గుండమ్మ కథ
వికీపీడియా నుండి
| గుండమ్మ కథ (1962) | |
| దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
|---|---|
| నిర్మాణం | బి.నాగిరెడ్డి , చక్రపాణి |
| రచన | పింగళి నాగేంద్రరావు |
| కథ | చక్రపాణి |
| తారాగణం | నందమూరి తారక రామారావు , అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి, రేలంగి , జమున , ఎస్.వి.రంగారావు , సూర్యకాంతం , ఛాయాదేవి , రమణారెడ్డి , హేమలత , హరనాథ్ , ఎల్ విజయలక్ష్మి , ముక్కామల, ఋష్యేంద్రమణి , రాజనాల |
| సంగీతం | ఘంటసాల |
| నేపథ్య గానం | ఎస్.జానకి, పి.లీల, ఘంటసాల, పి.సుశీల |
| గీతరచన | పింగళి నాగేంద్రరావు |
| సంభాషణలు | డి.వి.నరసరాజు |
| ఛాయాగ్రహణం | మార్కస్ బార్ట్లీ |
| నిర్మాణ సంస్థ | విజయా ప్రొడక్షన్స్ |
| విడుదల తేదీ | 7 జూన్ 1962 |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో ఆఖరి విజయవంతమైన చిత్రం గుండమ్మ కథ. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కధ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి.
కధ
గుండమ్మ (సుర్యకాంతం) ఒక గయ్యాళి గృహిణి. ఆమె స్వంత కూతురు సరోజగా జమున, సవతి కూతురు జమునగా సావిత్రి నటించారు. ఇంటెడు చాకిరీ సవతి కూతురు మీద పడుతుంది. స్వంత కూతురు మాత్రం పెంకిగా తయారవుతుంది. గుండమ్మగారి గతించిన భర్తకు స్నేహితుడైన ఒక జమీందారు రామ భద్రయ్య (ఎస్.వి.రంగారావు) పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్ధం చేసుకొంటాడు. ఇద్దరు పిల్లలనూ తన కోడళ్ళుగా చేసుకొని చనిపోయిన తన స్నేహితుని ఆత్మకు శాతి కలిగించాలనుకొంటాడు.
వారి పధకం ప్రకారం పెద్దకొడుకు అంజి (ఎన్.టి.ఆర్.) గుండమ్మగారి ఇంట్లో పనివాడిగా చేరతాడు. పొగరున్న పనిమంతుడుగా గుండమ్మ విశ్వాసాన్ని, తోటి పనివాడిగా లక్ష్మి మనసును చేజిక్కించుకుంటాడు. ఇంట్లోనే ఉండి చాకిరీ చేస్తాడని గుండమ్మ అంజికి సవతికూతురునిచ్చి పెళ్ళి చేస్తుంది. ఇక రామ భద్రయ్య రెండవ కొడుకు రాజా (ఏ.ఎన్.ఆర్.) సరోజను పెళ్ళి చేసుకొని కాస్త కటువుగా ప్రవర్తించి ఆమె పెంకి తనాన్ని అదుపులో పెడతాడు.
పౌరాణిక చిత్రాల దర్శకునిగా పేరు పొందిన కమలాకర కామేశ్వరరావు ఈ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించి శభాష్ అనిపించుకొన్నాడు. డి.వి.నరసరాజు పసందైన సంభాషణలు అందించాడు. మచ్చుకు:
- పాలలో నీళ్ళు కలపకపోతే పెట్రోల్ కలుపుతారా?
- వున్నోళ్ళంతా యదవలైతే మన తెలివికేం? దివిటీలా వెలిగిపోదూ?
- ఆశకు చావు లేదు
ఈ సినిమాలో ఘంటసాల బాణీలు కూర్చిన పాటలు చిరకాలం నిలచిపోయాయి.
- కోలు కోలోయమ్మ కోలో! కొమ్మలిద్దరు మాంచి జోడూ
- వేషము మార్చెను, భాషను మార్చెను... అయినా మనిషి మారలేదూ.. ఆతని ఆస తోరలేదూ
- ప్రేమ యాత్రలకు బృందావనము కాష్మీరాలు ఏలనో
ఈ పాటలలో పింగళి నాగేంద్రరావు "సఖినెర చూపుల చల్లదనం", "జగమున ఊటీ సాయగా" వంటి అందమైన పదాలు క్రొత్తగా పొందుపరచాడు. ప్రేయసి జడను వలపుపాశంతో పోల్చాడు.

