వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.15
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
సూచిక:Ananthuni-chandamu.pdf
106
89523
570261
396770
2026-08-14T22:38:14Z
Rajasekhar1961
50
570261
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[అనంతుని ఛందము అను నామాంతరముగల ఛందోదర్పణము|ఛందోదర్పణము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:అనంతామాత్యుడు|అనంతామాత్యుడు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=చెన్నై
|సంవత్సరం=1921
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=MS
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
8mqgvc4njmwj9fge18jm3fbpc9oafkg
570262
570261
2026-08-14T22:39:51Z
Rajasekhar1961
50
570262
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[అనంతుని ఛందము అను నామాంతరముగల ఛందోదర్పణము|ఛందోదర్పణము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:అనంతామాత్యుడు|అనంతామాత్యుడు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=[[వేదిక:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్|వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]]
|చిరునామా=చెన్నై
|సంవత్సరం=1921
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=MS
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
lzwviiw48sl7bv9j06abgju782q07h0
పుట:Aananda-Mathamu.pdf/226
104
109565
570297
355830
2026-08-15T07:38:26Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
570297
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||నలువదిమూడవప్రకరణము|221}}</noinclude>జీవానందుఁడు నవ్వి “ఈ దినము మహదానందము, కొండపైనను కొండ క్రింది భాగమునను సహా ఎడ్వర్ డ్సు దొర సైన్యమున్నది. ఎవరు ముందుగా పై కెక్కుదురో వారికి జయము” అని చెప్పి, సంతాన సైన్యమును గూర్చి గట్టిగా; “నే నెవరైనది తెలియునా! నేను జీవానంద గోస్వామిని; అజయనదీ తీరమున అనేక వేల శత్రువుల ప్రాణవధ చేసిన వాఁడను;” అని చెప్పెను.
తక్షణమే తుముల నినాదముచే నాకానన ప్రాంతమంతయు ధ్వనిత మగునట్లుగా “తాము జీవానందగోస్వామి యని యెఱుఁగుదుము” అని ప్రత్యుత్తర శబ్ద మాయెను.
జీవానంద —— చెప్పుఁడు “హరే మురారే” అని.
అంత పర్వత కందర కానన ప్రాంతములయం దంతట వేల కొలఁది కంఠములనుండి “హరే మురారే” యని ధ్వనిత మాయెను.
జీవానంద —— కొండ కాప్రక్కను శత్రువు లున్నారు. నేఁ డీపర్వతశిఖరమునందు ఈనీలాంబరియైన యామిని సాక్షాత్కారమై, సంతానులు యుద్ధము చేయవలయును; బిరాన రండు, ఎవరు ముందుగా శిఖరము నెక్కుదురో వారు జయింతురు, అని చెప్పుచున్నది. కనుక, రండు. “వందేమాతరం” అనుఁడు.
అప్పుడు భూమ్యాకాశములు నిండునట్లుగా “వందేమాతరం” గీతా శబ్ద మయ్యెను. సంతానసైన్యము మెల్ల మెల్లగా పర్వతారోహణము చేయ నారంభించెను. అయినను, అకస్మాత్తుగా మహేంద్ర సింహుఁడు తూర్యనాదము చేయుచు త్వరిత<noinclude><references/></noinclude>
da7yg0lzeunl46hibwmmhmrgr3njg39
పుట:Aananda-Mathamu.pdf/227
104
109566
570300
356080
2026-08-15T07:42:22Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
570300
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|222|ఆనందమఠము|}}</noinclude>ముగా పర్వతమునుండి దిగివచ్చుటను గాంచి సంతాన సైన్యము భయఁపడెను. చూచుచుండగనే పర్వతశిఖర ప్రదేశంబున
నీలాకాశపటమందు ఫిరంగీలతో బారుతీఱిన యింగ్లీషువారి సైన్యము ప్రకాశించెను. ఉచ్ఛస్వరముతో వైష్ణవ సైన్యము,
{{left margin|5em}}<poem>
ఆన్వీక్షకీ త్రయీవార్తా దండనీతి స్త్వమేవచ,
సౌమ్యాసౌమ్యై ర్జగ ద్రూపై స్త్వయై తద్దేవిపూరితమ్,
కాత్వన్యాత్వామృతేదేవి సర్వయజ్ఞమయం వపుః,
వసుధే త్వమేవవిద్యా భక్తిశ్శక్తిశ్చబాహ్వోర్నః ,
జననీద్ర విణం మిత్త్రం త్వంహి ప్రాణాశ్శరీరే.
వ్వింహిద్యా త్వంహి మాతా త్వంహి ప్రాణా శ్శరీరే,
త్వంహి భక్తిః త్వంహి శక్తిః త్వంహి ప్రాణా శ్శరీరే.</poem></div>
అని గానము చేసెను. అయినను, ఇంగ్లీషువారియొక్క ఫిరంగి గుండ్ల శబ్దమునం దామహాసంగీతశబ్దము మునిఁగిపోయెను.
వేలకొలఁది సంతానులు హతాహతులై పర్వతఝరియందు పడిపోయిరి. మరల నా ఫిరంగిగుండ్లు, దధీచిఋషి యొక్క వెన్నెముకతోఁ జేయఁబడిన వజ్రాయుధమును ధిక్కరించి, సముద్ర తరంగములను తుచ్ఛము గాఁ జేసి, యాంగ్లేయుల వజ్రాయుధ మనునట్లుగా పరిణమించెను. సుపక్వమై నిలచిన సస్యము కొడవండ్లకుఁ జిక్కినట్లు సంతాన సైన్యము ఖండింపబడి ధరాశాయి యగుట కారంభ మాయెను. పతనశీలమైన శిలా రాశివలె సంతాన సైన్యము పర్వత ప్రదేశమున నుండి వెనుకకుఁ దిరుగ నారంభించెను. ఎవ రెచ్చట పాఱిపోయిరో తెలియక పోయెను. జీవానందుఁడును మహేంద్రుఁడును పోవలదని కావించిన ప్రయత్నము వ్యర్థ మాయెను. అపు డాంగ్లే<noinclude><references/></noinclude>
ejt30p01j48ctwkmbqjark1cihd66ga
పుట:Aananda-Mathamu.pdf/228
104
109593
570301
355834
2026-08-15T07:44:55Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
570301
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||నలువది మూఁడవ ప్రకరణము|223}}</noinclude>యులు సకల సంతాన నాశముకొఱకు “హుర్రే! హుర్రే,” యని శబ్దము చేయుచు పర్వతమునుండి దిగిరి. తుపాకులను మోచికొని యతి వేగముగా పర్వతమునుండి పడునట్టి విశాలమైన తటినీ ప్రపాతమువలె దుర్దమనీయమును అలంఘ్యమును అజయ్యమునైన బ్రిటిష్ సైన్యము పలాయనపరులైన సంతాన సైనికులను వెంబడించెను.
జీవానందుఁ డొకసారిమాత్రము మహేంద్రునిఁ గాంచి, “ఈదిన మంత్య కాల మాసన్నమైనది, రా; ఇచ్చటనే చచ్చి పోవుదము” అనెను.
మహేంద్ర —— చచ్చుట కేమి, రణజయ మైనమీఁద చావ వచ్చును. వ్యర్థముగాఁ జచ్చుట వీరధర్మము కాదు.
జీవానంద —— నేను వ్యర్థముగనే చచ్చెదను. అయినను, యుద్ధమునఁ జచ్చెదను.
ఇట్లు చెప్పి, జీవానందుఁడు ఒక పార్శ్వంబుగాఁ దిరిగివచ్చి నిల్చి “ఎవరు హరినాముమును నుడువుచు చచ్చుట కిష్టము గలవారో వారు నాతోడ రావచ్చు” నని యఱచి చెప్పెను.
అనేకులు ముందు పడిరి. జీవానందుఁడు వారినిఁ జూచి, “హరిసాక్షిగా ప్రాణము పోయినను వెనుకకుఁ దిరుగుట లేదని శపథము చేయవలయు” ననియెను.
అప్పుడు ముందడుగిడినవారు వెనుకకు మఱలిరి. జీవానందుఁడు, “ఎవరును వచ్చుట లేదా? అట్లయిన నే నొక్కఁడనే
పోయెద” ననియెను.
జీవానందుఁడు గుఱ్ఱముమీఁద నే చాలదూరము కొండ నెక్కిపోయి వెనుకనుండిన మహేంద్రునిం బిలిచి, “అన్నా,<noinclude><references/></noinclude>
3ovphzln689odudyq9scarxa62pv8p6
పుట:Aananda-Mathamu.pdf/229
104
109594
570302
355836
2026-08-15T07:47:08Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
570302
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|224|ఆనందమఠము|}}</noinclude>నవీనానందునితో నేను వెడలిపోతి ననియును, లోకాంతరమునఁ జూచెద ననియును జెప్పు” మని చెప్పెను.
ఇట్లు చెప్పి యావీరపురుషుఁడు ఆలోహవృష్టి మధ్యమున గుఱ్ఱము నతి వేగముతో విడిచెను. ఎడమ చేతియందు బల్లెమును
కుడిచేతియందు తుపాకియు నున్నది. నోట “హరే మురారే హరే మురారే” యను శబ్దము. యుద్ధము చేయు ప్రయత్నమే లేదు ఇట్టిసాహసమువలన ఫల మేమియును లేదు. అయినను “హరే మురారే” అని పాడుచు జీవానందుఁడు శత్రువ్యూహ మధ్యంబునం బ్రవేశించెను.
పలాయనపరులైన సంతానులను సంబోధించి, మహేంద్రుఁడు “చూడుఁడు, ఒకతూరి వెనుకకుఁదిరిగి జీవానందగోస్వామిని చూడుఁడు, చూచినచో మీరు చావరు” అనియెను.
కొందఱు సంతానులు వెనుకకు దిరిగి జీవానందుని అమానుషకీర్తినిఁ జూచిరి. మొదట విస్మితు లైరి. పిదప, “జీవానందునికి మాత్రము చచ్చుటకుఁ దెలియునా? మాకుఁ దెలియదా? పదండి; జీవానందునితోడ మనమును వైకుంఠమునకుఁ బోవుదము” అనిరి.
దీనిని విని కొందఱు సంతానులు మరలిరి. వారినిఁ గాంచి యింకను గొందఱు మరలిరి. మఱియుఁ గొందఱు నట్లే చేసిరి. ఇందువలన మహాకోలాహల మాయెను. జీవానందుఁడు శత్రువ్యూహమధ్యమునఁ బ్రవేశించెను. సంతాను లెవ్వరును మరల నతనిని గాంచరైరి.
ఇచ్చట రణ క్షేత్రమునుండి సంతానులు చూచుచుండఁగనే కొందఱు సంతానులు వెనుకకుఁ దిరిగి వచ్చుచుండిరి. అంద<noinclude><references/></noinclude>
qytsh59h7p815u5miavlcmn2guf45zu
పుట:Aananda-Mathamu.pdf/230
104
109595
570303
355842
2026-08-15T07:50:12Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
570303
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||నలుబదిమూఁడవప్రకరణము|225}}</noinclude>ఱును మనస్సున సంతానులకు జయ మాయెను, శత్రువులను బాఱఁద్రోలి వచ్చుచున్నారని తెలిసికొని ‘కొట్టుఁడు, శత్రువులను నఱుకుఁడు’ అని శబ్దము చేయుచు మరల నింగ్లీషువారి సైన్యముపైఁ బడిరి.
ఇచ్చట ఇంగ్లీషువారి సైన్యమునందు కలత కల్గెను. సిపాయీలు యుద్ధ ప్రయత్నమును మాని రెండు వైపులకు బాఱుచుండిరి. ఆంగ్లేయులు సహితము తుపాకులను దించుకొని శిబిరాభిముఖులై పాఱిరి. మహేంద్రుఁ డట్టిటు చూచుచుండఁగనే పర్వతశిఖరమందనంతమైన సంతాన సైన్యమును గాంచెను. వారు వీరదర్పముతో దిగివచ్చుచు ఇంగ్లీషువారి సైన్యమును నాక్రమించుచుండిరి. మహేంద్రుఁ డెలుఁగెత్తి సంతానులను గూర్చి “సంతానులారా! అట చూడుఁడు; పర్వత శిఖరంబున ప్రభువు సత్యానందగోస్వామి ధ్వజము కానఁబడు చున్నది. నేడు స్వయముగా మురారి యైన మధుకైటభ నిషూదనుఁడగు కంసకేశి రణక్షేత్రమున వచ్చి యున్నాఁడు! పర్వతముపై లక్షసంతానులున్నారు ‘హరే మురారే! హరే మురారే!’ యని చెప్పుడు. లెండు; లేచి శత్రువుల ఱొమ్ము పగులునట్లు కొట్టుఁడు. లక్ష సంతానులు పర్వతముపై నున్నారు” అని చెప్పెను.
అప్పుడు ‘హరేమురారే’ అనెడి భీషణధ్వని పర్వతకందరకానన ప్రాంతర మెల్ల నిండి నిబిడీకృత మాయెను. సకల సంతానులయొక్క “మాభైః మాభైః ” (భయమువద్దు భయమువద్దు) అను రవము లలితమైన తాళధ్వనియై, తళతళ మెఱయ నస్త్రముల ఝుణంఝుణ శబ్దమునందు లయముకాఁగా సర్వజీవము<noinclude><references/></noinclude>
b39iwa3ql05qg5nymdhxycikxrprtpx
పుట:Aananda-Mathamu.pdf/231
104
109596
570304
565131
2026-08-15T07:52:41Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
570304
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|226|ఆనందమఠము|}}</noinclude><section begin="231A" />లును విమోహితము లాయెను. వేగముగా మహేంద్రుని సంతాన వాహినీ ప్రవాహము పర్వతము నధిరోహణము సేయ నారంభించెను. శిలలచే ఘాత ప్రతిఘాతములై ప్రతి ప్రేరితమైన నిర్ఝరిణివలె రాజసైన్యము విలోడితమై స్తంభీభూతమై భీతితో పరుగిడి పోయెను. ఆసమయంబున నిరువదియైదు వేల సంతాన సైన్యమును దీసికొని స్వయముగా సత్యానంద బ్రహ్మచారి పర్వత శిఖరమునుండి యాంగ్లేయులపై సముద్రమే యుప్పొంగి వచ్చినట్లుగా పడెను. అత్యంతము భయంకరమైన యుద్ధము జరిగెను. ఎట్లు రెండు పెద్ద పెద్ద ఱాతిబండల సంఘర్షణము నడుమ నల్పమైన చీమలు చిక్కి పొడియై ధూళిపటలమై పోవునో, యట్లు రెండు సంతాన సేనల సంఘర్షణముచే నా విశాలమైన రాజసైన్యము పర్వతసాను దేశమున నలిగి పొడియై పోయెను.
వార౯ హేస్టింగ్సు నొద్దకుపోయి, ఈసమాచారమును దెల్పుటకుఁగూడ నొక్కఁడును లేఁడు, అందఱును హతులైరి.
{{rule|6em}}
<section end="231A" />
<section begin="231B" />{{p|fs125|ac}}నలుబదినాలుగవ ప్రకరణము</p>
{{p|fs100|ac}}సంతాన సేనా విజయము.</p>
పూర్ణిమారాత్రి! —— ఆ భీషణంబగు రణక్షేత్ర మిప్పుడు స్థిర మాయెను. గుఱ్ఱంబుల పటపట శబ్దమును, తుపాకుల దడదడ శబ్దమును, ఫిరంగిగుండ్ల ఢంఢం శబ్దమును, సర్వవ్యాపకమైన ధూమమును లేదు. “హుర్రే” అని చెప్పు వారును లేరు, హరిధ్వని చేయువారును లేరు. శబ్దముమాత్రము
<section end="231B" /><noinclude><references/></noinclude>
rifhbgfxnxfmzus9qcbt4d4on4glh7n
పుట:Aananda-Mathamu.pdf/232
104
109597
570305
355851
2026-08-15T07:56:42Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
570305
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||నలుబదినాలుగవ ప్రకరణము|227}}</noinclude>చేయుచుండినవి; ఏవి? నక్కలు, కుక్కలు, గద్దలు, ఇవిగాక ఆ హతులైన జనుల క్షణికమైన ఆర్తనాదము. కొందఱు ఛిన్నహస్తులు; కొందఱు ఛిన్నమస్తకులు; కొందఱకు కాళ్లు భగ్నములై యుండెను; కొందఱకు శరీరము చిల్లులుపడి పోయెను; కొందఱు గుఱ్ఱముల క్రిందఁ బడి యుండిరి; కొందఱు అమ్మా! యనుచుండిరి; కొందఱు అయ్యా! యని యఱచుచుండిరి; కొందఱు దాహము అనుచుండిరి; కొందఱు మూలుగుచుండిరి. బంగాళీలు, తురకలు, ఇంగ్లీషువారు, హిందూస్థానీలు, తెలగాలు, అఱవలు, అందఱు నేకత్ర జడజడితమై మృతులైరి. ఆమాఘమాసపు పూర్ణిమా రాత్రి యందు ఆ దారుణమైన శీతమున వెలుఁగుచుండు వెన్నెలయందు రణభూమి అతిభయంకరమై కానఁబడుచుండెను. అచ్చటికిఁ బోవుట కెవ్వరికిని ధైర్యము లేదు.
ఎవ్వరును ధైర్యము చేసి పోలేదు. అయినను, ఆ యర్ధరాత్రి సమయంబున నొక రమణీమణి ఆ యగమ్యమైన రణక్షేత్రంబున తిరుగుచుండెను. ఒక మషాలును వెలిఁగించుకొని దాని వెల్తురున నేమో వెదకుచుండెను. ప్రతిశవము యొక్క ముఖమును ఆవెల్తురులోఁ జూచుచుండెను. ఎచ్చటనైనను శవము గుఱ్ఱము క్రింద పడి యుండినచో, నాయువతీమణి చేతిలోనున్న వెల్తురుకట్టెను దిగువ నుంచి, గుఱ్ఱమును రెండు చేతులతో లాగివేసి ఆ శవమును పరీక్షించి చూచును. ఈరీతిగా వెదకుచు నారణ క్షేత్రము నంతయుఁదిరిగెను. వెదకుచుండిన శవ మెక్కడను దొరక లేదు. అప్పుడు వెల్తురును బాఱవైచి యాశవరాశి పూర్ణమైన రక్తమయభూమిపైఁ బడి యేడ్చుచు పొరలాడు<noinclude><references/></noinclude>
2yrszvs7b4tnihkznvxrukam5c9vco3
పుట:Aananda-Mathamu.pdf/233
104
109598
570306
387449
2026-08-15T07:59:25Z
రవిచంద్ర
146
570306
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Inquisitive creature" />{{rh|{{larger|228}}|{{larger|ఆనందమఠము}}|}}</noinclude>చుండెను. ఈమెయే శాంతి; జీవానందుని కళేబరమును వెదకుచుండెను.
శాంతి ఏడ్చుచు పొరలాడుచుండిన సమయమునందు, అతి మధురమైన సకరుణధ్వనిచే, “ఏడ్చువా రెవరు? లేవమ్మా! యేడ్వవలదు” అని చెప్పిన మాటలను విని, శాంతి తిరిగి చూడఁగా నెదుట నాజ్యోత్స్నాలోకంబునందు వెనుక నెపుడు చూడని జటాజూటధారియైన పురుషుఁడు నిలిచి యుండెను.
శాంతి ఏడ్చుచు లేచి నిలువంబడెను. వచ్చిన మహాపురుషుఁడు “ఏడ్వవలదమ్మా! జీవానందుని దేహమును నేను వెదకి యిచ్చెదను, నాతోరమ్ము” అనియెను.
అప్పు డతఁడు శాంతిని రణక్షేత్ర మధ్యస్థలంబునకుఁ బిలిచికొని పోయెను. అచ్చట అసంఖ్యేయములగు శవరాసులొకదానిపై నొకటిగా పడియుండెను. శాంతిచేత దానిని కదలించుటకు కాకపోయెను. ఆ బలిష్ఠుండగు మహాపురుషుఁడు దానినంతయుఁ దీసి యొకశవమును వెలికిఁ దీసెను. దానినిఁ గాంచి శాంతి జీవానందుని దేహమని గుర్తించెను. సర్వాంగమును గాయములచే రక్తమయమై యుండెను. శాంతి చూచి సామాన్య స్త్రీవలె విలపింప నారంభించెను.
ఆ మహాపురుషుఁడు, మరల “ఏడ్వవలదమ్మా! జీవానందుఁడు చావలేదు. స్థిరముగా నతని దేహమును పరీక్షించి చూడుము, మొదట నాడిని పట్టిచూడుము” అనియెను.
శాంతి శవము యొక్క నాడినిబట్టి చూచెను. కొంచెమైనను గతి లేదు. ఆ పురుషుఁడు “ఱొమ్ముపై చేయి నిడి చూడు” మనియెను.<noinclude><references/></noinclude>
sjbuhj4nog06f626y1l9fkouws9h1fq
రసాభరణము
0
128761
570288
396103
2026-08-15T05:15:34Z
Rajasekhar1961
50
570288
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[రసాభరణము]]
| రచయిత = అనంతామాత్యుడు
|అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =[[రసాభరణము/భూమిక|భూమిక]]
| వివరములు =
|సంవత్సరం= 1931
}}
<pages index="రసాభరణము.pdf" from=1 to=1/>
{{page break}}
<pages index="రసాభరణము.pdf" from=10 to=10/>
{{page break}}
<pages index="రసాభరణము.pdf" from=11 to=13/>
ot0luurm6o93lrv945czbjy5a0qt8ue
రసాభరణము/భూమిక
0
128762
570286
449608
2026-08-15T05:13:48Z
Rajasekhar1961
50
570286
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కోపల్లె శివకామేశ్వరరావు
|అనువాదం=
| విభాగము = భూమిక
| ముందరి = [[../]]
| తదుపరి =[[../ప్రథమాశ్వాసము/]]
| వివరములు =
|సంవత్సరం= 1931
}}
<pages index="రసాభరణము.pdf" from=2 to=10/>
tprdpexy9b08e1wu9c5m62ybaer9l9w
570287
570286
2026-08-15T05:14:27Z
Rajasekhar1961
50
570287
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కోపల్లె శివకామేశ్వరరావు
|అనువాదం=
| విభాగము = భూమిక
| ముందరి = [[../]]
| తదుపరి =[[../ప్రథమాశ్వాసము/]]
| వివరములు =
|సంవత్సరం= 1931
}}
<pages index="రసాభరణము.pdf" from=2 to=9/>
2ohd6px8rkz33rmukk7wozxdcp5wfdg
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/608
104
154663
570229
448473
2026-08-14T12:08:29Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570229
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కల్పము}}</noinclude>
ములలో వివాహాది కర్మలేగాక, అధర్వవేదీయములైన ఆభిచారిక కర్మలుగూడ ప్రతిపాదింపబడుచున్నవని మేగ్డా
నల్ మహాశయుడు వ్రాసియున్నాడు.
మరియును 'కమలాకరభట్టు' రచించిన అగ్ని నిర్ణయము, నారాయణభట్టు రచించిన గృహ్యాగ్ని సారము,
గృహ్య కల్పతరువు మొదలుగాగల కొన్ని గ్రంథములును అర్వాచీనములు, ఉపలబ్ధము లగుచున్నవి.
'''ధర్మసూత్రములు :''' ఇవి 4, 5 మాత్రమే ప్రసిద్ధములై యున్నవి. ఇందు ఆపస్తంబ, హైరణ్యకేశీయ, బౌధాయనములు, కృష్ణయజుశ్శాఖియములు. గౌతమ సూత్రము, సామశాఖీయము. ‘వైఖానస ధర్మప్రశ్నము' అను పేరనొక సూత్రగ్రంథము ముద్రితమై యున్నది.
పై సూత్రములయందు ఉదాహరింపబడిన మతాంతరములనుబట్టి మరికొన్ని ధర్మసూత్రము లుండి యుండ
వలయు నని తెలియుచున్నది. గద్యపద్యాత్మకముగానున్న 'వాసిష్ఠస్మృతి' యొకటి పూర్వధర్మశాస్త్రములలో పరిగణింపదగి యున్నది. అది స్మృతియైనను సూత్రగౌరవమునకు తగియున్నది.
'''ధర్మసూత్రముల పౌర్వాపర్యము :''' మను, హారితములను ఉద్ఘాటించిన ఆపస్తంబము వాటికంటే పరము, పాణినీయమునకు పూర్వమని తెలియుచున్నది. 'భాల్లవు' లను పురాతనులనుగా 'నిర్వచించిన పాణినీయ మతమునకు ఆధారభూతమయిన 'థాల్లవిగాథ' ను ఉదాహరించుటచే వాసిష్ఠము పాణినీయమునకు పూర్వమైయుండవలయును. దీనిని గౌతమముని పేర్చొన్న బౌధాయనము, హిరణ్యకేశి సూత్రమునకంటె పూర్వముగా కనబడుచున్నది. క్రీ. పూ. 5 వ శతాబ్దిలోని శిలాశాసనములో హిరణ్యకేశి శబ్దముండుటచే అంతకుపూర్వమై యుండవలయును. గౌతము. ఆప స్తంబములలో నేది ప్రాచీనమో నిశ్చయించుటకు వీలు
లేకున్నది.
'''వాసిష్ఠస్కృతి:'' 30 అధ్యాయముల గ్రంథము. ఇందు మను, హారీత, గౌతమ, ప్రజాపతి, యమ, వసిష్ఠుల మతములును, కాఠిక, భాల్లవి. వాజస, కాయక మతములును ఉద్ఘాటింపబడియున్నవి.
ధర్మసూత్రములలో ఉత్తమోత్తమమైనది ఆపస్తంబము. ఇది దక్షిణదేశమున సకల వర్ణాశ్రమాచారము
లకును పరమప్రమాణమై యున్నది. ఇది 2 ప్రశ్నల గ్రంథము. ఈ రెండును శ్రౌతసూత్రములోని 28, 29
ప్రశ్నలని కొందరును, వేరుగ్రంథమని మరికొందరును భావించుచున్నారు. ఇంట్లొక్కొక్క ప్రశ్నమునకు 11
పటలములు గలవు.
ఈ ధర్మసూత్రములు, సామయి కాచారములను బొధించును. సమయ మనగా మనుష్యులు చేసిన వ్యవస్థ.
అదివిధి, నియమ, ప్రతి షేధ భేదములచే త్రివిధముగుచున్నది.
ఆపస్తంబమువలెనే హైరణ్యకేశి ధర్మసూత్రముగూడ తన కల్పసూత్రమునకు అనుబంధము, 27 అధ్యాయముల
శ్రౌతసూత్రములలో 26, 27 అధ్యాయములు ధర్మసూత్రములు. ఇది మనదేశమున వ్యాప్తిలో లేదు.
'''గౌతమధర్మసూత్రము:''' ఇది క3 ప్రశ్నల గ్రంథము. ఇదియును దక్షిణదేశమున ఎక్కువ వ్యాప్తిలో సున్నది. ఇది జన్మచే సామ వేదీయ మైనను, ఇందలి విషయము సర్వశాఖా సామాన్యమై వెలయుచున్నది. ఇందలి 26 వ అధ్యాయము సామవిధాన బ్రాహ్మణము ననుసరించుటచే ఈ సూత్రము సామశాఖీయమని స్పష్టమగుచున్నది.
దీనికి ‘హరదత్తుడు' 'మితాక్షర' వ్యాఖ్యను రచించేను. ఇందలి లౌకిక ధర్మములు హిందూకోడ్లో ఉదాహరింప
బడియున్నవి. 'క్రియా కాండ' మను పేర ఈ సూత్రములకు పరిశిష్టగ్రంథ మొకటిగలదు. కాని ఇది గౌతమ నిర్మితము కాదు.
'''బౌధాయన ధర్మసూత్రము :''' ఇది 4 ప్రశ్నల గ్రంథము. ఇందలి విభాగములకు అధ్యాయము లని పేరు.దీనికి గోవిందస్వామి రచించిన వ్యాఖ్య ప్రసిద్ధమైయున్నది. 'ఇతర శాఖీయములును బౌధాయనము ననుసరించిన స్వసూత్రము ననుసరించిన ట్లగును' అని వృద్ధమనువు చెప్పియున్నాడు. దానినిబట్టి ఈ సూత్రమునకుండు పరమ ప్రామాణికత్వము, మహిమయు వ్యక్తములగుచున్నవి.
స్రౌతగృహ్య సూత్రములందువలెనే ధర్మసూత్రము లందును సంప్రదాయ భేదములు కొన్ని కనవచ్చుట
మాత్రమే గాక, దేశ భేదమును బట్టి వచ్చిన ఆచారములును కొన్ని కనిపించుచున్నవి. వాసిష్ఠమువలెనే ఆపస్తంబము షడ్విధవివాహములను చెప్పగా, గౌతమము 8 విధములను చూపుచున్నది.<noinclude><references/></noinclude>
0tprslh6r28zbcz5h1s24ihjjeel559
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/609
104
154664
570241
448474
2026-08-14T14:26:24Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570241
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కల్హణుడు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="609A" />ఇంకను ఈ విషయములను విపులముగా బోధించు స్మృతి గ్రంథములు లెక్కకు మీరియున్నవి.
సూత్రము లన్నిటియందును సాధారణముగా పర్ణాశ్రమ విభాగములు, సర్వవర్ణాశ్రమాచార సంబంధము
లయిన సాంఘిక ధర్మములును వివరింప బడుచున్నవి. ధర్మ సూత్రములు ఉపదేశించిన పావనజీవనము ఇప్పుడు కలలోని వార్తయయినది.
{{right|తి. కు. వేం. న. సు.}}
<section end="609A" />
<section begin="609B" />''''కల్హణుడు :'''
భారతీయ సాహిత్యమున సక్రమమగు చారిత్రక గ్రంథములు దాదాపు లేవనీయే చెప్పవలయును. కొన్ని
చారిత్రక కావ్యము లున్నను, విమర్శ పూర్వకముగా చరిత్రను గెల్పు గ్రంథములు అల్పసంఖ్యాకములు. ఇందు
లకు కారణము అనేకు లనేక విధములుగా తెల్పుదురు. నిజమునకు భారతీయులకు చారిత్రక దృష్టియే తక్కునయని కొందరందురు. ఇది కొంతవరకు నిజమేయగును. పురాణములలో కొంత చరిత్ర కలదు. కాని వానియందు వర్ణితములగు రాజకుటుంబములు, వారి రాజ్యకాలము మొదలగునవి చారిత్రక విమర్శనమునకు నిలువజాలవు. చరిత్ర నిర్మాణమున కవి ఉపకారకము లనిమాత్రము చెప్పక తప్పదు. శాతవాహన చరిత్రము నకు వాయుపురాణాదులయందున్న చారిత్రక విషయము అత్యంతోషకారకము లైనవి. మహాభారత రామాయణములును చరిత్రములుగానే భారతీయులు గ్రహించిరి. చరిత్రమొక ప్రత్యేక విజ్ఞానశాఖగా భారతీయులు భావించలేదు.
కేవల చారిత్రక కావ్యములను గూర్చి యాలోచించిన పక్షమున, కల్హణ విరచితనుగు రాజతరంగిణియే వీనికెల్ల
తలమానికము. అంతకు పూర్వమున్న వాటిలో హర్ష చరితాదులలో కొంత చారిత్రక సామగ్రి యున్నను, అవి
కావ్యఫక్కి నుండుటచే అందు కావ్యభాగ మెంతకలదో చరిత్రభాగమెంత కలదో నిర్ణయించుట కష్టసాధ్యము.
ఆంధ్ర వాఙ్మయమునకూడ గ్రంథపీఠికలు చెప్పుచరిత్రము కాక, కేవల చరిత్రాత్మకమైన గ్రంథములు చాల తక్కువ యనియే చెప్పవలెను. మహావంశము, గౌడవాహము మున్నగు బౌద్ధ, జైన గ్రంథములలో కొంత చారిత్రక సామగ్రి యున్నను ఆది పురాణవిషయములతో సమ్మిళితమై యున్నది. చారిత్రిక కావ్యరచయితల ల దృష్టి కావ్యత్వముపై ప్రసరించినంతగ, చరిత్రముపై ప్రవరించి యుండలేదు, అట్టి గ్రంథముల నన్నిటిని కావ్యములుగ మాత్రమే పరిగణింపవలెను గాని చరిత్రములుగా భావింపరాదు. ఈ గ్రంథములవలెగాన కల్హణుని రాజతరంగిణి సూత్రము కావ్యత్వముతో పాటు చరిత్రత్వమును కూడ సాధించినది. ఇట్టికీర్తి ఒక్క కల్హణునికి మాత్రమే దక్కినది.
రాజకరంగిణికి పూర్వము వెలసిన చారిత్రక కావ్యముల గూర్చి ఇచ్చట సంగ్రహముగ తెల్పుట అవసరము.
"చరితము" అను పేర జరుగువాని నన్నిటిని చరిత్రలుగా పరిగణింపజాలము, దశకుమార చరిత్రమును చరిత్ర యన గలమా ? హర్ష చరితమునందు కూడ చరిత్రాంకములు కొరపడియే యున్నవి. శంకుకుడను నొక కాశ్మీరకవి వ్రాసినట్లు చెప్పబడు భువనాభ్యుదయమను నొక యుద్ధ వర్ణన కావ్యము లబ్యము కానందున, దానిని గూర్చి మన కెక్కువ తెలియదు. అది క్రీ. శ. ఎనిమిదవ శతాబ్దినాటిదని చెప్పబడుచున్నది. నవసాహసాంక చరిత్రమను పేర పద్మగుప్తుడు రచియించిన కావ్యమొకటి కలదు. అది క్రీ.శ. పదునొకండవ శతాబ్దాదిని రచింపబడినది. దీని రచయిత పద్మగుప్తుడు. నవసాహసాంగుడన ధారానగరము నేలిన పరమార సింధురాజు. ఆ కావ్యమున కావ్యత్వమే అతిశయించి యున్నది. తరువాతి గ్రంథము విక్రమాంక దేవచరితము. ఇది బిల్హణకవి విరచితము. ఇందు కవిని గూర్చిన విషయములలోను, విక్రమాంక దేవుని విజయవర్ణనములలోను కొంత చరిత్ర కలదు. (విక్రమాంక దేవుడు పదునొకండవ శతాబ్దారంభమున కళ్యాణి నగరము నేలిన త్రిభువనమల్ల బిరుదాంకితుడగు ఆరవ విక్రమాదిత్యుడు.) ఇయ్యదికూడ చారిత్రక గ్రంథముగా విలువ కలదనుటకు వలను పడదు. బిల్హణుడు కూడ కేవలము చారిత్రకుడు కాడు. అతనిని కవియని వర్ణించుటయే యెక్కుడు సమంజసము.
తరువాత వెలసిన చారిత్రక గ్రంథము రాజతరంగిణి. కల్హణుడు చారిత్రక విషయములను తెల్పుచు, తన గ్రంథమునకు కావ్యత్వము కొరవడకుండ సంతరించినాడు. ఆతని గ్రంథమును చక్కగ పరీక్షించినయెడల, ఆతడు అందు
<section end="609B" /><noinclude><references/></noinclude>
e84j21rgbo879d80p9npy3ssn5q8gjd
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/610
104
154665
570245
448475
2026-08-14T15:37:42Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570245
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కల్హణుడు}}</noinclude>
కావ్యత్వమునకంటె చరిత్రత్వమునకే ప్రాముఖ్యము నిచ్చినట్లు కనబడును. ఆతడు ప్రాచీనములగు మహాభారత
రామాయణాదులను, హర్షచరిత్ర, విక్రమాంక దేవ చరిత్రములను, కాళిదాస నాటకాదులను బాగుగా చదివినట్లు
నిదర్శనము లాతని గ్రంథమున కనబడును. కల్హణుడు కాళి దాసాదులవలేగాక తనగ్రంథమునందు తనను గూర్చి కొంత తెల్పుకొనియున్నాడు.
కల్హణుడు బిల్హణునివలెనే కాశ్మీరదేశ బ్రాహ్మణుడు. పరిహాసపురము వీరి కాపురమని కొన్ని నిదర్శనములవలన
తెలియుచున్నది. ఆయన తండ్రి పేరు చంపకుడు. చంపకుడు కాశ్మీర దేశమున క్రీ. శ. 1089-1101 సంవత్సరముల నడుమ రాజ్యపాలనము కావించిన హర్షుని కాలమువాడు. ఈ బ్రాహ్మణుడు హర్షునికి తుదివరకు సలహాదారుగ నుండెను. ఈ హర్షుని హత్య రాజతరంగిణియందు వర్ణింపబడినది. హర్షుని తరువాత చంపకుడు విశ్రాంతి తీసికొనుట చేత, కల్హణునికి రాజకార్యములతో నెట్టి ప్రసక్తియును లేకపోయెను. కల్హణుని వంశమువారు పలువురు రాజోద్యోగులుగ నుండిరి. కల్హణుడు శైవుడు. కాని ఈతనికి బౌద్ధధర్మములగు అహింస మున్నగువాని యెడల చాల అభిమాన ముం డెను.
ఇతర వ్యాసంగ మేదియును లేనందున కల్హణుని దృష్టి చరిత్రవై పు మరలెను. కాశ్మీరరాజ్యమును కొలది కాలము పాలించిన అలకదత్తుని ప్రేరణమున కల్హణుడు చరిత్ర రచనకు కడగెనని ముఖుడనుకవి వ్రాసెను. కాని ఇందెంత నిజమున్నదో చెప్పజాలము. ఈ రాజుకాలమున కాశ్మీర రాజ్యము చాల అలజడితో నుండెను. హర్షుని హత్య తర్వాత అతని శత్రువులయిన ఉచ్చల, సుళ్ళలులు రాజ్యమును పంచుకొని పాలించిరి. తరువాత ఉచ్చలునికి హర్షుని గతియే పట్టెను. నడుమ కొందరు తాత్కాలికముగ పరిపాలనము నెరపినను తుదకు సుళ్ళలుడు యావద్రాజ్యమునకును ప్రభువయ్యెను. కాని అతడు ప్రశాంతముగ రాజ్య మేలలేదు. తుద కతడు క్రీ. శ. 1128 వ సంవత్సరమున హతుడయ్యెను. అతని కుమారుడు జయసింహుడు. ఈతడు రాజ్యతంత్ర మెరిగినవాడు. మొదట కష్టములపొలయినను, జయసింహుడు మొత్తముమీద విజయవంతము గనే రాజ్యము చేసెను. కల్హణు డీతని ఆస్థానమున నుండకపోయినను, ఈరాజు ప్రోత్సాహముచే క్రీ. శ. 1149 వ సంవత్సరమున తన కావ్యమును వ్రాయ నారంభించెను. జయసింహునికి పూర్వము రాజ్యమున సంభవించిన అల్లకల్లోలములు కల్హణుని గ్రంథమున వర్ణింపబడినవి. కల్హణుడు తాను స్వయముగ చూచిన యంశములను వర్ణించి యున్నందున, ఆtaని వ్రాతలను విశ్వసనీయములుగ మనము భావింపవచ్చును. కాశ్మీర దేశము నేడలను, అచ్చటి ప్రజలయెడలను, కల్హణుని కత్యంతాభిమాన మున్నను, ప్రజల చిత్తవృత్తులను, 'వారి
గుణావగుణములను ఆతడు దాచలేదు. ఆతని కావ్యము వలన కాశ్మీరీయులు స్థిరచిత్తులు కారనియు, పట్టుదల లేనివారనియు, యుద్ధమున ధీరులు కారనియు వ్యక్తమగును. అచ్చటి రాజులపై బయటినుండి వచ్చిన రాజపుత్రుల ధైర్యసాహసములను అతడు కొనియాడెను. పట్టణవాసులు సుఖాసక్తులుగను, సోమరులుగను వర్ణింపబడిరి. ఆ కవి డామయులు మొదలయిన తెగల వారిని మిక్కిలి నిశితముగా విమర్శించినాడు. వారు
క్రూరులుగను, దోపిడిదారులుగను వర్ణింపబడినారు. అచ్చటి పురోహితు లించుకయు దైవభక్తియు, పాపభీతియు లేనివారని కల్హణుడు తెల్పుచున్నాడు. కాని కొందరు సమకాలికవ్యక్తులను గూర్చి ఆతడు మిక్కిలి సానుభూతితో వ్రాసినాడు. రిల్హణుడు, అలంకారుడు అను మంత్రులను పొగడివాడు. ఉదయుడను సేనానిని వీరునిగా కొనియాడినాడు. మొత్తముమీద కల్హణుడు సత్య పక్షపాతము కలవాడని తెలుపనగును. వ్యక్తుల ప్రకృతులను తెల్పుటలో కల్హణుడు మిక్కిలి సమర్థుడు. తన చుట్టుప్రక్కల జరుగుచున్న సంఘటనల నాతడు కండ్లు
తెరచి చూచి, వివేచనతో పరీక్షించి, వానికి గల కారణాదులను చర్చించి, చారిత్రక దృష్టితో వానిని తన గ్రంథ
మున వర్ణించియున్నాడు.
తనకు పూర్వము కాశ్మీరదేశమును గూర్చి వ్రాయబడిన అన్ని గ్రంథములను పరీక్షించియే తాను రాజ
తరంగిణిని వ్రాసినట్లు కల్హణుడు తెల్పుకొనియున్నాడు. కానీ అతనికి పూర్వమున్న కాశ్మీరదేశ చరిత్ర చాల లోప
భూయిష్ఠముగా నుండెను. కల్హణుడా గ్రంథములను తాను విమర్శించినట్లు తెలిపియున్నాడు. ఆతనికి సహాయ<noinclude><references/></noinclude>
bgppxszubhtd96k4kij41gptvmc29qy
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/611
104
154666
570246
448476
2026-08-14T15:52:12Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570246
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కల్హ ణుడు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
పడిన గ్రంథములలో నీలమతపురాణ మొకటి. అది ఇప్పుడు ప్రచురింపబడి యున్నది. దానియందు చరిత్రాం
శములకంటే, ఆ దేశమునందలి క్షేత్ర తీర్థాదుల వర్ణనమే విశేషముగ నున్నది. కల్హణునికి సామగ్రిగా నుపయోగ
పడిన గ్రంథములలో నీ క్రింది వానిని పేర్కొనదగును.
:1. క్షేమేంద్రుని నృపావళి.
:2. పాశుపత హేలరాజ కృతగ్రంథముపై నాధారపడి రచియించిన పద్మమిహిరుని గ్రంథము.
:3. చావిల్లి కరుని గ్రంథము.
ఇవియేకాక కల్హణుడు శాసనములను, దేవాలయములు, ఇతర కట్టడములు నిర్మింపబడిన కాలములను,
భూదాన పత్రములను, ప్రశస్తులను, ఇతర లిఖిత గ్రంథములను తాను పరీక్షించితినని తెల్పుకొనినాడు. ఇట్టి
వాటి ప్రశంస ఈతని గ్రంథములో అనేక స్థలములందు కలదు. ఆతడు నాణెములను పరీక్షించి, కట్టడముల
దగ్గరకు స్వయముగా పోయి పరిశీలించి, వాని నిర్మాణ కాలమును తెలిసికొనినట్లు దృష్టాంతములు కలవు. ఈ
విషయము లన్నియు ఆతని చారిత్రకదృష్టికి తార్కాణములు, నిర్దుష్టమైన చరిత్రను వ్రాయుట అతని యుద్దేశ
మైనట్లు స్పష్టము. శృంగార వీరరసములు రెండును ఈ గ్రంథమున కవి పోషించినాడు. వర్ణనలు కావలసిన పట్టున నాతడు దీర్ఘవర్ణనలు కావించినాడు. అనవసరమగు స్థలమున వర్ణనలు చేయలేదు. తనను రచనకు ప్రోత్సహించిన జయసింహునిపై "జయసింహభ్యుదయము" అను పేర నొక కావ్యమును కల్హణుడు రచించినట్లు రత్నాకరుడు తన “సారసముచ్చయము" లో నుల్లేఖించినాడు. ఈ రాజు తరంగిణిని వ్రాయుటకు రెండు సంవత్సరములు పట్టెను. కల్హణు డీ గ్రంథమును క్రీ. శ. 1148 లో ప్రారంభించి 1149 లో పూర్తి చేసెను.
ఇక కల్హణుని రచనా విశేషములను పరికింతము. అతడు తన చరిత్రమును గోనందుడను రాజుతో నారంభించెను. అతడు కలిళకము 653 వ సంవత్సరమున సింహాసన మధిష్ఠించినట్లు తెలుపబడినది. అదియే యుధిష్ఠిరుని పట్టాభిషేక సంవత్సరమని చారిత్రకులు తెల్పుదురు. ఇచ్చట కల్హణుడు చరిత్రకును, పురాణమునకును సంబంధము కలిపినాడు. గోనందుడు మధురా నగరముపై దండెత్తెననియు, బలరాము డాతని చంపెననియు ప్రతీతి కలదు. కృష్ణుడు, హతుడైన గోనందుని భార్యను రాణిగా చేసెననియు, అప్పటికి గర్భిణిగా నున్న గోనందుని భార్య యొక పుత్రుని కనెననియు, ఆ పుత్రుడే తరువాత రాజయ్యేననియు తెలుపబడినది. ఇది పుక్కిటి పురాణముగా కన్పట్టక మానదు. గోనందుని తరువాత ఏబదియిద్దరు రాజుల చరిత్ర నీవాడు తనకు పూర్వ గ్రంథములనుండి గ్రహించినాడు. నీలమత పురాణమునుండి మొదటి నల్వురి గాథను గ్రహించెను. తరువాత ముప్పది యైదుగురు రాజు లుండిరనితెల్పి, పదపడి ఎనమండుగురు
రాజులను `హేలరాజు గ్రంథమునుండియు, తదుపరి ఐదుగురు రాజుల చరిత్రమును చావిల్లికరుని గ్రంథము
నుండియు ఈ కవి గ్రహించెను. భారతీయ చరిత్రతో కాశ్మీర చరిత్రను కలుపుటకై, గోనంద యుధిష్ఠిరులు
సమకాలికత్వము కల్పింపబడినది. రాజతరంగిణిలోని ప్రథమభాగమున (తరంగమున) అశోకుని ప్రశంస కలదు. అతనికి జలౌకుడను పుత్రుడున్నట్లు తెలుపబడినది. ఇది చారిత్రకముగ ధ్రువపడ లేదు. కుషాన్ రాజులైన హుష్క, జుష్క, కనిష్కుల ప్రశంస ఈ గ్రంథమున గలదు. వారు బౌద్ధులని తెలుపబడినది. వీరి వరుస తలక్రిందుగా నున్నది. ఈ భాగమున కొన్ని కథలు ఆకాలపు సంప్రదాయము ననుసరించి యున్నవి. బ్రాహ్మణుడగు అభిమన్యుడను రాజు కాలములో, బౌద్ధ స్పర్శచే అపవిత్రములైన తీర్థములు పవిత్రములు చేయబడినట్లు తెలుపబడినది. ఈ గ్రంథమున తెలుపబడిన రాజులు భిన్న వంశములకు చెందిన వారుగా కన్పింతురు. మొదటి ఏబది యిద్దరు రాజుల చరిత్రములోని సత్యాసత్యములను పరీక్షించుటకు కల్హణుని కవకాశములేకపోయెను. అందులకు సామగ్రియు మృగ్యము. కేవలము సంప్రదాయబద్ధముగా వచ్చు కథలను, అప్పటికి ప్రచారములోనున్న అసంపూర్ణ గ్రంథములను సామగ్రిగా నీ కవి గ్రహించెను. అశోకుడు క్రీ. పూ. 1260 వ సంవత్సరమున నుండెననియు, గోనంద వంశమునకు చెందిన రణాదిత్యుడను రాజు మున్నూరు
సంవత్సరములు పాలించెననియు, మున్నగు నమ్మదగని యంశములిందు పొందుపరచబడినవి. ఇందులకై, కల్హణుని నిందింపరాదు. ఆకాలమున నట్టి నమ్మకములుండెననియు,<noinclude><references/></noinclude>
0eur81kyydp2xzlu3qmhvdqewtfe5sg
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/612
104
154667
570247
448477
2026-08-14T16:07:11Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570247
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కల్హణుడు}}</noinclude>
వానిని సంప్రదాయానుసారముగ కల్హణుడు గ్రంథస్థములుగ కావించె ననియు మనము తెలిసికొనవలెను. కర్కోట వంశము యొక్క చరిత్రమున కొంత సత్యము కలదు. నిజమైన కాశ్మీర చరిత్రము అవంతి వర్మతో నారంభ మగుచున్నది. క్రీ. శ. 1003 లో చనిపోయిన దిద్దారాణి వరకు గల చరిత్రము విశ్వసనీయముగనే యున్నది. తరువాత లోహార వంశ మారంభించును. అనంతరము 1731 శ్లోకములలో తరువాతి చరిత్ర క్రీ. శ. 1101 వ సంవత్సరమున హర్షుని హత్యవరకు సక్రమముగా నీయబడినది. తుది రెండు తరంగములును మిక్కిలి
రసవంతములును, ముఖ్యములును అయి యున్నవి. ఇందు ఉచ్చలుని రాజ్యాగమనమునుండి కథ వర్ణింపబడినది. ఈ విధముగా మొదటి భాగముకంటె గ్రంథోత్తరభాగము చారిత్రక విషయములతో నిండి, విశ్వసనీయమై యలరారు చున్నది. ఇందులకు కవియొక్క స్వానుభవమే ముఖ్య కారణము. రెండవ భాగమున గల పెక్కు వివరములు మొదటి భాగమున లేవు. ఉండుటకు వీలును లేదు. చారిత్రక దృష్టితో వ్రాయబడిన మొదటి గ్రంథము రాజతరంగిణియే ! ఇందలి పూర్వభాగము ప్రాచీన రచనలపై ఆధారపడియున్న కారణమున నా భాగము చారిత్రక విమర్శనమునకు నిలువజాలదు. సామగ్రి తక్కువగా నున్న అన్ని చారిత్రక గ్రంథములకును ఇది సామాన్య లక్షణము.
కల్హణుని కావ్యమును పరీక్షించుటలో కావ్యదృష్టి యెక్కడుగా నుపయోగింపవలసియుండును. ఆ గ్రంథమును
పరిశీలించిన యెడల కవియొక్క ఆశయమేదియో మనకు స్పష్టమగును, చారిత్రకుడు కాదలచిన కల్హణుడు తన
కవి ధర్మమున కొంత కొరవడినట్లు స్పష్టము. ఆతని భావనాశక్తి కిష్టమువచ్చిన యెత్తున కెగురుట కాతనికి
వీలులేకపోయెను. అయినను వలయు స్థలములం దాతడు తన శక్తిని చూపినాడు. కల్హణుడు సామాన్యముగా
అనుష్టుప్ ఛందస్సునే ఉపయోగించెను. చరిత్రకు కావలసిన వేగ మాతని రచన యందు కాన్పించును. ఒక్కొ
క్కచో నాతడు కావ్యశైలిలోనికి పూర్తిగా చొరబడవలెనాని యత్నించెను. కాని అతడు వ్రాసిన విషయ మాతని
కనరోధకమయ్యెను. ఒక్కొక్కచో రసము కొరవడియున్నది. అందుల కచ్చటి విషయమే కారణము. "కాని
మొత్తము మీద నీతడు "ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం” అనునట్లు కవి గుణములను, చారిత్రక గుణములను— రెండిం టిని కలవాడని చెప్పకతప్పదు. కల్హణుడు వ్రాసిన కథలో మహమ్మద్ గజినీ దండయాత్ర యొక్క ప్రశంస కూడ కలదు. మహమ్మద్ గజనీని భారతీయ సాహిత్యము హమ్మీరుడని పేర్కొనుచున్నది. ఆ హమ్మీరుని దండయాత్ర నావుటకై కాశ్మీరరాజు తుంగుడను సేనాని ద్వారమున త్రిలోచనపాలుని కంపిన సహాయమును కల్హణుడు పేర్కొనుచున్నాడు. కాని దాని పర్యవసాన మేమయ్యెనో, క్రీ. శ. 1015వ సంవత్సరము న కాశ్మీరముపై మహమ్మదీయుల దండయాత్ర యొక్క పరిణామ మేమయ్యేనో ఈతడు తెలుపలేదు. కల్హణుని కాలము నాటికా దండయాత్ర లాగిపోయెను.
కల్హణుని శైలి మిక్కిలి లలితమై, సమయోచితమై యున్నది. అతడు రసవంతముగా వ్రాయగల సమర్థుడు.
క్రీ. శ. 1144 వ సంవత్సరమున భోజుని పర్వతయాత్రయు, అనంతుని భార్య యగు సూర్యమతి సహగమనమును, జయాపీడ బ్రాహ్మణుల సంభాషణమును, హర్షుని దుఃఖమును, హంతకుని రక్షించుటయు, మున్నగు స్థలములందు కల్హణుడు తన కవితాశక్తిని వినియోగించి, సహృదయుల నానందసాగరములో ముంచినాడనుట అతిశయోక్తి కాదు. సంభాషణముల సందర్భమున నాతని శక్తి మిక్కిలి యుజ్జ్వలము. శైలి మధురము. అలంకారముల నుపయోగించుటలో నాతడు సమర్థుడు. చరిత్ర యొక్కప్రాముఖ్యమును వర్ణించుచు, కల్హణు డిట్లు పల్కి యున్నాడు:
<poem>
భుజ తరువనచ్ఛాయాం యేషాం నిషేవ్యమహౌజసాం
జలధి రశనా మేదిన్యా సీదసావకుతోభయా,
స్మృతమపినతే యాంతి క్షసూపా వినా యదనుగ్రహం
ప్రకృతి మహతే కుర్మః తస్మై నమః కవికర్మణే.</poem>
రాజతరంగిణి క్రీ. శ. 1149 లో పూర్తి చేయబడినట్లు వెనుక తెలుపబడినది. కాని ఈ గ్రంథము 1150 వ సంవత్సరమున ముగిసినట్లు కొందరు చెప్పుచున్నారు. క్రీ.శ. 1421వ సంవత్సరము రాజతరంగిణిలో కొంతభాగము పారసీక భాషలోని కనువదింపబడెను. మిగిలిన భాగాను<noinclude><references/></noinclude>
kyjjtbm52npfcisorywqwvm3ucczzip
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/613
104
154668
570248
448478
2026-08-14T16:45:27Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570248
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కల్లినాథుడు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="613A" />వాదము క్రీ.శ .1594 వ సంవత్సరములో పూర్తియయ్యెను. అక్బరు కాలమున వరలిన అబుల్ ఫజల్ రాజకరంగిణిని పేర్కొనినాడు.
బెర్నియర్ అను పాశ్చాత్యు డీ గ్రంథము ననువదించెనని తెల్పుదురు. కాని అది ఉపలభ్యమానము కాదు.
ఈ గ్రంథము యొక్క సంపూర్ణ ప్రథమ భాషాంతరీకరణము క్రీ.శ. 1852 వ సంవత్సరమున ఫ్రెంచిభాషలో వెలు
వడెను. క్రీ. శ. 1870 వ సంవత్సరమున దీనిని యోగీశ చంద్రదత్తు ఆంగ్లములోని కనువదించెను. కాని పాఠాంతరములతో సరియైన పాఠమును ప్రచురించు గౌరవము సర్ ఆరెల్ స్టీన్ అను పాశ్చాత్య పండితునికిని, దుర్గాదాసు పండితునికిని దక్కెను. అప్పటివరకు పాఠనిర్ణయమైయుండలేదు. సర్ ఆరెల్ స్టీన్ క్రీ. శ. 1900 సంవత్సరమున దీని నాంగ్లభాషలోనికి చక్కగ అనువాదము చేసెను. మరల క్రీ. శ. 1935 వ సంవత్సరమున రాజతరంగిణిని శ్రీ ఆర్. యస్. పండిట్ గారు సాధికారముగా ఆంగ్లములోని కనువదించెను. ఇది ఈ గ్రంథానువాద చరిత్రము.
కల్హణుని తరువాత ముగ్గురు కవులు మూడు భాగములను రచియించిరి. మొదటి భాగమును జోన రాజను
కవి రచియించెను. ఈయన క్రీ. శ. 1417-1437 సంవత్సరముల మధ్య కాశ్మీరమును పాలించిన ముసల్మాను రాజగు జై మలాబుద్దీన్ వద్ద ఆస్థానకవీశ్వరుడుగా నుండెను. కల్లణుడు విడచిన నాటినుండి ఈ ముసల్మాను రాజు కాలము వరకుగల చరిత్ర మీ భాగమున కలదు. ఆతని శిష్యుడైన శ్రీవరుడు, గురువుగారి రచనను సాగించెను. ఇందు క్రీ.శ. 1459-1488 సంవత్సరముల మధ్యనున్న చరిత్ర కలదు. తరువాత అక్బరు చక్రవర్తి కాశ్మీరమును జయించి దానిని తన రాజ్యమున కలుపుకొను నంతపరకు అనగా క్రీ. శ. 1586 వరకుగల చరిత్రము ప్రాజ్య భట్టుడును, ఆయన శిష్యుడు శుకుడును రచియించిరి. ఈ నల్గురి రచనలకును, కల్హణుని రచనకును హస్తిమశకాంతరమున్నది. వీరు రచియించిన భాగములు బొత్తుగా రసవంతములు కావని చెప్పజాలము.. కాని శైలీ భేదము మాత్రము కనబడును.
రాజతరంగిణి తరువాత సోమపాలవిలాసము, పృథ్వీరాజ విజయము, కుమారపాల చరితము మున్నగు చారిత్రక రచనలు వెలసినను, అయ్యవి కల్హణుని గ్రంథము యొక్క స్థాయికి రాలేకపోయెను. ఒక్క కావ్యము
మాత్రము చెప్పుకోవదగినది కలదు. తంజావూరు రఘునాథ రాయల ఆస్థాన కవయిత్రియగు రామభద్రాంబ రఘునానాభ్యుదయు మను కావ్యమును చక్కని చారిత్రకదృష్టితో రచించినది. దీనిని దాస్ గుప్తగారు కూడ
మెచ్చుకొనినారు. ఎన్ని గ్రంథము లున్నను రాజతరంగిణి కదియే సాటి.
{{right|కు.సి.}}
<section end="613A" />
<section begin="613B" />'''కల్లినాథుడు :'''
కల్లినాథుడు సంగీత, విద్యాప్రపూర్ణుడు. ఇతనికి చతుర కల్లినాథుడను వ్యవహారము కలదు. ఇతడు నియోగి.
బ్రాహ్మణుడు. శాండిల్యగోత్ర వరిష్ఠుడు. తండ్రి తోడరమల్ల లక్ష్మణాచార్యుడు. తల్లి నారాయణీ దేవి.
శాత జ్ఞాన వై రాగ్యో పేతు డగు తా (సక) లేశ్వరదేవుడు. మహా రాజాధిపుల యొద్ద మంత్రిపదవి నలంకరించి మంత్రిత్వమున పేరున్న తోడరమల్లుని యొక్క వంశ బిరుదమును ఆశతో డన `పేరునకు చేర్చికొనినాడు కల్లినాథుడు. తన పాండిత్యగరిమకు కర్ణాట దేశాధీశుడగు ఇమ్మడి దేవ (లేక మల్లికార్జున) రాయలవల్ల అనేక గౌరవములను వడసెనట. అందుచే కల్లినాథుడు క్రీ. శ. 1446-65 మధ్యకాలమున నుండినట్లు తెలియు చున్నది. కర్ణాట దేశము కావేరి, కృష్ణానదులకు మధ్యగల దేశముగ నీతడు పీర్కొనెను.
కల్లినాథుడు గీతవాద్య నృత్యములతో గూడిన సంగీతము నభ్యసించి అందు చతురుడై చతుర కల్లినాథు డను
పేరును సార్థకము చేసికొనెను. అతడు ముఖ్యముగ నృత్యమున ప్రజ్ఞావంతుడై భరతాచార్యుడై ఖ్యాతి గాంచెను."ప్రత్యక్ష. భరతాచార్యో కల్లినాథో విదాం వరః" అనియు, "శ్రీమదభినవ భరతాచార్యః" అనియు తనను గూర్చి అతడే నగర్వముగ చెప్పికొనినాడు. నాట్యమును గురించి లోకమున ప్రబలియున్న నీచభావమును తోలగించుటకు 'కాబోలు అతడు భరతాచార్యుడై నాట్యకళౌన్నత్యమును చాటెను.
రెండు శతాబ్దములకు పైగా తనకు పూర్వమందు శ్రీ శార్ణ దేవుడు రచించిన "సంగీత రత్నాకరము" నకు
<section end="613B" /><noinclude><references/></noinclude>
8wztciy6gmlfpgcqbrz61ybvcxdt993
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/614
104
154669
570289
448479
2026-08-15T05:43:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570289
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కవిత్వము :}}</noinclude><section begin="614A" />కల్లినాథుడు “కలానిధి" అను వ్యాఖ్యానము రచించెను. ఆ గ్రంథము మన దేశమున సర్వత్ర వ్యాప్తినొంది
యున్నది. సంగీతరత్నాకర గ్రంథమునకు మున్నే సింహ భూపాలునిచే వ్రాయబడిన వ్యాఖ్యానముకన్న కల్లినాథుని కలానిధి భాష్యమే దేశ విశ్రుతి నొందెను. ఇట్టి ఖ్యాతికి కారణము ఆతని వ్యాఖ్యానము సమగ్రము, సంప్రదాయ సిద్ధమునై యుండుటయే. వ్యాకరణ, వేదాంత, అలంకార, ఆయుర్వేదాది శాస్త్రములందు అతనికి గల ప్రజ్ఞ "కళానిధి" యను సార్థక బిరుదమందు తెల్లము కాగలదు. శార్ణదేవుని కాలమునాటి సంగీతము దేశకాల పరిస్థితుల ననుసరించి కల్లినాథుని కాలమునకు కొంత మారినట్లు తెలియగలదు. కాలానుసరణమున లక్ష్యలక్షణములకు వ్యత్యాసములు కలుగుచుండును. వానిని తిరిగి కల్లినాథుడు తన వ్యాఖ్యానమున మార్గ, దేశి, సంగీతము యొక్క లక్ష్యలక్షణములను నిరూపించియున్నాడు.
శార్ణ దేవుని సంగీతకళా విశేషములను దృఢపరచుచు కల్లినాథుడు పెక్కు పూర్వశాస్త్రజ్ఞుల సూక్తుల సుల్లేఖించెను. ప్రాచీనులైన భరతుడు, కోహలుడు, మతంగుడు, రుద్రటుడు, కశ్యపుడు మున్నగు ఆచార్యులచే చెప్పబడిన శాస్త్రములను, శ్లోకములను ఉదహరించుచు సంగీత విషయమును సమన్వయ మొనర్చెను. ఇట్లు స్వర, రాగ, ప్రకీర్ణ,ప్రబం ఛాధ్యాయాదులందు భరత మతంగాదుల మతములను విశేషముగా ప్రతిపాదించెను. అందు విశేషముగా మతంగుని అభిప్రాయము లుదహరించెను. శార్జదేవుడు తెలిపిన గ్రహాంశాది త్రయోదశ గానలక్షణములను విపులముగా వ్యాఖ్యానించెను. రాగలక్షణ విషయమునను, రాగ, గీత భేదము లెంచుటలోను మతంగ, కశ్యప మతములను సాదరముగ నుదహరించెను. రాగాంగ
ఉపొంగాది లక్షణవివరణమున మతం గోక్తుల నుల్లేఖించెను.
కల్లినాథుడు తన కభిమాన విద్యయగు నృత్యము గూర్చి తెలుపునప్పుడు, కోహలుని మతము నభిమానించి
నట్లు తెలియుచున్నది. నర్తనములను గూర్చి వర్ణించు కోహలుని శ్లోకములు అధికముగా వ్రాసెను. భరతముని
నృత్యహస్తములను శారదేవుడు తెలుపుటలో అతనికి తృప్తి కలుగనందున కాబోలు అతడు కోపాలుని “సంగీత
మేరువు" లోని ఈ విషయము గూర్చిన అధ్యాయమును పూర్తిగ ఉల్లేభించెను. కరణ సముదాయపూర్వక అంగహారము ప్రయోగింపనగు రంగస్థల నిరూపణమున “భావ ప్రకాశ” కర్త యగు శారదాతనయుని శ్లోకములు
కల్లినాథుడు ఉదహరించెను. దేశీయములైన విధములు గూర్చిన భరత శార్ణదేవుల మతములనే గాక, కోహలుని
కావ్యమును సహితము ఉల్లేఖించెను.
{{right|వి. ప. స. }}
<section end="614A" />
<section begin="614B" />'''కవిత్వము :'''
కవిత్వము - లలితకళలు: కవిత్వము కళ. కార్య కౌశలమే కళయని సాధారణముగా నిర్వచింపవచ్చును.
కార్య వైవిధ్యమునుబట్టి యివి యసంఖ్యాకములగును. భారతీయులు స్థూలముగా కళలు అఱువదినాలుగు
అన్నారు. వీనిని పరిశీలించినచో వీనిలో పెక్కు మానవుని జీవయాత్రను సుఖప్రదము గావించుట కుపయోగపడునవి గానే కనబడును. కాని పునఃపరిశీలనము చేయగా ఈ కళలలో కొన్నింట లౌకిక ప్రయోజనముకంటె భిన్నమైనదియు, విశిష్టమైనదియు నగు వేరొక ప్రయోజనము గోచరించును. అది హృదయానందము. కళలలో హృదయానంద దాయకములగు వానిని కొన్నింటిని వేరుపరచి వానికి లలితకళలని పేరు పెట్టినారు. చిత్రవిద్య, సంగీతము, కవిత్వము, నాట్యము, శిల్పము అనునవి లలితకళలు. వీనికన్నింటికిని మనోహరత్వము సమాన ధర్మమనునది స్పష్టము. ఉత్తమ చిత్రము చూచినను, కమ్మని పాట విన్నను, రసవంతమగు కావ్యము చదివినను, నృత్యమును కాంచినను, శిల్పము పరీక్షించినను మానవునకు కలిగెడి లాభమేమి ? భోజనము చేసినందువలననో, కర్పూరపు
పత్తి కనుల వేసికొనినందుననో, చందనము పూసికొనుట వలననో, మరియు ఇట్టివానివలననో కలిగెడి ప్రయోజనములలో ఏ ప్రయోజనము కలుగుచున్నది ? నిజమునకు కాయమున కెట్టి ప్రయోజనము కలుగుట లేదు. కావుననే "బుభుక్షితైః వ్యాకరణం నభుజ్యతే | పిపాసితై 8 కావ్యరసోనిపీయతే" అన్నారు. వ్యాకరణమును దీని క్షుద్బాధను తొలగించుకొనలేము - కావ్యరసమును త్రాగి దప్పిక పోగొట్టుకొననులేము- -కాని మానవుడు కేవల
<section end="614B" /><noinclude><references/></noinclude>
9jrn90dh1qti55kmmmr76c7wkx8i859
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/615
104
154670
570290
448480
2026-08-15T06:14:12Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కవిత్వము||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
లౌకిక ప్రయోజనములతోనే తృప్తిపడువాడు కాడు. పశుపక్ష్యాదులకు లేని విశేషశక్తు లాతనికున్నవి. ఊహా
పోహలున్నవి. మేధ యున్నది. భావన యున్నది. భాష యున్నది. ప్రకృతిలో మానవుడు పరమేశ్వరుని సూక్ష్మరూపము. అతడు ప్రకృతిని సంస్కరింప జూచును. ప్రతి సృష్టిచేయ బూనును. ఆనందము నాశించును. ఇతరుల కద్దాని నందింప నభిలషించును. ఈ లక్ష్యసాధనముకొరకు చేయు మేలి ప్రయత్నమే కళ. మనోజ్ఞములయిన కళలు కావున ఇవి లలితకళలయినవి. "ప్రియశిష్యా లలితే కళా
విధౌ" అని లలితశబ్దమును కళకు విశేషణముగా కాళిదాస మహాకవి వాడుట జూడ లలితకళలుగా ఇవి భారతీయులకు ప్రాచీన కాలమునుండియు పరిచితములై నట్లుగా స్పష్టపడుచున్నది. లలితకళలలో కవిత్వము మిన్నాకు.
'''కవిత్వ స్వరూపము :''' కవి యొక్క ఉత్కృష్ట వర్ణనా వ్యాపారము కవిత్వము. కవనము కవి వ్యాపారములలో ముఖ్యమైనది. కవ- వర్ణనే యను ధాతువునుండి నిష్పన్నమగు కవిశబ్దము ప్రధానముగా వర్ణనశీలుని బోధించును. సుందరముగా విషయమును వ్యక్తీకరించుటయే వర్ణనము. అదియే కవిత్వము, కావ్యము. ప్రకృతిలో తాను చూచిన దృశ్యములను, పొందిన యనుభవములను భావనలో తీర్చి
దిద్ది రమణీయముగా, రసవంతముగా శబ్దద్వారమున ప్రదర్శించు నొకానొక విలక్షణమైన శక్తికలవాడు కవి. అట్టివాని సృష్టి కవిత్వము. రమణీయార్థ ప్రతిపాదకమైనచో ఒక వాక్యమైనను ఒక పద్యమైనను అది కవిత్వమే. కవిత్వము పద పరిమాణమునుబట్టి కాక భావపరిణతినిబట్టి యెన్నబడును. విన్నంతనే హృదయమును ఆనందపరవశము చేయునది యుత్తమ కవిత్వము. చమత్కృతి విశేషముచే తల యూపించునది మేలి కవిత. కావుననే,
<poem>
'ముదమున సత్కవి కావ్యము
నదరగ విలుకాని పట్టినమ్ముమ బర హృ
దిృదిమై తలయూపింపని
యది కావ్యమె మలరి పట్టినదియుం గరమే ?-'</poem>
అని నన్నెచోడకవి కవితాప్రసారమును శరప్రసారముతో పోల్చి చెప్పినాడు. ఇట కావ్యపక్షమున హృద్భేద
మనగా మనోవికాసమే. ఉత్తమ కవితాస్వరూపమును పింగళి సూరనార్యుడు హృద్యముగా ఇట్లు తెలిపెను :
<poem>
పొనఁగ ముత్తపు సిరుల్ పోహణించినలిలఁ
దమలోన దొరయు శబ్దములఁ గూర్చి
అర్థంబు వాచ్య లక్ష్య వ్యంగ్య భేదంబు
లెరిగి నిర్దోషత నెనఁగఁ జేసి
రసభావములకు సర్హంబున వైదర్శి
మొదలైన రీతు లిమ్ముగ నమర్చి
రీతుల కుచితంబులై తనరారెడు
ప్రాణంబు లింపుగ బాదుకొల్పి
అమర నుషమాదులును యమ కాదులునగు
నట్టి యర్థశబ్దాలంక్రియలు ఘటించి
కవిత చెప్పంగ నేర్చు సత్కవివరునకు
వాంఛితార్థంబు లీయని వారు కలరె !</poem>
ఇది శబ్దార్థవృత్తిరీతిరసాలంకారాది సర్వాంగ శోభితమైన కావ్యస్వరూపమును తెలుపుచున్నది.
'''కవిత్వోత్పత్తి హేతువులు :'''
'''ప్రతిభ :''' లాక్షణికులచే కవిత్వోత్పత్తికి హేతువులుగా పేర్కొనబడిన వానిలో ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము అనునవి ముఖ్యములు. ఈ మూడింటి సమష్టి రూపమే కవితకు కారణ మనియు సందురు. ప్రతిభనే శక్తియని వ్యవహరింతురు. కావ్య నిర్మాణమునకును, తదాస్వాదనమునకును ఈ బుద్ధి విశేషమువలననే మానవుడు సమర్థు డగును. అందువలన శక్తి పదము సార్థక మగుచున్నది. అప్పటప్పటికి క్రొత్తక్రొత్తగా వికసించు బుద్ధియే ప్రతిభ యనబడుచున్నది. ఈ ప్రతిభ సామర్థ్యము అతి విచిత్రమైనది. లోకములో సాధారణముగా కనబడు పదార్థములే ప్రతిభావంతుని భావనలో ప్రవేశించి నంతనే పరుసవేది స్పర్శమున లోహవస్తువులు బంగారువన్నె కలిగి మెరియునట్లు లోకోత్తరములుగా
ప్రకాశించును. కావ్యవస్తువులుగా స్వీకరింపబడి కవిభావ భావ్యమానమైనది సహజముగా చక్కనిదే యైనచో
దానికి ఈ ప్రతిఖామహిమచే మరింత చక్కదనము కలుగును. అల్పవస్తువు అయినచో అనల్పముగా భావించును. లోకములో ఏవగింపు కలిగించు వస్తువు- సంఘటనము కూడ కవితలో చేరి రమణీయమై అస్వాద్యమగును. కావుననే లోకములో భయమును, దుఃఖమును కలిగించు సందర్భములు కూడ కవితలో ఆనందదాయకములుగానే<noinclude><references/></noinclude>
mcs7r1b0r57s90pl54y0008vgxp465b
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/616
104
154671
570291
448481
2026-08-15T07:00:47Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570291
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కవిత్వము}}</noinclude>
పరిణమించుచున్నవి. అచేతనములు చైతన్యవంతములగును. ఒక లత సుందరియై లాస్యముచేయును. ఒక వాగు అభిసారికయై అభిసరించును. దానిని సముద్రుడు కౌగిలిలో పొదివికొనును. అంచ రాయబారము నడపును. ఇట్టి లోకాతీత స్థితికి, ఇంద్రజాలమునకు ప్రతిభా మహిమయే కారణము. ప్రతిభాసంపత్తికల కవికి శాస్త్రాధ్యయనాదులు విశేషముగా లేనందువలన రచనలో ఏవేని దొసగులు
దొరలినను అవి ఆ ప్రతిభా మాహాత్మ్యమున కప్పువడి పోవును. ప్రతిభాహీనుని కవితలో అట్టి తప్పులు కొట్టవచ్చినట్లు కనబడును.
ప్రతిభ పూర్వపుణ్య విశేషమువలననో, ఈ జన్మములో ఏ మంత్ర జపాదుల వలననో యైన దేవతానుగ్రహ ఫలితముగానో కలుగును. కాళిదాసుని అప్రతిమాన ప్రతిఖాదులకు కాళికా దేవి యనుగ్రహము కారణ మందురుగదా ! శ్రీహర్షుడు తన కావ్యము 'చింతామణీ మంత్ర చింతన ఫలము' గా వాకొన్నాడు. సంస్కృతములోను, తెలుగులోను ఇట్టివారు లెక్కకు మిక్కిలి కలరు. ఐం, క్లీం, సౌం, ఓం సరస్వత్యై నమః అను మంత్ర జపముచేయుట వలన వాణీ ప్రసాదము లభించి, ప్రతిభాదులు కలిగి మహాకవి
యగుటకు వీలున్నదని క్షేమేంద్రుని వంటి లాక్షణికులు నుడివిరి. ఆంధ్రకవులలో బ్రాహ్మీదత్త వరప్రసాద మున కవితా సామ్రాజ్యము లేలిన శ్రీనాథాదులు కలరు. కారయిత్రి - భావయిత్రి యని ఈప్రతిభ రెండు రూపములుగా విలసిల్లును. కారయిత్రి ప్రతిభ గలవాడు మహాకవి యగును. భావయిత్రి ప్రతిభ గలవాడు కావ్యరసాస్వాద నైపుణ్యము గల ఉత్తమభావుకు డగును.
'''వ్యుత్పత్తి :''' కావ్యోత్పత్తి హేతువులలో రెండవ యంశము వ్యుత్పత్తి. వ్యుత్పత్తి యనగా బహుముఖమైన శాస్త్రపాండిత్యము. శబ్ద సాధుత్వాసాధుత్వములయు, వివిధ వృత్తములయు పరిజ్ఞానము కొరకు వ్యాకరణ ఛందః శాస్త్రములు చదువవలెను. నిఘంటువు పఠింప వలసియుండును. చతుష్షష్టి కళలలో ప్రవేశము కలిగించుకోవలెను. ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థములకుపకరించు నను, యాజ్ఞవల్క్యస్మృతులు, గర్గ, భార్గవ, కౌటిల్యాదుల అర్థశాస్త్ర గ్రంథములు, వాత్స్యాయనాదుల కామశాస్త్రము, వ్యాస కపిల కణా దాక్షపాద పతంజలులచే ప్రణీతమయిన వేదాంత సాంఖ్య తర్క న్యాయ యోగ గ్రంథజాలమును అధ్యయనము కావించవలెను. శాలి హోత్రాదులు గజ తురగశాస్త్రము,
సాముద్రికము, ఆయుర్వేదమువంటి శాస్త్రములను పరిశీలింపవలెను. ఇట్టి శాస్త్ర పాండిత్యమే కాక మహాకవులగు వాల్మీకి కాళిదాసాదుల కావ్యములయు, భారతాదులగు ఇతిహాసములయు, పురాణములయు పరిచయము కలిగి యుండవలెను. వీని నన్నింటిని మించి స్థావరజంగమాత్మకమైన ఈ లోకము యొక్క స్వరూపమును, స్వభావాదులను గుర్తింపవలెను. ప్రకృతి పరిశీలన మెంత చేసిన అంతగా కవి వర్ణనా నైపుణ్యము పుష్టినొందును.
బహుముఖ వైదుష్యరూపమైన ఇట్టి వ్యుత్పత్తి ప్రయత్నసాధ్యము, వ్యాపారమునకు మూలధన మెట్టిదో
కవిత్వ వ్యాపారమున కి వ్యుత్పత్తి సంపద యట్టిది. కవిత్వము చిరస్థాయి కావలెనన్న ప్రతిభతోపాటు వ్యుత్పత్తియు తన్ని ర్మాతకు మిక్కిలి యవసరము. ఇవి యొండొంటికి పోషకములై ప్రకాశించి కవిత్వప్రాప్తిని కలిగించును.
'''అభ్యాసము :''' అభ్యాసము కావ్యోత్పత్తి హేతువులో తృతీయాంశము. నిరంతరముగా రచనా వ్యాసంగము కావించుచుండుటయే అభ్యాసము. దీనివలన ధారాశుద్ధి యేర్పడును. రచనలో వేగ మలవడును. ప్రతిభావ్యుత్పత్తుల వైభవమెంత మహితముగా మన్నను కావ్యరచన సాగింపనిచే యట్టి వానివలన లోభి ద్రవ్యమున బోలె లోకమునకు ప్రయోజనము కలుగదు. మహర్షులలో ప్రతిభావంతు లును, శాస్త్రజ్ఞులును గానివారెవరు ? కావ్య రూపముననో, శాస్త్రరూపముననో రచనలు సాగించిన వారి మూలముననే కదా విజ్ఞానవ్యాప్తి కలిగినది ! లోకమునకు మేలు చేకూరినది! శాణోల్లీఢమైన వజ్రము
వలె అభ్యాసము వలన కవిత్వ రచనాపాటవము మెరుగెక్కును. అక్షర రమ్యత యీ యసకృదభ్యాస సంపాద్యమే. కవితలో ఒక భాగమైన ఆశువు నిరంతర రచనా భ్యాసము కావింపనివాని కందరాని ఫలమనవచ్చును. శత లేఖనీ పద్యసంధాన ధౌరేయులకు, ఘటికా శతగ్రంథకరణధుర్యులకు, అష్ట శత సహస్రాది వివిధావధాన కర్తలకు ధ్యేయమైన దీ యథ్యాసదైవమే. 'అనభ్యాసే<noinclude><references/></noinclude>
r78qgpr86u2lx18xlxr4vtrp79yxgdj
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/617
104
154672
570293
448482
2026-08-15T07:27:15Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570293
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{ rh|కవిత్వము||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
విషం విద్యా' అను సూక్తి కవితావిద్యకును సమన్వయించును. ఇట్ల ప్రతిభా వ్యుత్పత్త్యభ్యాసత్రయి యేక
రూపమై ప్రకృష్ట కవిశ్వ సృష్టికి కారణమగును.
'''కవిత్వప్రపంచము - కవిసృష్టికర్త:''' కవితాప్రపంచము లౌకిక ప్రపంచముకంటె అన్ని విధములను విలక్షణమైనది. కావ్య ప్రకాశకారు డీ కవిసృష్టి బ్రహ్మసృష్టుల స్వరూపమును చక్కగా నిరూపించి వీనిలో కవిసృష్టియే సుందరతరమని తేల్చినాడు. బ్రహ్మ సృష్టించిన ప్రపంచములో పద్మాదులలోనే పరిమళాది గుణము లుండునని నియమము కలదు. కవి నిర్మించిన జగత్తులోనో, కాంతాముఖాదులలో కూడ పరిమళ ముండును. వాస్తవ ప్రపంచములో జడములుగానున్నవి కవి సృష్టిలో చైతన్యవంతములై వ్యవహరింప గలవు. దేవతలు, మానవులు - తిర్యక్కులు, స్థావరములు-జంగమములు అన్నియు పరస్పర ప్రేమ సానుభూతులు గలిగి యేక కుటుంబములోని వ్యక్తులవలె మెలగు సుందర దృశ్యములు కావ్యప్రపంచము లోనే కననగును. లోకము సుఖదుఃఖాది మయముకాగా, కావ్యలోకము సుఖమయమే. అందు దుఃఖ స్పర్శము లేనేలేదు. బ్రహ్మ నిర్మించిన రవి సోకని స్థలముండిన నుండునేమోకాని కవి ప్రతిభారవి స్పృశింపని చోటే యుండదు. భౌతిక ప్రపంచములో ఆరు రసములే రసన కందుచుండగా కావ్య
విశ్వమున నవరసము లాస్వాద్యము లగుచు ఆనందింప జేయుచుండును. చతుర్ముఖబ్రహ్మ తన సృష్టికి అణ్వాది కారణములపై ఆధారపడవలసినవాడై పరాధీనుడు కాగా కవిబ్రహ్మ స్వతంత్రుడై వెలయును. బ్రహ్మ నిర్మితిలోని వ్యక్తులకు స్వర్గాది సుఖానుభవము కొరకు సూక్ష్మశరీరధారణ చేయవలసిన యవసరము కలుగుచుండగా కావ్య జగన్ని వాసుల కాయా స్వస్వదేహములతోనే తత్తత్సుఖాను భవ యోగ్యత కల్గుచున్నది. ఇట్టి హేతువులచే కావ్య ప్రపంచము విలక్షణమైనదని గుర్తింపవచ్చును.
'''కవి :''' అద్భుతమైన యిట్టి కావ్యప్రపంచమునకు సృష్టి కర్తయైన కవి మహామహిమోపేతుడు. దివ్యదృష్టి గలవాడు. అతిక్రాంత విషయములను, ఆగామి విషయములను గూడ స్పష్టముగా జూడగలిగిన వాడు. ఆదికవి శ్రీ వాల్మీకి జరిగిపోయిన శ్రీరామ వృత్తమును ప్రతీచీ దృష్టితో కరబదర సమానముగా చూచియే రామాయణ కావ్యమును రచించెనని ప్రతీతి. కవి పదము తొలుత సర్వశక్తి సంపన్నుడగు పరమాత్మకు వాచకముగ వైదిక వాఙ్మయములో ప్రయోగింపబడినది. భగవద్గీతలో అక్షర బ్రహ్మయోగము నందును కపిల పురాణమును శాసితార మణొరణీయాంస మనుస్మ రేద్య -అనుచు పరమాత్మ కవిగా వర్ణింపబడినాడు. ఇట కవిశబ్దమును 'సర్వజ్ఞుడు ' అని వ్యాఖ్యాతలు వివరించినారు. భగవద్వాచకమైన యీ కవిశబ్దము క్రమముగా విశేషజ్ఞాన సంపన్నుడైన కావ్యకర్తకు పర్యాయముగా వ్యవహారములోనికి వచ్చినది. దివ్యదృష్టిగల ఋషులకును ఆ కవిశబ్దము వాచకమయినది. ప్రకృతి గత విచిత్ర ధర్మాంశ తత్వములను ప్రతిభచే దర్శించి వివరించి చెప్పగల్గుటవలన కవియు ఋషి యగు చున్నాడు. 'నా నృషిః కురుతే కావ్యమ్' అని ప్రసిద్ధి. ఋషి కానివాడు కవి కాడనుట యుక్తము. ఋషివలె కవియు లోక శ్రేయస్సునే వాంఛించువాడు. స్థితప్రజ్ఞుడు. దివ్యదృష్టి గలవాడైనను ఋషు లందరును కవులుగా ఖ్యాతినందలేదు. దర్శనశక్తితోపాటు వర్ణనా నైపుణ్యము గూడ వెలసినప్పుడే వారికి కవులను ప్రసిద్ధి కలిగినది. కావుననే ఈ యుభయశక్తులు గల వాల్మీకి, వేదవ్యాసాదులగు ఋషులు కొందరే కవులుగా విఖ్యాతులైనారు.
'''కవుల వైవిధ్యము:''' రచనా విధానమునుబట్టి కవులను కొందరు వర్గీకరించినారు. సత్కవి, విదగ్ధకవి, అరోచకి కవి, సతృణాఢ్యవహారక కవి యను కవిభేదములను సాహిత్య మీమాంసా కారుడు పేర్కొనెను. వీణానాదము వలె శ్రవణానందకరమగు వైదర్భిరీతి నాశ్రయించి రసవంతమైన కవిత్వమును చెప్పెడివాడు సత్కవి యనబడును. వాల్మీకి కాళిదాసాదులు ఈ శ్రేణికి చెందిన వారు. వక్రోక్తి ప్రధానమైన కవితారచనము కావించు కవికి విదగ్ధుడని పేరు. వ్యాసబాణాదు లిట్టివారు, అలంకారముల మీద ఎక్కువ మక్కువ చూపుచు అర్థగాంభీర్యము వెలయ కావ్య నిర్మాణముచేయు కవి అరోచకి యన ప్రసిద్ధుడు.
మాఘుడు, భారవి మొదలైన కవు లీ కోవలో చేరుగురు. శబ్ద ప్రధానములైన యమకానుప్రాసాదులు, చిత్ర
బంధాదులు గలుగు కబ్బము గూర్చునతడు సతృణాభ్య సహారక కవి యనబడును. కావ్యాలంకార చూడామణి<noinclude><references/></noinclude>
kk5artseskanhmcgrjou6nxvzqvfu8w
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/618
104
154673
570313
448483
2026-08-15T09:55:15Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570313
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కవిత్వము}}</noinclude>
రచయిత విన్నకోట పెద్దనయు, వాని ననుసరించి అప్ప కవియు సప్తవిధ కవులను బేర్కొన్నారు. వాచికుడు, ఆర్థుడు, శిల్పకుడు, రౌచికుడు భూషణార్థి, మార్దవాను గతుడు, వివేకి యనువార లీ యేడుగురు కవులు. పదా డంబరముగల ప్రౌఢకవి వాచికుడు. మితశబ్దములతోనే విపులార్థస్ఫూర్తి కలిగించు శక్తికలవా డార్థికుడు. బహువిధ యమకాదు లగు శబ్దాలంకారముల నభిమానించు వాడు శిల్పకుడు. వెదకి వెదకి మృదు మృదు పదముల గూర్ప నేర్పరియైనవాడు రేచికుడు, అలంకార భూయిష్ఠమయిన రచన సాగించు నాతడు భూషణార్థి. సరళములగు శబ్దములను విరళములగు నర్థములను వీనుల కింపు దనరగూర్చి రసభరితముగ కావ్యమును రచించువాడు మార్దవానుగతుడు. శబ్దార్థ గుణదోష వివేక పూర్ణుడును, బహుముఖశాస్త్రజ్ఞాన సంపన్నుడును, రసవదుత్తమ కావ్య నిర్మాణ చాతురీధురీణుడు నగువాడు వివేకి. ఈ వివేకి సర్వక విమూర్ధన్యుడు. మహాక విఖ్యాతుడు.
రాజశేఖరు డింకొకరీతి కవి భేదములను జూపి యున్నాడు. శాస్త్రకవి, కావ్యకవి, ఉభయకవి అవి
యొక విభాగమును జెప్పి ఈ మువ్వురిలో పూర్వ పూర్వ కవికంటె ఉత్తరోత్తరకవి మిన్నయని శ్యామ దేవుడను శాస్త్రజ్ఞుడన్నట్లును, అది సరికాదని యాయావరీయుడను విమర్శకుడు తలంచినట్లును తెలిపినాడు. కేవల శాస్త్ర రచయితయు, శాస్త్రమునందు కావ్యసంపత్తిని చూపువాడును, కావ్యమునందు శాస్త్రార్థమును గూర్చువాడు నను తీరున శాస్త్రకవులును త్రివిధులు. ఇక కావ్యకవులలో ఎనిమిది తెగలవారున్నారు. 1. రచనాకవి, 2. శబ్దకవి, 3. అర్థకవి, 4. అలంకారకవి. 5. ఉక్తికవి, 6. రసకవి,
7. మార్గకవి, 8. శాస్త్రార్ధకవి అనువారు. ఈ పేర్లను బట్టియే ఆయా కవులు కవితలో ప్రదర్శించు పద్ధతి
తెలియుచున్నది. స్వభావములను బట్టియు కవి వర్గీకరణమును రాజశేఖరు డిట్లు కావించినాడు:
స్నాతకకవి . హృదయకవి- అన్యాపదేశి, సేవిత ఘట మానుడు - మహాకవి - కవిరాజు ఆవేశికుడు - అవిచ్ఛేది -సంక్రామయిత అనువారు పదిమంది కవులు. వీరిలో కావ్య విద్యాగ్రహణార్థము గురుకులమును జేరి సాధన చేయు కవి విద్యాస్నాతకుడు. తన హృదయములోనే కవిత్వము అల్లుకొనుచు పైకి రానీయని వాడు హృదయ కవి. తాను రచించిన కవితనే అందులో ఏ దోషములు దొరలినవో యని భీతిచే ఆ కవిత మరియొకరి డెవరిదియో యని కప్పిపుచ్చి సభలలో చదువువాడు అన్యాపదేశికవి. కావ్యరచనా వైపుణ్యము కలిగియు, స్వతంత్రింపక పూర్వులైన కవులలో ఏ యొక్కరి ఛాయనో అనుసరించు నతడు సేవిత. ఎవడు చక్కని కబ్బము చెప్ప కల్గియు ఏవో యనిబద్ధములైన ఖండికలనేకాని పూర్ణమైన కావ్య
రచనకు పూనడో యాతడు ఘటమానకవి. ఖండాఖండ కావ్యములన్నింటిని, రచింప సమర్థుడైన రచయిత మహాకవి. ఆయా వివిధ భాషలలో ప్రావీణ్యము గలిగి గద్య పద్యోభయాత్మకములును, కావ్య నాటకాది బహు రూపములను, నవరసభరితములునగు కృతులను నిర్మింప జాలు మేటి కవిరాజు. అట్టి మహాకవులు, కవిరాజు లీ విశ్వములో మిక్కిలి తక్కువసంఖ్యలో నుందురు. ఇట్టి వారిని గురించియే శ్రీమదానంద వర్ధనాచార్యుడు- 'అతి మహతి సంసారే ద్విత్రా పంచషావా మహాకవయః కాళీదాస ప్రభృతయః' అని యీ విశాల విశ్వములో కాళిదాసు మున్నగువారు ఇద్దరో, ముగ్గురో లేదంటే
ఏ అయిదారుగురో మహాకవులున్నారని తన అభిప్రాయము వెలిబుచ్చెను. మంత్రోపదేశ ఫలితముగా
ఆవేశము గలిగి కవితను చెప్పువాడే ఆవేళికకవి. తాను తలచినపు డెల్ల అనర్గళముగా కవిత్వము నల్లుకొనిపోవునతడు అవిచ్ఛేదికకవి. మహాక్షేత్రములలో మంత్రోపాసనము కావించి సరస్వతీదేవి యనుగ్రహమును గడించి కావ్య నిర్మితి కావించు కవి సంక్రామయిత. ఇట్టి విభేదము లెన్ని యున్నను కవులందరిలోను జీవనాళికగా భాసించునది ప్రతిభయే.
'''కవిత్వము-చతుర్విధము :''' ఆశువు, మధురము, చిత్రము, విస్తరము అని కవిత్వము నాలుగు విధములుగా నుండును. ఆశువుస్థానమున కొందరు 'మృదువు' అను పదముమ కూడ వాడినారు. 'ఆకు, బంధ, గర్భ, చిత్రములు అను విధముగా కవిత్వభాగములను బేర్కొన్నవారును గలరు.
బంధ గర్భ కవిత్వములు చిత్రకవిత్వ విభాగములోనే చేరి పోవుటచే రెండవ విభాగముకన్న మొదటి విభాగమే యుక్తముగా మన్నది. ఆనుపూర్వికముగా ఈ చతుర్విధ<noinclude><references/></noinclude>
mhkjthnwdb0vp2zgjm7sg2f2iglz89c
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/619
104
154674
570317
448484
2026-08-15T10:20:20Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570317
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కవిత్వము||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
శవిశ్వములను ఒక్కచో నిరూపించి చెప్పకపోయినను ఈ ప్రక్రియలు సంస్కృతమునను ప్రాచీన కాలమునుండి వచ్చుచున్నవియే. ఏకధాటిగా కవులు అప్పటికప్పుడు వేని నేని వర్ణించుచు శ్లోకములు చెప్పుటయు, సమస్యలు పూరించుటయు తొల్లియు గలదు. మధుర విస్తర కవిత్వములుగా చెప్పబడునట్టి గీత కావ్యములు, పద్యకావ్యములు పూర్వ వాఙ్మయమునను కొల్ల లుగదా ! ఇక మిగిలిన చిత్రకవిత్వమునే గుణీభూతవ్యంగ్య మనుచు క్షుద్ర ప్రబంధశాఖలలో చేర్చినారు.
తెలుగులో ఈ చతుర్విధ కవిత్వములు నన్నయనాటికే పరిచితములైనట్లు కనబడుచున్నది. భారతావతారికలో రాజరాజనరేంద్రుని విద్యావిలాసగోపిని వర్ణించుచు నన్నయభట్టారకుడు 'మృదుమధుర చిత్ర విస్తర నవరస భావభాసుర కవితారచనా విశారదులైన మహాకవులును' అందున్నట్లు చెప్పేను.
శ్రీనాథ మహాకవియు తన శృంగార నైషధములో 'మృదుమధురచిత్ర' విస్తర కవితావిలాన వాగీశ్వరులగు
కవీశ్వరులును' అని ఈ చతుర్విధకవిత్వములను ప్రస్తావించి యుండెను. ఈ నాల్గింటిలో ఏయొక్క సరణిలో విశేష నైపుణ్యము గలిగినను అద్దానికి సూచకముగా కవులాయా పేళ్ళతో వ్యవహరింపబడుటయు గనబడుచున్నది. ఆశుకవి, చిత్రకవి, మధురకవి ప్రబంధకవి అనుచు బిరుదములు వాడుకొనీన కావ్యకర్తలున్నారు. కొందరింకను ముందంజవైచి ఈ వాలుగు తీరులలోను మేము సిద్ధహస్తులముసుమా ! అని భుజాస్ఫాలనముచేసినట్లు కనబడుదురు. 'చతుర్విధ కవితామతల్లి కాల్లసాని చొక్కయా మాత్య పుత్ర పెద్దనార్య ప్రణింతంబైన' యని యాశ్వాసొంత గద్యము చెప్పి కొనిన పెద్దనాదు అట్టివారు,
చతుర్విధ కవిత్వముల స్వరూపము నిరూపించిన లాక్షణికులలో ముఖ్యుడు వార్తకవి రాఘవయ్య. ఈ
రాఘవయ్య రచించిన 'లక్షణ దీపిక' అముద్రితము. ఇది మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తకశాలలో నున్నదట. ఆ లాక్షణికుడు ఆశు, మధుర, చిత్ర, విస్తరములని చతుర్విధ కవిత్వములను వివరించి నాడు.
శ్రీ నిడుదవోలు వెంకట్రావుగారు లక్షణదీపిక నుండి యుద్ధరించుకొని తమ ఉదాహరణ వాఙ్మయచరిత్రలో
ప్రకటించిన ఆ చతుర్విధ కవిత్వముల వర్ణనను ఇందు పొందుపరుచుచున్నాము :
'''"ఆశుకవిత్వంబన్నది:''' ఏక పాద త్రిపాద కఠినప్రాస విషమ సమస్యాపూర్తులు, వ్యస్తాక్షరి సంఘటిత పద్యంబులును, ఇష్టార్థదేవతావర ప్రతిపాది నిషేధాక్షర రచనా చమత్కృతియు, అష్టావధానంబులు. ఘటికాశత గ్రంథ కల్పనయు, ఆకాశపురాణంబులని తత్కాలోచి తాతిత్వరిత
గతిని రచియింపఁబడునది యాశుక విత్వంబును,
'''మధుర కవిత్వంబన్నది:''' నాటకాలంకారంబులు. కశికోత్కళికలు, విభక్త్యధిదేవతోదాహరణంబులు, సప్తతాళ నటనలు, నట్లెట్లు, గీత ప్రబంధములు, చతుర్భద్రిక అష్టభద్రికలు, బిరుదావళి, నామావళి, భోగావళి, రంగ ఘోష, జయఘోష, చతురుత్తర సంఘటనలు, యక్షగానంబున వెలయు పదంబులు, దరువులు, లీలలు, ధవళంబులు, మంగళహారతులు, శోభనంబులు, ఉయ్యాల జోలలు, జక్కుల రేకు పదంబులు, చందమామ సుద్దులు, అష్టకంబులు, ఏకపద ద్విపద త్రిపద చతుష్పదషట్పదాష్టపదులు నివి యాదీగా నన్నియు లయ ప్రమాణంబుల నొప్పి మృదు మధుర రచనలన బ్రసిద్ధంబయిన యవి మధుర కవిత్వంబులు.
'''చిత్ర కవిత్వంబన్నది:''' పొద గోవనంబును, పద్య భ్రమకంబును, పాద భ్రమకంబును, నామ గోపనంబును, అనులోమ విలోమగతి పద్యంబులు, కందగీత గర్భిత వృత్తంబులును, కందద్వయ గర్భిత మణిగణ నికరంబును, క్రౌంచ పదగర్భిత కందద్వయంబును, ద్విపద చౌపదలాలి సువ్వాల మంగళ హారతి ధవళంబులు, శోభనార్థ చంద్రికాది పదదర్వులాది లయగర్భిత సీసంబును, కంక పటహ
మండూక తురంగ నట భేరీ నినాద నాలుక రంప వృత్తంబులును, ఓష్ఠ్య నిరోష్ఠ్య సంకరజిహ్వ అచల జిహ్వ వృత్తంబులును, రగడ భేదంబులును, తాళగతులును, దండక వృత్తంబులును, అష్టదళ షోడశదశ ద్వాత్రింకద్దళ పద్మ బంధంబులును, నవావరణ ద్వాదశావరణ చక్రబంధంబులును, రథ, నాగ, ద్వివాగ, కులాలచక్ర ఆందో శికాచ్ఛత్ర బంధంబులును, గోమూత్రికా పుష్పమాలికా పుష్పగుచ్ఛ మృదంగ డమరు ఖడ్గ త్రిశూల కంకణ సర్వతోభద్ర కవి కల్పిత కల్పవల్లరి నిలి యాదిగాగల్గు<noinclude><references/></noinclude>
nyozo7gsrtgr7q4o23g0fj0ls162tdo
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/620
104
154675
570320
448485
2026-08-15T10:49:23Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570320
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కవిలె భాండాగారములు}}</noinclude><section begin="620A" />బహువిధ చమత్కారంబుల చిత్రంబులు రచియించుటం జేసిన నిది చిత్రకవిత్వము.
'''విస్తర కవిత్వంబన్నది: ఇష్టదేవతా ప్రార్థనయు, కృతికర్త వంశావళియు, పురగిరి మృగయాయాత్ర వన
జల నిధివర్ణన, ద్యూత వినోద రాయబార వివాహోత్సవ సురతక్రీడ పుత్రోత్సవ సూర్యోదయ సూర్యాస్తమయ చంద్రోదయ చంద్రోపాలంభన విరహవర్ణనలు, షడృతువుల వర్ణనలు, జలక్రీడలు, మధుపాన దండయాత్ర రణక్రీడ దిగ్విజయంబులు నివి యాదిగా గలుగు నష్టాదశ వర్ణనలు, అలంకారములు, రీతులు, శయ్యలు, వృత్తులు, పాకంబు లుత్ప్రేక్షలు, శ్లేషోల్లేఖలు, ధ్వనులు, వ్యంగ్యములు నివియాదిగా గలుగు కావ్య లక్షణంబులు గలిగి పంచలక్షణ, దశ లక్షణంబులు నొప్పి కథాసరణి వర్తిల్లుటం జేసి యది విస్తర కవిత్వంబన్నది మహా ప్రబంధంబు.
ఇట్టి కవిత్వంబు కావ్య లక్షణంబునఁ జెప్పిన వాక్య పద దోషంబులు చతుర్వింశతి దోషంబులు పరిహరింపవలయు. దోషంబులు వర్ణించి, కవి సమయసిద్ధి ప్రయోగంబు లరసి, అభినవ కావ్యంబువక్రమించు నతడు భారత భాగవత రామాయణా ద్యనేక పురాణ ప్రసిద్ధంబులైన
యితిహాసంబునంగల కథ విస్తరించుట యిహపర సాధనంబని మహాకవి శ్రేష్ఠుల కభిమత మది కవిత్వ రచన సన్మార్గంబు)..........
కవితామూర్తి శరీరాత్మల వివేచనమున కావ్య తత్వజ్ఞులు విభిన్నాభిప్రాయములను తెలిపియున్నారు. అట్టి
వానిని గూర్చిన విశేషాంశములు "కావ్యాత్మ" యను వ్యాసమున వివరింపనగును.
{{right|చె. రం.}}
<section end="620A" />
<section begin="620B" />'''కవిలె భాండాగారములు (Archives) :'''
'''కవిలె భాండాగారములు :''' వర్తమాన (నవీన) యుగలక్షణము జ్ఞానాభివృద్ధి చేయుటయైయున్నది. అన్నవస్త్ర సమస్యలు, గృహసమస్యలు తీర్చినతరువాత జ్ఞాన విస్తరణము కావించుట ప్రతి రాష్ట్ర ప్రభుత్వము యొక్క ముఖ్య ధర్మముగ పరిగణింపబడుచున్నది. ప్రతిపౌరుని అక్షరాస్యుని చేయుట కొరకును, ఆతడు తనజ్ఞానమును అభివృద్ధి చేసికొనుటలోను తన మనస్సును సంస్కరించుకోనుటలో
అతనికి తోడ్పడుటకొరకును, ప్రభుత్వములు, చిత్రవస్తు ప్రదర్శనశాలలను, కవిలె భాండాగారములను, గ్రంథాలయములను నిర్మించుటకు పాటుపడుచున్నవి. 1947వరకు భారత దేశము యొక్క అభివృద్ధి బహుముఖముల నిరోధింపబడినది. కాని స్వతంత్ర భారతము హఠాత్తుగా ఉద్బుద్ధమై జ్ఞాననూర్గము లగు కవిలె భాండాగారములు, చిత్రవస్తు ప్రదర్శనశాలలు మున్నగువాటిని రూపొందించుటకును, నిర్మించుట కును యత్నించుచున్నది.
కవిలె ఖాండారములు, పత్రములు అను పదములు సమానార్ధకములుగా సామాన్య సంభాషణమందు
ప్రయుక్తములగుచున్నవి. కాని పత్రములు (రికార్డులు) అనుపదము కవిలె భాండారములు అను పదముకన్న విపులమైన అర్థముకలదియై యున్నది. కవిలె భాండారములు అనుపదము శబ్దవ్యుత్పత్తి ప్రకారము న్యాయాధికారి సంబంధమైన నివాసగృహము లను అర్థమును ఇచ్చును. కాని కాలక్రమమున అది ప్రభుత్వ పత్రములు భద్రపరచబడిన స్థలము అను అర్థమున పర్యవసించినది. అట్టి ప్రాచీన పత్రములు సాధారణముగా ప్రజాసామాన్యమునకును విశేషించి చారిత్రక పరిశోధకులకును గొప్ప
ప్రయోజనకారు అనుటలో దోషము కనిపించదు.
హిందూ దేశ చరిత్ర మిక్కిలి విపులమైనది. ఈ దేశము నైసర్గిక స్వరూపముచే నొక ఖండమువంటిది. దీని చరిత్ర గతించిన వేలకొలది సంవత్సరములనుండి వివిధజాతులతోను, మతములతోను, వలస వచ్చిన వారితోన, దేశాటన పరులతోను, రాజ్యస్థాపనలతోను, రాజ్య విచ్ఛిత్తులతోను సంఘటితమై ప్రవర్తించుచు వచ్చినది. ఈ రాజవంశముల యొక్కయు, రాజ్యముల యొక్కయు, పరిపాలనకు
సంబంధించిన పురాతనపత్రములు మన భారతదేశమునకు ముస్లిములు వచ్చువరకు మనకు లేకుండెను. బ్రిటనువంటి దేశముల యొక్క పరిస్థితి మాత్రము మన దేశపరిస్థితి కంటె పూర్తిగా భిన్నమైనది. బ్రిటను దేశము ఇట్టి పత్రములను సమీకరించుట కొరకును, విస్తరింప చేసికొనుటకును,
వాటిని క్రమపద్ధతిలో జాగ్రత్త పెట్టుకొనుటకును అన్ని అనుకూల్యములను కలిగియుండెను. పాశ్చాత్య దేశములో కవిలె భాండారములు అను విషయము మిక్కిలి పరిశీలనముతో అధ్యయనము చేయబడినది. తల్లక్షణములు పరిష్కరింపబడినవి. కవిలే సంరక్షణము కార్యాలయ విధు
<section end="620B" /><noinclude><references/></noinclude>
lrc349dyo4osg1pguj31ou2q5ld10lh
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/621
104
154676
570321
448486
2026-08-15T11:06:03Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570321
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కవిలె భాండాగారములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
లలో ఒక భాగమైనది. కవిలెలకు ప్రాచీనపత్ర గౌరవము లభించినది. కవిశెలు కార్యాలయములలో పూర్వవిషయ పరామర్శనమునకై భద్రపరచ బడుచున్నవి. ఒక వర్తమాన రాజ్యము మరియొక రాజ్యముపై యుద్ధ ప్రకటనమును చేసినచో దానికి సంబంధించిన లిఖిత సమాచారము వివిధ ప్రభుత్వ శాఖలలో భద్రపరచబడినదై దొరకును. రాష్ట్ర, కార్యదర్శులకును,రాయబారులకును జరిగిన ఉత్తరప్రత్యుత్తరములు మనకు లభించును. యుద్ధ కార్యాలయము దానికి సంబంధించిన జమాఖర్చులను, నివేదికలను నిర్వహణమునకును, పరిపాలనమునకును సంబంధించిన వ్యవహారముల వివరములను సమకూర్చి యుంచును.
పైని చెప్పబడిన విషయమును దానికి సంబంధించిన ఇతర సామగ్రియు ఏ అభిప్రాయమును గాని ధ్వనినిగాని, ఊహనుగాని, ప్రతిపాదించవు. ఏ సంఘటనలైతే వాస్తవముగా జరిగినవో, వేనివలన అవి స్వయముగా కవిలె భాండాగారములలో ఒక భాగముగా పరిణమించినవో అట్టివానికి అవి సామాన్య లిఖిత ఆధికారిక భద్రతాచిహ్నములు మాత్రమే. అవి కార్యాలయములలో భద్రపరచబడుటచే సాధికారము లగుచున్నవి. ఆ కార్యాలయములుకూడ అట్టి సంఘటనలయందు భాగస్వాములు. తరువాత వచ్చు చరిత్ర రచయిత తన గ్రంథనిర్మాణము కొరకు ఈ పత్రములను పరిశీలించుట. అర్థకల్పనము చేయుట, విభజించుట, క్రమపరచుట మున్నగు పనులు చేయవచ్చును. కావున కవిలె భాండారములకు సంబం
ధించిన పత్రములకు వలసిన ముఖ్యాతిముఖ్య లక్షణము నిష్పక్షపాత దృష్టియై యున్నది.
కవిలే ఖాండారములు సాధారణముగా లిఖిత పత్రమయములు, కానీ ఇవి మనకు దస్తావేజులు అను మరి యొక ముఖ్యపదమును మ్ఫరణమునకు తెచ్చుచున్నవి. ముద్రిత సామగ్రి కూడ ఇందు చేరవచ్చునా అను ప్రశ్న యొకటి జనించుచున్నది. యుద్ధవ్యవహారములకు సంబంధించియుండి
జాబితాలో చేర్చబడిన "హిందూ" పత్రిక వంటి పత్రిక కూడ దస్తావేజుగా పరిగణింపదగునా? అను ప్రశ్న మరి యొకటి ఉదయించుచున్నది. ఆ పత్రిక సంధి నిబంధనములతో కూడి యుండవచ్చును. ఏ శాఖా కార్యదర్శి యైనను దానిని కోరవచ్చును. అట్టి సందర్భములలో ముద్రిత సామగ్రికూడ అధికారిక పత్రము కాదగును. ఏవిధమైన సాధన సామగ్రితో నిర్మితములై నప్పటికిని లేఖనములన్నియు దస్తావేజులుగానే పరిణమించుచున్నవి. వ్రాతయంత్రములతో అచ్చొత్తబడిన లేఖనములు, టైపు యంత్రములచే యాంత్రికముగా పునర్ముద్రితములైనవి, టైపు బ్లాకులు, చెక్కడపు ఫలకములు, లేక వీటికి చేరువయైన కాకులు, తదితర సాక్షి సామగ్రులన్నియు దస్తావేజుల పరిగణనములోనికి వచ్చును.
పైన చెప్పబడినవి—— అక్షర సంబంధమైన గుర్తులు, లేక సంఖ్యాసంబంధమైన గుర్తులు కలవి. అట్టివి కాకున్నను పై నిర్వచింపబడిన రూపముగల దస్తావేజులలో భాగములుగా నున్నవి—— వాటితో అనుబంధించి యున్నవి, లేక వాటి అనుబంధములనిగాని, భాగములనిగాని ఊహించుటకు వీలు కల్గించునవి—— ఇవన్నియు దస్తావేజులక్రిందనే లెక్కింపబడుచున్నవి.
సాధారణముగా కవిలె భాండాగారములలో మూడు రకముల దస్తావేజులు జమ అగుచుండును. (1) ఆఫీసు లోనికి వచ్చునవి. (2) ఆఫీసునుండి బయలు వెడలిన వాని ప్రతులు. (8) ఇతర కార్యాలయములతో రాకపోకల సంబంధము కలవి కాకున్నను, సదరు ఆఫీసులోమాత్రమే ప్రచారము కలవి.
కవిలె భాండాగారికుని మొట్టమొదటి ధర్మము కవిలె భాండారములను భద్రపరచుటకును, తన అధీనములో నుంచుకొనుటకును వలసిన అన్ని విధములైన అధికార చర్యలను అనుష్ఠించుట. అనగా వాటి ముఖ్యలక్షణములను గూర్చి జాగ్రత్త వహించుటయై యున్నది. ఆతని రెండవ ధర్మముకూడ తుల్యప్రాధాన్యము కలదియే. తన శక్తి వంచన లేకుండ చరిత్రకారులకును, పరిశోధకులకును,
అవసరమైన తోడ్పాటును కల్పించుట అతని రెండవ ధర్మము.
కవిలె ఢాండాగారికుడు తన కవిలె భాండారముల యొక్క భౌతికము, నైతికమునైన రక్షణమునకు తగు
శ్రద్ధను వినియోగించవలసి యుండును. కవిలె భాండారములను పదిలవరచు గృహములు అగ్నిప్రమాదము నుండియు తేమనుండియు సురక్షితములుగా నుండవలెను. వీటిని పదిలపరచు భవనములు ప్రమాదములకు గురియగు<noinclude><references/></noinclude>
7k9ppalbvlefp3y6cry0r1670q2u0mj
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/622
104
154677
570322
448487
2026-08-15T11:20:40Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570322
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కవిలె భాండాగారములు}}</noinclude>
ఇతర గృహములనుండి ప్రత్యేకింపబడి యుండవలెను. నీళ్ళు చిమ్ము రబ్బరుగొట్టములు ఇసుకను చల్లు ఉపకరణములు, అగ్నిప్రమాదమును తెలియజేయు సైరనులు అగ్నిమాపకదళములతో నేరుగా టెలిఫోను సంబంధము కలిసియుండుట, భాండాగారిక దళమునకు క్రమమైన అగ్నిమాపక శిక్షణ మిప్పించుటయు మున్నగు ప్రమాద నిరోధక చర్యలు ఆవశ్యకములు.
కవిలె భాండారముల నిలయములో వాతావరణము యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ద మొనరించుటకు తగిన
ఏర్పాటు ఉండుటకూడ అవసరమే. కొన్ని శీతల దేశములలో వేడినీటి గొట్టముల ద్వారమున భవన వాతావరణమును వెచ్చచేయుటకు వలసిన ఏర్పాటులు కలవు. దీనికి సంబంధించిన కొలిమి గృహ బహిర్భాగమున ఉంచబడును. శీతోష్ణ వాయు నియంత్రణయుత భవనములు (Air-conditioned houses) కవిలె భాండారము లుంచబడుటకు ఆదర్శప్రాయములు. విద్యుద్దీపములు ఉపయోగింపబడ
వలెను. విద్యుతంత్రులన్నియు బాహ్య లోహనాళము లందు గుప్తములై యుండవలెను. చర్మమునకును, కాగితమునకును ఉత్తమ రక్షకము ధారాళమైన వాయు సంచారమని కనుగొనబడినది. దస్తావేజులు లేక పత్రములు ఉంచదలచిన గదిలోనికిగాని, ప్రదేశములోనికి గాని వాయు ప్రవాహము ఉరవడితో వీచుటకు వలసిన ఆనుకూల్యమును కల్పించుట అవసరము. దీనిని వీలైనంత తరచుగా ఉపయోగించుటకు తగిన ఏర్పాట్లు చేయబడవలెను. ఇట్టి వాయుతరంగములు దుమ్మునుగాని, మురికిని గాని రికార్డుల లోనికి ప్రవేశింప జేయును అను అనుమానమున్న యెడల గాలిని రద్దుదూది ద్వారమునగాని, మరియే ఇతర పదార్థము ద్వారమునగాని వడపోయు పద్దతి అవలంబింపబడ వలయును. తెరలు ప్రవేశ పెట్టబడు నేడల వాటిని తరచుగా పరిశుభ్ర పరచుచు మార్చుచు ఉండుట అవసరము. వెలుతురుకూడ ఈ సందర్భమున విలువ కలదేకాని ప్రాత ప్రతులను నేరుగా సూర్య కిరణముల కంతగా గురిచేయుట ఉచితమైన పనికాదు. చర్మమునుగాని కాగితమునుగాని చుట్టచుట్టి యుంచుటయు తగదు.
రికార్డులుకల గదులు ఏ సందర్భమునను క్రిక్కిరిసి యుండకూడదు. గదులను శుభ్రపరచునప్పుడు రికార్డులను పత్రములను బీరువాలలోనికిని నేలమీదకును చేరవేయుటకు అనువుగా అవకాశములు కల్పింపవలెను. అట్లు కానిచో పత్రముల మనికి వాటి జీవితము తగ్గిపోవును. ప్రతి నిలయమునకును ఒక వాక్యూమ్ క్లీనరు (ఖాళీ స్థలములను శుభ్రపరచు యంత్రము) ఆవశ్యకము. కవిలె భాండాగార మందిరములు జనులు పనిచేయుటకును, మెసలుటకును అనుకూలములై యుండవలెను. భవనము
యొక్క అన్ని భాగములనుండియు రాకపోకలకు సులభావకాళములు కల్పింపబడవలెను. స్థలమును పొదుపుగా ఉపయోగించుట అత్యవసరమే. అయినను అది దస్తావేజుల యొక్క సంరక్షణమునకును భద్రతకును వ్యతిరిక్తమై యుండకూడదు. సులభముగా అందుబాటులో బీరువాలు ఉండుట వాంఛనీయము. బీరువాల ప్రక్క భాగములు ఉక్కుతోగాని, ఇనుముతోగాని చేయబడినవిగా నుండ
వచ్చును. కాని అడ్డచెక్కలు ఇనుముకంటెను, ఉక్కు కంటెను మృదువైన ద్రవ్యముతో చేయబడి యుండవలెను. వేక్సువంటి చర్మము కప్పబడిన పలకలు కొన్ని దేశములలో ఉపయోగించబడుచున్నవి. కొన్ని చోట్ల చెక్కలవంటి దళసరి అద్దములుకూడ వాడబడుచున్నవి. ఈ సమస్య పరిశీలించబడినది. కాగితములను కట్టలుగా బట్టలలో మూట కట్టుటవలనను, వాటిని వస్త్రముల అట్టల మీద వేసి కట్టుటవలనను, పెట్టెలలో పెట్టుటవలనను కలుగు లాభనష్టముల తారతమ్యము గుర్తింపబడినది. పత్రముల పరిమాణము పరిగణనకు తీసికొనినప్పుడు ఈ చెప్పిన దంతయు ఆవశ్యకమే. సులభముగా తీసి చదువుకొనుటకు అవి మనకు అందుబాటులో ఉండవలెనను విషయము జ్ఞాపక ముంచుకొనవలెను.
విద్యార్థులు పరామర్శ చేయుటకును. పఠనము చేయుటకును పత్రములను చేత పట్టుటకూడ చెరువును కలిగించును. కొన్ని కవిలె భాండాగారములలో పొగ త్రాగుటయు, సిరా వాడుటయు నిషేధింపబడినవి. పత్రములపై పెక్కు రకముల వ్రాతలు వ్రాయుటయు, గుర్తులుంచుటయు కచ్చితముగా నిషేధింపబడు చున్నవి. విద్యార్థులు అట్టి అవివేకమునకు పాల్పడినచో తత్ క్షణమే అది రసాయన శాస్త్రజ్ఞుని ఎరుకకు తేబడవలెను. పత్రములను మోటుగా త్రిప్పుట మొదలగు పనుల వలన కలుగు నష్ట<noinclude><references/></noinclude>
9d5vdf4683tats52cy6goegxm3fd6z5
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/623
104
154678
570323
448488
2026-08-15T11:36:36Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
570323
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కవిలె భాండాగారములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
మును వ్యాసపీఠములు, నిలుపు పీఠములు ఉంచుటచే తగ్గించవలయును. కవిలే భాండాగారికుడు ఇట్టి ప్రమాదములను ప్రతిఘటించుటకు ఉపయోగింపతగిన కవచము, (డాలు) ఒక్కటియే. అదియే దన సంపూర్ణమైన పర్యవేక్షణ. ఛాయాగ్రహణముచే స్థిరీకరింపబడిన దస్తావేజుల సకళ్ళను సరఫరా చేయుటయే అట్టి ప్రమాదముల నుండి తప్పుకోనుటకు ఉత్తమ పద్ధతి. పరిశోధన విద్యార్థులును,
పరామర్శము కొరకు దస్తావేజుల నుపయోగించువారును, దస్తావేజులను అక్రమముగా ఉపయోగించుటయో వానిని అపహరించుటయో చేయుచుందురు. విద్యార్థులు సమావేశమైన గది వారి ఉపయోగము కొరకు తెరచియుంచబడినంతవరకును కవిలె ఖాండారమునకు చెందిన ఒక అధికారి అచ్చట పర్యవేక్షణ చేయుచుండుట అవసరము.
కవిలె భాండారముల భౌతిక రక్షణమునకై ఛాయా గ్రహణపద్ధతి మైక్రోఫిల్ము నిర్మాణము మున్నగు వాని
ద్వారమున పఠితలకు చీకటి గదులలో చదువుకొనుటకు తగు నేర్పాటు కావించవలెను. అటు తర్వాత మూల ప్రతులను మరమ్మతు చేయుట, బాగుచేయుట, బైండింగు లను మరమ్మతుచేయుటకును, బాగుచేయుటకును ఉపయోగించు ద్రవ్యములు, ఉపయోగింపదగిన జిగురు వస్తువులు జాగ్రత్తగా అలోచించబడినవి. రంగు తగ్గి, (కగ్గి) పోయిన సిరాలను పూర్వ స్థితికి తెచ్చునట్టి దుర్బల ద్రావకములు
పత్రములకు ఉపయోగించు విషయమై ప్రయోగములు చేయబడుచున్నవి. కానీ కొన్ని సందర్భములలో ఈ ప్రయోగములు మంచికన్న చెరువునే ఎక్కువగా కలిగించినవి.
కవిలె భాండారముల రక్షణముపట్ల భాండాగారికుని ధర్మములను పూర్తిగా నిర్వచింప శక్యముకాదు. అవి
పరిస్థితుల వైవిధ్యము పై ఆధారపడి యుండును. ప్రభుత్వ శాఖ లెట్లు, నిర్వహింపబడుచుండెడివో తెలిసికొనుటకు కుతూహలముగల సామాన్య ప్రజానీకము యొక్కయు, గత కాలమును ప్రత్యక్షీకరించు కొనుటయందు ఆసక్తి గల చరిత్ర పరిశోధకుల యొక్కయు అవసరములను తీర్చుటకై అవలంబించ వలసిన సూత్రములను విధానములను ఏర్పరచుకొనుట కవిలె ఖాండాగారికుని రెండవ కర్తవ్యము. కవిలె ఖాండారమున చేర్చుకొనబడిన పత్రములను కేటలాగుచేయుట, నమోదుచేయుట, వర్గీకరించుట, విభజించుట, విషయ విశ్లేషము చేయుట అను వివిధ విధానములు భాండాగారికుని ధర్మములలో చేరి
యుండును. భాండాగారికుడు తన యధీనమున సేకరింపబడియున్న వస్తువులలో ఉత్తమమైన వాటిని ఉత్తమపద్ధతి ననుసరించి బహిరంగపరచవలెను. అన్ని దస్తావేజులును ప్రసిద్ధమైన శీర్షికలక్రిందికి రాజాలవు. వాటిని ఒక్కటొకటిగా తీసికొనినచో వర్గీకరించుటయందును, సంఖ్యాబద్దము చేయుట యందును అంతులేని శ్రమకలుగును. పూర్వతర శతాబ్దములకు సంబంధించిన దస్తావేజులు సాధారణముగా సులభముగా చిక్కు విడదీయరాని లిపులలో వ్రాయబడియున్నవి. అట్టి ప్రతులు ప్రోగై
యుండవచ్చును. కాని ఇటీవలి రికార్డులను జాగ్రత్తగా సరిచూడబడిన జాబితాలతో సక్రమముగా స్వీకరించి కవిలె భాండారములలో చేర్చవలెను. కవిలె భాండారములలోనికి వానిని చేర్చుకొనుటకు ముందు అవి సరిగా లెక్కింపబడి యుండవచ్చును. లెక్కింపబడి యుండక పోవచ్చును. అమర్చుట, సంఖ్యాబద్ధముచేయుట, జాబితా వేయుట మున్నగు పనులు జరిగియుండవచ్చును, జరిగి యుండక పోవచ్చును. అట్టిస్థితిలో భాండాగారికుడు తాను ఏవిచేర్చుకొనదగినవో, ఏవి స్వీకరింప దగినవి కావో గుర్తించుటకు సర్వవిధముల జాగరూకతను వినియోగించవలెను.
భాండారములలో దస్తావేజులను తన యధీనములోనికి తీసికొనిన తరువాత భాండాగారికుడు సత్యమును కప్పి పుచ్చుట లేక అణచి వేయుట, అసత్యమును స్ఫురింప చేయుట, అను దోషముల వలన కలుగు నిందలకు గురికారాదు. భాండాగారికుడు ప్రవేశ సంఖ్యలను ప్రతి దస్తావేజునకు లేక దస్తావేజుల సముదాయమునకు కల్పింపవలెను. అట్లు చేయుటచే సదరు పత్రముల ప్రవేశము కవిలె భాండారములో రిజిస్టరు (జాబితా) చేయబడినట్లగును. సాధ్యమైనంతవరకు పాత జాబితాలు, పాత అంకెలు, పాతవరుసలు చెడనీయకూడదు. సముదాయ రూపములో లిఖించిన జాబితాలను గాని అట్ట కట్టబడిన
వానినిగాని చెక్కు చెదరకుండ ఉంచవలెను. ప్రతి పత్రము వైనను కవిలే భాండాగారపు ముద్ర యుండవలెను. ముద్రణ సాధనము లోహ నిర్మితమై యుండవలెను.<noinclude><references/></noinclude>
l645e194fzcqiwl5e3wzk297gnsin62
పుట:Ananthuni-chandamu.pdf/3
104
155206
570256
570190
2026-08-14T22:22:22Z
Rajasekhar1961
50
570256
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{rule|4em}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ఉపోద్ఘాతము|ఉపోద్ఘాతము]]}}
|{{DJVU page link|1|4}}
}}
{{c|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ఇష్టదేవతాస్తుతి]]}}
|{{DJVU page link|1|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|సంజ్ఞాప్రకరణము]]}}
|{{DJVU page link|1|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గద్యపద్యలక్షణము]]}}
|{{DJVU page link|2|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గురులఘునిర్ణయము]]}}
|{{DJVU page link|3|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గణాష్టకలక్షణము]]}}
|{{DJVU page link|3|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ఇంద్రచంద్రాదిగణభేదములు]]}}
|{{DJVU page link|5|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|సంయుక్తవర్ణగణంబులు]]}}
|{{DJVU page link|6|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గణఫలములు]]}}
|{{DJVU page link|6|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గణాధిదైవతములు]]}}
|{{DJVU page link|6|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|కృత్యాదివర్జనీయగణములు, నక్షరములును]]}}
|{{DJVU page link|6|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ప్రాసప్రకరణము]]}}
|{{DJVU page link|7|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ద్వాదశవిధప్రాసములు]]}}
|{{DJVU page link|8|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|షడ్విధప్రాసములు]]}}
|{{DJVU page link|15|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|యతిప్రకరణము]]}}
|{{DJVU page link|17|84}}
}}
{{c|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|గద్యలక్షణము]]}}
|{{DJVU page link|28|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|ఛందములు]]}}
|{{DJVU page link|29|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|ఛందోవృత్తసంఖ్య]]}}
|{{DJVU page link|30|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|సర్వసమవృత్తభేదసంఖ్య]]}}
|{{DJVU page link|31|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|సమవృత్తములు]]}}
|{{DJVU page link|31|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|అర్ధసమవృత్తములు]]}}
|{{DJVU page link|58|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|విషమవృత్తములు]]}}
|{{DJVU page link|59|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|ఉద్ధురమాలావృత్తములు]]}}
|{{DJVU page link|61|84}}
}}
{{c|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}<noinclude><references/></noinclude>
7gk6q97oztn73wz8z0lidu7fb0c665x
570257
570256
2026-08-14T22:26:01Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
570257
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{rule|4em}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ఉపోద్ఘాతము|ఉపోద్ఘాతము]]}}
|{{DJVU page link|1|4}}
}}
{{c|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ఇష్టదేవతాస్తుతి]]}}
|{{DJVU page link|1|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|సంజ్ఞాప్రకరణము]]}}
|{{DJVU page link|1|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గద్యపద్యలక్షణము]]}}
|{{DJVU page link|2|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గురులఘునిర్ణయము]]}}
|{{DJVU page link|3|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గణాష్టకలక్షణము]]}}
|{{DJVU page link|3|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ఇంద్రచంద్రాదిగణభేదములు]]}}
|{{DJVU page link|5|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|సంయుక్తవర్ణగణంబులు]]}}
|{{DJVU page link|6|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గణఫలములు]]}}
|{{DJVU page link|6|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|గణాధిదైవతములు]]}}
|{{DJVU page link|6|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|కృత్యాదివర్జనీయగణములు, నక్షరములును]]}}
|{{DJVU page link|6|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ప్రాసప్రకరణము]]}}
|{{DJVU page link|7|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|ద్వాదశవిధప్రాసములు]]}}
|{{DJVU page link|8|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|షడ్విధప్రాసములు]]}}
|{{DJVU page link|15|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ప్రథమాశ్వాసము|యతిప్రకరణము]]}}
|{{DJVU page link|17|84}}
}}
{{c|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|గద్యలక్షణము]]}}
|{{DJVU page link|28|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|ఛందములు]]}}
|{{DJVU page link|29|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|ఛందోవృత్తసంఖ్య]]}}
|{{DJVU page link|30|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|సర్వసమవృత్తభేదసంఖ్య]]}}
|{{DJVU page link|31|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|సమవృత్తములు]]}}
|{{DJVU page link|31|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|అర్ధసమవృత్తములు]]}}
|{{DJVU page link|58|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|విషమవృత్తములు]]}}
|{{DJVU page link|59|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/ద్వితీయాశ్వాసము|ఉద్ధురమాలావృత్తములు]]}}
|{{DJVU page link|61|84}}
}}
{{c|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|కందములు]]}}
|{{DJVU page link|65|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|ఆర్యలు]]}}
|{{DJVU page link|66|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|గీతులు]]}}
|{{DJVU page link|67|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|సమవిషమగీతులు]]}}
|{{DJVU page link|68|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|సీసములు]]}}
|{{DJVU page link|69|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|తరువోజ]]}}
|{{DJVU page link|70|84}}
}}<noinclude><references/></noinclude>
ocdt55h56au2mg1urxcjlqpkrrxjrz8
పుట:Ananthuni-chandamu.pdf/4
104
155210
570258
449615
2026-08-14T22:29:27Z
Rajasekhar1961
50
570258
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|అక్కరలు]]}}
|{{DJVU page link|77|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|పదములు]]}}
|{{DJVU page link|78|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|రగడలు]]}}
|{{DJVU page link|80|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|చాటుప్రబంధములు]]}}
|{{DJVU page link|83|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|షట్ప్రత్యయములు]]}}
|{{DJVU page link|85|84}}
}}
{{c|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|చతుర్థాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|కందములు]]}}
|{{DJVU page link|65|84}}
}}<noinclude><references/></noinclude>
7g3jihylitr959z8j09bwcsgtj12xym
570260
570258
2026-08-14T22:35:22Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
570260
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" />{{rh|2|విషయసూచిక|}}</noinclude>{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|అక్కరలు]]}}
|{{DJVU page link|77|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|పదములు]]}}
|{{DJVU page link|78|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|రగడలు]]}}
|{{DJVU page link|80|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|చాటుప్రబంధములు]]}}
|{{DJVU page link|83|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/తృతీయాశ్వాసము|షట్ప్రత్యయములు]]}}
|{{DJVU page link|85|84}}
}}
{{c|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|చతుర్థాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|దశదోషములు]]}}
|{{DJVU page link|89|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|షట్సంధులు]]}}
|{{DJVU page link|97|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|సమాసములు]]}}
|{{DJVU page link|100|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|కారకశబ్దములు]]}}
|{{DJVU page link|100|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|క్రియాపదములు]]}}
|{{DJVU page link|110|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|అవ్యయశబ్దములు]]}}
|{{DJVU page link|110|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|విశేష్యవిశేషణములు]]}}
|{{DJVU page link|110|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|క్రియావిశేషణములు]]}}
|{{DJVU page link|110|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|పంచాశద్వర్ణములు]]}}
|{{DJVU page link|110|84}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[ఛందోదర్పణము/చతుర్థాశ్వాసము|షడ్వర్గములు]]}}
|{{DJVU page link|110|84}}
}}
{{rule|3em}}<noinclude><references/></noinclude>
6skrj8xfhya3dombpzng4d2tf31d0pl
పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/33
104
203546
570309
533493
2026-08-15T09:25:24Z
Brjswiki
6801
570309
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Css image crop
|Image = Grandhalaya_Sarvasvamu_-_Vol.5,_No.2_(1921).pdf
|Page = 33
|bSize = 449
|cWidth = 395
|cHeight = 243
|oTop = 26
|oLeft = 8
|Location = center
|Description =
}}
{{left margin|5em}}దఁటు లక్ష్మీనరసింహం </div>
{{left margin|5em}}కార్యదర్శి </div>
{{left margin|5em}}సిద్దపల్లి, ౭-౧౦-౨౧ </div>
{{rule |6em }}
{{Center|{{p|fs150}}నండూరి బాపయమంత్రి</p>}}
ఈకవి, సకలజనమనోరంజకఁబగు విఘ్నేశ్వర చరిత్రమను రెండాశ్వాసముల గ్రంధము రచియించి వెంటనే సోమేశ్వరస్వామికి అఁకితము చేసెను.
{{Center|{{p|fs125}}గద్య</p>}}
ఇది శ్రీదక్షిణామూర్తి వరప్రసాదలబ్ధకవితా మాధురీ ధురీణ నండూరి బాపయమంత్రి ప్రణితంబయిన సకలజనమనౌరంజనంబగు విఘ్నేశ్వర చరిత్రయను ప్రబంధంబునందు ప్రధమాశ్వాసము —
ఇతఁ డార్వేల నియోగి, శ్రీవత్స గోత్రుఁడు. వెంకమంత్రికి బుచ్చమాంబకు తనయుఁడు. వెంటురి గ్రామ నివాసి, పురాణములందు
విఘ్నేశ్వర చరిత్రను, ప్రభంధముగా రచియించెను. కవి శాలివాహన శికము, ౧౭౩౧౦ ఈశ్వరనామ సంవత్సరమున తన గ్రంధము రచియించి నట్లే విధముగ తన గ్రంధమున జెప్పినాడు.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఒప్పుమారగభవి ♦ ష్యత్తరస్కందభా
::గపతిపురాణస్థ ♦ గాధలరసి
సకలజనానురం ♦ జనముగా విఘ్నేశ్వ
::రచరిత్రయనియెడి ♦ గ్రంధమొకటి
నా నేర్చినట్టులొ ♦ నర్చితి శాలివా
హనశకాబ్దములునం ♦ దాగ్ని శైల
హిమకరి సౌజ్జల ♦ నెసగునీశ్వరవత్స
రంబున, నిందుదో ♦ షంబులున్న
గణనసేయకగుణములే ♦ గైకొనుండు
సాధుఫలముల తృగ్విజనమితివిడిచి (యతిలేదు)
సారముగ్రహించువైఖరి ♦ సంతసమున
రసికులైనట్టికవిబుధ ♦ ప్రవరులార.</poem>|ref=}}
కవి తన స్వప్నమందు శ్రీసోమేశ్వర స్వామివారు సాక్షాత్కరించి తనకీ గ్రంధమంకింతము చేయుమనిజెప్పుచు యీతనివశీఁకులగూర్చి
నీ విధముగా బలికినట్లు జెప్పినాడు.
{{Telugu poem|type=సీ.|lines=<poem> నీతాతతండ్రిలో ♦ కాతీత విశదవి
ఖ్యాతయశస్కుండు ♦ కామరాజు
నీతాతభూసుర ♦ నివహబంధువ్రాత
పరిపోషణుండు ♦ బాపప్రధాని
నీతండ్రి శేతుకా ♦ శీతలమధ్యభూ
విభుసభాపూజ్యుండు ♦ వెంకమంత్రి
నీతల్లి భువనవ ♦ ర్హితదానధర్మప్ర
పూతగుణాలంబ ♦ బుచ్చమాంబ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
59sx6ipln2uou2g50l3whkoehd7z62r
570310
570309
2026-08-15T09:27:19Z
Brjswiki
6801
570310
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Css image crop
|Image = Grandhalaya_Sarvasvamu_-_Vol.5,_No.2_(1921).pdf
|Page = 33
|bSize = 449
|cWidth = 395
|cHeight = 243
|oTop = 26
|oLeft = 8
|Location = center
|Description =
}}
{{left margin|5em}}దఁటు లక్ష్మీనరసింహం </div>
{{left margin|5em}}కార్యదర్శి </div>
{{left margin|5em}}సిద్దపల్లి, ౭-౧౦-౨౧ </div>
{{rule |6em }}
{{Center|{{p|fs150}}నండూరి బాపయమంత్రి</p>}}
ఈకవి, సకలజనమనోరంజకఁబగు విఘ్నేశ్వర చరిత్రమను రెండాశ్వాసముల గ్రంధము రచియించి వెంటనే సోమేశ్వరస్వామికి అఁకితము చేసెను.
{{Center|{{p|fs125}}గద్య</p>}}
ఇది శ్రీదక్షిణామూర్తి వరప్రసాదలబ్ధకవితా మాధురీ ధురీణ నండూరి బాపయమంత్రి ప్రణితంబయిన సకలజనమనౌరంజనంబగు విఘ్నేశ్వర చరిత్రయను ప్రబంధంబునందు ప్రధమాశ్వాసము —
ఇతఁ డార్వేల నియోగి, శ్రీవత్స గోత్రుఁడు. వెంకమంత్రికి బుచ్చమాంబకు తనయుఁడు. వెంటురి గ్రామ నివాసి, పురాణములందు
విఘ్నేశ్వర చరిత్రను, ప్రభంధముగా రచియించెను. కవి శాలివాహన శికము, ౧౭౩౧౦ ఈశ్వరనామ సంవత్సరమున తన గ్రంధము రచియించి నట్లే విధముగ తన గ్రంధమున జెప్పినాడు.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఒప్పుమారగభవి ♦ ష్యత్తరస్కందభా
::గపతిపురాణస్థ ♦ గాధలరసి
సకలజనానురం ♦ జనముగా విఘ్నేశ్వ
::రచరిత్రయనియెడి ♦ గ్రంధమొకటి
నా నేర్చినట్టులొ ♦ నర్చితి శాలివా
::హనశకాబ్దములునం ♦ దాగ్ని శైల
హిమకరి సౌజ్జల ♦ నెసగునీశ్వరవత్స
::రంబున, నిందుదో ♦ షంబులున్న
గణనసేయకగుణములే ♦ గైకొనుండు
సాధుఫలముల తృగ్విజనమితివిడిచి (యతిలేదు)
సారముగ్రహించువైఖరి ♦ సంతసమున
రసికులైనట్టికవిబుధ ♦ ప్రవరులార.</poem>|ref=}}
కవి తన స్వప్నమందు శ్రీసోమేశ్వర స్వామివారు సాక్షాత్కరించి తనకీ గ్రంధమంకింతము చేయుమనిజెప్పుచు యీతనివశీఁకులగూర్చి
నీ విధముగా బలికినట్లు జెప్పినాడు.
{{Telugu poem|type=సీ.|lines=<poem> నీతాతతండ్రిలో ♦ కాతీత విశదవి
ఖ్యాతయశస్కుండు ♦ కామరాజు
నీతాతభూసుర ♦ నివహబంధువ్రాత
::పరిపోషణుండు ♦ బాపప్రధాని
నీతండ్రి శేతుకా ♦ శీతలమధ్యభూ
::విభుసభాపూజ్యుండు ♦ వెంకమంత్రి
నీతల్లి భువనవ ♦ ర్హితదానధర్మప్ర
::పూతగుణాలంబ ♦ బుచ్చమాంబ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
kx9le8lfb7zrr00nd4kk9kayrwqnkax
పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/34
104
203551
570311
528565
2026-08-15T09:41:35Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
570311
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>
<poem>నీవనేక భవార్ణిత ♦ నిశ్చలాస్మ
దీయపదభక్తి సంజాత ♦ దివ్యసుకృత
వాసనావాసితుడవు శ్రీ ♦ వత్సగోత్ర
పావనుడ వెన్న నండూరి ♦ బాపమంత్రి.</poem>
ఈతని కవిత్వము చాలవరకు సంస్కృత పదభూయిష్టమై యలగారుచున్నది. తనగ్రంథము ప్రబంధమువలె నుండవలెనని యెంచి సరిసమైన వర్ణనలతో పూరించినాడు. చతుర్విధ కవిత్వము లీకవికీ తెలియును. గ్రంథమంతయు రసవంతముగనున్నది. చాలచోటుల లేఖక ప్రమాదములున్నవి. కొన్ని కొన్ని చోట్ల రసవంతమైన వర్ణనలు గలవు. భాగవతములో దశమస్కంధమున కృష్ణావతార ఘట్టము. కృష్ణుని బాల్యక్రీడ, రుక్మిణి సత్యభామల పరిణియము నీకవి క్లుప్తముగా తన గ్రంథమున నిమిడ్చి యున్నాడు. చక్కని జాతీయోక్తులందందు చూపట్టెడి. చాలవరకు పూర్వకవులపోకడలచే నలరారుచున్నది. ఇట్టి గ్రంధము
నాయొద్ద తాళపత్రములపై వ్రాయబడి యున్నది. ఈ గ్రంథము నచ్చు వేయించుట కింకొక ప్రతియైనను కావలయును గదా!
కావున పాఠక మహాశయు లెవ్వరి వద్దనైనను నిట్టి గ్రంథమున్నచో సరిచూచుకొనుటకు బంపఁబ్రాంర్థతులు.
{{Center|{{p|fs125}}శైలి దెలియుటకై కొన్ని పద్యములు</p>}}
{{p|fs125}}ప్రధమాశ్వాసము</p>
చల్లే సురవర మస్త కాంచితవి • శుద్ధ సువర్ణకిరీట భాగవి
స్ఫగదురుపద్మ రాగమణి పుంజమరీ చివి రాజమానసుం
దంతర పాదపద్మ వసుధాధర రాజకుమాం గౌరి శాం
సిరి కరివస్త్రు అల్లి కుతు కంబున మాకొసగు శుభో
[న్నతుల్
సీ॥ వేదాంతవీధుల
విహరించు పరతత్వ
మాభీర గృహముల యందు మెలగు
సరసిజభవముఖామరుల సంగి తిరుండు
ప్రోడకుఱ్ఱలతోడ గూడియాడు
యిందిరారమణితో నెలమి గ్రీడించెడి
బలు వేల్పు కొల్ల నెచ్చెలుల గవయు
ఘనతపోధనులైన గిన లేని నిర్గణ
బ్రహ్మంబు గొల్లలఁ
బాయకుండు
గణన యిడరాని బ్రహ్మాండ గణములాత్మ
కుక్షియఁగువ దొఁత్రిగా కుదురు కొల్పు
దేవదేవుఁడు రేపల్లె లోవసించు
భువనముల గాచుమేటి గోవులను గాచు.
ద్వితీయాశ్వాసము —
౪|| హరియొక డే గెను మగి డే
సీ।
శ్వరముఖనరపతులు వైద్య సహాయముకై
రంతురు చెలికొను నెడ
దురమగునని బలుడుబలముతో ఁజనె వెనుక =
పాకశాసనవన ప్రాసాదశిఖర సం
కలితహాటకరత్న కలశమనగ
యామినీ సతికంఠ సీను నెం తేలియు
శోభిలు మంగళ
సూత్రమనగ
ప్రాగ్వామలోచనా ఫాలభాగంబున
జీపించు కాశ్మీర
కదులజాఁడ వ్యాప్య ఘనతిమోని హృతిపై
దేవతలుంచిన దీపమునగ
తామరలు గ్రుఁగకై రవ తలిజలింగ
జలధులుప్పొంగ చీకట్లు' కడగొలంగ (యతిలేదు.
జగముల లరంగ జక్కవల్ జతివిడంగ
సోముఁడువయిందె సత్కళాధాముఁడగుచు.
గీ॥
మేనమామను దునిమిన
వానికన్యు
లెంతలక్ష్యంబు జగతిపై నెంచిజూడ
కొఁకకీంచుక లేకయు గుడియు మ్రింగు
కకెనునకు నందివడియంబు
గాదెసుఁడు
ఫలిపాక వేంకట రామారావు.
F.<noinclude><references/></noinclude>
fwhk1sey2bl8kfg2nz9s9ve6p4r8hu3
570324
570311
2026-08-15T11:45:31Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
570324
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>
<poem>నీవనేక భవార్ణిత ♦ నిశ్చలాస్మ
దీయపదభక్తి సంజాత ♦ దివ్యసుకృత
వాసనావాసితుడవు శ్రీ ♦ వత్సగోత్ర
పావనుడ వెన్న నండూరి ♦ బాపమంత్రి.</poem>
ఈతని కవిత్వము చాలవరకు సంస్కృత పదభూయిష్టమై యలగారుచున్నది. తనగ్రంథము ప్రబంధమువలె నుండవలెనని యెంచి సరిసమైన వర్ణనలతో పూరించినాడు. చతుర్విధ కవిత్వము లీకవికీ తెలియును. గ్రంథమంతయు రసవంతముగనున్నది. చాలచోటుల లేఖక ప్రమాదములున్నవి. కొన్ని కొన్ని చోట్ల రసవంతమైన వర్ణనలు గలవు. భాగవతములో దశమస్కంధమున కృష్ణావతార ఘట్టము. కృష్ణుని బాల్యక్రీడ, రుక్మిణి సత్యభామల పరిణియము నీకవి క్లుప్తముగా తన గ్రంథమున నిమిడ్చి యున్నాడు. చక్కని జాతీయోక్తులందందు చూపట్టెడి. చాలవరకు పూర్వకవులపోకడలచే నలరారుచున్నది. ఇట్టి గ్రంధము
నాయొద్ద తాళపత్రములపై వ్రాయబడి యున్నది. ఈ గ్రంథము నచ్చు వేయించుట కింకొక ప్రతియైనను కావలయును గదా!
కావున పాఠక మహాశయు లెవ్వరి వద్దనైనను నిట్టి గ్రంథమున్నచో సరిచూచుకొనుటకు బంపఁబ్రాంర్థతులు.
{{Center|{{p|fs125}}శైలి దెలియుటకై కొన్ని పద్యములు</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమాశ్వాసము</p>}}
{{Telugu poem|type=చ౹౹|lines=<poem> సురవర మస్తకాంచితవి ♦ శుద్ధ సువర్ణకిరీట భాగవి
స్ఫురదురుపద్మరాగమణి ♦ పుంజమరీచివిరాజమానసుం
దంతర పాదపద్మ వసు ♦ ధాధర రాజకుమారిగౌరి శాం
కరి కరివక్త్రుతల్లికుతు ♦ కంబున మాకొసగు౯ శుభో[న్నతుల్</poem>|ref=}}
{{Telugu poem|type=సీ౹౹|lines=<poem> వేదాంతవీధుల ♦ విహరించు పరతత్వ
::మాభీర గృహముల ♦ యందుమెలగు
సరసిజభవముఖా ♦ మరులసంగతినుండు
::ప్రోడకుఱ్ఱలతోడ ♦ గూడియాడు
యిందిరారమణితో ♦ నెలమి గ్రీడించెడి
::బలువేల్పు గొల్లనె ♦ చ్చెలుల గవయు
ఘనతపోధనులైన ♦ గనలేని నిర్గుణ
::బ్రహ్మంబు గొల్లలఁ ♦ బాయరు౦డు
గణన యిడరాని బ్రహ్మాండ ♦ గణములాత్మ
కుక్షియంగువ దోంతిగా ♦ కుదురు కొల్పు
దేవదేవుఁడు రేపల్లె ♦ లోవసించు
భువనముల గాచుమేటి ♦ గోవులను గాచు.</poem>|ref=}}
{{Center|{{p|fs125}}ద్వితీయాశ్వాసము</p>}}
{{Telugu poem|type=క౹౹|lines=<poem> హరియొకడేగెనుమమగదే
శ్వరముఖనరపతులు వైద్య ♦ సహాయముకై
బఱతెంతురు చెలికొనునెడ
దురమగునని బలుడుబలము ♦ తో౦జనెవెనుక౯</poem>|ref=}}
{{Telugu poem|type=సీ౹౹|lines=<poem> పాకశాసనవధూ ♦ ప్రాసాదశిఖర సం
::కలితహాటకరత్న ♦ కలశమనగ
యామినీ సతికంఠ ♦ సీమనెంతేనియు
::శోభిలు మంగళ ♦ సూత్రమనగ
ప్రాగ్వామలోచనా ♦ ఫాలభాగంబున
::దీపించు కాశ్మీర ♦ తిలకమనగ
కదులజాండవ్యాప్య ♦ ఘనతిమోని హృతికై
::దేవతలుంచిన ♦ దీపమనగ
తామరలు గ్రుఁగకై రవ ♦ తతిజలింగ
జలధులుప్పొంగ చీకట్లు ♦ కడగొలంగ (యతిలేదు.
జగములలరంగ జక్కవల్ ♦ జతివిడంగ
సోముఁడువయిందె సత్కళా ♦ ధాముఁడగుచు.</poem>|ref=}}
{{Telugu poem|type=గీ౹౹|lines=<poem> మేనమామను దునిమిన ♦ వానికన్యు
లెంతలక్ష్యంబు జగతిపై ♦ నెంచిజూడ
కొంకకీంచుక లేకయు ♦ గుడియుమ్రింగు
కఠినునకు నందివడియంబు ♦ గాదెనుండు</poem>|ref=}}
{{right|౼ పులిపాక వేంకట రామారావు}}
{{rule |6em }}<noinclude><references/></noinclude>
km6k5k5c5n0cotr45emb9urb6zq8u7c
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/89
104
216491
570228
565421
2026-08-14T12:06:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570228
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}సుగ్రీవుడు కపులకు ధైర్యము జెప్పుట</p>
<poem>వానరావళులార మానంబు విడనాడి । పారదగునా మీకు బలవిహానమున॥
మన కసాధ్యం బైనదనుజుని బరిమార్ఫ । నాలాయమై యుండె నార్తరక్షణుడు॥
రక్షించుకర్త శ్రీరామచంద్రుడు గలుగ । తరుచరవరులార వెర పేమి మీకు॥
వెరవు గల్గిన వారు నరవకురునిమరుగునను । జేరియుండగవచ్చు చింతింపదగున॥
పౌరుషవంతులై బలవిక్రమము జూపి । అసురుతో పోరాడు టది కీర్తి మనకు॥
పోరాడగా లేక పారి గిరిగుహలందు । దూరియుండిన మనకు దోషంబు వచ్చు॥
దనుజులతో పోరాడ తరముగా దనువేళ । కలడు పోరాడుటకు కమలనాభుండు॥
అడుగ మనపాలింటియార్తరక్షామణి । జెగదేకవీరుండు జానకీవరుడు॥
శరణాగతత్రాణబిరుదు గైకొనియుండె । దానవసంహరుడు ధరణిపాలకుడు॥
కాకుత్స్థకులవరుడు ఘనవుణ్యచెరితుండు । దీనరక్షామణీ దేవదేవుండు॥
తృణలీల దానవుని దునుమాడువేళ । కోరె దనుజునిచావు చూడండి మీరు॥
దాపు ప్రావును తల్లితండ్రియైన నెల్ల । రక్షించుకర్త శ్రీరాము డుండంగ॥
భయము మీ కేమి నిర్భయు లగుచు మీరంత । రండిరం డిటకు శ్రీరాముసన్నధికి॥
అని వేగ మరలించె నాసైన్యములనెల్ల । మరలి కపులంత ధీమంతులై యపుడు॥
గిరివరక్ష్మాజమ్ము లరజేతులను బట్టి । పెల్లుగా నార్చుచును భీకరాకృతిని॥
శ్రీరాములకు మ్రొక్కి శతకంఠు దునుమాడి । మరల వత్తుము శరవు మా కివ్వమనిరి॥
చిరునవ్వు వెలయంగ శ్రీరామచంద్రుండు । అంత వారలు మీర కాదురో యనెను॥
ఉత్సాహమున మీర లిచ్చోట నుండుడని । వచ్చి శతకంధరునివైఖరులు గనెను॥
తననూరుచేతులను ధనవులును ధరియించి । ఘోరశరములు బూని కొదవచేతులను॥
భుజముపై శూలంబు బూనుకొని ధీరుడై । నింగి ముట్టగ పొడవు నిలచి చూచుచును॥
నూరుమొగములపైని భోరునను యనలములు । వెడలుకాలాగ్నివలె వికృతరూపమున॥
వచ్చురాక్షసవీరు నచ్చేరువను గాంచి । భయము కోపము నాత్మ బరిఢవిల్లెనుగ॥</poem><noinclude><references/></noinclude>
0655aifruymfpnfmm8a8ouigmjngh3t
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/90
104
216492
570230
565422
2026-08-14T12:27:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570230
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>వేమారు రాక్షసునివికృతరూపము జూచి । ఆశ్చర్యమానసుండై రామవిభుడు॥
విభ్రాంతచిత్తుడై విభీషణుని బిలిచి । ఈమహాశూరుండు యెవ్వడో చెపుమ॥</poem>
{{p|ac|fwb}}రాముడు విభీషణునివలన శతకంఠు నెరుగుట</p>
<poem>ఛండకృతాంతుడో ఛండికానాథుడో । కాలమృత్యువో కాక కడుభూతచయమొ॥
ఎవ్వడో వీడు మా కెరుగంగ జెప్పుమా । వీనిరూపము జూడ వింతయై దోచు॥
వీనిబాహాశక్తి వీనిశౌర్యము జూడ । వీనితో సరిబోరు వీరుండు లేడు॥
వీనిపే రేమిటో వివరించి చెప్పుమా । పరమాప్తుడవు ప్రాణబంధుడవు నీవు॥
అని రాఘవేశ్వరుడు తనతోడ బలుకంగ । కరయుగంబులు మోడ్చి ఘను డిట్టులనియె॥
దేవదేవ మహానుభావ రఘునాయకా । ఆదినారాయణా యవతారపురుష॥
వీడు శతకంఠుండు వికృతాకారుండు । బహుమాయవర్తనుడు పరమద్రోహుండు॥
ఇతనిచే మనబలము లెల్లను మృతిబొందు । చలగి రణమున బోర శక్యంబు గాదు॥
వీనిరక్తపుచుక్క వెలసి నేలనుబడిన । వీనివలె బుట్టెదరు వీరు లొకనూరు॥
వారంత వీనివలె పోరాడుచుండెదరు । వనజభవు డిచ్చిన వరమహత్యమున॥
వీనితో పోరాడి వీనిధాటికి నిల్వ వనచరుల । కెవ్వరికి వశము గాదనెను॥
ఇల జనులకందరికిని తడజేయుండయ్య । తరముగా దెవ్వరికి దనుజుతో బోర॥
నెట్లు జయ మొందునో యేమికథ జరుగునో । తోచ డేమియు నాకు తోయజేక్షణుడు॥
వీని మించినవారు వీనిసరదార్లంత । మంత్రతంత్రజ్ఞులు మాయవాదులును॥
ఈరాక్షసుని గూల్ప నీవె కా వెవ్వరును । భరియింపగా లేరు పద్మలోచనుడ॥
ఇక జాగు సేయంగ నేల విల్లందుకొని । ఆజ్ఞేయబాణంబులందు శ్రీరామ॥
నేల రక్తకణంబు రాలకుండగ జేయ । మాయశతకంధరులు మహిని బుట్టరుగ॥
దైత్యేంద్రుమంత్రులకు తగినట్టిశూరులను । మనవారి నేర్పరచు మానవేశ్వరుడ॥
అని రాముతో జెప్పి ఆంజనేయుని జూచి । అంజనీనందనా అసమానశౌర్య॥</poem><noinclude><references/></noinclude>
83g3lg8vi8ly6w4kjznbz427upggjx2
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/91
104
216493
570234
565423
2026-08-14T13:28:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570234
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}సమయ మిదిగో గెలుపు సమకూడజేయవలె । నరయ మాకందరికి నాత్మబంధుడవు॥
దానవుడు నామీద తగకోవమును బొంది । విగ్రహింపుచునుండు నాగ్రహంబునను॥
ఆగ్రహంబున దనుజు డరుదెంచువేళను । కాపాడవలె నన్ను కరుణతో నీవు॥
పవననందనుడ నాభారమే నీ దనుచు । తనసేనతో దాను దట్టమున నుండె॥
రాముసాన్నిధ్యమున రంజిలుచు హనుమంతు । వాలంబు ద్రిప్పుచును వడి మీరియుండె॥
భరతుడును లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడును । కుశలవులు విజయుడును గూడియుండిరిగ॥
సుగ్రీవాంగదముఖ్యశూరులెల్లను మిన్ను । పగులనార్చుచు రాము బలసియుండిరిగ॥
శ్రీరామచంద్రుండు చే విల్లు బట్టుకొని । నారిఠాంకృతులెల్ల భోరుకొల్పుచును॥
ఉదుటుగా బాణములు పొదిలోన బరపుచును । పెక్కువిధముల విజృంభించుచుండెనుగ॥
నూరుమొగములయందు భోరునను యనలములు । మంట లెగయగ చాలకంటకంబునను॥
ఘనుడు శతకంఠుండు తనబలంబుల జూచి । శలవిచ్చె యుద్ధంబు సలుప బొమ్మనుచు॥</p>
{{p|ac|fwb}}వానరులు దానవులు పోరుట</p>
<poem>కాలజీమూతంబు బోలి రాక్షసబలము । చెలగుచును శ్రీరాముసేనపై గవిసె॥
శరచక్రములు బూని తరుచరానీకములు । మారుకొని పోరాడె వీరరాక్షసులు॥
ధరపరాగం బెగయ నురువడిగ దాటుచును । కపిసేనపై గవిసె ఘనులు రాక్షసులు॥
కార్చిచ్చువంటి బెగ్గలమైనరూపములు । గనుపట్ట కపులపై గదసె రాక్షసులు॥
ఏది వానరబలము యేది మానవబలము । అనుచు బలముల గవిసి రపుడు రాక్షసులు॥
కులశైలములరీతి కుంజరేంద్రంబులను । డీకొల్పి వానరాధిపుల గదసిరిగ॥
భూమి తల్లడ మొంద భూరజం బెగయంగ । కోటు లర్బుదములు దీటుకొల్పిరిగ॥
అవని తల్లడ మంద నర్బుదంబులు కొద్ది । రథము లుద్ధతి దోలె రాక్షసావళులు॥
కడలేని బాణములు యెడతెరిపి లేకుండ । బలములన్నియు గప్పి బలులు రాక్షసులు॥</poem><noinclude><references/></noinclude>
nb643isjsq2wo9532o554hs85q2dak0
570235
570234
2026-08-14T13:29:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
570235
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>సమయ మిదిగో గెలుపు సమకూడజేయవలె । నరయ మాకందరికి నాత్మబంధుడవు॥
దానవుడు నామీద తగకోవమును బొంది । విగ్రహింపుచునుండు నాగ్రహంబునను॥
ఆగ్రహంబున దనుజు డరుదెంచువేళను । కాపాడవలె నన్ను కరుణతో నీవు॥
పవననందనుడ నాభారమే నీ దనుచు । తనసేనతో దాను దట్టమున నుండె॥
రాముసాన్నిధ్యమున రంజిలుచు హనుమంతు । వాలంబు ద్రిప్పుచును వడి మీరియుండె॥
భరతుడును లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడును । కుశలవులు విజయుడును గూడియుండిరిగ॥
సుగ్రీవాంగదముఖ్యశూరులెల్లను మిన్ను । పగులనార్చుచు రాము బలసియుండిరిగ॥
శ్రీరామచంద్రుండు చే విల్లు బట్టుకొని । నారిఠాంకృతులెల్ల భోరుకొల్పుచును॥
ఉదుటుగా బాణములు పొదిలోన బరపుచును । పెక్కువిధముల విజృంభించుచుండెనుగ॥
నూరుమొగములయందు భోరునను యనలములు । మంట లెగయగ చాలకంటకంబునను॥
ఘనుడు శతకంఠుండు తనబలంబుల జూచి । శలవిచ్చె యుద్ధంబు సలుప బొమ్మనుచు॥</poem>
{{p|ac|fwb}}వానరులు దానవులు పోరుట</p>
<poem>కాలజీమూతంబు బోలి రాక్షసబలము । చెలగుచును శ్రీరాముసేనపై గవిసె॥
శరచక్రములు బూని తరుచరానీకములు । మారుకొని పోరాడె వీరరాక్షసులు॥
ధరపరాగం బెగయ నురువడిగ దాటుచును । కపిసేనపై గవిసె ఘనులు రాక్షసులు॥
కార్చిచ్చువంటి బెగ్గలమైనరూపములు । గనుపట్ట కపులపై గదసె రాక్షసులు॥
ఏది వానరబలము యేది మానవబలము । అనుచు బలముల గవిసి రపుడు రాక్షసులు॥
కులశైలములరీతి కుంజరేంద్రంబులను । డీకొల్పి వానరాధిపుల గదసిరిగ॥
భూమి తల్లడ మొంద భూరజం బెగయంగ । కోటు లర్బుదములు దీటుకొల్పిరిగ॥
అవని తల్లడ మంద నర్బుదంబులు కొద్ది । రథము లుద్ధతి దోలె రాక్షసావళులు॥
కడలేని బాణములు యెడతెరిపి లేకుండ । బలములన్నియు గప్పి బలులు రాక్షసులు॥</poem><noinclude><references/></noinclude>
blwmmckuubuqascocako76e9jjjpjvf
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/92
104
216494
570237
565424
2026-08-14T13:39:34Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570237
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>సింహనాదంబులును చెలగి మిన్నంటంగ । నార్పు లొదవుచు పోరి రసురవల్లభులు॥
గిరివృక్షముల బట్టి తరుచరావళు లెల్ల । నెదురుకొని రాక్షసుల గదసి రుద్దతిని॥
రారోయి కపులార రండి వేగం బనుచు । పశ్చమసముద్రంబుపగిది గవసిరిగ॥
కడుశైలముల బట్టి కందుకంబులరీతి । వీరరాక్షసులపై విసరె కపిబలము॥
ధీమంతులై కపులు యేమరక వృక్షములు । దనుజకోటులమీద తరిమి విసరిరిగ॥
పెక్కునేర్పులమీద నక్కజంబుగ పోరి । రుక్కు మీరుచు నిట్లు నక్కపీశ్వరులు॥
తన్నుచును జీరుచును తగుముష్టి బొడుచుచును । కరచుచును పలుగతుల గాసి జేయుచును॥
వాలమున జుట్టుచును వడిని బడద్రోయుచును । నేలబె ట్టడ్చుచును నింగి కెగయుచును॥
ఈరీతి కపిబలము పోరాడుచుండంగ । బలుకోపులై దైత్యభటు లంతలోన॥
పరిఘపట్టెసచక్రకరవాలతోమర । ముసలాయుధము లెల్ల విసరి రుద్ధతిని॥
మరియు మరియును పెక్కు శరము లుద్ధతి బూని। కపిబృందముల గప్పె నపుడు రాక్షసులు॥
అతితీవ్రశరము లుద్ధతిని మరిమరికొన్ని । వేలులక్షలకొలది వేసె రాక్షసులు॥
దనుజశరములు గాడి తరుచరబలమెల్ల । బలుగతుల మూర్ఛిల్లి బరవశం బైరి॥
శరము లరుదుగ నాటిపరవశంబును బొంది । బడిరి మర్కటబలము బహువిధంబులను॥
వడగళ్లవరషంబు పుడమి గురిసినలాగు । రాక్షసులపై గురిసె రాళ్లవర్షంబు॥
నేటైన శైలములు కోట లర్బుదములును । ఒక్కపెట్టున విసరి రుజ్వలంబుగను॥
నగము చేతుల బట్టి గగనవీథికి నెగసి । గురిజూచి రాక్షసుల గూలనేసిరిగ॥
కోలాహలము మీరి కుప్పించి దాటుచును । పిడుగుపాటున ముష్టి బొడచి కూల్చిరిగ॥
రథముపై కెగసి సారథిరథుల బరిమార్చి । అశ్వసముదాయముల నవని గూల్చిరిగ॥
మదగజముతో నొక్కమదగజము గూల్చుచును । గుర్రముతో గుర్రమును గూల నేసిరిగ॥
తరువు చేబట్టుకొని గిరగిరను ద్రిప్పుచును । కాల్బలంబుల నేల గలియగొట్టిరిగ॥
రథముతో నొకరథము రట్టుబడగను జేసి । దనుజు బట్టుకు నొక్కదనుజు గూల్చిరిగ॥</poem><noinclude><references/></noinclude>
3h6yqwfws1mmu74w13ifvq4jh3ip4k3
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/93
104
216495
570244
565425
2026-08-14T14:53:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570244
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>పదుగు రొక్కొక్కరుని పట్టి బడగూల్చుచును । కరచుచును గొందరిని గాసిబెట్టిరిగ॥
ఎడపకను వాలములు కడుకాళ్లపై జుట్టి । పడద్రోచి గుండెపై బొడచి కూల్చిరిగ॥
నడుముపై వాలంబు వడిమీరగా జుట్టి । ఆకసంబున కెగయ అపుడు విసిరేసి॥
భళిభళీ యని వచ్చి పట్టి ముష్టిని బొడచి । పడద్రోచి నేలపై బట్టి యీడ్తురుగ॥
పిడుగుపాటున వచ్చి బెడిదముగ బొడుచుచును । తన్నుచును జీరుచును ధరణి గలుపుచును॥
కుంభికుంభంబులను కూలంగదన్నుచును । కోట్లగజముల నేల గూల్చివేసిరిగ॥
ముష్టిఘాతంబులకు మొగిసి బెగ్గుర్రములు । గుండె లవయుచు నేల గూలె గోట్లుగను॥
కోరి రథములు పైకి కుప్పించి దాటితే । గుండయ్యె రథములు గూలె సారథులు॥
పుడమిపరాగంబు వడి మీరగా నెగసి । కడువడిని యాకాశగంగలో గలిసె॥
కూలె రాక్షసపౌంజు కోటానకోటులుగ । తెట్టతెట్టలుగాను తెరిపి లేకుండ॥
తునియలై యమ్ములును తునకలై చరణములు । పరియలై బాహువులు ధరణిపై బడియె॥
నడుములును మోకాళ్లు తొడలు ఖండిత మగుచు । బడిరి దానవబలము బహువిధంబులను॥
ఇట్లు దనుజావళులు యిలపైని గూలంగ । శేషించియున్నట్టి సేననాయకులు॥
బలుగర్వముల మీరి పంతములు బలుకుచును । కపిబలంబులపైని గవిసి రుగ్రతను॥
చేటుపాటుగ బట్టి చెలరేగి బాణములు । కపిబృందముల గప్పి రపుడు రాక్షసులు॥
పదులు నూరులు వేలు బహులక్ష బహుకోట్లు । బలుశరంబులు గప్పె బలము కంతటికి॥
శరము లురువడి దాకి శిరములును తెగి రాలి । తొడ విరిగి తరుచుగా బడిరి మర్కటులు॥
అధికముగ పటుశరము లంకింప వడినేసి । కపులమిక్కిలి గూల్చి రపుడు రాక్షసులు॥
మదగజేంద్రంబులను మార్కొనుచు డీకొల్పి । ద్రొక్కించి మర్కటుల మొక్కణంచిరిగ॥
అడిదములు చేబూని అశ్వముల నదలించి । కడువడిని మర్కటుల కదిసి దునిమిరిగ॥
శిరము తెగి రాలంగ నరికి భూమికి నాట । నరకదొణగిరి ఛండతరము మీరుచును॥
వెలయ తొలకరిమెరుపువలె తురగములు ద్రిప్పి । కవివరుల దునుమాడి రపుడు రాక్షసులు॥</poem><noinclude><references/></noinclude>
dv51acr8sxvyb0dacwz6mvr77kr69wd
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/94
104
216496
570249
565426
2026-08-14T17:03:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570249
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఝట్టిమల్లులు రాగమట్టి మల్లాడుచును । తలలు తెగనేయుచును బలిమి జూపుచును॥
చేటుపాటుగ నిట్లు చెలరేగి వానర । బలములను దునుమాడె బలులు రాక్షసులు॥
పీనుగపెంటలై వానర బలమెల్ల । వేలు లక్షలు కోట్లు కూలె నవ్వేళ॥
నిలువెల్ల బాణములు నిండి తెప్పిరి లేక । నీల్గి రందరుకపులు నిలిచియున్నట్లు॥
కూలుకపులను గాంచి కొదు వేమి లేదనుచు । వీరసాహసవృత్తి వెలసి వానరులు॥
తమమనంబుల చాలదైర్యములు దెచ్చుకొని । వనచరబలమెల్ల వక్కముఖమునను॥
పంతమున రాక్షసబలముమీదను గవిసి । రేమి చెప్పుదు వారితామసములెల్ల॥
కరచుచును నఖములను కండలుగ జీరుచును । కడువడిని బొడచుచును కాళ్ళ దన్నుచును॥
దట్టించి మోకాళ్ళ దన్నుచును కరచుచును । పిడికిళ్ల బొడుచుచును పుడమి గూల్చుచును॥
మరచిపాటున వచ్చి మరియు కలబట్టుచును । పడద్రోచి పొట్టలు బగులదన్నుచును॥
పటువాలముల జుట్టి పడద్రోచి త్రొక్కుచును । గిరులు పడవైచుచును నురుము జేయుచును॥
చరణాగ్రనఖములను మరిమరియు జీరుచును । పలువిధంబుల బట్టి భంగపరచుచును॥
వెనుక మారుగ వచ్చి వీపుపై దన్నుచును । పడినదనుజునిగుండె పగులమోదుచును॥
కడుశైలముల దెచ్చి నడునెత్తి వైచుచును । తల వ్రక్కలైపోవ ధరణి గూల్చుచును॥
పలువిధంబుల నిట్లు చలరేగి వానరులు । దనజుచేతులు బట్టి ధరణి గూల్చిరిగ॥
ఏనుగతుండములు యెగసి చేబట్టుకొని । గిరగిరను ద్రిప్పుచును ధరణి గొట్టిరిగ॥
కులగిరులగతి నేల గూలి వడి యేనుగులు । వేలులక్షలకోట్లు విడ్డూరముగను॥
కొండలు పొడవుగా కోటానుకోటులు । అశ్వసముదాయంబు లవని గూల్చిరిగ॥
బలువు మీరిన మహాపర్వతంబులు వైచి । బలురథంబులు నేలపాలు జేసిరిగ॥
దొంతులుగ గిరుల చేబంతులుగ బట్టుకొని । కపిబలంబంతయును గదిసి రుద్ధతిని॥
ఒక్కతీరున విసరి రుజ్వలాకృతి మీరి । దనుజబలములు నేల దగ్ధమై కూల॥
వడగళ్లవరషంబు పుడమి గురిసినలాగు । గురిసి రసురులమీద గిరులవరషంబు॥<noinclude><references/></noinclude>
8kvozaqma8t3toj23jqiap8qfg0k4jw
570250
570249
2026-08-14T17:03:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
570250
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఝట్టిమల్లులు రాగమట్టి మల్లాడుచును । తలలు తెగనేయుచును బలిమి జూపుచును॥
చేటుపాటుగ నిట్లు చెలరేగి వానర । బలములను దునుమాడె బలులు రాక్షసులు॥
పీనుగపెంటలై వానర బలమెల్ల । వేలు లక్షలు కోట్లు కూలె నవ్వేళ॥
నిలువెల్ల బాణములు నిండి తెప్పిరి లేక । నీల్గి రందరుకపులు నిలిచియున్నట్లు॥
కూలుకపులను గాంచి కొదు వేమి లేదనుచు । వీరసాహసవృత్తి వెలసి వానరులు॥
తమమనంబుల చాలదైర్యములు దెచ్చుకొని । వనచరబలమెల్ల వక్కముఖమునను॥
పంతమున రాక్షసబలముమీదను గవిసి । రేమి చెప్పుదు వారితామసములెల్ల॥
కరచుచును నఖములను కండలుగ జీరుచును । కడువడిని బొడచుచును కాళ్ళ దన్నుచును॥
దట్టించి మోకాళ్ళ దన్నుచును కరచుచును । పిడికిళ్ల బొడుచుచును పుడమి గూల్చుచును॥
మరచిపాటున వచ్చి మరియు కలబట్టుచును । పడద్రోచి పొట్టలు బగులదన్నుచును॥
పటువాలముల జుట్టి పడద్రోచి త్రొక్కుచును । గిరులు పడవైచుచును నురుము జేయుచును॥
చరణాగ్రనఖములను మరిమరియు జీరుచును । పలువిధంబుల బట్టి భంగపరచుచును॥
వెనుక మారుగ వచ్చి వీపుపై దన్నుచును । పడినదనుజునిగుండె పగులమోదుచును॥
కడుశైలముల దెచ్చి నడునెత్తి వైచుచును । తల వ్రక్కలైపోవ ధరణి గూల్చుచును॥
పలువిధంబుల నిట్లు చలరేగి వానరులు । దనజుచేతులు బట్టి ధరణి గూల్చిరిగ॥
ఏనుగతుండములు యెగసి చేబట్టుకొని । గిరగిరను ద్రిప్పుచును ధరణి గొట్టిరిగ॥
కులగిరులగతి నేల గూలి వడి యేనుగులు । వేలులక్షలకోట్లు విడ్డూరముగను॥
కొండలు పొడవుగా కోటానుకోటులు । అశ్వసముదాయంబు లవని గూల్చిరిగ॥
బలువు మీరిన మహాపర్వతంబులు వైచి । బలురథంబులు నేలపాలు జేసిరిగ॥
దొంతులుగ గిరుల చేబంతులుగ బట్టుకొని । కపిబలంబంతయును గదిసి రుద్ధతిని॥
ఒక్కతీరున విసరి రుజ్వలాకృతి మీరి । దనుజబలములు నేల దగ్ధమై కూల॥
వడగళ్లవరషంబు పుడమి గురిసినలాగు । గురిసి రసురులమీద గిరులవరషంబు॥</poem><noinclude><references/></noinclude>
7rahl646qkpkujip0g45fwby1yrguwr
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/95
104
216497
570251
565427
2026-08-14T17:25:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570251
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>గిరివర్షమున జిక్కి సురవైరిబలమెల్ల । గుండపిండై నేల గూలి రవ్వేళ॥
అవని నిండగ గూలె నశ్వసముదాయములు । మడిసె కోట్లకొలంది మడిసె రాక్షసులు॥
కోటానుకోట్లుగా గూలె రాక్షసబలము । పీనుగపెంటలై కానబడుచుండె॥
కోట్లకొలదిగ వచ్చి గూడి పోరినపౌంజు । లెక్క దానవు లుండి రక్కజంబుగను॥
ఎల్లధైర్యము లాడి పెల్లార్చుబలమెల్లఁ । మర్కటవరులచే మడిసిపోయిరిగ॥
పలుమాంసరాసులు పర్వతంబుల పొడవు । కుప్పలై పడియుండె కోట్లకొలదిగను॥
పోగులును యెమ్ములును పోగులై పడియుండు । తెగినపుణికెలు నేల నగణితంబయ్యె॥
పెదపెద్దమొనలెల్ల పీనుంగుపెంటలై । రక్తమాంసము రొంపి రణభూమి యయ్యె॥
చాలనెత్తురుయేర్లు నేలబారుచు నుండె । మిన్నంటి పొంగుచును మిక్కటంబుగను॥
రక్తపుటేటిలో రట్టాడుకొని భూత । భేతాళములు నిండ వేటాడుచుండె॥
ఈపాటిమాంసంబు నెన్న డెరుగమటంచు । చెలరేగియాడు పిశాచసంఘములు॥
పాటించి తాటించి మేటియై యందందు । తగ ఢాకినీగణము తాండవం బాడు॥
ఢాకినీసంఘములు డాసి మెదడు భుజించి । యీగలింపుచునుండె ఢాకినీగణము॥
శాకినీగణములను ఢీకొనుచు నెత్తురులు । వాలలా డుగ్రభేతాళరవములును॥
గలిసి పురి విప్పుచును కేకలాడుచునుండ । కేగికాకులను గమకించుగద్దలును॥
గలిగి కావిరి దిశలు గప్పి పగలును రేయి । గానరాకుం డంధకారంబు గప్పె॥
అభ్రతలమున నిల్చి అమరాదిదేవతులు । కపులశూరత్వములు గని సంతసిలిరి॥
కపులశూరత్వములు గాంచి నంతసమంది । నాట్యంబు లొనరించె నారదామౌని॥
కడుపు నిండినపోరు గలిగె నిన్నాళ్ల కని । గెర్రుగెర్రున తెంచె ఘనుడు నారదుడు॥
బ్రహ్మదేవుం డపుడు ప్రళయకాలం బనుచు । కాలంబు లెక్కింపగా దొణంగెనుగ॥
ఘనసముద్రమురీతి కడువింత రంజిల్ల । గాఢమై రణభూమి గానబడుచుండె॥
రక్తోదకము భూతరాగంబు నిడి ఘోష । వెలయు తురంగముల్ వింజమరములు॥
శరము లురగంబులు చక్రములు కూర్మములు । వెలయ పీనుంగులు వీరమకరములు॥</poem><noinclude><references/></noinclude>
f9tlk35itwex9i9nfulascnzuol5w8y
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/96
104
216498
570254
565428
2026-08-14T18:19:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570254
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>మీనములు ఛత్రములు మెరయుఘనరత్నములు । బడబాగ్నిచందమున భాసిల్లి యుండె॥
ఆరీతి రణభూమి అంభోదిచందమునఁ । బొలుపారుచుండంగ గని దైత్యవరుడు॥
సకలదానవబలము సరిపుచ్చె కపిబలము । ఘనపముద్రముబోలి కానంగబడెను॥
సరదార్లుమాత్రము సముఖస్థులై యుండి । బ్రతుకుటకు యోగంబు పట్టియుండెనుగ॥
సరదార్లలనేముందు సమరముకు బంపితె । కపిబృందముల నేల గలిపి వత్తురుగ॥
పొరపాటు వచ్చె ముందర సేన లంపుటయు । దైవయోగం బెవరు తప్పింపలేరు॥
ఇపుడు మించిన దేమి కపుల జంపింతునని । కడురౌద్రమును బొంది ఘనుడు శతముఖుడు॥
దీర్ఘజిహ్వుని బిలిచి ధీరుడా నీ వేగి । కపివరానీకముల కడతేర్చి రమ్ము॥
ఆమీద రాఘవుని హతమార్చి రమ్మనుచు । శలవివ్వ రాక్షసునిశలవు గైకొనుచు॥</poem>
{{p|ac|fwb}}భరతుడు దీర్ఘజిహ్వుని జంపుట</p>
<poem>దీర్ఘజిహ్వుం డరిగె దిశలు కంపము నొంద । పైకి నాలుక చాచి పరువడిని వచ్చి॥
కాలరుద్రునిపగిది కపిసేనపై గవిసె । ఏమి చెప్పుదు వానితామసంబెల్ల॥
కపిబృందములపైని గవిసి పోరుచునున్న । కడురాక్షసుని జూచి కమలనాభుండు॥
అటు బోకు బోకురా అసురాధమా యనుచు । తనవిల్లు చేబట్టె వనజగర్భుండు॥
ధనువు చేబట్టుకొని దానవులు భీతిల్ల । గుణ మెక్కు గావించి కోదండపాణి॥
గుణరవధ్వనులచే గూలె కులశైలములు । భూమి గడగడ వడకె భూరజం బెగసె॥
దివ్యబాణము లంది ధీరుడై శ్రీరాము । బరపె రాక్షసునిపై తెరపి లేకుండ॥
బాణములు రాక్షసునిమేనుపై గాడంగ । రఘురాము లెదురుగా రథము నడిపించె॥
అంతలోపల భరతు డడ్డంబుగా వచ్చి । నిలచి దనుజుని గాంచి బలికె తా నపుడు॥
ఓరిరాక్షసవీర ఉగ్రరణమున నీవు । నిలచి నాతో పోరు నీపొంక మణతు॥
బాణాగ్నిచే నిన్ను బరిమార్చి యమపురికి । నిజముగా బంపింతు నిన్ను యీవేళ॥</poem><noinclude><references/></noinclude>
31qlislk8c7p9ycs8zgbwu1z2whqu78
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/97
104
216499
570271
565429
2026-08-14T23:33:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570271
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అనిన విని రాక్షసుడు కనుల నిప్పులు రాల । పళ్లు పటపట గొరికి బలికె భరతునితో॥
ఏర మనుజాధమా యెదురు దెలియక నీవు । నాకడ్డమై వచ్చినావు యీవేళ॥
నిను బట్టి వధియింతు నిజముగా నీవేళ । చూడు నాభుజబలిమి చూపెదను యిపుడు॥
నాతోటి సరిబోర నాకేశు శక్యమా । కదసి కండలు జేతు మెదలకుండగను॥
నిన్ను బరిమార్చెదను యన్న రాఘవుడు । వచ్చినా బడగూల్తు నొక్కబాణమున॥
ఘను విభీషణుడు వచ్చిన వాని జంపెదను । తడయకుండగ నొక్కగడియలోపలను॥
శౌర్యమున లక్ష్మణుడు జనుదెంచినాగాని । కూలనేయుదు నొక్కకోలతో వాని॥
మరి యెవరు వచ్చినా బరిమార్తు నవలీల । నజుడు వచ్చిన గాని హతము జేసెదను
అనిన భరతుడు నవ్వి అసురుడా ప్రల్లదము । లేల బల్కెదవు నీ కేమి లాభంబు॥
ఘనశరంబుల నిన్ను గడతేర్తు నిటు చూడు । మని దైత్యుపై వైచె ఘనశరం బొకటి॥
భరతు డేసిన దివ్యబాణంబు ఖండించి । తిరిగి బాణము వేసె సురవైరిబంటు॥
అది తూలగా నేసె నారాముసోదరుడు । సింహనాధము జేసి గంహరంబుగను॥
ఘనశరం బొకటంది కాసుకోరా యంచు । తగ రాక్షసునిజిహ్వ తెగవ్రేసె నపుడు॥
తనజిహ్వ నష్టమై పెనుగొన్న కోపమున । ప్రళయాగ్నిగతి మండి బలుడు రాక్షసుడు॥
రౌద్రాస్త్ర మొక టేసి రాముతమ్మునిమీద । కంఠీరవధ్వనులు గదుర నార్చుచును॥
ఆబాణ మవలీల హతముగా దునుమాడి । అన్న రాముడు మెచ్చ హస్తములు దునిమె॥
వానరుల్ పెల్లార్వ వక్కనిముషములోన । నసురునాలుకకరము లవని బడగూల్చె॥
కరములును తనజిహ్వ కడతేరిపోయెనని । సిగ్గుపడ కేమియును చెనటి రక్కసుడు॥
భరతు మ్రింగెదనంచు బలుకోపుడై రాగ । నంతలో హనుమంతు డడ్డమై వచ్చి॥
సిగ్గుమాలిన దైత్య ఛీ నిల్వుమని పల్కి । వానికంఠము దృంచె పూని ఖడ్గమున॥
అట్లు భండనములో నవనిపై బడి దీర్ఘ । జిహ్వుండు కడతేర శిఖిముఖుం డపుడు॥</poem>
{{p|ac|fwb}}శత్రుఘ్నుడు శిఖిముఖుని జంపుట</p>
<poem>విలయకాలమునాటి వీరభద్రునిరీతి । గవిసె భరతునిమీద ఘనుడు శిఖిముఖుడు॥</poem><noinclude><references/></noinclude>
n6dlanjxhj8x7rf21lri0xw41x5clf0
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/98
104
216500
570272
565430
2026-08-15T00:10:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570272
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అన్నమీదను గవిసినట్టిదనుజుని జూచి । శత్రుభీకరుడైన శత్రుఘ్ను డపుడు॥
అర్ధచంద్రాస్త్రంబు లవి వింట సంధించి । వేసె శిఖిముఖునిపై వీరహంకృతిని॥
అవి యెల్ల ఖండించి అతనిపై రాక్షసుడు । తిరిగి యైంద్రాస్త్రంబు దొడిగి తా వేసె॥
దాని నడుమను దృంప దైత్యు డంతటిలోన । నురగబాణము వేసె సురలు భీతిలగ॥
గరుడబాణము వేసె భరతునితమ్ముండు । యురగబాణము గూల్చె త్వరితమార్గమున॥
యురగబాణం బిట్లు ధరణి గూలుట జూచి । క్రోధాంతరంగుడై క్రూరరాక్షసుడు॥
పాశుపదాస్త్రంబు భరతుతమ్మునిమీద । వేసె దుర్మదవృత్తి నాశరం బపుడు॥
పొగలు మంటలు మింట భుగులుకొని శర మేగి । భరతుతమ్ముని దూసె సురలు భీతిలగ॥
శరము మేనును గాడి శత్రుఘ్ను డావేళ । సొమ్మసిలి తా లేచి జూచి కోపమున॥
ధీరుడై వేగమున నారాయణాస్త్రంబు । వింట సంధించి బలుమంట లెగయగను
ఆర్చి వడి నేయంగ ఆదివ్యశర మపుడు । చెలగె మంటలు మింట చెదిరి యేగెనుగా॥
రిపులు మొర్రలు బెట్టి తపియింపుచుండంగ । భువనములు వణికె నంభోనిధుల్ గలిగె॥
శిఖిముఖుడు వణుకుచును చెలగి మొర్రలు బెట్ట । చిచ్చు లొలుకుచు వానిశిరము తెగటార్చె॥
శిరము తెగి దానవుడు ధరణిపై బడి గూలె । దనుజసంఘములెల్ల తల్లడించిరిగ॥
శిఖిముఖుం డీరీతి జీవములు యెడబాసె । సురలు పువ్వులవాన గురిసి రవ్వేళ॥</poem>
{{p|ac|fwb}}లక్ష్మణుడు శూలహస్తుని జంపుట</p>
<poem>శూలకంఠుడు వచ్చె శూలంబు చేబూని । విలయభైరవమూర్తివేషంబుతోడ॥
గని లక్ష్మణాస్వామి దనుజు కడ్డము నిలచి । రమ్ము నాతో వోరి రాక్షసా యనెను॥
కంటకంబున జూచి కంట నిప్పులు రాల । పటుదివ్యబాణములు బరపె రాక్షసుడు॥
దనుజు డేసిన బాణతతులన్ని ఖండించి । తనబాణతతు లేసె ఘనుడు లక్ష్మణుడు॥
బలుడు లక్ష్మణవీరుపటుబాణములు దృంచి । అనలబాణము లేసె నపుడు రాక్షసుడు॥</poem><noinclude><references/></noinclude>
g44ks6d1itjyqz8sieo0xi3p4250762
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/99
104
216501
570273
565431
2026-08-15T00:29:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570273
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అసురనాథుం డేయు ననలబాణములెల్ల । వారించె సౌమిత్రి వారణాస్త్రమున॥
కలహించి దానవుడు కన్ను లెర్రగ జేసి । కూలుమని పటుఘోరశూలంబు విసరె॥
దానవుడు శూలంబు తప్పకుండగ వినర । అనలములు గ్రక్కుచును ఆశూల మేగె॥
భూమి తల్లడ మంది భువనములు కంపించె । అద్భుతంబును బొందె అమరాదిసురలు॥
అంతలో హనుమంతు డడ్డంబుగా వచ్చి । జనుదెంచు శూలంబు తనకేల నందె॥
రెండుముక్కలుగాను ఖండితంబులు జేసి । దూరంబునకు విసరి పారవేసెనుగ॥
హనుమంతు వీక్షించి ఆలక్ష్మణస్వామి । ప్రాణబంధుడ వనుచు బ్రస్తుతించెనుగ॥
మరియు లక్ష్మణసామి మది రోషమును బొంది । కౌశికుం డిచ్చి నాఘనశరము దీసి॥
తనచాపమున బూని దనుజుని గూల్చుమని । కంఠీరవధ్వనుల్ గదలజేసెనుగ॥
అనలములు గ్రక్కుచును ఆదివ్యశర మేగి । దనుజువక్షస్థలము తా దూసిపోయె॥
వక్షస్థలము దూసి వ్రాలి నేలను గూలె । స్థూలకంఠు డపుడు సురలు మోదింప॥
స్థూలకంఠుం డిట్లు నేల గూలుట జూచి । కనలుచును వచ్చె యోజనహస్తు డపుడు॥
ఆమడామడపొడవు హస్తముల్ విసరుచును । ఏడి లక్ష్మణవీరు డేడి యనుచు॥
వచ్చి లక్ష్మణవీరు నొడసి మెడబట్టుకొని । కదలకుండగ బట్టమనుడు రాక్షసుడు॥
కదలి మెదలక యుండకట్టు నిల్పినరీతి । ఆలక్ష్మణువీరు బలశాలి నపుడు॥</poem>
{{p|ac|fwb}}శతకంఠునిమంత్రులు యుద్ధమునందు జచ్చుట</p>
<poem>రాహుపట్టువిధాన రాక్షసుడు బంధించె । అభ్రవాసులు భయం బంది చూడగను॥
గని చాలకోపమున ఘను డాకుశుం డపుడు । వానిచేతులు దృంచె పూని కోపమున॥
హస్తములు తెగవ్రేయ అపుడు యాదనుజుండు । కుశుని మ్రింగెద నంచు కోపమున వచ్చె॥
తననోరు దెరచుకొని దానవుడు తా రాగ । ఘోరశరములు నూరు కుశుడు తా వైచి॥
మించి మరిమరి శరము లెంచి వడి నేయంగ । తూటులై మేనంత దునిసి రాక్షసుడు॥
కదల మెదలగ లేక కన్ను దెరువగ లేక । యోజనహస్తుండు యొరగె ధరపైని॥</poem><noinclude><references/></noinclude>
b6mzjbt6ndzm9dp71ax4y8cyztq3ydj
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/100
104
216502
570274
565432
2026-08-15T02:18:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570274
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఇట్లు యోజనహస్తు డిలపైని గూలంగ । గని దుర్ముఖుం డొకడు కనలచును వచ్చె॥
వచ్చి రాఘవసుతుని నచ్చేరువను గాంచి । పోకురా బాలుడా పోకురా యనుచు॥
హాగ్రుడై జనుదేర నంతలోపల లవుడు । దనుజు కడ్డము వచ్చి ఘనశరము వేసె॥
లవు డేయు బాణంబు లవలీలగా దునిమి । మరియు దైత్యుడు ఘోరశరము వేసెనుగ॥
దైత్యుశరములు దృంచి దనుజారినందనుడు । కాచుకొమ్మని వైచె ఘనశరం బొకటి॥
శరము మేనున నాటి చాల రోషంబునను । బాలకునిపై పళ్లు పటపటను గొరికి॥
ఆగ్నేయబాణంబు లవి వింట సంధించి । వేసె హాంక్రుతితోడ వేగ రాక్షసుడు॥
గని రామపుత్రుండు కినుకతోడుత దీసి । వారుణాస్త్రం బేసె ధీరుడై యపుడు॥
ఆవారుణాస్త్రంబు నాయనలబాణముల । పెల్లుగా రాకుండ చల్లార్చె నపుడు॥
ఆగ్నేయబాణంబు లట్లు చల్లారెనని । చింతించి యొకకొంతసేపు దానవుడు॥
ఘోరశరము వేయ కూల్చి తా లవు డపుడు । ఉగ్రశర మొక టంది ఆగ్రహంబునను॥
వింట సంధించి బలుమంట లెగయగ వైవ । ఆదివ్యశర మేగి ఆదానవునకు॥
కరయుగంబులు శిరము కడువేగమున దృంచి । పదిలంబుగా లవునిపొది జేరె నవుపుడు॥
దుర్మదుం డీరీతి దూలి ప్రాణము వీడె । గని మిగిలియున్నట్టి ఘనులు సరదార్లు॥
శూరతలు దీపింప శూర్పకర్ణుండును । పెల్లు విరినయట్టి పింగళాక్షుడును॥
త్రిముఖుండు రౌద్రంబుతోడ గజోదరుడు । కుశలవుల జంపుటకు గూడి వచ్చిరిగ॥
భుగభుగను మంటలును మొగములను చెదరంగ । నొక్కపెట్టున గదిసి రుగ్రులై యపుడు॥
జగములన్నిటి మ్రింగజాలుమృత్యులరీతి । రామునందనులపై రాదొణంగిరిగ॥
అట్లు వచ్చేవారి నారామచంద్రుండు । గని యిట్లు రారోయి యని వారి బిలచి॥
నాతోటి పోరాడి నని గెల్చి ఆపైని । వారిపై మీరు జనవచ్చు రం డనుచు॥
అరయ వారందరికి నన్నిశరములు పూని । కాచుకొమ్మని వేసె కమలనాభుండు॥
పటుబాణములు సోకి ప్రాణములు గడతేరిఁ । దనుజు లొక్కవిధాన ధరణిపై బడిరి॥
బలుమంత్రికోవిదులు పదుగురు గూలుటకు । మది గొంత చింతించి మరి శతాననుడు॥<noinclude><references/></noinclude>
snori26wqgr5rbryqw2shl8mj66rlfb
570275
570274
2026-08-15T02:18:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
570275
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఇట్లు యోజనహస్తు డిలపైని గూలంగ । గని దుర్ముఖుం డొకడు కనలచును వచ్చె॥
వచ్చి రాఘవసుతుని నచ్చేరువను గాంచి । పోకురా బాలుడా పోకురా యనుచు॥
హాగ్రుడై జనుదేర నంతలోపల లవుడు । దనుజు కడ్డము వచ్చి ఘనశరము వేసె॥
లవు డేయు బాణంబు లవలీలగా దునిమి । మరియు దైత్యుడు ఘోరశరము వేసెనుగ॥
దైత్యుశరములు దృంచి దనుజారినందనుడు । కాచుకొమ్మని వైచె ఘనశరం బొకటి॥
శరము మేనున నాటి చాల రోషంబునను । బాలకునిపై పళ్లు పటపటను గొరికి॥
ఆగ్నేయబాణంబు లవి వింట సంధించి । వేసె హాంక్రుతితోడ వేగ రాక్షసుడు॥
గని రామపుత్రుండు కినుకతోడుత దీసి । వారుణాస్త్రం బేసె ధీరుడై యపుడు॥
ఆవారుణాస్త్రంబు నాయనలబాణముల । పెల్లుగా రాకుండ చల్లార్చె నపుడు॥
ఆగ్నేయబాణంబు లట్లు చల్లారెనని । చింతించి యొకకొంతసేపు దానవుడు॥
ఘోరశరము వేయ కూల్చి తా లవు డపుడు । ఉగ్రశర మొక టంది ఆగ్రహంబునను॥
వింట సంధించి బలుమంట లెగయగ వైవ । ఆదివ్యశర మేగి ఆదానవునకు॥
కరయుగంబులు శిరము కడువేగమున దృంచి । పదిలంబుగా లవునిపొది జేరె నవుపుడు॥
దుర్మదుం డీరీతి దూలి ప్రాణము వీడె । గని మిగిలియున్నట్టి ఘనులు సరదార్లు॥
శూరతలు దీపింప శూర్పకర్ణుండును । పెల్లు విరినయట్టి పింగళాక్షుడును॥
త్రిముఖుండు రౌద్రంబుతోడ గజోదరుడు । కుశలవుల జంపుటకు గూడి వచ్చిరిగ॥
భుగభుగను మంటలును మొగములను చెదరంగ । నొక్కపెట్టున గదిసి రుగ్రులై యపుడు॥
జగములన్నిటి మ్రింగజాలుమృత్యులరీతి । రామునందనులపై రాదొణంగిరిగ॥
అట్లు వచ్చేవారి నారామచంద్రుండు । గని యిట్లు రారోయి యని వారి బిలచి॥
నాతోటి పోరాడి నని గెల్చి ఆపైని । వారిపై మీరు జనవచ్చు రం డనుచు॥
అరయ వారందరికి నన్నిశరములు పూని । కాచుకొమ్మని వేసె కమలనాభుండు॥
పటుబాణములు సోకి ప్రాణములు గడతేరిఁ । దనుజు లొక్కవిధాన ధరణిపై బడిరి॥
బలుమంత్రికోవిదులు పదుగురు గూలుటకు । మది గొంత చింతించి మరి శతాననుడు॥</poem><noinclude><references/></noinclude>
e4xgmx8l9p9tqe9ut1h1t8cf8vg7m8v
570276
570275
2026-08-15T02:19:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
570276
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఇట్లు యోజనహస్తు డిలపైని గూలంగ । గని దుర్ముఖుం డొకడు కనలచును వచ్చె॥
వచ్చి రాఘవసుతుని నచ్చేరువను గాంచి । పోకురా బాలుడా పోకురా యనుచు॥
హాగ్రుడై జనుదేర నంతలోపల లవుడు । దనుజు కడ్డము వచ్చి ఘనశరము వేసె॥
లవు డేయు బాణంబు లవలీలగా దునిమి । మరియు దైత్యుడు ఘోరశరము వేసెనుగ॥
దైత్యుశరములు దృంచి దనుజారినందనుడు । కాచుకొమ్మని వైచె ఘనశరం బొకటి॥
శరము మేనున నాటి చాల రోషంబునను । బాలకునిపై పళ్లు పటపటను గొరికి॥
ఆగ్నేయబాణంబు లవి వింట సంధించి । వేసె హాంక్రుతితోడ వేగ రాక్షసుడు॥
గని రామపుత్రుండు కినుకతోడుత దీసి । వారుణాస్త్రం బేసె ధీరుడై యపుడు॥
ఆవారుణాస్త్రంబు నాయనలబాణముల । పెల్లుగా రాకుండ చల్లార్చె నపుడు॥
ఆగ్నేయబాణంబు లట్లు చల్లారెనని । చింతించి యొకకొంతసేపు దానవుడు॥
ఘోరశరము వేయ కూల్చి తా లవు డపుడు । ఉగ్రశర మొక టంది ఆగ్రహంబునను॥
వింట సంధించి బలుమంట లెగయగ వైవ । ఆదివ్యశర మేగి ఆదానవునకు॥
కరయుగంబులు శిరము కడువేగమున దృంచి । పదిలంబుగా లవునిపొది జేరె నపుడు॥
దుర్మదుం డీరీతి దూలి ప్రాణము వీడె । గని మిగిలియున్నట్టి ఘనులు సరదార్లు॥
శూరతలు దీపింప శూర్పకర్ణుండును । పెల్లు విరినయట్టి పింగళాక్షుడును॥
త్రిముఖుండు రౌద్రంబుతోడ గజోదరుడు । కుశలవుల జంపుటకు గూడి వచ్చిరిగ॥
భుగభుగను మంటలును మొగములను చెదరంగ । నొక్కపెట్టున గదిసి రుగ్రులై యపుడు॥
జగములన్నిటి మ్రింగజాలుమృత్యులరీతి । రామునందనులపై రాదొణంగిరిగ॥
అట్లు వచ్చేవారి నారామచంద్రుండు । గని యిట్లు రారోయి యని వారి బిలచి॥
నాతోటి పోరాడి నని గెల్చి ఆపైని । వారిపై మీరు జనవచ్చు రం డనుచు॥
అరయ వారందరికి నన్నిశరములు పూని । కాచుకొమ్మని వేసె కమలనాభుండు॥
పటుబాణములు సోకి ప్రాణములు గడతేరిఁ । దనుజు లొక్కవిధాన ధరణిపై బడిరి॥
బలుమంత్రికోవిదులు పదుగురు గూలుటకు । మది గొంత చింతించి మరి శతాననుడు॥</poem><noinclude><references/></noinclude>
ez5n6wowt6hsue0ajbdto3mqvshv5bu
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/101
104
216503
570277
565433
2026-08-15T02:48:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570277
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>బలములు గూలుటకు పరితాప మొందుచును । మితిలేనికోపంబు మతి దలంపుచును॥
మధ్యాహ్నమున వెలయు మార్తాండుచందమున । త్రిపురసంహరురీతి దేజరిల్లుచును॥
పదిపదులు నోళ్లతో పళ్లు పటగొరికి । తనమోములన్నిటిని పెనుమంట లెగయ॥
సప్తసముద్రము లొక్కసరణిగా ఘూర్ణిల్లు । గతిని ఘార్ణిల్లుచును కలువరింపుచును॥
జగములన్నిటి సమయజేయంగ జాలిన । చలపాదియైన కృశాను బోలుచును॥
కన్ను లెర్రగ జేసి కలహించి తల లెత్తి । శ్రీరాముసేనపై తేరిచూచెనుగ॥
తేరిపారజూచి తీ టణంచెద మీకు । ది క్కేది తె న్నేది దీనులకు యనుచు॥</poem>
{{p|ac|fwb}}శతకంఠుడు రామునిసైన్యముల దునుముట</p>
<poem>తల యూచి ముమ్మారు తాటించి మీపాట్లు । చూచుకొండని తాను శూరతలు వెలయ॥
కపిసేనపై తనదుకన్ను లెర్ర జేసి । తనయొక్క ప్రఖ్యాతి ధరణి గంపింప॥
నూరుచాపము లొక్కబారు ననుసంధించి । కొదువ చేతుల శరము లుదుటుగా బూని॥
కాలమృత్యువురీతి కలుషలీలలు గ్రమ్మ । బలములన్నిటిపైని బలుడు శతముఖుడు॥
ధరణి యాకాశంబు తెరపి గనబడకుండ । బహుకోట్లబాణములు బరపె రాక్షసుడు॥
తెరిపి తెన్నును తేట గురుతు గనబడకుండ । కపివరానీకముల గప్పె బాణములు॥
పరగ నమ్ములపొదికి బాణములు చాపుట । వెలయ బాణము లంది వి ల్లందికొనుట॥
పరువడిని వ్రేయు యేర్పాటు గనబడకుండ । శరము వేసెను నిశాచరుడు ధీరతను॥
పటుశరము వేయు యేర్పాటు యెవ్వరికైన । గణుతింప రాకుండ దనుజు డేసెనుగ॥
సకలబలములయందు సకలదిక్కులయందు । బరపె శరములు లోకభయదరాక్షసుడు॥
అర్బుదంబులు కొలది నిర్బుదంబులు కొలది । ఖర్వంబుల క్షోణికాండంబు వేసె॥
వానిభుజలాఘవము వానిశరలాఘవము । పరికింపగా నెంతవారు జాలరుగ॥
పొగలు మంటలు మింట భుగులుకొని చెలగంగ । కడుఘోరబాణములు గుప్పె రాక్షసుడు॥
సకలబలములయందు చెలరేగి బాణములు । ఘోరదైత్యుడు చాల గ్రుమ్మరించెనుగ॥</poem><noinclude><references/></noinclude>
8274cbj180lckze7pnaucv1vi6wnmf7
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/102
104
216504
570278
565434
2026-08-15T03:41:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570278
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>చండవిక్రము డంచు చెప్పినందుకునెల్ల । తార్ఖాణముగ జేసె దనుజవల్లభుడు॥
బలుడు రాక్షసఘోరబాణాగ్నివేడిమికి । నెల్లబలములు చాల తల్లడించెనుగ॥
మానంబు విడనాడి మందుకైనా గాని । శూరుడై యొకడైన పోరాడడాయె॥
దనుజుశరముల కెదురుగను చూచుటేగాని । ధైర్యమున నొకడైన తరమలేడాయె॥
శైలచయ మొకటైన చేబట్టి వనచరుడు । దనుజు కెదురై నిలచి మొన కట్టడాయె॥
నెదిరించినట్లు డెబ్బదిరెండువేల్వలు । జవము చెడి నేలపై సాగిలంబడిరి॥
గొర్రెమందలరీతి కోటానకోటులు । నేల గూలిరి యొక్కనిముషమాత్రమున॥
మేటికార్చిచ్చులో మిడుతలు బడురీతి । దనుజుబాణాగ్నిలో దగ్ధమై పడిరి॥
బలుడు శతకంధరునిబాణమహి మెట్టిదో । అఖిలబలములు మడసె నరగడియలోను॥
పేరుకై నాయొక్క వీరుఁడు నిలకుండ । మనుజవనచరసేన మడిసిపోయెనుగ॥
తనచేత బలములు దగ్ధమై కూలెనని । వీరసాహసముచే వెలసె రాక్షసుడు॥
సుగ్రీవయంగదసుషేణుమొదలయిన । దండనాథుల నెల్ల తా జంపదలచి॥
ఇల గూలియున్నట్టి బలములన్నిటి విడచి । దండనాథులపైకి తనరథము నడిపె॥
తనరథము నడిపించి దండనాథుల బట్టి । దునుమాడగా జొచ్చె దుష్టరాక్షసుడు॥
పటుతీవ్రబాణములు పదిపదులు తా నేసి । అంగదుని బరిమార్చె నసురవల్లభుడు॥
ఏనూరుబాణముల నేసె సుగ్రీవుని । గడతేర్చె కపులెల్ల గడగడవణక॥
ఆర్నూరుబాణముల నతిబలశాలియౌ । జాంబవంతుని గూల్చె ఛండరాక్షసుడు॥
దక్కియుండినయట్టిదండనాథులనెల్ల । తరుచు శరములు గప్పి ధరణి గూల్చెనుగ॥
చప్పన్నదేశాది జననాయకులనెల్ల । బలుబాణములచేత బడగూల్చె నపుడు॥
బలుడు కొందరి బట్టి పరహతము గావించె । చెలగి కొందరి బట్టి శిరము లెగదునిమె॥
ఘనుడు కొందరివక్త్రగ్రంహరంబులు దృంచె । మరియు కొందరి బట్టి మట్టి మల్లాడె॥
కడు విభీషణఫౌంజు గని ద్వాదశాక్షోణి । బాణములు వడి నేసి ప్రాణములు గొనియె॥</poem><noinclude><references/></noinclude>
iqijdht3385wls56h2nhouh845qkdf9
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/103
104
216505
570308
565435
2026-08-15T08:31:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570308
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>తనకులంబని మదిని అనుమాన మొందకను । కడువిభీషణుబలము మడియజేసెనుగ॥
మనుజవనచరదనుజమరణంబు గావించి । పిదప విభీషణుని బిల్చి యిట్లనియె॥
నీకతంబున గదా నిష్కారణంబునను । లంకాపురపుదనుజపొంకంబు లణగె॥
నీవల్లనే గదా నెరిలంకలోగుట్టు । మనఁజనాథుని కెల్లమర్మముల్ దెలిసె॥
రణరంగమందు రావణకుంభకర్ణాది । దనుజహరణము సలిపె దశరథాత్మజుడు॥
కులద్రోహి వగునిన్ను గూలనేసెద నిపుడు । రణభూమిలోపలను రాక్షసాధముడ॥
హరిహరబ్రహ్మాదు లడ్డమై వచ్చినను । పడగూల్తు నిన్ను యీభండనంబునను॥
తారకాచలగుహల దాగితివి యిన్నాళ్లు । యిపుడు నీ కాభయము యెచట బోయెనురా॥
మనుజువల్లభు గూడి మర్మములు దెల్పుటకు । జనుదెంచితివ నీవు దనుజులను గూల్ప॥
అనుచు శతకంఠుండు అపుడు బ్రహ్మాస్త్రంబు । లంకాధిపునిపైని బింకముగ వైవ॥
జనుదెంచె నావిభీషణుగుండె లవిసిపడ । గరుడగంధర్వకిన్నరులు భయపడగ॥
అఖిలలోకముల కాహాకారములు బట్టి । చిచ్చు లొలుకుచు దివ్యశర మేగుదెంచె॥
చిచ్చు లొల్కుచు నేగి శరము విభీషణుని । అవయవంబులు చించి యవని బడద్రోచె॥
అవయవంబులు దూలి ఆరావణానుజుడు । నిదుర బొందినరీతి నేల బడియుండె॥
నిదుర బొందినరీతి నేలగూలెనుగాని । ప్రాణముల్ గొనదాయె బ్రహ్మాస్త్రమైన॥
ఘనముగా శ్రీరాము కరుణారసమువల్ల । చంపనోపగదాయె శర మెంతదైన॥
ఘను డిట్లు వ్రాల తక్కినవిభీషణుపౌంజు । అక్కడక్కడ దాగె నతిచింత నొంది॥
ఆవిభీషణు గూల్చి యాదానవేఁంద్రుండు । ఘోరబాణము లంది శూరుడై యపుడు॥
తనయభార్యాసహోదరచయంబులతోడ । రామచంద్రుని జంప రాక్షసుడు దలచె॥
మది నిశ్చయము జేసి పదినూరుబాణములు । హనుమంతుపై బూని యనియె రాక్షసుడు॥
అగచరా నీవు మానగరిలోపల జొచ్చి । నీపెంకెతన మెల్ల జూపినా వచట॥
దూతలను జంపిస్తె దోషంబు వచ్చునని । కనికరించితి నందు గవన మొందితివి॥</poem><noinclude><references/></noinclude>
huprku8kqrg47rhb24by3ubwzgse783
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/207
104
216609
570319
565539
2026-08-15T10:40:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570319
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}కామధేనువు సకలసేనల సంతృప్తుల జేయుట</p>
{{Css image crop
|Image = శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf
|Page = 207
|bSize = 600
|cWidth = 456
|cHeight = 480
|oTop = 129
|oLeft = 70
|Location = center
|Description =
}}
<poem>బలములన్నియు పంచభక్ష్యాన్నములు గుడువ । నఖిలబలములకు నీ డమరియుండుటకు॥
పదినూర్లు యామడబారుగా పందిళ్లు । వినువీథి నంటంగ వేయించుమనెను॥
పల్లవంబులు వింత పరిఢవింపగ జేసి । యెండ గనరాకుండ నెల్లదిక్కులను॥
నింగి ముట్టున పొడవు నిల్పె వెయ్యామడ । కల్పించె పందిరలు కనులపండువుగ॥
బలములన్నిటి నపుడు పంక్తిగా నుండుడని । చాటించె నావేళ జానకీవరుడు॥
జానకీవరుశలవు సంతోషమున బొంది । బంతులే సాగిరి బలములన్నియును॥
అన్నిపంక్తులనడుమ నావేలుపులగిడ్డి । నిలిచి బలముల గాంచి పలికె నిటు లపుడు॥</poem><noinclude><references/></noinclude>
o7cp14x4afbig1lsdu3laiggch8pk9o
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/208
104
216610
570315
565540
2026-08-15T10:09:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570315
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>శ్రీరాఘవేశ్వరునిసేనలారా మీరు । అతిక్షుధాతురు లగుచు అంత యున్నారు॥
మీక్షుధలు తీరంగ విూరు భుజియింపవలె । నిష్టాన్నములు గోరు డింపు మీరగను॥
అని పంక్తిపంక్తులను నావేలుపుల గిడ్డి । కడుప్రీతి రంజిల్ల నడువంగ దొణగె॥
వెలి మొదవ నడువంగ వెంటనే సిద్ధించె । ఘనబలంబుల కెల్ల కామితార్ధములు॥
కోరిన పదార్ధములు కొరత లేకుండంగ । వెలయ బలముల కెల్ల విస్తళ్లు నిండె॥
అనుభవించేవస్తువలు కొరత లేకుండ । గలిగె బలముల కెల్ల కామించినట్లు॥
సంతోషములు వెలయ సకలసేనావళులు । ఆరగింపులు జేసి రానందమునను॥
ఇట్లు సర్వబలంబు లేపార భుజియించి । కరతలంబులు నీళ్ల గడిగిరందరును॥
సురభికర్పూరాదిపరిమళద్రవ్యములు । అఖిలబలముల మేన నలరించె నపుడు॥
అపరంజిమణితొడవు లధికముగ దెప్పించి । బలము లన్నిటి కిచ్చె పరమాత్ము డపుడు॥
సకలబలముల నిట్లు సంతోష మొనరించి । గారవంబులు జేసె కమలనాభుండు॥
సేన లన్నిటికిని సెలవిచ్చె నవ్వేళ । సంతోషభరితుడై శ్రీరాము లపుడు॥
రామచంద్రుం డంత లక్ష్మణుం డాదిగా । తమ్ములు బాంధవులు తగినమంత్రులును॥
పుత్రులు పౌత్రులును పురజనం బేవత్తు । గొలువంగ నగరులోపల బ్రవేశించి॥
పరివారజనములను బంధుకోటుల నెల్ల । పురవీథిలో నిల్పి నరనాయకుండు॥
తనపుత్రపౌతృలును తమ్ములును జానకియు । తనవెంట జనుదేర దశరథాత్మజుడు॥
అంతఃపురంబులో కరిగి కౌసల్యాది । మొదలైనతల్లులకు మ్రొక్కు లొనరించె॥
పతితోను తా మ్రొక్కె భామ సీతాదేవి । వెలదులందరి కపుడు వేడ్క రంజిల్ల॥
తనపుత్రపౌత్రులును తమ్ములును యావత్తు । తనరీతి మ్రొక్కి రాతల్లులందరికి॥
సీతామహాదేవి సేయుమహిమంతయును । తనతల్లులకు జెప్పె దాశరథి యపుడు॥
తల్లులందరు మహాయుల్లాస మందుచును । ముదితలందరు బట్టి ముద్దుగొనియిరిగ॥
ముద్దాడి పలుమారు మోము మోమున జేర్చి । కడుగారవింపుచును కాంత లిట్లనిరి॥</poem><noinclude><references/></noinclude>
kx33y4y3a0hpkrp1zfve91xvfc0lv80
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/209
104
216611
570314
565541
2026-08-15T09:55:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570314
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}అంతఃపురస్త్రీలు సీతను కొనియాడుట</p>
{{Css image crop
|Image = శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf
|Page = 209
|bSize = 600
|cWidth = 514
|cHeight = 474
|oTop = 145
|oLeft = 42
|Location = center
|Description =
}}
<poem>ఓతల్లి జానకీ ఓలోకమాత నీ । వేలాగు శతకంఠు కెదు రొనర్చితివి॥
హనుమంతుభుజములం దమరితివి నీ వెట్లు । బలుచాప మేరీతి బట్టి బూనితిని॥
పటుదురార్భటివృత్తి కెటు నీవు నిల్చితివి । నారిఠాంకృతు లెట్లు బోరు కొల్పితివి॥
దివ్యస్వరూపమున తేజరిల్లితి వెట్లు । కోపానలస్ఫూర్తి గొనియుంటి వెట్లు॥
పలుదివ్యశరవృష్టి బరపితివి ని వెట్లు । సింహధ్వనులు మీరి చెలగితివి యెట్లు॥
ఎట్లు నిల్చితివి నీ వీవిక్రమస్ఫూర్తి । ఆశ్చర్యకరమాయె నఖిలజగములకు॥
సాటివారలు మెత్స శతముఖుని దునుమాడి । వలనొప్ప నీపతికి వన్నె దెచ్చితివి॥</poem><noinclude><references/></noinclude>
25zraviy7p4gudjkwiw9smcm6x0u5i3
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/210
104
216612
570312
565542
2026-08-15T09:49:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
570312
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>మునివరుల కభయ మిచ్చినమాట నీపతికి । దక్కజేసితివి మాతల్లిరో నీవు॥
ఇంతు లెక్కడనైన నేకాలమందైన । దనుజకోటుల దృంప ధరలోను గలరా॥
వెలది దనుజుల దృంప విపరీతవాక్యంబు । గలుగజేసితివి యీకాలమున నీవు॥
నీకీర్తి లోకముల నివ్వటిలియుండుటకు । శతకంధరుని బట్టి సంహరించితివి॥
నీవంటియిల్లాలు నీవంటిగుణశీల । పదినాల్గులోకముల వెదకినాగలర॥
వసుధలో పలుమారు వాడికలు రంజిల్లె । చాలకీర్తులు వెలసె సఖియ నీవలన॥
నీ వాదిశక్తివి నీ వాదిలక్ష్మివి । మూడుమూర్తులజగన్మూలంబు నీవు॥
ఎల్లలోకంబులును యెల్లబ్రహ్మాండములు । నీవల్ల జనియించు నీవల్ల నణగు॥
నిన్ను దెలియగలేక నీమాయ గనలేక । నిన్ను భావించెదము నెలతచందమున॥
మావంశముల కెల్ల పావనంబులు గల్గు । నవతార మెత్తినా వతివ మాతల్లి॥
అని వేయిదెరగుల నాదేవు లందరును । సన్నుతులు జేసి రాజానకీసతిని॥
సీత నచ్చట విడచి శ్రీరామచంద్రుండు । తమ్ములు పుత్రులును తనవెంట గొలువ॥
అఖిలభూసురగణము లాశీర్వదింపంగ | సూతమాగధు లెల్ల స్తుతులు జేయగను॥
మంగళపాఠకసంగీతములు వెలయ । పంచమహావాక్యములు మించి మ్రోయగను॥
అత్యనర్గళసంభ్రమాయత్తచిత్తులై । కనకసింహాసనంబున దేజరిల్లె॥
కరుణాకటాక్షంబు కడుదీనులందున । పరమతాత్పర్యంబు బ్రాహ్మణులయందు॥
శౌర్యంబు కఠినంబు శత్రుకోటులయందు । జెలగ శ్రీరాముండు జగతి పాలించె॥
రశికు లానందింప పసగాడసన్యాసి । యనువాడ నీపాట నెలమి గూర్చితిని॥
వెలయంగ నీపాట విన్నవారల కబ్బు । సంపదలు సౌఖ్యములు సకలభాగ్యములు॥</poem>
{{Css image crop
|Image = శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf
|Page = 210
|bSize = 600
|cWidth = 185
|cHeight = 22
|oTop = 648
|oLeft = 212
|Location = center
|Description =
}}
{{Center|శతకంఠరామాయణము<br>
సంపూర్ణము}}
{{Css image crop
|Image = శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf
|Page = 210
|bSize = 600
|cWidth = 54
|cHeight = 54
|oTop = 767
|oLeft = 282
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
197ofqkolgyz7ur0s8b8tf9sqqb1dl9
సూచిక చర్చ:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu
107
217509
570243
570212
2026-08-14T14:32:12Z
శ్రీరామమూర్తి
1517
570243
wikitext
text/x-wiki
ఈ పుస్తకములో 13, 14, 15, 16 పేజీలు లేవు. గమనించగలరు. --[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 13:15, 2 ఆగస్టు 2026 (UTC)
ఈపుస్తకములో 181, 182, 195, 196, 197, 198, 199, 200 పేజీలు లేవు. గమనించగలరు. --[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 10:27, 14 ఆగస్టు 2026 (UTC)
s56cunchpebqw4iqmhwi7k1hdzknrqd
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/15
104
218011
570307
569237
2026-08-15T08:31:03Z
శ్రీరామమూర్తి
1517
570307
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}1</p>
{{p|fs125}}ప్రేమచేఁ జేసిన శ్రమ వితయాయెనా ?</p>
{{Largeinitial|మి.}}చేంబర్లేను దక్షిణ — ఆఫ్రికాదేశములో మూఁడు కోట్ల యేఁబదిలక్షల పౌనులు కానుకగొని తెల్లవారలయు, వీ లగునేని బోయరులయు ఉల్లముల పల్లవింపఁజేయుటకు వచ్చియుండెను.
ఇటులగుటఁజేసి యితఁడు ఇండియాప్రతినిధులకు శాంతివచనములను ఈరీతిగాఁ జెప్పెను:—
‘తమ్ముఁ దాము పరిపాలించుకొను వలసరాజ్యములపై సామ్రాజ్య ప్రభుత్వమున కుండు నధికారము నామమాత్రమని మీ రెఱిఁగినదేకదా! మీరు చెప్పుకొను కష్టములు సత్య మేయగును. వానిని తొలఁగించుటకు
నాశక్తికొలఁదిని పాటుపడుదును. కాని తెల్లవారిలో నివసింపనెంతురేని మీశక్తికొలఁది వారితో సంధికుదుర్చుకొన వలసియుందురని మీరును మఱవరాదు.'
ఈజవాబుతో ప్రతినిధులయొడలు చల్లఁబడెను. నాకును ఆసలుడిగెను. ఈజవాబు మమ్ము జాగరూకుల నొనరించెను. మరల ఓనమాలకడనుండి ప్రారంభింపవలయునని మాకు తెలిసివచ్చెను. నాతో పనిచేయువారలకు ఈసంగతి యంతయు లెస్సగా తెలిపితిని.
కాని మి. చేంబర్లెనుమాట జూటా యగునా? మాయమాటలు గాక యతఁడు నిక్కమాడెను. 'బడితె యెవరిదో బర్రె-వారిది<ref>'నోరుగలవానిదే రాజ్యము' అని తెలుఁగువారి సామెత. 'మారే తేనీ తలవార్ ' 'ని గుజరాతువారి సామెత. 'జిస్కీ లాఠీ ఉస్కీ భైంస్' అని హిందీ సామెత. అను.</ref> అను నీసామెతను ఇతఁడు మెత్తగా చెప్పెను:<noinclude><references/>
{{c|3}}</noinclude>
9dypsatw5f7iss9hufa1lt4p34i9iu4
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/204
104
218266
570231
2026-08-14T13:05:15Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570231
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>దనియు, ఏసునాధుఁడు మధ్యవర్తియై అడ్డుపడకున్నచో పాపప్రక్షాళనము కాదనియు, పుణ్యకర్మములతో నిసుమంతయు ప్రయోజనము లేదనియు అతఁడు వాదించి నన్ను ఒప్పింప ప్రయత్నించుచుండెను.
అతఁడు నాకు గ్రంథపరిచితి కలిగించినటులే ఏసుభక్తుల పరిచితినిగూడ కలిగించెను. ఈపరిచయసంబంధమున ప్లీమత్ బ్రదరన్ కుటుంబ మొకటి.
ప్లీమత్ బ్రదరన్ అనునది ఒక ఏసుసంప్రదాయము. నాకు కోట్సు గారివలన పరిచితులయినవా రందఱును చదువుకొన్న వారు;పాప భీరువులు. కాని ఈ కుటుంబములో ఒకరు ఇటులు వాదించిరి :
'మా మతసౌందర్యము నీ వెఱుఁగవు. మానవుఁడు తన పాపములకు ఎప్పటికప్పటికి ప్రాయశ్చిత్తము చేసికొనవలయు ననునది నీ వాదము అగుచో జన్మమెల్లను ప్రాయశ్చిత్తములతో సరి. ఎడతెగని ఈక్రియాకాండచే ముక్తి యెటులు కలుగును? నీకెన్నఁటికిని శాంతి రాదు. మన మందఱమును పాపులమని నీవును అందువు. చూడుము, మా కెంతవిశ్వాసము కలదో! మన ప్రయత్నములు వ్యర్థములు గాని ముక్తి కావలయును. ఈపాపభారము నెటులు మోయఁగలము? దానిని ఏసుమీఁదనే పాఱవేయవలయును. అతఁ డొకఁడే పాపరహితుఁడు. అతఁ డొకఁడే భగవానుని కుమారుఁడు. ఎవరు తనను నమ్ముదురో వారి పాపము పటాపంచలయిపోవునని ఆయన వర మొసఁగెను. అది ఈశ్వరుని అగాధ మగు ఉదారత. ఏసు ముక్తి నీయఁ గలఁడని నమ్ముదుమేని పాపములు మన
కంటవు. మనకు పాపము చేయక తప్పదు. ఈ ప్రపంచమున పాపస్పర్శ లేకుండు టెటులు? కావున 'ఏసే రక్షకుఁడు ' అని నమ్మినవానికే పరిపూర్ణశాంతి. కావున శాంతి మీకా, మాకా ?<noinclude><references/>
{{c|188}}</noinclude>
7iirp7u499j1qacdqfpbcfvr76ggf8i
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/205
104
218267
570232
2026-08-14T13:17:42Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570232
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>11 క్రైస్తవులతో పరిచయము</big>}}</noinclude>ఈవాదము నాకు నచ్చ లేదు. వినయముతో నేను ఇటు లంటిని.
'ఏసుమతమువా రందఱును ఇటులే వాదించుచో నే నాయేసు మతమును అంగీకరింపఁజాలను. పాపము లొనర్చి తత్ఫలము నాకు అంటరాదని నే నెన్నఁడును ప్రార్ధింపను. పాపకర్మమునుండి, మఱియు పాపప్రవృత్తినుండి విముక్తుఁడ నగుటకు ప్రయత్నము చేయుదును. అట్టిస్థితి చేకూఱువఱకు అశాంతియే నాకు ప్రియతరము.'
అతఁ డిటులు బదు లాడెను:
'ఇది యంతయు నిష్ప్రయోజనము. మరల నొకసారి నా చెప్పినమాట లాలోచింపుము. '
పాపము! ఆతఁడు చెప్పినంత చేసితీరెను. బుద్ధిపూర్వకముగా అతఁడు పాపము అనుష్ఠించుచుండెను. అంతటితోఁ బోక వానివలన తన కేమియు మనస్సున చింతలేదని నాకు చెప్పెను.
ఇట్టి సిద్ధాంతములు క్రైస్తవులందఱుకు సమ్మతములు కావని వీరిపరిచితికి వెనుక నే నాకు తెలియును. కోట్సు పాపభీరువు. ఈతని హృదయము నిర్మలము. సాధనచే హృదయము శుద్ధమగునని యితని నమ్మిక. ఆవృద్ధకుమారికలకుఁగూడ నిదియే నమ్మిక. నాచదివిన గ్రంథములలో కొన్ని భక్తిపరములు. ప్లీమత్ సోదరప్రసంగమున నాబుద్ధి యెటులు మాఱునో యని కోట్సు గారు భయపడుచుండిరి గాని అట్టిసందియమున కవకాశము లేదనియు, అతని పెడమతముచేత ఏసుమతము యొక్క రూఢార్థముపై నాకు ఈసు కలుగదనియు నచ్చఁ బలికితిని. నాకుఁ గల తపన వేఱు. అది బైబిలునుగుఱించియు, దాని తత్త్వార్థమును గుఱించియు.<noinclude><references/>
{{c|189}}</noinclude>
7me76pncngs8p0jt7esvfkb1rggnphl
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/206
104
218268
570233
2026-08-14T13:27:40Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570233
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}12</p>
{{p|fs125}}భారతీయులతో పరిచితి</p>
{{Largeinitial|క్రై}}స్తవులనుగూర్చి అధికముగా వ్రాయుముందు అప్పటి నా యితరానుభూతులను చెప్పుట ఆవశ్యకము.
నేటాలురాష్ట్రమున దాదా అబ్దుల్లాగా రెట్టివారో ప్రిటోరియాలో సేఠ్ తైయబ్ హాజీ ఖాన్ మహమ్మదుగారు అట్టివారు. అందఱకు ఉపయోగించు ఏధర్మకార్యమైనను అతఁడు లేక నెఱవేఱదు. నేనచటి కేఁగిన మొదటివారముననే వారితో పరిచితి గావించితిని. నేను ఆతనితో ఇటు లంటిని: 'నాకు ప్రిటోరియాలోని భారతీయులందఱతో పరిచయము సంపాదింపవలయునని ఉన్నది. ఇచట హిందువుల ఆనుపానులు నాకు తెలిసికొనవలయునని ఉన్నది. కావున మీరు నాకు సాయము చేయవలయును.' ఇటులు నే ననఁగా నతఁడు అన్నివిధముల సాయము చేయుటకు ఉత్సహించెను.
భారతీయుల నందఱను ఒకచో సమావేశపఱిచి వారి స్థితిగతుల నన్నింటిని వివరించి చెప్పుట ఆవశ్యకమని నాకు తోఁచెను. సేట్హాజిమహమ్మద్ హాజీజుసబ్ అనువారి పేర నాకడ పరిచయలేఖ కలదు. సభ వారిగృహమున, సభ్యులందఱు మేమన్వర్తకులు. హిందువుల సంఖ్య వేళ్ల మీఁద. ప్రిటోరియాలో ఉనికిగల హిందువులు కొలఁదిమంది.
నాజీవితమునం దిది ప్రథమోపన్యాసము. ఆయుపన్యాసమునకు నేను కష్టించితిని. ఉపన్యాసవిషయము సత్యము. వాణిజ్యమున<noinclude><references/>
{{c|190}}</noinclude>
ca1f7p4mcoc4mepaf3ejcvpiym54jmk
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/207
104
218269
570236
2026-08-14T13:38:00Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570236
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>12 భారతీయులతో పరిచితి</big>}}</noinclude>సత్యము నడపుట అసంభవమని కొందఱువర్తకులు పలుమాఱులు నాతో పలికియుండిరి. నేనపుడును దాని విశ్వసింప లేదు; ఇపుడును విశ్వసింప లేదు. 'సత్యమును, బేహారమును ఈరెండును పరస్పరము విరుద్ధములు' అనుచుండు బేహారులు నేఁటికిని గలరు. 'బేహార మనునది వ్యవహారము; సత్యమనునది ధర్మము. కావున వ్యవహారము వేఱు; ధర్మము వేఱు' అని వారి రాద్ధాంతము. వ్యవహారమునందు శుద్ధసత్యము అశక్యము; యథాశక్తి సత్యమాడుట శక్యమని వారి మతము. నేను నా నాయుపన్యాసమున ఈవిషయమునంతయు ప్రత్యాఖ్యానము చేసి బేహారులు రెండింతలు సత్యముగా ఉండవలయునని చూపించితిని. స్వదేశమునకంటె విదేశమున ఎక్కుడు
సత్యనిష్ఠ ఉండవలయును. ఏలన, అచట నుండు ఏకొలఁదిమంది భారతీయులనో చూచి కోటానకోట్ల భారతీయులుగూడ వీరివలెనే యుందురని నిర్ణయ మగును.
నేను తెల్లవారిని ఉదాహరించి నల్లవాం డ్రెంత అశుచిగ నుందురో, ఎంత దుష్ప్రవర్తనము చేయుదురో చాటిచెప్పితిని.
హిందువులు, ముసల్మానులు, పారసీకులు, క్రైస్తవులు, మఱియు గుజరాతీ, మదరాసీ, పంజాబీ, సింధీ, కచ్చీ, సూరతీ ఈమొదలగు భేదములు మఱవుఁడని ఉద్బోధించితిని ఒక సంఘమును స్థాపించి మనవారు పడుచున్న కష్టనిష్ఠురములను అధికారులకు అర్జీలు పెట్టుకొనుఁడనియు, నాకు వీలు ఉన్నంతవఱకు వేతనము కోరకయే పని చేయుదుననియు ముగించితిని.
నా ఉపన్యాసము సభను ఆకట్టెనని గ్రహించితిని.
దానిపై చర్చలు జరిగెను.<noinclude><references/>
{{c|191}}</noinclude>
1ni6d63ge6pcxb89axareiun8b3s2wh
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/208
104
218270
570238
2026-08-14T13:48:36Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570238
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>తమతమకష్టముల నా కెఱిఁగింప కొంద ఱంగీకరించిరి. నాకును ఉత్సాహము కలిగెను. వారిలో ఇంగ్లీషు వచ్చినవారు కొలఁదిమంది. ఆ పరదేశమున ఇంగ్లీషువచ్చినచో లాభకరమని నేను వారికి తెలిపితిని. కావున ఇంగ్లీషు చదువుఁడని కోరితిని. పెద్దవారైనను చదువుకొనవచ్చునని కొందఱ యుదాహరణము చూపితిని.
ఎవరయినను చదువుకొనువా రున్నచో చెప్పుటకు నేను సంసిద్ధుఁడ నంటిని. తమకు వీలయినపుడు నేను తమకడకువచ్చి బోధించుషరతుమీఁద కొందఱు ఇంగ్లీషు చదివికొన నంగీకరించిరి. వీరిలో ఇరువురు ముసల్మానులు. ఒకఁడు మంగలి. ఒకఁడు గుమాస్తా. మూఁడవవాఁడు హిందువు; ఒక చిన్న దుకాణాదారు. నే నందఱకు అనుకూలుఁడనై తిని. బోధకతలో నాకు సందియము లేదు. నాశిష్యులుమాత్రము ఏమఱిరిగాని నేను విసువుకొనలేదు.
నేను వారియిండ్లకు పోవుటయకాని వారి కవకాశము లేకుండెడిది. కాని నే నోరిమిని విడనాడలేదు. ఇంగ్లీషుపండితుల మగుదమని వారి కెవరికిని కోర్కె లేదు. అయినను ఇద్దఱు ఎనిమిదినెలలకు కొంత తేలిరి. కొంచెము ఖాతా వ్రాఁత (Book-keeping) కొంచెము వ్రాఁతకోఁతలు (correspondence) నేర్చిరి. తన ఖాతాదారులతో మాటలాడుటకు శక్తిగలుగుచో చాలునని మంగలి అనుకొనెను. వారిలో ఇద్దఱు ఇంగ్లీషు వచ్చుటవలన ధనార్జనము చేయు సామర్థ్యము గడించిరి.
సభవలన కలిగిన ఈప్రయోజనమునకు నాకు సంతస మయ్యెను. అట్టి సభలు ప్రతివారమో, ప్రతినెలయో చేయ నిశ్చయింపఁబడెను. ఇంచుమించుగా మే మనుకొన్నటులు సభలు జరుగుచుండెడివి. ఈసభలలో ఒకరి ఉద్దేశము లింకొకరు తెలిసికొన వీలు కలుగుచుండెడిది.<noinclude><references/>
{{c|192}}</noinclude>
0epc9t94zkihnzt4y841kz6rzl7ksl5
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/209
104
218271
570239
2026-08-14T14:00:52Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
570239
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>12 భారతీయులతో పరిచితి</big>}}</noinclude>ఈకారణముచే ప్రిటోరియాలో నే నెఱుఁగని భారతీయుఁడు లేఁడు. వారినిగుఱించి నాకు తెలియనివిషయము లేదు. ఈ కారణమున అచట నివసించుచున్న బ్రిటీషు ఏజెంటుతో పరిచితి చేసికొన నెంచితిని; వారిని సందర్శించితిని. ఆయన పేరు జాకోబస్ డి వెట్. హిందువులపై ఆయనకు మంచి అభిప్రాయము. కాని అచట నతనికి తగిన పలుకుబడి లేదు. 'సమయము వచ్చినపుడు సాయపడుదు' నని ఊఱడించి, అక్కఱ కలుగునపుడు ననుఁ జూడర”మ్మని అతఁ డనెను.
రైలువారితో వ్యవహారము జరుప నారంభించితిని. 'మీరు పెట్టుకొనిన ఏర్పాటులను అనుసరించియే హిందువులకు కష్టములుకలుగకుండఁ జూడుఁడని కోరితిని. సరియగు వేషభాష లున్న యెడలనే పెద్దతరగతిటికెట్టు లీయఁబడునని ప్రత్యుత్తరము వచ్చెను. దీనివలన తగినప్రయోజనము సమకూరలేదు. ఏలయనగా వేషభాషలు సరిగానున్న వనుటకును, లేవనుటకును స్టేషన్ మాస్టరుగదా అధికారి!
హిందువులకు సంబంధించిన కొన్నివ్యవహారపత్రములను బ్రిటిష్ ఏజెంటు నాకు చదువనిచ్చెను. ఇట్టివి కొన్ని తైయబ్ సేటుగారుగూడ ఇచ్చిరి. ఆరెంజిఫ్రీస్టేటునుండి భారతీయులు ఎంత నిర్దయముగా వెళ్లఁగొట్టఁబడిరో ఆవిషయ విూకాకితములవలన నాకు తెలియనాయెను.
వేయేల? ట్రాన్సువాలు ఫ్రీస్టేటులలోని భారతీయుల జీవనము సాంఘికము, ఆర్ధికము, రాజకీయము, సమస్తమును తెలిసిపోయెను. వీనిని చదువుటకలన ముందు ఇంత ప్రయోజన<noinclude><references/>
{{c|193}}</noinclude>
f8blugsaz1v1crlevkv1lcz5q1kr585
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/210
104
218272
570240
2026-08-14T14:14:39Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
570240
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}13</p>
{{p|fs125}}కూలితనపు అనుభవము</p>
{{Largeinitial|ట్రా}}న్సువాలు ఆరెంజిఫ్రీస్టేటులలోని భారతీయుల దశను సంపూర్ణముగా చిత్రించుట కిది తావు కాదు. తెలిసికొనఁదలఁచువారు దక్షిణ-ఆఫ్రికా సత్యాగ్రహేతిహాసమును చదువవలెను. కాని దాని రూపరేఖ యిచ్చుట ఇచ్చట నావశ్యకము.
ఆరెంజిఫ్రీస్టేటులందు 1888 సంవత్సరముననో, అంతకుముందో పుట్టిన ఒకశాసనముపలన భారతీయుల, స్వాతంత్ర్యము లన్నియు మాసిపోయెను. ఒక వేళ భారతీయుఁ డెవఁడేని అచట నుండఁదలఁచెనేని హోటళ్లలో సేవకుఁడుగనో, లేక మఱియొక బానిసతన మేదేని అవలంబించియో ఉండితీఱవలెను. నామమాత్రమునకు ముదరాయిచ్చి వర్తకులను తఱిమివైచిరి. వారు అర్జీలు పెట్టుకొనిరి. ప్రార్ధనాపత్రములు పంపుకొనిరి. కాని వారి మాట లెవరు విందురు ?
1885 సంవత్సరమున ఒక కఠినశాసనము పుట్టెను. 1886 సంవత్సరమున అది కొంచెము సంస్కరింపఁబడెను. దీనికి ఫల మేమనఁగా భారతీయులకు ట్రాన్సువాలులో ప్రవేశించుటకు మూఁడు పవునులు
ప్రత్యేకించిన స్థలములలో తప్ప
మన
- పవునులు
-మునకు అదియు 'భూ
లేదు. ఆసియాఖండ
-రికంటె
(<noinclude><references/>
{{c|194}}</noinclude>
ibkb919y3ijdbhp1oglqcb6hrz8zzmu
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/211
104
218273
570242
2026-08-14T14:30:17Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570242
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>14 దావా సిద్ధపఱచుట</big>}}</noinclude>పిన్కట్టుగారు చెప్పిన ఒకమాట నాకు అప్పుడు గుర్తు తగిలెను. దక్షిణ-ఆఫ్రికాలో గొప్ప బారిస్టరును, స్వర్గీయుఁడును అగు లియోనార్డు అనునాయన దీనిని సమర్ధించెను. ‘యథార్థవిషయములే ముప్పాతికలా'—ఇది పిన్కట్టుగారి మాట. అపుడు నాయొద్దనున్న ఒకానొక కేసునందు న్యాయము మాపక్షమైయుండఁగా 'లా' వ్యతిరేకముగ నుండెను.
ఆశలుడిగి నేను లియోనార్డుగారి సాయము కోరితిని. వారికిఁగూడ దావాలోవిషయములన్నియు అనుకూలములనితోఁచెను. కాని అతఁడు-'గాంధీ, నాకొకటి తోఁచుచున్నది. కేసులోనున్న యధార్థవిషయములయెడ
మనము జాగరూకులమై యున్నచో పిదప న్యాయము తనంతఁ దాసమకూరును. ఈకేసులోనున్న విషయముల నన్నింటిని లోఁతుగా చూడవలయును. ఈకేసునంతయు చక్కగా చూచి మరల నాకడకు ర'మ్మనెను. మరల నే నా యంశముల మననముచేయఁగా అది అపూర్వముగా కానిపించెను. అటువంటిదే మఱియొక దక్షిణ-ఆఫ్రికా కేసుగూడ మనసునకు తట్టెను. నే నందులకు సంతసించి ఆ విషయమును లియోనార్డుగారికి తెలియఁజేసితిని. ఆయన యిటు లనెను: 'మన మిపు డీకేసు గెలువఁగలము. బెంచిమీఁది కేజడ్జి వచ్చునో చూడవలయును.'
దాదా అబ్దుల్లాగారి, కేసులో పనిచేయుచున్న పుడు యథార్థ వస్తువుల మహిమ యింత యని తెలియదు. యథార్థవస్తువనఁగా సత్యము. సత్యము మన మెపుడు కైకొందుమో అపుడు న్యాయము తనంత నదియే మన కనుకూలించును.
మా వాదిదావాలో యథార్థవిషయములు బలవత్తరములు కావున 'లా' మావాదిపక్షము అయి తీఱవలయునని తెలిసెను.<noinclude><references/>
{{c|201}}</noinclude>
lcc2ohkzalvux0z27tsmeiuszn15w3d
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/212
104
218274
570252
2026-08-14T18:04:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570252
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>అంతియకాక యీ కేసును ఇటులే జరుగనిచ్చినచో చుట్టములును, ఒక పట్టణముననే నివసించువారును అగు ఈ వాదిప్రతివాదులు నాశన మయిపోవుదురనియు తెలిసెను. దావా తుద కెవరిపక్షమగునో ఎవరికి తెలియదు. కోర్టులలో దీని విడిచి యూరకుండుచో ఇటు లనంతముగా పోవుచునేయుండును. దాన ఇరువాగులవారికిని లాభము లేదు. కావున, వీలగుచో వడిగా తేల్చుకొనుటకు వా రుంకించిరి.
నేను తైయబ్సేటును అనురోధించి రాజీచేసికొమ్మని చెప్పితిని. అందులకు మీవకీలుతో సంప్రతింపుఁ డంటిని. వాదిప్రతివాదు లిరువురు విశ్వాసపాత్రుఁడగు ఒక మధ్యవర్తి చెప్పినటులు వినుకొనినచో, కేసు సులువుగా తేలిపోవునని సూచించితిని. వీరు ఎంతగొప్పవర్తకులయినను వీరి ధనమంతయు శోషించిపోవునంత వడిగా వకీళ్ల ఫీజు పెరుఁగఁ జొచ్చెను. ఈకేసు చూచుచో ఇంకొక పని చూచుకొనుటకు అవకాశము లేదు. కావున వారికి దీనితోనే సరిపోవుచుండెను. ఈనడుమ కాలమున ఒకళ్ల కొకళ్లకు లోలోపల దౌర్మనస్యము పెరుఁగుచుండెను. నాకు వకీలుపని యన్నచో చీ యనిపించెను. ఒకరి నొక రోడించుటకు లాయరులు 'లా' వెదకుట సాజము. పెట్టిన ఖర్చులన్నియు గెలిచినవానికి రావనువిషయము తెలియుట నా కదియ ప్రప్రథమము. ఒకరు మఱియొకరికి ఖర్చు లిచ్చుటకు 'కోర్టుఫీజ్ రిగ్యులేషన్' ప్రకారము ఒకపద్ధతి యున్నది. కాని లాయర్ల కిచ్చు డబ్బు దానికంటె ఎంతయో యెక్కువ. దీనిని నేను సహింపలేకపోతిని. ఈ యిరువురికి రాజీ కుదిర్చి స్నేహము కలిగించుట నాకువిధి అని తలఁచితిని. ఈసంధి కుదుర్చుటలో నాప్రాణములు తోఁడుకొనిపోయెను. తుదకు తైయబ్ సేటుగా రంగీకరించిరి. మధ్యవర్తి యొకఁడు నియమింపఁబడెను. దావా అతనిముందు నడచెను. దాదాఅబ్దుల్లాగారు గెలిచిరి.<noinclude><references/>
{{c|202}}</noinclude>
nbibj7qygwnlecfev7qguopq71efmoq
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/213
104
218275
570253
2026-08-14T18:17:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570253
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>14 దావా సిద్ధపఱచుట</big>}}</noinclude>అయినను నాకు సంతృప్తి కలుగలేదు. మధ్యవర్తి ఫైసలాప్రకారము దాదా అబ్దుల్లాగారు వెంటనే అమలు జరిపినచో తైయబ్హాజీఖాన్ మహమ్మదుగారు అన్ని రూపాయలు ఒక్కసారే తెచ్చి కుమ్మరింపలేరు. దక్షిణ-ఆఫ్రికాలో నివసించుచున్న పోరుబందర్ వర్తకులలో వ్రాయని శాసన మొకటి కలదు. దివాలాకంటె చావు మేలు. తైయబ్సేటుగారు ఒక్క పెట్టున ముప్పదియేడువేల పౌనులును, ఖర్చులును ఈయలేరు. ఆయన పైసలతో బాకీ తీర్పఁదలఁచెను. కాని దివాలా తీసెనను అపదూఱు వినరాదు. ఈదశలో ఒకటే దారి. సొమ్ము
వాయిదాల మీఁద పుచ్చుకొనుటకు దాదా అబ్దుల్లాగా రంగీకరింపవలయును. ఆయనయు ఆసమయమున ఉండఁదగిన ఉదారతతో ఆసొమ్మును దీర్ఘ - వాయిదాల మీఁద పుచ్చుకొనుటకు కావలసినంత అవకాశమిచ్చిరి. ఈయుభయులను రాజీపఱచుటలో పడిన కష్టముకంటె ఈవాయిదాల కొప్పించుటకు పడినకష్ట మెక్కువ అనిపించెను. దీని కిరువురును సంతసించిరి. ఇరువురికి ప్రతిష్ఠ వచ్చెను. నాయానందమునకు మేరయే లేదు. వకీలుపని యననేమో, దాని సత్యస్వరూపమన నేమో నా కపుడు తెలిసెను. నేను మనుజుల గుణమును - మనుజులలోని సత్పక్షమును కనిపట్ట నేర్చికొంటిని. మనుజుల హృదయాంతరాళములోనికి
చొరఁబాఱు టెఱిఁగితిని. వేఱుపడిన వాదిప్రతివాదుల కలుపుటయే వకీలునకు పరమధర్మమని యెఱిఁగితిని. ఈసత్యము మాయక నాలో నెల్లపుడును ఉనికి యేర్పఱచికొనుటచే నేను ప్లీడరీచేసిన ఇరువదియేండ్లలో చాలవఱకు వందలతరబడికేసులు కోర్టు కెక్కకుండఁగనే పరిష్కరింపఁ గలిగితిని. దాన నా కేమియు కస్తి కలుగలేదు; ధనమును గోల్పోవలేదు; ఆత్మనా, దానికన్న లేదు.<noinclude><references/>
{{c|203}}</noinclude>
m0jodveh1h46nj7hgmgv6n9coj9djc7
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/214
104
218276
570255
2026-08-14T21:36:27Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570255
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>̺{{p|fs150|ac}}15</p>
{{p|fs125}}మథన</p>
{{Largeinitial|క్రై}}స్తవమిత్రులవలన నాకుఁ గలిగిన అనుభవములకేసి మరలుట కిది యదను.
బేకరుగారు నా భవిష్యత్తునుగుఱించి ఆతురపడుచుండిరి. అతఁడు నన్ను వెల్లింగుటన్ పత్తనమున జరిగిన సభకు తీసికొని వెళ్లెను. ప్రొటెస్టెంటు తెగవారు ధర్మప్రబోధమునకు, అనఁగా ఆత్మపరిశుద్ధికి-కొన్ని కొన్ని యేండ్లలో అట్టిసమ్మేళనములను ఏర్పాటుచేయుచుండిరి. ఇవి ధర్మముయొక్క పునఃప్రతిష్ఠకు, లేక ధర్మముయొక్క పునరుద్ధారణకు ఉద్దిష్టమయినవి. వెల్లింగ్ టనులో జరిగిన సమ్మేళన మిట్టిది. దానికి
ఆధ్యక్షుఁడు రివరెండు ఆండ్యూముర్రే. ఆయన ఆపత్తనమున ప్రధాన మతాచార్యుఁడు; ప్రఖ్యాతుఁడు. ఈసమ్మేళనమున కలుగు మతప్రబోధమును,అచటికి వచ్చినవారి మతోత్సాహమును, దాని పవిత్రతయు చూచినచో, నేను ఏసు మతమున కలియకమాననని బేకరుగారి తలఁపు.
కాని బేకరుగారికి ప్రార్ధనాబలమే చరమబలము. ప్రార్థనపై ఆయనకు అతివిశ్వాసము. అంతఃకరణపూర్వకముగా చేయుఁబడిన ప్రార్థనను తప్పక ఈశ్వరుఁడు వినునని ఆయన నమ్మకము. ఐహికములు కూడ ప్రార్థనచే సిద్ధించి తీరునని నమ్మిన బ్రిస్టల్ నివాసియగు జార్జిముల్లరువంటివారిని పలువుర నతఁడు ప్రమాణముగా ఉదాహరించును. ప్రార్థనామహిమను నేను తటస్థభావముతో 'వింటిని. అంతరాత్మ చెప్పినచో జగతిలోనుండు నేశక్తియు ఏసుమతమున కలియకుండ<noinclude><references/>
{{204}}</noinclude>
jzini7hizx6jv4uebzwygnepgb7667j
570259
570255
2026-08-14T22:32:41Z
శ్రీరామమూర్తి
1517
570259
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>̺{{p|fs150|ac}}15</p>
{{p|fs125}}మథన</p>
{{Largeinitial|క్రై}}స్తవమిత్రులవలన నాకుఁ గలిగిన అనుభవములకేసి మరలుట కిది యదను.
బేకరుగారు నా భవిష్యత్తునుగుఱించి ఆతురపడుచుండిరి. అతఁడు నన్ను వెల్లింగుటన్ పత్తనమున జరిగిన సభకు తీసికొని వెళ్లెను. ప్రొటెస్టెంటు తెగవారు ధర్మప్రబోధమునకు, అనఁగా ఆత్మపరిశుద్ధికి-కొన్ని కొన్ని యేండ్లలో అట్టిసమ్మేళనములను ఏర్పాటుచేయుచుండిరి. ఇవి ధర్మముయొక్క పునఃప్రతిష్ఠకు, లేక ధర్మముయొక్క పునరుద్ధారణకు ఉద్దిష్టమయినవి. వెల్లింగ్ టనులో జరిగిన సమ్మేళన మిట్టిది. దానికి
ఆధ్యక్షుఁడు రివరెండు ఆండ్యూముర్రే. ఆయన ఆపత్తనమున ప్రధాన మతాచార్యుఁడు; ప్రఖ్యాతుఁడు. ఈసమ్మేళనమున కలుగు మతప్రబోధమును,అచటికి వచ్చినవారి మతోత్సాహమును, దాని పవిత్రతయు చూచినచో, నేను ఏసు మతమున కలియకమాననని బేకరుగారి తలఁపు.
కాని బేకరుగారికి ప్రార్ధనాబలమే చరమబలము. ప్రార్థనపై ఆయనకు అతివిశ్వాసము. అంతఃకరణపూర్వకముగా చేయుఁబడిన ప్రార్థనను తప్పక ఈశ్వరుఁడు వినునని ఆయన నమ్మకము. ఐహికములు కూడ ప్రార్థనచే సిద్ధించి తీరునని నమ్మిన బ్రిస్టల్ నివాసియగు జార్జిముల్లరువంటివారిని పలువుర నతఁడు ప్రమాణముగా ఉదాహరించును. ప్రార్థనామహిమను నేను తటస్థభావముతో 'వింటిని. అంతరాత్మ చెప్పినచో జగతిలోనుండు నేశక్తియు ఏసుమతమున కలియకుండ<noinclude><references/>
{{c|204}}</noinclude>
hwn3r5z08iuo51uocdc4mzatpq33k04
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/215
104
218277
570263
2026-08-14T22:43:36Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570263
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>15 మథన</big>}}</noinclude>న న్నాఁపలేదని బేకరుగారితో చెప్పితిని. ఇటులు వాగ్దానము చేయుటకు నే నెంతమాత్రమును సంశయింపలేదు. ఏలయన, అప్పటి కప్పుడే నా యంతరాత్మ చెప్పినరీతి నడుచుట నా కలవాటైనది. అంతరాత్మ చెప్పినరీతి నడుచుట నా కానందము. విపరీతాచరణము కష్ట జననము, దుఃఖప్రదమును.
పిదప మేము వెల్లింగ్టన్ పత్తనమునకు పోతిమి. నా వంటి నల్లవానిని బాసటగ నుంచుకొనుటవలన బేకరుగారు చాల కష్టముల పాలైరి. కేవలము నావలననే దారిలో ఆయన కొన్నియో ఇబ్బందులు కలిగెను. నడుమ ఆదివారము తగులుటచే మా పయనము ఆఁగవలసి వచ్చెను. బేకరుగారును, వారి ముఠాయు ఆదివారముల పయనింపరు. మే మాఁగిన స్టేషనులోని హొటెలుయజమాని చాల వాదప్రతివాదములు జరిగిన పిదప నాకు అన్న మిడుట కంగీకరించెను. కాని అన్నశాలలో నాకుఅన్నమిడనించుకయు నియ్యకొనలేదు. బేకరుగారో,సామాన్యముగా లోఁబడువారు కారు. హొటెలుకువచ్చు అతిథులహక్కులఁగూర్చి ఆయనను నిలువఁదీయఁదొడఁగిరి. బేకరుగారికిఁగల కష్టము నే నెఱుఁగుదును. వెల్లింగ్టన్ పట్టణమునఁగూడ నేను బేకరుగారితోడనే ఉంటిని. నా వలన తానుపడుచున్న కడగండ్లను నాకుఁ దెలియకుండఁ జేయుటకై ఆయన పలుపాట్లు పడుచుండెను. కాని నా కన్నియు తెలియుచునే యుండెను.
ఈ సభయందలి క్రైస్తవు లందఱును చాల శ్రద్ధాళువులు. వారి భక్తి నా కానందము కలిగించెను. నేను రివరెండు ముర్రేగారి దర్శనము చేసితిని. అచట చాలమంది నాకుఁగాను భగవంతుని ప్రార్థించుచుండుట
చూచితిని. వారి భజనకీర్తనలు కొన్ని అతిమధురములు.<noinclude><references/>
{{c|2}}</noinclude>
r2b7xwh7ne1rwvjglsao6td40bno2xq
570264
570263
2026-08-14T22:44:00Z
శ్రీరామమూర్తి
1517
570264
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>15 మథన</big>}}</noinclude>న న్నాఁపలేదని బేకరుగారితో చెప్పితిని. ఇటులు వాగ్దానము చేయుటకు నే నెంతమాత్రమును సంశయింపలేదు. ఏలయన, అప్పటి కప్పుడే నా యంతరాత్మ చెప్పినరీతి నడుచుట నా కలవాటైనది. అంతరాత్మ చెప్పినరీతి నడుచుట నా కానందము. విపరీతాచరణము కష్ట జననము, దుఃఖప్రదమును.
పిదప మేము వెల్లింగ్టన్ పత్తనమునకు పోతిమి. నా వంటి నల్లవానిని బాసటగ నుంచుకొనుటవలన బేకరుగారు చాల కష్టముల పాలైరి. కేవలము నావలననే దారిలో ఆయన కొన్నియో ఇబ్బందులు కలిగెను. నడుమ ఆదివారము తగులుటచే మా పయనము ఆఁగవలసి వచ్చెను. బేకరుగారును, వారి ముఠాయు ఆదివారముల పయనింపరు. మే మాఁగిన స్టేషనులోని హొటెలుయజమాని చాల వాదప్రతివాదములు జరిగిన పిదప నాకు అన్న మిడుట కంగీకరించెను. కాని అన్నశాలలో నాకుఅన్నమిడనించుకయు నియ్యకొనలేదు. బేకరుగారో,సామాన్యముగా లోఁబడువారు కారు. హొటెలుకువచ్చు అతిథులహక్కులఁగూర్చి ఆయనను నిలువఁదీయఁదొడఁగిరి. బేకరుగారికిఁగల కష్టము నే నెఱుఁగుదును. వెల్లింగ్టన్ పట్టణమునఁగూడ నేను బేకరుగారితోడనే ఉంటిని. నా వలన తానుపడుచున్న కడగండ్లను నాకుఁ దెలియకుండఁ జేయుటకై ఆయన పలుపాట్లు పడుచుండెను. కాని నా కన్నియు తెలియుచునే యుండెను.
ఈ సభయందలి క్రైస్తవు లందఱును చాల శ్రద్ధాళువులు. వారి భక్తి నా కానందము కలిగించెను. నేను రివరెండు ముర్రేగారి దర్శనము చేసితిని. అచట చాలమంది నాకుఁగాను భగవంతుని ప్రార్థించుచుండుట
చూచితిని. వారి భజనకీర్తనలు కొన్ని అతిమధురములు.<noinclude><references/>
{{c|205}}</noinclude>
40yegal81wy1uou2pgnidjocyjabog1
పుట:Nava Katha Manjari.djvu/11
104
218278
570265
2026-08-14T22:50:43Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గల వానివలననే మనయాంధ్రజాతి శాపతప్త మయ్యె నను నంశమే యీకథలోని ముఖ్యాంశము. ఆంధ్రు లార్యర్షుల యాశ్రమప్రాంతముల నుండు ననార్యు లనియు, వారు 'పుళింద, శబ ’ రాదులతో నుండు నొకతెగవారని...'
570265
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />{{c|iii}}</noinclude>గల వానివలననే మనయాంధ్రజాతి శాపతప్త మయ్యె నను నంశమే యీకథలోని ముఖ్యాంశము. ఆంధ్రు లార్యర్షుల యాశ్రమప్రాంతముల నుండు ననార్యు లనియు, వారు 'పుళింద, శబ ’ రాదులతో నుండు నొకతెగవారనియుఁ, గాలాంతరమున వా రధికులై మహా సామ్రాజ్యమును నిర్మించిరనియుఁ గొందఱును, ఆంధ్రు లార్యేతరులు కారు- ఆర్యులే; వా రార్యావర్తమున, గంగా యమునా నదీ ప్రాంతములనుండి యెపుడో యేదరినో దక్షిణహిందూ దేశమునకు వచ్చి రాజ్యస్థాపన మొనర్చిరని మఱికొందఱును, ఆంధ్రు లార్యులేకాని, వారిప్రాచీనస్థానము కృష్ణా, గోదావరీనదీ మధ్యభాగమే యనియు, నచటనుండి మహారాష్ట్ర, ఘూర్జరాది దేశములను జయంచి యేలిరని వేఱు కొందఱును, వాదోపవాదము లొనర్చుచు, ఖండన మండనములఁ జేయుచున్నారు. ఆంధ్రులఁ గూర్చి చెప్పినప్రాచీనగ్రంథము ' ఐతరేయబ్రాహ్మణము ’ పిమ్మ టివిపురాణశాసనాదులును. కాన నాదిదగు నైతరేయబ్రాహ్మణ మేమి చెప్పుచున్నదో పరిశీలించము.
<ref>తస్యహ విశ్వామిత్రస్యైకశతంపుతా అనుఁ పంచాక
దేవ జ్యాయాం సోమనుఛందసః పంచాళత్క నీయాంస
స్తద్యే జ్యాయాంసో నతే కులం మేనిరే. తానను వ్యాజహా
రాంతా స్వః ప్రజా భక్షిష్టేతి.
తఏ' తేంద్రః పుండా శబరా పుళిందా' మూతిబా ఇక్యుదం
త్యా బహవోభవంతి. వైశ్వామిత్రాదస్యూనాం భూయిష్టాః॥
ఐతేరేయబ్రాహ్మణ 7-8-18.</ref>"ఆవిశ్వామిత్రునకు నూర్గురుపుత్రులుండిరి. వారిలో 'మధుఛందుని' కంటెఁ బెద్దవా రేఁబదిమందియుఁ, జిన్నవా<noinclude>{{rule}}
<references/></noinclude>
2qztdcq5cbes8etyax4dlpstl5vps08
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/216
104
218279
570266
2026-08-14T22:54:09Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570266
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>వెల్లింగ్టన్ సభ మూణ్ణాళ్లు. అచటికి వచ్చినవారి విశ్వాసము నాకు బాగుగా నుండెను. కాని తావన్మాత్రమున నా మతమును, నా విశ్వాసమును ఏల పరిత్యజింపవలెను ? స్వర్గముగాని, ముక్తిగాని ఏసుమతమునఁ గలియనిచో రాదని నమ్ముట నాకు కాని పని. క్రైస్తవ మిత్రులతో నే నిటులు తెలుపఁగా వారి మనస్సు లెగిరిపోయెను. కాని నే నేమి చేయఁగలను ?
నా కష్టము లింకను గహనము లాయెను. జీససు ఫరమేశ్వరుని ఏకపుత్రుఁడనుటయు, వారిని నమ్మినవారికే అమృతత్వము కలుగు ననుటయు నానమ్మికను దాఁటిన మాటలు. పరమేశ్వరునకు పుత్రులే ఉండునెడల మనమందఱమును ఆయన పుత్రులమే. జీససు భగవత్సముఁడుగాని, లేక సాక్షాత్తు భగవంతుఁడు గాని యగుచో, మానవులందఱును భగవత్సములు, లేక భగవంతులు. జీససు తన మృతిచేతనే, మఱియు తన
రక్తముచేతనే జగత్తునందలి పాపముల కడిగివైచు నను వాక్యవాచ్యార్థము నమ్ముటకు నాబుద్ధి యెటులును సిద్ధము కాలేదు. వ్యంగ్యార్థము కొంత సత్యము కావచ్చును. క్రైస్తవమతానుసారము మనుష్యునకే ఆత్మ కలదు. జంతువులు మొదలగు ఇతరములకు ఆత్మ లేదు. వానికి చావుతో సరి. ఇది నాకు విపరీతమతము.
జీససు త్యాగి, మహాత్ముఁడు, మహాగురువు అని అంగీకరింతును. కాని అతఁ డొక అద్వితీయపురుషుఁడు కాఁడు. సిలువపై నతని మృతి జగత్తునకు ఒక మహాదృష్టాంతము. కాని, ఇతని మృతియందు రహస్యమును, చమత్కారమును అగు ఒకానొక ప్రభావ మున్నదని నాహృదయము సమ్మతింపఁజాలకుండెను. ఇతరు లీయఁజాలని ఏ మహాప్రసాదమును క్రైస్తవుల పవిత్రజీవితములు నా కీయలేదు. ఇతరధర్మము<noinclude><references/>
{{c|206}}</noinclude>
0y76nfd4hqkjsise7npj3hnayxdiyy7
పుట:Nava Katha Manjari.djvu/12
104
218280
570267
2026-08-14T22:59:27Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రేఁబది మందియునై రి. అందులోఁ బెద్దవారగు నేఁబదిమందియు క్షేమమును బొందరైరి. (శునశ్శేపుని జ్యేష్టునిగా నంగీకరించి దాయభాగమిచ్చుట క్లిష్టపడనందున) అట్లు కుశలము నొందని 'ఆంధ్రు'ల...'
570267
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />{{c|iv}}</noinclude>రేఁబది మందియునై రి. అందులోఁ బెద్దవారగు నేఁబదిమందియు క్షేమమును బొందరైరి. (శునశ్శేపుని జ్యేష్టునిగా నంగీకరించి దాయభాగమిచ్చుట క్లిష్టపడనందున) అట్లు కుశలము నొందని 'ఆంధ్రు'లు, పుండ్రులు, శబరులు, పుళిందులు, మూతిబులు' నను నైదు తెగలవారిని గూర్చి విశ్వామిత్రుఁడు మీరు ప్రజాభక్షకులగుదురుగాక” అని శపించెను. ఆట్లు శప్తులగువారు దస్యులలోఁ బెక్కండ్రైరి.
(మధుఛందునికంటెఁ జిన్నవారగు అష్టక, రేణుక, ఋషభ' అను సంఘములలోని నేఁబదిమందియు, శుభసుఖముల నొందిరని 'యైతరేయ బ్రాహ్మణము'లో నీవాక్యముకంటెఁ బూర్వవాక్యమున నే జెప్పఁబడెను) ఈకథయే వాల్మీకిరామాయణమున నిట్లు స్వల్పభే
దముతో నుడువఁబడెను.
విశ్వామిత్రుడు తాను దపమాచరించు 'శరావతీ' నదికి దక్షిణ ప్రదేశము నందు ’త్రిశంకునకు' సశరీరస్వర్గమిప్పింప యత్నించి యది నెఱవేఱక విఘ్నము నొందగా విచారించి యా ప్రదేశమును
విడిచి పశ్చిమాభిముఖుడై 'పుష్కర' తీర్థముఁ జేరి యటఁ దపమొనర్చుచుండెను.
<ref>అంబరీషునకు 'హరిశ్చంద్ర'' నామము కూడ నుండునని రామాయణవ్యాఖ్యాత వ్రాసెను. ఈకథ శ్రీమద్రామాయణము బాల కాండమున 60 సర్గలో ఁగలదు.</ref>ఆకాలముననే యయోధ్యాధిపతియగు 'అంబరీషుఁడు' యజ్ఞమొనర్చుచుండఁగ నాతని యాగపశువు నింద్రుఁ డపహరింప<noinclude>{{rule}}
<references/></noinclude>
3c36woj5sltwdrh9s021fq52qqt1a6g
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/217
104
218281
570268
2026-08-14T23:03:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570268
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>15 మథన</big>}}</noinclude>లందును క్రైస్తవసంస్కారమును చూచితిని. సిద్ధాంతదృష్టిలో ఏసుసిద్ధాంతములందు అలౌకికత నాకు కానరాలేదు. త్యాగమునందును హిందువులు క్రైస్తవుల నెన్ని రెట్లో మించిపోదురని తోఁచెను. క్రైస్తవమతము సంపూర్ణ మనిగాని, ప్రపంచమునందలి మతము లన్నిటిలో శ్రేష్ఠ మనిగాని నమ్ముట నా కసంభవ మాయెను.
సమయము దొరకినపుడెల్ల క్రైస్తవమిత్రులకు నా యీమథనను చెప్పుకొనుచుంటిని. కాని వారి ప్రత్యుత్తరములు నాకు సంతోషజనకములు కాలేదు.
ఈవిధముగా క్రైస్తవమతము సంపూర్ణ మనియు, అన్నిటికంటె శ్రేష్ఠమనియు నే నొప్పుకొనఁజాలకున్నను హిందూమతమైనను అట్టిదని నిశ్చయింపఁజాలకపోతినీ. హిందూమతమునందలి దోషములు నా కన్నుల వ్రేలుచుండెను. అస్పృశ్యత హిందూమతమున కొక యంగమనినచో అదియొక జీర్ణాంగమైనఁ గావలయు, లేదా అధునాతనమగు దురాచారమైనఁ గావలయు. ఇన్ని వర్ణములు, ఇన్ని శాఖలు, ఇవియేమో నా కర్ధము కాలేదు. వేదములు అపౌరుషేయము లనుట కర్థమేమి? అవి అపౌరుషేయములయిన బైబిలును, కొరానులు అపౌరుషేయములు కావా?
క్రైస్తవమిత్రులు నన్ను ఏసుమతమునఁ గలుపుటకు ప్రయత్నించినట్లే మహమ్మదీయులును తమ మతమునఁ గలుపఁ బ్రయత్నించిరి. అబ్దుల్లాస్టేటుగారు మాటిమాటికి నన్నిస్లాముమతగ్రంథములను జదువ నొక్కి చెప్పుచుండిరి. ఆయన యెల్లపుడును దాని సొగసును గూర్చి చెప్పుచుండుట మామూలు.<noinclude><references/>
{{c|207}}</noinclude>
8vv1mah7yervag34wxfjojuksmnefvi
పుట:Nava Katha Manjari.djvu/13
104
218282
570269
2026-08-14T23:07:44Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రాజు పురోహితోపదేశముచే, నరపశువుకై యత్నించి 'శునశ్శేపుఁడు' అనువానిని గొనితెచ్చుచు మార్గమధ్యమునం దుండిన విశ్వామిత్రాశ్రమమునందు విశ్రాంతి పొందుచుండఁగా, శునశ్శేపుఁడు విశ్...'
570269
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />{{c|v}}</noinclude>రాజు పురోహితోపదేశముచే, నరపశువుకై యత్నించి 'శునశ్శేపుఁడు' అనువానిని గొనితెచ్చుచు మార్గమధ్యమునం దుండిన విశ్వామిత్రాశ్రమమునందు విశ్రాంతి పొందుచుండఁగా, శునశ్శేపుఁడు విశ్వామిత్రునిం జేరి, తనవృత్తాంతముఁ జెప్పిఁ నన్ను రక్షింపు మనెను. విశ్వామిత్రుఁడు శునశ్శేపుని రక్షింతునని మధుఛందాదులగు తనపుత్రులలో నొకని శునశ్శేపునకుఁ గాను, నంబరీషునియజ్ఞము
నకుఁ బశువుగాఁ బొం డన. వా రామాటలకు రోసి, “శ్వమాంసము" దినుటవంటి మాటను జెప్పితివి. దీని నెట్లు చేయఁగల మన, నామాట కెదు రాడితిరిగాన మీరు కుక్క మాంసమునే దినుచు వేయివత్సరములు ప్రవర్తింతురుగాక! యని శపించెను. శునశ్శేపునకు రెండుమంత్రముల నుపదేశించి వీనిని బఠించితివేని దేవతలు నిన్ను 'యూపస్తంభమునుండి విడిపింపఁగల రని చెప్పి
పంపెను.
పై గాథాంశములఁ బరిశీలింపఁగా విశ్వామిత్రుఁడు తనపుత్రులగు నూర్వురను 'పుష్కర తీర్థమునఁ దపం బొనరించు కాలమున శపించెనని స్పష్టమగును. కాన, నాంధ్రుల యాదిమస్థలము పుష్కర తీర్థమే. వేదవాక్యమువలన నాంధ్రాదు లేఁబదిమందియే శప్తులై రని కలదు కాని, రామాయణగాథవలన వైశ్వామిత్రులు నూర్వురు, వేయివత్సరములే శాపబాధ నొందువారుగా శపింపఁబడి రని కలదు. ఇది నిజమైయుండును కారణ మేమనఁగా నెట్టిశాపమునకైనను నేనాఁటికైనను శాపవిముక్తి కలుగుట, శపించినవా రనుగ్రహించుటచేతనొ, శప్తవ్యక్తి యొక్క తపశ్చరణాదులచేతనొ కలుగుటసర్వ సాధారణము.<noinclude><references/></noinclude>
luh7fwkzapa69ou62l9wtbi9x1uj3j9
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/218
104
218283
570270
2026-08-14T23:14:09Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
570270
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>కవి రాయచందు భాయిగారికి నాకలవర మంతయు ఒక ఉత్తరములో వ్రాసితిని. భారతదేశములోని ఇతరవిద్వాంసులకుఁగూడ ఉత్తరములు వ్రాసితిని. ప్రత్యుత్తరములు అందుకొంటిని. రాయచందుభాయిగారి ఉత్తరమువలన నాకు కొంత సంతృప్తి కలిగెను. 'ఓర్పుతో హిందూమతమును ఇంకను లోఁతుగా ఆరయు'మని అతఁడు వ్రాసెను. మఱియు, 'పక్షపాతము విడుచుచో హిందూమతసిద్ధాంతముల సూక్ష్మతయు, అగాధతయు, ఆత్మవివేకమును, దయయు, ధర్మనిర్ణయమును ఇతరమతములలో కానరా' వని వ్రాసెను.
సేలుగారి కొరానుఅనువాదమును కొని చదువఁదొడఁగితిని. మఱికొన్ని ఇస్లాముగ్రంథములఁగూడ సంపాదించితిని. ఇంగ్లాండులోని క్రైస్తవమిత్రులకు ఉత్తరములు వ్రాయ మొదలిడితిని. ఆమిమిత్రులలో ఒకరు నాకు ఎడ్వర్డు మెయిట్లండుగారితో పరిచయము కలిగించిరి. అతనితో ఉత్తరప్రత్యుత్తరము లారంభమాయెను. అన్నా కింగ్స్ఫోర్డుగారును, తానును కలిసి రచించిన 'ది పర్ఫెక్ట్వే' అను గ్రంథమాయన నా కంపెను. ఇపుడు ప్రచారమునందున్న క్రైస్తవమతముయొక్కఖండన మాగ్రంథమునఁ గలదు. మెయిట్లండుగారు 'ది న్యూ ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ బైబిల్' అను మఱియొక గ్రంథముగూడఁ బంపిరి. ఈగ్రంథములు హిందూమతము ననుసరించునటులు ఉండెను. టాల్స్టాయిగారి 'ది కింగ్ డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు' అనుగ్రంథము నన్ను ముగ్ధునిఁజేసెను. ఆగ్రంథము నా మానసమున అంకితమై పోయెను. అందలి స్వతంత్రవిచారశైలిని, ప్రౌఢనీతిని, శుద్ధసత్యమును బట్టి చూడఁగా, ఆగ్రంధముముందు కోట్సుగా రొసంగిన గ్రంథములన్నియు శుష్క-దండుగ.<noinclude><references/>
{{c|208}}</noinclude>
548fsyzsy3u9e1jzlnguafcvfq9ujyg
సూచిక:Shringara Kadambari Of Narasimha Shastri 1926.djvu
106
218284
570279
2026-08-15T04:19:16Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with ''
570279
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=శృంగార కాదంబరి
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:చింతలపల్లి నరసింహ శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=1928
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=djvu
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
22xbvg2gdd096ac628cyzarnllu8n70
పుట:రసాభరణము.pdf/11
104
218285
570280
2026-08-15T05:05:01Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center| {{p|fs150}}విషయసూచిక</p> }} {{rule|4em}} {{dotted TOC page listing| |{{sc|[[రసాభరణము/ఉపోద్ఘాతము|ఉపోద్ఘాతము]]}} |{{DJVU page link|1|4}} }} {{c|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}} {{dotted TOC page listing| |{{sc|రసాభరణము/ప్రథమాశ్వాసము|ఇష్టదే...'
570280
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{rule|4em}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/ఉపోద్ఘాతము|ఉపోద్ఘాతము]]}}
|{{DJVU page link|1|4}}
}}
{{c|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|ఇష్టదేవతాస్తుతి]]}}
|{{DJVU page link|1|84}}
}}<noinclude><references/></noinclude>
746bcn6yb3qqyfivewyxc5927m3pgbo
570281
570280
2026-08-15T05:06:26Z
Rajasekhar1961
50
570281
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{rule|4em}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/భూమిక|భూమిక]]}}
|{{DJVU page link|1|4}}
}}
{{c|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|ఇష్టదేవతాస్తుతి]]}}
|{{DJVU page link|1|84}}
}}<noinclude><references/></noinclude>
flz7nuq0o664j4nwhjmbm262uvuk5s8
570282
570281
2026-08-15T05:08:06Z
Rajasekhar1961
50
570282
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{rule|4em}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/భూమిక|భూమిక]]}}
|{{DJVU page link|1|4}}
}}
{{c|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|నవరసములు]]}}
|{{DJVU page link|1|84}}
}}
{{c|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/ద్వితీయాశ్వాసము|నవరసములు]]}}
|{{DJVU page link|1|84}}
}}<noinclude><references/></noinclude>
olbp7tgogz4f22jt65r9e3qe4c0pjkd
570283
570282
2026-08-15T05:09:29Z
Rajasekhar1961
50
570283
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{rule|4em}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/భూమిక|భూమిక]]}}
|{{DJVU page link|1|4}}
}}
{{c|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/ప్రథమాశ్వాసము|నవరసములు]]}}
|{{DJVU page link|1|84}}
}}
{{c|[[రసాభరణము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/ద్వితీయాశ్వాసము|శృంగారభక్తివాత్సల్యంబులు]]}}
|{{DJVU page link|1|84}}
}}<noinclude><references/></noinclude>
q4j26gq0jyfeb5pelsnrm061p9v06ai
పుట:రసాభరణము.pdf/12
104
218286
570284
2026-08-15T05:10:37Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' {{c|[[రసాభరణము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}} {{dotted TOC page listing| |{{sc|[[రసాభరణము/తృతీయాశ్వాసము|అభిలాషాదులు]]}} |{{DJVU page link|1|84}} }}'
570284
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>
{{c|[[రసాభరణము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/తృతీయాశ్వాసము|అభిలాషాదులు]]}}
|{{DJVU page link|1|84}}
}}<noinclude><references/></noinclude>
m3510x5qi9z2oh34s26yd19ddpvvr9m
పుట:రసాభరణము.pdf/13
104
218287
570285
2026-08-15T05:11:49Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' {{c|[[రసాభరణము/చతుర్థాశ్వాసము|చతుర్థాశ్వాసము]]}} {{dotted TOC page listing| |{{sc|[[రసాభరణము/చతుర్థాశ్వాసము|సాధారణనాయకులు]]}} |{{DJVU page link|30|84}} }}'
570285
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>
{{c|[[రసాభరణము/చతుర్థాశ్వాసము|చతుర్థాశ్వాసము]]}}
{{dotted TOC page listing|
|{{sc|[[రసాభరణము/చతుర్థాశ్వాసము|సాధారణనాయకులు]]}}
|{{DJVU page link|30|84}}
}}<noinclude><references/></noinclude>
rhej40yt9l5xqn03hfplch511v467ot
సూచిక:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf
106
218288
570292
2026-08-15T07:25:56Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with ''
570292
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=గర్గ భాగవతం
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:చివుకుల అప్పయ్య శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
o6bzh7uhpqmv28hncup2k2vcm3rb9kj
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/4
104
218289
570294
2026-08-15T07:32:25Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
570294
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/5
104
218290
570295
2026-08-15T07:32:36Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
570295
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/16
104
218291
570296
2026-08-15T07:37:40Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నేనుః ఉపోద్ఘాతము నూతనజలధరరుచయే గోపవధూటీదు కూలచోరాయ తస్మై కృష్ణాయ నమస్సంసార మహీరుహస్య బీజాయః గుణ గ్రహణచణులారా! ధర్మము శ్రేయస్సాధనమనియు, నధర్మంబు...'
570296
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నేనుః
ఉపోద్ఘాతము
నూతనజలధరరుచయే గోపవధూటీదు
కూలచోరాయ
తస్మై కృష్ణాయ నమస్సంసార మహీరుహస్య బీజాయః
గుణ గ్రహణచణులారా!
ధర్మము శ్రేయస్సాధనమనియు, నధర్మంబు తద్భిన్న హేతువనియు దూకుఁ
చెలియనిది కాదు. మంచిపని ధర్మంబనియుఁ జెడ్డపని యధర్మంబనియు నెఱుంగఁ
బడుచున్నది. ఈ ధ
ఈ ధర్మాధర్మంబులను నిర్ణయించుటకు శ్రుతిస్మృతిపురా ణేతిహాసంబులు ప్రబలప్రమాణంబులు, శ్రుతులపౌరుషేయంబులనియు, వానియభిప్రాయంబులను మాత్రము వ్య క్తీకరించి త్రికాలజ్ఞులును నిగ్రహానుగ్రహసమర్ధులు నగు మహర్షులచే నాయా యుగంబుల కనుగుణంబుగా వ్రాయఁబడినవి స్మృతు
లనియు ద్విజులకుమాత్రం బివి పాఠ్యంబులనియు, వానియాశయంబులు సులభగ్రాహ్యంబగునట్లు మహానుభావుల చరిత్రంబుల నుపబలంబుగాఁ జూపుచురచింపఁ
బడినవి పురాణేతిహాసంబులనియు, నివి స్త్రీశూద్రాదులకుఁ బార్యంబులగుననియు ఇవి యొకటి తరువాత నొకటి ప్రమాణంబగుననియుఁ దెలియనగును. ఇవి విధించిన విధులను మానవు లేమాత్రమును మీఱఁగూడదు. మీఱి యధేష్టంబుగా సంచరించు వాఁ డైహికాముష్మిక సుఖదూరుం డగునని శ్రీకృష్ణుండు భారతాంతర్గతమగు భగవద్గీతయందు
శ్లో॥ యశ్శాస్త్రవిధిముత్సృజ్య వర్త తేశామకారతః
న స సిద్ధినువాప్నోతి | వసుఖం న పరాం గతిం
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే | కార్యా కార్య వ్యవస్థితౌ॥
అను శ్లోకంబుల మూలమునఁ జెప్పియున్నాఁడు. ఇంక నా శ్రుతిస్మృతిసూత్రపురా
ణేతిహాసయథార్ధ
భావంబులను జక్కఁగా నెఱుంగుటకై వ్యాసవశిష్ఠ పరాశర
శంకరాచార్య విద్యారణ్యాది మహానుభావు అనేక గ్రంథంబులను రచించియున్న వారు.
అవి చూడఁదగును. కాని యేవో రెండు కావ్యశ్లోకంబులం జదివి గొని వేదాదుల
కర్ధంబుఁ జెప్పఁబూసఁగూడదు. చెప్పఁ బూనినచోఁ బరమేశ్వర ద్రోహి యగును. వేద
పరమేశ్వరులకు భేదం బేమాత్రంబును లేదు. ఇట్లే సర్వ గ్రంథంబులందును జెప్పం
బడియున్నది. వేద వేదాంగ మీమాంసాది శాస్త్రాధ్యయనంబు చక్కఁగాఁ గావించి<noinclude><references/></noinclude>
ilg61yijh0brhuw53i2qygheeztmz1m
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/1
104
218292
570298
2026-08-15T07:38:28Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
570298
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/2
104
218293
570299
2026-08-15T07:38:41Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
570299
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2
సూచిక:Shri Hanumat Bhagavat Gita.djvu
106
218294
570316
2026-08-15T10:11:35Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with ''
570316
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=హనుమద్భగవద్గీత
|భాష=te
|సంపుటి=
|రచయిత=అబ్బరాజు
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=djvu
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
9pmdj7ziapxq8ng2cxla6e8zh7xzx7w
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/30
104
218295
570318
2026-08-15T10:27:23Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రవిభుండై యనుకంపతో నగుచు నా శ్రీ రాధాసతింగూడి యా తనిమ్రోల దెసలు వెలుంగఁదగె వా వారి స్థ నేత్రపర్వంబు గా. వ ఇట్లు ప్రాదుర్భవించిన జగన్మోహనాకారుండగు శ్రీకృష్ణుని శాండిల్య మ...'
570318
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />శ్రీ గర్గ భాగవత మాహాత్మ్యము.</noinclude>రవిభుండై యనుకంపతో నగుచు నా శ్రీ రాధాసతింగూడి యా
తనిమ్రోల దెసలు వెలుంగఁదగె వా
వారి స్థ నేత్రపర్వంబు గా.
వ ఇట్లు ప్రాదుర్భవించిన జగన్మోహనాకారుండగు శ్రీకృష్ణుని శాండిల్య
మహర్షి యు, బ్రతిబాహు భూపతియుఁ, బట్టమహిషియగు మాలినియు
ప్రత్యుత్థానం బొసరించి నమస్కరించి యిట్లని వినుతించిరి.
సీ। శ్రీవత్సలాంఛనా ! శ్రీగజపోషకా !, శ్రీXళమిత్ర | చక్రీ ! జొహారు
గోలోక నాయకా !! గోకలీలాన్వితా।, వైకుంఠలీలా ప్రవర! జొహారు
దేవర్షి వందితా | దివ్యరూపాంచితా ! గిరిరాజపతిమనోహర! జొహారు
బృందావసవిహార | బృందారకకదంబ, రక్షక! రాథేశ్వరా ! జొహారు
నందనందన! నారాయ ణా ! జొహారు
దానవాంతక ! మానవో • త్తమ! జొహారు
సచ్చిదానంద! యింద్రాను జా ! జొహారు
కృష్ణ | రోచిష్ణు! జిష్ణు ! హ | రీ ! జొహారు.
1
ఉ అంతట శ్రోత లెల్ల హరి శ్రీ కెదుపదుల్ బొనరించి శ్రీపతీ !
సాంతము మాదు తప్పులను జక్కఁగ మన్నన సేయుచుగా సుధీ
మంతుని వంశకర్త సుకు మారుఁ గుమారుని లేని కిచ్చి మా
కంతము లేని బత్తి తమ యందున నుండ ననుగ్రహింపుమా !
చ గిరిజ 1 యిటుల్ నుతింపఁ గని శ్రీ కృష్ణుఁ డఖండమన స్వరంబు
వనముని ! పౌరులార ! బహు భక్తిని నిఫ్ట్లు మదీయ వాక్యముల్
సరిగ వినుండు ! గర్గకృత సంహిత కామచతుష్టయ ప్రదం
బరిహరణంబు విన్నఁ దమయర్థితవాంఛ ఫలించితీ రెడిగా .
చ ఎవ రెవ రెట్టికోరికల నేరియు గోరియు గర్గసంహితా
శ్రవణము నాచరించెదరో • సంశయ మింతయు లేనియట్టు
య్యని యని వారివారికిని హత్తునుగా యని కోర్కె లిచ్చి మా
ధవుఁడు సదృశ్యుఁ డయ్యెను ముదంబును నందరు బొందిరో యుమా !
క॥ మునివర శాండిల్యుండును, మనమధురా బ్రాహ్మణులకు గౌరవపక్కి
ధన మిడి ప్రత్యేకముగా జననాయకు నూఱడించి చనియె మృడానీ :
ఉ: మాలిని మానినీమణి స మంజ సభూషణకమ్రయై విభు
లీలల సోలి చూలు నవ లీలఁగఁ బొందియు సూతికాలమం
దోలి సుపుత్రుఁ గాంచె నిజయుక్తకృతి ప్రతతి జనేశుడు
మేలని యిచ్చెఁ బాఱులకు మేదిని గోగజహేమవస్త్రముల్.
ల
3
४
ле<noinclude><references/></noinclude>
r1pdj7o8yld38vol5bizchdu8d9d6th