త్యాగరాజు
వికీపీడియా నుండి
| భారతీయ సంగీతము | |
|---|---|
| భారతీయ సాంప్రదాయ సంగీతము | |
| కర్ణాటక సంగీతము | |
| వాగ్గేయకారులు | |
| కర్ణాటక సంగీత వాగ్గేయకారులు | |
| గాయకులు | |
| కర్ణాటక సంగీత గాయకులు | |
| హిందుస్థానీ సంగీతము | |
| ఆధునిక సంగీతము | |
| చలన చిత్ర సంగీతము | |
| భారతీయ జానపద సంగీతము | |
| Concepts | |
| శృతి | |
| రాగము | |
| మేళకర్త | |
| Katapayadi sankhya | |
| స్వరం | |
| తాళము | |
| ముద్రలు |
" ఎందరో మహానుభావులు,అందరికీ వందనాలు " నాదబ్రహ్మ త్యాగయ్య.
శ్రీత్యాగరాజుగారు (౧౭??-౧౮౪౮) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు, వీరు గొప్ప రామ భక్తులు. వీరు ప్రస్తుత తమిళనాడు లోని తంజావూరు దగ్గరలోని తిరువయ్యూరు అను గ్రామం (అగ్రహారం) నందు తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినారు. త్యాగరాజుగారు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. వీరి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలములోని కాకర్ల గ్రామమునుండి తమిళదేశానికి వలస వెళ్లారు.
విషయ సూచిక |
[మార్చు] జీవిత విశేషాలు
[మార్చు] చదువు (శిక్షణ) మరియు ప్రయోజనం
త్యాగరాజుగారు వారి సంగీత శిక్షణను శ్రీయుతులు శొంఠి వెంకటరమణయ్య వారి దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించినారు. సంగీతంను భగవంతుని ప్రేమను అనుభవించు మార్గముగా త్యాగరాజుగారు భావించినారు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసినారు. దేవముని అయిన నారదులవారే స్వయంగా వీరికి సంగీతంలోని రహస్యాలను చెప్పి ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చినారు. ఆ సంధర్భంలో త్యాగరాజు గారు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనా" అని చెపుతారు.
[మార్చు] వృత్తి
పదమూడేండ్ల చిరుత ప్రాయమునాడే త్యాగరాజుగారు నమో నమో రాఘవా అను కీర్తనను దేశికతోడిలో స్వరపరచినారు. గురువుగారైన శొంఠి వేంకటరమణయ్యగారు తన శిష్యుని క్రొత్త ప్రతిభను గురించి విని తంజావూరులోని తన ఇంటికి పిలిచి కచేరీ ఇవ్వమన్నారు. అప్పుడు స్వరపరచి పాడిన పాటే ఎందరో మహానుభావులు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించినాడు. కానీ త్యాగరాజు నిధి చాల సుఖమా అను కీర్తన పాడి తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని అంత సొమ్ములను నిర్మొహమాటంగా తిరస్కరించినారు.
త్యాగరాజు యొక్క ఈ చర్య తో ఆగ్రహించిన వారి అన్నయ్య, త్యాగారాజు నిత్యం పూజించుకునే శ్రీ రామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసినారు. శ్రీ రామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి ఎన్నో అద్భుత కీర్తనలు రచించినారు. చివరగా శ్రీ రామఅనుగ్రహంతో విగ్రహాలను పొందినారు. వైకుంఠ ఏకాదశినాడు వీరు శ్రీరామ సన్నిధి చేరుకున్నారు.
[మార్చు] వీరి జీవితంలో కొన్ని సంఘటనలు
- త్యాగరాజుగారు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట - ఎందు దాగినావో
- వీరు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపొయినాయి. ఆ తరువాత వారు వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినారు.
- వీరు పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు - గిరిపై, పరితాపము
[మార్చు] త్యాగరాజు ఆరాధనోత్సవాలు
అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజుగారు కర్ణాటసంగీతానికి మూలస్థంబంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి లలో తంజావూరు నందు త్యాగరాజు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
[మార్చు] కీర్తనలు
సంపూర్ణ లిస్టుకోసం త్యాగరాజు కీర్తనలు అనే వ్యాసాన్ని చూడండి

