వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.15 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk రచయిత:రాయప్రోలు సుబ్బారావు 102 81652 570340 559434 2026-08-16T08:19:27Z Vjsuseela 1850 /* గ్రంథాలయ సర్వస్వము */ 570340 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = రాయప్రోలు |అసలుపేరు = సుబ్బారావు |పేరు_మొదటి_అక్షరం = ర |పుట్టిన_యేడు = 1892 |గిట్టిన_యేడు = 1984 |వివరణ =నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన రాయప్రోలు సుబ్బారావు తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. |బొమ్మ= |వికీపీడియా_లంకె = రాయప్రోలు సుబ్బారావు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= Category:Rayaprolu Subba Rao }} ==రచనలు== * '' ప్రాచీన చిత్రనిర్మాణము.'' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1911]] * [[తెనుగు తోట]] (1913) {{small scan link|Tenugutota.pdf}} * [[తృణకంకణము]] (1913) {{small scan link|TrxnaKankanamu.pdf}} * '' అస్తమయము '' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1915]] * [[జడకుచ్చులు]] (1925) {{small scan link|Jadakucchulu1925.pdf}} * '' సుప్రభాతమ్‌ '' - [[జమీన్ రైతు]] (1947) * [[శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)|శ్రీ సుందరకాండ]] (1905) {{small scan link|శ్రీ సుందరకాండ.pdf}} * [[మధుకలశమ్]] (రెండవ ముద్రణ: 1944) {{small scan link|మ ధు క ల శ మ్.pdf}} ===గ్రంథాలయ సర్వస్వము === # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథాలయములు (పద్యములు)|గ్రంథాలయములు (పద్యములు)]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/మనుచరిత్ర నాయకలు|మనుచరిత్ర నాయకలు]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/పుస్తకావాహన|పుస్తకావాహన]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/ఎవరు? (సశేషము) పద్యములు|ఎవరు? (సశేషము) పద్యములు]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఎవరు? |ఎవరు? (గత సంచిక శేషము) పద్యములు]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/ఆధునికాంధ్రసారస్వతము]] (1916) # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/వసంతవికాసము]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/ప్రవాస రాధిక |ప్రవాస రాధిక]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/రవీంద్రనాధ ఠాకూరు| రవీంద్రనాధ ఠాకూరు]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/విజయదశమి|విజయదశమి]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/వసంతము (పద్యములు)|వసంతము (పద్యములు)]] # [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/శేషచైత్రము (పద్యములు)|శేషచైత్రము (పద్యములు)]] [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు‎]] 2g4ze0astem7x0qw4z5s9lqrphj8cpm రచయిత:పాటిబండ అప్పారావు 102 152015 570338 444520 2026-08-16T07:09:22Z Vjsuseela 1850 /* రచనలు */ 570338 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = పాటిబండ |అసలుపేరు = అప్పారావు |పేరు_మొదటి_అక్షరం = అ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = పాటిబండ అప్పారావు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 3/కృష్ణవేణి]] (1916) * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 4/గీత ప్రపంచము|గీత ప్రపంచము]] (1916) * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/వేసవి]] [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]] 0pjfsvedimk2m715v0nz59oszdo7n37 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/624 104 154679 570325 448489 2026-08-15T12:02:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 570325 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨|కవిలె భాండాగారములు}}</noinclude> ఉపయోగించిన సిరా చెరపరానిదై యుండవలెను. ప్రారంభ పరిశీలనములో దస్తావేజులను గురించి కొన్ని గమనింపదగిన యంశములను భాండాగారికుడు గుర్తు పెట్టుకొనవలెను. తాను వాటినిబట్టి గమనికలు తయారు చేయించి అవి దస్తావేజుకు అతికించబడి యుండునటులు చూడవలెను. ఏవిధముగను దస్తావేజులకు చెరుపు కలుగకుండా ఈ పని జరుగవలెను. ఈ నిరోధక చర్యలు తీసికొన్న తరువాత భాండాగారికుడు తన వశముననున్న పత్రముల విషయమై నిశ్చయ జ్ఞానమును కలిగి యుండగలడు, కార్యమునకు కడగునపుడు తాను అవలంబించిన విధానమున పొరపాట్లున్నచో అవి చక్క బెట్టుటకు వీలు లేనివిగా నుండకూడదు. దస్తావేజులు సరియైన క్రమములో లేకున్నను, ఎట్టి క్రమము కలవిగా లేకున్నను వాటిని వర్గీకరించవలెను. స్వాభావికమైన కవిలె భాండాగార లక్షణమును ప్రక్క నున్న వాటితోడి సంబంధమును సాధ్యమైనంత స్పష్టముగా దస్తావేజులు తెలుపునట్లు అవి మునుముందుగా తీర్చబడవలెను. కవిలె భాండారములు స్వప్రయోజనములను నిర్వహించుటకును, విద్యార్థులు వాటిని అర్థము చేసికొని పఠించి కృతార్థులగుటకును ప్రశస్తతమమైన అవకాశమును అట్టి ఏర్పాట్లు కల్పించ గలవు. పత్రములను అమర్చు విధానము దస్తావేజుల ఉత్పత్తి స్థానము సులభముగ తెలిసికొనుటకు అనువుగా నుండవలెను. ఏ పరిపాలనా లక్ష్యములను ఉద్దేశించి సదరు పత్రములు బయలు దేరిననో అట్టి లక్ష్యములను వెలువరించునట్లు దస్తావేజులను అమర్చుటయే సవ్యమైన పద్ధతి. కవిలె భాండారమును ఉత్ప త్తిచేసిన పరిపాలనా విధానమును గూర్చి పరిచయములేనిది కవిలె భాండారముల తత్త్వము సరిగా బోధపడదు. కవిలె భాండారములతో సన్నిహిత సంబంధము గలవారు ముగ్గురు కలరు. పరిపాలకుడు, భాండాగారికుడు, చరిత్రకారుడు అనువారు ఆ ముగ్గురు. ఈ మువ్వురి యొక్క కార్యరంగములు, అభిరుచులు జాగ్రత్తగా విభాగించినచో కవిలే భాండాగారికుని జవాబుదారీలను సులభముగా మనము గ్రహింపవచ్చును. ఒకడు కవిలే భాండారములను సృష్టించును. మరియొకడు వానిని క్రమప్రకారముగా భద్రపరచును. మూడవవాడు తన అక్కరకొరకు వానిని మధించి వినియోగపరచుకొనును. చరిత్రకారునకు అనేక దృష్టికోణములున్నవి. అతని ఉపాదాన విసర్జన పద్ధతులు భాండాగారికుని శ్రద్ధకు మిక్కిలి హానికరమైనవి. భాండాగారికుడు తన కవిలె భాండారములను భద్రపరచుటయందు అత్యంతాధునిక, శాస్త్రీయ పద్ధతులను అవలంబింపవలెను. కాని ఆతని కాలము, దృష్టికోణము నవీనులతో కాక కవిలె భాండారములతొ తాదాత్మ్యమును పొందవలెను. అనగా ప్రాచీనముగా నుండవలెను. ఆతనికి అన్ని పత్రములును తుల్యప్రాధాన్యము గలవే. అతడు ప్రజలకు కాక కవిలె భాండారమునకే సేవకుడగు చున్నాడు. భాండాగారికునకు సాధ్యమైనంత జాగరూకతతో తయారుచేయబడిన మార్గదర్శినులు (guides), విషయసూచికలు, వృత్తాంత కోశములు, పంచాంగములు ఉండవలెను. ఇవి కవిలె భాండారములోని యావద్విషయములను బాహాటముగా సమగ్రముగా పరిశోధకునికి కరతలామలకము చేయునవిగా నుండవలెను. కవిలె భాండారములోని విషయములు వర్గీకరింపబడి, వర్ణింపబడి యుండవలెను. అట్టి విషయముల క్రమసూచికయు, కాలక్రమానుసారముగ ఏర్పరచబడిన ప్రదేశముల యొక్కయు, వ్యక్తుల యొక్కయు, పట్టికలను అన్యోన్య నిర్దేశముతో కూడినవై కవిలే భాండారమునకు పఠనముకొరకై వచ్చు ప్రతి వ్యక్తికిని సులభముగ విషయబోధ కలిగించును. దస్తావేజులకు టిప్పణులు వ్రాయుట ఒక ప్రత్యేక స్వభావముగల పని. దస్తావేజు రచింపబడిన భాషలోనే దానికి టిప్పణి వ్రాయుట ఉత్తమపద్ధతి, మూలపత్రము వేలిపుచ్చు వాతావరణమునే టిప్పణి సృష్టించవలేను. కానీ అది సంగ్రహరూపముగా నుండవలెను. భాండాగారికుడు ఎట్టి ముఖ్యవిషయమును విడనాడకూడదు. శక్యమైనచో ఆ పదవిన్యాసమునే ఉపయోగించవలెను. వీలైనంతవరకు సంగ్రహ రూపములో మూలగ్రంథమును క్లుప్తపరచవలెను. భాండాగారికుడు మూలగ్రంథము నుండి సందర్భాను సారముగా ఏదైన నొక ఆవశ్యకమైన సమాసమునో, వాక్యభాగమునో ఉద్దరించుచు, అనవసర భాగ ములను తగ్గించవచ్చును.<noinclude><references/></noinclude> i4jckl8sh1cnre4ua0r3hwk70sh23x7 570326 570325 2026-08-15T12:02:49Z A.Murali 3019 570326 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కవిలె భాండాగారములు}}</noinclude> ఉపయోగించిన సిరా చెరపరానిదై యుండవలెను. ప్రారంభ పరిశీలనములో దస్తావేజులను గురించి కొన్ని గమనింపదగిన యంశములను భాండాగారికుడు గుర్తు పెట్టుకొనవలెను. తాను వాటినిబట్టి గమనికలు తయారు చేయించి అవి దస్తావేజుకు అతికించబడి యుండునటులు చూడవలెను. ఏవిధముగను దస్తావేజులకు చెరుపు కలుగకుండా ఈ పని జరుగవలెను. ఈ నిరోధక చర్యలు తీసికొన్న తరువాత భాండాగారికుడు తన వశముననున్న పత్రముల విషయమై నిశ్చయ జ్ఞానమును కలిగి యుండగలడు, కార్యమునకు కడగునపుడు తాను అవలంబించిన విధానమున పొరపాట్లున్నచో అవి చక్క బెట్టుటకు వీలు లేనివిగా నుండకూడదు. దస్తావేజులు సరియైన క్రమములో లేకున్నను, ఎట్టి క్రమము కలవిగా లేకున్నను వాటిని వర్గీకరించవలెను. స్వాభావికమైన కవిలె భాండాగార లక్షణమును ప్రక్క నున్న వాటితోడి సంబంధమును సాధ్యమైనంత స్పష్టముగా దస్తావేజులు తెలుపునట్లు అవి మునుముందుగా తీర్చబడవలెను. కవిలె భాండారములు స్వప్రయోజనములను నిర్వహించుటకును, విద్యార్థులు వాటిని అర్థము చేసికొని పఠించి కృతార్థులగుటకును ప్రశస్తతమమైన అవకాశమును అట్టి ఏర్పాట్లు కల్పించ గలవు. పత్రములను అమర్చు విధానము దస్తావేజుల ఉత్పత్తి స్థానము సులభముగ తెలిసికొనుటకు అనువుగా నుండవలెను. ఏ పరిపాలనా లక్ష్యములను ఉద్దేశించి సదరు పత్రములు బయలు దేరిననో అట్టి లక్ష్యములను వెలువరించునట్లు దస్తావేజులను అమర్చుటయే సవ్యమైన పద్ధతి. కవిలె భాండారమును ఉత్ప త్తిచేసిన పరిపాలనా విధానమును గూర్చి పరిచయములేనిది కవిలె భాండారముల తత్త్వము సరిగా బోధపడదు. కవిలె భాండారములతో సన్నిహిత సంబంధము గలవారు ముగ్గురు కలరు. పరిపాలకుడు, భాండాగారికుడు, చరిత్రకారుడు అనువారు ఆ ముగ్గురు. ఈ మువ్వురి యొక్క కార్యరంగములు, అభిరుచులు జాగ్రత్తగా విభాగించినచో కవిలే భాండాగారికుని జవాబుదారీలను సులభముగా మనము గ్రహింపవచ్చును. ఒకడు కవిలే భాండారములను సృష్టించును. మరియొకడు వానిని క్రమప్రకారముగా భద్రపరచును. మూడవవాడు తన అక్కరకొరకు వానిని మధించి వినియోగపరచుకొనును. చరిత్రకారునకు అనేక దృష్టికోణములున్నవి. అతని ఉపాదాన విసర్జన పద్ధతులు భాండాగారికుని శ్రద్ధకు మిక్కిలి హానికరమైనవి. భాండాగారికుడు తన కవిలె భాండారములను భద్రపరచుటయందు అత్యంతాధునిక, శాస్త్రీయ పద్ధతులను అవలంబింపవలెను. కాని ఆతని కాలము, దృష్టికోణము నవీనులతో కాక కవిలె భాండారములతొ తాదాత్మ్యమును పొందవలెను. అనగా ప్రాచీనముగా నుండవలెను. ఆతనికి అన్ని పత్రములును తుల్యప్రాధాన్యము గలవే. అతడు ప్రజలకు కాక కవిలె భాండారమునకే సేవకుడగు చున్నాడు. భాండాగారికునకు సాధ్యమైనంత జాగరూకతతో తయారుచేయబడిన మార్గదర్శినులు (guides), విషయసూచికలు, వృత్తాంత కోశములు, పంచాంగములు ఉండవలెను. ఇవి కవిలె భాండారములోని యావద్విషయములను బాహాటముగా సమగ్రముగా పరిశోధకునికి కరతలామలకము చేయునవిగా నుండవలెను. కవిలె భాండారములోని విషయములు వర్గీకరింపబడి, వర్ణింపబడి యుండవలెను. అట్టి విషయముల క్రమసూచికయు, కాలక్రమానుసారముగ ఏర్పరచబడిన ప్రదేశముల యొక్కయు, వ్యక్తుల యొక్కయు, పట్టికలను అన్యోన్య నిర్దేశముతో కూడినవై కవిలే భాండారమునకు పఠనముకొరకై వచ్చు ప్రతి వ్యక్తికిని సులభముగ విషయబోధ కలిగించును. దస్తావేజులకు టిప్పణులు వ్రాయుట ఒక ప్రత్యేక స్వభావముగల పని. దస్తావేజు రచింపబడిన భాషలోనే దానికి టిప్పణి వ్రాయుట ఉత్తమపద్ధతి, మూలపత్రము వేలిపుచ్చు వాతావరణమునే టిప్పణి సృష్టించవలేను. కానీ అది సంగ్రహరూపముగా నుండవలెను. భాండాగారికుడు ఎట్టి ముఖ్యవిషయమును విడనాడకూడదు. శక్యమైనచో ఆ పదవిన్యాసమునే ఉపయోగించవలెను. వీలైనంతవరకు సంగ్రహ రూపములో మూలగ్రంథమును క్లుప్తపరచవలెను. భాండాగారికుడు మూలగ్రంథము నుండి సందర్భాను సారముగా ఏదైన నొక ఆవశ్యకమైన సమాసమునో, వాక్యభాగమునో ఉద్దరించుచు, అనవసర భాగ ములను తగ్గించవచ్చును.<noinclude><references/></noinclude> oc1hkypl6waxck3hb3yehtyseqyx2rr పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/625 104 154680 570327 448490 2026-08-15T12:17:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 570327 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కసరత్తులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="625A" />ఒకప్పుడు దస్తావేజుల నకలు ప్రతులు అచ్చు వేయబడవచ్చును. కాని నకలు వ్రాయుటలో వ్రాయసగాని ఆత్మీయత సాధ్యమైనంత తక్కువగా ప్రత్యక్షము కావలెను. కాని మూల ప్రతుల వ్రాత పోల్చుకొన రానిస్థితిలో నున్నచో వ్రాయసగాని కౌశలము తప్పక అపేక్షితమగును. ఛాయాగ్రహణ ప్రతులను తయారు చేయవచ్చును. కాని అవి అధిక వ్యయ సాధ్యములు. పత్రములకు నకళ్ళు వ్రాయించు పద్ధతివలన దూరప్రాంతములనుండి కవిలె భాండారములకు చదువరులు రావలసిన ఆవశ్యకము తొలగును. వర్తమాన, భౌతిక శాస్త్రయుగమున కాగితపు ఉత్పత్తి, వ్రాతసాధనములు అతి సులభములై పోయినవి. అనేకాంగములతో సంకీర్ణమైన ప్రభుత్వ విధానము యొక్క సూక్ష్మాతిసూక్ష్మ చర్యలన్నియు కాగితముపై వ్రాసిపెట్టబడవలెను. కావుననే నవీన పరిపాలనము పత్రముఖమున జరుగునని జనులు వాకొను చుందురు. అనంతముగా పత్రములు జమ అగుచుండును. అందువలన దస్తావేజుల నాళము లేక ఏరివేతలను సమస్యను మనము ఎదుర్కొనవలసి యున్నాము. ప్రభుత్వ యంత్రమునుండి బయలు వెడలు ప్రతి కాగితపుముక్కయు ప్రత్యేక ప్రాముఖ్యమును కలిగియుండజాలదు అని చెప్పుటలో వివేకము లేకపోలేదు. పత్రముల యొక్క అట్టినాశము ప్రతిదినము పరిపాలనలో ఎట్టిసంప్రతింపులు లేకయే జరుగుచుండును. భాండాగారికుడు తన వశములోనికి పత్రములు వచ్చిన తర్వాత వానిని నాశముచేయుతలంపు మానుకొనవలెను. అధికారియైనవాడు పత్రములను తాత్కాలిక వ్యవహార దృష్టితో మాత్రమే పరిగణించును. భాండాగారికుడు పరిశోధకుల భవిష్య దవసరములపై దృష్టినుంచవలెను. నకళ్ళు తొలగింపబడవచ్చునని యొక వాదము కలదు. కాని వ్రాత దస్తావేజులలో మాటకుమాట వ్రాయబడిన నకళ్ళు మిక్కిలి అరుదు. అప్పుడు భావానుగుణమైన నకళ్ళసమస్య ప్రాధాన్యమును గైకొనును. మాటకు మాటగా ప్రతి వ్రాయబడినప్పుడు తప్ప ఒక దస్తావేజునకు మరియొకటి దగ్గర నకలు అని భావించుట ప్రమాద బహుళ మే అగును, కొన్ని దస్తావేజులు శాశ్వతముగా భద్రపరచదగినంత విలువను కలిగి యున్నట్లు తాత్కాలికముగా తోచకపోవచ్చును.. కాని ఏ వ్యక్తియైనను శాశ్వతముగా కవిలెలను ధ్వంసముచేయు జవాబుదారీని తీసికొనునప్పుడు, తన ఆలోచనలనుగాని; అభిరుచులనుగాని తన సమకాలికుల అక్కరలకు మాత్రమే పరిమితము చేయకూడదు. ఇకనేమంటే రానున్న తరములకుచెందిన వ్యక్తుల అక్కరల యెడ తనకుగల బాధ్యతను కూడ అతడు గుర్తింపవలయును. భవిష్యత్తు నెవరు సులభముగా ప్రత్యక్షము చేసికొనగలరు? భవిష్యత్తు యొక్క అక్కరలను ఊహింప ఎవరికి తరము ? పాత ధస్తావేజుల శోధనమునకు కడగినపుడు దస్తావేజులన్నియు చక్కగా భద్రపరచబడి యుండ లేదను భావము బాధాకరముగా నుండును. పత్రముల ధ్వంసమునకు పూనుకొన్న భాండాగారికుడు కూడా బాధా కరుడే అనదగును. దస్తావేజుల అస్తిత్వము నిరుపయోగకరమని తాను భావించినందున వాటిని ధ్వంసముచేయు భాండాగారికుడు తన వ్యక్తిత్వమును ఆ సేకరణ విషయములోనికి చొప్పించుచున్నాడు. అట్లు చొప్పించుట అన్యాయము. గత పరిపాలనము యొక్క కృత్రిమస్మృతిని నిలిపియుంచుటకు వీలగునట్లు దస్తావేజులు భద్రపరచబడు చున్నవి. భవిష్యత్తునకు ఎట్టి సందేశమును అందించు ప్రత్యేకమైన తలపులేకుండగనే అవి దస్తావేజుల రూపము నందుచున్నవి. దస్తావేజులు స్వకృత్యమును నెర వేర్చిన పిదప కూడ వాటి మనుగడకును, వాటి కృత్యనిర్వహణమునకును క్షతిలేకుండ వాటికొక నూతన ప్రయోజనమును కల్పింపబూనినవాడు భాండాగారికుడు. అతడు వాటి వర్తమాన నిత్యత్వమును గమనించును. వాటి ధ్వంసమునకును, ఉపేక్షకును కారణములైనవాటిని నివారించును; సులభముగా పారదర్శకమైన వర్గీకరణ విధానము నవలంబించును; తమ్మాలమున గత పరిపాలనమునకు సంబంధించిన గుప్తజ్ఞానమును అతడు పాఠకులకు కరతలామలకము కావించును. {{right|ఆర్. ఎమ్. జో}} <section end="625A" /> <section begin="625B" />'''కసరత్తులు :''' మానవజాతికో, మృగజాతికో సంబంధించిన శత్రువును తట్టుముట్టాడకుండ (కదలకుండ) పట్టుకొను విద్య ప్రాచీన <section end="625B" /><noinclude><references/></noinclude> 9t474x1kx7b8yy85m490f90znu5dfbm పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/626 104 154681 570328 448491 2026-08-15T12:36:20Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 570328 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కసరత్తులు}}</noinclude> యుగమునాటనే ప్రారంభించినది. చరిత్ర కందని కాలము నాటి ప్రాచీన మానవుడు ముఖాముఖి వన్యమృగములతో తరుచుగా పెనగులాడవలసి యుండు నని, ముష్టి బంధపు బిగువును గూర్చిన పరిజ్ఞానము ముఖ్యమని తెలిసి కొన్న వాడయి స్వకుటుంబ జనులతోనో, ఇరుగు పొరుగులవారితోనో పోరాడు విధములను సాగించుచుండెడు వాడు. ఈ విధముగా ప్రతివాడును మృగములను ఎట్లు పట్టి బంధించి అదుపులో నుంచుకొనవచ్చునో నేర్చుకొనసాగెను. సభ్యతా చరిత్రమును తెలిసికొన గలిగినంత ప్రాచీన కాలములో కుస్తీ ఒక వేడుక క్రీడగా నుండెను. మెసస టోమియాలో త్రవ్వకము పని జరుపుచున్న డాక్టరు ఎస్. ఏ. స్వీజరు చేతను, అతని అనుచర బృందముచేతను 1938 లో ప్రాచీన సాక్ష్య వివరములు బహిర్గతము చేయబడెను. బాగ్దాదు సమీప మందున్న 'క్యాఫాజె' (Kyafaje) లోని దేవాలయ శిథిలములలో రెండు పలకలు దొరకెను. అందొక దానిమీద ఇద్దరు మల్లులు సరిసమానముగా పోరాడుచున్నట్లు విగ్రహములు కలవు. రెండవదానిమీద ఇద్దరు మల్లులు తమ ప్రతిపక్షి తుంటిని తమ చేతులతో బిగపట్టినట్లు కంచుపోత విగ్రహములు కలవు. పేర్కొనబడిన పలకలు సుమేరియనులచే నిర్మింపబడినవి.. సుమేరియనులు ఒక పురాతన జాతివారు. సుమేరియను జాతి అత్యంత ప్రాచీన కాలముననే అంతరించినది. ఈజాతి నాశనము 5000 సంవత్సరము లకు పూర్వము జరిగెనని గుణింపబడినది. చక్రప్రయోక్తకు (Discus Thrower) పిదప పేర్కొనదగిన జెట్టినే మల్లయోధాగ్రగణ్యునిగా గ్రీకులు భావించుచుండెడివారు. గ్రీకులు ప్రయోగించు విధానమును సంక్రాషియం (Pancratium) అందురు. ఇది యొక కరకైన, విలంబనమైన విధానము. ఎట్టి పట్టునకును నిషేధములేదు. పెనుగులాడ వచ్చును. కరవవచ్చును. మెలి పెట్టవచ్చును. గట్టిగా పట్టుకొని వచ్చును..గొంతు పిసుకవచ్చును, కుమ్మవచ్చును, తన్నవచ్చును. ఇంతయేల ఇష్టమువచ్చిన పని నేదయినను చేయవచ్చును. పురాణ కథలనుబట్టియు, వాస్తవిక వృత్తాంతములను బట్టియు గ్రీకు మల్లయుద్ధ ప్రవీణులలో గొప్ప మొనగాడుగా ప్రసిద్ధిచెందిన వాడు 'క్రోటన్' కాపురస్థుడైన 'మైలో' (Milo) అను నాతడు. ఇతడు ఒలింపిక్ ఇస్తిమియన్ క్రీడల యందు ఆరుసార్లు జయించి కీర్తి గడించిన వీరాగ్రణి హోమరు మహాకవి "ఇలియడు" అను వీర కావ్యమునందు చేసిన యులిస్సీజు—— ఎజాక్సుల ద్వంద్వయుద్ధవర్ణనము, మల్ల యుద్ధ కథనమును గూర్చిన అపూర్వ రచనయైయున్నది. రోమనులు గ్రీకులను జయించి ఒలింపిక్ క్రీడల ఆధిపత్యమును వహించినపుడు మల్ల యుద్ధ నిబంధనలను మార్చి పాన్ క్రేషియమ్ లోని మోటు విధానములను తీసివేసిరి. రొమనులు గ్రీకుల మూలవిధానములతో తమ మల్ల యుద్ధ విధానములను మిశ్రణముచేసి “గ్రీకు-రోమన్ " మల్ల యుద్ధ విధానము నొకదానిని వ్యాప్తికి తెచ్చిరి. ఈ విధానమే ఇప్పటికిని ఐరోపాఖండమునందు నిలిచియున్నది. ప్రాచీన యూదులు అంతగా క్రీడా వినోద లాలసులు గారు. అయినను వారు మల్లయుద్ధము విషయములో అమితోత్సాహము గలవారుగా నుండిరి. 5000 సంవత్సరముల క్రిందటి సుమేరియన్ యుగమునకు సమీప కాలమున యూదులలో క్రీడావినోదము లుండియున్నట్లు శిల్పవిద్యా విదులు (స్థపతులు) శిథిలావశేషములను బట్టి సూచించుచున్నారు. క్రీస్తు శకమునకు పూర్వము కొంతకాలము నుండి జపానీయులకు మల్లయుద్ధము "జాతీయ క్రీడ"గా నున్నది. రాక్షసాకారులయిన “సూమో (sumo) మల్లులు చక్రవర్తి ప్రీత్యర్థము ఏర్పాటగు ఉత్సవ సమయములందును, ప్రజా సంబంధమగు మరియే ప్రముఖ కార్యక లాపమునం దయినను, ప్రదర్శనములు చేయుచుండిరి. ఆధునిక శతాబ్దములలో జపానీయులు "జ్యూ-జిట్సు" (Jui-Jitsu) అను మల్లయుద్ధమునందు అత్యంత కుశలులై యున్నారు. ప్రాచీన భారతదేశములో మల్లవిద్య ఒక క్రీడగమ, ఒకానొక వ్యాయామసాధనముగను వృద్ధిలోనికి వచ్చినది. వేదయుగములో ఆర్యులు (వైదికార్యులు) ప్రజా సామాన్యము నందు పరిపాటిగా నున్న క్రీడలలో నొకటియగు మల్లయుద్ధము యొక్క ప్రదర్శనములందు తమ శారీరక శక్తి సామర్థ్య ప్రకటనమున మించియున్నట్లు కనబడును.<noinclude><references/></noinclude> pp2215x0c3ftxdfjq9r7nrambizamsi పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/22 104 199298 570336 524256 2026-08-16T06:33:12Z Vjsuseela 1850 570336 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vjsuseela" /></noinclude>{{left margin|5em}}<poem> :విద్యాభోగకరీ యశస్సుఖకరీ :విద్యాగురూణాం గురుః :విద్యాబంధుజనో విదేశగరు నే :విద్యాపరాదేవతా :విద్యారాజసుపూజ్యతే నహీధనం :విద్యావిహీనః పశుః "భర్తృహరి”</poem> <poem>తే.గీ. విద్యయొసఁగును వినయంబు వినయమునను బడయుఁబాత్రత పాత్రతవలన ధనము ధనమువలనను ధర్మంబు దానివలన నైహికాముష్మిక ఫలంబులందు నరుఁడు.</poem> </div> అని పూర్వులు విద్యాధనము ప్రశస్తమయినదనియు విద్యపరార్ధ సాధకమనియుఁ వాకొని యున్నారు. విద్యవలనఁగలుగు లాభములు వేఱుగాఁ జెప్ప నవసరములేదు. విద్యాజ్ఞానశూన్యుఁడు ద్విపాదపశువరునను విషయము మన మెఱింగినదే. ఎక్కార్యమున కేని ఎట్టివానికేని విద్య తోడ్పడితీఱును. వ్యవసాయమున కేమి వత౯కమునకేమి వ్యవహారమునకేమి విద్యవలెంఁ దోడ్పడునది మఱియొకటిలేదు. ఏ కార్యముననేమి ఏరూపముననేమి ఘనత సంపాదించుటకు విద్యయే భిక్షము. విద్యావంతుండేందున్నను పూజనీయుఁడె. విద్యలేనిదేశ మధోగతిపాలు కాఁగలదు. అజ్ఞానాంధకారమునఁబడి తెన్ను గానక గిలగిలలాడు మనదేశము జ్ఞానసూర్యకిరణప్రచారమున నచిరకాలమున నున్న తదశంగాంచుగాఁత. బరోడారాష్ట్రమువలె మనదేశముగూడ విద్యాభివృద్ధి కావలయువనిన గ్రంథాలయముల నెక్కువగస్ధాపించి విద్యావృద్ధులు దేశాభిమానులు తమజీవిత సర్వస్వము నిందులకు ధారపోయవలయును. అట్లు వారొనరించినగాని భాండాగారముల యుపయోగములు లోకమునకుఁ దెలియఁజాలవు. తెలిసినఁగాని సర్వజనుల నాకషి౯౦పఁగలశక్తి భాండాగారమునకున్నగాని సాటిదేశీయులతోఁ బాటు మన దేశీయులు విధ్యుక్తధర్మముల నెఱుంగఁజాలరు. విధ్యుక్తధర్మమెఱింగినగాని స్వదేశ సేవఁజేయనివాఁడు జీవచ్ఛవంబని యెఱుంగలేకు. భారతీయులు స్వదేశాభిమానులైననేగాని మనహూణప్రభువులు మనము స్వపరిపాలనార్హులకుని తలంపఁజాలరు; అట్లు వారెఱిఁగిననేగాని భారతీయులునిష్ప్రయోజకులను పేరు సాటిదేశములయందంతరింపదు. కావున మదీయసోదరులారా! నరజన్మ మెత్తినతరువాత దేశాభిమానము భాషాభిమానము లేకున్న మనజన్మము పశుజన్మమగునని గుఱుతెఱింగి స్వదేశమందు విద్యాభివృద్ధినొనర్చి దేశసేవఁజేసి భారతీయులపేరు ప్రతిష్ఠల నిలుపుదరని ని ప్రార్ధించుచున్నాను. భారతమాత మనకెల్లవిధముల తోడ్పడుఁగాఁత. శ్రీమత్పరదేవత మనకు సర్వశక్తుల ప్రసాదించును గాత. {{Center|{{p|fs125}}కార్యక్రమము</p>}} అగ్రాసనాధిపతిగారి యుపన్యాసమయిన పిమ్మట కృష్ణాజిల్లా గ్రంథాలయ సంఘ కార్యదర్శి దుర్గిరాల వేంకట సుబ్బయ్యగారు తాము ఈ సంవత్సరమున జేసిన పనినిగూర్చియు జరిగిన అభివృద్ధిని గూర్చియు విపులముగ జెప్పిరి. అంతట దంటు సుబ్బావధానులుగారు గ్రంథాలయములను గూర్చి జెప్పిన పిమ్మట, జగ్గయ్యపేటయందు ధర్మగ్రంథాలయము నొకదానిని స్థాపించుటకు తీర్మాన ముపపాదింపబడినది. ఆతీర్మానమునకు ఫలితముగ అగ్రాసనాధిపతి గారు రు ౧౧౬ లను, గ్రామస్థులు రు 3౨ం లను చందాలనిచ్చెదమని వాగ్దానము జేసిరి. అనంతరము గ్రంథాలయముల ఉపయోగమునుగూర్చి పురాణం సూరి శాస్త్రులుగారును, ఆంధ్రదేశగ్రంథాలయోద్యమమును గూర్చి అయ్యంకి వేంకటరమణయ్య గారును, ఉపన్యాసములనిచ్చిరి. పిమ్మట అంగలూరు గ్రంథభాండాగార చరిత్రను దుగ్గిరాల వెంకటసుబ్బయ్యగారును, కొణకంచి గ్రంథాలయమును గూర్చి కొణకంచి చక్రధరరావుగారును, చెరుకుమిల్లి గ్రంథాలయమును గూర్చి దాట్ల వేంకటపతి రాజుగారును, బెజవాడ తాలూకా సంఘమును గూర్చి రొయ్యూరి రామచంద్ర ప్రసాదరావుగారును, ఆకువీడు గ్రంథాలయమునుగూర్చి నండూరి రామదాసుగారును, ఆకిరిపల్లి గ్రంథాలయమునుగూర్చి గ.అప్పయ్యశాస్త్రిగారును, చింతలపాడు<noinclude><references/></noinclude> 0m8lhwjmbma0a42a9miwl8gel7g5boc పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/10 104 199333 570334 524243 2026-08-16T06:10:03Z Vjsuseela 1850 570334 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vjsuseela" /></noinclude>లోఁ జేర్పవలయునని నాయభిప్రాయము కాదు. ఏపదా ర్ధమును వచించు పదములు లేవో పెక్కు పదముల చేఁ జెప్పఁబడు నభిప్రాయములు యేయొక్క పదముచే చెప్పఁ బడునో ఏ పదములు శాస్త్ర సంకేతికములో - అవియెల్లను నిళ్ళంకముగా జేర్చుకోవలయునని నాయభిప్రాయము. నీచజాతులవారు మాటలాడు నింద్య గ్రామ్యమునకుగూడ వ్యాకరణము లేకపోలేదు. వాండ్రును ఏకవచనమునకు బహువచనము, కత౯కు కర్మ, కర్మకు క్రియ, షష్టికి తృతీయ, తృతీయకు పంచమి మాటలాడరు. కాని పదములు వర్ణాగమవర్ణలో పవర్ణ వ్యత్యయాదులచే వికృ తములై నవగుటచే ప్రయోగానర్హములయినవియు, నుత్తమ జాతి నాగరక భాషలోఁ గలుపఁదగినవియు కాకపోవు టచే నింద్య గ్రామ్యములుగా మన పూర్వులే నిషేధించి నారు. కాని యుత్తమజాతి నాగరక పండితులు స్వేచ్ఛ గామాటలాడు భాష నుగూడ దానివలె ప్రయోగార్హ ము కాదనుటకంటె తప్పుపని యింకొకటిలేదు. భిన్న భిన్న సీమలయందుండు నుత్తమజాతి నాగరిక పండితులు మాటలాడు భాషయు భిన్న భిన్నముగా నుండుటంజేసి యది గ్రాంధికము చేసినచో నొకసికలోని వాడుక భాష యింకొక సీమలోనివారి కర్ధముకాదు. కనుక వాడుక భాస గ్రాంధిక తావస్థకు తగదను కారణమే ఆభాష గ్రాంధికావస్థకు తేదగినదని చెప్పుటకు కారణము. ఏమ న అట్లు గ్రాంధికావస్థకు తెచ్చుటచేతనే యది యెల్ల సీమలవారికిఁ దెలియును గాని తేకున్నంత కాలము యేసీ మలోని దాసీమలో నేయుండును. ప్రస్తుతము గ్రాంధి కావస్థఁ జెందిన యితర దేశ్యపదములు మనకుఁ దెలియుట కు కారణము గ్రంధములేకదా! అట్లు తెలిసికోదగిన యితర దేశ్యపదములు మన గ్రంథములయం దెన్నెన్నో కలవు. ఒక్కొక్క సీమయందలి వ్యావహారిక భాష యొ క్కొక్కతీరుగానుండును. అందును ఒక్కొక్క తెగ వారి సంభాషణ మెక్కొక్కతీరుగా నుండును. అయి నను నుత్తమజాతి నాగరక పండిత సంభాషణము మాత్ర మతిస్వల్ప భేదములతో నొక్క తీరుగ చేయున్నది. అట్టిసీ మలయందలి నాగరక సంభాషణ భాష యంతయు గ్రాంధిక భాషయైనచో క్రమముగా సర్వసీమల సంభాషణభాషకును నైక్యము రాగలదు. అట్టి భాషయందు వ్రాయం బడిన గ్రంధములు చదివిన కొలది నీచజాతిసంభాషణభా షయు నుత్తమజాతి సంభాషణ భాషాదశను పొందును. సర్వసీమలలోని వాడుకభాషలు సర్వసీమలవారు గ్రంధములయందు వ్రాయగలిగిరేని అప్పుడు దీనికిఁ గూడ మంచివ్యాకరణముపుట్టును. అప్పుడు ప్రాచీన నవీన భాషలు రెండింటికి నైక్యము సంభవించును. దానిచే మన యాంధ్రభాష కితోధికోన్న తావస్ధ ఘటించును. లేనిచో సంస్కృతభాష వలె. నాంధ్రభాషయు మృతావస్థలోని కివచ్చుటకు సందియములేదు. ఇతర భాషా సంపర్కము తోనభివృద్ధి చెందుచున్నంతమట్టు కేభాషకును సంపూర్ణ వ్యాకరణముపుట్టదు. ఏభాషయందు గాని వ్యాకరణము భాషను నిర్బంధపరచినచో అది మృతభాష యగు నే కాని యమృతభాష కానేరదు. భావయభివృద్ధియైనకొ లది వ్యాకరణముకూడ నేభావ కభివృద్ధమగునో నది యే అమృతభాష. ప్రస్తుతము తెలుగు భాషకున్న యల్ప వ్యాకరణముచే సంభాషణ భాషాపదము లనేకము లప భ్రంశములని తోచకమానవు. పదములే కావు శైలియంత యు నపభ్రంశ ప్రాయమే. ఆదియంతయు సుష్ఠమై ప్రక్రియా భాగము మాత్రము దుస్థమనుట యేమి న్యాయము! కావున నభివృద్ధియగు భాష కెన్నడును నిర్ణీత వ్యాకరణము పనికిరాదు. అభివృద్ధియగుచున్న శరీరమునకు చిన్నతనము నాటి చొక్కాయములు పనికిరావు. క్రొత్తక్రొత్త చొక్కాయములు శరీర పరిమాణము ననుసరించి కుట్టింపవలసినదే. అందరును విద్యావంతులు కావలయు నని కోరు నిక్కాలఁబున నిర్బంధ ప్రాధమిక విద్య యవ సరమని పోరు నీ సమయంబున సులభ శైలిగల వ్యావ హారిక భాషా గ్రంథములు కాక యేగ్రంధములు పనికి వచ్చును ! చిన్న తనమునుండియు కర్ణతాడితమగుచున్న భాష కాక యింకే భాష సులభముగా తెలియును! పం డిత సంభాషణభాషలో గ్రంధములు వ్రాయుట కారం, భించినచోనవి తక్కువజాతిలో అక్షరములు నేర్చినవారు చదువుకొని పండితవ్యావహారిక భాష నేర్చుకో గలుగు దురు. అదియు వచ్చినతరువాత ప్రౌఢ భాష నేర్చుకొం దురు. ఇట్లు క్రమక్రమముగా భాషాపర్వతము నెక్కుట<noinclude><references/></noinclude> 5hbaq142jni5s1to2jseyappfx9g8le గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/బాలుర భావి బాధ్యతలు 0 215371 570335 562586 2026-08-16T06:20:06Z Vjsuseela 1850 added [[Category:పద్యములు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 570335 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2]] | రచయిత = సత్తెనపల్లి హనుమంతరావు | అనువాదం= | విభాగము = బాలుర భావి బాధ్యతలు | ముందరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/ఆంధ్రభాష|ఆంధ్రభాష)]] | తదుపరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/]] | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf" from=14 to=14 /> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] [[వర్గం:పద్యములు]] akzm3uwgg561yjbyakak4r0dyxbgtyy పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/104 104 216506 570330 565436 2026-08-16T02:39:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 570330 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>గవనమున మము నెల్ల గాసిపడజేసితివి । అపుడు జూపితి బింకె మిపుడు కనపర్చు॥ నీప్రభువు జూడగా నిన్ను దునుమాడెదను । చూడరా మర్కటా చూడరా యిపుడు॥ యుద్ధరంగమున నీ వూరుకోకుండంగ । దీర్ఘజిహ్వునిశిరము దెగవేసినావు॥ మధ్య చొరబారి ధర్మము దప్పి యాభరతు । పక్షమై సరదారు బట్టి చంపితివి॥ చంపెదను నిన్ను నిర్జరులు భీతిల్లంగ । ననుచు శతకంఠుండు కను లెర్రజేసి॥ పదినూరుచేతులను పదినూరుబాణములు । బూని హనుమంతుపై బాణములు బరపె॥ భూనభోంతరములను బొదలి మంటలు వెలయ । ఘనశరము లేతెంచి హనుమంతు బొదవి॥ బాణసాహస్రంబుబలు మేనుపై నాటి । విరథుడై హనుమంతు ధరణిపై వ్రాలె॥ విరథుడై హనుమంతు ధరణి వ్రాలుట జూచి । సింహనాదము జేసె శతకంఠు డపుడు॥ సింహధాటీ జేసి చెలరేగి దానవుడు । పెక్కుశరములు బూని పెళ్లు మీరుచును॥ అట్టహాసాధిపుం డగుచు రామునికడ । నరదేరగా జూచి తరుణి జానకియు॥</poem> {{p|ac|fwb}}శతకంఠుడు సీతను జూచి భయపడుట</p> <poem>అసురుభీషణగమన మంత కన్నుల జూచి । తనయాదిమహిమంబు తలపోసె నపుడు॥ ఆదిపరంజ్యోతి ఆయమ్మ జానకి । కంట గన్పడ నసురు కంపమున బొదలె॥ పదునాల్గులోకములు పట్టజాలనియట్టి । వీరరూపము దాల్చె వెలది తా నపుడు॥ శతకంధరుడు దక్క జగములో నెవ్వరికి । గానరాకుండంగ గనుపించెనపుడు॥ విలయకాలమునాటి వీరభైరవమూర్తి । తేజమై రవికోటితేజమై వెలసె॥ ద్వాదశాదిత్యులును తగనవబ్రహ్మలును । పదకొండుగురురుద్రు లుదుటు మీరగను॥ అష్టదిక్పాలకులు అరయ త్రేతాగ్నులును । కొమరు ముప్పదిమూడుకోట్లదేవతులు॥ ఈవిశ్వరూపంబు వెలయ జానకిదేవి । గనుపించె దనుజునకు కడుభీకరముగ॥ కని దైత్యవల్లభుడు కంపంబు నొందుచును । తనపాలిమృత్యువని తల్లడిల్లుచును॥ మది భీతి నొందుచును మానంబు దూలుచును । అచట గుండెలు నిలువ కవని రాక్షసుడు॥</poem><noinclude><references/></noinclude> gfjfrdk6hsxlrh85k83cbc3durh1sej 570331 570330 2026-08-16T02:40:17Z దేవీప్రసాదశాస్త్రి 4290 570331 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>గవనమున మము నెల్ల గాసిపడజేసితివి । అపుడు జూపితి బింకె మిపుడు కనపర్చు॥ నీప్రభువు జూడగా నిన్ను దునుమాడెదను । చూడరా మర్కటా చూడరా యిపుడు॥ యుద్ధరంగమున నీ వూరుకోకుండంగ । దీర్ఘజిహ్వునిశిరము దెగవేసినావు॥ మధ్య చొరబారి ధర్మము దప్పి యాభరతు । పక్షమై సరదారు బట్టి చంపితివి॥ చంపెదను నిన్ను నిర్జరులు భీతిల్లంగ । ననుచు శతకంఠుండు కను లెర్రజేసి॥ పదినూరుచేతులను పదినూరుబాణములు । బూని హనుమంతుపై బాణములు బరపె॥ భూనభోంతరములను బొదలి మంటలు వెలయ । ఘనశరము లేతెంచి హనుమంతు బొదవి॥ బాణసాహస్రంబుబలు మేనుపై నాటి । విరథుడై హనుమంతు ధరణిపై వ్రాలె॥ విరథుడై హనుమంతు ధరణి వ్రాలుట జూచి । సింహనాదము జేసె శతకంఠు డపుడు॥ సింహధాటీ జేసి చెలరేగి దానవుడు । పెక్కుశరములు బూని పెళ్లు మీరుచును॥ అట్టహాసాధిపుం డగుచు రామునికడ । నరదేరగా జూచి తరుణి జానకియు॥</poem> {{p|ac|fwb}}శతకంఠుడు సీతను జూచి భయపడుట</p> <poem>అసురుభీషణగమన మంత కన్నుల జూచి । తనయాదిమహిమంబు తలపోసె నపుడు॥ ఆదిపరంజ్యోతి ఆయమ్మ జానకి । కంట గన్పడ నసురు కంపమున బొదలె॥ పదునాల్గులోకములు పట్టజాలనియట్టి । వీరరూపము దాల్చె వెలది తా నపుడు॥ శతకంధరుడు దక్క జగములో నెవ్వరికి । గానరాకుండంగ గనుపించెనపుడు॥ విలయకాలమునాటి వీరభైరవమూర్తి । తేజమై రవికోటితేజమై వెలసె॥ ద్వాదశాదిత్యులును తగనవబ్రహ్మలును । పదకొండుగురురుద్రు లుదుటు మీరగను॥ అష్టదిక్పాలకులు అరయ త్రేతాగ్నులును । కొమరు ముప్పదిమూడుకోట్లదేవతులు॥ ఈవిశ్వరూపంబు వెలయ జానకిదేవి । గనుపించె దనుజునకు కడుభీకరముగ॥ కని దైత్యవల్లభుడు కంపంబు నొందుచును । తనపాలిమృత్యువని తల్లడిల్లుచును॥ మది భీతి నొందుచును మానంబు దూలుచును । అచట గుండెలు నిలువ కవని రాక్షసుడు॥</poem><noinclude><references/></noinclude> he97sx0rahrlw6fkrw5d3boljbrggp2 పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/105 104 216507 570332 565437 2026-08-16T03:52:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 570332 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>పురము మొగమై తాను మరలిపారగజొచ్చె । సిగ్గుమాలుచు మదిని చిన్నబోవుచును॥ తల్లి రణమున కేగదగదంచు చెప్పుటకు । తగ దుష్టశకునములు గనిపించుటకును॥ బలములును తనప్రధానులు గూలిపోవుటకు । విలయరూపము కన్నులను జూచుటకును॥ చిత్తంబు వికలమై తత్తరంబును బొంది । చాలదుఃఖింపుచును శతకంఠు డరిగె॥ రేవు రాముని బట్టి యేపు చూలింతునని । తలచు ......................॥ ............................... । ...నవేంద్రునిసేన మడియజేసితిని॥ అతనిభార్యాతనయు లతనితమ్ములు దక్క । కొదువబలముల నెల్ల గూల నేసితిని॥ తొల్లి హనుమంతుండు ద్రోణాచలము దెచ్చి । బ్రతికించినా డఖిలబలములను వాడు॥ రాముతమ్ముండైన లక్ష్మణవీరునకు । మూర్ఛ దెలియగ జేసి ముదము నొందించె॥ మున్నువలె హనుమంతు ముదముతో సంజీవి । దెచ్చి సేనలనెల్ల దెలివినొందించు॥ ఆరీతి గాకుండ నాద్రోణశైలంబు । కడ కేగి మీరెల్ల కాపు లుండండి॥ అవుషధా లివ్వవద్దని ద్రోణగిరితోడ । చెప్పుడు నే చాల చెప్పినా ననుచు॥ అని కోటిదానవుల నాద్రోణగిరిచుట్టు । కావుగా నుంపించె కఠినరాక్షసుడు॥ అంతఃపురంబులో కరిగి నాశతముఖుడు । అవుషధంబులగిరికి యటు కాపు లుంచె॥ రామచంద్రుం డచట రణభూమిలో గూలు । కపిబలంబుల జూచి కటకటా యనుచు॥ బలుచింత నొందుచును నలుదెరంగుల జూచి । అవనిపై వ్రాలి నాహనుమంతు జూచి॥ కరుణాసముద్రుండు కనికరము రంజిల్ల । వచ్చి యాతని బట్టి యొడలెల్ల నిమిరి॥ హస్తస్పర్శచేత హనుమంతుదేహంబు । గాయముల్ దొరుగంగ కరుణజూచెనుగ॥ వజ్రదేహుని జేసి వాయునందనా మహా । శ్రమ గల్గె నీకు మాసహవాసమునను॥ అఖిలబలముల కిపుడు ఆపదలు సిద్ధించె । మానిమిత్తముచేత మారుతాత్మజుడ॥ వనచరభల్లూకమనుజదానవబలము । నిదురబొందినరీతి నేల ప్రాలిరిగ॥ మానిమిత్తము వచ్చి మడిసి రెల్లబలంబు । లపకీర్తి వచ్చె నోయగచరోత్తముడ॥ అసురు జంపగలేని అపకీర్తి గాకుండ । సేన గూలిననింద శాశ్వతం బయ్యె॥</poem><noinclude><references/></noinclude> eogwgg51qzgxpmeegviyl3papce6hja పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/106 104 216508 570333 565438 2026-08-16T04:25:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 570333 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఇన్నిబలముల జంపి యేరీతి నయ్యోధ్య । పురము కేగుదునోయి తరుచరోత్తముడ॥ క్రూరరాక్షసు బట్టి గూల్తు నే నేరీతి । దనుజుబల మెంచంగ తరము గాకుండు॥ అసురు జంపక గాని అయ్యోధ్యపురమునకు । జనరాదు దునుమాడ శక్యంబు గాదు॥ అఖిలసేనలు మడిసిరని యెల్లవారలకు । యేరీతి జెప్పుదును యేమి సేయుదును॥ సకలబలముల నిపుడు సమరంబుపా ల్జేసి । చనిపోవుటకు నెట్లు మనసు రంజిల్లు॥ శతకంఠు జంపుటకు చేతగాదని నేను । యెల్లజను లడిగితే నేమి చెప్పుదును॥ చండవిక్రమనిశాచరుబలము తెలియక । కయ్యంబునకు నేల కాలు ద్రువ్వితిని॥ అఖిలలోకంబులకు యపకీర్తి వచ్చెగా! నిఖిలబలముల జంప నింద వచ్చెనుగ॥ అని చాలభీతిచే గనలుచుండినయట్టి । ఇనకులాధిపు జూచి హనుమంతు డనియె॥ అఖిలలోకాధార ఆదినారాయణా । పరమాత్మ నీ విట్లు వెర గొందదగున॥ నిఖిలలోకంబులు నీకుక్షిలో నుండు । నీవు లోకమునందు నిలిచియుందువుగ॥ నీమాయలోకములు నివ్వటిల్లుచునుండు । పరమాత్ముడవు లోకపాలకుండవుగ॥ నీమహిమ గనలేక నీవు మానవురీతి । పరితాప మొందుటకు భావ్యమా స్వామి॥ వెరపు కపులకు గాని వెర పనగ నీ కేమి । నీలోను మహిమంబు నీ వెరుంగవుగా॥ నీకు బుద్ధులు చెప్ప నే నెంతవాడను । సర్వశత్రువినాశ సకలలోకేశ॥ సేనలన్నియు మూర్ఛ జెందియున్నారన్న । సంశయంబులు మాను జానకీరమణ॥ తొల్లిచందమున నే ద్రోణాచలము దెచ్చి । తెలివి చెందించెదను బలములన్నిటిని॥ సకలబలముల మూర్ఛ క్షణములో దెలిపెదను । శలవైతె తెచ్చెదను సంజీవకరణి॥ తెల్లవారకముందె యెల్లసేనల మూర్ఛ । తెలియంగ జేసెదను శలవు నా కిమ్ము॥ ముదముతో సేనంత మూర్ఛ తెలిసినవెనుక । శతకంధరుని బట్టి హతమార్పవయ్య॥ క్షణములో పని కింతసంశయార్ధం బేమి । కపటనాటకసూత్రకంజాతనేత్ర॥ దివ్యౌషధము దెత్తు తెల్లవారకముందు । బలములన్న టిమూర్ఛ దెలియజేసెదను॥</poem><noinclude><references/></noinclude> oo1l2smzbszvrxgbwk3b67mnrill6cj పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/107 104 216509 570337 565439 2026-08-16T06:34:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 570337 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అయిదులక్షలనలుబదామడై వర్తిల్లు । నిక్కడికి ద్రోణాద్రి యినవంశవర్య॥ అని యిట్లు హనుమంతు తనతోడ బలుకంగ । మది సంశయము బాసె మనుజవల్లభుడు॥ అతని కౌగిట జేర్చి హనుమంతుడా నీవు । అరయ మా కెప్పటికి నాప్తబంధుడవు॥ అపుడు బలముల కెల్ల నాపదనివారణము । గావించుమా నింద గలుగకుండగను॥ ఈకార్యసరణి నీ వేరీతిగా జేయ । భారమంతయు నీదె పవననందనుడ॥ పొమ్ము వేగము ద్రోణభూధరము గొనితెమ్ము । దివ్యౌషధము తెమ్ము ధీరతను రమ్ము॥ అని లోకనాయకుడు తనతోడ బలుకంగ । ప్రణమిల్లి ముమ్మారు పవననందనుడు॥</poem> {{p|ac|fwb}}ఆంజనేయులు సంజీవి కరుగుట</p> <poem>శ్రీజానకీవరునిశలవు తా కొనుచు । నాకాశమార్గమున హనుమంతు డరిగె॥ పవనవేగముతోడ పటుజవంబున నెగసి । అరిగె హనుమంతుఁడు అఖిలంబు గడచి॥ నదులు నిధులును గడచి నగరభూములు గడచి । పర్వతంబులు గడచె పవననందనుడు॥ కాననంబులు గడచి కడురాజ్యములు గడచి । ద్రోణశైలము గాంచె వానరబలుండు॥ గిరిచుట్టు రాక్షసవరునాజ్ఞ దప్పక । కఠినదానవకోటి కాపు లుండిరిగ॥ అల్లంతదూరమున హనుమంతు బొడగాంచి । తబ్బిబ్బులను బొంది దైత్యులందరును॥ తందర్లు బొందుచును దానవావళులెల్ల । వచ్చె నదుగో చూడు వాయునందనుడు॥ మొన్న మననందరిని మోసపుచ్చినయట్టి । ఘనుడు వాయుసుతుండు కంటిరా మీరు॥ మనపగలు దీరంగ మర్కటవరు బట్టి । తునకతునకలు గాగ దునుమాడవలెను॥ ఘనభుజబలపరాక్రమము యింకెన్నటికి । పోనీక వానరుని బొరిపుచ్చవలెను॥ ఒక్కముఖమై మనము అక్కపీంద్రుని గదిసి । చెలక నరికినరీతి చండాడవలెను॥ అనుచు దానవులెల్ల కనుల నిప్పులు రాల । భీకరాకారులై పెల్లార్చుకొనుచు॥ హనుమంతునిం గదిసి రంద రొక్కుమ్మడిని । ఘోరరౌద్రాకృతిని కోటిదానవులు॥ కాలజీమూతంబు బోలి దానవకోటి । పవననందనుచుట్టు బరిఢవించిరిగ॥</poem><noinclude><references/></noinclude> ni7fh3cd463v6caihiz5jkzdasttuu9 పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/108 104 216510 570339 565440 2026-08-16T07:42:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 570339 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>తనచుట్టు నీరీతి దనుజావళులు గవయ । చిరునవ్వు నవ్వుచును శ్రీరాముబంటు॥ నను బట్టి చంపంగ పని బూని మీ రంత । గదిసినారా మీరు గర్వాంధు లగుచు॥ చంపజాలగ మీకు శక్యమా యమలోక । వాసులౌటకు మీరు వచ్చినా రిటకు॥ మీపరాక్రమమెల్ల జూపుడీ నాయెదుట । ప్రజ్ఞావిశేషములు పలికితిరి చాల॥ అని దీర్ఘవాలంబు వినువీథి ముట్టంగ । బరపె దానవకోటి వెరపు నొందగను॥ లోక మెల్లను నిండ భీకరాకారంబు । కాలాంతకునిరీతి గనుపట్టెనవుడు॥ తలపువ్వు లగుచు చుక్కలు జెలంగగ మేను । పెంచె హనుమంతుండు భీషణాకృతిని॥ అతనిరూపము జూచి ఆనిశాచరులెల్ల । కడుభీతి గొని చాల కంప మొందిరిగ॥ కంప మొందినదనుజగణములను బొడగాంచి । తనవాలమున జుట్టె తరుచరవరుండు॥ ఇందాక బింకంబు లెందు బోయెనటంచు । తనవాలమున జుట్టె తరుచరేంద్రుండు॥ తనవాలమున జుట్టి తరుచరవీరుండు । గుండపిండిగ నేల గొట్టె నందరిని॥ పెదవులను గరచుకొని శిథిలమై దేహములు । నిఖిలరాక్షసకోటి నిర్జీవులైరి॥ శతకంఠునకు వార్త దెలుపుకొరకైనను । బ్రతుకడాయె నొకండు పలుమాటలేల॥ నిర్జీవులై పడిన నిఖిలదనుజుల విడచి । ద్రోణశైలము కేగె వానరవరుండు॥ బలుతేజమున మతాబాలు వెలిగినరీతి । తేజరిల్లె శైలమున దివ్యౌషధములు॥ సంజీవికరణులు సంధానకరణులు । శల్యకరణులు గలిగి చెన్నొంద నగము॥ చెలువైన యాద్రోణశైలంబు బొడగాంచి । పలికె నగ్గిరితోడ పవననందనుడు॥ శతకంధరునితోడ సమరంబు సేయుటకు । శ్రీరామచంద్రుండు జనుదెంచినాడు॥ సేనలన్నియు మూర్ఛ జెందిపడ రాక్షసుడు । ఘోరబాణము లేసి కూలవేసెనుగ॥ నను బిలచి శ్రీరామజనవరుడు నీవద్ది । కరుగుదెమ్మని బల్కె నగకులేంద్రుండ॥ బలములన్నియు మూర్ఛ దెలియుటకు నీయందు । గలవు దివ్యౌషధము లెలమి బొందగను॥ శ్రీరాముకార్యముకు జాగుసేయక వేగ । దివ్యౌషధము లిమ్మ ధీరతను లెమ్ము॥ ప్రొద్దు దూరకముందు పోవలెను సంజీవి । త్వరమీర నిప్పించు గిరివరా నీవు॥</poem><noinclude><references/></noinclude> r625z3uu54zzyd6in55qaw6i0elc89n పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/109 104 216511 570343 565441 2026-08-16T09:01:22Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 570343 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అని యిట్లు హనుమంతు తనతోడ బల్కినను । అతనితో నిట్లనియె నాద్రోణనగము॥ అంజనీవరపుత్ర హనుమదాహ్వయ నాదు । విన్నపము గైకొనుము విన్నవించెదను॥ కంటకుడు శతముఖుడు కపులనెల్లను గూల్చి । తనపురంబున కేగి దానవుల బిలచి॥ కపులమూర్ఛలు దెలుప ఘనుడు హనుమంతుండు । అవుషధంబులకొరకు నరుదెంచు నిటకు॥ అవుషధా లేమియును హమమంతు గొనిపోవ । కుండంగ గాపుగా యుండిడీ యనుచు॥ కఠినదానవకోటి కా పుంచె నాచుట్టు । దానవునిదివ్యాజ్ఞ దప్పకుండగను॥ ఘనశౌర్యగాంభీర్య ఘడియమాత్రములోన । దుష్టదానవకోటి దునుమాడినావు॥ అవుషధము లిచ్చుటకు అర పేమియును లేదు । మనవియొక్కటి గలదు వినుము చెప్పెదను॥ దివ్యౌషధము లెల్ల తీసి నే నివ్వంగ । పగ బూని నామీద బలుడు శతముఖుడు॥ పగ బూని యతిబాధ పరుచు నాతడు నన్ను । కడురాక్షసునిబాధ పడలేను యికను॥ కుపితశతకంఠునకు కోపంబు రాకుండ । పొసగంగ నే నొక్కబుద్ధి జెప్పెదను॥ నను బలిమి పెకలించికొనిపోయినట్లుగా । గొనిపొమ్ము నింద బాయును పుణ్యచరిత॥ అట్లు గాకుండ నే నౌషధము లిస్తినా । పగ బూనియుండు నాపాపకర్ముండు॥ పెకలించుకొనిపోయి అగచరవరులకును । మూర్ఛ దెలియగ జేసె ముదము బొందించి॥ నామనవి సైరించి నన్ను మన్నన జేసి । వడి నన్ను గొనిపొమ్ము వనచరోత్తముడ॥ పరమపుణ్యము నీకు వనచరవీరుండ । మారు చెప్పక నాదుమనవి గైకొమ్ము॥ అని ద్రోణశైలంబు తనతోడ బలుకంగ । కనికరము రంజిల్ల ఘనుడు హనుమంతు॥ అవుషధంబులు బట్టి అరుగుదెంచుటకంటె । కొండతోడుత బట్టికుంటె బాగౌను॥ కపుల మేల్కొలుపంగ గావలసియున్నట్టి । ఘనవస్తుజాలముల్ గొనవచ్చుననుచు॥ కొన్ని తెచ్చితి నంచు కొన్ని తేలేదంచు । బలికితే నటు కార్యభంగంబు యనుచు॥ కొండతోడుత బట్టుకుంటె శుభం బనుచు । ఘనుడు హనుమంతుండు తనమదిని దలచె॥</poem><noinclude><references/></noinclude> sza6to2silm3qje8z66frp20u5habkx పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/110 104 216512 570344 565442 2026-08-16T09:28:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 570344 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>తనదీర్ఘవాలంబు తా కొండపై జుట్టి । పెకలించె లోకములు భీతి నొందగను॥ పెకలించి ద్రోణాద్రి తగ శిరంబున బూని । కోటిసూర్యులభంగి నేటు మీరుచును॥ వాయువేగముకన్న వడిమీర నేతెంచె । నాకాశమార్గంబు నంటి వాయుజుడు॥ ఎల్లభూములు గడచి యెల్లదిక్కులు గడచి । దేశభూములు తాను ధీరతను గడచి॥ తనరాక కతిదీక్ష గనిపెట్టియున్నట్టి । రామచంద్రుని గాంచి ప్రేమ మీరగను॥ శైల మచ్చట దించి సాష్టాంగ మొనరించి । పలుదీవనల నంది పవననందనుడు॥ అచట గల్గినవార్తలన్ని శ్రీరాములతో । విన్నపము గావించి వేగమార్గమున॥ శలవు గైకొని ద్రోణశైలంబునందున్న । సంజీవకరణులు శల్యకరణులును॥ సంధానకరణులు సకలదివ్యౌషధము । లన్ని గిరిచే నంది హనుమంతు డపుడు॥ నిదురబొందినరీతి నిర్జీవులై నేల । బడియున్న కపిబలముపై జారజల్లె॥ మనుజుసేనలపైని దనుజసేనలపైని । పరగ సంజీవి యేపార జల్లెనుగ॥ బలములన్నియు మూర్ఛ దెలియంగ హనుమంతు । వేగ దివ్యౌషధములెల్ల వేడుకను॥ ఘనయౌషధము లిట్లు కలబారజల్లితే । అమృతవరషము గురిసినట్లు బలమెల్ల॥ కలకలం బాడుచును కిలకిలారావమున । నఖిలబలములు లేచి నిలిచియుండిరిగ॥ కోలాహలంబుగను వాలములు ద్రిప్పుచును । సింహనాదములతో చెలగుచుండిరిగ॥ అతిసుందరంబుగా నఖిలబలములు లేచి । ఆనందమయు లగుచు అపుడు యుండగను॥ సకలబలముల జూచి జానకీనాయకుడు । అంతింత యనరాని సంతోష మొదవె॥ సంతోష మొప్పంగ జానకీనాయకుడు । కపివరేణ్యుని బట్టి కౌంగలించెనుగ॥ తనకంఠమున మెరయుఘనరత్నహారంబు । తీసి కపివరుమెడను వేసి రాఘవులు॥ పవనజా నీవంటి పరమబంధువుడు మాకు । పదునాల్గులోకముల వెదకినను గలడు॥ నిఖిలబలముల లేపి నింద దప్పించితివి । లేనిలోకమునందు బూని నిల్పితివి॥ అరయ ని న్నొకని నే నావగా జేసుకొని । సంగరాంబుధి నీద జాడ గంటినిగ॥ ఎన్నివిధములనైన యెన్నిదినములకైన । నీరుణము దీర్పంగ నే జాలనయ్య॥</poem><noinclude><references/></noinclude> 61cp2voudccj8xixw4dgxmsh46xbqce పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/111 104 216513 570346 565443 2026-08-16T11:26:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 570346 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>బ్రహ్మదేవునికన్న ప్రజలు దీర్ఘాయువును । వర్ధిల్లు చిరకాలవశుడవై నీవు॥ సంజీవి దెచ్చి యాచంద్రార్కముగ సకల । బలములను రక్షించి ప్రౌఢి మీరితివి॥ నోట బల్కినరీతి మాట దక్కించుకొని । నిలుపుకుంటివి కీర్తి నిఖిలలోకముల॥ అక్క గలయపుడు ఆద్రోణశైలంబు । తెగువతో పెకలించి తెచ్చియిచ్చితివి॥ తొల్లి యుండినచోట ద్రోణశైలము నిల్పి । తెల్లవారకమునుపు త్వరితముగ రమ్ము॥ అనుచు జానకిరాము తనతోడ బలుక । శలవు గైకొని యపుడు బలుడు హనుమంతు॥ తలమీద ద్రోణభూధరము తా ధరియించి । అఖిలభూములు గడచి ఆవాయుసుతుడు॥ పరగ ద్రోణాద్రి నెప్పటిస్థలంబున నిల్పి । వచ్చి శ్రీరాములకు వందనము జేసి॥ వందనము గావించువనచరేంద్రుని బట్టి । కౌగిటను బంధించి కమలనాభుండు॥ నాకు తమ్ములు మువురు నాలుగోతమ్ముడవు । నీవు పవనాత్మజా నేటిపరినుండి॥ అయిదుగురుమోయి మనయన్నదమ్ములమంచు । యెడబాయలేను ని న్నొకనిముషమైన॥ అనుచు హనుమంతుణ్ని గొనియాడుచును చాల । వేడుకను శ్రీరామవిభుడు తా నుండె॥</poem> {{p|ac|fwb}}శతకంఠుల తల్లిదరి కేగుట</p> <poem>అంతఃపురము కేగి అతిబలుడు శతకంఠు । తనతల్లి కతిభక్తి దండములు మ్రొక్కి॥ దండములు తా కొట్టి తల్లిరో యీవేళ । సమరమున కేగతిని చలముతోడుతను॥ వానరబలమంత వ్రాలి నేలను గూల । శరపరంపర గప్పి ధరణి గూల్చితిని॥ తనతమ్ములును తాను తరుణిపుత్రులు దక్క । కొదువబలముల నెల్ల గూలనేసితిని॥ మరికొన్నిబాణములు మానవేంద్రునిపైని । పూని నంతటిలోన జానకీరమణి॥ వీరస్వరూపంబు వెలది తా ధరియించి । యుండంగ నచట నే నుగ్రరూపంబు॥ సుదతియాకారంబు చూడజాలగ లేక । పురము మొగమై నేను మరలివచ్చితిని॥ అది కాలమృత్యువో అది యెట్టిభూతమో । గాని యాడది గాదు కడుమాయ గాని॥ అని కొడుకు తనతోడ నడలుచును జెప్పంగ । కడుభయంబున చిత్రగంధి తా బల్కె॥</poem><noinclude><references/></noinclude> nsvo1117911o5j1zx2hdbqbif3xkoq6 పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/206 104 216608 570329 565538 2026-08-15T12:57:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 570329 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>సంతుష్టచిత్తులై సన్మునీశ్వరు లెల్ల । వేయికన్నులు గల వేల్పు లిట్లనిరి॥ జగము సంతోషింప శతకంఠు బరిమార్చి । సీతామహాలక్ష్మి శ్రీరామమూర్తి॥ తిరిగి నే డయ్యోధ్యపురవాసులైనారు । బలములన్నియు గొల్వ ప్రౌఢి మీరగను॥ బలములన్నియు గుడువతలపు జేసెను నేడు । దశరథరాముండు దయ బెనంగొనగ॥ వర్షధారలను నంబరవీథిచుక్కలను । యిసుకనైనను లెక్క నెన్నగావచ్చు॥ అట్టిబలముల కెల్ల ఆరామచంద్రుండు । భక్ష్యాన్నములు జేయ భావమున దలచె॥ పాకంబు జేయ నేబలుల శక్యం బౌను । వడ్డింపగా నెవరివశము దేవేంద్ర॥ కరుణించి నీవు నీకామధేనువ నిచ్చి । బలములను సంతృప్తి పరచంగవలెను॥ ఆబలంబులకెల్ల హారములు సమకూర ! కామధేనువ గాక కలదె యెందైన॥ పరమాత్ముడగు రామభద్రునికి ప్రీతిగా । కరుణింపవయ్య నీకామధేనువను॥ తిరిగి రేపటిరోజువరకు ధేనువను । నీపురికి పంపెదము నిర్జరాధిపుడ॥ అని రుషులు వేడంగ నపుడు దేవేంద్రుండు । మోదాత్ముడై సర్వమునుల కిట్లనియె॥ బలము లాకలి దీర్ప పరమవేడుక నాకు । స్వామికార్యము సకలసంతోషకరము॥ ఆలస్య మేల నాయడ్డ మేమియు లేదు । ధేనువును గొనిపొండి మౌనీంద్రులార॥ అని వేలుపులగిడ్డి నమరాధిపుం డిచ్చె । పరమర్షిగణములకు భక్తితోడుతను॥ రాముకార్యం బెల్ల రంజిల్లజేతునని । వెడలె సంతోషమున వేలువులగిడ్డి॥ వేలుపుల లెల్లావు వెనువెంట దోడుకొని । స్వామిసన్నిధి కేగి రామహాఋషులు॥ పరమాత్మ మేమంత భవదాజ్ఞ తలనుంచి । ఘనముగా దెస్తి మిటు కామధేనువును॥ బలములందరి కిపుడు పరితృప్తిగా జేసి । షడ్రసాన్నము లెల్ల జరిగించవచ్చు॥ సెలవు మా కొసగుమా జానకీనాయకా । అని రాము వినుతించె నఖిలమునివరులు॥ వినుతించి రామభూవరుని శలవందుకొని । తమతమాశ్రమములకు తర్లి రామునులు॥ కరుణ మీరగ విశ్వకర్మను బిలిపించి । పలికె నాతనితోడ పరమాత్ము డపుడు॥</poem><noinclude><references/></noinclude> ommf01tpzaiawfleqlb4o5xuvangk1n పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.2 (1922).pdf/25 104 218145 570341 569814 2026-08-16T08:38:02Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 570341 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="25A" />ముఖముగను, జయప్రదముగను నడపుటకు ప్రయత్నములు సల్పుచున్నారు. మీదంద రద్దానికి దోడ్పడి దాస్యభూ యిష్టమగు విద్యను పొందినందులకు చింతించుచు నిక ముం 0 ఆణచిన నణగక నారాటపడుచు 8F 'దువచ్చు సంతానమునకైనను జాతీయసాంప్రదాయముల పై నాధారపడువిద్యను గరపి దేశదాస్యవిముక్తికై పాటు పడవలయునని ప్రార్థించుచు విరమించుచున్నాను. - కురుగంటి సీతా రామయ్య . <section end="25A" /> <section begin="25B" />మొగమాటము . పడుచు యపు టుబ్బ పారవశ్యమున తనకంఠ మెత్తి తీయని పాటఁ బాడ నుఱ్ఱూతలూగు నీ యుత్సాహసఖిని పల్లె తనీయ నీ పాపమేమోయి. పచ్చనియెలదోట పడక లనడుమ తెల్లని సెలయేటి తిన్నెలమీద నలువురు కలకల నవ్వురచ్చలను తన కంఠ మితి 3 పూలపిందెలతరుల్ పురుడాడు వాడ చూడియాల్ నడ లేక సోలేటి చోట దిసి మొలపనిక స్నె తిరి గేటియెడల పొద్దు ప్రొద్దున పొడల్ పుష్పించుకడల తన కంఠమెతి ४ ఎంత గారాబమో! యెంత మోహుబొ! ఎంత దాపఃక మో! యొత పామర మొ! కడకు ఘోషాక న్నె గాజేసి నావు నీ గానముదిత నూ రాగలరంగ! తన కంఠ మె తి పలుకుసింగారంబు పైకి రాకుండ ముసుగులో ముచ్చ టే ముద్దోయి ప్రియుడ వినరాని పాటలే వేడకోసఖుఁడ E. సన్న గాపాడినా సంతో స మేను మెల్లగాబాడినా యుల్లాసమేరు పదములు చెదరినా పాటింపఁబోము తలలో సాలు వెతకఁగబోము తీయగా హాయిగా తెనుగుగీతముల పాడనీవోయి నీబంగారు చెలిసి. <section end="25B" /> <section begin="25C" />{{Center|{{p|fs150}}ఆంధ్రగీర్వాణవిద్యాలయము, కొవ్వూరు</p>}} శ్రీయుత తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారిచే 1912 సం౹౹రమున స్టాపింపఁబడినది. 10 సంవత్సరముల నుంచి అవిచ్ఛిన్నముగ నాంధ్రగీర్వాణ విద్యల యభివృద్ధికై పని చేయుచున్నది. ఆంధ్ర సాహిత్యము ప్రత్యేకము గాదుకదా, పేరునకైన నేర్పు విద్యాలయములు దేశమునం దెచ్చటనుగూడలేవు. ఆంధ్ర సాహిత్యమున గట్టిపునాదిలేనిచో నా౦ధ్రవాఙ్మయము పరిశుద్దమయిన చెప్పటికి గాని దేశమున బయలుదేరనేరదు. ఆంధ్రవాఙ్మయము లేనిచో నాంధ్రదేశమునకు వృద్ధిలేదు. దొరతనము వారి పాఠశాలలోగూడ దేశభాషయందే సర్వవిషయములును నేర్పబడవలెనను నభిప్రాయములు ప్రబలియున్న యిక్కలమున నిట్టివిద్యాలయముల యావశ్యకత వేరుగఁజెప్ప నక్కరలేదు. సంస్కృతములేక యాంధ్ర సాహిత్యమునకు జీవము లేదు. అందువలన ఆంధ్రగీర్వాణ సాహిత్యములకు బాధాన్యమొసంగి వానియభివృద్ధికై యీయీవిద్యాలయము పనిచేయుచున్నది. ఆంగ్ల విద్యాపరిచయమున్న గాని నూతనభావములు పెంపొందుటయు బ్రస్తుతకాలమునకనువగు విద్యావబోధము గల్గుటయు సంభవింపదు. దానికై ఆంగ్లభాషాగ్రంథముల అర్థముచేసికొనుటకు దగిన యాభాషాజ్ఞానముకూడ నిందు నేర్పబడును, ఆంధ్ర <section end="25C" /><noinclude><references/></noinclude> 4v48kpm72s2i0ork61tr1tbmsz64zep పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.2 (1922).pdf/26 104 218146 570342 569815 2026-08-16T08:49:52Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 570342 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude><section begin="26A" />గీర్వాణములయందు గట్టిపునాది కుదిరిన వెనుక గాని యాంగ్లభాష నేర్పబడదు. ఇందులో గొన్ని భూములు దానపూర్వకముగ లభ్య తక్కము, వ్యాకరణము, వేదాంతము మున్నగు శాస్త్రములన్నియు నిప్పుడు సంస్కృతమునం దేయుండుటచే నా శాస్త్రములు పూర్వ సుమాదిరినే బోధింపఁబడుచున్నవి. గురుకులవాసమున విద్యాభ్యాసముకల్గినఁ గాని దైవభక్తి, జాతీయభావము, దేశభక్తి, గురుభక్తి మున్న గుణవి చిన్న నాటనుండి యు నల వడుట స- ధనింపదు. చిన్న నాట నేకుదిరిన గాని పెద్ద యయిస వెనుక నివి లభ్యముగా నేగవు. అందులకై గురు శిష్యులు విద్యాలయమునందె యుండి విద్యాభ్యాసము జరుపుటకు దగ్నిఋగవు కొంత వరకేర్పరుపఁబడింది. వర్ణా శ్రమవిధుల ననుసరించి చాతుర్వర్ణ్యముల వారికిని విద్య గరపు నేర్పాటులు చేయబడినవి. ఇప్పుడు 60 మంది విద్యార్థులును 8 గురు ఉపా ధ్యాయలును నున్నారు. విద్యార్థు అందఱకును భోజన సదుపాయ ముచితముగానే చేయబడుచున్నది. ఏ కొలది మంది యొతప్ప విద్యార్థులందరును గాళిదాసత్రయ యువఱ నను సంస్కృతము నేర్చినవారేగాని కింది తరగతి వారు లేరు. అధ్యాపకభృతికిని విద్యార్థులభోజకములకును నెలకు దాదాపు వేయిరూపాయిల ఖర్చున్నది. విద్యాలయమునకు “నాలుగు వేలరూపాయలు వఱకును వచ్చు సిరివసతులున్నవి. ge మైనవి. దాదాపు ఇరువై వేల రూపాయిల యప్పులున్నవి. అవి తీరనఁ గాని ఆ యాదాయమును దీని వెచ్చి మునకై స్వేచ్ఛగా వినియోగింప నవకాశము లేదు. దొరతనము వారి సహాయము గత సం॥రం రు 600 లం మాత్రమె వచ్చినవి. ఒక్క నెల వెచ్చమునకుకూడ జాలదు. విద్యాలయమునకు రెండు భవనములు మాత్రమున్నవి. ఒకటి విద్యామందిరము, రెండునది భోజనశాల. అధ్యా పకులకు వాసగృహములును విద్యార్థులు చదువుకొను టకు బ్రత్యేక భవనములును నిర్మింపవలసియున్నది. స్థల ముమాత్రము సంపాదిత మైనది. ఈ యిండ్ల కొన్నిటికిని సధమ మిక యెదు వేల రూపాయిలయిన నుండవలెను. Pa నియంత గానుండి మొన్నటివఱకును సంస్కృత విద్యాశాల లకు నూప గెంటెండెంటుగానున్న శ్రీమత్ తిరుమల గుది మెళ్ళ వరదాచార్యులు ఎమ్. యె. గారు నెలకు రెండువందల రూపాయిలు వచ్చు తమ యుద్యోగమును వదలి దీనికి యుచితముగా బని చేయుచున్నారు. బ్రహ్మశ్రీ పురఘళ్ళ సూర్యనారాయణశాస్త్రిగారు విద్యాలయమునకు చందాలు ధర్మాధముగ. పోగుచేయు విషయమున రక్ష ముగ రాత్రిం బగళ్ళు మిగుల గష్టించి పనిజేయుచున్నారు <section end="26A" /> <section begin="26B" />అమర గానము. మధుర సంధ్యల వీధిగుమ్మములనిలచి అలతిసిగ్గుల వాడిచూపులను 'మెలసి, మొలకనవ్వుల విశ్వమ్ముఁ గలత పెట్టు పదిపదా పేండ్ల వయసు పైఁబడని పడుచు పిల్లలు, తమంతఁదాముగా నల్లుకొనిగ సంస్కృతములైన నిడువాలు జడల ముడువ మొగ్గ విడిచిన పరనుల్లెపూవు టర్మ లనుదొడిగి దివ్యసుమకోమలమ్ము 3 అయిన యువకుల హృదంతరమ్ముల నవయ నేయు మన్మధునివిఁటిసడి వినంబడు వసంత చంది కాస్వాద్ర యమునాప్రశాంతే సలిల మృదుల భావగీతమ్ముల మేళవించి ప్రకృతి సర్వమ్ము తన్మయక్వమ్ము నొంద మురళిమో యింపఁగ లిగిన ముద్దుకృష్ణు సమర గానమ్ము లీలాశుకాదు లట్టి ఎఁదఱి కవీశ్వరులనో సృజింపఁగలదు. -కొడాలి ఆంజనేయులు.<section end="26B" /><noinclude><references/></noinclude> ao5i1gwlp4chbe15d6f22a8ph941n32 570345 570342 2026-08-16T09:47:40Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 570345 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="26A" />గీర్వాణములయందు గట్టిపునాది కుదిరిన వెనుక గాని యాంగ్లభాష నేర్పబడదు. తర్కము, వ్యాకరణము, వేదాంతము మున్నగు శాస్త్రములన్నియు నిప్పుడు సంస్కృతమునందేయుండుటచే నాకాశాస్త్రములు పూర్వసుమాదిరినే బోధింపఁబడుచున్నవి. గురుకులవాసమున విద్యాభ్యాసముకల్గినఁగాని దైవభక్తి, జాతీయభావము, దేశభక్తి, గురుభక్తి మున్నగుణవి చిన్ననాటనుండియు నలవడుట స౦భవి౦పదు. చిన్న నాటనేకుదిరిన గాని పెద్దయయిసవెనుక నివి లభ్యముగానేరవు. అందులకై గురుశిష్యులు విద్యాలయమునందెయుండి విద్యాభ్యాసము జరుపుటకు దగినయిరవు కొంతవరకే ర్పరుపఁబడింది. వర్ణాశ్రమవిధుల ననుసరించి చాతుర్వర్ణ్యములవారికిని విద్యగరపునేర్పాటులు చేయబడినవి. ఇప్పుడు 60 మంది విద్యార్థులును 8 గురు ఉపాధ్యాయలును నున్నారు. విద్యార్థులందఱకును భోజన సదుపాయముచితముగానే చేయబడుచున్నది. ఏ కొలది మందియొ తప్ప విద్యార్థులందరును గాళిదాసత్రయయువఱకయినను సంస్కృతము నేర్చిన వారేగాని కింది తరగతి వారు లేరు. అధ్యాపకభృతికిని విద్యార్థుల భోజనములకును నెలకు దాదాపు వేయిరూపాయిల ఖర్చున్నది. విద్యాలయమునకు నాలుగువేల రూపాయలు వఱకును వచ్చు స్టిరవసతులున్నవి. ఇందులో గొన్నిభూములు దానపూర్వకముగ లభ్యమైనవి. దాదాపు ఇరువైవేల రూపాయిల యప్పులున్నవి. అవి తీరనఁగాని ఆ యాదాయమును దీనివెచ్చిమునకై స్వేచ్ఛగా వినియోగింప నవకాశము లేదు. దొరతనము వారి సహాయము గత సం॥రం రు.600 లు మాత్రమె వచ్చినవి. ఒక్క నెల వెచ్చమునకుకూడ జాలదు. విద్యాలయమునకు రెండు భవనములు మాత్రమున్నవి. ఒకటి విద్యామందిరము, రెండునది భోజనశాల. అధ్యాపకులకు వాసగృహములును విద్యార్థులు చదువుకొనుటకు బ్రత్యేక భవనములును నిర్మింపవలసియున్నది. స్థలము మాత్రము సంపాదితమైనది. ఈ యిండ్ల కన్నిటికిని సధమ మిరవైయైదువేల రూపాయిలయిన నుండవలెను. మొన్నటివఱకును సంస్కృత విద్యాశాలలకు నూపగెంటెండెంటుగానున్న శ్రీమత్ తిరుమల గుదిమెళ్ళ వరదాచార్యులు ఎమ్. యె. గారు నెలకు రెండు వందల రూపాయిలు వచ్చు తమ యుద్యోగమును వదలి దీనికి నియంతగానుండి యుచితముగా బని చేయుచున్నారు. బ్రహ్మశ్రీ పురఘళ్ళ సూర్యనారాయణశాస్త్రిగారు విద్యాలయమునకు చందాలు పోగుచేయు విషయమున ధర్మార్థముగ రాత్రిం బగళ్ళు మిగుల గష్టించి పనిజేయు చున్నారు {{rule |6em }} <section end="26A" /> <section begin="26B" />అమర గానము. మధుర సంధ్యల వీధిగుమ్మములనిలచి అలతిసిగ్గుల వాడిచూపులను 'మెలసి, మొలకనవ్వుల విశ్వమ్ముఁ గలత పెట్టు పదిపదా పేండ్ల వయసు పైఁబడని పడుచు పిల్లలు, తమంతఁదాముగా నల్లుకొనిగ సంస్కృతములైన నిడువాలు జడల ముడువ మొగ్గ విడిచిన పరనుల్లెపూవు టర్మ లనుదొడిగి దివ్యసుమకోమలమ్ము 3 అయిన యువకుల హృదంతరమ్ముల నవయ నేయు మన్మధునివిఁటిసడి వినంబడు వసంత చంది కాస్వాద్ర యమునాప్రశాంతే సలిల మృదుల భావగీతమ్ముల మేళవించి ప్రకృతి సర్వమ్ము తన్మయక్వమ్ము నొంద మురళిమో యింపఁగ లిగిన ముద్దుకృష్ణు సమర గానమ్ము లీలాశుకాదు లట్టి ఎఁదఱి కవీశ్వరులనో సృజింపఁగలదు. -కొడాలి ఆంజనేయులు.<section end="26B" /><noinclude><references/></noinclude> m1mv7de9ycv2c61bhs298rmobzpcj4o