బంగారుపాప
వికీపీడియా నుండి
| బంగారుపాప (1954) | |
| దర్శకత్వం | బి.ఎన్.రెడ్డి |
|---|---|
| రచన | పాలగుమ్మి పద్మరాజు |
| తారాగణం | ఎస్వీ.రంగారావు, కొంగర జగ్గయ్య, హేమలత, జమున, రమణారెడ్డి |
| సంగీతం | ఆదేపల్లి రామారావు |
| సంభాషణలు | పాలగుమ్మి పద్మరాజు |
| ఛాయాగ్రహణం | బి.ఎన్.కొండారెడ్డి |
| నిర్మాణ సంస్థ | వాహిని పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
- కళ - ఎ.కె.శేఖర్
- నేపధ్య గానం - ఎ.ఎమ్.రాజా, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికుందని హృద్యంగా చెప్పిన చిత్రమది. జార్జ్ ఇలియట్ వ్రాసిన 'ది సైలాస్ మార్నర్' నవలను మన నేటివిటీకి తగ్గట్లు మలచి వెండితెర మీదకెక్కించి అంత అపురూపంగా మనకందించిన ఘనత బి.ఎన్.దే.
పద్మరాజు మాటలు, కృష్ణశాస్త్రి పాటలు, ఎస్వీఆర్ అసమాన నటనా చాతుర్యం, మేకప్ మాన్ అద్వితీయమైన పనితనం, అన్నిటినీ మించి బి.ఎన్. దర్శకత్వ ప్రతిభ దీనిని అపురూప కళాఖండంగా తీర్చిదిద్దాయి. ఎస్వీరంగారావు నటన ఈ చిత్రంలో శిఖరాగ్ర స్థాయినందుకుని ఆయనలోని నటనాప్రతిభను లోకానికి చాటిచెప్పింది. ఆయన కెరీర్ లోనే గాక యావద్భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నదగిన మాస్టర్ పీస్ 'బంగారుపాప'. మల్లీశ్వరి కంటే మిన్నగా, తాను తీసిన చిత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమమైనదిగా బి.ఎన్. భావించిందీ బంగారుపాపనే. బి.ఎన్.కు గురుతుల్యులైన దేవకీబోస్ బంగారుపాపను చూసి ముచ్చటపడి అదేసినిమాను బెంగాలీలో తీశారు.
ఐతే ఆయన అంత అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారుపాప బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.

