వాడపల్లి(దామరచర్ల మండలం)
వికీపీడియా నుండి
వాడపల్లి (Wadapally), నల్గొండ జిల్లా, దామరచర్ల మండలానికి చెందిన గ్రామము.
వాడపల్లినే విష్ణుపురం అని కూడా అంటారు. ఈ గ్రామం కృష్ణా, మూసీ నదులు కలిసే చోట ఉంది. జిల్లా కేంద్రమైన నల్గొండ వాడపల్లికి వాయువ్యదిశలో ఉంటుంది. మిరియాలగూడ నుండి వాడపల్లికి 25 కి.మీ. దూరం.
12వ శతాబ్దంలో కాకతీయుల కాలంనాటి "మీనాక్షీ అగస్తేశ్వర స్వామి" మందిరం వాడపల్లిలో ప్రసిద్ధం. రాశీ సిమెంట్సు వారు అక్కడ రైల్వే స్టేషను కూడా కట్టారు. ఐతే అక్కడనుంచి గుడికి వెళ్లటం దూరం. కృష్ణానది ఇవతల వొడ్డు పొందుగుల. అక్కడ దిగొచ్చు. (To be updated)

