౌరవంబుగా వీడుకొలిపి <ref>క. పరమ, చ. యప్పరమ</ref>యప్పరమపురుషుం డంతర్ధానంబు నొందె; శతా
నందుండును సానందంబుగ యథాస్థానంబునకు జనియె నిట్లు.</poem>|ref=175}}
'''టీక'''. మక్కృతంబులు = నాచేఁ జేయఁబడినవి; మదీయరచితంబులు నాచేఁ దొలుత కల్పింపఁబడినవి; ఆహవక్రీడనంబులన్ = యుద్ధపుటాటలందు; నక్రోధవిరోధివధంబు = కోపముతోఁ గూడిన శత్రువుల సంహారమును; ఒనరించి = చేసి; తదీయ...సారంబులన్ = వారిగొంతుక్రోవులందలి భయంకరమై ఎడతెగని రక్తధారలచే; తాపోపశమనంబున్ = నీ తాపము (వేఁడిమి) చల్లారుటను; ఆపాదించెదన్ = కలుగఁజేసెదను; పాపకారినిరసనంబు = దుష్టజనశిక్షణము; అవశ్యకర్తవ్యంబు = ప్రధానముగాఁ జేయఁదగినది; ఉత్తరంబగు = మిక్కిలి అధికమైన; భవద్భారంబు = నీబరువును; సముత్పాదితత్రిభువనోపప్లవంబగు = పుట్టింపఁబడిన ముల్లోకముల యుపద్రవము కల; పుండరీకతపోదహనవిహారంబు = పుండరీకమహర్షి తపస్సువలనఁ గల్గిన చిచ్చుయొక్క వ్యాప్తిని; వారించు = పోగొట్టు; ఇన్నలువ = నాలుగుమోములు గల యీ బ్రహ్మ; పనివిన్నవాఁడు = ఆజ్ఞానువర్తియై యున్నవాఁడు; ఎన్నికదినంబులన్ = లెక్క పెట్టఁదగిన రోజులలో - కొలఁదిదినములలోనే; శుభోదర్కంబులు = మేలు కలిగించునవి - సానుకూలములు; పుడమిపడఁతియడలు = భూదేవిదుఃఖమును; ఉడిపి = పోఁగొట్టి; వీడు కొలిపి = పంపి; అప్పరమపురుషుండు = ఆవిష్ణువు; శతానందుండును = బ్రహ్మయును.
{{Telugu poem|type=ఆ.|lines=<poem>పుండరీకుతపము భూదేవిభారంబు
ఫలము నందఁజేయఁ దొలఁగఁద్రోయఁ
గోరి మర్త్యుఁ డయ్యె శౌరి; పరార్థమై
పురుషవరులు వికృతి <ref>క. పొరయు</ref>బొరయు టొప్పు.</poem>|ref=176}}
'''టీక'''. శౌరి = విష్ణుపు; మర్త్యుఁడు = మనుష్యుఁడు; పరార్థమై = ఇతరులకొఱకు; పురుషవరులు = మహాత్ములు; వికృతిన్ = వికారమును - మార్పును; పొరయుట = పొందుట; ఒప్పున్ = తగును. '''అలం'''. శ్రమము, అర్థాంతరన్యాసము.
{{p|ac|fwb}}శ్రీకృష్ణావతారచరిత్రము</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>వసుమతీభారనిర్వాపణోద్యక్తుండు
వర్ధితయాదవాన్వయపయోధి
దేవకీవసుదేవశేవధి నందమం
దిర<ref>చ. సారసా</ref>రసాలావాసపరభృతంబు
పూతనాప్రాణసంఘాతవాతూలాహి
శకటాంగవిఘటనచటులబుద్ధి
సమదతృణావర్తసంవర్తసమవర్తి
పాతితార్జునపాదపద్వయుండు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వత్సహృత్సాయకం బభివ్యధితబకుఁడు
మర్దితాఘుండు కాళియమానభేది
నిష్టురానలపారణనైష్ఠికుండు
కృష్ణుఁ డాశ్రితలోకవర్ధిష్ణుఁ డలరు.</poem>|ref=177}}<noinclude><references/></noinclude>
jh1e2k0jhwksd1nvtt80n5tklziyrhg
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/2
104
212961
559743
555779
2026-06-15T18:39:41Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
559743
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2
సూచిక:కాలచక్రం బనుఫల గ్రంథము.pdf
106
213661
559704
557597
2026-06-15T14:44:08Z
Vjsuseela
1850
559704
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=కాలచక్రం బనుఫల గ్రంథము
|భాష=te
|సంపుటి=
|రచయిత=ఆలూరు ఏకామ్ర జ్యోతిష్కులు
|అనువాదకులు=
|ఎడిటర్=వాజపేయం వెంకటాద్రి శాస్త్రుల
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కృష్ణయ్య
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3to5="విసూ" 6="1" 21="14" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
mfnjkb70rmtalgfy2wdw0e3dewkel67
సూచిక:AadarshaPrabhuvu.pdf
106
213680
559673
558758
2026-06-15T13:38:31Z
Aryapranathi06
7306
559673
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఆదర్శప్రభువు : అను 7 అసస్హా,పంచవింశతి వర్ష రాజ్యచరిల్ర
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:కురుగంటి సీతారామయ్య|కురుగంటి సీతారామయ్య]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1941
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=6
|పురోగతి=X
|పుటలు=<pagelist 1to11="-" 6="శీర్షిక" 8="బొమ్మ" 10to11="విసూ" 12="1" 13="-" 14="3" 52="-" 53="బొమ్మ" 61="-" 64="-" 65="బొమ్మ" 74="-" 75="బొమ్మ" 80="బొమ్మ" 81="-" 88="బొమ్మ" 89to90="-" 91="బొమ్మ" 115="-" 117="-" 92="83" 27="-" />
|సంపుటాలు=81-82 పేజీలు లేవు
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
fsz7qpbqsi0o7ih1und9525m1tbj50w
రచయిత:కురుగంటి సీతారామయ్య
102
213685
559600
558343
2026-06-15T12:19:16Z
Rajasekhar1961
50
/* రచనలు */
559600
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = కురుగంటి
|అసలుపేరు = సీతారామయ్య
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు = 1890
|గిట్టిన_యేడు = 1959
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = కురుగంటి సీతారామయ్య
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
== రచనలు==
* [[ ఆదర్శప్రభువు ]] (1890)
* [[నవ్యాంధ్ర సాహితీవీధులు]]
* [[అలంకార తత్త్వ విచారము]] {{small scan link|Alankara Tattva Vicharamu.pdf}}
q1oiya83e5j6d9yu6re3i0mesmytenv
పుట:AadarshaPrabhuvu.pdf/12
104
213686
559626
557818
2026-06-15T12:40:44Z
Aryapranathi06
7306
559626
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|{{larger|అధ్యాయము}}}}
{{Center|{{Css image crop
|Image = AadarshaPrabhuvu.pdf
|Page = 12
|bSize = 503
|cWidth = 101
|cHeight = 100
|oTop = 322
|oLeft = 180
|Location = center
|Description =
}}
}}<noinclude><references/></noinclude>
004hhwbugg18ff46aceqm027f9xg6ki
559629
559626
2026-06-15T12:43:20Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559629
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|{{p|fs150}}అధ్యాయము</p>}}
{{Css image crop
|Image = AadarshaPrabhuvu.pdf
|Page = 12
|bSize = 503
|cWidth = 101
|cHeight = 120
|oTop = 410
|oLeft = 171
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
mibb3m715yzcb69dqomyab5z9amaj20
559630
559629
2026-06-15T12:44:07Z
Aryapranathi06
7306
559630
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude><br><br><br><br><br><br>{{Center|{{p|fs150}}అధ్యాయము</p>}}
{{Css image crop
|Image = AadarshaPrabhuvu.pdf
|Page = 12
|bSize = 503
|cWidth = 101
|cHeight = 120
|oTop = 410
|oLeft = 171
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
mg13527sof8bc0oksv026r1buy4mxxo
పుట:AadarshaPrabhuvu.pdf/15
104
213691
559632
557839
2026-06-15T12:48:04Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559632
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" />ఆ ద ర్శ ప్ర భు వు</noinclude>బ్రిటిషువారిచే అత్యంత గౌరవము బడసినవారనియు, నా చిన్నతనమును వినుచుండెడివాడను. వీరిని గూర్చి రెండుగాధల నిట చెప్పుట యప్రస్తుతము గాదు.
మొదటిది వారు సర్పమంత్రసమర్థులని చెప్పుదురు. త్రాచుపాము కరచినవారి శ్రోత్రముల శ్రీవారి నామము బడిన లేచి కూర్చుండువారని వినికిడి. రెండవది శ్రీవారు, బ్రాహ్మణుడును, వేదార్థ కల్పతరువు నగు, బ్ర॥ కీ॥ శే॥ బులుసు పాపయ్య శాస్త్రిగారికి గౌరవమిడి, సభలో వారి యుపన్యాసములు విని వారికి 1116 రూపాయిలు దుశ్శాలువలు నిచ్చి బహూకరించిరట. ఈ రెండు గాధలును వారి యందలి మహత్తరగుణములకు నిదర్శనములు. మొదటిది యార్తత్రాణ పరాయణత్వము. రెండవది జాతి మత సామరస్యము. ఈ రెండు గుణములు నాయన యద్వితీయుడు.
వారు తమ కుమారులగు మ॥ ఘ॥ వ॥ ప్రస్తుత ప్రభువువారికి రాజమర్యాదల కనుగుణమగు విద్య
గరపజేసిరి. గొప్ప ప్రాచ్య పండితులు రావించి శ్రీవారికి అరబ్బీ, ఫారసీ, ఉర్దూ భాషల పాండిత్య మల<noinclude><references/></noinclude>
th3pu1mu08rewr9b9rju7awlqtfltjx
అలంకార తత్త్వ విచారము
0
213805
559592
559531
2026-06-15T12:04:10Z
Aryapranathi06
7306
559592
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[అలంకార తత్త్వ విచారము]]
| రచయిత = కురుగంటి సీతారామయ్య
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరము = 1915
}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=3 to=3 />
{{page break|label=}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=5 to=11 />
{{page break|label=}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=13 to=13 />
{{page break|label=}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=15 to=15 />
[[వర్గం:తెలుగు భాష]]
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
[[వర్గం:1915 పుస్తకాలు]]
[[వర్గం:కురుగంటి సీతారామయ్య రచనలు]]
nv9sj3aqo1w9lczftq3jbbngq137qhi
559593
559592
2026-06-15T12:05:10Z
Aryapranathi06
7306
559593
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[అలంకార తత్త్వ విచారము]]
| రచయిత = కురుగంటి సీతారామయ్య
| అనువాదం=
| విభాగము =సాహిత్య విమర్శ
| ముందరి =
| తదుపరి =
| వివరములు = మొదటి ముద్రణ, 1915
|సంవత్సరము = 1915
}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=3 to=3 />
{{page break|label=}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=5 to=11 />
{{page break|label=}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=13 to=13 />
{{page break|label=}}
<pages index="Alankara Tattva Vicharamu.pdf" from=15 to=15 />
[[వర్గం:తెలుగు భాష]]
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
[[వర్గం:1915 పుస్తకాలు]]
[[వర్గం:కురుగంటి సీతారామయ్య రచనలు]]
gn9knzngldnmrpb1n7v0bf6xt7ux3lr
పుట:Alankara Tattva Vicharamu.pdf/19
104
213822
559619
559501
2026-06-15T12:32:45Z
Vjsuseela
1850
/* సమస్యాత్మకం */
559619
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Vjsuseela" /></noinclude>{{Center|{{p|fs150}}కా వ్య ము.</p>}}
ప్రధమమున కావ్యమన నెట్టిదో దానిఁ గూర్చి మన
లాక్షణికు" యభిప్రాయము లెవ్వియో తెలిసి
కొనవలసియున్నది. కొన్నిఁటిఁ జూతము. దం
చార్యుఁడు. క్యాచార్యుఁడు మన మొదటి లాక్షణికుఁడు.
గాన నాయననే ముదట తీరుకొందము ఆయనికాలము నాఁటి
కంకారశాస్త్రము పైన బావస్థ నుండేరు. ఆయన :--
{{Center |"ఇష్టార్థ వ్యసచ్ఛిన్నా పదాన”}}
యని కావ్యాక్షణము నానతిచ్చి యున్నాఁడు. రమణీ
మార్గమును సలియఁ జేయు పదము వరుసకు కావ్యమని యా
యని నామకరణ మున ర్చెను. దీనివని కాన్యిమన నొకగ్రంధి
ముకాదని సష్టమగుచున్నది. శబ్ద జాతిమనుటచే నొక వాక్య
మని దిటియర్థము. తరువాత నట్టి వాక్యసిముదాయమని
వీణయా చెప్పవచ్చును. ఈ లక్షణమును చూసిన తోడనే
యిది యలంకారశాస్త్రము సిరిగిబ్రబలిన కాలము నాఁటిది
కాదని తెలియుచున్నది. కాన్యము రమణీయార్థమును ప్రతి
పాదించినఁ జాలును.<noinclude><references/></noinclude>
kp83jkvxmaj2afpq4qyamiudkkizwo1
పుట:శశిరేఖాపరిణయము.pdf/3
104
213886
559773
558645
2026-06-16T04:17:37Z
Vandanapu Saidhiraj
7301
559773
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}}
{{p|ac|fs150}}శశిరేఖాపరిణయము</p>
{{p|ac|fwb}}పీఠిక</p>
{{Css image crop
|Image = శశిరేఖాపరిణయము.pdf
|Page = 3
|bSize = 450
|cWidth = 57
|cHeight = 31
|oTop = 107
|oLeft = 203
|Location = center
|Description =
}}
{{Telugu poem|type={{Css image crop
|Image = శశిరేఖాపరిణయము.pdf
|Page = 3
|bSize = 450
|cWidth = 55
|cHeight = 166
|oTop = 75
|oLeft = 65
|Location = left
|Description =
}}|lines=<poem>
కన్యామణిగబ్బిగుబ్బయుగముం జిత్తంబునం జేర్చి తా
వింక న్గన్గొనువేడ్కఁ జూడ్కు లిడఁగా వ్రీడానుభావంబుతో
జోకన్ బయ్యెదకొంగుఁ జేర్చుసతితో సొంపొప్పఁగా నవ్వుచు
న్నేకాంతంబున ముద్దులాడుహరి మ మ్మెల్లప్పుడున్ బ్రోవుతన్.</poem>|ref=1}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పచ్చనికోకయున్ మెఱుఁగుబర్హిసుపింఛము నింద్రకార్ముకం
బచ్చుగ నీదు మేను జలదాభ్ర మటంచని యెంచి యంచ నీ
పచ్చినచంచలించె నని వల్లభుతో సరసోక్తులాడు నా
లచ్చి యొసంగు మా కెపుడు లక్షకు మీఱిన ద్రవ్యమూలముల్.</poem>|ref=2}}
{{Telugu poem|type=మ.|lines=<poem>సరసాలాపము లాడుగౌరిఁ గని హాసాస్యంబుతో వేడుకన్
గిరికోదండుఁడు గౌఁగిలించుకొనఁగా గ్రీవంబుపై హారముల్
కరమాశ్చర్యముగాఁగఁ జూచి చెలి యాకంపాయమానంబుతోఁ
గరము ల్మోడ్చిన నవ్వుదేవుఁ డొసఁగున్ గామ్యార్థము ల్ప్రీతితోన్.</poem>|ref=3}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అత్తఱి నున్న జహ్నుసుత నౌదలఁ జేర్చి నటించుచున్నయా
చిత్తజవైరిపై నలుకఁజేయుచుఁ జారుసరోజలోచనన్
నెత్తిన చేర్చుకొంటి విది నీతియె కాదని పల్కు గౌరి య
త్యుత్తమభోగసంపదల నొప్పుగ మాకు నొసంగుఁ గావుతన్.</poem>|ref=4}}
{{Telugu poem|type=చ.|lines=<poem>వెలయఁగ భారతీయువతి వీణెఁ గుచంబులఁ జేర్చి హాయిగా
సలలితరాగవైఖరులఁ జక్కఁగ గానముసేయ వేగమే
వలపునఁ గౌఁగిటన్ దిగిచి వాణిమనం బలరారఁ జేయు న
జ్జలభవుండు మా కెపుడు సత్కృపతోడఁ జిరాయు వీవుతన్.</poem>|ref=5}}<noinclude><references/></noinclude>
j023jafn7mmpagpxeekpcmdta5v9107
పుట:Alankara Tattva Vicharamu.pdf/20
104
213891
559620
558690
2026-06-15T12:33:39Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559620
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>
{{Center|కావ్య ము}}
ఆయని మరల :<br>
{{Center|"గద్యంపద్యంచ మిశ్రంచతత్తిథైనవ్యవస్థితం."}}
అని దాని మూడువిధము ఁ భాగించియున్నాఁడు. ఈ
లక్షణమును చూచినంతనే దండ్యాచార్యుఁడు కవికెంతి స్వ
తంత్ర్యమిచ్చెనో తెలియఁగలదు ఈయన తర్వాతి లాక్షణికులు
నియమములనేర్పరచిరి. స్వాతంత్య్రమును తగ్గించిది. మొదట
నియమముల నేరచినవారు వామనుడు వాభటుఁడు.
వామునుఁడు కాన్యము నీవిధముగ వివరించి
యున్నాఁడు.
{{Center|"కాశ్యశభ్దయం గుణాలంకార
స్వస్కృతియో శ్శ్వర్థయోర్వర్తితే "}}
దాని క్రిందమరల: ---
{{Center|"రీతిరాత్మా కాన్యస్య "}}
యని పై నియమములు చాలనట్టుల మరియొక దానిఁ
జేర్చెను. కావున దండి కాలమునుండి వాచునుని కాలమునాఁ
టీ కలంకారశాస్త్ర మెంతవృద్ధినొంగినదో చూడఁగలము.
ఈన్నద్ధి మంచిదియో చెకదియోయని యభిప్రాయభేదము
లుండవచ్చును. కవికి కష్టమేక్కువయైనది. ఫలము తక్కువ
యైనది. కవిత్వ మెన్నఁడైన నియమములఁ జాటించి వెలు
ఏడునా ?<noinclude><references/></noinclude>
0it86g2g6l9fh6xt66skca950ncvsp7
పుట:Alankara Tattva Vicharamu.pdf/21
104
213913
559621
559502
2026-06-15T12:34:04Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559621
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{right|3}}{{Center|కవిత్వము}}
ఇట్లు చెప్పుడునని చెప్పు పద్యము కేవలము పద్యమా
త్రసారస్యము గలుగ చేయుండును.
మైన కవిత్వమనిపించికొనదు - ప్రయత్ని ముగ
మనసున నిండియున్న భావము బ గుటికి వచ్చు
నె నీ నియమములకు చోటుండదు. కవిత్వము చెప్పి నట్టు
లిష్టమువచ్చినప్పుడే రాళ్లురు దేశకాల పాత్రము" ది వెలు
నడుటకు తెగియు శవలయు. మనం బొకసమయమున నొక
భావముచేసింది. ఎకొండు భాగమునకు చోటుండఁ గూడదు ·
అభావములు సంద ర్ళాను.
'రముగ మా ముండలయు. ఏ
భావముచే మనంబు నిండి. యున్నపు డాభావాను గుణముగఁ
గవిత్వము ప్రసరించును. వీని సన్నింటి విచారించి చూచిన
కవిశ్వము హృదయపూర్వమయి: నిజమైనదయిన నియమము
లఁభాసుపఁ బ్రయత్నింపును, ఒక వేకప్రయత్ని ముగఁగొన్ని
నియమములుండేవ నుండుఁ గాక! కావున విశ్వమును విమర్శిం
చుటలో సాధ్యమైనం తినడకు కవియెడల సానుభూతి కలిగియుం
ఉమయును ఈనియమమును పాటించెనా? ఆ నియమమును
మొదల ఎదలివేసిను అని యీ రీతిని విమర్శనాఖ్యముఁ
జేబూని యిచ్చవచ్చినట్టు లుపయోగించిన మన నియహములు
ననుసరించి వ్రాయఁగల కవి ప్రపంచంబునఁ గానివాఁడు.
విశేషవిమర్శనానియమములు విమర్శన యొనర్చు పుస్త
కము ననుసరించియే యుండును గాని బయటనుండవు కొన్ని<noinclude><references/></noinclude>
sne28plisnulraszx01l9jui1qi6sri
పుట:Alankara Tattva Vicharamu.pdf/22
104
213914
559622
559503
2026-06-15T12:34:21Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559622
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{left|4}}{{Center|కావ్యము.}}
సామాన్య నియమములుబయటనుండును గాని యనియాపుస్త
కఋను విమర్శించుటలోముఖ్యములు గావు. విమర్శించుటలో
కవి పుట్టిన కాఫీ మెట్టిదో, వాని త్రోవసరియైనదో లేనిదో, వాఁ
`డెట్టికష్టములు పడవలసిన చ్చెనో, తత్పూర్వవాఙ్మయమేట్లుం
డెనో, ఇట్టి విషయముఁ దీసికొని చర్చించి సిద్ధాంతి మొనర్ప
నలయును కాని, ఎవనినో నొకని నాదర్శముగ నుంచికొని
యందఱు వానితోఁబోల్చి విమర్శించుట యుక్తము కాదు.
కవితాశక్తి నిరంకుశముగాని విమర్శనమునకంత నిరంకుశత్వ
ముండుటకు వీలు లేదు. నేనుక కవియెడల అనుభూతి కలిగి
యుండవలయునని చెపితి. కవిసజీవుఁడైన సానుభూతి యుండక
పోయినను ప్రమాద మంతగ లేదు గాని పూర్వుఁడైన సాను
భూతి లేకపోయిన నావిమర్శకుఁడుగ్యఁడు.
<br>
పై చెప్పిన వామన వాక్యమువలన కవిశ్వమునకుఁ
గుణములు,కారములు, రీతులు, కూడ
నావశ్యకముని యాయన యభిప్రాయము
శ్రకుఁ బాణాం మల్లినాధుఁడు మాఘకావ్యము రెండవ సర్గతరము.<br>
86 శ్లోక వ్యాఖ్యలో:-
{{Center|" అదోషా సగుళ" "లంకా రా శబ్దా కాన్యం
"}}
అని వామన వాక్యముగ నుదహరించి యున్నాఁడు.
ఈ వాక్యమే రసగంగాధరంబునఁ గూడఁ జర్చింపఁ బడియున్నది.<noinclude><references/></noinclude>
glxsoh3ripv36bube1y5odrvejk2c65
సూచిక:AgastyaVidyamu.pdf
106
214053
559609
559214
2026-06-15T12:25:50Z
Aryapragathi07
7305
559609
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[అగస్త్య వైద్యము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:దీవి గోపాలాచార్యులు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist 2to4="శీర్షిక" 5="బొమ్మ" 6to7="ప్రకట" 8="1" 45="బొమ్మ" 46="ప్రకట" 47="6" 47to56="roman" 49="విసూ" 57to118="highroman" 57="6" 6="తొలిపే" 7="అతప" 1="-" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
0hjlfx5pz0ptms6o7s06yqd0nu38rr2
559613
559609
2026-06-15T12:28:51Z
Aryapragathi07
7305
559613
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[అగస్త్య వైద్యము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:దీవి గోపాలాచార్యులు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist 2to4="శీర్షిక" 5="బొమ్మ" 6to7="ప్రకట" 8="1" 45="బొమ్మ" 46="ప్రకట" 47="6" 47to56="roman" 49="విసూ" 57to118="highroman" 57="6" 6="తొలిపే" 7="అతప" 1="-" 4="-" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
da7sab73n8yu57qffnzm5lzss6kq9b9
పుట:AgastyaVidyamu.pdf/2
104
214092
559677
559144
2026-06-15T13:42:21Z
Aryapragathi07
7305
559677
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల -ఓ.
<br><br>
{{Center|శ్రీమధన్వంతరయేననుః.
12/27}}
{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>అగస్త్య వైద్యము.</poem>}}
{{Center|ఇది}}
{{Center|చెన్న పురి ఆయుర్వేదకాలేజ్ ప్రిన్సిపాలును,}}
{{Center|చెన్న పురి ధర్మ ఆయు ర్వేద వైద్యశాలా ప్రధాన చికిత్సకులుమ,}}
{{Center|శ్రీమత్పంచమఃరాజ్ఞి సాగ్వభౌమునిచే ప్రదత్తమగు}}
{{Center|" వైద్యరత్న" బిరుదావళీ విరాజమానులు}}
{{Center|నగు}}
{{Center|ఆయు ర్వేదమార్తాండ, భిషజ్ఞ్మణి}}
{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>పండిత డి. గోపాలాచార్యులు,ఎ. వి. ఎస్ .,</poem>|}}
{{Center|గారిచే విరచితము.}}
<br><br>
{{right|వెల ఆణాలు}}<noinclude><references/></noinclude>
ojnb25wtcmzgggbwa0sbxixlv2pcirk
559678
559677
2026-06-15T13:43:14Z
Aryapragathi07
7305
559678
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల -ఓ.
<br><br>
{{Center|శ్రీమధన్వంతరయేననుః.
12/27}}
{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>అగస్త్య వైద్యము.</poem>}}
{{Center|ఇది}}
{{Center|చెన్న పురి ఆయుర్వేదకాలేజ్ ప్రిన్సిపాలును,}}
{{Center|చెన్న పురి ధర్మ ఆయుర్వేద వైద్యశాలా ప్రధాన చికిత్సకులుమ,}}
{{Center|శ్రీమత్పంచమఃరాజ్ఞి సాగ్వభౌమునిచే ప్రదత్తమగు}}
{{Center|" వైద్యరత్న" బిరుదావళీ విరాజమానులు}}
{{Center|నగు}}
{{Center|ఆయు ర్వేదమార్తాండ, భిషజ్ఞ్మణి}}
{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>పండిత డి. గోపాలాచార్యులు,ఎ. వి. ఎస్ .,</poem>|}}
{{Center|గారిచే విరచితము.}}
<br><br>
{{right|వెల ఆణాలు}}<noinclude><references/></noinclude>
dfctugaiorfgea59juux1o4suiyz4gf
559681
559678
2026-06-15T13:49:38Z
Aryapragathi07
7305
559681
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>ఆయుర్వేదాశ్రమ గ్రంథమాల -ఓ.
<br><br>
{{Center|శ్రీమధన్వంతరయేననుః.
12/27}}
{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>అగస్త్య వైద్యము.</poem>}}
{{Center|ఇది}}
{{Center|చెన్న పురి ఆయుర్వేదకాలేజ్ ప్రిన్సిపాలును,}}
{{Center|చెన్న పురి ధర్మ ఆయుర్వేద వైద్యశాలా ప్రధాన చికిత్సకులును,}}
{{Center|శ్రీమత్పంచమజార్జి సార్వభౌమునిచే ప్రదత్తమగు}}
{{Center|" వైద్యరత్న" బిరుదావళీ విరాజమానులు}}
{{Center|నగు}}
{{Center|ఆయుర్వేదమార్తాండ, భిషఙ్మణి}}
{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>పండిత డి. గోపాలాచార్యులు,ఎ. వి. ఎస్ .,</poem>|}}
{{Center|గారిచే విరచితము.}}
<br><br>
{{left|రిజిష్టర్లు- కాపిరైటు}}
{{right|వెల ఆణాలు}}<noinclude><references/></noinclude>
rymi6vhmni8qvdyam58w92rfhzuou8c
పుట:AgastyaVidyamu.pdf/3
104
214093
559685
559146
2026-06-15T13:52:21Z
Aryapragathi07
7305
559685
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{Center|వైద్యరత్న, పండిత డి. గోపాలాచార్యులు వారి స్వీయ}}
{{Center|చెన్నపురి :}}
{{Center|ఆయుర్వేద ముద్రాయంత్రమున ముద్రింపంబడి}}
{{Center|౧౨, తంబు శెట్టివీధియందుఁగల}}
{{Center|ఆయుర్వేదకలాశాలాభవనమున బ్రకటింపంబడియె.}}<noinclude><references/></noinclude>
4gsrw338r31aqca6z3rzz8czt0qk13i
పుట:AgastyaVidyamu.pdf/6
104
214098
559674
559158
2026-06-15T13:40:15Z
Aryapragathi07
7305
559674
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>విజ్ఞాపనము.</poem>}}
{{Center|దక్షిణాపధమందుగల ఆగస్త్యసంప్రదాయము ననుసరించు చికిత్సకులు}}
{{Center|చేయు చికిత్సావిధానములు ఔషధనిర్మాణములు మొదలగు వానిని}}
{{Center|నేబలుమారు చూచుచుండుటచే నయ్యది నాగార్జువాది రసతంత్ర ప్రక్రియలకంటె }}
{{Center|భిన్నములగునట్లు దెలియవచ్చె. ఆయ్యని రసతంత్ర ప్రక్రియవిధానములకన్న}}
{{Center|నెట్లు భిన్నములో యాభాగమంతయు తత్సంప్రదాయజ్ఞలవలన}}
{{Center|దెలిసికొన చిరకాలమునకు పూర్వమే ప్రయత్నించితిని. ఆసంప్రదాయము ననుసరించియుండు}}
{{Center|గ్రంధముల విమశ౯నమువలన ఆగస్థ్యసంప్రదాయము}}
{{Center|నాగార్జునాది రససంప్రదాయముకంటె భిన్నమని నేజేసిన కృషివలన దెలిసికొంటి. }}
{{Center|నే దెలిసికొనిన ఈ భాగములను అందరకు దెలిపిన బాగుండునని}}
{{Center|యోచించుతః భగవత్ప్రేరణచే 1918 సంవత్సరము ఏప్రియల్ 18-19 తేదులయందు}}
{{Center|జొంబాయి మహాపత్తనమున జరిగిన అఖిల భారత వర్షియ ఆయుర్వేద}}
{{Center|మహాసభా ద్వితీయ వార్షికోత్సవమున నే నాసభ కగ్రాసనాధిపతిగను౦డుట సంభవించే. }}
{{Center|అట్టి మహాసమయమున నిట్టి నవీన విషయముల చర్చించుట}}
{{Center|ముఖ్యమని తలచి నాయుపన్యాసమున కొంతవరకు
నీయగస్త్యవైద్య}}
{{Center|సంప్రదాయమును గురించి ముచ్చటించితి, ఆసభ కేతెంచినవారలు ప్రాయికముగ }}
{{Center|నౌత్తరీయులగుటచే నిట్టి సంప్రదాయమొకటి కలదాయని విస్మయమొందిన}}
{{Center|వారలు కొందరును ఇది కేవలమాయుర్వేదమున జేరిన సంప్రదాయము}}
{{Center|కాదనువారు కొందరునై బయటకువచ్చిరి.వారలకందుకును నా దెలిపిన}}
{{Center|కోలందిని అగస్త్యసంప్రదాయమందలి ముఖ్య భాగములు నాగార్జునాది}}
{{Center|రసతంత్రముకన్న ఉత్తమములని బోధపఱచితిని. నాటినుండియు అనేకులా}}<noinclude><references/></noinclude>
cueb2vnkn3nuvrvtk2uu0feiuv9wn4s
పుట:ఆంధ్రులెవరు?.pdf/16
104
214192
559605
559486
2026-06-15T12:21:47Z
Vihuu18
7318
/* అచ్చుదిద్దారు */
559605
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude>
{{p|fs150}}<center><big>'''“ఆంధ్ర” శబ్ద కారణము'''</big></center></p>
మూడుకోట్ల పదిలక్షల ముప్పదియొక్క వేయి ముప్పదినాలుగు సంవత్సరముల క్రిందట పరిపాలించిన యయాతి రాజు కొడుకయిన “అనువు” వంశములో యయాతినుండి ప్రముఖ వంశములను లెఖ్ఖవేయగా 15వ ప్రముఖ వంశములో జన్మించిన “బలి” యను రాజు కుమారులయిన 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుండ్ర 6 ఆంధ్ర అను వారలలో 6వ వాడైన “ఆంధ్ర” అను రాజువలన పరిపాలింపబడిన రాజ్యమునకు “ఆంధ్ర”దేశమనియు అందలిజనులకు “ఆంధ్రు”లనియు నామంబులు గలిగినట్లును అటులనే “ఆంధ్రుని” సోదరులయిన 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుండ్రులవలన పరిపాలింపబడిన దేశము లాయా, రాజనామంబుల పిలువబడినట్టును భాగవతమున నవమస్కంధములో స్పష్టముగా జెప్పబడియున్నది. (భాగ 9–685 చూడుడు)
చాతుర్వర్ణ్యములతో గూడి వైదికధర్మ ప్రవృత్తులయిన ఆర్యజాతి పరిపాలకుడయిన “ఆంధ్ర” నృపతినామంబున “ఆంధ్ర" జాతి యని పిలువబడినదిగాని శాపహతులై భ్రష్ఠులై నీచజాతీయులుగా మారిపోయిన “అంధ్ర” జాతి కాదని తెలియవలయును.
శ్రీమద్భాగవతే నవమస్కంధే 23 అధ్యాయే 5; 6 శ్లోకాః<br>
శ్లో॥ “అంగవంగ కళింగాద్యాః సుంహ్మ పుండ్రాంధ్ర సంజ్ఞితాః
జఙ్ఞిరే దీర్ఘతమసోబలేః క్షేత్రేమహేషితః (శ్లో 5)<br>
శ్లో॥ “చక్రుస్ప్వనామ్నావిషయాన్ షడిమాన్ ప్రాచ్యకాంశ్చతే 6<br>
తా॥ “బలియను మహారాజునకు దీర్ఘతముడను ఋషి యనుగ్రహమున 1 అంగ 2 వంగ 3 కళింగ 4 సుంహ్మ 5 పుండ్ర 6 ఆంధ్రయను పేర్లుగల ఆర్గురు కుమారులు గలిగిరి. వారు తూర్పు దేశమునకు రాజులై ఆరు దేశభాగములకు తమ నామములనే పేర్లుగానుంచి ఏలిరి.
(శ్రీ పోతనామాత్యుని శ్రీమదాంధ్రభాగవతం నవమస్కంధం 685 చూడుడు)<noinclude><references/></noinclude>
mznuvrjz840e0vu6vgcvdrjjy9tydka
పుట:AgastyaVidyamu.pdf/8
104
214197
559697
559541
2026-06-15T14:05:42Z
Aryapragathi07
7305
559697
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>అగస్త్య వైద్యము.
</poem>}}
{{Center|జగన్ని ర్మాతయగు నా పరమాత్మ సర్వజనారోగ్యంబు}}
{{Center|ఆయుర్వేదమునకై యొసంగిన హేతు (రోగములు జనించిన}}
{{Center|ప్రధానభాగములు. చూచుటకుఁ దగు కారణములు) లక్షణ ( రోగమూలం}}
{{Center|జక్కఁగఁ దెలుపు చిహ్నములు)}}
{{Center|ఔషధ (రోగసామాన్యమును నివర్తి చేయు వివిధచికిత్సోపాయములు)}}
{{Center|స్కంధత్రయాత్మకమై విరాజిల్లుచు ననాది యని}}
{{Center|ఖ్యాతిఁచెందిన యాయుర్వేదము వివిధ చికిత్సల సౌకర్యమునకై}}
{{Center|శల్యము శాలాక్యము మున్నగు నెనిమిది యంగములతో}}
{{Center|కూడియున్నను, “కాయచికిత్స “శల్యచికిత్స" యను రెండు
}}
{{Center|ప్రధాన భాగములతో నిమిడియున్నది.}}
{{Center|అందు ఆత్రేయ అగ్నివేశ భేడాది మహర్షి ప్రణీతము}}
{{Center|ఆత్రేయ లగు కాయచికిత్సా బోధక తంత్రమునకు}}
{{Center|సంప్రదాయము. నాత్రేయ సంప్రదాయమని పేరు.}}
{{Center|ధన్వంతరి సుశ్రుత ఔపధేనవ ఔరభ్ర గోపురరక్షిత}}
{{Center|ధన్వంతరి ప్రభృతి మహర్షులచే విరచిత మగు}}
{{Center| శల్యసంప్రదాయము. తంత్రము ధన్వంతరి సంప్రదాయమని తెలి}}
{{Center|సెడీని..}}<noinclude><references/></noinclude>
7jigozf584yh9qmn4epf2mahz2gv7c0
559698
559697
2026-06-15T14:05:59Z
Aryapragathi07
7305
559698
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>అగస్త్య వైద్యము.
</poem>}}
{{Center|జగన్ని ర్మాతయగు నా పరమాత్మ సర్వజనారోగ్యంబు}}
{{Center|ఆయుర్వేదమునకై యొసంగిన హేతు (రోగములు జనించిన}}
{{Center|ప్రధానభాగములు. చూచుటకుఁ దగు కారణములు) లక్షణ ( రోగమూలం}}
{{Center|జక్కఁగఁ దెలుపు చిహ్నములు)}}
{{Center|ఔషధ (రోగసామాన్యమును నివర్తి చేయు వివిధచికిత్సోపాయములు)}}
{{Center|స్కంధత్రయాత్మకమై విరాజిల్లుచు ననాది యని}}
{{Center|ఖ్యాతిఁచెందిన యాయుర్వేదము వివిధ చికిత్సల సౌకర్యమునకై}}
{{Center|శల్యము శాలాక్యము మున్నగు నెనిమిది యంగములతో}}
{{Center|కూడియున్నను, “కాయచికిత్స “శల్యచికిత్స" యను రెండు
}}
{{Center|ప్రధాన భాగములతో నిమిడియున్నది.}}
{{Center|అందు ఆత్రేయ అగ్నివేశ భేడాది మహర్షి ప్రణీతము}}
{{Center|ఆత్రేయ లగు కాయచికిత్సా బోధక తంత్రమునకు}}
{{Center|సంప్రదాయము. నాత్రేయ సంప్రదాయమని పేరు.}}
{{Center|ధన్వంతరి సుశ్రుత ఔపధేనవ ఔరభ్ర గోపురరక్షిత}}
{{Center|ధన్వంతరి ప్రభృతి మహర్షులచే విరచిత మగు}}
{{Center|శల్యసంప్రదాయము. తంత్రము ధన్వంతరి సంప్రదాయమని తెలి}}
{{Center|సెడీని..}}<noinclude><references/></noinclude>
mhmfs8fjcnaqfpmj2vlw8lron1yf70u
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు
0
214206
559590
559579
2026-06-15T12:00:54Z
Vjsuseela
1850
added [[Category:జీవితచరిత్రలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
559590
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]]
| రచయిత = పాలపర్తి నరసింహము
| అనువాదం=
| విభాగము = పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=20 to=27 fromsection="20B" />
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:జీవితచరిత్రలు]]
3awtz1a5pz0yv0my0gpzaol84pns5hk
559737
559590
2026-06-15T18:23:18Z
Vjsuseela
1850
559737
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3]]
| రచయిత = పాలపర్తి నరసింహం
| అనువాదం=
| విభాగము = పిళ్లారిశెట్టి సీతారామయ్యగారు
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1918
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf" from=20 to=27 fromsection="20B" />
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
[[వర్గం:జీవితచరిత్రలు]]
luvaensp0toexae86dutyvz2cbg5868
పుట:శశిరేఖాపరిణయము.pdf/34
104
214209
559750
559569
2026-06-15T21:00:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559750
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>గలిమి కాశించి యనృతంబుఁ బలికి నీవుఁ, గౌరవులు నేకమై మమ్ముఁ గాన కనిపి
రామరాజ్యంబుగా మీరె రాజ్య మేలుఁ డనుచు నేడ్చుచు నరిగె నయ్యంబుజాక్షి.</poem>|ref=64}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆసమయంబున సాత్యకి, రోషముతో బలునిఁ జూచి రొప్పుచుఁ బలికెన్
వాసవిసుతునకుఁ బుత్త్రిని, వాసిగ నీ వియ్యకున్న వారికిఁ గొదవే.</poem>|ref=65}}
{{Telugu poem|type=క.|lines=<poem>ధర్మజభీమార్జునులను, దుర్మదమున నిందచేసి దుర్యోధను దు
ష్కర్ముని వినుతించుట నీ, కర్మమొ బలరామ లేక గర్వమొ తలఁవన్.</poem>|ref=66}}
{{Telugu poem|type=క.|lines=<poem>సమయాబ్దంబులు గడచిన, విమలాత్మకు లైన పాండవేయులు వరుసన్
సమరములోఁ గౌరవులను, సమవర్తిపురంబుఁ జేర్చి సంపద గొనుటన్.</poem>|ref=67}}
{{Telugu poem|type=క.|lines=<poem>తప్పదు సంకర్షణ నీ, కొప్పదు దూష్యంబు సేయ నుర్వీశుల వా
రెప్పుడు ధర్మపథంబును, దప్పక పాలింతు రఖిలధరణీతలమున్.</poem>|ref=68}}
{{Telugu poem|type=వ.|lines=<poem>కావున సత్యాత్ముల దూషింపుచు దుష్టాత్ముల భూషించు నీజిహ్వ పెక్కుపరియ
లై పోకుండుట విచిత్రం బని పలుకుశినివరునివాక్యంబులు వినక నతనికిఁ బ్రత్యు
త్తరం బీయక దుర్యోధనుం డనిపిన సురులతో నిట్లనియె.</poem>|ref=69}}
{{Telugu poem|type=చ.|lines=<poem>వినఁ జవిగానిపల్కు లవి వీనుల విందురె విప్రులార యీ
శినివరుఁ డార్యసన్నుతుఁడు శ్రీధరుఁ డిర్వురు సారెసారెకున్
వనముల నున్న పాండవుల వర్ణన చేయుచు కౌరవేంద్రుఁ దా
మనవరతంబుఁ దిట్టుటకు నాదియు నంత్యము లేదు చూడఁగాన్.</poem>|ref=70}}
{{Telugu poem|type=మ.|lines=<poem>అలదుర్యోధనుసాటిరాజు లిలలో నందంద వీక్షించినన్
గలరా రాజమృగేంద్రునందనునకుం గంజాక్షి నర్పించెదన్
దలబ్రాల్వేళకు బంధువర్గములతోఁ దామందఱున్ మిత్రులున్
బలు వేగంబునఁ దోడి తెండనుచు నాబ్రాహ్మణ్యులం బంపినన్.</poem>|ref=71}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తదనంతరంబ సుభద్ర హలాయుధుండు పలికినపల్కులు ములుకులై మనంబు
వ్రణంబుఁ గావింపం దద్వేదనచే శయ్యాతలంబుఁ జేరి చింతించుచున్నసమయంబున
సూర్యాస్తమయం బగుటయు మందిరంబునకుం జని చింతాకులచిత్తయై యున్న
జననిన్ సంకర్షణుండు పల్కినచందంబును లక్ష్మణునకు శశిరేఖ నొసంగినవిధంబు
నెఱుంగక మాతం జూచి యిట్లనియె.</poem>|ref=72}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఘనమగుచింత వహించితి, వనముల మాతండ్రిగారివార్తలు చెవికిన్
వినఁబడిన దాఁచవల దో, జననీ వినుపింపు మమ్మ చయ్యన నాకున్.</poem>|ref=73}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన సౌభద్రునకు సుభద్ర యిట్లనియె.</poem>|ref=74}}
{{Telugu poem|type=క.|lines=<poem>అబ్బీ నే నెఱుఁగను నీ యబ్బలజో లేల వినుము హలసాధనుఁడున్
డబ్బుల కాస వహింపుచుఁ, దబ్బిబ్బులు సేసెఁ బలుకు దత్తము నేఁడున్.</poem>|ref=75}}<noinclude><references/></noinclude>
39ojec114ezj3auui033l9gv7ccovch
పుట:శశిరేఖాపరిణయము.pdf/35
104
214211
559751
559573
2026-06-15T21:06:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559751
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అది యె ట్లనిన.</poem>|ref=76}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>రారాజుసుతునకై రౌహిణేయాత్మజ నడుగుటకై యిద్ద ఱగ్రజన్ము
లరుదెంచి వేఁడఁగా నందుకు బలరాముఁ డానందభరితుఁడై మీననేత్ర
నిచ్చెద నని మాట యిచ్చినఁ దగ దంచు నచ్యుతుం డాడిన నతనిపలుకు
వినఁ డాయె నంతలో వేఁడుకతో నేను ప్రార్థన సేయఁగా బలుఁడు నన్నుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గూటిపేదవు విను నీకుఁ గోడ లేల, నడవిజోగుల కరయంగఁ బడఁతు లేల
పొసఁగ దిటువంటిసుద్దులు పొమ్మటంచుఁ, బలికి వెండియు నొకకొన్ని పలికె వినుము.</poem>|ref=77}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అవనిఁ బదివేలపాండపు లైనఁగాని, ఘనుఁడు దుర్యోధనునిసాటి గా రటంచుఁ
బలికి కురురాజు పంపిన బ్రాహ్మణులను, నెట్టకేలకు వీక్షించి యిట్టులనియె.</poem>|ref=78}}
{{Telugu poem|type=వ.|lines=<poem>నేఁటి కెనిమిదివాసరంబులకు లగ్నంబు నిశ్చయం బని యుగ్గడించి క్ష్మాసురులం బంపె నని చెప్పి మఱియును.</poem>|ref=79}}
{{Telugu poem|type=క.|lines=<poem>వెయ్యేటికిఁ దనయుఁడ నీ, యయ్యలు వనవాసు లగుట నది మది నిడకన్
వియ్యము గలదని వచ్చిన, నెయ్యము చెడ నాడె నన్ను నీలాంబరుఁడున్.</poem>|ref=80}}
{{Telugu poem|type=మ.|lines=<poem>గ్రహచారంబును జాలనప్పు డెవరుం గార్పణ్యులై యుందు రీ
మహనీయుం డగురౌహిణేయుఁ డిటుల న్మర్యాదహీనంబుగా
బహువాక్యంబుల నన్నుఁ బల్కెఁ దనయా భాగ్యంబు లేకున్నచో
విహితుల్ శత్రువు లంచుఁ బల్కు పలుకు ల్విన్నావొ లేవో గదా.</poem>|ref=81}}
{{Telugu poem|type=క.|lines=<poem>కలిమి గలవారిపక్షమె, పలుకుదు రెవ రైనఁ గాని భావింపంగా
నిలలోఁ బేదలపక్షము, కలలోనం బలుక రనుచు ఘను లన విందున్.</poem>|ref=82}}
{{Telugu poem|type=క.|lines=<poem>కావునఁ గౌరవరాజును, వేవిధముల వినుతి జేసి వేదిజపతినిన్
పావని మొదలగు పాండవు, లేవుర నిందించి సుదతి నీలే దనియెన్.</poem>|ref=83}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన విని సౌభద్రుండు కోపోద్దీపితమానసుఁ డగుచు కటకటంబు లదర నిటలం
బునఁ జెమటకణంబులు పొడమ నేత్రంబు లరుణంబులు గావించి పటపట పండ్లు
గీటుకొని రోమకూపంబుల ధూమంబు వ్యాపింప భ్రూయుగంబు ముడిబడం జేసి
సుభద్రంజూచి యిట్లనియె.</poem>|ref=84}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జనని హలి నిన్నుఁ బల్కినచెనఁటిపల్కు, లేల చదువఁగ వినఁగ నా కింపుగాదు
కర్ణములు రెండుతూటులు గట్టె వినుము, తల్లి నావంటిసుతుఁ డుండఁదగునె వగవ.</poem>}}
{{Telugu poem|type=క.|lines=<poem>అది గాక రణగరిష్ఠుఁడు, పదిపేరులు గలిగినట్టి ఫల్గునుఁ డరయన్
ముదమునఁ బతి యైయుండియుఁ, బదపడి చింతింప నీకుఁ బాడియె తల్లీ.</poem>|ref=86}}
{{Telugu poem|type=చ.|lines=<poem>కుటిలతరప్రచండరిపుకోటులఁ ద్రుంచి వనాంతరంబులోఁ
బటుతరవిక్రమాఢ్యు లగు పాండవులేవురు సంతసంబుతో</poem>}}<noinclude><references/></noinclude>
19f0bev1yqeb78k5n7qf0qw8l4tt3b8
పుట:శశిరేఖాపరిణయము.pdf/36
104
214213
559752
559581
2026-06-15T21:14:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559752
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type= |lines=<poem>దిటముగ నున్నవా రనుచు దివ్యమునీంద్రులు చెప్ప విందు నీ
కటకట లెందు కీబలుఁడు కన్నె నొసంగకయున్న మేలగున్.</poem>|ref=87}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియును.</poem>|ref=88}}
{{Telugu poem|type=చ.|lines=<poem>పడఁతి నొసంగలే దనుచుఁ బల్కినపల్కులు చెల్లుఁ గాక యా
చెడుగులఁ గౌరవాధముల సీరి నుతింపుచుఁ బాండుపుత్రులం
గడువడి నింద సేయుటకుఁ గారణ మేమని పల్కి యల్కతో
నొడలున ఘర్మబిందువులు పుట్టఁగ నిట్లని పల్కె వెండియున్.</poem>|ref=89}}
{{Telugu poem|type=క.|lines=<poem>సదయుఁడు హరి సాత్యకియున్, ముద మొదవఁగఁ జూచుచుండ ముసలాయుధునిన్
పద నగుశరములచేతన్, మద మడఁచెద నన్నుఁ జూడు మాతా యిపుడున్.</poem>|ref=90}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని ధను వొకచేఁ గైకొని, ఘనశరముల నొక్కచేత గ్రక్కునఁ గొనుచున్
దినకరతేజస్ఫురణన్, గను లెఱ్ఱఁగఁ జేసి లేచె కవ్వడిసుతుఁడున్.</poem>|ref=91}}
{{Telugu poem|type=పంచచామరము.|lines=<poem>కిరీటిసూనుఁ డట్లు లేచి కిన్కతో వచించె హా
విరోధి యాసుయోధనుండు వీరు నేకమే కదా
విరోధు లైరి యాదవు ల్వివేకహీను లందఱిన్
పరేతరాట్పురంబుఁ జేర్చి పాపుకోందుఁ గోపమున్.</poem>|ref=92}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు.</poem>|ref=93}}
{{Telugu poem|type=క.|lines=<poem>పార్థుఁ డొసంగినవిద్య కృ, తార్థత నొందింపకున్న ధరణీస్థలిలో
సార్థకమే విను తల్లీ, ప్రార్థించెద సెల వొసంగు పనియే మిచటన్.</poem>|ref=94}}
{{Telugu poem|type=క.|lines=<poem>తఱియైనవేళ శత్రులఁ, బరిమార్పకయున్న ధనువుబాణము లకటా
పొరిఁబొరిఁ గాల్పనె నేఁ డీ, హరి సాత్యకిఁ దప్ప నితరులందఱిఁ గూల్తున్.</poem>|ref=95}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున.</poem>|ref=96}}
{{Telugu poem|type=క.|lines=<poem>రుద్రునివలె వెడలిన సౌ, భద్రుని వీక్షించి జనని భయమానస యై
భద్రగజవైరివిక్రమ, యుద్రేకము సేయ నేల నుడుగుము తండ్రీ.</poem>|ref=97}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అదియునుంగాక.</poem>|ref=98}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>బలుఁడు త న్నాడినపల్కులు విని పోయి కలవి లేనివి కొన్నికారు లరచి
పుత్త్రున కత్యంతశత్రుత్వ మెగఁబోసి చయ్యన బలునిపై కయ్యమునకుఁ
బంపె గయ్యాళని పలుకుదు రవనిలో నీయపవాదం బదేల మనకుఁ
గామపాలుఁడు నన్నుఁ గఠినోక్తు లాడుట కాలవిశేషంబు గాక వినుము</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>చిత్తజునితండ్రి యన్నపైఁ గత్తికట్టఁ, దగదు రమ్మని పలికినఁ దల్లిపలుకు
హస్తి కంకుశమును జూపినట్టు లగుట, మరలి యి ట్లని పలికె నమ్మానధనుఁడు.</poem>|ref=99}}<noinclude><references/></noinclude>
o1m1d3v0apgula08mgieogx74a4ihet
సూచిక:1950 SaaraSangrahaGanditamu Telugu PDF.pdf
106
214214
559682
559588
2026-06-15T13:50:16Z
Aravind Bandi
7336
559682
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[సారసంగ్రహ గణితము]]
|భాష=te
|సంపుటి=ప్రథమభాగము
|రచయిత=[[రచయిత:పావులూరి మల్లన]]
|అనువాదకులు=వేటూరి ప్రభాకరశాస్త్రి
|ఎడిటర్=ప్రొఫెసర్ పి. వి. రామానుజస్వామి
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=తిరుమల తిరుపతి దేవస్థానములు
|చిరునామా=తిరుపతి
|సంవత్సరం=1952
|ఆధారం=Sri Venkatesvara Oriental Series No. 38
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=7
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
a8d0q6txk4gc4jdrdo03ee6nuhc7gxe
పుట:శశిరేఖాపరిణయము.pdf/37
104
214215
559753
559587
2026-06-15T21:21:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559753
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ఇప్పని నీహృదయమునకు, మెప్పొదవక నుండెనేని మీయ న్నాడే
తప్పుడుకూఁతల కోర్చుచు, నిప్పురమున నుండవమ్మ యీసును లేకన్.</poem>|ref=100}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జనని మాతండ్రిగా రున్నవనికి నేను, బోదు నని లేచి వెడలినపుత్త్రుఁ జూచి
నిన్ను నెడఁబాసి క్షణమైన నిలువఁ జాలఁ, దండ్రి ననుఁ బాసిపో నీకు ధర్మమగునె.</poem>|ref=101}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని మఱియు నిట్టులనియెన్, వనములలోఁ బతినిఁ బాసి వగ పెదఁ దగులన్
నినుఁ జూచి వగవకుండుదు, ననుఁ దోడ్కొనిపో కుమార నగసమధీరా.</poem>|ref=102}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన విని సౌభద్రుండు సుభద్రాగమనంబున కొడంబడి జనంబులు నిద్రింప నర్ధ
రాత్రంబునఁ దల్లిం దోడ్కొని ధనుర్బాణపాణి యై వెడలి మహారణ్యంబుఁ జొచ్చి
గిరిగహ్వరంబు లాలోకింపుచు నరుగుసమయంబున.</poem>|ref=103}}
{{Telugu poem|type=క.|lines=<poem>జననాథాగ్రణి వినుమా, ఘనవేణి సుభద్ర రోషగతి యేమందున్
పనభూమి నరుగువేళ, దనతల్లిని దండ్రినైనఁ దలఁపదు మదిలోన్.</poem>|ref=104}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కలకలధ్వను లిచ్చె ఖగసమూహంబులు చక్రవాకంబులు సంతసించెఁ
దమము దిక్కుల కేఁగెఁ దమ్ములు వికసించెఁ దొలికొండ శిఖరిపైఁ దోఁచె రవియు
నభిమన్యుఁ డావేళ నతిరమణీయమౌ కమలాకరముఁ జేరి కాలవిధులు
సల్పిన తరువాత సంకర్షణం డాడు వాక్యము ల్పలుమారు వగచి వగచి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>విల్లు శరములు తోడుగా విపినభూమి, జననిఁ దోడ్కొని పోవుచు జనకు లున్న
వనము దెలియక ఘోరకాననముఁ జొచ్చి, పొదల దూరుచు భయదమౌనదులు కడచి.</poem>|ref=105}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>రెండుదినంబు లీపగిది రేయిపగళ్ళును బోయినంతలోఁ
గొండొకసేపు నిల్చి మృగకుంజరగర్జన లాలకించి కో
దండము నెక్కువెట్టి తనతల్లినిఁ దోడ్కొని ధీరవృత్తితో
వెండియు నేఁగె నాఘనుని వీరపరాక్రమ మేమి చెప్పుదున్.</poem>|ref=106}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునం జని చని మూఁడవనాఁటి సాయంకాలమునకు ఘటోత్కచువనంబు
జేరం జనిరి. ఆవనంబునం దౌదుంబరవటాశ్వత్థజంబూజంబీరనారికేళకదళీఖర్జూర
మాకందపున్నాగకదంబచాంపేయకురంటకపనసరసాలాదిభూజంబులును, శరభసింహ
శార్దూలచమరీభల్లూకమదేభవృకఖడ్గజంబుకమార్జాలాదిమృగంబులును, గలహంస
మయూరశారికాకీరక్రౌంచచక్రవాకకపోతకాకోలూకభరద్వాజటిట్టిభాదిపక్షిసమూ
హంబులుం గల కాననంబుఁ బ్రవేశించి రాసమయంబున సుభద్రసౌభద్రుం జూచి
“తండ్రీ మార్గాయాసంబున దాహం బొదవె శిలాకంటకంబులు దాఁకి చరణంబులు
దెమలింప రాదయ్యెఁ గావున గొంతసేపు నిద్రించెద ననిన జననిం జూచి సౌభద్రుండు
చింతింపుచు సమీపంబున నున్నజలంబుల దాహంబుఁ బాపి సికతాతలంబున నిద్రింపం
జేసి తనమనంబున నిట్లని వితర్కించె.</poem>|ref=107}}<noinclude><references/></noinclude>
0bbdgdkvb191z8noda5b42t8h0q00i9
559754
559753
2026-06-15T21:21:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559754
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>ఇప్పని నీహృదయమునకు, మెప్పొదవక నుండెనేని మీయ న్నాడే
తప్పుడుకూఁతల కోర్చుచు, నిప్పురమున నుండవమ్మ యీసును లేకన్.</poem>|ref=100}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జనని మాతండ్రిగా రున్నవనికి నేను, బోదు నని లేచి వెడలినపుత్త్రుఁ జూచి
నిన్ను నెడఁబాసి క్షణమైన నిలువఁ జాలఁ, దండ్రి ననుఁ బాసిపో నీకు ధర్మమగునె.</poem>|ref=101}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని మఱియు నిట్టులనియెన్, వనములలోఁ బతినిఁ బాసి వగ పెదఁ దగులన్
నినుఁ జూచి వగవకుండుదు, ననుఁ దోడ్కొనిపో కుమార నగసమధీరా.</poem>|ref=102}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన విని సౌభద్రుండు సుభద్రాగమనంబున కొడంబడి జనంబులు నిద్రింప నర్ధ
రాత్రంబునఁ దల్లిం దోడ్కొని ధనుర్బాణపాణి యై వెడలి మహారణ్యంబుఁ జొచ్చి
గిరిగహ్వరంబు లాలోకింపుచు నరుగుసమయంబున.</poem>|ref=103}}
{{Telugu poem|type=క.|lines=<poem>జననాథాగ్రణి వినుమా, ఘనవేణి సుభద్ర రోషగతి యేమందున్
పనభూమి నరుగువేళ, దనతల్లిని దండ్రినైనఁ దలఁపదు మదిలోన్.</poem>|ref=104}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కలకలధ్వను లిచ్చె ఖగసమూహంబులు చక్రవాకంబులు సంతసించెఁ
దమము దిక్కుల కేఁగెఁ దమ్ములు వికసించెఁ దొలికొండ శిఖరిపైఁ దోఁచె రవియు
నభిమన్యుఁ డావేళ నతిరమణీయమౌ కమలాకరముఁ జేరి కాలవిధులు
సల్పిన తరువాత సంకర్షణం డాడు వాక్యము ల్పలుమారు వగచి వగచి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>విల్లు శరములు తోడుగా విపినభూమి, జననిఁ దోడ్కొని పోవుచు జనకు లున్న
వనము దెలియక ఘోరకాననముఁ జొచ్చి, పొదల దూరుచు భయదమౌనదులు కడచి.</poem>|ref=105}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>రెండుదినంబు లీపగిది రేయిపగళ్ళును బోయినంతలోఁ
గొండొకసేపు నిల్చి మృగకుంజరగర్జన లాలకించి కో
దండము నెక్కువెట్టి తనతల్లినిఁ దోడ్కొని ధీరవృత్తితో
వెండియు నేఁగె నాఘనుని వీరపరాక్రమ మేమి చెప్పుదున్.</poem>|ref=106}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునం జని చని మూఁడవనాఁటి సాయంకాలమునకు ఘటోత్కచువనంబు
జేరం జనిరి. ఆవనంబునం దౌదుంబరవటాశ్వత్థజంబూజంబీరనారికేళకదళీఖర్జూర
మాకందపున్నాగకదంబచాంపేయకురంటకపనసరసాలాదిభూజంబులును, శరభసింహ
శార్దూలచమరీభల్లూకమదేభవృకఖడ్గజంబుకమార్జాలాదిమృగంబులును, గలహంస
మయూరశారికాకీరక్రౌంచచక్రవాకకపోతకాకోలూకభరద్వాజటిట్టిభాదిపక్షిసమూ
హంబులుం గల కాననంబుఁ బ్రవేశించి రాసమయంబున సుభద్రసౌభద్రుం జూచి
“తండ్రీ మార్గాయాసంబున దాహం బొదవె శిలాకంటకంబులు దాఁకి చరణంబులు
దెమలింప రాదయ్యెఁ గావున గొంతసేపు నిద్రించెద" ననిన జననిం జూచి సౌభద్రుండు
చింతింపుచు సమీపంబున నున్నజలంబుల దాహంబుఁ బాపి సికతాతలంబున నిద్రింపం
జేసి తనమనంబున నిట్లని వితర్కించె.</poem>|ref=107}}<noinclude><references/></noinclude>
0y5votuaklzcts66tc855w7dpks7upd
వాడుకరి చర్చ:Aravind Bandi
3
214216
559595
2026-06-15T12:08:58Z
Rajasekhar1961
50
/* స్వాగతం */ కొత్త విభాగం
559595
wikitext
text/x-wiki
{{స్వాగతం}} [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 12:08, 15 జూన్ 2026 (UTC)
qftp2jcbsh623azx0wfy6t11kibj0dx
వాడుకరి చర్చ:Vihuu18
3
214217
559596
2026-06-15T12:09:58Z
Rajasekhar1961
50
/* స్వాగతం */ కొత్త విభాగం
559596
wikitext
text/x-wiki
{{స్వాగతం}} [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 12:09, 15 జూన్ 2026 (UTC)
o486zujhszthe8y7hsz45dzfvgtau7s
పుట:AgastyaVidyamu.pdf/7
104
214218
559601
2026-06-15T12:19:50Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559601
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{Center|ii}}
{{Center|(పొంతములవారు ఉత్తర (పత్యుత్తరముల మూలమున
ఈసంప్రదాయములను}}
{{Center|గురించి చర్చజరిపిరి.దానంజేసీ యీయగస్త్య సంప్రదాయమును గురించి}}
{{Center|నేనును కొంత యధికపరిశ్రమ జేయవలసీవచ్చినది. అందు నేజేసిన పరిశ్రమను}}
{{Center|మన యాంధ్రసోదరులకు దెలుప కుతూహాలినై యుండ
అస్మత్ప్రియమిత్రు}}
{{Center| లును ఆంధ్రదైనిక పత్రికాస్థాపకులును దేశ బాంధవులును అగు (శీకాశీనా}}
{{Center|ధుని నాగేశ్వరరావు పంతులవారు తమ యాంధ్రపత్రికయొక్క యైదవ}}
{{Center| సంవత్సరాది సంచికకి విషయమునువ్రాసి ఈయగోరిరి. వారి యపేక్షను}}
{{Center|బూ ర్తిజేయ నీవిషయము నొకవ్యాసముగ వ్రాసితిని. అద్దాని నాంధ్ర పత్రిక}}
{{Center|అయిదవ సంవత్సరాది సంచికయందు 1914 ఏప్రిల్ మాసమున ము(దింపబడె.}}
{{Center|నవీనమగు నీవిషయమును పలువురు మిత్రులు కోరియుండుటచే గ్రంధరూప}}
{{Center|మున నీ(గంధమాలయం దైదవగుచ్ఛముగ ముద్రించితిని, ఈవిషయము ప్రాచీన}}
{{Center|కాలమున సర్వజననిదితమై యుండినను ప్రకృతకాలమువ గగన కుసువముం}}
{{Center|బోలియున్నయది. గాన నవీనమగు నా విమర్శమునందు అనేకలోపము}}
{{Center|లుండవచ్చును. పాఠకమహాశయులు వానిని విమర్శించి దెలిపినచో విధేయతతో}}{{Center| కైకొనుచున్నాడను.}}
{{left|25-5-14,
ఆయుర్వేదాశ్రమం
ముదరాస్.}}
{{right|డి.గోపాలాచార్యులు.}}<noinclude><references/></noinclude>
tuwwaopi7tjson45nd7s0cekq8g77cc
559603
559601
2026-06-15T12:21:33Z
Aryapragathi07
7305
559603
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{Center|ii}}
{{Center|(పొంతములవారు ఉత్తర (పత్యుత్తరముల మూలమున
ఈసంప్రదాయములను}}
{{Center|గురించి చర్చజరిపిరి.దానంజేసీ యీయగస్త్య సంప్రదాయమును గురించి}}
{{Center|నేనును కొంత యధికపరిశ్రమ జేయవలసీవచ్చినది. అందు నేజేసిన పరిశ్రమను}}
{{Center|మన యాంధ్రసోదరులకు దెలుప కుతూహాలినై యుండ
అస్మత్ప్రియమిత్రు}}
{{Center|లును ఆంధ్రదైనిక పత్రికాస్థాపకులును దేశ బాంధవులును అగు (శీకాశీనా}}
{{Center|ధుని నాగేశ్వరరావు పంతులవారు తమ యాంధ్రపత్రికయొక్క యైదవ}}
{{Center|సంవత్సరాది సంచికకి విషయమునువ్రాసి ఈయగోరిరి. వారి యపేక్షను}}
{{Center|బూ ర్తిజేయ నీవిషయము నొకవ్యాసముగ వ్రాసితిని. అద్దాని నాంధ్ర పత్రిక}}
{{Center|అయిదవ సంవత్సరాది సంచికయందు 1914 ఏప్రిల్ మాసమున ము(దింపబడె.}}
{{Center|నవీనమగు నీవిషయమును పలువురు మిత్రులు కోరియుండుటచే గ్రంధరూప}}
{{Center|మున నీ(గంధమాలయం దైదవగుచ్ఛముగ ముద్రించితిని, ఈవిషయము ప్రాచీన}}
{{Center|కాలమున సర్వజననిదితమై యుండినను ప్రకృతకాలమువ గగన కుసువముం}}
{{Center|బోలియున్నయది. గాన నవీనమగు నా విమర్శమునందు అనేకలోపము}}
{{Center|లుండవచ్చును. పాఠకమహాశయులు వానిని విమర్శించి దెలిపినచో విధేయతతో}}
{{Center|కైకొనుచున్నాడను.}}
{{left|25-5-14,
ఆయుర్వేదాశ్రమం
ముదరాస్.}}
{{right|డి.గోపాలాచార్యులు.}}<noinclude><references/></noinclude>
d2vd2o2mbimgv8c1f5rpsmjfjq7zxff
559608
559603
2026-06-15T12:25:26Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559608
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{Center|ii}}
{{Center|(పొంతములవారు ఉత్తర (పత్యుత్తరముల మూలమున
ఈసంప్రదాయములను}}
{{Center|గురించి చర్చజరిపిరి.దానంజేసీ యీయగస్త్య సంప్రదాయమును గురించి}}
{{Center|నేనును కొంత యధికపరిశ్రమ జేయవలసీవచ్చినది. అందు నేజేసిన పరిశ్రమను}}
{{Center|మన యాంధ్రసోదరులకు దెలుప కుతూహాలినై యుండ
అస్మత్ప్రియమిత్రు}}
{{Center|లును ఆంధ్రదైనిక పత్రికాస్థాపకులును దేశ బాంధవులును అగు (శీకాశీనా}}
{{Center|ధుని నాగేశ్వరరావు పంతులవారు తమ యాంధ్రపత్రికయొక్క యైదవ}}
{{Center|సంవత్సరాది సంచికకి విషయమునువ్రాసి ఈయగోరిరి. వారి యపేక్షను}}
{{Center|బూ ర్తిజేయ నీవిషయము నొకవ్యాసముగ వ్రాసితిని. అద్దాని నాంధ్ర పత్రిక}}
{{Center|అయిదవ సంవత్సరాది సంచికయందు 1914 ఏప్రిల్ మాసమున ము(దింపబడె.}}
{{Center|నవీనమగు నీవిషయమును పలువురు మిత్రులు కోరియుండుటచే గ్రంధరూప}}
{{Center|మున నీ(గంధమాలయం దైదవగుచ్ఛముగ ముద్రించితిని, ఈవిషయము ప్రాచీన}}
{{Center|కాలమున సర్వజననిదితమై యుండినను ప్రకృతకాలమువ గగన కుసువముం}}
{{Center|బోలియున్నయది. గాన నవీనమగు నా విమర్శమునందు అనేకలోపము}}
{{Center|లుండవచ్చును. పాఠకమహాశయులు వానిని విమర్శించి దెలిపినచో విధేయతతో}}
{{Center|కైకొనుచున్నాడను.}}
{{left|25-5-14,
ఆయుర్వేదాశ్రమం
ముదరాస్.}}
{{right|డి.గోపాలాచార్యులు.}}<noinclude><references/></noinclude>
iyvdbqqm2h8zo8x9xmcgbwvbch2bb2a
559635
559608
2026-06-15T12:50:52Z
Aryapragathi07
7305
559635
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{Center|ii}}
{{Center|(పా౦తములవారు ఉత్తర (పత్యుత్తరముల మూలమున
ఈసంప్రదాయములను}}
{{Center|గురించి చర్చజరిపిరి.దానంజేసీ యీయగస్త్య సంప్రదాయమును గురించి}}
{{Center|నేనును కొంత యధికపరిశ్రమ జేయవలసీవచ్చినది. అందు నేజేసిన పరిశ్రమను}}
{{Center|మన యాంధ్రసోదరులకు దెలుప కుతూహాలినై యుండ
అస్మత్ప్రియమిత్రులును}}
{{Center|ఆంధ్రదైనిక పత్రికాస్థాపకులును దేశ బాంధవులును అగు (శీకాశీనాధుని}}
{{Center|నాగేశ్వరరావు పంతులవారు తమ యాంధ్రపత్రికయొక్క యైదవ సంవత్సరాది}}
{{Center|సంచికకి విషయమునువ్రాసి ఈయగోరిరి. వారి యపేక్షను}}
{{Center|బూర్తిజేయనీ విషయము నొకవ్యాసముగ వ్రాసితిని. అద్దాని నాంధ్రపత్రిక}}
{{Center|అయిదవ సంవత్సరాది సంచికయందు 1914 ఏప్రిల్ మాసమున ము(దింపబడె.}}
{{Center|నవీనమగు నీవిషయమును పలువురు మిత్రులు కోరియుండుటచే గ్రంధరూపమున}}
{{Center|నీ(గంధమాలయం దైదవగుచ్ఛముగ ముద్రించితిని, ఈవిషయము ప్రాచీన కాలమున }}
{{Center|సర్వజననిదితమై యుండినను ప్రకృతకాలమువ గగన కుసుమముంబోలియున్నయది.}}
{{Center|గాన నవీనమగు నా విమర్శమునందు అనేకలోపములుండవచ్చును. }}
{{Center|పాఠకమహాశయులు వానిని విమర్శించి దెలిపినచో విధేయతతో గైకొనుచున్నాడను.}}
{{left|25-5-14,
ఆయుర్వేదాశ్రమం
ముదరాస్.}}
{{right|డి.గోపాలాచార్యులు.}}<noinclude><references/></noinclude>
blcyupdfc4tewcuu85rdavv4hgxj1ee
సూచిక:19330101 AndhrashabdaChinthamani Telugu pdf.pdf
106
214219
559606
2026-06-15T12:22:15Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with ''
559606
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=
|భాష=te
|సంపుటి=
|రచయిత=
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=_empty_
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
lq8a7ln5c0jqekrtrrhgv2qwncewpzs
559610
559606
2026-06-15T12:27:03Z
Y Sai Kumar
7319
559610
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఆంధ్ర శబ్ద చింతామణి
|భాష=te
|సంపుటి=
|రచయిత=నన్నయ భట్టాకర
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1933
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=_empty_
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
r98i5vzrf97rjz1gmfij0k2aziak1fz
559612
559610
2026-06-15T12:28:00Z
Y Sai Kumar
7319
559612
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఆంధ్ర శబ్ద చింతామణి
|భాష=te
|సంపుటి=
|రచయిత=నన్నయ భట్టాకర
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1931
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=_empty_
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
67usn29j124x4j8134hc517rv3jcvc1
559614
559612
2026-06-15T12:30:11Z
Y Sai Kumar
7319
559614
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఆంధ్ర శబ్ద చింతామణి
|భాష=te
|సంపుటి=
|రచయిత=నన్నయ భట్టాకర
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కాకినాడ ముద్రాక్షరశాల
|చిరునామా=కాకినాడ
|సంవత్సరం=1931
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
r6okms2es34vy6rzsxxronsxg45xqyk
పుట:ఆంధ్రులెవరు?.pdf/2
104
214220
559611
2026-06-15T12:27:37Z
Vihuu18
7318
/* అచ్చుదిద్దారు */
559611
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude>{{Css image crop
|Image = ఆంధ్రులెవరు?.pdf
|Page = 2
|bSize = 450
|cWidth = 400
|cHeight = 670
|oTop = 2
|oLeft = 11
|Location = center
|Description = ముఖచిత్రం గా పూర్తి పేజీ చిత్రం
}}<noinclude><references/></noinclude>
725ebs51ieklekd0ivdcmzshtjcn7h6
పుట:ఆంధ్రులెవరు?.pdf/7
104
214221
559615
2026-06-15T12:30:17Z
Vihuu18
7318
/* పాఠ్యం లేనిది */
559615
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Vihuu18" /></noinclude>-
C /
/'
C^^
v? ooooccct
t
,.(,,,<noinclude><references/></noinclude>
4jjtvlj11olambz47gwhg1ko4m0ttxd
559616
559615
2026-06-15T12:30:42Z
Vihuu18
7318
559616
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Vihuu18" /></noinclude><noinclude><references/></noinclude>
a146ad3n6lriq9bz7z34up56v9nhphc
పుట:ఆంధ్రులెవరు?.pdf/9
104
214222
559623
2026-06-15T12:35:33Z
Vihuu18
7318
/* అచ్చుదిద్దబడని */
559623
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Vihuu18" /></noinclude>== '''<center>ఆంధ్రులెవరు?</center>''' ==
విశ్వామిత్రుని కుమాళ్ళు యేబదిమంది తండ్రి ఆజ్ఞ మీరినందున తండ్రిచే శపించబడి దస్యులై అనాగరిక జాతులైన ఆంధ్ర, పుండ్ర, శబర, పుళింద, ముతంబా మొదలుగాగల జాతులుగా మారిపోయిరని ఐత రేయ బ్రాహ్మణము చెప్పుచున్నది. అందు చెప్పబడిన “అంధ్రులే” “ఆంధ్రులని”యు వారి సంతానమే యిప్పుడు ఆంధ్రదేశములో నివచ ఆంధ్రులనియు వెబగు, మాల్గొనలు, ఇ.జె. రాప్సన్ ఎం.ఎ.
మొదలుగాగల పాశ్చాత్య విద్వాంసులును వారి యనుయాయులైన
హైందవహూణ విద్యాధికులును భ్రమించి చరిత్రల నల్లియుండిరి.
కాని విశ్వామిత్రుని శాపహతులై “అంధ్ర” నామమును పొందిన
వారలు వేదబాహ్యులైన మ్లేచ్ఛ జాతులుగా మారిపోయిరి. ఆంధ్రదేశ
ములోని ఆంధ్రులు చాతుర్వర్ణ్యములతో గూడి వేదోక్తశర్మల నాచ
రించువారైన స్వచ్ఛమైన ఆర్యజాతి నేటికిని వేదాధ్యయనములో
ఆంధ్రబ్రాహ్మణులను మించినవారు గాని సమానులుగాని భారతదేశ
మందంతటను గానరారు. పితృశాపోపహతులై వైదికధర్మ భ్రష్టులై,
మ్లేచ్ఛులై, పర్వతారణ్యముల నాశ్రయించి, ఉన్న నాగరికతను బోగో
ట్టుకొని అనాగరికులై హింసా చౌర్యాదులు వృత్తిగా గలిగి అంధ్రాది
నీచజాతులలో చేరిపోయిన విశ్వామిత్రుని సంతానమునకును, ఆంధ్ర
దేశములోని ఆంధ్రజాతియని పిలువబడుచున్న ఆర్యులకును ఎట్టి పోలిక
యు లేదు. నామసాదృశ్యమాత్రమున వారే వీరైనట్లు భారతీయ సాంప్ర
దాయ జ్ఞానశూన్యులైన పాశ్చాత్య విద్వాంసులూహించిన నూహించె
దరు గాక! తమ సాంప్రదాయముల తాము మరచి పాశ్చాత్యుల
ననుకరించు హైందవవిద్యాధికు లనుసరించిన ననుసరించెదరుగాక !
ఏమాత్రమయిన భారతీయ సాంప్రదాయ మెరిగినవారలైనను అంగీక
రింతురా? ఒకసారి వైదికధర్మమునుండి భ్రష్టమైనవా డింతవరకు
'వైదిక సాంప్రదాయములోనికి తిరిగివచ్చుట కెవరును నంగీకరించుట
లేదు. ఇట్టి స్థితిలో అతి పురాతన కాలమున వైదిక ధర్మము
-నాలుగు పాదములతో నడుపబడుచుండిన కాలమున కర్మభ్రష్టులై,<noinclude><references/></noinclude>
2ypw1jdkimu1azgea35g0mgwwslvgaz
559783
559623
2026-06-16T09:45:46Z
Vihuu18
7318
/* అచ్చుదిద్దారు */
559783
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude>==='''<center>ఆంధ్రులెవరు?</center>'''===
విశ్వామిత్రుని కుమాళ్ళు యేబదిమంది తండ్రిఆజ్ఞ మీరినందున తండ్రిచే శపించబడి దస్యులై అనాగరిక జాతులైన ఆంధ్ర, పుండ్ర, శబర, పుళింద, ముతుబా మొదలుగాగల జాతులుగా మారిపోయిరని ఐతరేయ బ్రాహ్మణము చెప్పుచున్నది. అందు చెప్పబడిన అంధ్రులే” “ఆంధ్రులని”యు వారి సంతానమే యిప్పుడు ఆంధ్రదేశములో నివసించుచుండిన ఆంధ్రులనియు వెబరు, మాగ్డోనలు, ఇ.జె. రాప్సన్ ఎం.ఎ. మొదలుగాగల పాశ్చాత్య విద్వాంసులును వారి యనుయాయులైన హైందవహూణ విద్యాధికులును భ్రమించి చరిత్రల నల్లియుండిరి.<br>
కాని విశ్వామిత్రుని శాపహతులై “అంధ్ర” నామమును పొందిన వారలు వేదబాహ్యులైన మ్లేచ్ఛ జాతులుగా మారిపోయిరి. ఆంధ్రదేశములోని ఆంధ్రులు చాతుర్వర్ణ్యములతో గూడి వేదోక్తకర్మల నాచరించువారైన స్వచ్ఛమైన ఆర్యజాతి నేటికిని వేదాధ్యయనములో
ఆంధ్రబ్రాహ్మణులను మించినవారు గాని సమానులుగాని భారతదేశమందంతటను గానరారు. పితృశాపోపహతులై వైదికధర్మ భ్రష్టులై, మ్లేచ్ఛులై, పర్వతారణ్యముల నాశ్రయించి, ఉన్న నాగరికతను బోగొట్టుకొని అనాగరికులై హింసాచౌర్యాదులు వృత్తిగా గలిగి అంధ్రాది నీచజాతులలో చేరిపోయిన విశ్వామిత్రుని సంతానమునకును, ఆంధ్రదేశములోని ఆంధ్రజాతియని పిలువబడుచున్న ఆర్యులకును ఎట్టి పోలికయు లేదు. నామసాదృశ్యమాత్రమున వారే వీరైనట్లు భారతీయ సాంప్రదాయ జ్ఞానశూన్యులైన పాశ్చాత్య విద్వాంసులూహించిన నూహించెదరు గాక! తమ సాంప్రదాయముల తాము మరచి పాశ్చాత్యులననుకరించు హైందవవిద్యాధికు లనుసరించిన ననుసరించెదరుగాక! ఏమాత్రమయిన భారతీయ సాంప్రదాయ మెరిగినవారలైనను అంగీకరింతురా? ఒకసారి వైదికధర్మమునుండి భ్రష్టమైనవా డింతవరకు వైదిక సాంప్రదాయములోనికి తిరిగివచ్చుట కెవరును నంగీకరించుటలేదు. ఇట్టి స్థితిలో అతి పురాతనకాలమున వైదిక ధర్మము నాలుగు పాదములతో నడుపబడుచుండిన కాలమున కర్మభ్రష్టులై,<noinclude><references/></noinclude>
9wbr2sf3i5lsojbij77tlj5569gg2fj
559789
559783
2026-06-16T10:14:08Z
Vihuu18
7318
559789
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude><center>{{p|fs200}}'''ఆంధ్రులెవరు?'''</p></center>
విశ్వామిత్రుని కుమాళ్ళు యేబదిమంది తండ్రిఆజ్ఞ మీరినందున తండ్రిచే శపించబడి దస్యులై అనాగరిక జాతులైన ఆంధ్ర, పుండ్ర, శబర, పుళింద, ముతుబా మొదలుగాగల జాతులుగా మారిపోయిరని ఐతరేయ బ్రాహ్మణము చెప్పుచున్నది. అందు చెప్పబడిన అంధ్రులే” “ఆంధ్రులని”యు వారి సంతానమే యిప్పుడు ఆంధ్రదేశములో నివసించుచుండిన ఆంధ్రులనియు వెబరు, మాగ్డోనలు, ఇ.జె. రాప్సన్ ఎం.ఎ. మొదలుగాగల పాశ్చాత్య విద్వాంసులును వారి యనుయాయులైన హైందవహూణ విద్యాధికులును భ్రమించి చరిత్రల నల్లియుండిరి.<br>
కాని విశ్వామిత్రుని శాపహతులై “అంధ్ర” నామమును పొందిన వారలు వేదబాహ్యులైన మ్లేచ్ఛ జాతులుగా మారిపోయిరి. ఆంధ్రదేశములోని ఆంధ్రులు చాతుర్వర్ణ్యములతో గూడి వేదోక్తకర్మల నాచరించువారైన స్వచ్ఛమైన ఆర్యజాతి నేటికిని వేదాధ్యయనములో
ఆంధ్రబ్రాహ్మణులను మించినవారు గాని సమానులుగాని భారతదేశమందంతటను గానరారు. పితృశాపోపహతులై వైదికధర్మ భ్రష్టులై, మ్లేచ్ఛులై, పర్వతారణ్యముల నాశ్రయించి, ఉన్న నాగరికతను బోగొట్టుకొని అనాగరికులై హింసాచౌర్యాదులు వృత్తిగా గలిగి అంధ్రాది నీచజాతులలో చేరిపోయిన విశ్వామిత్రుని సంతానమునకును, ఆంధ్రదేశములోని ఆంధ్రజాతియని పిలువబడుచున్న ఆర్యులకును ఎట్టి పోలికయు లేదు. నామసాదృశ్యమాత్రమున వారే వీరైనట్లు భారతీయ సాంప్రదాయ జ్ఞానశూన్యులైన పాశ్చాత్య విద్వాంసులూహించిన నూహించెదరు గాక! తమ సాంప్రదాయముల తాము మరచి పాశ్చాత్యులననుకరించు హైందవవిద్యాధికు లనుసరించిన ననుసరించెదరుగాక! ఏమాత్రమయిన భారతీయ సాంప్రదాయ మెరిగినవారలైనను అంగీకరింతురా? ఒకసారి వైదికధర్మమునుండి భ్రష్టమైనవా డింతవరకు వైదిక సాంప్రదాయములోనికి తిరిగివచ్చుట కెవరును నంగీకరించుటలేదు. ఇట్టి స్థితిలో అతి పురాతనకాలమున వైదిక ధర్మము నాలుగు పాదములతో నడుపబడుచుండిన కాలమున కర్మభ్రష్టులై,<noinclude><references/></noinclude>
sbcesncfg3hg5t5huaknc487jvstmr8
559796
559789
2026-06-16T10:44:04Z
Vihuu18
7318
indents corrected
559796
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude>{{center|{{p|fs200}}'''ఆంధ్రులెవరు?'''</p>}}
{{gap}}విశ్వామిత్రుని కుమాళ్ళు యేబదిమంది తండ్రిఆజ్ఞ మీరినందున తండ్రిచే శపించబడి దస్యులై అనాగరిక జాతులైన ఆంధ్ర, పుండ్ర, శబర, పుళింద, ముతుబా మొదలుగాగల జాతులుగా మారిపోయిరని ఐతరేయ బ్రాహ్మణము చెప్పుచున్నది. అందు చెప్పబడిన అంధ్రులే” “ఆంధ్రులని”యు వారి సంతానమే యిప్పుడు ఆంధ్రదేశములో నివసించుచుండిన ఆంధ్రులనియు వెబరు, మాగ్డోనలు, ఇ.జె. రాప్సన్ ఎం.ఎ. మొదలుగాగల పాశ్చాత్య విద్వాంసులును వారి యనుయాయులైన హైందవహూణ విద్యాధికులును భ్రమించి చరిత్రల నల్లియుండిరి.<br>
{{gap}}కాని విశ్వామిత్రుని శాపహతులై “అంధ్ర” నామమును పొందిన వారలు వేదబాహ్యులైన మ్లేచ్ఛ జాతులుగా మారిపోయిరి. ఆంధ్రదేశములోని ఆంధ్రులు చాతుర్వర్ణ్యములతో గూడి వేదోక్తకర్మల నాచరించువారైన స్వచ్ఛమైన ఆర్యజాతి నేటికిని వేదాధ్యయనములో
ఆంధ్రబ్రాహ్మణులను మించినవారు గాని సమానులుగాని భారతదేశమందంతటను గానరారు. పితృశాపోపహతులై వైదికధర్మ భ్రష్టులై, మ్లేచ్ఛులై, పర్వతారణ్యముల నాశ్రయించి, ఉన్న నాగరికతను బోగొట్టుకొని అనాగరికులై హింసాచౌర్యాదులు వృత్తిగా గలిగి అంధ్రాది నీచజాతులలో చేరిపోయిన విశ్వామిత్రుని సంతానమునకును, ఆంధ్రదేశములోని ఆంధ్రజాతియని పిలువబడుచున్న ఆర్యులకును ఎట్టి పోలికయు లేదు. నామసాదృశ్యమాత్రమున వారే వీరైనట్లు భారతీయ సాంప్రదాయ జ్ఞానశూన్యులైన పాశ్చాత్య విద్వాంసులూహించిన నూహించెదరు గాక! తమ సాంప్రదాయముల తాము మరచి పాశ్చాత్యులననుకరించు హైందవవిద్యాధికు లనుసరించిన ననుసరించెదరుగాక! ఏమాత్రమయిన భారతీయ సాంప్రదాయ మెరిగినవారలైనను అంగీకరింతురా? ఒకసారి వైదికధర్మమునుండి భ్రష్టమైనవా డింతవరకు వైదిక సాంప్రదాయములోనికి తిరిగివచ్చుట కెవరును నంగీకరించుటలేదు. ఇట్టి స్థితిలో అతి పురాతనకాలమున వైదిక ధర్మము నాలుగు పాదములతో నడుపబడుచుండిన కాలమున కర్మభ్రష్టులై,<noinclude><references/></noinclude>
7zywhcir7n6mwuk510s1e8hbm1el5ub
పుట:AgastyaVidyamu.pdf/9
104
214223
559625
2026-06-15T12:38:58Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559625
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{right|2}}
{{Center|అగస్త్యవైద్యము.}}
{{Center|వైదికమహాయుగము మొదలు క్రమముగ నభివృద్ధిని}}
{{Center|బొందిన పై రెండు సంప్రదాయకములను నాయుర్వేదత}}
{{Center|స్త్రజ్ఞులు వైదిక వైద్యసంప్రదాయములని వాడెదరు.}}
{{Center|తాన్త్రియుగమున నాగార్జునాదులచే వృద్ధిని బొందిం}}
పంబడిన ఖనిజ వస్తు సమ్మేళనతోఁ గూడిన
ధనసంప్రదాయము. వైద్యక పద్ధతులకు తాస్త్రిక సంప్రదాయము
లేక రససంప్రదాయమని వాడుకగలదు.
ఈ మూడు సంప్రదాయములకన్నను భిన్నముగ దక్షిణ
దేశమున విఖ్యాతమగు “నగస్త్యవైద్యము”
సంప్రదాయము, అను వైద్యము గలదు. అయ్యని పైమూడు
సంప్రదాయములలోఁ జేరినదియా లేక తద్భిన్నమా? ఇయ్యడి
మే కాలమునుండియారంభమైనది? దీనిమూలప్రవర్తకులు వార్ల
పరంపర మొదలగువానిని సంక్షేపముగ
వ్రాయుచున్నాఁడను.
సకలజనవంద్యులగు శ్రీరామచంద్రులు జననీజనకుల
యాజ్ఞంగై కొని పదునాల్గు వత్సరముల కాల
మును విదేశములఁ గడపుచు క్రమముగ
సగస్త్యాశ్రమమునకు విచ్చేసినటుల శ్రీరామాయణమునంగల
వాల్మీకి వాక్యరత్నములు సర్వజనవిదితములు. ఈ వాక్యత
తిచే శ్రీరామమూర్తికన్నను మున్ముందు అగస్త్యులు దక్షిణా
పథయాత్ర సలిపిని తెలియుచున్నది. అసస్త్యమహర్షి దక్షి<noinclude><references/></noinclude>
1g6ptuk68ndy11vj07ylg9xcch32lrc
559701
559625
2026-06-15T14:28:46Z
Aryapragathi07
7305
559701
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{right|2}}
{{Center|అగస్త్యవైద్యము.}}
{{Center|వైదికమహాయుగము మొదలు క్రమముగ నభివృద్ధిని}}
{{Center|బొందిన పై రెండు సంప్రదాయకములను నాయుర్వేదతస్త్రజ్ఞులు}}
{{Center|వైదిక వైద్యసంప్రదాయములని వాడెదరు.}}
{{Center|తాన్త్రికయుగమున నాగార్జునాదులచే వృద్ధిని బొందింపంబడిన}}
{{Center|ఖనిజ వస్తు సమ్మేళనతోఁ గూడిన
ధనసంప్రదాయము.}}
{{Center|వైద్యకపద్ధతులకు తాన్త్రిక సంప్రదాయము
లేక }}
{{Center|రససంప్రదాయమని వాడుకగలదు.}}
{{Center|ఈ మూడు సంప్రదాయములకన్నను భిన్నముగ దక్షిణ
దేశమున}}
{{Center|విఖ్యాతమగు “నగస్త్యవైద్యము” సంప్రదాయము, అను వైద్యము గలదు.}}
{{Center|అయ్యది పైమూడు సంప్రదాయములలోఁ జేరినదియా లేక తద్భిన్నమా? }}
{{Center|ఇయ్యది యేకాలమునుండియారంభమైనది? దీనిమూలప్రవర్తకులు}}
{{Center|వార్ల పరంపర మొదలగువానిని సంక్షేపముగ
వ్రాయుచున్నాఁడను.}}
{{Center|సకలజనవంద్యులగు శ్రీరామచంద్రులు జననీజనకుల
యాజ్ఞంగైకొని}}
{{Center|పదునాల్గు వత్సరముల కాలమును విదేశములఁ గడపుచు క్రమముగ}}
{{Center|సగస్త్యాశ్రమమునకు విచ్చేసినటుల శ్రీరామాయణమునంగల}}
{{Center|వాల్మీకి వాక్యరత్నములు సర్వజనవిదితములు.}}
{{Center|ఈ వాక్యతతిచే శ్రీరామమూర్తికన్నను మున్ముందు అగస్త్యులు}}
{{Center|దక్షిణా పథయాత్ర సలిపిరని తెలియుచున్నది. అసస్త్యమహర్షి దక్షి}}<noinclude><references/></noinclude>
pt2iffufwydfnwwtf60fbuh45il7npi
సూచిక:19560101 BudhaCharitramu Telugu pdf.pdf
106
214224
559631
2026-06-15T12:47:39Z
Y Sai Kumar
7319
[[WP:AES|←]]Created page with ''
559631
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=బుద్ధ చరిత్రము
|భాష=te
|సంపుటి=
|రచయిత=తిరుపతి వెంకటేశ్వర కవులు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
icwdm8mpepxoiiwp57jw9mhq94opk4v
559633
559631
2026-06-15T12:50:19Z
Y Sai Kumar
7319
559633
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=బుద్ధ చరిత్రము
|భాష=te
|సంపుటి=
|రచయిత=తిరుపతి వెంకటేశ్వర కవులు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=వెంకటేశ్వర పబ్లికేషన్సు
|చిరునామా=కడియం ,తూర్పు గోదావరి జిల్లా
|సంవత్సరం=1956
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
iri34poscseimeta5d27hv2viavuqcs
559667
559633
2026-06-15T13:33:40Z
Rajasekhar1961
50
559667
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=బుద్ధ చరిత్రము
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:తిరుపతి వేంకట కవులు|తిరుపతి వెంకటేశ్వర కవులు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=వెంకటేశ్వర పబ్లికేషన్సు
|చిరునామా=కడియం ,తూర్పు గోదావరి జిల్లా
|సంవత్సరం=1956
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
8d99ez95yjuucplv6xhlk3vy70ommgx
559687
559667
2026-06-15T13:54:38Z
Y Sai Kumar
7319
559687
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[బుద్ధ చరిత్రము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:తిరుపతి వేంకట కవులు|తిరుపతి వెంకటేశ్వర కవులు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=వెంకటేశ్వర పబ్లికేషన్సు
|చిరునామా=కడియం ,తూర్పు గోదావరి జిల్లా
|సంవత్సరం=1956
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
82xctmxw7a8frrfnmiwmvno7s6mtutv
పుట:AadarshaPrabhuvu.pdf/16
104
214225
559636
2026-06-15T12:51:43Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559636
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|౧. జననము, విద్యాభ్యాసము}}
వడుస ట్లొనర్చిరి. రాజుకాగలవారగుటచే శ్రీవారిని
గుఱ్ఱపుస్వారి మొదలగు సైనిక వ్యాయామములలో
సుశిక్షితుని జేయించిరి. వీనిలో సర్వసేనాధిపతిగా రగు
నవాబ్ అఫ్సరుల్ ముల్క్ - బహద్దూరుగారు వీరికి
శిక్షకులు. 'కాలముననుసరించి సామ్రాజ్యభాష నేర్వ
వలసి యుండెను. అందుచే 1899 సంవత్సరమున
శ్రీవారు 13 సంవత్సరముల వయసునందుండగా ఇగర్ట్౯ (Egerton) దొరవారిని వీరి కాంగ్లశిక్షకులుగా నియమించి యాంగ్ల విద్యాభ్యాసము చేయించిరి. తరు
వాత కొంతకాలము బర్నెటుదొరగారు శ్రీవారికి శిక్ష
కులుగా నుండిరి. వారు తరువాత నిజాంకాలేజి ప్రిన్సి
పాలుగా ఫింఛను తీసుకొనిరి. శ్రీవారు వీరికి మిక్కిలి
వినయము చూపుచుండెడివారు. అప్పుడప్పుడు శ్రీ
{{p|fs50}}1 గుఱ్ఱపుస్వారియందేగాక కత్తిసామునందును. రేరామేకులు పెకలించుట
యందును శ్రీవారి కసమానప్రావీణ్యము కలదు, గుఱ్ఱముపై స్వారీచేయుచు వ్రేలాడ
గట్టియున్న యొక గొట్టెను రెండు తునియలుగా చేయు శక్తియు, నొక్కొక్కమారు
రెండేసి రేరామేకులను పెరుకు సామర్ధ్యమును, వీరుచూపి, యత్యాశ్చర్యము
గొల్పిరి.</p>
{{right|Illustrated Weekly of India
18-9-38}}<noinclude><references/></noinclude>
8oabeuj731w2w1qmg92scn2rlwk9aju
559637
559636
2026-06-15T12:52:04Z
Aryapranathi06
7306
559637
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|౧. జననము, విద్యాభ్యాసము}}
వడుస ట్లొనర్చిరి. రాజుకాగలవారగుటచే శ్రీవారిని
గుఱ్ఱపుస్వారి మొదలగు సైనిక వ్యాయామములలో
సుశిక్షితుని జేయించిరి. వీనిలో సర్వసేనాధిపతిగా రగు
నవాబ్ అఫ్సరుల్ ముల్క్ - బహద్దూరుగారు వీరికి
శిక్షకులు. 'కాలముననుసరించి సామ్రాజ్యభాష నేర్వ
వలసి యుండెను. అందుచే 1899 సంవత్సరమున
శ్రీవారు 13 సంవత్సరముల వయసునందుండగా ఇగర్ట్౯ (Egerton) దొరవారిని వీరి కాంగ్లశిక్షకులుగా నియమించి యాంగ్ల విద్యాభ్యాసము చేయించిరి. తరు
వాత కొంతకాలము బర్నెటుదొరగారు శ్రీవారికి శిక్ష
కులుగా నుండిరి. వారు తరువాత నిజాంకాలేజి ప్రిన్సి
పాలుగా ఫింఛను తీసుకొనిరి. శ్రీవారు వీరికి మిక్కిలి
వినయము చూపుచుండెడివారు. అప్పుడప్పుడు శ్రీ
{{p|fs50}}1 గుఱ్ఱపుస్వారియందేగాక కత్తిసామునందును. రేరామేకులు పెకలించుట
యందును శ్రీవారి కసమానప్రావీణ్యము కలదు, గుఱ్ఱముపై స్వారీచేయుచు వ్రేలాడ
గట్టియున్న యొక గొట్టెను రెండు తునియలుగా చేయు శక్తియు, నొక్కొక్కమారు
రెండేసి రేరామేకులను పెరుకు సామర్ధ్యమును, వీరుచూపి, యత్యాశ్చర్యము
గొల్పిరి.</p>
{{right|Illustrated Weekly of India<br>
18-9-38}}<noinclude><references/></noinclude>
m9vc9khljrn4lun3zqejcx2xdwqcvfl
పుట:శశిరేఖాపరిణయము.pdf/38
104
214226
559638
2026-06-15T12:54:25Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559638
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>కురుకులవార్ధిసుధాకరుఁ, డరిగజకంఠీరవునకు నాత్మజుఁ డగుచుకోన్
హరికి నేనల్లుఁడ నై, సిరికి స్వలి నుండఁ జేయఁ జెల్లునె విధికిస్.</poem>|ref=108}}
{{Telugu poem|type=క.|lines=<poem>సుదతి హలాయఁధపుత్తిని, ముద మొదవఁగఁ బెండ్లియాడి మురిసెద ననుచున్
మది నే నొకటి దలంచినఁ, దుద దైవం ఒకటి తలఁప దుర్దశగాదే.</poem>|ref=109}}
{{Telugu poem|type=క.|lines=<poem>విరివింటివాని కేళికిఁ, బరిపరిమార్గములు నేను బ్రార్థించినచోఁ
ద్వరపడవల దని చెప్పిన, యురుకువఁ బెండ్లాడుభాగ్య మున్నదొ లేదో.</poem>|ref=110}}
{{Telugu poem|type=వ.|lines=<poem>కావున.</poem>|ref=111}}
{{Telugu poem|type=క.|lines=<poem>సతీ న న్నొకటిగఁ జేసే, హితు లెప రున్నా రటంచు నెంచుచు మరలన్
మతి నేఁ గోరినకోరిక, గతజలబంధనముగాక కాఁగలపనియే.</poem>|ref=112}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆనుచు వెండియు నతఁ డాత్మలో నిట్లరు బలరాముఁ డాడిన భాషణములు
తల్లిచే విని చాల తామసంబున నేను జననిఁ దోడ్కొని ఘోరవనముఁ జొరఁగ
బహుళమార్గాయాసభిరమున రాలేక నిచ్చట శయనించే నింక రేపు
నెటువలె నడుచు నే నేమిసేయుదుఁ బాండుతనయులు విహరించుపన మెఱుంగ</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నని తలంచుచు మరల ధైర్యంబుఁ బెంచి, తల్లి రక్షించుకొఱకునై ధనువుఁ బట్టి
గుణము దీర్చినఁ దద్ధ్వని కొండగుహల, బదులుధ్వను లిచ్చెఁ బక్షులు చెదరఁబఱచె.</poem>}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆరవము విని ఘటోత్కచుఁ, డీరసమున వినియు లేచి యీవనసీమనం
జేరిన విలుకాఁ డెంతటి, శూరుఁడో చని వాని నేను జూచెద ననుచున్.</poem>|ref=114}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియును.</poem>|ref=115}}
{{Telugu poem|type=క.|lines=<poem>సురయక్షసిద్ధసాధ్యులు, చొరఁ జాలరు నావనంబుఁ జొచ్చిన మీఁదన్
మరణము సిద్ధం బనుచుక్, శరములు చాపంబుఁ దాల్చి చయ్యన వెడలెన్.</poem>|ref=116}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆసమయంబున</poem>|ref=117}}
{{Telugu poem|type=క.|lines=<poem>పదఘట్టనమున పరుస౯, పెద పెద భూజంబు లన్ని బెట్టుగ ధరపై
నదరుచుఁ బడుగుల బేకఁగఁ, దుదమొద లని తో ఁపనీక దొడఁ గెను దఱుచై.</poem>|ref=118}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునం జని.</poem>|ref=119}}
{{Telugu poem|type=చ.|lines=<poem>చటులతరో గ్ర రోషమునఁ జక్షల నిప్పులు కుప్పలై పడన్
మటముట మండు పావకునిమాడ్కి ముఖద్యుతు లుప్పతిల్లఁగా
దిట మగుదంతమట్టనకు దిగ్గ జయూఢము బెగ్గడిల్లఁ దా
నటునిటుఁ జూచుచుం జనఁగ నర్జునసూనుఁడు చూచి యాత్మలోన్.</poem>|ref=120}}<noinclude><references/></noinclude>
nax5ixsoxep1a7p89zpwyrb5yjz730p
559756
559638
2026-06-15T21:31:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559756
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>కురుకులవార్ధిసుధాకరుఁ, డరిగజకంఠీరవునకు నాత్మజుఁ డగుచున్
హరికి న్మేనల్లుఁడ నై, సిరికి న్వెలి నుండఁ జేయఁ జెల్లునె విధికిన్.</poem>|ref=108}}
{{Telugu poem|type=క.|lines=<poem>సుదతి హలాయఁధపుత్త్రిని, ముద మొదవఁగఁ బెండ్లియాడి మురిసెద ననుచున్
మది నే నొకటి దలంచినఁ, దుద దైవం బొకటి తలఁప దుర్దశగాదే.</poem>|ref=109}}
{{Telugu poem|type=క.|lines=<poem>విరివింటివానికేళికిఁ, బరిపరిమార్గములు నేను బ్రార్థించినచోఁ
ద్వరపడవల దని చెప్పిన, యురుకుచఁ బెండ్లాడుభాగ్య మున్నదొ లేదో.</poem>|ref=110}}
{{Telugu poem|type=వ.|lines=<poem>కావున.</poem>|ref=111}}
{{Telugu poem|type=క.|lines=<poem>సతి న న్నొకటిగఁ జేసే, హితు లెవ రున్నా రటంచు నెంచుచు మరలన్
మతి నేఁ గోరినకోరిక, గతజలబంధనముగాక కాఁగలపనియే.</poem>|ref=112}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అనుచు వెండియు నతఁ డాత్మలో నిట్లను బలరాముఁ డాడినభాషణములు
తల్లిచే విని చాల తామసంబున నేను జననిఁ దోడ్కొని ఘోరవనముఁ జొరఁగ
బహుళమార్గాయాసభరమున రాలేక నిచ్చట శయనించె నింక రేపు
నెటువలె నడుచు నే నేమి సేయుదుఁ బాండుతనయులు విహరించువన మెఱుంగ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నని తలంచుచు మరల ధైర్యంబుఁ బెంచి, తల్లి రక్షించుకొఱకునై ధనువుఁ బట్టి
గుణము దీర్చినఁ దద్ధ్వని కొండగుహల, బదులుధ్వను లిచ్చెఁ బక్షులు చెదరఁబఱచె.</poem>|ref=113}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆరవము విని ఘటోత్కచుఁ, డీరసమున వినియు లేచి యీవనసీమం
జేరిన విలుకాఁ డెంతటి, శూరుఁడొ చని వాని నేను జూచెద ననుచున్.</poem>|ref=114}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియును.</poem>|ref=115}}
{{Telugu poem|type=క.|lines=<poem>సురయక్షసిద్ధసాధ్యులు, చొరఁ జాలరు నావనంబుఁ జొచ్చినమీఁదన్
మరణము సిద్ధం బనుచున్, శరములు చాపంబుఁ దాల్చి చయ్యన వెడలెన్.</poem>|ref=116}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆసమయంబున</poem>|ref=117}}
{{Telugu poem|type=క.|lines=<poem>పదఘట్టనమున వరుసన్, పెదపెదభూజంబు లన్ని బెట్టుగ ధరపై
నదరుచుఁ బడుగుంబేకఁగఁ, దుదమొద లని తోఁపనీక దొడఁగెను దఱుచై.</poem>|ref=118}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబునం జని.</poem>|ref=119}}
{{Telugu poem|type=చ.|lines=<poem>చటులతరోగ్రరోషమునఁ జక్షుల నిప్పులు కుప్పలై పడన్
మటమట మండు పావకునిమాడ్కి ముఖద్యుతు లుప్పతిల్లఁగా
దిట మగుదంతఘట్టనకు దిగ్గజయూథము బెగ్గడిల్లఁ దా
నటునిటుఁ జూచుచుం జనఁగ నర్జునసూనుఁడు చూచి యాత్మలోన్.</poem>|ref=120}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>కాటుకకొండకైవడినిఁ గాంతులు గ్రక్కెడు వీనిదేహముం
దూఁటులు గట్టఁగాఁ గఱకుతూఁపుల నేసెద నంచుఁ గార్ముకం</poem>|ref=}}<noinclude><references/></noinclude>
lsvjasha9i6ljs2izj5ll12bd9d29as
పుట:AadarshaPrabhuvu.pdf/17
104
214227
559641
2026-06-15T12:54:42Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559641
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|ఆదర్శప్రభువు}}
రిచ్చు నుపన్యాసముల వలన శ్రీవారికెట్టి నిశితమైన
యాంగ్ల పాండిత్యమున్నదో స్పష్టపడగలదు. ఈమఇగర్ట౯
(Egerton) దొరవారింతకు పూర్వ మనేక రాజకుమా
రులను తరిబీదుచేసిరి. ఇట్టివారిక్రింద మ౹౹ఘ॥వ॥ శ్రీవారు
విశాలమగు జ్ఞానము నార్జించిరి. ఈ సర్వతోముఖమైన
విజ్ఞానమే తరువాతి సంవత్సరములలో శ్రీవారి నాదర్శ
రాజ సార్వభౌముని చేసినది. ఇదిగాక శ్రీవారు చిన్న
తనముననే రాష్ట్రముయొక్క సర్వభాగములను సంచార
మొనర్చి పరిస్థితులను స్వయముగా కనుగొను నవకా
శము కల్పింపబడినది. మరియు శ్రీవారి తండ్రిగారు
శ్రీవారిని 1903 సంవత్సరమున ఢిల్లీలో జరిగిన దర్బారు
నకు గొనిపోయిరి. అప్పుడు శ్రీవారు నిజాంరాష్ట్రము
యొక్కయు, తత్పరిపాలకుల యొక్కయు, గొప్ప తన
మును కనుగొనుటయేగాక సోదర సంస్థానాధీశులతో
నెట్లు మెలగవలయునో తెలిసికొనిరి. ఈ యనుభవ
మంతయు తరువాత రాజ్యము చేయుటలో సాయపడి
రాష్ట్రమిప్పుడున్న యుచ్చస్థితికి వచ్చుటకు కారణ
మాయెను. -భావికాలమున రాజు కావలసిన వారి కెట్టి
విజ్ఞాన మవసరమో యట్టివిజ్ఞానము శ్రీవారి కలవడెను.
రాష్ట్ర భాగ్యమున కింకేమి కావలెను!<noinclude><references/></noinclude>
o79lva4sf4bw091ccwdf1weg5xtluyy
559642
559641
2026-06-15T12:55:19Z
Aryapranathi06
7306
559642
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{left|{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>}}
రిచ్చు నుపన్యాసముల వలన శ్రీవారికెట్టి నిశితమైన
యాంగ్ల పాండిత్యమున్నదో స్పష్టపడగలదు. ఈమఇగర్ట౯
(Egerton) దొరవారింతకు పూర్వ మనేక రాజకుమా
రులను తరిబీదుచేసిరి. ఇట్టివారిక్రింద మ౹౹ఘ॥వ॥ శ్రీవారు
విశాలమగు జ్ఞానము నార్జించిరి. ఈ సర్వతోముఖమైన
విజ్ఞానమే తరువాతి సంవత్సరములలో శ్రీవారి నాదర్శ
రాజ సార్వభౌముని చేసినది. ఇదిగాక శ్రీవారు చిన్న
తనముననే రాష్ట్రముయొక్క సర్వభాగములను సంచార
మొనర్చి పరిస్థితులను స్వయముగా కనుగొను నవకా
శము కల్పింపబడినది. మరియు శ్రీవారి తండ్రిగారు
శ్రీవారిని 1903 సంవత్సరమున ఢిల్లీలో జరిగిన దర్బారు
నకు గొనిపోయిరి. అప్పుడు శ్రీవారు నిజాంరాష్ట్రము
యొక్కయు, తత్పరిపాలకుల యొక్కయు, గొప్ప తన
మును కనుగొనుటయేగాక సోదర సంస్థానాధీశులతో
నెట్లు మెలగవలయునో తెలిసికొనిరి. ఈ యనుభవ
మంతయు తరువాత రాజ్యము చేయుటలో సాయపడి
రాష్ట్రమిప్పుడున్న యుచ్చస్థితికి వచ్చుటకు కారణ
మాయెను. -భావికాలమున రాజు కావలసిన వారి కెట్టి
విజ్ఞాన మవసరమో యట్టివిజ్ఞానము శ్రీవారి కలవడెను.
రాష్ట్ర భాగ్యమున కింకేమి కావలెను!<noinclude><references/></noinclude>
s48n715x7u0ed160376pgg3gh3zi1vk
559643
559642
2026-06-15T12:55:45Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559643
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{left|{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>}}
రిచ్చు నుపన్యాసముల వలన శ్రీవారికెట్టి నిశితమైన
యాంగ్ల పాండిత్యమున్నదో స్పష్టపడగలదు. ఈమఇగర్ట౯
(Egerton) దొరవారింతకు పూర్వ మనేక రాజకుమా
రులను తరిబీదుచేసిరి. ఇట్టివారిక్రింద మ౹౹ఘ॥వ॥ శ్రీవారు
విశాలమగు జ్ఞానము నార్జించిరి. ఈ సర్వతోముఖమైన
విజ్ఞానమే తరువాతి సంవత్సరములలో శ్రీవారి నాదర్శ
రాజ సార్వభౌముని చేసినది. ఇదిగాక శ్రీవారు చిన్న
తనముననే రాష్ట్రముయొక్క సర్వభాగములను సంచార
మొనర్చి పరిస్థితులను స్వయముగా కనుగొను నవకా
శము కల్పింపబడినది. మరియు శ్రీవారి తండ్రిగారు
శ్రీవారిని 1903 సంవత్సరమున ఢిల్లీలో జరిగిన దర్బారు
నకు గొనిపోయిరి. అప్పుడు శ్రీవారు నిజాంరాష్ట్రము
యొక్కయు, తత్పరిపాలకుల యొక్కయు, గొప్ప తన
మును కనుగొనుటయేగాక సోదర సంస్థానాధీశులతో
నెట్లు మెలగవలయునో తెలిసికొనిరి. ఈ యనుభవ
మంతయు తరువాత రాజ్యము చేయుటలో సాయపడి
రాష్ట్రమిప్పుడున్న యుచ్చస్థితికి వచ్చుటకు కారణ
మాయెను. -భావికాలమున రాజు కావలసిన వారి కెట్టి
విజ్ఞాన మవసరమో యట్టివిజ్ఞానము శ్రీవారి కలవడెను.
రాష్ట్ర భాగ్యమున కింకేమి కావలెను!<noinclude><references/></noinclude>
pujzddfaq1qr7uch7252jhth9lt4bx9
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/213
104
214228
559644
2026-06-15T12:56:57Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559644
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|207}}</noinclude>కాని యొకరితో నొకరికి సంబంధము లేకయే యుదర పోషణాదిక్రియలు చేసికొనుచుండును. ఇట్టివి తమ జీవనక్రియలు సతంత్రముగా జరుపుకొనుచున్నను, ఒక్కచోట గలసి యున్నందున వీని సంఘమునుజూచి శత్రువులు వీనిపైకి సాహసించి రానేరవు. ఇతర ఆధిభౌతిక బాధలును వీనిని అంతగా బాధింపవు. నాచు, ప్రవాళ కీటకములు గుంపులుగూడి యొక్కచో నున్నందున నీళ్ళకుఁ గొట్టుకొనిపోక నిలచియుండును. అందుకే 'సంఘే శక్తి' అను వచనము పుట్టినది. స్పాంజు కీటకములుగూడ పై కీటకముల వంటివే. ఈజీవులు
వృక్షజాతిలోనివా లేక జంతుజాతిలోనివా యని కొంత కాలము వఱకు శాస్త్రజ్ఞులకు సంశయ ముండెను. కాని అవి యేకకణము లయిన యాది జంతువులలోనివే యని యిప్పుడు నిశ్చయమైనది. బాజారులో దొరకు స్పాంజు, యిట్టి కీటకముల యిల్లు. ఈ కీటకములు తమ జీవనవ్యాపారములన్నియు స్వతంత్రముగాఁ జేసికొనుచున్నప్పటికి, అన్నిటికిఁ గావలసిన నీటిని తమ యింటిలోనికిఁ దెచ్చుటయు, అక్కరలేని నీటిని వెలుపలకుఁ బంపుటయు అనుక్రియల నన్నియుఁ గలసి చేయును.
ఒక కణము అనేక కణములుగాఁ జీలి యీ కణములన్నియు నొకటితో నొకటికి సంబంధము లేకుండ విడివిడిగా నున్నయెడల ఎన్నటికిని హెచ్చు తరగతి జీవులు పుట్టియుండవు. కొంతకాలమునకు, ఒక కణము చీలి యేర్పడిన యనేక కణములు విడిపోయి, స్వతంత్రముగా, నుండుట మాని, కలసి యొకటిగానుండును. ఇట్లుండుటయేగాక జీవనమునకై కావలసిన వ్యాపారములన్నియు అన్ని కణములు చేయుట మాని, కొన్ని కణములు కొన్ని వ్యాపారములును. మఱికొన్ని కణములు మఱికొన్ని వ్యాపారములును చేయఁబూని యీ కణములన్నియుఁగూడి యొక్క జీవియగును. వెలుపలనున్న కణములు శీతోష్ణముల యెడ తెగని సహవాసముచే గట్టివై వెలుపలిచర్మముగ నేర్పడును. లోనివి మృదువుగ నుండును జీవినమునకుఁ గావలసిన పదార్థములను వెలుపలనుండి సంపాదించుపని కొన్ని కణములపై బడినందున నవి క్రమ<noinclude><references/></noinclude>
0iss31plbb5l8h6y5i69eapaeinjk86
పుట:AadarshaPrabhuvu.pdf/18
104
214229
559645
2026-06-15T12:58:40Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559645
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|{{p|fs100}}౨. రాజ్యాధిపత్యము</p>}}
శ్రీవారు 1911 సంవత్సరమున ఆగష్టు 29 తేదీన
పట్టాభిషిక్తులైరి. శ్రీవారు రాజ్యమునకు వచ్చునప్పటికీ
రాజ్యముయొక్క పరిస్థితు లెట్లున్నవో కొంచెముగ ముచ్చ
టింతును. శ్రీవారి తండ్రిగారుగు మ॥ ఘ॥ వ॥ మహబూ
బల్లీపాషాగారు ఋషితుల్యులని మున్నే విన్నవించి
యుంటిని. వారియొక్క దయార్ద్రత్వము, సౌమనస్యము,
సౌజన్యమును పురస్కరించి రాజ్యాంగమున నినేకము
లగు లోటులుండుట తటస్థించెను. తప్పులొనర్చినవారిని
శిక్షించుటకు వారు వెనుకంజ వేసి కఠిన చర్యలను తీసు
కొనకపోవుటచే నవియన్నియు నట్లే నిలచిపోయెను.
జిల్లాలోనియు, తాలూకాలోనియు కచ్చేరీలలో దాదాపు
ప్రతి యుద్యోగియు లంచములు తీసుకొనుచుండెను.
ఈలోపము ప్రభుత్వమున నున్నతోద్యోగులలో కూడ
నుండెను. పోలీసు శాఖను గూర్చి వేరుగా చెప్పనవ
సరము లేదు. చిన్న చిన్న యుద్యోగులుకూడ లంధి
కారులవలె కాలము గడుపుచుండిరి. తహసీల్దారులు తమ
తహసీళ్లు తమ జాగీర్లేనని కాలము గడుపుచుండిరి. శిస్తు<noinclude><references/></noinclude>
8nsx41w7l1r93d4led3igabmwn07pfx
559646
559645
2026-06-15T12:59:28Z
Aryapranathi06
7306
559646
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|{{p|fs100}}{{p|ac|fwb}}౨. రాజ్యాధిపత్యము</p></p>}}
శ్రీవారు 1911 సంవత్సరమున ఆగష్టు 29 తేదీన
పట్టాభిషిక్తులైరి. శ్రీవారు రాజ్యమునకు వచ్చునప్పటికీ
రాజ్యముయొక్క పరిస్థితు లెట్లున్నవో కొంచెముగ ముచ్చ
టింతును. శ్రీవారి తండ్రిగారుగు మ॥ ఘ॥ వ॥ మహబూ
బల్లీపాషాగారు ఋషితుల్యులని మున్నే విన్నవించి
యుంటిని. వారియొక్క దయార్ద్రత్వము, సౌమనస్యము,
సౌజన్యమును పురస్కరించి రాజ్యాంగమున నినేకము
లగు లోటులుండుట తటస్థించెను. తప్పులొనర్చినవారిని
శిక్షించుటకు వారు వెనుకంజ వేసి కఠిన చర్యలను తీసు
కొనకపోవుటచే నవియన్నియు నట్లే నిలచిపోయెను.
జిల్లాలోనియు, తాలూకాలోనియు కచ్చేరీలలో దాదాపు
ప్రతి యుద్యోగియు లంచములు తీసుకొనుచుండెను.
ఈలోపము ప్రభుత్వమున నున్నతోద్యోగులలో కూడ
నుండెను. పోలీసు శాఖను గూర్చి వేరుగా చెప్పనవ
సరము లేదు. చిన్న చిన్న యుద్యోగులుకూడ లంధి
కారులవలె కాలము గడుపుచుండిరి. తహసీల్దారులు తమ
తహసీళ్లు తమ జాగీర్లేనని కాలము గడుపుచుండిరి. శిస్తు<noinclude><references/></noinclude>
e2kbwf6fy3oygwzp5qm5pnpahn18q8j
పుట:AadarshaPrabhuvu.pdf/19
104
214230
559648
2026-06-15T13:02:26Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559648
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>
వసూళ్లు బకాయాలు మిక్కుటముగ మిగిలియుండెను.
రివిన్యూ పోలీసుద్యోగస్థులు ప్రజలను మిక్కిలి పీడించు
చుండిరి. శాఖలన్ని టియందును కృత్యములన్నియు సరిగా
నిర్వర్తింప బడకుండెను. సంవత్సరములైనను విషయ
ములు తేలకుండెను. పనియుండివచ్చునా రెడ తెగకుండ
కచ్చేరీలచుట్టును తిరుగవలసి వచ్చుచుండెను. ఉద్యో
గస్థులు తమవిధులను న్యాయముగా నిర్వర్తించుట
యరుదుగా నుండెను. బాగీర్దార్లందరు నాడంబరములను
పెంచుకొనుచు, వృధాధనవ్యయము చేయుచుండిరి.
వారి జాగీర్లన్నియు ఋణదాతల హస్తగతము లై
యుండెను. భోగలాలస యెక్కువగుట చే వారట్లు చేయక
తప్పినది కాదు. ఈ లోపము లన్నియు గుమిగూడి
రాష్ట్రమునంతను పీడించుటతోపాటు రాజ్యముయొక్క
బొక్కసము నిండుగా లేకుండెను. 'శ్రీమహబూబల్లీ<br><br><br>
{{p|ac|fwb}}1" They resorted to intrigue and machinations, not
only to save themselves, but also to further their ambi-
tions, and these conditions prevailed right up to the end
of the Regime of H. E. H. The late Nizam. "</p>
{{p|ac|fwb}}{{right|- 'My Life' P. 191.<br>
"And the behaviour of these men might be likened
</p>}}<noinclude><references/></noinclude>
20xeramct2rroitp1bqtbh5kwmzwxul
పుట:AadarshaPrabhuvu.pdf/20
104
214231
559650
2026-06-15T13:06:46Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559650
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|{{p|ac|fwb}}౨. రాజ్యాధిపత్యము</p>
}}పాషాగారు వారి కాలములోనే
లోపములను కొంచెముగ గమనించి సమర్థుడగు సర్ జార్జి కాస౯
వాకర్ గారిని మంత్రిగా నియమించిరి. ఈయన యార్థిక
పరిస్థితులను చక్క బెట్టుటకు పూనుకొనెను. ఈ నైజాము
గారి కాలముననే యొక భావ్యభివృద్ధికరమగు విషయము
1905 సంవత్సర మక్టోబరు నెలలో శ్రీ నైజాంగా రిండియాగవర్న మెంటును కోరగా, శ్రీహైదరి యను నుద్యోగిని వారియ్యగా, వారిని హైద్రాబాదున
నియమించిరి. అప్పట్లో యువకుడగు నీయుద్యోగిచే
నిజాంరాష్ట్ర మెంత యభివృద్ధికి రాగలదో యెవ్వరును
చెప్పగలవారు లేరైరి. ఈకాలమున స్వల్పముగా కనపడు
విషయములు భావికాలమున నెట్లుపకరించి రాష్ట్రము
యొక్క సర్వతోముఖాభివృద్ధికి కారణమయ్యెనో ముందు
తెలుసుకొనగలము. రాజు దానకర్ణుడైన బొక్కసమున
మిక్కుటముగా రొక్కమెట్లుండును? చిన్న తనమున
రాజ్యమునకు వచ్చినను మ॥ మ॥ వ॥ శ్రీప్రభువువారీ
<br><br>
{{p|ac|fwb}}to cartels without leads, who, stretching out their necks,
anapped in all directions. "</p>
{{right|{{p|ac|fwb}}_Ibid 259.</p>}}<noinclude><references/></noinclude>
dku1f0r4p3iy9pq1s0tg921spplb76l
559651
559650
2026-06-15T13:08:04Z
Aryapranathi06
7306
559651
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|{{p|ac|fwb}}౨. రాజ్యాధిపత్యము</p>
}}పాషాగారు వారి కాలములోనే
లోపములను కొంచెముగ గమనించి సమర్థుడగు సర్ జార్జి కాస౯
వాకర్ గారిని మంత్రిగా నియమించిరి. ఈయన యార్థిక
పరిస్థితులను చక్క బెట్టుటకు పూనుకొనెను. ఈ నైజాము
గారి కాలముననే యొక భావ్యభివృద్ధికరమగు విషయము
1905 సంవత్సర మక్టోబరు నెలలో శ్రీ నైజాంగా రిండియాగవర్న మెంటును కోరగా, శ్రీహైదరి యను నుద్యోగిని వారియ్యగా, వారిని హైద్రాబాదున
నియమించిరి. అప్పట్లో యువకుడగు నీయుద్యోగిచే
నిజాంరాష్ట్ర మెంత యభివృద్ధికి రాగలదో యెవ్వరును
చెప్పగలవారు లేరైరి. ఈకాలమున స్వల్పముగా కనపడు
విషయములు భావికాలమున నెట్లుపకరించి రాష్ట్రము
యొక్క సర్వతోముఖాభివృద్ధికి కారణమయ్యెనో ముందు
తెలుసుకొనగలము. రాజు దానకర్ణుడైన బొక్కసమున
మిక్కుటముగా రొక్కమెట్లుండును? చిన్న తనమున
రాజ్యమునకు వచ్చినను మ॥ మ॥ వ॥ శ్రీప్రభువువారీ
<br><br>
{{p|ac|fwb}}to cartels without leads, who, stretching out their necks,
anapped in all directions. "</p>
{{p|ac|fwb}}{{right|_Ibid 259.</p>}}<noinclude><references/></noinclude>
8tc4fa76g4pl8bja2uad6ll9sw8tjd0
559653
559651
2026-06-15T13:09:09Z
Aryapranathi06
7306
559653
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|{{p|ac|fwb}}౨. రాజ్యాధిపత్యము</p>
}}పాషాగారు వారి కాలములోనే
లోపములను కొంచెముగ గమనించి సమర్థుడగు సర్ జార్జి కాస౯
వాకర్ గారిని మంత్రిగా నియమించిరి. ఈయన యార్థిక
పరిస్థితులను చక్క బెట్టుటకు పూనుకొనెను. ఈ నైజాము
గారి కాలముననే యొక భావ్యభివృద్ధికరమగు విషయము
1905 సంవత్సర మక్టోబరు నెలలో శ్రీ నైజాంగా రిండియాగవర్న మెంటును కోరగా, శ్రీహైదరి యను నుద్యోగిని వారియ్యగా, వారిని హైద్రాబాదున
నియమించిరి. అప్పట్లో యువకుడగు నీయుద్యోగిచే
నిజాంరాష్ట్ర మెంత యభివృద్ధికి రాగలదో యెవ్వరును
చెప్పగలవారు లేరైరి. ఈకాలమున స్వల్పముగా కనపడు
విషయములు భావికాలమున నెట్లుపకరించి రాష్ట్రము
యొక్క సర్వతోముఖాభివృద్ధికి కారణమయ్యెనో ముందు
తెలుసుకొనగలము. రాజు దానకర్ణుడైన బొక్కసమున
మిక్కుటముగా రొక్కమెట్లుండును? చిన్న తనమున
రాజ్యమునకు వచ్చినను మ॥ మ॥ వ॥ శ్రీప్రభువువారీ
<br><br>
{{p|ac|fwb}}to camels without leads, who, stretching out their necks,
anapped in all directions. "</p>
{{p|ac|fwb}}{{right|_Ibid 259.</p>}}<noinclude><references/></noinclude>
jm0q61um2059awoalk7ektqnu2wk11l
559655
559653
2026-06-15T13:10:18Z
Aryapranathi06
7306
559655
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|{{p|ac|fwb}}౨. రాజ్యాధిపత్యము</p>
}}పాషాగారు వారి కాలములోనే లోపములను కొంచెముగ గమనించి సమర్థుడగు సర్ జార్జి కాస౯ వాకర్ గారిని మంత్రిగా నియమించిరి. ఈయన యార్థిక పరిస్థితులను చక్క బెట్టుటకు పూనుకొనెను. ఈ నైజాము గారి కాలముననే యొక భావ్యభివృద్ధికరమగు విషయము 1905 సంవత్సర మక్టోబరు నెలలో శ్రీ నైజాంగా రిండియాగవర్న మెంటును కోరగా, శ్రీహైదరి యను నుద్యోగిని వారియ్యగా, వారిని హైద్రాబాదున నియమించిరి. అప్పట్లో యువకుడగు నీయుద్యోగిచే నిజాంరాష్ట్ర మెంత యభివృద్ధికి రాగలదో యెవ్వరును చెప్పగలవారు లేరైరి. ఈకాలమున స్వల్పముగా కనపడు విషయములు భావికాలమున నెట్లుపకరించి రాష్ట్రము యొక్క సర్వతోముఖాభివృద్ధికి కారణమయ్యెనో ముందు తెలుసుకొనగలము. రాజు దానకర్ణుడైన బొక్కసమున మిక్కుటముగా రొక్కమెట్లుండును? చిన్న తనమున
రాజ్యమునకు వచ్చినను మ॥ మ॥ వ॥ శ్రీప్రభువువారీ
<br><br>
{{p|ac|fwb}}to camels without leads, who, stretching out their necks,
anapped in all directions. "</p>
{{p|ac|fwb}}{{right|_Ibid 259.</p>}}<noinclude><references/></noinclude>
4nwqsd73yjjcug5pc2k65vsguj3d845
559656
559655
2026-06-15T13:10:40Z
Aryapranathi06
7306
559656
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|{{p|ac|fwb}}౨. రాజ్యాధిపత్యము</p>
}}పాషాగారు వారి కాలములోనే లోపములను కొంచెముగ గమనించి సమర్థుడగు సర్ జార్జి కాస౯ వాకర్ గారిని మంత్రిగా నియమించిరి. ఈయన యార్థిక పరిస్థితులను చక్క బెట్టుటకు పూనుకొనెను. ఈ నైజాము గారి కాలముననే యొక భావ్యభివృద్ధికరమగు విషయము 1905 సంవత్సర మక్టోబరు నెలలో శ్రీ నైజాంగా రిండియాగవర్న మెంటును కోరగా, శ్రీహైదరి యను నుద్యోగిని వారియ్యగా, వారిని హైద్రాబాదున నియమించిరి. అప్పట్లో యువకుడగు నీయుద్యోగిచే నిజాంరాష్ట్ర మెంత యభివృద్ధికి రాగలదో యెవ్వరును చెప్పగలవారు లేరైరి. ఈకాలమున స్వల్పముగా కనపడు విషయములు భావికాలమున నెట్లుపకరించి రాష్ట్రము యొక్క సర్వతోముఖాభివృద్ధికి కారణమయ్యెనో ముందు తెలుసుకొనగలము. రాజు దానకర్ణుడైన బొక్కసమున మిక్కుటముగా రొక్కమెట్లుండును? చిన్న తనమున రాజ్యమునకు వచ్చినను మ॥ మ॥ వ॥ శ్రీప్రభువువారీ
<br><br>
{{p|ac|fwb}}to camels without leads, who, stretching out their necks,
anapped in all directions. "</p>
{{p|ac|fwb}}{{right|_Ibid 259.</p>}}<noinclude><references/></noinclude>
5ew6bozm9ekp4zec2ux4d3atnwhnd1a
పుట:శశిరేఖాపరిణయము.pdf/39
104
214232
559652
2026-06-15T13:08:09Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559652
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>కాటుకకొండ వడినిఁ గాంతులు గ్రక్కెడు వీనిదేహముం
దూఁటులం గట్టఁగాఁ గఱకుతూఁపులు సేసెద నందుఁ గార్ముకం
బేటుకుఁ బాటుగా గుణము నెక్కిడి యోచనసేసి బుద్ధికిన్
దీటగు బాణము ద్దోడిగి ధీరత నుండఁగ నంతలోపలన్.</poem>|ref=121}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>హైడింబుఁ డత్యుగ్ర గ్ర హంబున వచ్చి యర్జునుసుతుఁ జూచి యాడుఁ గరచి
యెవ్వఁడురా నీవు యివ్వనభూమికి అర్ధరాత్రంబున నరుగుచెంచు
టరయ దైవంబు నా కాహారమునకు నై తిన్న గాఁ బంపిన ట్లున్న దీపుడు
కొమరొప్ప వంటయి ల్కుందేలు సొచ్చిన చందనూయె నటంచు మందలించి</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సింహ మపలీల నిద్రింపఁ జేరి గోలఁ, గొట్టువిధమునఁ గోపంబు పుట్టె నాదు
బారిఁ జొచ్చితివిఁక నీవు బ్రతుకఁగలవె, మిడుకమిడుకంగ మ్రింగెదఁ గడుపునిండ.</poem>}}
{{Telugu poem|type=క.|lines=<poem>కయ్యము సేయక మానవుఁ, డియ్యెడకు స్వచ్చి మరల నేఁగం గలఁడే
వెయ్యేల నాదు శరములు, చయ్యన భక్షించు ననిన సౌభద్రుండున్.</poem>|ref=123}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సటలు పెరికినసింగంబుచందమునను, గనుబోమలురెండు నుదుటిపైఁగంటువడఁగఁ
బుచ్ఛమునుద్రొక్క భుజగంబుఁబోలెనుండి, చురుకుచూపుల హైడింబుఁజూచిపలీకె.</poem>}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>రాక్షసాధమ నన్ను భక్షింతు నని పల్కు జల్లికూతలు మానిఃవిల్లుఁబూని
కయ్య మొనర్పు నీదయ్యంబు మాన్పెద నని పల్కి వెండియు నతనిఁ జూచి
భద్రగజం బెంత పంచాననం బెంత వరపర్వతం బెంత వజ్ర మెంత
గొప్ప కొంచెము లెన్నుకొన నేల నిను మ్రింగుశరములు గణంతింపఁ జాలఁ గలవు</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కాలయాపన మిఁక నేల కయ్య మొసఁగు, మనిన హెడింబుఁ డుగ్రుఁడైయాడుఁ గరచి
చాప మెక్కిడి పొది నున్నశరము లంది, చాఁకె నభిమన్యు పై యాతుధానుఁడపుడు.</poem>}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని చెప్పి వైశంపాయనుండు వెండియు నిట్లనియె.</poem>|ref=126}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అద్దమరేయి వారిరువు రన్నయుఁ దమ్ముఁ డటంచుఁ దోఁచకన్
దద్దయు కోపము న్బొడమఁ దాగ్కొని విక్రమ మొక్క తీరుగాఁ
బెద్దయుఁబ్రొద్దు పోరునెడ భీమతనూజుఁడు పార్థుపుత్తుతో
నద్దిర నీపరాక్రమము సద్భుత మంచుఁ దలంచి చాపమున్.</poem>|ref=127}}
{{Telugu poem|type=క.|lines=<poem>దీటుచుఁ గడు వేగంబుల, మూఁడును మఱి నాల్గు సైదు ముప్పదిరెండున్
వాఁడిశరంబుల నేసిన, వాఁ డొక బాణంబుఁ బఱపి వడిఁ ద్రుంచుటయున్.</poem>|ref=128}}
{{Telugu poem|type=క.|lines=<poem>దాన న్కోపం బొదవఁగ, దానవుఁ డభిమన్యుమీఁద దశమార్గణము
లేనం దూరఁగ సేసిన, దానవుపై నేనె నతఁడు దశవిశిఖములన్.</poem>|ref=129}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇ ట్లేసిన</poem>|ref=130}}
{{Telugu poem|type=క.|lines=<poem>వడనుండిసూనుఁడు కన్బొమ, ముడివడఁగోపంబు మదిని ముప్పిరిగొనఁగా
నెడనెడ సౌభద్రునిపైఁ, గడువడిఁ బదియాఱునూరుకాండము లేసెస్.</poem>|ref=131}}<noinclude><references/></noinclude>
err8g61zmqqjphxmna6a56635useupv
559758
559652
2026-06-15T21:40:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559758
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బేటుకుఁ బాటుగా గుణము నెక్కిడి యోచనసేసి బుద్ధికిన్
దీటగు బాణము ల్దొడిగి ధీరత నుండఁగ నంతలోపలన్.</poem>|ref=121}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>హైడింబుఁ డత్యుగ్రయాగ్రహంబున వచ్చి యర్జునుసుతుఁ జూచి యాడుఁ గరచి
యెవ్వఁడురా నీవు యివ్వనభూమికి నర్ధరాత్రంబున నరుగుదెంచు
టరయ దైవంబు నా కాహారమునకు నై తిన్నగాఁ బంపిన ట్లున్న దిపుడు
కొమరొప్ప వంటయి ల్కుందేలు సొచ్చిన చందమాయె నటంచు మందలించి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సింహ మవలీల నిద్రింపఁ జేరి గోలఁ, గొట్టువిధమునఁ గోపంబు పుట్టె నాదు
బారిఁ జొచ్చితి విఁక నీవు బ్రతుకఁగలవె, మిడుకమిడుకంగ మ్రింగెదఁ గడుపునిండ.</poem>|ref=122}}
{{Telugu poem|type=క.|lines=<poem>కయ్యము సేయక మానవుఁ, డియ్యెడకు న్వచ్చి మరల నేఁగం గలఁడే
వెయ్యేల నాదుశరములు, చయ్యన భక్షించు ననిన సౌభద్రుండున్.</poem>|ref=123}}
{{Telugu poem|type=తే.|lines=<poem>సటలు పెరికినసింగంబుచందమునను, గనుబొమలురెండు నుదుటిపైఁ గంటువడఁగఁ
బుచ్ఛమును ద్రొక్క భుజగంబుఁబోలెనుండి, చురుకుచూపుల హైడింబుఁ జూచి పలికె.</poem>|ref=124}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>రాక్షసాధమ నన్ను భక్షింతు నని పల్కు జల్లికూతలు మానిఁ విల్లుఁ బూని
కయ్య మొనర్పు నీదయ్యంబు మాన్పెద నని పల్కి వెండియు నతనిఁ జూచి
భద్రగజం బెంత పంచాననం బెంత వరపర్వతం బెంత వజ్ర మెంత
గొప్ప కొంచెము లెన్నుకొన నేల నిను మ్రింగుశరములు గణుతింపఁ జాలఁ గలవు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కాలయాపన మిఁక నేల కయ్య మొసఁగు, మనిన హైడింబుఁ డుగ్రుఁడై యౌడుఁ గరచి
చాప మెక్కిడి పొది నున్నశరము లంది, దాఁకె నభిమన్యుపై యాతుధానుఁ డపుడు.</poem>|ref=125}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని చెప్పి వైశంపాయనుండు వెండియు నిట్లనియె.</poem>|ref=126}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>అద్దమరేయి వారిరువు రన్నయుఁ దమ్ముఁ డటంచుఁ దోఁచకన్
దద్దయు కోపము న్బొడమఁ దార్కొని విక్రమ మొక్కతీరుగాఁ
బెద్దయుఁబ్రొద్దు పోరునెడ భీమతనూజుఁడు పార్థుపుత్త్రుతో
నద్దిర నీపరాక్రమము నద్భుత మంచుఁ దలంచి చాపమున్.</poem>|ref=127}}
{{Telugu poem|type=క.|lines=<poem>దీటుచుఁ గడువేగంబుల, మూఁడును మఱి నాల్గు నైదు ముప్పదిరెండున్
వాఁడిశరంబుల నేసిన, వాఁ డొకబాణంబుఁ బఱపి వడిఁ ద్రుంచుటయున్.</poem>|ref=128}}
{{Telugu poem|type=క.|lines=<poem>దాన న్కోపం బొదవఁగ, దానవుఁ డభిమన్యుమీఁద దశమార్గణము
ల్మేనం దూరఁగ సేసిన, దానవుపై నేసె నతఁడు దశవిశిఖములన్.</poem>|ref=129}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇ ట్లేసిన.</poem>|ref=130}}
{{Telugu poem|type=క.|lines=<poem>వడముడిసూనుఁడు కన్బొమ, ముడివడఁ గోపంబు మదిని ముప్పిరిగొనఁగా
నెడనెడ సౌభద్రునిపైఁ, గడువడిఁ బదియాఱునూరుకాండము లేసెన్.</poem>|ref=131}}<noinclude><references/></noinclude>
6sy9ywvnmzcje5100u7p6czhhiew7zv
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/214
104
214233
559654
2026-06-15T13:09:24Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559654
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|208|శాస్త్రవిషయములు|}}</noinclude>క్రమముగా హస్తాది కర్మేంద్రియములుగా మారును. లోని కణములకు ఆహారము జీర్ణముచేయు పని ప్రాప్తించుటచే నవి జీర్ణకోశాది యాకారములను దాల్చును. ఇట్లు భిన్నభిన్న కణములలో శ్రమవిభాగము
(Division of labour) గలిగి జీవులకు హెచ్చుతరగతి ప్రాప్తమగును.
మానవుల సంఘములకును, జీవులకును పోలిక యిదివరకు మనము కనిపెట్టుచు వచ్చుచున్నాము. ఏమానవ సంఘములో వేఱువేఱు మానవులు వేఱువేఱు పనులు చేయుచుందురో యది యధిక నాగరికత
జెందినదని మనము చెప్పవచ్చును. ప్రతి మానవుఁడును, తన పొలమును తానే దున్నుకొని తన బట్టలు తానే నేసికొని, తన యిల్లు తానే కట్టుకొను సంఘముకంటె వ్యవసాయము చేయువారు వేఱుగను, బట్టలు
నేయువారు వేఱుగను, ఇండ్లు కట్టువారు వేఱుగను, కుండలు చేయువారు వేఱుగను, కరణము పనిచేయువారు వేఱుగను ఏర్పడిన గ్రామసంఘము శ్రేష్ఠముగదా ? ఇటులనే జంతుశరీర రచనను గుఱించి యెఱుఁగునది. జీవన వ్యాపారములు చేయుటకు నొక్క యవయవము కల జంతువు కంటె రెండు అవయవములు కల జంతువు శ్రేష్టమైనది. అంతికంటె మూఁడవయవములు కలది గొప్పది. దానికంటె నాలుగు అవయవములు కలది యధికమైనది. ఈలాగుననే యితర హెచ్చుతరగతి జంతువులను గుఱించి యెఱుఁగవలయును.
పైని వర్ణింపఁబడినటుల వేఱువేఱు కణములకు వేఱువేఱు పను లేర్పడి క్రమముగ నొకటికంటె శ్రేష్టమైన మఱియొక జంతువు పుట్ట సాగెను. ఈలాగు జలదరములును, జలస్థలచరములును, కేవల స్థలచరములగు చిన్నజంతువులును, చతుష్పాదజంతువులును, మనుష్యులా యేమి యనఁదగు వానరములును, మనుష్యులును క్రమక్రమముగా నొకదానికంటె నొకటి హెచ్చు తరగతివి యగు జంతువులు భూమిపైఁ బుట్టెను. ఈ ప్రకార మా యుగమున కాయుగమునకుఁ బెద్దపెద్దవియగు జీవు లుదయించుచు, సృష్టియందు నుండుట కనర్హమగు అనేక జంతు<noinclude><references/></noinclude>
emfr729c0cc9jq01klvzc1nwbj83o2j
పుట:శశిరేఖాపరిణయము.pdf/40
104
214234
559657
2026-06-15T13:12:36Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Telugu poem|type=సీ.|lines=<poem>విజయతనూజుండు వింశతిదశకంబు దానవేశ్వరుని పైఁ దగులనేనె భీమునిపుత్రుఁ డాబీభత్సుసూనుపై నాగాశుగంబులు నాల్గు చొనిపె సౌభద్రుఁడంతలో సప్తాంబకంబులు బకవైరిసుతున...'
559657
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>విజయతనూజుండు వింశతిదశకంబు దానవేశ్వరుని పైఁ దగులనేనె
భీమునిపుత్రుఁ డాబీభత్సుసూనుపై నాగాశుగంబులు నాల్గు చొనిపె
సౌభద్రుఁడంతలో సప్తాంబకంబులు బకవైరిసుతున్నిపైఁ బఱపె నపుడు
నరభోజనుం డాఱునారాచములు నేసె నవి త్రుంచి సౌభద్రుఁ డతనిధనువుఁ</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దునిమి వెండియుఁబదియాఱు తూపులేయఁ, గినిసిరాక్షనుఁడింకొక్క ధనువుఁదాల్చి
పదియు నేఁబదివిశిఖముల్ పార్థుసుతుని, వర్షమగలంగ నేసిన వాఁడు గినిసి.</poem>|ref=132}}
తే భుజగ నారాచములు రెండు భుజయుగంబుఁ, దగుల నేసిన నభిమన్యుడనుపు డీన
నారి వదలించి పది రెండు నారసములఁ, బార్థతనయుని ఫాలంబుఁ బరగ నేనె. 133
. ఇట్లేసిన
134
క. కన్నులు కెంపొదవఁగ వెయి, గన్నుల దొర పొత్రుఁ డడరి మన కారుకముక్
మిన్నగ నెక్కిడి గుణమునఁ, బన్నగశర మొకటిఁ గూర్చి పట్టుకోపముతోన్. 135
వ, ఘటోత్కచుం జూచి యిట్లనియె.
క. అమరారి యీశరంబున, సమరావని నిన్నుఁ గూల్చి శౌర్యంబమరక్
136
అమరులు ప్రస్తుతి సేయఁగ, సమవర్తిపురంబుఁ జేర్చి చనియెద ననుచున్. 137
క. ఉరశాస్త్రం
బేసినఁ గని, సురవైరియు సరకుగొనక శూరత్వముతోఁ
దిరముగఁ బోదిలో నుంచిన, గరుడా స్త్రము చేత దాని ర్రక్కునఁ దునిమెన్. 138
తే. దునిమి సౌభద్రు నీక్షించి దనుజవిభుఁడు, మానవాధమ యిఁక నీవు మనఁగ లేవు
యాతుధానాస్త్రమున నిన్ను యమపురంబుఁ, జేర్తునని వింట శరమిడి చెప్పెమఱియం..
క. బాలుఁడ నాతో బోరఁగఁ, జాలవు నీ కేల సమరసాహసవిధముల్
గాలునిదండముతో సరి, పోలినయీశరములోన బొలిసెద వరుచున్.
క, ఏసినఁ గని వేగంబున, ఖాసిత మగువైష్ణవాఖ్య బాణముతో న
య్యానురవిశీఖముఁ దుండ్లుగ, వాసవిసుతుఁ డేసె నమరవరులు నుతింపన్.
వ. అసమయంబున.
140
141
142
143
క. ఇరువురిపోరుఁ గనుంగొనఁ, గరి కరి గిరి గిరియుఁ గంధి గంధియుఁ బోలెజ్
సురవరుల కనిమిషత్వం, బగయఁగ సార్థక్య మయ్యె హస్తివురీశా.
వ. ఇవ్విధంబున సుభద్ర కుమారుం డగు సౌభద్రుండును హిడింబితనూజుం డగు హై
డింబుండునుం బోరు నెడ నిరువురశరీరంబులఁ దొరఁగురుధిరంబు మడువులు గట్టి
ప్రవాహంబులు పాటె నప్పుడు దివినున్న దేవసమూహంబులు కుసుమవర్షంబులు
రాసమయంబున శతానందసూనుం డగునారదుండు సరిగమపదంబుల
నాట్యంబు సేసె నపుడు వారిరువురిశస్త్రాస్త్రద్యుతు అంధకారంబు నణంచి దివం
'ఖంగాఁ దోఁపించే నానమయంబున,
144<noinclude><references/></noinclude>
201i5av6cmqhpdxq5yxnx9zu1ruvngw
559770
559657
2026-06-16T03:59:26Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559770
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>విజయతనూజుండు వింశతిదశకంబు దానవేశ్వరుని పైఁ దగులనేనె
భీమునిపుత్రుఁ డాబీభత్సుసూనుపై నాగాశుగంబులు నాల్గు చొనిపె
సౌభద్రుఁడంతలో సప్తాంబకంబులు బకవైరిసుతున్నిపైఁ బఱపె నపుడు
నరభోజనుం డాఱునారాచములు నేసె నవి త్రుంచి సౌభద్రుఁ డతనిధనువుఁ</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దునిమి వెండియుఁబదియాఱు తూపులేయఁ, గినిసిరాక్షనుఁడింకొక్క ధనువుఁదాల్చి
పదియు నేఁబదివిశిఖముల్ పార్థుసుతుని, వర్షమగలంగ నేసిన వాఁడు గినిసి.</poem>|ref=132}}
{{Telugu poem|type=తే.|lines=<poem>భుజగనారాచములు రెండు భుజయుగంబుఁ, దగుల నేసిన నభిమన్యుడనుపు కిడిన
నారి వదలించి పది రెండు నారసములఁ, బార్థతనయుని ఫాలంబుఁ బరగ నేసె.</poem>|ref=133}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లేసిన</poem>|ref=134}}
{{Telugu poem|type=క.|lines=<poem>కన్నులు కెంపొదవఁగ వెయి, గన్నులదొరపొత్రుఁ డడరి ఘనకార్ముకమున్
మిన్నగ నెక్కిడి గుణమునఁ, బన్నగశర మొకటిఁ గూర్చి పట్టుకోపముతోన్</poem>|ref=135}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఘటోత్కచుం జూచి యిట్లనియె.</poem>|ref=136}}
{{Telugu poem|type=క.|lines=<poem>అమరారి యీశరంబున, సమరావని నిన్నుఁ గూల్చి శౌర్యంబమరన్
అమరులు ప్రస్తుతి సేయఁగ, సమవర్తిపురంబుఁ జేర్చి చనియెద ననుచున్.</poem>|ref=137}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఉరశాస్త్రం బేసినఁ గని, సురవైరియు సరకుగొనక శూరత్వముతోఁ
దిరముగఁ బొదిలో నుంచిన, గరుడాస్త్రముచేత దాని ర్రక్కునఁ దునిమెన్.</poem>|ref=138}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దునిమి సౌభద్రునీక్షించి దనుజవిభుఁడు, మానవాధమ యిఁక నీవు మనఁగ లేవు
యాతుధానాస్త్రమున నిన్ను యమపురంబుఁ, జేర్తుననివింటశరమిడి చెప్పెమఱియం.</poem>}}
{{Telugu poem|type=క.|lines=<poem>బాలుఁడ నాతో బోరఁగఁ, జాలవు నీ కేల సమరసాహసవిధముల్
గాలునిదండముతో సరి, పోలినయీశరములోన బొలిసెద వరుచున్.</poem>|ref=140}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఏసినఁ గని వేగంబున, భాసిత మగువైష్ణవాఖ్యబాణముతో న
య్యానురవిశీఖముఁ దుండ్లుగ, వాసవిసుతుఁ డేసె నమరవరులు నుతింపన్.</poem>|ref=141}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అసమయంబున.</poem>|ref=142}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇరువురిపోరుఁ గనుంగొనఁ, గరి కరి గిరి గిరియుఁ గంధి గంధియుఁ బోలెన్
సురవరుల కనిమిషత్వం, బరయఁగ సార్థక్య మయ్యె హస్తివురీశా.</poem>|ref=143}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున సుభద్రకుమారుం డగు సౌభద్రుండును హిడింబితనూజుం డగుహై
డింబుండునుం బోరునెడ నిరువురశరీరంబులఁ దొరఁగురుధిరంబు మడువులు గట్టి
ప్రవాహంబులుపాఱె నప్పుడు దివినున్నదేవసమూహంబులు కుసుమవర్షంబులు
గురింపించి రాసమయంబున శతానందసూనుం డగునారదుండు సరిగమపదంబుల
నాట్యంబు సేసెనపుడు వారిరువురిశస్త్రాస్త్రద్యుతు అంధకారంబు నణంచి దివం
ఖంగాఁ దోఁపించే నానమయంబున</poem>|ref=144}}<noinclude><references/></noinclude>
ijgrf4wm48kym2onog95orx0gr1tbjc
559781
559770
2026-06-16T09:24:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559781
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>విజయతనూజుండు వింశతిదశకంబు దానవేశ్వరునిపైఁ దగులనేసె
భీమునిపుత్రుఁ డాబీభత్సుసూనుపై నాగాశుగంబులు నాల్గు చొనిపె
సౌభద్రుఁ డంతలో సప్తాంబకంబులు బకవైరిసుతునిపైఁ బఱపె నపుడు
నరభోజనుం డాఱునారాచములు నేసె నవి త్రుంచి సౌభద్రుఁ డతనిధనువుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దునిమి వెండియుఁబదియాఱు తూపులేయఁ, గినిసి రాక్షనుఁ డింకొక్కధనువుఁ దాల్చి
పదియు నేఁబదివిశిఖముల్ పార్థుసుతుని, వక్ష మగలంగ నేసిన వాఁడు గినిసి.</poem>|ref=132}}
{{Telugu poem|type=తే.|lines=<poem>భుజగనారాచములు రెండు భుజయుగంబుఁ, దగుల నేసిన నభిమన్యుడధనువు కిడిన
నారి వదలించి పదిరెండునారసములఁ, బార్థతనయుని ఫాలంబుఁ బరగ నేసె.</poem>|ref=133}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లేసిన</poem>|ref=134}}
{{Telugu poem|type=క.|lines=<poem>కన్నులు కెంపొదవఁగ వెయి, గన్నులదొరపౌత్రుఁ డడరి ఘనకార్ముకమున్
మిన్నగ నెక్కిడి గుణమునఁ, బన్నగశర మొకటిఁ గూర్చి పటుకోపముతోన్.</poem>|ref=135}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఘటోత్కచుం జూచి యిట్లనియె.</poem>|ref=136}}
{{Telugu poem|type=క.|lines=<poem>అమరారి యీశరంబున, సమరావని నిన్నుఁ గూల్చి శౌర్యం బమరన్
అమరులు ప్రస్తుతి సేయఁగ, సమవర్తిపురంబుఁ జేర్చి చనియెద ననుచున్.</poem>|ref=137}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఉరగాస్త్రం బేసినఁ గని, సురవైరియు సరకుగొనక శూరత్వముతోఁ
దిరముగఁ బొదిలో నుంచిన, గరుడాస్త్రముచేత దాని గ్రక్కునఁ దునిమెన్.</poem>|ref=138}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దునిమి సౌభద్రు నీక్షించి దనుజవిభుఁడు, మానవాధమ యిఁక నీవు మనఁగ లేవు
యాతుధానాస్త్రమున నిన్ను యమపురంబుఁ, జేర్తునని వింట శర మిడి చెప్పె మఱియు.</poem>|ref=139}}
{{Telugu poem|type=క.|lines=<poem>బాలుఁడ నాతో బోరఁగఁ, జాలవు నీ కేల సమరసాహసవిధముల్
గాలునిదండముతో సరి, పోలినయీశరముతోన బొలిసెద వనుచున్.</poem>|ref=140}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఏసినఁ గని వేగంబున, భాసిత మగువైష్ణవాఖ్యబాణముతో న
య్యాసురవిశిఖముఁ దుండ్లుగ, వాసవిసుతుఁ డేసె నమరవరులు నుతింపన్.</poem>|ref=141}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అసమయంబున.</poem>|ref=142}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇరువురిపోరుఁ గనుంగొనఁ, గరి కరి గిరి గిరియుఁ గంధి గంధియుఁ బోలెన్
సురవరుల కనిమిషత్వం, బరయఁగ సార్థక్య మయ్యె హస్తిపురీశా.</poem>|ref=143}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున సుభద్రకుమారుం డగు సౌభద్రుండును హిడింబితనూజుం డగుహై
డింబుండునుం బోరునెడ నిరువురశరీరంబులఁ దొరఁగురుధిరంబు మడువులు గట్టి
ప్రవాహంబులు పాఱె నప్పుడు దివినున్నదేవసమూహంబులు కుసుమవర్షంబులు
గురిపించి రాసమయంబున శతానందసూనుం డగునారదుండు సరిగమపదంబుల
నాట్యంబు సేసె నపుడు వారిరువురిశస్త్రాస్త్రద్యుతు లంధకారంబు నణంచి దివం
బుగాఁ దోఁపించె నాసమయంబున</poem>|ref=144}}<noinclude><references/></noinclude>
kk57ktp9c6iugs8p2re1trcoyjes761
పుట:AadarshaPrabhuvu.pdf/21
104
214235
559658
2026-06-15T13:13:57Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559658
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శ ప్రభువు</p>
లోపములన్నియు కనిపెట్టిరి. ప్రతిభావంతుల కసాధ్య ములుండునా!అన్నిటికంటేముందు రాజ్యాంగమునందలి లోపములను సవరించుటయు, నార్థికవిషయమున జాగరూకత వహించుటయు విధియయ్యెను. శ్రీవారు
పట్టాభిషిక్తులైన కాలమున పలికిన పలుకు లిప్పటికిని చెవులలో ప్రతిధ్వనించుచున్నవి :<br>
“నేనిప్పుడే నారాజ్యభవనమున కాలు పెట్ట
బోవుచున్నాను. ఇట్టిసమయమున ప్రస్తుతము నేను
చెప్పగలిగిన దేమన: _ఎట్లు కీ॥ శే॥ మాతండ్రిగా
రిండియా గవర్నమెంటు నెడల సుహృద్భావముతోను,
రాజ్యములోని ప్రజలయెడల రంజకుడగు రాజువలె
నుండెనో, యట్లే సర్వదా యుండుట నా పవిత్రాశ
యము, ఈ విషయమున నాయాశయము లెంత యార్ద్ర
ములో, యట్టి యార్ద్రతతోడనే మీరు విశ్వాసమును
చూపుదురని మిక్కిలి నమ్ముచున్నాను.” పట్టాభిషేక
సందర్భమున "రెసిడెంటు గారిచ్చిన యుపన్యాసమునకు
ప్రత్యుత్తరమిచ్చుచు నీవిషయమునే యీ క్రింది మాటల
నానతిచ్చిరి :<noinclude><references/></noinclude>
pa1ts73lofyqt3gbj8e9zjus01ui0w9
559659
559658
2026-06-15T13:14:34Z
Aryapranathi06
7306
559659
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శ ప్రభువు</p>
లోపములన్నియు కనిపెట్టిరి. ప్రతిభావంతుల కసాధ్య ములుండునా!అన్నిటికంటేముందు రాజ్యాంగమునందలి లోపములను సవరించుటయు, నార్థికవిషయమున జాగరూకత వహించుటయు విధియయ్యెను. శ్రీవారు
పట్టాభిషిక్తులైన కాలమున పలికిన పలుకు లిప్పటికిని చెవులలో ప్రతిధ్వనించుచున్నవి :<br>
“నేనిప్పుడే నారాజ్యభవనమున కాలు పెట్ట
బోవుచున్నాను. ఇట్టిసమయమున ప్రస్తుతము నేను
చెప్పగలిగిన దేమన: _ఎట్లు కీ॥ శే॥ మాతండ్రిగా
రిండియా గవర్నమెంటు నెడల సుహృద్భావముతోను,
రాజ్యములోని ప్రజలయెడల రంజకుడగు రాజువలె
నుండెనో, యట్లే సర్వదా యుండుట నా పవిత్రాశ
యము, ఈ విషయమున నాయాశయము లెంత యార్ద్ర
ములో, యట్టి యార్ద్రతతోడనే మీరు విశ్వాసమును
చూపుదురని మిక్కిలి నమ్ముచున్నాను.” పట్టాభిషేక
సందర్భమున "రెసిడెంటు గారిచ్చిన యుపన్యాసమునకు
ప్రత్యుత్తరమిచ్చుచు నీవిషయమునే యీ క్రింది మాటల
నానతిచ్చిరి :
{{Center|{{p|ac|fwb}}౧౦</p><noinclude><references/></noinclude>
jt37lcal29dwqyady682mof86sd3eid
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/215
104
214236
559660
2026-06-15T13:19:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559660
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|27]|ప్రకృతిశాస్త్రములు|209}}</noinclude>వుల జాతులు పూర్తిగా నశించుచుఁ గొన్నిజాతులు శరీర రచనయందు నభివృద్ధిఁజెందుచుఁ, దుదకు భూమిపై మనుష్యుఁ డుదయించెను. ఈ మా మానవుండిట్లు ఒక జీవకణములోనుండి బయలుదేరి క్రమముగా
ననేకజంతువుల శరీరములను దాల్చి తుద కీరూపము దాల్చెను.
పైని వర్ణించినటుల నేకకణమయ మగుజంతువు చేతనసృష్టికి శిరోభూషణమనఁదగు మానవుడుగా మారుటకు నెన్నియో లక్షలు కోటు సంవత్సరములు పట్టినవి. ఇది నూఱు సంవత్సరములలోఁ గాని వేయి సంవత్సరములలోఁ గాని యైన పని గాదు.
ఇంతవఱకు మేము పరిణామ వాదమును గుఱించి చెప్చిన యంశములకు రుజువేమైనను కలదాయని చదువరు లడుగవచ్చును. ఇందుకు శాస్త్రజ్ఞులు నలుబది యేఁబది సంవత్సరములనుండి మిక్కిలి శ్రమపడి, 'మీ కేమి తెలియును ? మీ కేమి తెలియును ?' అని గుట్టను, చెట్టును, రాతిని, మృత్తికను, సముద్రమును, జంతువులను, మఱియు భూమిమీఁది చేతనాచేతనాత్మకమైన సమస్తపదార్థములను అడిగి యడిగి ప్రబలమైన ముగ్గురు సాక్షులను సంపాదించిరి. ఈముగ్గురు సాక్షులు నమ్మఁదగినవారును, ఒకరితోనొకరికి సంబంధము లేనివారును అయి యున్నారు. వారెవరంటిరేని :-
{{c|1. భూగర్భశాస్త్రము}}
{{c|(Geology)}}
భూమిని త్రవ్విన కొలదిని అందుపొరలక్రిందఁ బొరలు కానవచ్చును. భూమి క్రమముగాఁ బెరిగినందున నిట్టి పొరలేర్పడినవి. క్రిందికిఁ బోయినకొలఁదిని పైపొరకంటెఁ గ్రింది పొర పురాతనకాలమును జూపు ననుట విదితము. ఆయా పొరలలో ఆకాలమునందునుండిన వృక్షముల యొక్కయు, జంతువులయొక్కయు శిలారూపమయిన (Fossil) దేహములు కానవచ్చుచున్నవి. వానివలన జంతువులు క్రమక్రమముగా నెట్లు
శరీరరచనలోనికి మాఱినదియు బాగుగఁ దెలిసికొనవచ్చును.<noinclude><references/></noinclude>
ieaqgv8xjoadf17d08xpvkssdp2ff09
పుట:AadarshaPrabhuvu.pdf/22
104
214237
559661
2026-06-15T13:20:26Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{right|{{p|ac|fwb}}౨. రాజ్యాధిపత్యము</p>}} “నాయావచ్ఛక్తిని వినియోగించి కీ॥ శే॥ మా తండ్రిగారు సంచరించినదారినే సంచరించుచు నా ప్రజలకును, రాష్ట్రమునకును మేలే తప్పకచేతునని హృదయపూర్వకముగా...'
559661
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Aryapranathi06" /></noinclude>{{right|{{p|ac|fwb}}౨. రాజ్యాధిపత్యము</p>}}
“నాయావచ్ఛక్తిని వినియోగించి కీ॥ శే॥ మా
తండ్రిగారు సంచరించినదారినే సంచరించుచు నా ప్రజలకును, రాష్ట్రమునకును మేలే తప్పకచేతునని హృదయపూర్వకముగా వాగ్దాన మొసంగుచున్నాను. మరియు
బ్రిటిషు ప్రభుత్వము నెడల నెల్లప్పుడును మైత్రితోనుండెదను.” శ్రీవారు పై రెండు సమయములయందును సెలవిచ్చిన వాక్యముల నెట్లు సార్థక పరచిరో, యెట్లు చెప్పిన
వానికంటె వేయిమడుంగులెక్కువ కార్యరూపమునచూపీరో ముందుతెలుసుకొనగలము. రాజ్యాంగమట్టి విషమావస్థయందుండుటకు కారణముల నారయుదము. 1857
సంవత్సరపు సిపాయికలకలమున హైద్రాబాదురాజ్యము బ్రిటిషు ప్రభుత్వమునకు సాయముచేయకపోయిన, నీరెండుసంస్థ లిట్లుండెడివి కావు. సాయము
చేయుట చేతనే రెండును చిరస్థాయులై సన్మైత్రితోమెలగుట తటస్థించింది.
ఈపనియంతము మొదటి సర్ సాలార్జంగు బహద్దూరుగారి దూరదర్శిత్వము.అప్పుడు బ్రిటిషుపరిపాలకులకు జరిగిన యుత్తర ప్రత్యుత్తరములను చూచిన నందలి విశేషములు మనకు తెలియగలవు. నవాబు అబ్జలుద్దాలా బహద్దూరు గారప్పుడు రాజ్యము చేయుచుండిరి. విప్లవకారుల చేష్టు
{{Center|{{p|ac|fwb}}౧౧</p>}}<noinclude><references/></noinclude>
tp69gkas0clqmrmfjxjywsdojw72yb9
559662
559661
2026-06-15T13:21:28Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559662
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Aryapranathi06" /></noinclude>{{p|ac|fwb}}{{right|౨. రాజ్యాధిపత్యము.}}</p>
“నాయావచ్ఛక్తిని వినియోగించి కీ॥ శే॥ మా
తండ్రిగారు సంచరించినదారినే సంచరించుచు నా ప్రజలకును, రాష్ట్రమునకును మేలే తప్పకచేతునని హృదయపూర్వకముగా వాగ్దాన మొసంగుచున్నాను. మరియు
బ్రిటిషు ప్రభుత్వము నెడల నెల్లప్పుడును మైత్రితోనుండెదను.” శ్రీవారు పై రెండు సమయములయందును సెలవిచ్చిన వాక్యముల నెట్లు సార్థక పరచిరో, యెట్లు చెప్పిన
వానికంటె వేయిమడుంగులెక్కువ కార్యరూపమునచూపీరో ముందుతెలుసుకొనగలము. రాజ్యాంగమట్టి విషమావస్థయందుండుటకు కారణముల నారయుదము. 1857
సంవత్సరపు సిపాయికలకలమున హైద్రాబాదురాజ్యము బ్రిటిషు ప్రభుత్వమునకు సాయముచేయకపోయిన, నీరెండుసంస్థ లిట్లుండెడివి కావు. సాయము
చేయుట చేతనే రెండును చిరస్థాయులై సన్మైత్రితోమెలగుట తటస్థించింది.
ఈపనియంతము మొదటి సర్ సాలార్జంగు బహద్దూరుగారి దూరదర్శిత్వము.అప్పుడు బ్రిటిషుపరిపాలకులకు జరిగిన యుత్తర ప్రత్యుత్తరములను చూచిన నందలి విశేషములు మనకు తెలియగలవు. నవాబు అబ్జలుద్దాలా బహద్దూరు గారప్పుడు రాజ్యము చేయుచుండిరి. విప్లవకారుల చేష్టు
{{Center|{{p|ac|fwb}}౧౧</p>}}<noinclude><references/></noinclude>
4jrdsr0ebhks9kd17a87p1gn44pdmnh
559664
559662
2026-06-15T13:25:39Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559664
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{right|౨. రాజ్యాధిపత్యము.}}
“నాయావచ్ఛక్తిని వినియోగించి కీ॥ శే॥ మా
తండ్రిగారు సంచరించినదారినే సంచరించుచు నా ప్రజలకును, రాష్ట్రమునకును మేలే తప్పకచేతునని హృదయపూర్వకముగా వాగ్దాన మొసంగుచున్నాను. మరియు
బ్రిటిషు ప్రభుత్వము నెడల నెల్లప్పుడును మైత్రితోనుండెదను.” శ్రీవారు పై రెండు సమయములయందును సెలవిచ్చిన వాక్యముల నెట్లు సార్థక పరచిరో, యెట్లు చెప్పిన
వానికంటె వేయిమడుంగులెక్కువ కార్యరూపమునచూపీరో ముందుతెలుసుకొనగలము. రాజ్యాంగమట్టి విషమావస్థయందుండుటకు కారణముల నారయుదము. 1857
సంవత్సరపు సిపాయికలకలమున హైద్రాబాదురాజ్యము బ్రిటిషు ప్రభుత్వమునకు సాయముచేయకపోయిన, నీరెండుసంస్థ లిట్లుండెడివి కావు. సాయము
చేయుట చేతనే రెండును చిరస్థాయులై సన్మైత్రితోమెలగుట తటస్థించింది.
ఈపనియంతము మొదటి సర్ సాలార్జంగు బహద్దూరుగారి దూరదర్శిత్వము.అప్పుడు బ్రిటిషుపరిపాలకులకు జరిగిన యుత్తర ప్రత్యుత్తరములను చూచిన నందలి విశేషములు మనకు తెలియగలవు. నవాబు అబ్జలుద్దాలా బహద్దూరు గారప్పుడు రాజ్యము చేయుచుండిరి. విప్లవకారుల చేష్టు
{{Center|{{p|ac|fwb}}౧౧</p>}}<noinclude><references/></noinclude>
5albh3boxpezl0my0h4ahrtmx5l9syy
పుట:AadarshaPrabhuvu.pdf/23
104
214238
559663
2026-06-15T13:24:01Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559663
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>
లకు మేర లేకుండెను. అట్టిస్థితిలో నైజాము గారు కూడ
విప్లవములో చేరిన బ్రిటిషువారిస్థితి యేమయ్యెడిది ?
అప్పుడు బొంబాయిగర్నరుగారు సందేహాస్పదులై హైద్రాబాదునున్న బ్రిటిష్ రెసిడెంటుగారికి “ నైజాముగారు మనలోనుండి చీలిపోయినయెడల సర్వము
భగ్నమగును" అని తంతివార్త నంపిరి. అట్టి పరిస్థితులలో సర్ సాలార్జంగు బహద్దూరుగారి రాజనీతి సఫలమొందెను. బ్రిటిష్ ప్రభుత్వము నిలచెను. అప్పటినుండిరెండు సంస్థలకు మైత్రి బలపడెను.సఖ్య మేర్పడినను
సంతఃపరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వ మెట్టిజోక్యము కలుగజేసికొనలేదు. సిపాయి కలకలముతరు వాత రాష్ట్రమునందలి చిన్న సంస్థానముల నన్నిటిని లోబరచుకొని
యొక విధమైన నియమముక్రిందకు తెచ్చుటకు సర్బహద్దూరుగారు మిక్కిలి శ్రమపడిరి.పూర్తిగా ఫలింపకమునుపే వారు గతించిరి.తరువాత సంత ప్రతిభాశాలురు మంత్రులుగా నుండకపోవుటచే వారు చక్క బెట్టిన పరిస్థితులు పైకి
చూచుట కట్లే యున్నట్లు కనపడినను, నెన్ని యోలోపములందుల బ్రవేశించెను. అట్టి స్థితిగతులను చక్క
{{p|ac|fwb}}౧౨</p><noinclude><references/></noinclude>
6oy1gsa47379cktiibvnvbdw44fi0jb
పుట:AadarshaPrabhuvu.pdf/24
104
214239
559665
2026-06-15T13:27:18Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559665
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{right|౨. రాజ్యాధిపత్యము}}
బెట్టుటకై, ప్రతిభాశాలియు, రాజనీతిజ్ఞుడును, కఠినము
గాను న్యాయముతోను పాలించి, పరిమితిగా వ్యయ
మొనర్చును తన ప్రవర్తనముచే నితరులకు
మార్గదర్శి యగునట్టియు, వ్యక్తి రాజు కావలసియుం
డెను. అట్టి పరిస్థితులలో శ్రీవారు రాజ్యమునకు
వచ్చుట తటస్థించెను. అది రాష్ట్రముయొక్క మహా
భాగ్యము !<br>
{{p|fs105}}ఇక్కడ యొక ముఖ్య విషయము గలదు. శ్రీవారి
తండ్రిగారి కాలమున బ్రిటిషువారి కియ్యవలసిన కప్పము
బాకీపడెను. శ్రీవారి తండ్రి గారు దానకర్ణులగుటచే
నట్లు తటస్థించెను. అది కర్జన్ ప్రభువుగారు పైసాయిగా
నున్న కాలము. ఆయన నైజాము వారి నా సొమ్మున కై
బలవంతపెట్టగా రెండు ప్రభుత్వములకు నొక యొడం
బడిక జరిగెను. అందు బీరారు రాజ్యము బ్రిటిషువారికి
శాశ్వత కౌలున కిచ్చునట్లును, వారు నైజామువారి
కేటేట 25 లక్షల రూపాయి లిచ్చునట్లును, నిశ్చయిం
పబడెను. శ్రీవారి తండ్రిగారు దృవ్య మీయ లేక
పోయినందున నీ సంధి కియ్యకొనవలసి వచ్చెను. రాజ్య
భాగ మిచ్చుట కిష్టము లేదు. అయినను చేయతగిన పని
లేకుండెను. ఈ సంధి మనశ్రీ వారి మనసును మిక్కిలి</p><noinclude><references/></noinclude>
8zdhtksrkyit327wlofsjtwg6dcpy8n
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/216
104
214240
559666
2026-06-15T13:30:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559666
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|210|శాస్త్రవిషయములు|}}</noinclude>
{{c|2. పిండోత్పత్తిశాస్త్రము.}}
{{c|(Embriology)}}
గర్భధారణసమయమునుండి జననమువఱకు పిండముయొక్క మార్పులను గనిపెట్టి వర్ణించెడి శాస్త్రమునకు పిండోత్పత్తిశాస్త్ర మని పేరు. ఈ శాస్త్రజ్ఞులు ఒక్క మానవపిండమునే పరీక్షింపక సమస్త జంతువుల పిండములను పరీక్షించిరి. పిండోత్పత్తి సమయమునుండి శిశువు పుట్టువఱకును వీని యభివృద్ధిఁ జూచిన, అవి పూర్వము
ఉత్క్రాంతి మార్గమున నేయే రూపములను ధరించెనో, యాయా రూపములను కొంతకాలమువఱకైనను ధరించును అని తెలియుచున్నది. ఏనుఁగు, పంది, ఆవు, కోతి, మానవుఁడు మొదలగు నత్యంతభిన్నాకారములుగల జంతువులన్నియుఁ బిండోత్పత్తి సమయమున ఏకకణమయము లయి యేకాకారములుగ నుండును. పిండోత్పత్తియైన తరువాతఁ గొన్నిదినములవఱకును ఈ పిండము లన్నియు సమానముగనే వృద్ధిజెందును; ఇందు మానవ పిండమును గుఱించి కొంచము విచారింతము. మొట్టమొదట నీపిండ మేక కణమైయుండును. అప్పుడు దానిని ఏకకణమయము లగు వికారిణివంటి యాదిమజంతువులతోఁ బోల్చవచ్చును. తరువాత ఈ ఏకకణము రెండు కణములుగాను, అవి నాలుగు, ఎనిమిది, పదియాఱు, ఈ లాగున నభివృద్ధియై యొకటి నొకటిని అంటుకొని ముద్దవలె నుండును. అప్పు డా పిండమును, ప్రవాళకీటకములతోఁగాని, బూజు కుక్కగొడుగులతోఁగాని కొంతవఱకు పోల్చవచ్చును. ఈ ప్రకారమీపిండ మభివృద్ధి యైన కొలఁదిని హెచ్చుతరగతి జంతువుల స్వరూపములను దాల్చుచు తుదకది మనుష్యాకృతిఁ దాల్చును. ఇటులనే యితర ప్రాణులను గుఱించియు నెఱుఁగునది.
{{c|3. శరీర స్థూలనిర్మాణశాస్త్రము.}}
{{c|(Anatomy)}}
ఈ శాస్త్ర మిచ్చెడి సాక్ష్యము పరిణామవాదమునకు మిక్కిలి యనుకూలమైనది. హెచ్చుతరగతిజంతువు లన్నిటియొక్క నిర్మాణము<noinclude><references/></noinclude>
ptcebeocxajpwi1dixruvx5nlf1vr6z
పుట:AadarshaPrabhuvu.pdf/25
104
214241
559668
2026-06-15T13:33:49Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559668
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>
కలంచెను. శ్రీవారు రాజ్యమునకు వచ్చినప్పు డీ
విషయముకూడ నితరములతో బాటు వారి మనసు
నాకర్షించెను. ఇది యెట్టులయిన రద్దు చేయవలెసను
సూహ మెండాయెను. ఆ యూహను శ్రీవారెట్లు
కార్యరూపమున బెట్టిరో తెలుసుకొనగలము.
<br><br><br>
{{p|ac|fwb}}౼౼౼</p>
<br><br><br><br><br>
{{p|ac|fwb}}౧౪</p><noinclude><references/></noinclude>
m57dg58xyd6o4qmavkha0h0s44x9do7
పుట:AadarshaPrabhuvu.pdf/26
104
214242
559671
2026-06-15T13:35:39Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559671
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>
<br><br><br><br><br>
{{Center|{{p|fs150}}అధ్యాయము</p>}}
{{Center|{{p|ac|fwb}}౨</p>}}<noinclude><references/></noinclude>
g76jzkff8rz1is6vee2m5mpxbt9jbm1
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/217
104
214243
559672
2026-06-15T13:38:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559672
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రకృతిశాస్త్రములు|211}}</noinclude>నందును శరీరము నిలువఁబడియుండు నిమిత్తమై యాధారముగా అస్థిపంజరము (Skeleton) ఉండును. ఇంటికిని, బందిరికిని స్తంభము లెటువంటివో యీ యస్థులును శరీరమున కటువంటివి. వేఱువేఱు విధమైన కండరములు (Muscles) ఈ యస్థులను జోడించును. ఇవన్నియుఁ జర్మచక్షువులకుఁ గానవచ్చును. వీనిని గుఱించి వివరించెడు శాస్త్రమునకు శరీరస్తూలనిర్మాణశాస్త్ర మని పేరు. వేఱువేఱు జంతువుల శరీరస్థూల నిర్మాణములను పోల్చి చూచెడు శాస్త్రమునకు స్థూల నిర్మాణ తారతమ్య శాస్త్రము (Comparitive Anatomy) అని పేరు.
ఈ యస్థులలోని సామ్యముఁ గనిపెట్టినయెడల ఏయే జంతువుల కెట్టి సంబంధముకలదో స్పష్టముగ దెలియును. పైమాంసము, చర్మములవలన వేఱువేఱుగాఁ గానవచ్చినను, లోపలియెముకలఁ, బరీక్షించినయెడల, పక్షి రెక్క, కోతికాలు, మనుష్యునిచెయ్యి ఈమూఁడును ఒకవిధమైనవియే యని తేలగలదు. కొన్ని కోతుల యస్థిపంజరములను మానవుని యస్థిపంజరములను, ఒక్కచోట నుంచి చూచినయెడల ఈ
ప్రాణుల కన్నిఁటికిని మిక్కిలి దగ్గరసంబంధము కల దని స్పష్టపడ గలదు.
{{Css image crop
|Image = లక్ష్మణరాయ వ్యాసావళి.pdf
|Page = 217
|bSize = 377
|cWidth = 98
|cHeight = 30
|oTop = 372
|oLeft = 141
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
i5ain9urk9iadnq6fhgbtq4r8j541o8
పుట:AadarshaPrabhuvu.pdf/28
104
214244
559675
2026-06-15T13:41:58Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559675
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{p|fs150}}౧. ప్రథమరాజ్య వత్సరములు, స్వయం ప్రభుత్వము</p>
{{di|శ్రీ}}వారి రాజ్యకాలమును నాల్గు భాగము
లుగా భాగింపవచ్చును.<br>
1. ప్రథమ సంవత్సరములు — 1911_1914<br>
2. స్వయం ప్రభుత్వము - 1914-1919<br>
3. మంత్రిసంఘ ప్రథమవత్సరములు - 1919 1925<br>
4. పరిశిష్టము. 1925-1938<br>
ప్రథమ సంవత్సరములలో కొంతభాగము
వారు పరిస్థితులను తెలుసుకొనుటకు వినియోగించిరి.
న్యాయపరిపాలనము శ్రీవారి ముఖ్యాశయమగుట చే,
ప్రభుత్వ శాఖ లన్నిటిలోను, విషయములన్నియు న్యాయ
దృష్టిచే జరుగుచున్న వా యను సంశయము వారి నాక
ర్షించెను. వచ్చుకాగితములు స్వయముగా పరిశీలింప
ప్రారంభించిరి. కచ్చేరీలకు స్వయముగా వెడలుట,
యుద్యోగస్థులందరు సరిగా పనిచేయుచున్నారో లేదో
యని స్వయముగా దర్యాప్తుచేయుట మొదలిడిరి. ప్రతి
యుద్యోగియు తనవద్దకు శ్రీవారెప్పుడువచ్చి పరీక్షిం
{{p|ac|fwb}}౧౫</p><noinclude><references/></noinclude>
pmgp1x0vbqqn5vymefn8zw3rsm1qoh6
559676
559675
2026-06-15T13:42:19Z
Aryapranathi06
7306
559676
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{p|fs150}}౧.ప్రథమరాజ్య వత్సరములు,స్వయం ప్రభుత్వము</p>
{{di|శ్రీ}}వారి రాజ్యకాలమును నాల్గు భాగము
లుగా భాగింపవచ్చును.<br>
1. ప్రథమ సంవత్సరములు — 1911_1914<br>
2. స్వయం ప్రభుత్వము - 1914-1919<br>
3. మంత్రిసంఘ ప్రథమవత్సరములు - 1919 1925<br>
4. పరిశిష్టము. 1925-1938<br>
ప్రథమ సంవత్సరములలో కొంతభాగము
వారు పరిస్థితులను తెలుసుకొనుటకు వినియోగించిరి.
న్యాయపరిపాలనము శ్రీవారి ముఖ్యాశయమగుట చే,
ప్రభుత్వ శాఖ లన్నిటిలోను, విషయములన్నియు న్యాయ
దృష్టిచే జరుగుచున్న వా యను సంశయము వారి నాక
ర్షించెను. వచ్చుకాగితములు స్వయముగా పరిశీలింప
ప్రారంభించిరి. కచ్చేరీలకు స్వయముగా వెడలుట,
యుద్యోగస్థులందరు సరిగా పనిచేయుచున్నారో లేదో
యని స్వయముగా దర్యాప్తుచేయుట మొదలిడిరి. ప్రతి
యుద్యోగియు తనవద్దకు శ్రీవారెప్పుడువచ్చి పరీక్షిం
{{p|ac|fwb}}౧౫</p><noinclude><references/></noinclude>
pq9gb9jziwx94gxjs9danra58nhr6pp
పుట:AadarshaPrabhuvu.pdf/29
104
214245
559679
2026-06-15T13:44:14Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559679
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>
తురోయని భయపడుచుండెను. ఈ విధముగా వీరి శ్రమ
యెక్కువయ్యెను. శుభసూచకమన్నట్లు శ్రీవారు రాజ్య
మునకు వచ్చిన సంవత్సరమే పంటలు పూర్వమెన్నో సం
వత్సరములకంటె నెక్కువగా పండెను. ఆసంవత్సర మా
దాయ మెక్కువయ్యెను. కచ్చేరీ లన్నియు తమవిధ్యుక్త
ధర్మములను నిర్వహింప నేర్చుకొనుటకు ప్రారంభించినవి.
కాని లంచములను గొనుటయను పిశాచము రాష్ట్రమం
తయు నావరించుకొని యుండెను. ప్రజలుద్యోగస్తుల చే
పీడింపబడుచుండిరి. ఇట్టి పరిస్థితులు శ్రీవారి చెవిని
బడగా నాయన తోక త్రొక్కిన త్రాచువలె యాగ్రహా
విష్టుడయ్యెను. కాని యీ దురభ్యాసమును పోగొట్టుట
యొక్క దినమున జరుగ నేరదు. ఉద్యోగస్థులను దీనిని
గూర్చి దర్యాప్తు చేయ మొదలిడిరి. ప్రతిభాశాలి
ప్రారంభించిన తెలియని విషయము లుండునా? శ్రీవారి
కేయుద్యోగస్థు లెట్టివారో తెలియుచుండెను. పొలము
లోని కలుపును పెరికి పారవైచినట్లు, పనికిరానట్టియు,
దుష్ప్రవర్తన గలిగినట్టియు, నుద్యోగస్థులను క్రమక్రమ
ముగా నుద్యోగమునుండి తొలగింప మొదలిడిరి. 1911
సంవత్సరమున జరిగిన యొక విశేషాంశము నిచ్చట
చెప్పవలసియున్నది. వైస్రాయి హార్డింగు ప్రభువుగారి
{{p|ac|fwb}}౧౯</p><noinclude><references/></noinclude>
j9frv78gw4g5lyw99anwzdrgtc55v1q
పుట:AadarshaPrabhuvu.pdf/30
104
214246
559680
2026-06-15T13:46:40Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559680
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{right|{{p|ac|fwb}}౧.ప్రథమరాజ్య వత్సరములు, స్వయంప్రభుత్వము</p>}}
యాజమాన్యమున నీ సంవత్సరమున ఢిల్లీలో నొక
గొప్ప దర్బారు జరిగెను. దానికి చక్రవర్తిగారు స్వయ
ముగ విచ్చేసియుండిరి. శ్రీవారప్పుడు ఢిల్లీ వెళ్ళవలసి
వచ్చినది. అప్పుడు శ్రీవారికైన గౌరవము, శ్రీవారి
తండ్రిగారి కాలమున వారికైన గౌరవమును తలపించెను.
హిందూ దేశమునందలి స్వతంత్రరాజ్యములలో నిజాము
రాజ్యము మొదటి కక్షలోనిదనియు, నందుచే నందరు
స్వతంత్ర రాజ్యాధిపతులకు నిజాం ప్రభువుగారు నాయకు
లనియు, నప్పటి చర్యలవలన శ్రీవారికి దృఢమయ్యెను.
ఎప్పుడు మనసున నీవిషయము నా పెనో యట్టి గౌరవము
కాపాడుకొని కీర్తి గడింపవలెనను కుతూహల మినుమ
డించెను.
{{p|fs100}}మరియు శ్రీవారి తండ్రిగారి కాలమునుండి
నిజాం రాజ్యము, బ్రిటిషు ప్రభుత్వమునకు చేసిన
తోడ్పాటునకును సహాయమునకును కృతజ్ఞతాపూర్వక
ముగా నింగ్లాండు రాజుగారు నిజాం ప్రభువులకు " మా
యా ప్తమిత్రము " నేను బిరుదమును ప్రసాదించిరి. ఈ
బిరుదము శ్రీవారి నింగ్లాండు రాజుగారికి సమానక
యందు నిల్పుచున్నది. ఇట్టి బిరుద మీ దేశమునందలి
</p>
{{p|ac|fwb}}౧ఽ</p><noinclude><references/></noinclude>
a2nrrp9ra167c674huujzjhjreap542
పుట:AadarshaPrabhuvu.pdf/31
104
214247
559683
2026-06-15T13:50:25Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559683
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>
స్వదేశ సంస్థానాధీశులలో నెవరికిని లేదు. ఈ రెండంశ
ములు శ్రీవారికి నిశ్చయముగ గర్వ హేతువులై, యిట్టి
బిరుదములు వచ్చుటకు కారణభూత మగు
రాజ్యము నెడల ప్రేమ సభివృద్ధిచేసి న్యాయముతోను
దూరదృష్టితోను పరిపాలింపవలెనను నాశయమును
పెంపొందించెను.<br>
1912 సంవత్సరమున, 1901 సంవత్సరమునుండి
ప్రధానామాత్య పదవి సలంకరించియున్న మహారాజా
సర్ కిష౯ప్ప్రసాద్ బహద్దూరు వారు విశ్రా౦తి కోరిరి.
శ్రీవా రమాత్యులిచ్చిన రాజీనామాను మిక్కిలి విచా
రముతో సంగీకరించుచు, తన సమవయస్కు డైనట్టియు,
పుత్ర నిర్విశేషముగా తమ తండ్రిగారి చేత పెంచబడి
నట్టియు, నా బాల్యమిత్రుడై నట్టియు మూడవ సాలార్
జంగుబహద్దూరువారిని ప్రధానామాత్యులుగా నియమిం
చిరి. ఈ విషయ మందరకును సంతోషకరమయ్యెను.
అమాత్యులును తన కర్తవ్యము నుత్సాహముతోను,
ప్రేమతోను నిర్వర్తింపప్ర్రారంభించెను. ఈయన మిక్కిలి
యుదారస్వభావము కలవాడు. నిగర్వ చూడామణి.
రాజభక్తిపూరితుడు. ప్రతిభాశాలి. ఈ గుణగణముల
{{p|ac|fwb}}౨౦</p><noinclude><references/></noinclude>
t4l6kpngcpo1b2ro8f7lvsqm1d8eevc
559684
559683
2026-06-15T13:50:53Z
Aryapranathi06
7306
559684
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>
స్వదేశ సంస్థానాధీశులలో నెవరికిని లేదు. ఈ రెండంశ
ములు శ్రీవారికి నిశ్చయముగ గర్వ హేతువులై, యిట్టి
బిరుదములు వచ్చుటకు కారణభూత మగు
రాజ్యము నెడల ప్రేమ సభివృద్ధిచేసి న్యాయముతోను
దూరదృష్టితోను పరిపాలింపవలెనను నాశయమును
పెంపొందించెను.<br><br>
1912 సంవత్సరమున, 1901 సంవత్సరమునుండి
ప్రధానామాత్య పదవి సలంకరించియున్న మహారాజా
సర్ కిష౯ప్ప్రసాద్ బహద్దూరు వారు విశ్రా౦తి కోరిరి.
శ్రీవా రమాత్యులిచ్చిన రాజీనామాను మిక్కిలి విచా
రముతో సంగీకరించుచు, తన సమవయస్కు డైనట్టియు,
పుత్ర నిర్విశేషముగా తమ తండ్రిగారి చేత పెంచబడి
నట్టియు, నా బాల్యమిత్రుడై నట్టియు మూడవ సాలార్
జంగుబహద్దూరువారిని ప్రధానామాత్యులుగా నియమిం
చిరి. ఈ విషయ మందరకును సంతోషకరమయ్యెను.
అమాత్యులును తన కర్తవ్యము నుత్సాహముతోను,
ప్రేమతోను నిర్వర్తింపప్ర్రారంభించెను. ఈయన మిక్కిలి
యుదారస్వభావము కలవాడు. నిగర్వ చూడామణి.
రాజభక్తిపూరితుడు. ప్రతిభాశాలి. ఈ గుణగణముల
{{p|ac|fwb}}౨౦</p><noinclude><references/></noinclude>
1m1i9c0dnupvfvyfulkz7dyhoqxhv99
పుట:AadarshaPrabhuvu.pdf/32
104
214248
559686
2026-06-15T13:53:49Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559686
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{p|ac|fwb}}౧.ప్రథమ రాజ్య వత్సరములు, స్వయంప్రభుత్వము</p>
రెండు సంవత్సరమున్నియు కార్యరూపము దాల్చు నట్లో నర్చుటకు యత్నించెను.
రాజును మంత్రియు సామరస్యముతోనే పనిచేయుచున్నట్లు కనపడుచుండిరి.
లీయన కృషి చే సెనో లేదో!(అనగా 1914సం॥తుది భాగముమున) స్వంతకార్యములచే నియన రాజీనామా నియ్యవలసివచ్చెను. ఈయన ప్రతిభాశాలియైనను రాష్ట్రమున శాశ్వతముగా నుండతగిన యేకార్యమును చేయకుండ
గనే, యుద్యోగమునుండి విరమించుకొనవలసివచ్చినందుకు, రాష్ట్రమంతయు మిక్కిలి చింతించెను. వీరింకను మంచి యారోగ్యవంతులై యున్నారు. కళోపాస
కులలో ముఖ్యులు.ప్రపంచమంతయు సంచరించిరి.
వీరి ప్రదర్శనశాల మిక్కిలి యపూర్వవస్తుభరితమై చూప
రకాశ్చర్యము గొలుపును. ఈయన పుస్తక భాండాగారము మిక్కిలి విలువగలది. దానములు సర్వతోముఖములై యొప్పారుచున్నవి. వీరి ప్రతిభ యింకను రాష్ట్ర
మునకు తోడ్పడగలదని నమ్ముచున్నాను.<br>
శ్రీవారు ప్రారంభించిన దుష్టోద్యోగశిక్షణమునిర్విఘ్నముగా కొనసాగుచుండెను. ఈదుండగులు మిక్కిలి న్యాయ, పోలీసు, శాఖలకు చెందియుండిరి.
{{p|ac|fwb}}౨౧</p><noinclude><references/></noinclude>
8bcmtbfoizww1kvn0p5xeph5iiz4d2m
సూచిక:19220101 BrahmaVidya Telugu Pdf.pdf
106
214249
559688
2026-06-15T13:57:01Z
Y Sai Kumar
7319
[[WP:AES|←]]Created page with ''
559688
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[బ్రహ్మవిద్య]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[పరమహంస]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1922
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
4t3kejwtugc2brqgpxzx6bgzxbxh6b3
559689
559688
2026-06-15T13:57:32Z
Y Sai Kumar
7319
559689
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[బ్రహ్మవిద్య]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[పరమహంస]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1922
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
rcnabr8h8iaop2o5vr45s3orovbgl3d
559690
559689
2026-06-15T13:59:33Z
Y Sai Kumar
7319
559690
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[బ్రహ్మవిద్య]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[పరమహంస]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=చంద్ర ప్రెస్సు
|చిరునామా=గుంటురు
|సంవత్సరం=1922
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
3c4wto2xf0ne9gome5iudp0pa1tfj2j
పుట:AadarshaPrabhuvu.pdf/33
104
214250
559691
2026-06-15T13:59:37Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559691
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>
శ్రీవారు తనపనిలో సహాయము చేయుట కిదివరలో
కోశశాఖలో కొంతశ్రమపడి మంచిపేరు సంపాదించిన
శ్రీయుత అక్బరు హైదరీగారి నప్పుడు తచ్ఛాభా
కార్యదర్శిగా నియమించిరి. ఇదియే శ్రీవారికిని శ్రీ హైదరీ
సమాగమప్రారంభము. ఈ సమాగముము
విూద నే తర్వాత రాష్ట్రముపొందిన యుచ్ఛస్థితి యాధా
రపడియున్నది. రాజుయొక్క ప్రతిభ సరియైన యుద్యో
గస్థులను వెదకుకొనుటలోనే కలదు. ఈ కాలమున
(1911–14) శ్రీ హైదరిగారు శ్రీవారికి కుడిభుజమై
యన్ని శాఖలందుగల దుర్వృత్తుల నణచుటకు మిక్కిలిసాయపడిరి. ఈవిధముగా శ్రీహైదరీగారి సాయమునశాఖలందలి యన్ని కార్యములను సవరించుచు శ్రీవారుమిగిలిన విషయముల నశ్రద్ధచేయలేదు.<br>
శ్రీవారు రాజ్యమునకు వచ్చునప్పటికే సజారి్జవాకరుగా రార్థికమంత్రిగా నుండిరి.సమర్థుడు. అదివర కార్థికమున నుండు లోపములనుసవరింపగడగెను. ఆయన చేయు పనికి శ్రీవారుమొసగిరి. ఇదివరకు బకాయపడిన శిస్తులు క్రమముగా రయితునకు కష్టము కలుగని పద్ధతికప్యుకారము
{{p|ac|fwb}}౨౨</p><noinclude><references/></noinclude>
ibo1f53chkvdj7bwlmgy91ps7zbs28y
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/219
104
214251
559692
2026-06-15T14:00:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559692
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||రసాయనశాస్త్రము|213}}</noinclude>వచ్చినపదార్థమును పుట్టింపవచ్చుననియు, ఈవిధముగ బంగారము చేయవచ్చుననియు వారు చెప్పుచుండిరి. కాని బంగారము చేసిచూపినవారొక్కరైనను కానరాక పోయిరి.
పైని వర్ణింపఁబడిన పిచ్చియూహలను తొలఁగించి నిజమైన రసాయనశాస్త్రమును నిర్మించినవాఁడు లవాయ్శియర్ (Lavoister) అను ఫ్రెంచి శాస్త్రవేత్త. ఇతడు ప్యారిస్ పట్టణమునందుఁ గ్రీ.శ. 1743 లో జన్మించెను. తన బుద్ధివైభవముచే నితఁడు చిన్నవయస్సులోనే గణిత, జ్యోతిష, వృక్ష పదార్థ విజ్ఞానశాస్త్రములఁ జక్కఁగ నభ్యసించెను. శాస్త్రసంబంధ మైన ప్రయోగములు చేయునప్పుడెల్ల నితఁడెక్కుడుశ్రద్ధతో ప్రతిపాత్రయొక్క బరువును ప్రతి పదార్థముయొక్క యాకారమానమును, ఉష్ణోగ్రతయు, ఇంకను ఇతరవిశేషములును
ప్రయోగముచేయుటకుఁ బూర్వమును తరువాతను చూచి వ్రాసియుంచును. అలసట అన్నమాట యెఱుఁగఁడు. తాను చేయుచున్న శోధన పూర్తిగ జేయుటకై యెన్నిదినములు పట్టినను శ్రద్ధతోను, ఓపికతోను ప్రయోగములు చేయుచునేయుండును. ఒకానొక పరిశోధనకై యీతఁడు ఆఱువారములవఱకు నొక చీకటిగదిలోఁ గాఁపురముండెను. శోధనల (Research) నిమిత్తమై ప్రయోగములు (Experiments) చేయుచు,
వానివలనఁ బ్రత్యక్షముగాఁ దేలుచున్న సిద్ధాంతములనే గ్రహించును; వట్టి యూహలఁ జేయఁడు. ఇట్లు శోధించి శోధించి యతఁడు తనదేశమందు, జతుర్భూతములను గుఱించి జనులకుఁ గల తప్పుటూహలను పారఁదోలెను. ఈ చతుర్భూతములలోనిది యగు వాయువు స్వతంత్ర పదార్థము కాదనియు, రెండు వాయువుల మిశ్రణ మనియు, జలముకూడ మఱి రెండు వాయువుల కలిమిడిచే నయ్యె ననియు నతఁడు లోకమునకుఁ దెలియఁజేసెను. ఇంతియకాదు. ప్రాణవాయువు (ఆమ్లజని Oxygen), జలవాయువు (ఉదజని Hydrogen), (నత్రజని(Nitrogen) అను వాయువుల గుణధర్మములను జక్కఁగ శోధించెను, పదార్థమునకు (సత్తుకు) వినాశములేదను సిద్ధాంతమును ప్రబలప్రమాణములతో స్థాపించెను. అదివఱకు వాడుకలోనున్న రసాయనికపదములనే క్రొత్త రసా<noinclude><references/></noinclude>
qjwi55y1lud3x2yovppu01lmtrvw51v
పుట:AadarshaPrabhuvu.pdf/34
104
214252
559693
2026-06-15T14:00:31Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559693
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{p|ac|fwb}}౧. ప్రథమ రాజ్య వత్సరములు, స్వయంప్రభుత్వము</p>
వసూలు చేయుటకు ప్రారంభించిరి. క్రమక్రమముగా
బొక్కసము పూర్తియగుచుండెను. ప్రజలకు పీడ
చాలా తగ్గిపోయెను. అందుచే శిస్తులను చెల్లించుశ క్తి
యభివృద్ధి యయ్యెను. ఉభయ తారకముగా కార్య
సాధన మయ్యెను. దీనివలన ప్రజలలో శ్రీవారియెడ
భక్తి హెచ్చెను. శ్రీవారు రాజ్యమునకు వచ్చిన మరు
సటి సంవత్సరమున ననగా (1321 ఫ) 1912 సంవత్స
రమున రాష్ట్రమునందలి ఖజానాలలోను బ్యాంకుల
లోను కలసి నిజాంసర్కారు వారి ద్రవ్యము 300
లక్షలు అనగా 3 కోట్ల రూపాయ లుండెను. ఇట్లు
రానురాను బొక్కసము పూర్తియయ్యెను. తర్వాత
పది సంవత్సరములకనగా (1331 ఫ) 1922 సంవత్సర
మున నీ మొత్తము 521 లక్షలు అనగా 5 కోట్ల 21
లక్షలకు పెరిగెను. శ్రీవారు పట్టినదెల్ల బంగార మై
రాజ్యము క మముగా ధనవంతమయ్యెను. (1320 ఫ)
అనగా శ్రీవారు రాజ్యమువహించిన సంవత్సరముతో నే
నిజాం గవర్నమెంటు ఇండియా గవర్నమెంటువద్ద 4
సంవత్సరముల క్రిందట మనివారణమునకై తీసు
కొనిన 340 లక్షల కల్దారు రూపాయల ఋణము తీర్ప
{{p|ac|fwb}}౨౩</p><noinclude><references/></noinclude>
gp7ce32slkfdl9mj8nkq8mrwoyfxfr5
పుట:AadarshaPrabhuvu.pdf/35
104
214253
559694
2026-06-15T14:02:52Z
Aryapranathi06
7306
/* సమస్యాత్మకం */
559694
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>
బడెను.ఈ కాలముననే సక్రమాభివృద్ధికై మార్గమేర్పడెను.
ఇచ్చట నీయార్థిక స్థితికి మరియొక కారణము చెప్పవలసియున్నది. శ్రీవారు నిగర్వులు. వారి స్వంతకోరికలు మిక్కిలి తక్కువ. నిరాడంబర జీవులు. ఈ నిరా
డంబరత్వమను భాగ్యమును రాజ్యమున కలవడ జేసిరి.సమస్తశాఖలలోను ననవసర ఖర్చులన్నియు నాపి వేసిరి.పాయగా ప్రభువులును సామంతరాజులు శ్రీవారినిచూచి
సిగ్గుపడసాగిరి. వారందరి జీవితములు క్రమముగా నిరాడంబరములగుటకు మొదలిడెను. శ్రీవారివలెనే వారునుఖర్చు తగ్గించుకొన మొదలిడిరి. ఈ పద్ధతి పాయగాలకున తత్ప్రభువులకును మహోపకారక మయ్యెను.వారికి సాహుకార్ల యలజడి తగ్గాను. మిక్కిలి ఋణపడినపాయగా ప్రభువులను సామంతరాజులను రక్షించుటకుశ్రీవారు పూనుకొని కోర్టుఆన్వార్డ్సు అను సంస్థను
స్థాపించిరి. వారట్టి సామంతరాజులు జాగీర్లను స్వాధీన
పరచుకొని సత్పాలనమునను, మితవ్యయమునను, ధనము
కూడబెట్టి ఋణములదీర్చి తరువాత మరల వారి జాగీ
ర్లను వారికి వశపరచునట్లేర్పాట్లు కావించుచుండిరి.
{{p|ac|fwb}}౨౪</p><noinclude><references/></noinclude>
6ne6v70n8gzr9kiyll8nbwv3h9om206
559695
559694
2026-06-15T14:03:18Z
Aryapranathi06
7306
559695
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Aryapranathi06" /></noinclude>{{p|al|fwb}}ఆదర్శప్రభువు</p>
బడెను.ఈ కాలముననే సక్రమాభివృద్ధికై మార్గమేర్పడెను.<br>
ఇచ్చట నీయార్థిక స్థితికి మరియొక కారణము చెప్పవలసియున్నది. శ్రీవారు నిగర్వులు. వారి స్వంతకోరికలు మిక్కిలి తక్కువ. నిరాడంబర జీవులు. ఈ నిరా
డంబరత్వమను భాగ్యమును రాజ్యమున కలవడ జేసిరి.సమస్తశాఖలలోను ననవసర ఖర్చులన్నియు నాపి వేసిరి.పాయగా ప్రభువులును సామంతరాజులు శ్రీవారినిచూచి
సిగ్గుపడసాగిరి. వారందరి జీవితములు క్రమముగా నిరాడంబరములగుటకు మొదలిడెను. శ్రీవారివలెనే వారునుఖర్చు తగ్గించుకొన మొదలిడిరి. ఈ పద్ధతి పాయగాలకున తత్ప్రభువులకును మహోపకారక మయ్యెను.వారికి సాహుకార్ల యలజడి తగ్గాను. మిక్కిలి ఋణపడినపాయగా ప్రభువులను సామంతరాజులను రక్షించుటకుశ్రీవారు పూనుకొని కోర్టుఆన్వార్డ్సు అను సంస్థను
స్థాపించిరి. వారట్టి సామంతరాజులు జాగీర్లను స్వాధీన
పరచుకొని సత్పాలనమునను, మితవ్యయమునను, ధనము
కూడబెట్టి ఋణములదీర్చి తరువాత మరల వారి జాగీ
ర్లను వారికి వశపరచునట్లేర్పాట్లు కావించుచుండిరి.
{{p|ac|fwb}}౨౪</p><noinclude><references/></noinclude>
qw8ci33jigd9h8q1z6upl8o1x2z8e5v
పుట:AadarshaPrabhuvu.pdf/36
104
214254
559696
2026-06-15T14:04:32Z
Aryapranathi06
7306
/* అచ్చుదిద్దారు */
559696
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{p|ac|fwb}}౧. ప్రథమ రాజ్య వత్సరములు, స్వయంప్రభుత్వము</p>
దీనితో జాగీర్దార్లందరును బాగుపడిరి. రాజ్యమున కార్థిక
బలము చాల చేకూరెను. శ్రీవారి శీలములోని నిరాడంబ
రత్వము ముఖ్యమైనదియు ప్రజలను రంజింప జేయు
గుణమును నైయున్నది.<br>
ఎప్పుడు ఋణము తీర్పబడి బొక్కసము నిండుట
ప్రారంభించెనో యప్పుడు ముఖ్యముగా కావల
కట్టడములకు శ్రీవారి దృష్టి మరలెను. రాష్ట్ర
మునందలి యున్నత న్యాయస్థానమునకు తగినభవన
మావశ్యకమయ్యెను. సంస్థ యొక్క- గౌరవమునకు తగిన
భవన ముండవలెనుగదా? అప్పుకు హైదరీగారి సలహా
నను సరించి ప్రస్తుతపు హైకోర్టు భవనము నిర్మింప
బడెను. సిటీ కాలేజీభవనమును నీ కాలమున ప్రారం
భింపబడినదే! ఇట్టి పరిస్థితులన్నియు క్రొత్తపన్నులు
వేయకుండ జరుగుటయనిన, శ్రీవారి ప్రతిభయు, నుద్యో
గుల చాకచక్యమును, ప్రశంసింప వలసియున్నది. ఈ
కాలమునందు శ్రీవారు చేసిన రాజ్య కార్యమునకు బ్రిటిషు
ప్రభుత్వము మెచ్చినట్లును, నన్ని శాఖలయం దభివృద్ధి
కలిగినట్లును 14_7_1918 తేదిన వైస్రాయి హార్డింగు
ప్రభువుగారు హైద్రాబాదు వచ్చినప్పుడు వారికిచ్చిన
{{p|ac|fwb}}౨౫</p><noinclude><references/></noinclude>
a0l721ld9ig6h7po08bjc610j0vq6v7
సూచిక:19270101 PranaDanamu Telugu Pdf.pdf
106
214255
559699
2026-06-15T14:14:06Z
Y Sai Kumar
7319
[[WP:AES|←]]Created page with ''
559699
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[ప్రాణదానము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[వేదుల సూర్యనారాయణ శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1927
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=_empty_
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
48rt527t5rh2i2mte97rt14e33xrygk
559700
559699
2026-06-15T14:16:12Z
Y Sai Kumar
7319
559700
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[ప్రాణదానము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[వేదుల సూర్యనారాయణ శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=శ్రీరామ ప్రెస్
|చిరునామా=రాజమహేంద్రవరం
|సంవత్సరం=1927
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
11jaypki73m19yiycqscxpxpqtpukg2
సూచిక:19280101 Vasanthakumari Telugu.pdf
106
214256
559702
2026-06-15T14:30:57Z
Y Sai Kumar
7319
[[WP:AES|←]]Created page with ''
559702
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[వసంత కుమారి]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[టంగుటూరి ప్రకాశం పంతులు]]
|అనువాదకులు=
|ఎడిటర్=జి.జోసఫు
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
jwecdgvbjw8nj9n1d6xzyh3tg19vvuq
559759
559702
2026-06-15T21:45:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
559759
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[వసంత కుమారి]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=జి.జోసఫు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
ovrxkxx2392rtuhvcpdusdit2k7r95q
సూచిక:1895 SarpaVishayaSarvasvaSangrahamu Telugu PDF.pdf
106
214257
559703
2026-06-15T14:39:24Z
Aravind Bandi
7336
[[WP:AES|←]]Created page with ''
559703
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=సర్ప విషయ సర్వస్వ సంగ్రహము
|భాష=te
|సంపుటి=
|రచయిత=దొడ్డిపట్ల సన్యాసిరాజు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=శ్రీమత్తిరిపురసుందరీ ముద్రాక్షరశాల
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=7
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
jt72gcuqi1pwtobh7b50l7ctnezxlm4
559705
559703
2026-06-15T14:46:01Z
Aravind Bandi
7336
559705
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=సర్ప విషయ సర్వస్వ సంగ్రహము
|భాష=te
|సంపుటి=
|రచయిత=దొడ్డిపట్ల సన్యాసిరాజు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=శ్రీమత్తిరిపురసుందరీ ముద్రాక్షరశాల
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=7
|పురోగతి=X
|పుటలు=<pages to=81 />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
hdejqqsjk7wpt2jfek9znogkb6mntdd
559706
559705
2026-06-15T14:51:09Z
Aravind Bandi
7336
559706
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=సర్ప విషయ సర్వస్వ సంగ్రహము
|భాష=te
|సంపుటి=
|రచయిత=దొడ్డిపట్ల సన్యాసిరాజు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=శ్రీమత్తిరిపురసుందరీ ముద్రాక్షరశాల
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=7
|పురోగతి=X
|పుటలు=<pagelist o="te" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
j3o0m9reyi6p6zh87hb5k01vb54ar7s
559707
559706
2026-06-15T14:51:53Z
Aravind Bandi
7336
559707
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=సర్ప విషయ సర్వస్వ సంగ్రహము
|భాష=te
|సంపుటి=
|రచయిత=దొడ్డిపట్ల సన్యాసిరాజు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=శ్రీమత్తిరిపురసుందరీ ముద్రాక్షరశాల
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=7
|పురోగతి=X
|పుటలు=1-100=te
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
2awr9zsgejhy51nl3u56z0lnqf2a430
559709
559707
2026-06-15T14:52:51Z
Aravind Bandi
7336
559709
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=సర్ప విషయ సర్వస్వ సంగ్రహము
|భాష=te
|సంపుటి=
|రచయిత=దొడ్డిపట్ల సన్యాసిరాజు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=శ్రీమత్తిరిపురసుందరీ ముద్రాక్షరశాల
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=7
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
jt72gcuqi1pwtobh7b50l7ctnezxlm4
559710
559709
2026-06-15T14:53:50Z
Aravind Bandi
7336
559710
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=సర్ప విషయ సర్వస్వ సంగ్రహము
|భాష=te
|సంపుటి=
|రచయిత=దొడ్డిపట్ల సన్యాసిరాజు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=శ్రీమత్తిరిపురసుందరీ ముద్రాక్షరశాల
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=7
|పురోగతి=X
|పుటలు=0-81
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
fjdwbhsumbcvb36650idanx2lldl2dr
559739
559710
2026-06-15T18:29:36Z
Rajasekhar1961
50
559739
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=సర్ప విషయ సర్వస్వ సంగ్రహము
|భాష=te
|సంపుటి=
|రచయిత=దొడ్డిపట్ల సన్యాసిరాజు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=శ్రీమత్తిరిపురసుందరీ ముద్రాక్షరశాల
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=7
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
jt72gcuqi1pwtobh7b50l7ctnezxlm4
పుట:AgastyaVidyamu.pdf/10
104
214258
559708
2026-06-15T14:52:40Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559708
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{right|3}}
{{Center|అగస్త్యవైద్యము.}}
{{Center|ణాపధగమనమును సలిపిన యెంతకాలమునకు రామభద్రుండు}}
{{Center|అగస్త్యాశ్రమమునకు విచ్చేసెనో యాకాలమును మాత్రము
నిర్ణయించుట కష్టతరము.}}
{{Center|శ్రీరామాయణరచనను గుఱించియు రామ రావణుల}}
{{Center|యుద్ధమును గుఱించియు కాలమును నిర్ణయించుటలో చరిత్రకారుల}}
{{Center|యాశయములు పలుతెఱంగులఁ గానంబడినను }}
{{Center|శ్రీ రాఘవుండును కుంభసంభవుండును సమకాలికు లను విషయము పై }}
{{Center|కారణములచే సుస్పష్టము. జానకీజాని యగు}}
{{Center|నా శ్రీరాములు అయోధ్యను వదలి క్రమముగ లంకాపట్టణముఁ}}
{{Center|జేరునఱకును శోభించు మార్గమున నుండు దండకారణ్యమందక్కడక్కడను}}
{{Center|తక్కిన మార్గమంతయును నగర రాజముల
చేతను పురవరముల చేతను}}
{{Center|మునిపల్లెలచేతను జనపదములచే తను శోభితమై}}{{Center|మిక్కిలి యెక్కుడగు నాగరకతఁ జెందిన దని
శ్రీ వాల్మీకి వాక్యములచే నూహింపఁదగును.}}
{{Center|మరియు రాక్షసరాజ మూర్ధన్యుండగు దశాన్యుని రాజధానియందు పురవీధులను}}
{{Center|ప్రాకారములను ఉద్యానవనంబులను క్రీడాసరోవరంబులను అంతిపురంబులను }}
{{Center|అందలి స్త్రీసమాజంబులను వారి క్రీడలను కేవల స్వభావగుణములచే }}
{{Center|లోకోత్తరముగ శోభిల్లినట్టులు వాల్మీకిచే వర్ణింపంబడిన వాక్యజాలములు సర్వలోకవిదితములు}}
{{Center|ఈరీతి నాగరకత జెందిన కాలమునం గల మనుజులకు}}
{{Center|మిధ్యాహార విహారములచే జనించి పలు తెఱంగుల నపాయము}}<noinclude><references/></noinclude>
pptlwx7rhf6yxf2axavwdl2cp19trhk
సూచిక:19250101 AndhranamaSangrahamuAndhraNamasheshamu Telugu.pdf
106
214259
559713
2026-06-15T15:46:00Z
Y Sai Kumar
7319
[[WP:AES|←]]Created page with ''
559713
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[ఆంధ్రనామ సంగ్రహము,ఆంధ్రనామ శేషము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=వావిళ్ళ ప్రెస్
|చిరునామా=చెన్నపురి
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
dnfljpperahf6kv15rbv2owqc007wa2
559714
559713
2026-06-15T15:46:22Z
Y Sai Kumar
7319
559714
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[ఆంధ్రనామ సంగ్రహము,ఆంధ్రనామ శేషము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=వావిళ్ళ ప్రెస్
|చిరునామా=చెన్నపురి
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
o8flszpp0g7c8zqglcijneqgcpfswhl
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/220
104
214260
559715
2026-06-15T16:10:41Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559715
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|214|శాస్త్రవిషయములు|}}</noinclude>యనశాస్త్రమందు వాడినయెడల లోకులకు నీ శాస్త్రము చక్కగఁ దెలియదని తలఁచి క్రొత్తగా రసాయనిక పరిభాష (Nomenclature) యితర పండితులసాయము వడసి యేర్పఱిచెను. మనకుఁ గానవచ్చుచున్న
యసంఖ్యపదార్థములలో నెద్ది మూలద్రవ్యమో, యేది మిశ్రద్రవ్యమో తెలిసికొనుటకు నసంఖ్యములగు ప్రయోగములను జేయుచుండెను.
ఇట్లీమహాత్ముఁడు నవీనరసాయనశాస్త్రముయొక్క పునాదిని దృఢపఱుచుచుండగా ఫ్రాన్స్ దేశములోని జనులు తమరాజుపైఁ దిరుగఁబడిరి. ఫ్రాన్స్దేశములో రాజ్యక్రాంతి (Revolution) యయ్యెను. రాజ ప్రభుత్వము పోయి ప్రజాప్రభుత్వము స్థాపింపఁబడెను. లవాయ్శియర్ రాజునకు ననుకూలుఁడని తోఁచినందున ప్రజాపక్షమువా రాతనికి దేహాంతశిక్ష విధించిరి. వధ్యస్థానమునకుఁ గొనిపోవునపుడు అతఁడు "నన్ను చంపవలెనని యున్నయెడలఁ జంపుడు. లోకమునకు మిక్కిలి యుపయోగముగా నుండునట్టి యొకప్రయోగమును చేయుచున్నాను. ఆ ప్రయోగము పూర్తియైనతోడనేనన్నుఁ జంపవచ్చును” అని చెప్పెను.
కాని యామూర్ఖులు 'మానూతన ప్రజాప్రభుత్వమునకు నిట్టిప్రయోగములతోను, శాస్త్రజ్ఞులతోను పనిలేదు' అని చెప్పి యాతనిని జంపిరి. అతని ప్రేతమును స్మశానములోఁ బాతివేయునపు డనేక శాస్త్రజ్ఞులు వచ్చి అధికారములో నున్న ప్రజాపక్షమువారి క్రోధమును లక్ష్యముచేయక, ఈ మహాశయునిపైఁ బుష్పవృష్టి చేసిరి.
రసాయనశాస్త్రమునకు జనకుఁ డని చెప్పఁదగు లవాయ్శియర్ కీర్తిశేషుఁడైనను అతని రసాయనశాస్త్రముమాత్రము దినదినాభివృద్ధిఁ జెందెను. దినదినమును ఈతని శాస్త్రముయొక్క ఖ్యాతి యూరోపుఖండమంతయు వ్యాపించినందున అనేక శాస్త్రవేత్తలీతని ప్రయోగపద్ధతిని, సిద్ధాంతములను, రసాయనిక పరిభాషను, ఒప్పుకొని నూతన శోధనలు చేయసాగిరి. దేవి యనువాఁడు 'పొటాశియము', 'సోడియము' 'మొదలయిన ధాతువులను గనిపెట్టెను. డాల్టన్ అను శాస్త్రజ్ఞుఁడు పదార్థము<noinclude><references/></noinclude>
fdmi1d00du06a5mt3dqc13l2rzyxrxv
సూచిక:19280101 JyothishyaVidyaPrakashika Telugu.pdf
106
214261
559716
2026-06-15T16:18:17Z
Y Sai Kumar
7319
[[WP:AES|←]]Created page with ''
559716
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=జ్యోతిష్య విద్యా ప్రకాశిక
|భాష=te
|సంపుటి=ఆకెళ్ళ వెంకట శాస్త్రి
|రచయిత=
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=రాజమండ్రి
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
h4xxxw18ehxy16xja9yvt68rgwk4v1d
559717
559716
2026-06-15T16:18:47Z
Y Sai Kumar
7319
559717
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=జ్యోతిష్య విద్యా ప్రకాశిక
|భాష=te
|సంపుటి=
|రచయిత=ఆకెళ్ళ వెంకట శాస్త్రి
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=రాజమండ్రి
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
i0ebsolbag7qsi0bsohotlba66998iz
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/221
104
214262
559718
2026-06-15T16:19:21Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559718
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||రసాయనశాస్త్రము|215}}</noinclude>లకుఁ బరమాణువులు మూలమని స్థాపించి, రసాయన సంయోగసంబంధమైన సిద్ధాంతములను సప్రమాణముగా సిద్ధాంతీకరించెను.
బెర్జీలియస్, గేలుసెక్, గ్రహమ్, డ్యూమాస్, మెండలీఫ్ మొదలయిన రసాయనవేత్త లనేకశోధనలు చేసినందున ఈ శాస్త్రము శీఘ్రకాలములోనే యత్యున్నత దశఁ జెందినది. ఇప్పు డీశాస్త్రమును సంపూర్తిగా నభ్యసించుటకు ఒకమానవుని జీవిత కాలము చాలదుః
{{c|హైందవరసాయనశాస్త్రము.}}
హిందూదేశమందుఁ గూడ రసాయనశాస్త్రము కొంతవఱకు నభ్యసింపఁ బడినది. కాని యిది మనదేశమునందు స్వతంత్రశాస్త్రముగాఁ బరిణమింపలేదు. ఇతర విద్యలయొక్క యంగముగా మనవారు ఈ శాస్త్రములోని కొన్ని విషయములను శోధించినట్లు కానవచ్చుచున్నది. వైద్యశాస్త్రము, రసవాదము, ధాతువాదము మొదలయిన విద్యలతో సంబంధించినంతవఱకు ఈ శాస్త్రము మన దేశములో నభివృద్ధిఁజెందెను. ఆశాస్త్రముల యభివృద్ధి కుంఠితమైనతోడనే యీ శాస్త్రము కూడ నడుగంటెను.
{{c|వైద్యము}}
వైద్యవిషయమై సంస్కృతములో వ్రాయఁబడిన గ్రంథములను చూడగా నౌషధాదులకుఁ గావలసిన రసాయనక్రియలను మనపూర్వులు చక్కఁగ నెఱిఁగినట్లు స్పష్టముగాఁ గానవచ్చుచున్నది. క్షారములు, భేదములు, వాని గుణథర్మములు, వానిని జేయువిధము, మందులుగా నుపయోగించుటకు నైమధ్యమక్షారము (Alkaline caustic of middling streušth), మృదుక్షారము (Weak alkaline solution) మొదలయిన వాని వర్ణనయు, లవణభేదములు. వాని లక్షణములు చరక సుశ్రుతాది వైద్యగ్రంథములలో సవిస్తరముగ వర్ణింపఁబడినవి.<noinclude><references/></noinclude>
89g631e75zk9z1kwhmydyyk8zg5tbnb
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/222
104
214263
559721
2026-06-15T16:31:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559721
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|216|శాస్త్రవిషయములు|}}</noinclude>బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలయిన లోహములను భస్మముచేసినఁగాని వానిని మందులుగా నుపయోగించుటకు వీలులేదు. కావున మన వైద్యులకు భస్మీకరణము (Calcimation) అనఁబడు
రసాయనక్రియలను అభ్యసించుట యావశ్యకమాయెను. ఆర్యులు మిక్కిలి పురాతనకాలమునుండియు ననేక లోహముల నెఱుంగుదు రని నమకచమకములలోని 'హిరణ్యంచమే, అయశ్చమే, శ్యామంచమే, లోహంచమే, సీసంచమే, త్రపుచమే, యజ్ఞేనకల్పన్తాం (18-13) అను వాక్యము వలనఁ దెలియుచున్నది. ఇంతియగాక టంకముపొడితో (టంకణక్షారము Borax) బంగారము నతుకుటయు నాకాలపువా రెఱిఁగి యుండిరని “లవణేన సువర్ణం సందధ్యాత్' అన్న ఛాందోగ్యోపనిషత్తులోని వాక్యము (4, 17, 7 ) చెప్పుచున్నది. క్రమక్రమముగా లోహ విషయక జ్ఞానము అభివృద్ధిఁ జెందెను. పరిశుద్దలోహముల లక్షణములును, అపరిశుద్ధలోహములలో నుండి పరిశుద్దలోహములఁ దీయు విధములును రసార్ణవాదితంత్రగ్రంథములలో స్పష్టముగా నీయఁబడియున్నవి.
రసరత్నసముచ్చయ మను గ్రంథముయొక్క యైదవ యధ్యాయమందు లోహములనుగుఱించి సవిస్తరముగా వ్రాయఁబడియున్నది. (వేఱు వేఱు లోహముల లక్షణములును. అవి దొరుకు స్థలములును. వానిని శుద్ధిచేయు విధమును, భస్మముచేయు రీతియు, ఈ గ్రంథము నందుఁ జూడనగును.) వాత్స్యాయన కామసూత్రములలో కళలను వర్ణించుచో 'ధాతువాద' మనుశాస్త్ర మొకటి యున్నట్లు వర్ణింపఁబడినది.
'శుక్రనీతి' యను గ్రంథము 'పాషాణ ధాత్వాదిదృతిస్తద్' భస్మీకరణం కలా' అని చెప్పియుండుటవలన, ధాతువుల దృతులు తీయుటయందును భస్మీకరణమందును హిందువులు మిక్కిలి ప్రావీణ్యత కలిగియుండి రని కానవచ్చుచున్నది. 'ధాతుసాంకర్య వార్థక్యకరణంతు కలాస్మృతా' యని యా గ్రంథమునందు వ్రాయఁబడియున్నది. లోహములను ఇతర ద్రవ్యములనుండి విడఁదీయుటయు, ఇతరపదార్థములతోఁ గలిపి మిశ్ర ద్రవ్యము చేయుటయు నొక 'కళ' అనఁగా విద్యావిశేషముగా నాకాలమందుఁ బరిగణింపఁబడుచుండెను.<noinclude><references/></noinclude>
1c74y29jxxdrnrup3k4ua1hlxzhw66h
సూచిక:19300101 ShivarathriMahathmyamu Telugu.pdf
106
214264
559722
2026-06-15T16:33:20Z
Y Sai Kumar
7319
[[WP:AES|←]]Created page with ''
559722
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=శివరాత్రి మహాత్మ్యము
|భాష=te
|సంపుటి=
|రచయిత=శ్రీనాథుడు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=ఆంధ్ర సాహిత్య పరిషత్తువారిచే ప్రకటితము
|చిరునామా=కాకినాడ
|సంవత్సరం=1928
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
8gat5h2bziemqyd4kmq12cw68s02p4a
559723
559722
2026-06-15T16:33:43Z
Y Sai Kumar
7319
559723
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=శివరాత్రి మహాత్మ్యము
|భాష=te
|సంపుటి=
|రచయిత=శ్రీనాథుడు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=ఆంధ్ర సాహిత్య పరిషత్తువారిచే ప్రకటితము
|చిరునామా=కాకినాడ
|సంవత్సరం=1928
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
4sjxivz6r673rj7pat1usxanzotyso7
పుట:AgastyaVidyamu.pdf/11
104
214265
559724
2026-06-15T16:41:42Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559724
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{left|4}}
{{Center|అగస్త్యవైద్యము.}}
{{Center|లను గలిగించు రోగములకుఁదగు చికిత్సారూపములగు}}
{{Center|శమనోపాయంబు లుండుననుట స్పష్టము. ఆ శమనోపాయంబులు}}
{{Center|సుప్రసిద్ధాయుర్వేదీయ వైద్యకచికిత్స లనియె చెప్పకతప్పదు.}}
{{Center|అనాదికాలమునుండియు ప్రజలయారోగ్యమును బాధీంచు}}
{{Center|వ్యాధి సామాన్యమును రూపుమాపుటకై యాపరాత్పరుని}} {{Center|దయచే ననుగ్రహింపఁబడినది యాయుర్వేదము దక్క}}
{{Center|వేఱొ౦డు లే దని ఋగ్వేదాదులయం దినేక చికిత్సా ప్రతిపాదక}}
{{Center|మంత్రరాజంబు లుద్ఘోషించుటచేతను ప్రపంచమునం గల}}
{{Center|వైద్యకవద్దతులలో నాయుర్వేదీయ సంప్రదాయమే యనాదియని}}
{{Center|సకలదేశ చరిత్రకారులును వైద్యవిశారదులును తగు}}
{{Center|ప్రమాణముల నుదహరించుటంజేసియు నాయుర్వేదమే మొట్ట}}
{{Center|మొదటిది యని యొప్పుకొనకతప్పదు.}}
{{Center|దక్షిణాపథమున వానరవర్గములోఁ జేరిన కాయచికిత్స
శస్త్రచికిత్సలయం}}
{{Center|దసమానుఁడై సర్వ సైనిక ప్రధాన చికిత్సకత్వమును వహించిన}}
{{Center|నుషేణుఁడు దశాస్యునిచే ప్రయోగింపండిన శక్త్యాద్యాయుధఘాతములచే}}
{{Center|మూర్ఛితుఁడైన లక్ష్మణుని మ్మోహరహితునిఁగఁ జేయుటకై}}
{{Center|సస్యరూపముగ నుపయో౦చిన " సంజీవకరణి " (మృతప్రాయు లగువారి}}
{{Center|నుజ్జీవింపంజేయు శక్తిగల యోషధుల) నుండియు,}}
{{Center|శస్త్రచికిత్సాప్రతిపాదక మగు " విశల్యకరణి (శరీరమున గుచ్చుకొనిన బాణముల ములుకులను}}
{{Center|బైటికి వెడలించు శక్తిగల యోషధులు)}}<noinclude><references/></noinclude>
nqqqe6qhszbdc5r9jih8eox4h8bn9xu
పుట:AgastyaVidyamu.pdf/12
104
214266
559725
2026-06-15T17:03:53Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559725
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{right|5}}
{{Center|అగస్త్యవైద్యము.}}
{{Center|" సావర్ణ్యకరణి ” (ప్రణప్రదేశములంగల చర్మమునకు యథాపూర్వమగు}}
{{Center|వర్ణము నిచ్చుశక్తిగల యోషధులు)}}
{{Center|"సంధానకరణి " (విఱిగిన యెముకలను జతపఱచు శక్తిగల 'యోషధులు)}}
{{Center|మొదలగువాని కృత్యములు స్వరూపములు మున్నగు
నవి స్పష్టముగ}}
{{Center|శ్రీరామాయణ యుద్ధ కాండము 102-వ సర్గయందు వర్ణింపంబడియుండుట చేత}}
{{Center|నాయుర్వేదీయ వైద్యక పద్ధతులు పై కాలమునకు}}{{Center|ముందునుండియు ప్రచారములోఁ గల
వనివ్రాయుట యనవసరము.}}
{{Center|అగస్త్యాగమనమునకు ముందునార్యభూయిష్ఠమని}}
{{Center|తలఁచెడి కొందఱి మతముల ననుసరించి }}{{Center|దక్షిణాపథమున ఆయుర్వేదీయ వైద్యకమార్గము లున్నవన్న}}
{{Center|cబలువురకు ఆశ్చర్యమును విస్మయమును గలుగకమానదు.}}
{{Center|ఇయ్యది కేవలభ్రమయని తోచుచున్నది.}}
{{Center|దశకంఠుండు పులస్త్యబ్రహ్మకు పౌత్రుఁడనియు నొకానొక సమయమున}}
{{Center|నీశ్వరునింగూర్చి సామవేదములచే స్తోత్రముఁజేసెననియు}}
{{Center|వీరి మరణానంతరము విభీషణుఁడు ఉత్తర
క్రియలం జేయుసమయమున}}
{{Center|ఆర్యులలో యాగాది క్రతువులం
జేసినవారికిఁ}}
{{Center|జేయురీతిని ఆహితాగ్ని సంస్కారములను జేసెననియు,}}
{{Center|మతంగ శరభంగాది మునిపల్లెలతోడను మార్గము
గూడియున్నదనియు}}
{{Center|వర్ణితములగు వాల్మీకిపుంగవుని వాగ్గుంభనలు ప్రబలముగఁ}}
{{Center|గనఁబడుట చేతను అగస్త్యుని యాగమన}}<noinclude><references/></noinclude>
i2uo5eg6p77bll6ww6lhd544zpli1zl
559726
559725
2026-06-15T17:10:21Z
Aryapragathi07
7305
559726
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{right|5}}
{{Center|అగస్త్యవైద్యము.}}
{{Center|" సావర్ణ్యకరణి ” (ప్రణప్రదేశములంగల చర్మమునకు యథాపూర్వమగు}}
{{Center|వర్ణము నిచ్చుశక్తిగల యోషధులు)}}
{{Center|"సంధానకరణి " (విఱిగిన యెముకలను జతపఱచు శక్తిగల 'యోషధులు)}}
{{Center|మొదలగువాని కృత్యములు స్వరూపములు మున్నగు
నవి స్పష్టముగ}}
{{Center|శ్రీరామాయణ యుద్ధ కాండము 102-వ సర్గయందు వర్ణింపంబడియుండుట చేత}}
{{Center|నాయుర్వేదీయ వైద్యక పద్ధతులు పై కాలమునకు}}{{Center|ముందునుండియు ప్రచారములోఁ గల
వనివ్రాయుట యనవసరము.}}
{{Center|అగస్త్యాగమనమునకు ముందునార్యభూయిష్ఠమని}}
{{Center|తలఁచెడి కొందఱి మతముల ననుసరించి }}{{Center|దక్షిణాపథమున ఆయుర్వేదీయ వైద్యకమార్గము లున్నవన్న}}
{{Center|బలువురకు ఆశ్చర్యమును విస్మయమును గలుగకమానదు.}}
{{Center|ఇయ్యది కేవలభ్రమయని తోచుచున్నది.}}
{{Center|దశకంఠుండు పులస్త్యబ్రహ్మకు పౌత్రుఁడనియు నొకానొక సమయమున}}
{{Center|నీశ్వరునింగూర్చి సామవేదములచే స్తోత్రముఁజేసెననియు}}
{{Center|వీరి మరణానంతరము విభీషణుఁడు ఉత్తర
క్రియలం జేయుసమయమున}}
{{Center|ఆర్యులలో యాగాది క్రతువులం
జేసినవారికిఁ}}
{{Center|జేయురీతిని ఆహితాగ్ని సంస్కారములను జేసెననియు,}}
{{Center|మతంగ శరభంగాది మునిపల్లెలతోడను మార్గము
గూడియున్నదనియు}}
{{Center|వర్ణితములగు వాల్మీకిపుంగవుని వాగ్గుంభనలు ప్రబలముగఁ}}
{{Center|గనఁబడుట చేతను అగస్త్యుని యాగమన}}<noinclude><references/></noinclude>
aq5231o9ehczok2933b1y5kettqgwl7
పుట:AgastyaVidyamu.pdf/13
104
214267
559728
2026-06-15T17:27:09Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{left|6}} {{Center|అగస్త్యవైద్యము,}} {{Center|మునకు చిరకాలమునకు పూర్వమే యల్ప సంఖ్యాకులగు}} {{Center|నార్యులు వచ్చియుండినం గాని పై యార్యసంప్రదాయకచిహ్నలు}} {{Center|గలిగియుండవని ఇక్కాలపు చరిత్రకారులు...'
559728
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Aryapragathi07" /></noinclude>{{left|6}}
{{Center|అగస్త్యవైద్యము,}}
{{Center|మునకు చిరకాలమునకు పూర్వమే యల్ప సంఖ్యాకులగు}}
{{Center|నార్యులు వచ్చియుండినం గాని పై యార్యసంప్రదాయకచిహ్నలు}}
{{Center|గలిగియుండవని ఇక్కాలపు చరిత్రకారులు గొందఱునుడువుట చేతను,}}
{{Center|విమర్శితమగు అగస్త్య సంప్రదాయమందును ఆర్షవైద్యమున}}
{{Center|ప్రధానప్రమేయములగు వాత పిత్తకఫములనెడి దోషత్రయమునె}}
{{Center|యాధారపఱుచుకొని ద్రవీడవైద్యగ్రంథము లన్నియుఁ}} {{Center|గానంబడుట చేతను, నింక ననేకకారణాంతరముల చేతను}}
{{Center|నీ దక్షిణ భూభాగము శ్రీ యగస్త్యచరణకమల సంస్పర్శము గలుగుటకు}}
{{Center|పూర్వమే యార్యభూయిష్టమనుట విశదమగుచున్నది.}}
{{Center|అల్పసంఖ్యాకులగు నార్యులచే నావృతమగుటచేత}}{{Center|నెట్టి యభివృద్ధియు నార్యవిద్యలకుఁ గలిగియుండుట కవకాశములేకుండెను.}}
{{Center|అగస్త్యమునివరుండు వచ్చినపిదప వారి నిజవిద్యా
ప్రభావములన్నిటి చేతను}}
{{Center|దక్షిణాపథమున భాష మొదలు సమస్తవిద్యలను}}
{{Center|సంస్కరించుట కారంభించెనని తోచుచున్నది.}}
{{Center|అందు వైద్యకసంస్కారము సర్వజనుల కత్యంతావశ్యమైన దగుటచే}}
{{Center|క్రమముగ నార్యవైద్య సాహాయ్యంబున మూలికలయొక్కయు ఖనిజములయొక్కయు}}
{{Center|జ్ఞానము వినియోరు:లు ప్రక్రియలు మొదలగునవి సంస్కారపూర్వకమగు}}
{{Center|అభివృద్ధిం గాంచె. పిదప నా ప్రవర్తకుల యొక్క సంఘమును}}<noinclude><references/></noinclude>
1iono010kowqx6dcochc8vgqvp842gb
559729
559728
2026-06-15T17:27:11Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559729
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{left|6}}
{{Center|అగస్త్యవైద్యము,}}
{{Center|మునకు చిరకాలమునకు పూర్వమే యల్ప సంఖ్యాకులగు}}
{{Center|నార్యులు వచ్చియుండినం గాని పై యార్యసంప్రదాయకచిహ్నలు}}
{{Center|గలిగియుండవని ఇక్కాలపు చరిత్రకారులు గొందఱునుడువుట చేతను,}}
{{Center|విమర్శితమగు అగస్త్య సంప్రదాయమందును ఆర్షవైద్యమున}}
{{Center|ప్రధానప్రమేయములగు వాత పిత్తకఫములనెడి దోషత్రయమునె}}
{{Center|యాధారపఱుచుకొని ద్రవీడవైద్యగ్రంథము లన్నియుఁ}} {{Center|గానంబడుట చేతను, నింక ననేకకారణాంతరముల చేతను}}
{{Center|నీ దక్షిణ భూభాగము శ్రీ యగస్త్యచరణకమల సంస్పర్శము గలుగుటకు}}
{{Center|పూర్వమే యార్యభూయిష్టమనుట విశదమగుచున్నది.}}
{{Center|అల్పసంఖ్యాకులగు నార్యులచే నావృతమగుటచేత}}{{Center|నెట్టి యభివృద్ధియు నార్యవిద్యలకుఁ గలిగియుండుట కవకాశములేకుండెను.}}
{{Center|అగస్త్యమునివరుండు వచ్చినపిదప వారి నిజవిద్యా
ప్రభావములన్నిటి చేతను}}
{{Center|దక్షిణాపథమున భాష మొదలు సమస్తవిద్యలను}}
{{Center|సంస్కరించుట కారంభించెనని తోచుచున్నది.}}
{{Center|అందు వైద్యకసంస్కారము సర్వజనుల కత్యంతావశ్యమైన దగుటచే}}
{{Center|క్రమముగ నార్యవైద్య సాహాయ్యంబున మూలికలయొక్కయు ఖనిజములయొక్కయు}}
{{Center|జ్ఞానము వినియోరు:లు ప్రక్రియలు మొదలగునవి సంస్కారపూర్వకమగు}}
{{Center|అభివృద్ధిం గాంచె. పిదప నా ప్రవర్తకుల యొక్క సంఘమును}}<noinclude><references/></noinclude>
g1kf06woak9tfgy40710xv1fxtthlyz
పుట:AgastyaVidyamu.pdf/14
104
214268
559730
2026-06-15T17:52:02Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559730
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{Center|7}}
{{Center|style=font-weight: bold; font-style:italic;|<poem>అగస్త్య వైద్యము</poem>}}
{{Center|పరంపరలను నేర్పఱచి కట్టుఁబాట్లను జేసెను.}} {{Center|దానంచేసియె యీ ద్రవిడదేశమున నభివృద్ధిని బొందించిన}}
{{Center|పై వైద్యక పద్ధతులన్నిటికీని “అగస్త్య వైద్యము" అను}} {{Center|నామధేయముచే నిచ్చటి వైద్యలోకంబున వ్యవహారము గలిగె.}}
{{Center|ఈశ్వరుఁడు పార్వతికిని పార్వతి నందీశునకును నందీశుఁ అగస్త్యసంప్రదాయ పరంపర,}}
{{Center|డశ్వనీ దేవతలకును వారలు ధన్వంతరికిని
ధన్వంతరి యగస్త్యులకును అగస్త్యులు}}
{{Center|పులస్యులకును అతఁడు తేరయ్యకును వీరు ఊహమునికీని క్రమముగ}}
{{Center|నీ వైద్యతంత్రము నుపదేశించినట్టు లిందలి గ్రంథముల కాననగును.}}
{{Center|ఈ సంప్రదాయ ప్రవర్తకులు నలువదియెనిమిది మంది
తస్త్రప్రవర్తకులు.}}
{{center|యని కొందఱును మఱికొందఱు ఇరువది
మంది యనియు }}
{{Center|ఇంకను కొందఱు పదునెని మిదిమందియనియు భిన్న మతములు సూచించిరి.}}
{{Center|ఈరీతి భిన్న మతములున్నను పదునెనిమిది మంది యను పక్షమునే}}
{{Center|అందఱు నంగీకరించినట్టులును ఈతన్త్రప్రవర్తకు లందఱకును సిద్ధులని}}
{{Center|పేరు గల్గినట్టులును తెలియుచున్నది.}}
{{Center|నందీశ్వరర్, అగస్త్యర్, మత్స్యముని, పిడినా!శర్, }}
{{Center|పులస్త్యర్, పుంశుండర్, కరువురార్, తిరుమూలర్,}} {{Center|చట్టముని, రోమరుషి,పదు నెనిమిదిమంది సిద్ధులు.}}<noinclude><references/></noinclude>
j1nz4hbj0oyvq6vpdfhc3267iv7yfny
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/223
104
214269
559731
2026-06-15T17:54:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559731
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|28]|రసాయనశాస్త్రము|217}}</noinclude>ద్రావకములను చేయుట హిందూవైద్యులచే నభ్యసింపఁబడిన మఱియొక రాసాయనిక క్రియ, రసకౌముది, రసరత్నప్రదీపిక యను గ్రంథములలో ఈ క్రియ వర్ణింపబడినది. భైషజ్యరత్నావళిలో మహాద్రావకరసము లను పేరిట, పటికి, అన్నభేది, వెలిగారము, సురేకారము, నవాసాగరము, ఇంకను కొన్నిద్రవ్యములు నీటిలో కలిపి గాజు మూషలో బెట్టి బట్టీపెట్టి ద్రావకము చేయువిధము వర్ణింపఁబడినది. గంధకదృతి నత్రికదృతి చేయుటకూడ హిందువు లెఱిఁగియుండిరి.
{{c|రసవాదము.}}
'రసేశ్వరసంప్రదాయ' మను మతమువారు రస మనఁగా పాదరసమును గుఱించి యధికముగా శోధనచేసి దాని రసాయనధర్మములను చక్కఁగఁ గనుఁగొనిరి. ఈ రసాయనపద్ధతులన్నియు వైద్యశాస్త్రములోని భాగమైనను, కొందఱు సంప్రదాయమువారు శరీరమును వజ్రమువలెఁ జేసి రోగజరామరణములనుండి మనుజులను తొలఁగించు శక్తి ఈ పాదరసమునకుఁ గలదనియు, నితర మతములవారు దేహము పడిపోయిన తరువాత ముక్తి చెప్పుదురు, గాని తాము ఈ దేహముండగనే ముక్తి ననుభవించు నుపాయము చెప్పుచున్నామనియు అనేకముగా వాదించుచుండిరి. ఈ వాదమువలన వారికోరిక ప్రకారము రసము మనుష్యుల మరణమును తప్పింపకపోయినను, వారికి దానియందుఁ గల భక్తిచే వారు దాని గుణధర్మములను చక్కఁగఁ గనుఁగొనిరి. అందువలన 'రసము' ను చంపి దానిని రోగమునకు మందుగా నుపయోగించు విధము లనేకములు మనకుఁ దెలిసెను. తంత్ర గ్రంథములలో రసమును గుఱించి యధికముగా వ్రాయఁబడినది. నాగార్జునుఁ డను బౌద్ధతత్వవేత్త యీ రసవాదమును గుఱించి యనేకశోధనలు చేసి విఖ్యాతి వడసెను.
{{c|పరుసవేది : బంగారముచేయుట.}}
ఇనుము మొదలయిన క్షుద్రలోహములను బంగారుగా మార్చి యధిక ధనవంతులము కావలయుననిన కోరిక యన్ని కాలములందును, అన్ని దేశములందును మనుజులకుఁ గలదు. అ------- కొందఱు<noinclude><references/></noinclude>
ep4a2bj4g6yg8qutlow9mpevnemnerp
పుట:AgastyaVidyamu.pdf/15
104
214270
559732
2026-06-15T17:56:32Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559732
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{left|8}}
{{Center|అగస్త్యవైద్యము.}}
{{Center|భోగర్, బ్రహ్మముని, సుందరర్, వామదేవర్, తేరయ్యర్,}}
{{Center|కపిలర్, కమలముని, కొంగణర్ అను నీ పదునెనమండ్రును}}
{{Center|ఈ సంప్రదాయప్రవర్తకు లని యందఱు సంగీకరించినట్టులు}}
{{Center|ఊహముని మొదలగువారి గ్రంథములచేఁ దెలియుచున్నది.}}
{{Center|వీరిలో నగస్త్య పులస్త్య ధన్వంతరి నందీశ ప్రభృతి}}
{{Center|రెండువిధముల సంస్కృత భాషామయములగు వ్యావహా
సిద్ధులు రిక నామములు గలవారలు ఆయుర్వేద
వైదిక వైద్యముసను తాంత్రిక వైద్యమునను సమర్థులనియు కరు
పూర్ చట్టముని తేరయ్యర్ పిడినాక్కి శు పులిప్పాణి
భోగర్ మొదలగు ద్రావిడ నామధారులు ద్రవిడదేశజ మగు
అగస్త్యసంప్రదాయ రసవైద్యక ప్రవర్తకులనియు వారివారి
గ్రంథముల విమర్శనమునుండి తేటపడుచున్నది.
22
మఱియు సాంస్కృతిక తాంత్రిక వైద్య రచనా
తులు తెలిసినవారిని "వడ" (ఉత్తరము) సంప్రదాయజ్ఞు
లనియు కేవల ద్రవిడదేశ వైద్యక పద్ధతులఁ దెలిసిన వారిని
" తెన్ (దక్షిణము) సంప్రదాయజ్ఞులనియు వ్యవహరిం చెదరు.
ఈ “ తేజు “ నడ » సంప్రదాయములయందు సమర్థులగు
సిద్ధులచే విరచితము లగు గ్రంథములఁ బరికించినచో
'నా శ్రేయ
ధన్వంతరి నాగార్జునాది సంప్రదాయ సంమ్మేళన రూపముగ
నుండు గ్రంథములం బోలెఁ గాన్పించుచున్నయవి.<noinclude><references/></noinclude>
aqigakn1d2wqab54265vkgsao1qixvp
పుట:AgastyaVidyamu.pdf/45
104
214271
559733
2026-06-15T18:01:41Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559733
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{Css image crop
|Image = AgastyaVidyamu.pdf
|Page = 45
|bSize = 450
|cWidth = 277
|cHeight = 360
|oTop = 11
|oLeft = 16
|Location = center
|Description =
}}
{{Center|వైద్యరత్న పండిత డి. గోపాలాచార్లు,}}
{{Center|ఎ. వి. ఎస్. అండ్ ఎ. ఎమ్. బి.}}<noinclude><references/></noinclude>
0omzmv6hsz854g28fov3ekxl4ins021
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/224
104
214272
559734
2026-06-15T18:09:44Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559734
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|218|శాస్త్రవిషయములు|}}</noinclude>తమ ధనమంతయు వెచ్చింతురు. ఇప్పటికిని కొన్ని మూలికల రసముచేఁ గొందఱు బైరాగులు కానిడబ్బును బంగారపు మొహరుగా మార్చెదరని నమ్మువారు మనదేశమందు ననేకులుగలరు. బంగారపుఁ బిచ్చివలన
రససంప్రదాయమువారె యీ ధాతుశోధనములఁ జేసిరి. అందువలన బంగారము చేయుయుక్తి యెవరికిని తెలియలేదు. కాని ధాతువుల గుణధర్మములును, వేఱువేఱు ధాతువులకును, ధాతువులకు మూలికల రసములకును సంయోగము కలిగి మిశ్రపదార్థములు సిద్ధమగు విధమును మానవకోటికిఁ దెలిసి యెంతయో యుపకారము కలిగినది. శుక్రనీతిలో 'ధాత్వౌషధీనాం సంయోగక్రియాజ్ఞానం కలాస్మృతా' యని యున్నందున
అప్పటికి ధాతువులను, ఔషధులను కలుపుశాస్త్ర, మొక స్వతంత్రశాస్త్రముగా నెంచఁబడుచుండె ననుట స్పష్టము.
{{c|యంత్రములు: రసశాల.}}
పైని వర్ణింపఁబడిన రసాయన క్రియలు చేయుటకునై రసశాలయు (Laboratory), యంత్రములును (Apparatus) నిర్మింపఁబడెను. రసముతోఁ బ్రయోగములను చేయుటకు యంత్రములు ముఖ్యములు.
రసార్ణవమునందు యంత్రమాహాత్మ్య మిట్లు చెప్పఁబడియున్నది:-
"పాదరసమును చంపుటకును, దానికి వర్ణమువేయుటకును యంత్రమే ప్రబలసాధనము; యంత్రవిద్యయే ప్రబలమైనది. పాదరసమును యంత్రముచేఁ జంపవచ్చును. కావునఁ దెలిసినవారు యంత్రబలమును నిరాకరింపఁజాలరు"<ref>జారణేమారణేచైవ రసరాజస్యరంజనే । యంత్రమేవ పరం కర్మయంత్ర విద్యామహాబలా ॥ ఓషధీరహితా శ్చాయం హఠాత్ యంత్రేథవధ్యవతే । తస్మాత్ యంత్రబలంచైకం న విలంఘ్యం విజానతా॥ (23-24)</ref> రసరత్న సముచ్చయమునందలి యేడవ యధ్యాయమునందు ‘రసశాల' వర్ణనము గలదు. తంత్రగ్రంథములలో
t " ఊర్ధ్వం వహ్ని రధశ్చాపో మధ్యేతు రససంగ్రహః । మూషా యంత్ర మిద-----రయేత్ గంధకాదికమ్॥ (రసార్ణవము.)<noinclude><references/></noinclude>
k2zizjlhbkr87fy7dugg7qeicfrhd40
పుట:AgastyaVidyamu.pdf/31
104
214273
559736
2026-06-15T18:21:51Z
Aryapragathi07
7305
/* అచ్చుదిద్దారు */
559736
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Aryapragathi07" /></noinclude>{{left|6.}}
{{Center|వైద్యవత్న, పండిత డీ గోపాలాచార్లు, ఎ.వి.ఎస్., ఎ.ఎమ్.బి, వారిచే}}
{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>అర్క ప్రకాశిక.</poem>}}
{{Center||ఇందు ద్రావకములజేయు ప్రక్రియలుమెండు అతిసులభముగ }}
{{Center|ప్రతి వస్తువునుండి ద్రావకముల దీనికొనవచ్చును. ఆంధ్రజనులు దీనినుండి ద్రావక}}
{{Center|సంబంధములగు ననేకవిషయముల దెలుసుగొనగలరు. రాగల మేమా సాం}}
{{Center|తమునకు సిద్ధముగును.}}
<br><br>
{{left|త్వరలో వెలువడును.}}
{{right|త్వరలో వెలువడును.}}
{{center|style=font-weight: bold; font-style:italic;|<poem>చరక సంహిత—సుశ్రుత సంహిత.</poem>}}
<br><br>
{{Center|ఆయుర్వేదవైద్య సంప్రదాయములు యేమాత్రము దెలియక యిచ్చవచ్చినట్లు}}
{{Center|వ్రాయబడిన తెనుగు టీకటవలెగాక సంప్రదాయ సిద్ధముగ}}
{{Center|అనేకతడవలు పాఠములు జెస్పియు జదివియు అనేకవ్యాఖ్యతల యభి}}
{{Center|ప్రాయముల సతుసరించియు అనుభవజన్యమగు స్వాభిప్రాయములను జేర్చియు}}
{{Center|విపులముగ తేటదెనుగున వ్రాయబడిన ఆంధ్రవ్యాఖ్యతో గూడిన చరక}}
{{Center|సుశ్రుతములు విస్తారమగు నపోద్ఘాతములతోడను ముద్రణము త్వరలో పూర్తియై}}
{{Center|ఆంధ్ర సోదరులకరంబు అలంకరించును.}}
{{Center|అందు సుశ్రుతము యంత్రములు, శస్త్రములు, శారీరకసంబంధమును}}
{{Center|ప్రసవసంబంధమగు చక్కని ప్రతిమలును జేర్చిన షుమారు మున్నూరు}}
{{Center|పతిములతోను కూడియుండును.}}<noinclude><references/></noinclude>
lfqb6se4dpbrwg2gxfkqu8px8net4e3
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/225
104
214274
559738
2026-06-15T18:24:36Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559738
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||రసాయనశాస్త్రము|219}}</noinclude>ననేక యంత్రములు వర్ణింపఁబడినవి. డోలాయంత్రము, జారణయంత్రము, గర్భయంత్రము, మూషలు (Crucibles) మొదలయినవి కొన్ని యంత్రముల పేళ్లు.
"మీద నగ్ని, క్రింద జలము. నడుమ పాదరసముకలది మూషాయంత్రము." ఇట్లే యితరయంత్రములు వర్ణింపఁబడినవి. విస్తరభీతిచే వాని నిచ్చట వర్ణించుటకు వీలులేదు. అంధమూషయనుదానిని ఇప్పుడు
(Crucible with a lid on) అనియు, వాలుకాయంత్రమునకు . Sand bath' అనియు, డోలాయంత్రమునకు 'Steam bath' అనియు నామములు.
{{c|శాస్త్రజ్ఞులసభ.}}
ప్రస్తుతకాలమందు వైద్యులందఱును సభచేసి భిన్నభిన్న విషయములను చర్చించునట్లు పూర్వకాలమందలి శాస్త్రజ్ఞులును అప్పుడప్పుడు సభచేసి శాస్త్రీయవిషయములను చర్చించుచుండిరి. చరకసంహితలో నిట్టిసభ యొకటి వర్ణింపబడినది. ఈ క్రిందఁ జెప్పఁబడిన ఋషులొకప్పుడు చైత్రరథారణ్యములోఁ గొన్నిదినములు గడుపుటకువచ్చి రసములను గుఱించి ముచ్చటించిరి. ఆ ఋషు లెవ్వరనినః ఆత్రేయుఁడు, భద్రకాప్య శౌనకేయుఁడు, పూర్ణమౌద్గల్యుఁడు, హిరణ్యాక్ష కౌశికుఁడు, కుమారశిర భారద్వాజుఁడు. వార్య విదరాజు, విదేహరా జగు నిమి, బాహ్లికదేశములోని వైద్యశ్రేష్ఠుఁ డగు కాంఖాయనబాహ్లికుఁడు. వయోవృదులును, జ్ఞానవృద్ధులును అగు ఈ ఋషులకు రసములనుగుఱించి యొకసంవాదము జరిగెను.<ref><poem>
{{left margin|5em}}
ఆత్రేయోభద్రకాప్యశ్చ శాకుంతేయస్తథైవచ ।
పూర్ణాఖ్యశ్చైవ మౌద్గల్యో హిరణ్యాక్షశ్చ కౌశికః ।
యఃకుమారశిరోనామ భరద్వాజఃసచానఘః ।
శ్రీమాన్వార్యవిదశ్చైవ రాజా మతిమతాంవరః ॥
నిమిశ్చరాజా వై దేహో వడిశశ్చ మహామతిః ।
కాంఖాయనశ్చ బాహ్లీకో బాహ్లీకభిషజాంవరః ॥
</poem></ref><noinclude><references/></noinclude>
f7vdydnv8lt6h61aeevh0gfi0wf8ppn
559740
559738
2026-06-15T18:34:54Z
Rajasekhar1961
50
559740
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||రసాయనశాస్త్రము|219}}</noinclude>ననేక యంత్రములు వర్ణింపఁబడినవి. డోలాయంత్రము, జారణయంత్రము, గర్భయంత్రము, మూషలు (Crucibles) మొదలయినవి కొన్ని యంత్రముల పేళ్లు.
"మీద నగ్ని, క్రింద జలము. నడుమ పాదరసముకలది మూషాయంత్రము." ఇట్లే యితరయంత్రములు వర్ణింపఁబడినవి. విస్తరభీతిచే వాని నిచ్చట వర్ణించుటకు వీలులేదు. అంధమూషయనుదానిని ఇప్పుడు
(Crucible with a lid on) అనియు, వాలుకాయంత్రమునకు . Sand bath' అనియు, డోలాయంత్రమునకు 'Steam bath' అనియు నామములు.
{{c|శాస్త్రజ్ఞులసభ.}}
ప్రస్తుతకాలమందు వైద్యులందఱును సభచేసి భిన్నభిన్న విషయములను చర్చించునట్లు పూర్వకాలమందలి శాస్త్రజ్ఞులును అప్పుడప్పుడు సభచేసి శాస్త్రీయవిషయములను చర్చించుచుండిరి. చరకసంహితలో నిట్టిసభ యొకటి వర్ణింపబడినది. ఈ క్రిందఁ జెప్పఁబడిన ఋషులొకప్పుడు చైత్రరథారణ్యములోఁ గొన్నిదినములు గడుపుటకువచ్చి రసములను గుఱించి ముచ్చటించిరి. ఆ ఋషు లెవ్వరనినః ఆత్రేయుఁడు, భద్రకాప్య శౌనకేయుఁడు, పూర్ణమౌద్గల్యుఁడు, హిరణ్యాక్ష కౌశికుఁడు, కుమారశిర భారద్వాజుఁడు. వార్య విదరాజు, విదేహరా జగు నిమి, బాహ్లికదేశములోని వైద్యశ్రేష్ఠుఁ డగు కాంఖాయనబాహ్లికుఁడు. వయోవృదులును, జ్ఞానవృద్ధులును అగు ఈ ఋషులకు రసములనుగుఱించి యొకసంవాదము జరిగెను.<ref><poem>
{{left margin|5em}}
ఆత్రేయోభద్రకాప్యశ్చ శాకుంతేయస్తథైవచ ।
పూర్ణాఖ్యశ్చైవ మౌద్గల్యో హిరణ్యాక్షశ్చ కౌశికః ।
యఃకుమారశిరోనామ భరద్వాజఃసచానఘః ।
శ్రీమాన్వార్యవిదశ్చైవ రాజా మతిమతాంవరః ॥
నిమిశ్చరాజా వై దేహో వడిశశ్చ మహామతిః ।
కాంఖాయనశ్చ బాహ్లీకో బాహ్లీకభిషజాంవరః ॥
</poem></ref><noinclude>{{rule}}
{{smallrefs}}</noinclude>
fq7079sf2oodwlc6zqv42pyimhgq01c
559741
559740
2026-06-15T18:36:56Z
శ్రీరామమూర్తి
1517
559741
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||రసాయనశాస్త్రము|219}}</noinclude>ననేక యంత్రములు వర్ణింపఁబడినవి. డోలాయంత్రము, జారణయంత్రము, గర్భయంత్రము, మూషలు (Crucibles) మొదలయినవి కొన్ని యంత్రముల పేళ్లు.
"మీద నగ్ని, క్రింద జలము. నడుమ పాదరసముకలది మూషాయంత్రము." ఇట్లే యితరయంత్రములు వర్ణింపఁబడినవి. విస్తరభీతిచే వాని నిచ్చట వర్ణించుటకు వీలులేదు. అంధమూషయనుదానిని ఇప్పుడు
(Crucible with a lid on) అనియు, వాలుకాయంత్రమునకు . Sand bath' అనియు, డోలాయంత్రమునకు 'Steam bath' అనియు నామములు.
{{c|శాస్త్రజ్ఞులసభ.}}
ప్రస్తుతకాలమందు వైద్యులందఱును సభచేసి భిన్నభిన్న విషయములను చర్చించునట్లు పూర్వకాలమందలి శాస్త్రజ్ఞులును అప్పుడప్పుడు సభచేసి శాస్త్రీయవిషయములను చర్చించుచుండిరి. చరకసంహితలో నిట్టిసభ యొకటి వర్ణింపబడినది. ఈ క్రిందఁ జెప్పఁబడిన ఋషులొకప్పుడు చైత్రరథారణ్యములోఁ గొన్నిదినములు గడుపుటకువచ్చి రసములను గుఱించి ముచ్చటించిరి. ఆ ఋషు లెవ్వరనినః ఆత్రేయుఁడు, భద్రకాప్య శౌనకేయుఁడు, పూర్ణమౌద్గల్యుఁడు, హిరణ్యాక్ష కౌశికుఁడు, కుమారశిర భారద్వాజుఁడు. వార్య విదరాజు, విదేహరా జగు నిమి, బాహ్లికదేశములోని వైద్యశ్రేష్ఠుఁ డగు కాంఖాయనబాహ్లికుఁడు. వయోవృదులును, జ్ఞానవృద్ధులును అగు ఈ ఋషులకు రసములనుగుఱించి యొకసంవాదము జరిగెను.<ref><poem>
{{left margin|5em}}
ఆత్రేయోభద్రకాప్యశ్చ శాకుంతేయస్తథైవచ ।
పూర్ణాఖ్యశ్చైవ మౌద్గల్యో హిరణ్యాక్షశ్చ కౌశికః ।
యఃకుమారశిరోనామ భరద్వాజఃసచానఘః ।
శ్రీమాన్వార్యవిదశ్చైవ రాజా మతిమతాంవరః ॥
నిమిశ్చరాజా వై దేహో వడిశశ్చ మహామతిః ।
కాంఖాయనశ్చ బాహ్లీకో బాహ్లీకభిషజాంవరః ॥
ఏతేశ్రుతవయోవృద్ధా జితాత్మానో మహర్షయః ।
వనే చైత్రరథే రమ్యే సమీయుర్విజిహీర్షవః ॥
తేషాంతత్రోపవిష్టానా మియమర్థ వతీకథా ।
బభూ వార్థవిదాం సమ్య గ్రసాహారవినిశ్చయే ॥
చరకసంహిత, సూత్రస్థానము, 26వ అధ్యాయము.
</poem></ref><noinclude>{{rule}}
{{smallrefs}}</noinclude>
6x2c12xhfq7i2m3reyfct8qko7y7j83
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/226
104
214275
559744
2026-06-15T18:41:00Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559744
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|220|శాస్త్రవిషయములు|}}</noinclude>{{c|పరిశోధన.}}
ఇప్పటి పాశ్చాత్యశాస్త్రజ్ఞులవలెఁ బూర్వపు హిందూశాస్త్రజ్ఞులు కూడ వైద్యాది శాస్త్రములలోని విషయములను గుఱించి స్వయముగాఁ బరిశోధన చేయుచుండినట్లును, స్వయముగాఁ బ్రయోగములు (Experiments) చేసి చూచి, యందున గుఱించి వ్రాయుచుండినట్లును గానవచ్చుచున్నది. అట్లు ప్రయోగములు స్వయముగాఁ జేసినవారు ఆ సంగతి వ్రాసియుంచినారు.<ref><poem>
{{left margin|5em}}
స్వహస్తేనకృతంసమ్యక్ జారణం నశ్రుతంమయా ।
స్వహస్తేన భవయోగేన కృతంసమ్యక్ శ్రుతేనహి ॥
ధాతుబంధస్తృతీయోసౌ స్వహస్తేనకృతోమయా ।
దృష్టప్రత్యయయోగోయం కథితో నాత్రసంశయః ॥
</poem></ref> కాని యిటీవలివారు క్రమక్రమముగాఁ బ్రత్యక్షముగా శాస్త్రీయప్రయోగములను జేసి చూచుట మాని, వేదాంతములవలెనే భౌతికశాస్త్రములలోఁగూడ నూహలపై నూహ లల్లుట ప్రారంభించినందున ఈ శాస్త్రములన్నియు మనదేశమున అభివృద్ధిజెందక నాశముఁబొందినవి. ఇతర శాస్త్రములకు అనుమానాదికములు ప్రమాణములయిన నగునుగాక, భౌతికశాస్త్రమునకుఁ బ్రత్యక్షమే ప్రమాణము. ప్రత్యక్షమును విడిచిన భౌతికశాస్త్రము భూమి విడిచి చేయబడిన సామువంటిది.
{{c|పదార్థతత్వనిరూపణము.}}
{{c|(Constitution of Matter)}}
పదార్థములన్నియుఁ బరమాణువులచే నిర్మింపబడిన వని యిటీవలి రసాయనశాస్త్ర వేత్తలసిద్ధాంతము. ఈ విషయమే కణాదమహర్షిచే<noinclude><references/></noinclude>
t1ceem495frmu2ngoqxn2cck5on60x6
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/227
104
214276
559755
2026-06-15T21:31:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559755
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||రసాయనశాస్త్రము|221}}</noinclude>నెన్నియో వేలయేండ్లక్రింద వైశేషికదర్శనమునందుఁ బ్రతిపాదింపఁబడెను. పృథివి మొదలయిన యన్నిద్రవ్యములకును <ref>వైశేషికదర్శనమునందు 'పదార్థము' 'ద్రవ్యము' అను పదములు వేఱువేఱు అర్థములలో వాడఁబడినవి. పదార్థము అనఁగా category, ద్రవ్యమనఁగా matter.</ref>పరమాణువులే యుపాదాన కారణము (material cause). ఘటపటాదిద్రవ్యములలో నెద్ది తీసికొనినను దానిని రెండుతునకలుగాఁ జేయవచ్చును. ఆ రెండు భాగములలో నొక్కదానిని తీసికొని మఱల రెండువిభాగములుగాఁ జేయవచ్చును. ఇట్లు వచ్చిన నాల్గవవంతును తీసికొని దానిని రెండుభాగములుగా విభజింపవచ్చును. ఇట్లు విభజించుచుఁ బోఁగాఁబోగా నింకను విభజించుటకు వీలులేనంత చిన్న భాగము మిగులును, అదియే పరమాణువు. గవాక్షపు రంథ్రములలో నుండి గదిలోనికి వచ్చు సూర్యకిరణముల యందుఁ గానవచ్చెడి రేణువులో నాఱవపాలు పరమాణువు అనఁబడును<ref><poem>
{{left margin|5em}}
"జాలసూర్యమరీచిస్థం యత్సూక్ష్మం దృశ్యతే రజః ।
తస్యషష్ఠతమోభాగ, పరమాణుః స ఉచ్యతే ॥"
</poem></ref>. ఇట్టి రెండుపరమాణువులు కలసి 'ద్వ్యణుక' మగును. మూడు ద్వ్యణుకములు కలసి త్ర్యణుక మగును. ఇట్లే చతురణుకాది క్రమమున పృథివ్యాది భూతములు పుట్టినవి. ఇది కణాదప్రణీత వైశేషిక దర్శనములోని పరమాణు సిద్ధాంతము. ఇప్పటి శాస్త్రజ్ఞుల సిద్ధాంతముతోటి చాలవఱకు సరిపోవుచున్నది.<ref>హైందవ రసాయనశాస్త్రమును గుఱించి మిక్కిలి పరిశ్రమ పూర్వకముగా శోధనచేసి డాక్టర్ పీ. సీ.రే యను బంగాలీవిద్వాంసుఁడు ఇంగ్లీషులోఁ జక్కనిగ్రంథములు రెండు వ్రాసినాడు.</ref>
{{c|శాస్త్ర ప్రశస్తి.}}
పైని వర్ణింపఁబడిన చరిత్రమునుబట్టి చూడఁగా ఈశాస్త్రము హిందూదేశములో వైద్యశాస్త్రమునకు నొక యంగముగా నభివృద్ధిజెంది<noinclude><references/></noinclude>
qwyx1feqnqw42iy69lfzapa2v8aeqpz
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/228
104
214277
559757
2026-06-15T21:35:22Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559757
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|222|శాస్త్రవిషయములు|}}</noinclude>క్రమముగా నశించినదనియు, యూరోపుదేశమునందు నిది క్రమక్రమముగా నభివృద్ధిఁజెంది స్వతంత్రశాస్త్రమై సర్వశాస్త్రములకు నాధారభూతమై యున్నయది యనియుఁ జదువరులకుఁ దెలియఁగలదు. కేవలము
శాస్త్రముగాఁగాక, ప్రతిదినము వ్యవహారములలోఁ గూడ ఈ శాస్త్రము కావలసివచ్చుచున్నది. కోమటివాఁడు నేతిలో క్రొవ్వు కలిపినయెడలఁ గనుఁగొనుటకును, విషము తిని చచ్చినవాని కడుపులోని ద్రవ్యము విషమగునా లేదాయని పరీక్షించుటకును, ఔషధములు చేయుటకును, రంగులువేయు ద్రవ్యములు చేయుటకును. ఆస్పత్రిలోని మందులు కలుపుటకును ఈ శాస్త్రముయొక్క జ్ఞాన మత్యావశ్యకము.
{{rule|2cm}}<noinclude><references/></noinclude>
gha94i33jdcv8ggen513bqfs8ar1cl0
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/229
104
214278
559760
2026-06-15T21:50:31Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559760
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''పంచాంగము'''<ref>‘ఆంధ్రపత్రిక' ఉగాదిసంచిక: పింగళనామ సం॥రము (1916-1917) పుట 29.</ref></p>
{{Css image crop
|Image = లక్ష్మణరాయ వ్యాసావళి.pdf
|Page = 229
|bSize = 377
|cWidth = 75
|cHeight = 25
|oTop = 106
|oLeft = 154
|Location = center
|Description =
}}
<poem>
{{left margin|5em}}
చతురంగబలో రాజా జగతీం వశమానయేత్ ।
అహం పంచాంగబలవా నాకాశం వశమానయే॥<ref>చతురంగబలముగలరాజు భూమిని వశపఱుచుకొనును. పంచాంగబలముగల నేను ఆకాశమును వశపఱుచుకొనియెదను.</ref>
</poem>
మన జ్యోతిషశాస్త్రము రెండు విధములు. వీనిని స్కంధము లందురు: గణిత స్కంథము; జాతక స్కంధము. మొదటిది, రెండును రెండు నాలుగు. అను లెక్కవంటిది, ప్రత్యక్షసిద్ధము, నిశ్చితము. రెండవది అనిశ్చితము. బెజవాడనుండి చెన్నపట్టణమువఱకును గల యంతరమును మన మెఱంగుదు మనుకొనుఁడి, అట్లే మధ్యనున్న స్టేషనుల యంతరమును మనమెఱుంగుదుము. రైలుబండి గంటకిన్ని మైళ్లు నడచునన్న వేగముగూడ మనకుఁ దెలియుననుకొనుఁడి. 1917 మార్చి 24వ తేదీని ఉదయమున 6 గంటలకు బెజవాడనుండి రైలు బయలుదేరిన యెడల నేయేవేళకు నేయే స్టేషనుల యొద్ద నుండునో, చెన్నపట్టణ
మెప్పుడుచేరునో త్రైరాశికము వచ్చినవారెల్లరు చెప్పవచ్చును. జ్యోతిష మందలి గణితస్కంధ మీ లెక్కను పోలియుండును. సూర్యచంద్రాది గ్రహములు, రైలుబండ్లు, 12 రాసులు, 27 నక్షత్రములు ఆకాశములో
మనము గుర్తుపెట్టుకొన్న స్టేషనులు. ఇక రైలుబండి బాపట్లయొద్దకు వచ్చినపుడు పుట్టినపిల్ల వాని పెండ్లము నల్లగ నుండును, <ref> </ref>గూడూరునకు రైలు చేరినప్పుడు పుట్టినవాడు రాజగును అని చెప్పుట జాతకస్కంధమును అనుసరించుట. ఈ భవిష్యత్తు ఒకప్పుడు నిజమగును, ఒకప్పుడు అసత్యమగును. గణితస్కంధముయొక్క సత్యత్వాసత్యత్వములను బట్టి జాతకస్కంధముయొక్క సత్యత్వాసత్యత్వములను జెప్పుటకు<noinclude><references/></noinclude>
syl52m6qy0xmsxw9h7ke2ubwlukusa1
559761
559760
2026-06-15T21:52:06Z
శ్రీరామమూర్తి
1517
559761
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}'''పంచాంగము'''<ref>‘ఆంధ్రపత్రిక' ఉగాదిసంచిక: పింగళనామ సం॥రము (1916-1917) పుట 29.</ref></p>
{{Css image crop
|Image = లక్ష్మణరాయ వ్యాసావళి.pdf
|Page = 229
|bSize = 377
|cWidth = 75
|cHeight = 25
|oTop = 106
|oLeft = 154
|Location = center
|Description =
}}
<poem>
{{left margin|5em}}
చతురంగబలో రాజా జగతీం వశమానయేత్ ।
అహం పంచాంగబలవా నాకాశం వశమానయే॥<ref>చతురంగబలముగలరాజు భూమిని వశపఱుచుకొనును. పంచాంగబలముగల నేను ఆకాశమును వశపఱుచుకొనియెదను.</ref>
</poem>
మన జ్యోతిషశాస్త్రము రెండు విధములు. వీనిని స్కంధము లందురు: గణిత స్కంథము; జాతక స్కంధము. మొదటిది, రెండును రెండు నాలుగు. అను లెక్కవంటిది, ప్రత్యక్షసిద్ధము, నిశ్చితము. రెండవది అనిశ్చితము. బెజవాడనుండి చెన్నపట్టణమువఱకును గల యంతరమును మన మెఱంగుదు మనుకొనుఁడి, అట్లే మధ్యనున్న స్టేషనుల యంతరమును మనమెఱుంగుదుము. రైలుబండి గంటకిన్ని మైళ్లు నడచునన్న వేగముగూడ మనకుఁ దెలియుననుకొనుఁడి. 1917 మార్చి 24వ తేదీని ఉదయమున 6 గంటలకు బెజవాడనుండి రైలు బయలుదేరిన యెడల నేయేవేళకు నేయే స్టేషనుల యొద్ద నుండునో, చెన్నపట్టణ
మెప్పుడుచేరునో త్రైరాశికము వచ్చినవారెల్లరు చెప్పవచ్చును. జ్యోతిష మందలి గణితస్కంధ మీ లెక్కను పోలియుండును. సూర్యచంద్రాది గ్రహములు, రైలుబండ్లు, 12 రాసులు, 27 నక్షత్రములు ఆకాశములో
మనము గుర్తుపెట్టుకొన్న స్టేషనులు. ఇక రైలుబండి బాపట్లయొద్దకు వచ్చినపుడు పుట్టినపిల్ల వాని పెండ్లము నల్లగ నుండును, గూడూరునకు రైలు చేరినప్పుడు పుట్టినవాడు రాజగును అని చెప్పుట జాతకస్కంధమును అనుసరించుట. ఈ భవిష్యత్తు ఒకప్పుడు నిజమగును, ఒకప్పుడు అసత్యమగును. గణితస్కంధముయొక్క సత్యత్వాసత్యత్వములను బట్టి జాతకస్కంధముయొక్క సత్యత్వాసత్యత్వములను జెప్పుటకు<noinclude><references/></noinclude>
0kt9yjunp2tgh8u7bfedqhxgh2b1t52
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/230
104
214279
559762
2026-06-15T22:02:41Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559762
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|224|శాస్త్రవిషయములు|}}</noinclude>వీలు లేదు. గ్రహణము ప్రత్యక్షముగఁ గానవచ్చును గావున జాతకము గూడ విజమని మనవారు కొంద ఱందురు. వారి కీ స్కంధద్వయ విభేదము తెలియదు.
గణితస్కంధమునందుఁ బెక్కు విషయములు చెప్పఁబడి యుండును. వానిలోఁ బంచాంగమును గుణించుట యొకటి, హిందువులకు పంచాంగము లోకవ్యవహారమునకును, కర్మాచరణమునకును ముఖ్యము.
ఇంగ్లీషువిద్య యభివృద్ధి యైనకొలఁదిని మనదేశమునందుఁ బంచాంగములు చదువు నభ్యాసము తగ్గుచున్నది. పూర్వతరమువారును గ్రామ పౌరోహితులునుమాత్ర మిప్పుడు పంచాంగముల నుపయోగించుచున్నారు. ఇట్లు పంచాంగముల నుపయోగించువారికిఁగూడఁ బంచాంగముల యందలి విషయస్వరూప మెట్టిదో, తిధ్యాదులన నేమిటో, అవి యెట్టి గణితమువలన వచ్చునో, వేఱువేఱు పంచాంగములకు భేద మెందుకుండునో తెలియదు. కావునఁ బంచాంగమందలి విషయస్వరూపమును ఈ వ్యాసమునందుఁ గొంచెముగఁ దెల్పఁ దలఁచినాను.
పంచాంగ మనఁగా నైదు అంగములు కలది యని అంద ఱెఱింగిన విషయమే. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము లనునవి మన పంచాంగము యొక్క యంగములు ఇప్పటి పంచాంగములలో నివిగాక
పెక్కువిషయములీయఁబడినను మొదటి పంచాంగము గుణించు పద్ధతి పుట్టినపుడును. పంచాంగమన్న పేరు పెట్టబడినపుడును, ఈ యైదు విషయములే యందుఁ జూపఁబడుచుండె ననుటకు సందేహము లేదు.
{{c|తిథి}}
పంచాంగమునందు మొదటఁ - జూపఁబడునది తిథి. చంద్రునకును, సూర్యునకును గల యంతరమునుబట్టి తిథి యేర్పడును. అమావాస్యదినమున (క్షణమున) చంద్రసూర్యులిద్దరును కలిసియుందురు. అమావాస్య యనఁగఁ గలిసియుండుట.<noinclude><references/></noinclude>
44qrov2elo5n9racq1cysbparz8lkz0
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/231
104
214280
559763
2026-06-15T22:26:53Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559763
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|29]|పంచాంగము|225}}</noinclude>అనగా ఆదినమున సూర్యచంద్రులిద్దరికిని గల పూర్వ పశ్చిమాంతరము (0) సున్న. ఇట్లున్నసమయమున అమావాస్యగడియలు పూర్తియగును. అప్పటినుండి సూర్యచంద్రులు మరల ప్రయాణమునకు బయలుదేరుదురు. సూర్యుఁడు మందముగ నడచును<ref>నిజముగా నడచునది మనభూమి. అందుచే సూర్యు---------' నట్లు కనిపించును. అయినను భాషాసౌకర్యమునకై సూ----------- చును. ఇన్నవరాశిలోఁ బ్రవేశించును, ఇన్నవ నక్షత్రము---------- చును అని వ్రాయఁబడును. చదువరులు సూర్యుఁడే ------------ నని భయపడవలదు.</ref>. చంద్రుఁడు వేగముగ నడచును. చంద్రుఁడు దినమునకు రమారమి 13<sup>0</sup> - 20 నడచును. సూర్యుఁడు రమారమి 1<sup>0</sup> నడచును. ఈ యిద్దరికిని 12<sup>0</sup> (అంశములు) అంతరము కలుగగానే ఒక తిథియగును. అనగా నప్పటికి 1 పాడ్యమి పూర్తియగును. చంద్రసూర్యులకు 24<sup>0</sup> (అంశములు) అంతరము గలిగినప్పుడు విదియతిథి పూర్తియగును. 36<sup>0</sup> అంతరమున్నపుడు
తదియ పూర్తియగును. 180<sup>0</sup> భేదమున్నపుడు 1' అనగా పౌర్ణిమ యగును. 264<sup>0</sup> భేదమున్నపుడు బహుళ 7 మి తిథిపూర్తియగును. 360<sup>0</sup> అంతర మున్నపు డనగా నేమియు నంతరము లేక యిద్దరు మరల కలసినపుడు అమావాస్య యగును.
ఇట్లు తిథి తెలిసికొనవలయు నన్నయెడల సూర్యచంద్రాదు లెన్నవయింట నెచ్చటనున్నది తెలిసికొని చంద్రునిలో నుండి సూర్యునిఁ దీసివేసి మిగిలిన యంశములను 12<sup>0</sup> చే భాగింపగా తిథులు వచ్చును.
ఈ సంగతియే యీ క్రింది సమీకరణముచే సూచింపవచ్చును.
చం_స్తూ
12<sup>0</sup> = తిథులు
చంద్రసూర్యులకు ౧౨౦ అంతరము కలుగుటకు సాధారణముగా మధ్యమమానమున 59 గడియలు 4 విగడియలు (23 గంటల 37 మినిట్ల 28.093 సెకెనులు) పట్టును. ఇట్టి తిథులు ౩౦ యైన<noinclude><references/></noinclude>
0ocrg7vh3gg4sei81pwud6te8sz87ko
పుట:శశిరేఖాపరిణయము.pdf/41
104
214281
559772
2026-06-16T04:15:03Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
559772
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఇద్దఱి కారు కధ్వనికి నింద్ర తనూజునిరాణి దిగ్గునన్
నిద్దుర లేచి చూచి తననెమ్మది నిట్లని యెంచే నౌర నా
ముద్దులపట్టిపై ధనువు మోసిడి రాక్షసుఁ డుగ్రమూర్తియై
తద్దయుఁ బోరఁ జొచ్చెనిది తప్పునుపాయము నేమిసేయుదున్.</poem>|ref=145}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మాధవాగ్ర జుఁ డాడుమాటలు కలిగి నే నిట వచ్చుటను గదా యింతపుట్టెఁ
దామసం బెవరికిఁ దగ దంచుఁ బెద్దలు చెప్పెడు వాక్యముల్ సిద్ధమయ్యె
హలిపుత్రి నాపట్టి కర్పింతు నన నేల నిభపురేంద్రునిపట్టి కివ్వ నేల
పలుమారు నతని నేఁ బ్రార్థింపఁగా నేల నందుకుఁ బలుమాట లాడ నేల</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>చేరి సౌభద్రుతో నేను జెప్పనేల, వీఁడు ననుఁ బిల్చుకొని రాత్రి వెడల నేల
ఘోరవనమున నీబాధ నంద నేల, నెట్టు లున్నది తలఁపఁగా నీశ్వరాజ్ఞ</poem>|ref=146}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియును.</poem>|ref=147}}
{{Telugu poem|type=క.|lines=<poem>కొఱమాలినరక్కసుతో, దురమునఁ బోరాడఁ గలఁడె దురితాటవిలో
సరయఁగ నెవ్వరు లేరీ, సురవైరిని సంహరించి సుతు రక్షింపన్.</poem>|ref=148}}
{{Telugu poem|type=క.|lines=<poem>పాపాత్ముని శరముల నా, పాపఁడు మృతి నొందకుండ భయదాటవులన్
గాపాడువార లెవ్వరు, కాపాలియతక్క దిక్కు గలరే మాకున్.</poem>|ref=149}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు సుభద్ర చింతించుచున్నసమయంబున హిడింబియుం జనుదెంచి వారిరువురు
గయ్యంబు సేయం జూచి తనమనంబున నిట్లను శస్త్రాస్త్రవిద్యాధురీణుం డగు రాకు
మారునితో నాకుమారునకుఁ గయ్యంబు సేయుసామర్థ్యంబు గలదే యని వితర్కించు
చుండె నప్పుడు.</poem>|ref=150}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>హైడింబుఁ డనలాస్త్ర మదరింప సౌభద్రుం డైంద్రబాణంబున నదియుఁ ద్రుంచెఁ
గుంతిమధ్యమపుత్రుకొడుకు యామ్యాస్త్రంబుఁ బరపిన వీక్షించి పార్థసుతుఁడు
పర్జన్యకరమున భస్మంబు గావించి తొమ్మిది విశిఖముల్ ఱొమ్ముఁ దూర
నాటినఁ గోపించి నరభోజనుం డాఱు విశిఖంబు లేసిన విజయసుతుఁడుఁ</poem>}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గనలి వింశతి శరముల దనుజు నేసె, మరల రాక్షసుఁ డొకనూఱుమార్గణములు
తనువుఁజొర నేయఁ బార్థునితనయుఁ డాఱు, నూఱుళరములదనుజుమైఁదూరనేసె.</poem>}}
{{Telugu poem|type=క.|lines=<poem>భండనమున వా రిరువురు, నొండొరుల జయింపలేక నొకరీతిగ వే
దండారియుగముపోలిక, దండధరద్వయముమాడ్కి దర్పోజ్జ్వలు లై.</poem>|ref=152}}
{{Telugu poem|type=వ.|lines=<poem>వలలంబునకై పెనంగుసాళువంబులు తెఱంగున బెబ్బులులపగిదిం బోరిపోరి హైడింబుం
డబ్జభదా స్త్రంబుఁ దొడిగినం జూచి సౌభద్రుఁడు నదియే సంధించె నాసమయంబునఁ
గులాచలంబులు చలించె రవిచంద్రులు మార్గంబులు దప్పి రమరులు. భయాకులిత</poem>}}<noinclude><references/></noinclude>
dy7q6z8ez23f13ceabu6sphnxyhoffr
559782
559772
2026-06-16T09:29:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
559782
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఇద్దఱి కార్ముకధ్వనికి నింద్రతనూజునిరాణి దిగ్గునన్
నిద్దుర లేచి చూచి తననెమ్మది నిట్లని యెంచె నౌర నా
ముద్దులపట్టిపై ధనువు మోసిడి రాక్షసుఁ డుగ్రమూర్తియై
తద్దయుఁ బోరఁ జొచ్చె నిది తప్పునుపాయము నేమి సేయుదున్.</poem>|ref=145}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మాధవాగ్రజుఁ డాడుమాటలు కలిగి నే నిట వచ్చుటను గదా యింత పుట్టెఁ
దామసం బెవరికిఁ దగ దంచుఁ బెద్దలు చెప్పెడు వాక్యముల్ సిద్ధమయ్యె
హలిపుత్రి నాపట్టి కర్పింతు నన నేల నిభపురేంద్రునిపట్టి కివ్వ నేల
పలుమారు నతని నేఁ బ్రార్థింపఁగా నేల నందుకుఁ బలుమాట లాడ నేల</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>చేరి సౌభద్రుతో నేను జెప్పనేల, వీఁడు ననుఁ బిల్చుకొని రాత్రి వెడల నేల
ఘోరవనమున నీబాధ నంద నేల, నెట్టు లున్నది తలఁపఁగా నీశ్వరాజ్ఞ.</poem>|ref=146}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియును.</poem>|ref=147}}
{{Telugu poem|type=క.|lines=<poem>కొఱమాలినరక్కసుతో, దురమునఁ బోరాడఁ గలఁడె దురితాటవిలో
నరయఁగ నెవ్వరు లేరీ, సురవైరిని సంహరించి సుతు రక్షింపన్.</poem>|ref=148}}
{{Telugu poem|type=క.|lines=<poem>పాపాత్ముని శరముల నా, పాపఁడు మృతి నొందకుండ భయదాటవులన్
గాపాడువార లెవ్వరు, కాపాలియతక్క దిక్కు గలరే మాకున్.</poem>|ref=149}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు సుభద్ర చింతించుచున్నసమయంబున హిడింబియుం జనుదెంచి వారిరువురు
గయ్యంబు సేయం జూచి తనమనంబున నిట్లను శస్త్రాస్త్రవిద్యాధురీణుం డగు రాకు
మారునితో నాకుమారునకుఁ గయ్యంబు సేయుసామర్థ్యంబు గలదే యని వితర్కించు
చుండె నప్పుడు.</poem>|ref=150}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>హైడింబుఁ డనలాస్త్ర మడరింప సౌభద్రుఁ డైంద్రబాణంబున నదియుఁ ద్రుంచెఁ
గుంతిమధ్యమపుత్రుకొడుకు యామ్యాస్త్రంబుఁ బరపిన వీక్షించి పార్థసుతుఁడు
పర్జన్యశరమున భస్మంబు గావించి తొమ్మిది విశిఖముల్ ఱొమ్ముఁ దూర
నాటినఁ గోపించి నరభోజనుం డాఱు విశిఖంబు లేసిన విజయసుతుఁడుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గనలి వింశతి శరముల దనుజు నేసె, మరల రాక్షసుఁ డొకనూఱుమార్గణములు
తనువుఁ జొర నేయఁ బార్థునితనయుఁ డాఱు, నూఱుశరముల దనుజుమైఁ దూరనేసె.</poem>|ref=151}}
{{Telugu poem|type=క.|lines=<poem>భండనమున వా రిరువురు, నొండొరుల జయింపలేక నొకరీతిగ వే
దండారియుగముపోలిక, దండధరద్వయముమాడ్కి దర్పోజ్జ్వలు లై.</poem>|ref=152}}
{{Telugu poem|type=వ.|lines=<poem>వలలంబునకై పెనంగుసాళువంబుల తెఱంగున బెబ్బులులపగిదిం బోరిపోరి హైడింబుం
డబ్జభవాస్త్రంబుఁ దొడిగినం జూచి సౌభద్రుఁడు నదియె సంధించె నాసమయంబునఁ
గులాచలంబులు చలించె రవిచంద్రులు మార్గంబులు దప్పి రమరులు భయాకులిత</poem>}}<noinclude><references/></noinclude>
rmy702euyz23yhcgqdx55dkioq9iurv
రచయిత:పాటిబండ సూర్యనారాయణామాత్యులు
102
214282
559774
2026-06-16T05:22:03Z
Vjsuseela
1850
[[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = పాటిబండ |అసలుపేరు = సూర్యనారాయణామాత్యులు |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = 1879 |గిట్టిన_యేడు = |వివరణ = న్యాయవాది, ఆధ్యాత్మికవేత్త, రచయిత. |బొమ్మ= |వికీపీడి...'
559774
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = పాటిబండ
|అసలుపేరు = సూర్యనారాయణామాత్యులు
|పేరు_మొదటి_అక్షరం = ప
|పుట్టిన_యేడు = 1879
|గిట్టిన_యేడు =
|వివరణ = న్యాయవాది, ఆధ్యాత్మికవేత్త, రచయిత.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = పాటిబండ సూర్యనారాయణామాత్యులు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
కవి, పండితులు అయిన పాటిబండ వేంకటప్పయ్యకవి గారి కుమారుడు.ఈయన శంకరాచార్యుల సిద్ధాంతాల గ్రంథాలను తెలుగులోకి అనువదించి, వ్యాఖ్యానించారు. ఆయన రచనలలో బ్రహ్మసూత్రములు (ద్వితీయాధ్యాయం), శ్రీమచ్ఛంకర భగవత్పాదాచార్య ప్రణీత ఆత్మబోధ (1990). కుమారుడు పాటిబండ ప్రసాదరావు.
syqj6rrme948vbhqicpb50ff2jj5sci
వాడుకరి:Vihuu18
2
214283
559777
2026-06-16T07:20:54Z
Vihuu18
7318
[[WP:AES|←]]Created page with ''''First Name''': Vishal Royal, '''Surname''': Ragamsetty <big>Worked on Works:</big><br> <big>'''తెనుగు:'''</big><br> <big>[[రచయిత:కోట వెంకటాచలం]]</big><br><big>రచనలు</big> [[ఆంధ్రులెవరు?]]<br> [[జంబూద్వీపము (అందలి వర్షవిభాగములు)]]<br> <big>'''English:'''</big><br> <big>By రచయిత:కోట వెంకటా...'
559777
wikitext
text/x-wiki
'''First Name''': Vishal Royal, '''Surname''': Ragamsetty
<big>Worked on Works:</big><br>
<big>'''తెనుగు:'''</big><br>
<big>[[రచయిత:కోట వెంకటాచలం]]</big><br><big>రచనలు</big>
[[ఆంధ్రులెవరు?]]<br>
[[జంబూద్వీపము (అందలి వర్షవిభాగములు)]]<br>
<big>'''English:'''</big><br>
<big>By [[రచయిత:కోట వెంకటాచలం|Kota Venkatachalam]]</big><br>
s72xc8oynsx9hkg76vt3l26wald4dfe
559779
559777
2026-06-16T07:31:42Z
Vihuu18
7318
559779
wikitext
text/x-wiki
'''First Name''': Vishal Royal, '''Surname''': Ragamsetty
<big>Worked on Works:</big><br>
<big>'''తెనుగు:'''</big><br>
<big>[[రచయిత:కోట వెంకటాచలం]]</big><br>వారి<big>రచనలు</big>
[[ఆంధ్రులెవరు?]]<br>
[[జంబూద్వీపము (అందలి వర్షవిభాగములు)]]<br>
<big>'''English:'''</big><br>
<big>By [[రచయిత:కోట వెంకటాచలం|Kota Venkatachalam]]</big><br>
8ws92slqt9nubktbxayitnkkc5hx931
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/232
104
214284
559784
2026-06-16T09:47:17Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
559784
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|226|శాస్త్రవిషయములు|}}</noinclude>చాంద్రమాస మగును. చాంద్రమాసమునకు 3౦ తిథులున్నను. దినములు మధ్యమమానమున 29½ దినములే. ఇట్టివి 12 నెలలైన ఒక చాంద్రసంవత్సర మగును. ఇట్టి సంవత్సరమునందు 360 తిథులున్నను
దినములు మాత్రము 354. కావున సంవత్సరములో తిథులు వృద్ధి క్షయములఁ జెంది 6 దినములు తగ్గును. సాధారణముగఁ బండ్రెండు చాంద్రమాసములలో 13 క్షయతిథులును, 7 వృద్దితిథులును వచ్చును.
సూర్యచంద్రుల వేగము లొకప్పుడు శీఘ్రముగను, ఒకప్పుడు మందముగను ఉండుటచే తిథు లన్నియు సమానకాలమును వ్యాపింపవు. కొన్ని పెద్దవిగను, కొన్ని చిన్నవిగను ఉండును. కొన్ని తిథులు 65 గడియల కాలమును మించవచ్చును; కొన్ని 53 గడియలే వ్యాపింప వచ్చును. తిథి వ్యాపించు నట్టికాలము లీక్రిందఁ జదువరుల సౌకర్యార్థమై యీయఁబడుచున్నవి :
{| style="margin-left:5em;border:0px;"
|-
| మధ్యమ || గడి - పల* - విపల || గంట - మి - సె
|-
| తిథి || 59 - 3 - 40.23 || 23 - 37 - 28.092
|-
| మిక్కిలి పెద్దది || 65 - 16 - 0 || 26 - 6 - 24
|-
| మిక్కిలి చిన్నది || 53 - 56 - 0 || 21 - 34 - 24
|}
ఇట్లు తిథి యొకసమయమందుఁ బూర్తియగునన్న నియమము లేదు. ఒకప్పుడు సూర్యోదయసమయమందు, మఱియొకప్పుడు పగలు, ఇంకొకప్పుడు రాత్రి పూర్తికావచ్చును. కాని మన పంచాంగములందు, సూర్యోదయకాలమందు నేతిథి యుండునో దానినే చూపుదురు. అదియే యా దినమునకు వ్యవహారమునకై తిథి. ఆంధ్రపత్రిక సంవత్సరాదిసంచికలోని పింగళనామసంవత్సర పంచాంగమందలి సంవత్సరాది పండుగదినమున నిచ్చిన తిథి చూడుఁడి. అందు "ప్ర 3-48" అని వ్రాయఁబడియున్నది. ప్ర అనగా ప్రతిపద -------- ఆదినము సూర్యోదయకాలమున పాడ్యమితిథి యుండె
లనగా విగడియలు.
పాడ్యమి, విదియ, తదియ, చవితి, అనునవి ప్రధమా.
చతుర్థీ అను సంస్కృతపదములకుఁ దెలుఁగు<noinclude><references/></noinclude>
aiepxlki6qyblryjynz52phdn1g00y7
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/233
104
214285
559785
2026-06-16T10:05:22Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559785
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||పంచాంగము|227}}</noinclude>ననియు, అది సూర్యోదయానంతరమున 3 గడియల 48 విగడియల కాలమునకుఁ బూర్తియగుననియు దీని కర్థము. ఈ పాడ్యమితిథి తొలి దినమున సూర్యోదయానంతరమున 8-27 కే ప్రారంభ మైనది. కాని ఆ దినము సూర్యోదయకాలమందు అమావాస్య యుండుటవలన నాదిసమునకు వ్యవహారవిషయమై అమావాస్య యనియే పేరువచ్చెను. సంవత్సరాదిపండుగదినమున పాడ్యమి సూర్యోదయానంతరము 3 గడియల 48 విగడియల (1 గంట 31 నిమిషముల) కాలము మాత్ర మున్నను, అది సూర్యోదయ కాలమం దుండుటచే నాదినముననే (మార్చి 24 వ తేది శనివారమునాడే) పాడ్యమియై సంవత్సరాదిపండుగ వచ్చెను. ఆనాఁడు "ప్ర ౩-48" ఉండెననగా నేమి యర్థము? 3-49 కి విదియ ప్రారంభమైనదని, అదిఆదినమంతయు ననగా మరుఁనాడుసూర్యోదయము వఱకు 56 గడియలు 12 విగడియలు ఉండెను. ఇట్లు మార్చి 24 వ తేదీన పాడ్యమి 3-48 కాలము మాత్ర మున్నది. విదియ 56-12<ref>గడియలను విగడియలను గంటలుగ మార్చుకొనవలెనన్న, గడియ=24 మినిట్లు, విగడియ = 24 సెకనులు అన్న లెక్క ప్రకారము మార్చుకొన వచ్చును</ref> కాల మున్నది. అయినను సూర్యు డుదయించినపుడు పాడ్యమి యుండుటచే నాఁడు పాడ్యమియే యయ్యె. కావున ఒకానొక దినము తిధిని నిర్ణయము చేయుటలో, ఆ దిన మేతిథి యెక్కువకాలమును వ్యాపించె నని చూడ నక్కర లేదు. సూర్యోదయకాలమున నేతిథి యుండునో చూడవలెను. సూర్యుఁడుదయించిన తరువాత నాతిథి యొక విఘడియ కాలమున్నను సరే.
మార్చి 25 వ తేదీని పంచాంగములో నేమి వ్రాయబడియున్నదో చూడుడు. ‘ద్వి 0-1 తృతీయా 57-11" దీనికర్ధమేమి? ఆ దినమున సూర్యోదయకాలమందు విదియగడియ లుండెననియు, అది సూర్యుఁ
డుదయించిన తరువాత ఒక విగడియకాలముండి సమాప్త మైనదనియు, తరువాత తదియవచ్చి 57-11 వఱకు సుండెననియు; బిదప చవితి<noinclude><references/></noinclude>
cqf7f5w3i3q6pbemo2xzcsz0u3sl3to
559786
559785
2026-06-16T10:06:17Z
శ్రీరామమూర్తి
1517
559786
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||పంచాంగము|227}}</noinclude>ననియు, అది సూర్యోదయానంతరమున 3 గడియల 48 విగడియల కాలమునకుఁ బూర్తియగుననియు దీని కర్థము. ఈ పాడ్యమితిథి తొలి దినమున సూర్యోదయానంతరమున 8-27 కే ప్రారంభ మైనది. కాని ఆ దినము సూర్యోదయకాలమందు అమావాస్య యుండుటవలన నాదిసమునకు వ్యవహారవిషయమై అమావాస్య యనియే పేరువచ్చెను. సంవత్సరాదిపండుగదినమున పాడ్యమి సూర్యోదయానంతరము 3 గడియల 48 విగడియల (1 గంట 31 నిమిషముల) కాలము మాత్ర మున్నను, అది సూర్యోదయ కాలమం దుండుటచే నాదినముననే (మార్చి 24 వ తేది శనివారమునాడే) పాడ్యమియై సంవత్సరాదిపండుగ వచ్చెను. ఆనాఁడు "ప్ర ౩-48" ఉండెననగా నేమి యర్థము? 3-49 కి విదియ ప్రారంభమైనదని, అదిఆదినమంతయు ననగా మరుఁనాడుసూర్యోదయము వఱకు 56 గడియలు 12 విగడియలు ఉండెను. ఇట్లు మార్చి 24 వ తేదీన పాడ్యమి 3-48 కాలము మాత్ర మున్నది. విదియ 56-12<ref>గడియలను విగడియలను గంటలుగ మార్చుకొనవలెనన్న, గడియ=24 మినిట్లు, విగడియ = 24 సెకనులు అన్న లెక్క ప్రకారము మార్చుకొన వచ్చును</ref> కాల మున్నది. అయినను సూర్యు డుదయించినపుడు పాడ్యమి యుండుటచే నాఁడు పాడ్యమియే యయ్యె. కావున ఒకానొక దినము తిధిని నిర్ణయము చేయుటలో, ఆ దిన మేతిథి యెక్కువకాలమును వ్యాపించె నని చూడ నక్కర లేదు. సూర్యోదయకాలమున నేతిథి యుండునో చూడవలెను. సూర్యుఁడుదయించిన తరువాత నాతిథి యొక విఘడియ కాలమున్నను సరే.
మార్చి 25 వ తేదీని పంచాంగములో నేమి వ్రాయబడియున్నదో చూడుడు. ‘ద్వి 0-1 తృతీయా 57-11" దీనికర్ధమేమి? ఆ దినమున సూర్యోదయకాలమందు విదియగడియ లుండెననియు, అది సూర్యుఁ డుదయించిన తరువాత ఒక విగడియకాలముండి సమాప్త మైనదనియు, తరువాత తదియవచ్చి 57-11 వఱకు సుండెననియు; బిదప చవితి<noinclude><references/></noinclude>
gkf61hd4k7w77pssd88rki36j9pev41
పుట:ఆంధ్రులెవరు?.pdf/10
104
214286
559787
2026-06-16T10:06:38Z
Vihuu18
7318
/* అచ్చుదిద్దారు */
559787
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude>మ్లేచ్ఛులై, మ్లేచ్ఛాచారముల నాశ్రయించి పర్వతారణ్యముల నివసించుచుండినవారలు తిరిగి వైదిక సాంప్రదాయము ననుసరించుట కలలోనివార్త. అట్టివారిని వైదిక ధర్మ ప్రవర్తకులుగా నెవ్వరును సంగీకరింపరు. వేదాధ్యయనము నొదిలి యొకటి రెండు పురుషాంతరముల నుండి హూణవిద్యాభ్యాస మొనర్చుచుండిన యిప్పటి బ్రాహ్మణకుటుంబములలోనె తిరిగి వేదాభ్యాస మొనర్చువారు లేకుండుట మనము ప్రత్యక్షముగా చూచుచుంటిమి గదా స్వచ్ఛముగా మాటలు మాటలాడుట కూడా యిప్పుడింగ్లీషు చదువుచుండిన బ్రాహ్మణపిల్లలలోనే కనుబడుట లేదు. "బ్రాహ్మణుడు” అని యుచ్చరించవలసిన చోట “భామ్మడు” అని యుచ్చరించు చుండుట నూటికి యిరువదియైదు మంది బ్రాహ్మణ పిల్లలలోనే యిప్పుడు మనము చూచు
చున్నాము. ఇట్టి స్థితిలో పితృశాపహతులై, గోత్రప్రవరలను, వైదికకర్మాధికారమును బోగొట్టుకొని వేదశాస్త్రాది విద్యాభ్యాసమును త్యజించి, యనాచారులై, సంఘదూరులై, సత్పురుషులచేతను, మతగురువులచేతను, చాతుర్వర్ణ్య ప్రజలచేతను పరిత్యజింపబడి, ఆర్యవేషభాషల నొదలి బాహ్యజాతులుగా మారిపోయి పర్వతారణ్యముల వసించి, అడవి మృగములను వేటాడియు, దార్లుకొట్టియు జీవించుచు
కొన్ని వేల సం౹౹రముల అనంతరము తిరిగి వైదిక ధర్మావలంబులగుటయు సంఘము దాని నంగీకరించుటయు యెట్లు పొసగును ? ఇది విజ్ఞు లంగీకరింపదగినది కాదు. <u>గనుక ఆంధ్రులు శాపహతులైన విశ్వామిత్రుని సంతానము కానేరరు.</u><br>
<center>
===శునశ్శేపుని చరిత్ర===
</center>
ఆధునిక చరిత్రకారులకు సులభసాధ్యముగా నుండుటకుగాను
ఐతరేయ బ్రాహ్మణములో వినబడుచుండిన శాపహతులైన విశ్వామిత్రుని సంతానమునకు సంబంధించిన చరిత్ర నిచ్చట నిచ్చుచుంటిమి :<br>
హరిశ్చంద్రుడను యొక రాజుగలడు. అతడు తనకు కుమారుడు గలిగినయెడల తన కుమారుని యజ్ఞపశువుగాజేసి యాగముచేయునట్లు<noinclude><references/></noinclude>
fenqwnlbl43a8d6iquiz5bptx6478ln
559788
559787
2026-06-16T10:09:13Z
Vihuu18
7318
559788
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude>మ్లేచ్ఛులై, మ్లేచ్ఛాచారముల నాశ్రయించి పర్వతారణ్యముల నివసించుచుండినవారలు తిరిగి వైదిక సాంప్రదాయము ననుసరించుట కలలోనివార్త. అట్టివారిని వైదిక ధర్మ ప్రవర్తకులుగా నెవ్వరును సంగీకరింపరు. వేదాధ్యయనము నొదిలి యొకటి రెండు పురుషాంతరముల నుండి హూణవిద్యాభ్యాస మొనర్చుచుండిన యిప్పటి బ్రాహ్మణకుటుంబములలోనె తిరిగి వేదాభ్యాస మొనర్చువారు లేకుండుట మనము ప్రత్యక్షముగా చూచుచుంటిమి గదా స్వచ్ఛముగా మాటలు మాటలాడుట కూడా యిప్పుడింగ్లీషు చదువుచుండిన బ్రాహ్మణపిల్లలలోనే కనుబడుట లేదు. "బ్రాహ్మణుడు” అని యుచ్చరించవలసిన చోట “భామ్మడు” అని యుచ్చరించు చుండుట నూటికి యిరువదియైదు మంది బ్రాహ్మణ పిల్లలలోనే యిప్పుడు మనము చూచు
చున్నాము. ఇట్టి స్థితిలో పితృశాపహతులై, గోత్రప్రవరలను, వైదికకర్మాధికారమును బోగొట్టుకొని వేదశాస్త్రాది విద్యాభ్యాసమును త్యజించి, యనాచారులై, సంఘదూరులై, సత్పురుషులచేతను, మతగురువులచేతను, చాతుర్వర్ణ్య ప్రజలచేతను పరిత్యజింపబడి, ఆర్యవేషభాషల నొదలి బాహ్యజాతులుగా మారిపోయి పర్వతారణ్యముల వసించి, అడవి మృగములను వేటాడియు, దార్లుకొట్టియు జీవించుచు
కొన్ని వేల సం౹౹రముల అనంతరము తిరిగి వైదిక ధర్మావలంబులగుటయు సంఘము దాని నంగీకరించుటయు యెట్లు పొసగును ? ఇది విజ్ఞు లంగీకరింపదగినది కాదు. <u>గనుక ఆంధ్రులు శాపహతులైన విశ్వామిత్రుని సంతానము కానేరరు.</u><br>
<center>
{{p|fs125}}'''శునశ్శేపుని చరిత్ర'''</p>
</center>
ఆధునిక చరిత్రకారులకు సులభసాధ్యముగా నుండుటకుగాను
ఐతరేయ బ్రాహ్మణములో వినబడుచుండిన శాపహతులైన విశ్వామిత్రుని సంతానమునకు సంబంధించిన చరిత్ర నిచ్చట నిచ్చుచుంటిమి :<br>
హరిశ్చంద్రుడను యొక రాజుగలడు. అతడు తనకు కుమారుడు గలిగినయెడల తన కుమారుని యజ్ఞపశువుగాజేసి యాగముచేయునట్లు<noinclude><references/></noinclude>
t6cbbreuyh0l5q89el0oyjyj22i94wj
559795
559788
2026-06-16T10:42:31Z
Vihuu18
7318
indents are corrected
559795
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude>మ్లేచ్ఛులై, మ్లేచ్ఛాచారముల నాశ్రయించి పర్వతారణ్యముల నివసించుచుండినవారలు తిరిగి వైదిక సాంప్రదాయము ననుసరించుట కలలోనివార్త. అట్టివారిని వైదిక ధర్మ ప్రవర్తకులుగా నెవ్వరును సంగీకరింపరు. వేదాధ్యయనము నొదిలి యొకటి రెండు పురుషాంతరముల నుండి హూణవిద్యాభ్యాస మొనర్చుచుండిన యిప్పటి బ్రాహ్మణకుటుంబములలోనె తిరిగి వేదాభ్యాస మొనర్చువారు లేకుండుట మనము ప్రత్యక్షముగా చూచుచుంటిమి గదా స్వచ్ఛముగా మాటలు మాటలాడుట కూడా యిప్పుడింగ్లీషు చదువుచుండిన బ్రాహ్మణపిల్లలలోనే కనుబడుట లేదు. "బ్రాహ్మణుడు” అని యుచ్చరించవలసిన చోట “భామ్మడు” అని యుచ్చరించు చుండుట నూటికి యిరువదియైదు మంది బ్రాహ్మణ పిల్లలలోనే యిప్పుడు మనము చూచు
చున్నాము. ఇట్టి స్థితిలో పితృశాపహతులై, గోత్రప్రవరలను, వైదికకర్మాధికారమును బోగొట్టుకొని వేదశాస్త్రాది విద్యాభ్యాసమును త్యజించి, యనాచారులై, సంఘదూరులై, సత్పురుషులచేతను, మతగురువులచేతను, చాతుర్వర్ణ్య ప్రజలచేతను పరిత్యజింపబడి, ఆర్యవేషభాషల నొదలి బాహ్యజాతులుగా మారిపోయి పర్వతారణ్యముల వసించి, అడవి మృగములను వేటాడియు, దార్లుకొట్టియు జీవించుచు
కొన్ని వేల సం౹౹రముల అనంతరము తిరిగి వైదిక ధర్మావలంబులగుటయు సంఘము దాని నంగీకరించుటయు యెట్లు పొసగును ? ఇది విజ్ఞు లంగీకరింపదగినది కాదు. <u>గనుక ఆంధ్రులు శాపహతులైన విశ్వామిత్రుని సంతానము కానేరరు.</u><br>
{{center|{{p|fs125}}'''శునశ్శేపుని చరిత్ర'''</p>
}}
{{gap}}ఆధునిక చరిత్రకారులకు సులభసాధ్యముగా నుండుటకుగాను ఐతరేయ బ్రాహ్మణములో వినబడుచుండిన శాపహతులైన విశ్వామిత్రుని సంతానమునకు సంబంధించిన చరిత్ర నిచ్చట నిచ్చుచుంటిమి:<br>
{{gap}}హరిశ్చంద్రుడను యొక రాజుగలడు. అతడు తనకు కుమారుడు గలిగినయెడల తన కుమారుని యజ్ఞపశువుగాజేసి యాగముచేయునట్లు<noinclude><references/></noinclude>
hice46cyryu9ybc9cqx2gwo8sk3601t
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/234
104
214287
559790
2026-06-16T10:22:17Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
559790
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|228|శాస్త్రవిషయములు|}}</noinclude>ప్రవేశించెననియు నర్థము. ఇట్లాయొకదినమున 0-1 కాలము విదియ, 57-10 కాలము తదియ, 0-49 కాలము చవితి - అను మూడు తిథు లుండెను. కాని ప్రొద్దు పొడిచినప్పుడు విదియ యుండుటచే నాదినము విదియయే యనిపించుకొనును. 26 వ తేదిన యేమి వ్రాయఁబడియున్నది? "చ55-29" అనగా నా దినము చవితి.
ఇట్లు 25 వ తేదిన పత్రములు వ్రాసికొనిన యెడల విదియ యని వ్రాయుదురు, 26 వ తేదిన పత్రముల వ్రాసిన చవితి అని వ్రాయుదురు. మథ్య తదియగతి యేమి? వ్యవహారములో నది యే దినమునకును సంబంధించినది కాకుండాఁబోవును; ఇట్టిదానినే క్షయ తిథియందురు. ఒకదినము సూర్యోదయ మైనతరువాతఁ బుట్టి మఱునాడు సూర్యోదయ మగుటకుఁ బూర్వమే పూర్తియగునది క్షయతిధి. ఇట్టి క్షయతిధి 60 గడియలకంటె దక్కువకాలము వ్యాపించియుండును. ఈ తదియ 25 వ తేదిన 0-2 కుఁ ప్రారంభమై ఆదినముననే 57-11 కుఁ బూర్తియయ్యెను గాన దీని వ్యాప్తికాలము 57-10. ఇట్లే కొన్ని తిథులు వృద్ధిఁ జెందును. ఇవి 60 గడియలకంటె నెక్కుడుకాల ముండును. ఇట్టిది యొకదినమున సూర్యోదయానంతరమునఁ జాల కాలమునకుఁబ్రారంభమైన, రెండివదిన మంతయు 60 గడియలును ఉండి, మూడవదినము సూర్యోదయకాలమునందుండి తరువాత కొద్ది కాలమునకుఁ బూర్తి యగును; ఇట్లది మూడుదినములను తగిలి రెండు దినములకుఁ దనపేరు నొసంగును. ఇందుకుదాహరణము.
మార్చి 26 గురువారము దినమున సప్తమి 57-52 కుఁ బూర్తియగును. అష్టమి ప్రారంభమగును. అది 30 వ తేది శుక్రవారమంతయు (60 ఘడియలును) ఉండును. 31 వ తేది శనివారమున సూర్యోదయానంతము 1-5 కిఁ బూర్తియగును. ఇట్లీ 8 మి గురు, శుక్ర, శనివారములన్న మూడుదినములను స్పృశించినది కావున దీనిని 'త్రిదివస్పృక్' అందురు, శుక్రశనివారముల సూర్యోదయ కాలమందు 8 మి ఉండుటచే, వ్యవహారమునందు శుక్రవారము 8 మి, శని<noinclude><references/></noinclude>
fom4sgyg55wfqboy9utc2d0m0f3n3lq
పుట:Artharakshamani018205mbp.pdf/3
104
214288
559791
2026-06-16T10:30:09Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
559791
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{c|శ్రీరస్తు.}}
{{c|శ్రీపరమాత్మనే నమః}}
{{p|fs150|ac}}అవతారిక</p>
మహాజనులారా! సంసారసముద్రమున మునిగి యుక్కిరి బిక్కిరి యగుచుండు మానవకోటి, కొంచెము తల యెత్తి యూపిరి పుచ్చుకొనుచు విశ్రాంతి నొందుట కనుకూలముగా లోకోపకారపరాయణులు జ్ఞాననిధులు మహర్షులు పరమార్థసాధకము లగుబహుగ్రంథములు రచియించి కీర్తిశరీరముతోఁ దేజరిల్లు చున్నవారు; వారట్లు విరచించిన గ్రంధము లన్నిటియందు నాబాలగోపాలము సర్వజనామోద సంధాయకము అయి విలసిల్లుగ్రంథ రాజములు మూడు. అవియే భారత భాగవత రామాయణములు, సాధారణముగ నీ మూఁడిటి యందలి యంశములను స్వీకరించియే యాంధ్రగీర్వాణమహాకవు లనేకులు సరసము లయినసుప్రసిద్ధ కావ్యనాటకములను గల్పించి వాసి
కెక్కినవారు.
భారతకథయుండు నాకుఁ గలప్రీతిచేత భట్టనారాయణ మహాకవిప్రణీత మగు
వేణీసంహార మనుసంస్కృతనాటకము నేను గొన్ని సంవత్సరముల కిందటఁ దెలిగించి యాంధ్రమహాజనుల మన్ననకు భాజనము గాఁ జాలికిని, అట్లే భాగవతమునందలి పరమభక్తిం జేసి శ్రీకృష్ణభగవానుని మహిమాదులను బొగడుచు ముందుగ నందనందన శతకము, పదపడి యాపదుద్ధారక శతకము విరచించి ప్రకటించితిని.
{{nop}}<noinclude><references/></noinclude>
t14xn3zlsso8kc01k7tshes1n5kfyib
పుట:ఆంధ్రులెవరు?.pdf/11
104
214289
559792
2026-06-16T10:33:35Z
Vihuu18
7318
/* అచ్చుదిద్దారు */
559792
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude>వరుణునిగూర్చి మ్రొక్కుకొనెను. ఆ పిమ్మట వరుణుని యనుగ్రహమున నాతనికి కుమారుడు గలిగెను. కాని నాతడెప్పటికప్పుడు యజ్ఞమును జేయుటకు సుముఖుడుగాక కాలమును దాట వేయుచుండెను. తన ప్రతిజ్ఞను పాటింపక కాలమును గడుపుచుండిన రాజును వరుణ దేవుడు "జలోదర వ్యాధి గ్రస్తుడవవుదువుగాక" అని శపించెను. ఆ శాప వశమున రాజు వ్యాధిగ్రస్తుడై తన దోషమును తెలిసికొని యజ్ఞమును చేయ సంకల్పించాను. యజ్ఞపశువుగానుండి ప్రాణములువీడ నిష్టము లేని నాతని కుమారుడు తండ్రియింటిని విడచి అరణ్యములకు పారిపోయెను. అందువలన రాజు చింతాక్రాంతుడై తమ కులగురువైన వసిష్ఠుని సలహావేడెను. అందుకు వసిష్ఠమహాముని ఇట్లుచెప్పెను. “యజ్ఞపశువుగా నుద్దేశింపబడిన నీకుమారుడు పారిపోయినందుకు విచారింపనక్కర లేదు. యజ్ఞ పశువుగానుండి తన శరీరమును దేవతల కర్పింప నిష్టము లేని వానిని యజ్ఞపశువుగా జేయరాదు. అట్టివారిని దేవతలు గ్రహింపరు. గనుక విద్యావంతుడై, యోగ్యుడై దేవతలకు తన శరీరము నర్పింప నిచ్చయించెడి యొక బ్రహ్మచారియైన బ్రాహ్మణకుమారుని దెచ్చి నీ యజ్ఞము చేయవచ్చును." అట్టివానికొరకు ప్రయత్నింపుమనెను. పిమ్మట రాజు కోరినంత ధనమిచ్చి అట్టివానిని దెమ్మని తన మంత్రులను ఋష్యాశ్రమములకు వెదుకబంపెను. వారట్లు దేశములో దిరుగుచు విచారించుచుండిన కాలములో నొక యగ్రహారమున అత్యంత దరిద్రుడగు అజీగర్తుడనెడి బ్రాహ్మణుడుండెను. అతనికి ముగ్గురు కుమారులుండిరి. రాజదూతలాయనను సమీపించి 'ఆర్యా! మీకుగల ముగ్గురు కుమారులలో రాజు నిమిత్తమును, దేవతా ప్రీతి నిమిత్తమును యజ్ఞపశువుగా నుండదగిన యొక కుమారు నీయగలరా?' యని ప్రశ్నింపగా బ్రాహ్మణుడు జ్యేష్ఠకుమారునీయ వీలు లేదనెను. ఆయన భార్య భర్తమాట
లాలించి కనిష్ఠ కుమారునీయుటకు తానంగీకరింపజాలననెను. తల్లిదండ్రుల ప్రసంగములను వినుచుండిన మధ్యమ పుత్రుడిట్లు తలపోసెను. 'నాన్న గారికి జ్యేష్ఠుడును, అమ్మగారికి కనిష్ఠుడును గావలసి యుండిరి. గదా ! మధ్యముడనైన నేనెవరికిని యక్కర లేదు. ఈనా శరీరమును రాజునకు ప్రీతిగా దేవతల కర్పించి స్వర్గమును చూరగొనియెదనని<noinclude><references/></noinclude>
lpdjyndj7de2lxbbxdauoxvm5k4zrrr
పుట:Artharakshamani018205mbp.pdf/4
104
214290
559793
2026-06-16T10:37:10Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
559793
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" />{{c|2}}</noinclude>
ఇప్పుడు శ్రీమద్రామాయణ మనునాధికావ్యము ననుసరించి తారకనాముఁ డగు శ్రీరామచంద్రునిసుగుణముల సంకీర్తనము నేయుచు భగవదనుగ్రహమున నాకుఁ దోఁచిన కల్పనాదులతో నీయార్తరక్షామణి రచియించితిని. ఇందలి పద్య భావములు పెక్కులు చదువరులకు రామాయణ కథాంశముల జ్ఞప్తికిఁ దేఁ జాలినవిగా నుండును. శ్రీరామచంద్రుని భక్తజనుల కీకృతి అత్యంతముదావహము, హృదయాకర్షకము కాఁ గల దని నావిశ్వాసము.
రాజమహేంద్రవర వాస్తవ్యుఁడు కీ. శే. ముడుంబ కృష్ణమాచార్యుల సత్పుత్రుఁడు ప్రతివర్షముఁ జైత్రశుద్ధనవమిని శ్రీ సీతారామ కల్యాణమహోత్సవము హరికథాకాలక్షేపాదులతో నతివైభవమున
నిజభవనమున జరిగించు బాలభక్తుఁడు, శ్రీ రామాచార్యుఁ డీభావ సంవత్సర ఫాల్గునమాసాంతమున నొక్కనాఁ డార్తరక్షామణిలోని కొన్ని పద్యము లర్థసహితముగ నాకడ నాలకించి, యువసంవత్సర
చైత్రమునఁ దాను జరుపనున్న కల్యాణోత్సవమున కేతత్కృతిపఠన మొక యంగము గావలయు ననునుత్సాహముతో ముద్రాభృతి నొసఁగి; శీఘ్రగతి నీకృతిఁ బ్రకటింపఁ గోరెను. ఈ కోరికయే పూర్వోక్త
మగు నావిశ్వాసమునకు ముఖ్యకారణము.
బాలభక్తుఁ డగు నీ శ్రీ రామాచార్యునిచేత స్థాపిత మయిన శ్రీమద్భగవద్భారత సేవాసమాజ మఖిలజనమనోరంజక మగుచు నాచంద్రార్కము వర్ధిల్లుఁ గాక.
ఈ యార్తరక్షామణి నితఃపూర్వము సుప్రసిద్ధ మగుతమ యాంధ్ర సాహిత్య పరిషత్పత్రికయందుఁ బ్రకటించిన తత్సంపాదకులకు మత్కృతజ్ఞతాపూర్వక వందనములు. అగ్రజ యగుభక్తచింతామణి,
నార్తగక్షామణి యనవరత మనువర్తించుఁ గాక.<noinclude><references/></noinclude>
7u3wlkcujpkud0ybdoyzur45gmw7rl7
పుట:ఆంధ్రులెవరు?.pdf/12
104
214291
559798
2026-06-16T11:13:44Z
Vihuu18
7318
/* అచ్చుదిద్దారు */
559798
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vihuu18" /></noinclude>నిశ్చయించి రాజదూతలను చూచి 'అయ్యా! మీరు యీ దంపతులకు కోరిన ధనమిండు. నేను మీ రాజుగారి యాగపశుత్వమున కంగీకరించితి'నని పలికెను. వెంటనే నా దంపతులు కోరిన సొమ్ము వారికొసంగి వారు పిల్లవానిని గొంపోయిరి. ఆ పిల్లవానిపేరు "శునశ్శేఫుడు” రాజుయజ్ఞమునకుపక్రమించెను_పశువునుబట్టు సమయము సమీపించెను. శునశ్శేఫుడు కాళ్ళుచేతులు బంధింపబడి యూపస్తంభమునకు కట్టబడెను. యజ్ఞశాల సభాసదులచే నిండియుండును. ఇట్టిస్థితిలో విశ్వామిత్ర మహాముని దయార్ద్రహృదయుడై యిట్లు వచించెను. 'రాజా! యీ యజ్ఞము నిక చాలింపుము. నీ శరీరరక్షణార్థ మన్య శరీరమును బలిగొనజూచుట మహాదోషము, గనుక యీ యజ్ఞము నింతతో నిలిపి యీ కుమారుని విడువు'మనెను రాజందు కంగీకరింపడయ్యె_ శునశ్శేఫుడు విశ్వామిత్రు నుద్దేశించి యిట్లనెను_'కన్నతండ్రిని మించిన ప్రేమతో మీరు నన్ను రక్షింపజూచుచుంటిరి. కాని యీ యాగము పూర్తియై రాజునకు యాగఫలము సిద్ధించి యాతని రుగ్మత నివారణయగుటయు' నా కనృత దోషము గలుగకుండుటయు, దేవతలు తృప్తులగుటయు గలిగినగాని నేను విముక్తుడనగుటకు కోరను. సృష్టికి ప్రతిసృష్టిజేయ సమర్ధమైన మీ తపోశక్తివలన సాధ్యముకాని విషయములేదు _ గాన యీ నా కోరికను మన్నింపుడనెను. విశ్వామిత్రు డా కుమారుని సౌజన్యమునకు మెచ్చి వానికి వారుణమంత్రము నుపదేశించి యుచ్చైస్వరమున నా మంత్రముచే వరుణుని స్తుతింపుమనెను _ శునశ్శేఫుడట్లుజేయగా వరుణుడు ప్రసన్నుడై వచ్చి శునశ్శేఫుని కట్లను స్వయముగా విప్పి వానిని విముక్తుని జేసి రాజునకు యాగఫలమునిచ్చి నాతని రుగ్మతను నివారింపజేసి యదృశ్యుడయ్యెను పిమ్మట విశ్వామిత్రు డా కుమారుని తన యాశ్రమమునకు తీసుకొని వెళ్లెను.<br>
{{center|{{p|fs125}}'''విశ్వామిత్రుని కుమాళ్లు_శాపము'''</p>}}
{{gap}}ఇకమీద రాబోవుకథ విశ్వామిత్ర కుమారుల కథ నీవిధముగా ఐతరేయ బ్రాహ్మణమున వినబడుచున్నది. బ్రాహ్మణ వాక్యమును విద్యారణ్య భాష్యమును, అందుకు తెలుగు తాత్పర్యమును దిగువ వివరింపబడుచున్నది.<noinclude><references/></noinclude>
mccjchs06ab9m7hwm1oak049j79rwcf