కాకినాడ
వికీపీడియా నుండి
| కాకినాడ (పట్టణ) మండలం | |
| బొమ్మ:EastGodavari mandals outline24.png | |
| జిల్లా: | తూర్పు గోదావరి |
| రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
| ముఖ్య పట్టణము: | కాకినాడ (పట్టణ) |
| గ్రామాలు: | 0 |
| జనాభా (2001 లెక్కలు) | |
|---|---|
| మొత్తము: | 296.329 వేలు |
| పురుషులు: | 146.476 వేలు |
| స్త్రీలు: | 149.853 వేలు |
| అక్షరాస్యత (2001 లెక్కలు) | |
| మొత్తము: | 75.20 % |
| పురుషులు: | 80.14 % |
| స్త్రీలు: | 70.38 % |
| చూడండి: తూర్పు గోదావరి జిల్లా మండలాలు | |
కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ 16.93° ఉత్తర అక్షాంశం (lattitude)దగ్గర, 82.22° తూర్పు రేఖాంశం (longitude) దగ్గర ఉంది. భారతీయ కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోవటం గమనార్హం.
కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయల మాదిరి ఉండి, కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ.
కాకినాడ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి 564 కి మీ ల దూరంలో ఉన్నది. చెన్నై - కోల్కతా రైలు మార్గం లో సామర్లకోట దగ్గర బండి మారాలి. కాకినాడ నుండి ఇతర ప్రాంతాలకు దూరాలు, కిలోమీటర్లలో:
బెంగుళూరు 856
చెన్నై 684
హౌరా (కోల్కతా) 1028
ముంబై 1234
ఢిల్లీ 1848
రాజమండ్రి 65
విజయవాడ 223
విశాఖపట్నం 162
కాకినాడ ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులోనే ఉంది. ఇది రాష్ట్రములోని ప్రధానమైన ఓడరేవులలో ఒకటి. రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.
భారతదేశంలో వాసయోగ్యమైన బహుకొద్ది నగరాలలో కాకినాడ ఒకటిగా ఉండేది. తిన్నటి విశాలమైన వీధులు, విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి గ్రంధాలయాలు, కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దరిదాపు 1900 సంవత్సరం నుండీ ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు కూడ రావటంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతోంది.
కాకినాడలో ఉన్న విద్యా పీఠాలు:
- పిఠాపురం రాజావారి కళాశాల (P. R. College), ఇది చాల రోజులబట్టి ఉన్న కళాశాల. రఘుపతి వెంకటరత్నంనాయుడు, వేమూరి రామకృష్ణారావు వంటి ఉద్దండులు ఇక్కడ పని చేసేరు.
- ఆంధ్రా పోలీటెక్నిక్
- జవాహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College). ఇది ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెట్టాలన్న ఉద్దేశ్యంతో గిండీ ఇంజనీరింగు కాలేజీ నుండి దీనిని విడదీసేరు. మొదట్లో గిండీ లో ఉన్న ఆచార్యబృందాన్నే ఇక్కడికి బదిలీ చేసేరు. కాని వాల్తేరులో వనరులు లేక కాకినాడలో తాత్కాలికంగా పెట్టేరు. అది అలా అక్కడే 'ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాల, కాకినాడ' (Government College of Engineering, Kakinada)అన్న పేరుతో స్థిరపడి పోయింది. తరువాత జవాహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (Jawaharlal Nehru Technological University) స్థాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాలలన్నిటిని ఈ కొత్త విశ్వవిద్యాలయానికి అనుబంధించేరు.
- ప్రగతి ఇంజనీరింగు కాలేజి
- ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
- చైతన్య ఇంజనీరింగు కాలేజి
- శాయి ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
- రంగరాయ మెడికల్ కాలేజి ([[1]])
- ఆంధ్ర విశ్వవిద్యాలయం - స్నాతకోత్తర విద్యా కేంద్రం (Andhra University - Post-graduate Extension Center)
- MSN Charities Educational Institutions
- MSN English Medium School (Nehru Convent)
- Seahorse Academy of Merchant Navy
- Rajiv Gandhi Institute of Management and Science
[మార్చు] తూర్పు గోదావరి జిల్లా మండలాలు
మారేడుమిల్లి - వై.రామవరం - అడ్డతీగల - రాజవొమ్మంగి - కోటనందూరు - తుని - తొండంగి - గొల్లప్రోలు - శంఖవరం - ప్రత్తిపాడు - ఏలేశ్వరం - గంగవరం - రంపచోడవరం - దేవీపట్నం - సీతానగరం - కోరుకొండ - గోకవరం - జగ్గంపేట - కిర్లంపూడి - పెద్దాపురం - పిఠాపురం - కొత్తపల్లె - కాకినాడ(గ్రామీణ) - కాకినాడ (పట్టణ) - సామర్లకోట - రంగంపేట - గండేపల్లి - రాజానగరం - రాజమండ్రి (గ్రామీణ) - రాజమండ్రి (పట్టణ) - కడియం - మండపేట - అనపర్తి - బిక్కవోలు - పెదపూడి - కరప - తాళ్ళరేవు - కాజులూరు - రామచంద్రాపురం - రాయవరం - కపిలేశ్వరపురం - ఆలమూరు - ఆత్రేయపురం - రావులపాలెం - పామర్రు - కొత్తపేట - పి.గన్నవరం - అంబాజీపేట - ఐనవిల్లి - ముమ్మిడివరం - ఐ.పోలవరం - కాట్రేనికోన - ఉప్పలగుప్తం - అమలాపురం - అల్లవరం - మామిడికుదురు - రాజోలు - మలికిపురం - సఖినేటిపల్లి

