మందపల్లి
వికీపీడియా నుండి
మందపల్లి, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము
ఈ గ్రామంలోనే ప్రసిద్ధి పొందిన శనీశ్వరాలయం ఉంది. మందేశ్వరాలయం గా కూడా ప్రశస్తి పొందినది.
తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి 38 కిలోమీటర్ల దూరంలోనూ, రావులపాలెంకు 9 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు.
శనివారం నాడు, శనిత్రయోదశి నాడు, మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు. ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని , వెనక్కు తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు.
- మెదక్ జిల్లా, చిన్న కోడూరు మండలంలోని ఇదేపేరు గల గ్రామము కోసం మందపల్లి(చిన్నకోడూరు మండలం) చూడండి.

