నేదునూరు
వికీపీడియా నుండి
నేదునూరు, తూర్పు గోదావరి జిల్లా, ఐనవిల్లి మండలానికి చెందిన గ్రామము.
ఈ గ్రామము నందు సుమారుగా ఐదు అడుగుల ఎత్తు గల జైన విగ్రహము (కూర్చొని ఉండగా ఐదు అడుగుల ఎత్తు) ఉన్నది. ఈగ్రామం యొక్క పూర్వ పేరు "జైనూరు" అని, అదే కాలక్రమేణ "నేదునూరు" గా మారినదని కొందరి అభిప్రాయం. ఈగ్రామము నందు మరి కొన్ని జైన విగ్రహములు, జైనుల కాలమునాటి పెద్ద పెద్ద ఇటుకలు కొన్న సందర్భములలో (నూతులు తవ్వినప్పుడు) బయట పడినవి. ఈగ్రామము పండిత గ్రామము. పూర్వము అనేక మంది వేద పండితులు ఉండెడి వారు. ఈ గ్రామమున ఇప్పటికీ రెండు వేదపరిషత్తులు వేద పండితులను ప్రతిసంవత్సరమూ సత్కరించుచున్నది.

