కూళ్ళ
వికీపీడియా నుండి
కూళ్ళ , తూర్పు గోదావరి జిల్లా, పామర్రు (తూ.గో జిల్లా) మండలానికి చెందిన గ్రామము
అత్యంత పురాతనమైన ఈ గ్రామం గౌతమి (గోదావరి) నదీ తీరంలో ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రాలైన ద్రాక్షారామ, కోటిపల్లి లకు అతి చేరువలో ఉంది. గ్రామంలో సోమేశ్వర స్వామి, వేంకటేశ్వర స్వామి, కనకదుర్గ ఆలయాలు ఉన్నవి. దక్షాణమ్మవారు గ్రామదేవతగా కొలువుదీరి ఉన్నారు. గ్రామానికి నరజాడ, తమ్మయ్యపాలెం, మల్లవరం తదితరాలు శివారు గ్రామాలుగా కలవు. గ్రామానికి పామర్రు, వాకతిప్ప, కోరుమిల్లి, సుందరపల్లి, అముజూరు సరిహద్దు గ్రామాలుగా కలవు.
మునసబు గారి ఇల్లు గా పిలువబడే అత్యంత పెద్ద భవంతిలో పలు చిత్రాలు, టి.వి సీరియల్స్ చిత్రీకరిస్తున్నారు. దూరదర్శన్ లో ప్రసారమై విశేష ప్రాచుర్యాన్ని పొందిన "రాజశేఖర చరిత్ర" సీరియల్ లో ఎక్కువ భాగం ఈ గ్రామంలోనే చిత్రీకరించబడింది. కృష్ణ నటించిన " ఊరికి మొనగాడు"; బాలకృష్ణ నటించిన "బొబ్బిలి సింహం", "సాహస సామ్రాట్"; శ్రీకాంత్ నటించిన " ఊరికి మొనగాడు"; రజనీకాంత్ నటించిన "వీరా" (అల్లరి మొగుడు తమిళ అనువాదం) తదితర చిత్రాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి.
గ్రామానికి చెందిన ప్రముఖులలో శ్రీ చిట్టూరి జగపతి రావు (శ్రీనివాస హేచరీస్ అధినేత), శ్రీ చిట్టూరి రవీంద్ర (ప్రస్తుత బూరుగుపూడి శాసన సభ్యులు/మాజీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు), శ్రీ చిట్టూరి వీర రాఘవులు (నాగార్జున విశ్వవిద్యాలయ మాజీ ఉప కులపతి) తదితరులు ఉన్నారు.

