వరంగల్
వికీపీడియా నుండి
| వరంగల్ జిల్లా | |
|---|---|
| రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
| ప్రాంతము: | తెలంగాణ |
| ముఖ్య పట్టణము: | వరంగల్ |
| విస్తీర్ణము: | 12,846 చ.కి.మీ |
| జనాభా (2001 లెక్కలు) | |
| మొత్తము: | 32.21 లక్షలు |
| పురుషులు: | 16.37 లక్షలు |
| స్త్రీలు: | 15.93 లక్షలు |
| పట్టణ: | 6.2 లక్షలు |
| గ్రామీణ: | 26.1 లక్షలు |
| జనసాంద్రత: | 252 / చ.కి.మీ |
| జనాభా వృద్ధి: | 14.63 % (1991-2001) |
| అక్షరాస్యత (2001 లెక్కలు) | |
| మొత్తము: | 58.41 % |
| పురుషులు: | 70.01 % |
| స్త్రీలు: | 46.54 % |
| చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | |
వరంగల్(వరంగల్లు , పూర్వము ఓరుగల్లు) దక్షిణ భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం లో ఒక జిల్లా. ఇది రాష్ట్ర రాజధాని అగు హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మి దూరంలో ఉన్నది. వరంగల్ జిల్లా కు ముఖ్య పట్టణం - వరంగల్. కాకతీయ మెడికల్ కాలేజి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (పూర్వపు Regional Engineering College),Kakatiya Institute of Technology and Sciences, కాకతీయ విశ్వవిద్యాలయము మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు వరంగల్లులో ఉన్నాయి. కాకతీయ విశ్వవిధ్యాలయం లో పనిచేస్తున్న కాత్యాయనీ విధ్మహే వెయ్యేళ్ళ ఓరుగల్లు అనే ఉద్గ్రంధం సంకల్పించారని తెలిసింది. అది వస్తే చాలా సాధికారక సమాచారం దొరుకుతంది.
విషయ సూచిక |
[మార్చు] వరంగల్ జిల్లా
వరంగల్ జిల్లా 12,846 చ కి మీ లలో వ్యాపించి 32,31,174 (2001 లెక్కలు) జనాభా కలిగిఉంది. గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి మరియు పొగాకుకు పంటలు విరివిగా పండుతాయి.
[మార్చు] చరిత్ర
క్రీ.శ. 12 - 14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాలుగు వైపులా శిలా ద్వారాలు కలిగిన పెద్ద కోట, స్వయంభూ దేవాలయము, రామప్ప దేవాలయము మొదలైనవి వీటిలో కొన్ని. కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయులలో ప్రముఖ పాలకులు గణపతిదేవ చక్రవర్తి,రుద్రమ దేవి, ప్రతాప రుద్రుడు.
14 వ శతాబ్దంలో బహమనీ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అది గోల్కొండ ను పాలిస్తున్న దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687 లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యం లో భాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో వరంగల్లుతో సహా హైదరాబాదు భారత దేశంలో కలిసి పోయింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం తో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.
పురావస్తు శాఖవారు ఈ మధ్యకాలంలో చారిత్రాత్మక కట్టడం అయిన వేయి స్తంభముల దేవాలయాన్ని మరమత్తు చెయడానికి పూనుకొన్నారు. అయితే వారు జరిపిన త్రవ్వకాలలో ఒక విస్మయం చెందే విశయం బయటపడినది. ఉత్తరం దిక్కుగా ఉన్న ఆలయం క్రింద ఒక నీటితొ నిండిన బావి బయటపడినది. ఉపరితలం నుండి సుమారు 3-4 మీటర్ల లోతున ఈ బావి ఉంది. అంతేకాకుండా కట్టడం క్రింద అనగా పునాది క్రింద మొత్తం ఇసుకతో ఉండడం మరొక విశయం. ఆకాలం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. ఇలా పునాది క్రింద మొత్తం ఇసుకతో కట్టడానికి భూకంపాలనుండి రక్షించడానికి అని కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ విశయం మీద పురావస్తు శాఖ ఇంకా తన పరిశోధన కొనసాగిస్తుంది.
[మార్చు] ఇతర విశేషాలు
- జిల్లాలో ప్రతీ రెండేళ్ళ కొకసారి జరిగే సమ్మక్క-సారక్క జాతరకు 50 లక్షల మందికి పైగా యాత్రికులు వస్తారు. వరంగల్లుకు 90 కి.మీ ల దూరంలో గల తాడువాయి గ్రామం వద్ద జరిగే ఈ జాతర అధర్మ చట్టాన్ని ఎదిరించి పోరాడిన ఒక తల్లీ, కూతురుల ప్రతిఘటనకు స్మృత్యర్ధం జరుగుతుంది.
- [Communist Party of India (Marxist-Leninist) People's Warపీపుల్స్వార్ గ్రూపు, (ప్రస్తుత మావోయిస్టుల)కు వరంగల్లు జిల్లా గట్టి స్థావరం.
- వరంగల్లు ఆంధ్ర ప్రదేశ్ లోకెల్లా ఐదవ అతి పెద్ద నగరము.
- రెవిన్యూ డివిజన్లు (5): వరంగల్, మహబూబాబాద్,ములుగు,జనగాం,నర్సంపేట.
- లోక్సభ స్థానాలు (2): వరంగల్, హన్మకొండ
- శాసనసభ స్థానాలు (14): వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, స్టేషన్ ఘనపూర్, ములుగు, పరకాల , వర్థన్నపేట, డోర్నకల్, శాయంపేట, నర్సంపేట, చేర్యాల, చెన్నూరు, ఏటూరునాగారం, జనగాం .
[మార్చు] వరంగల్ మండలాలు
భౌగోళికంగా వరంగల్ జిల్లాను 50 రెవిన్యూ మండలములుగా విభజించినారు.
![]() |
|||||
| సంఖ్య | పేరు | సంఖ్య | పేరు | సంఖ్య | పేరు |
|---|---|---|---|---|---|
| 1 | చేర్యాల | 18 | తొర్రూర్ | 35 | దుగ్గొండి |
| 2 | మద్దూర్ | 19 | నెల్లికూదురు | 36 | గీసుకొండ |
| 3 | నెర్మెట్ట | 20 | నర్సింహులపేట | 37 | ఆత్మకూరు |
| 4 | బచ్చన్నపేట | 21 | మరిపెడ | 38 | శ్యాంపేట |
| 5 | జనగాం | 22 | డోర్నకల్లు | 39 | పరకాల |
| 6 | లింగాల ఘనాపూర్ | 23 | కురవి | 40 | రేగొండ |
| 7 | రఘునాథపల్లి | 24 | మహబూబాబాద్ | 41 | మొగుళ్ళపల్లి |
| 8 | స్టేషన్ ఘనాపూర్ | 25 | కేసముద్రం | 42 | చిట్యాల |
| 9 | ధర్మసాగర్ | 26 | నెక్కొండ | 43 | భూపాలపల్లి |
| 10 | హసన్పర్తి | 27 | గూడూరు | 44 | ఘనపూర్ |
| 11 | హనుమకొండ | 28 | కొత్తగూడెం | 45 | ములుగు |
| 12 | వర్ధన్నపేట | 29 | ఖానాపూర్ | 46 | వెంకటాపూర్ |
| 13 | జాఫర్గఢ్ | 30 | నర్సంపేట | 47 | గోవిందరావుపేట |
| 14 | పాలకుర్తి | 31 | చెన్నారావుపేట | 48 | తడ్వాయి |
| 15 | దేవరుప్పుల | 32 | పర్వతగిరి | 49 | ఏటూరునాగారం |
| 16 | కొడకండ్ల | 33 | సంగం | 50 | మంగపేట |
| 17 | రాయిపర్తి | 34 | నల్లబెల్లి | 51 | వరంగల్ |
[మార్చు] చూడవలసిన ప్రదేశాలు
- భద్రకాళి దేవాలయము
- వేయి స్తంభాల దేవాలయము
- కాకతీయ మ్యూజికల్ గార్డెన్
- ఖిలా వరంగల్
- వన విజ్ఞాన్ (జూ పార్కు)
- ప్లానిటోరియం
- రామప్ప దేవాలయము
- పాకాల సరస్సు
[మార్చు] బయటి లింకులు
- వరంగల్ జిల్లా అధికారిక వెబ్సైటు
- కాకతీయ విశ్వవిధ్యాలయం
- నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వరంగల్ - ఒకప్పటి వరంగలు ఆర్.ఈ.సీ
- కాకతీయ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ వరంగల్
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సైటులో వరంగల్ జిల్లా వివరాలు
- కాకతీయ శిలా తోరణము
- ఖుష్ మహల్
| ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | |
|---|---|
| అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు | |


