వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 19

వికీపీడియా నుండి

< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
  • 1910: ఖగోళభౌతిక శాస్త్రంలో అత్యున్నత ప్రమాణాలు స్థాపించిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త 'సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌' జననం (లాహోర్‌లో).
  • 1954: బీజింగ్ లో భారత ప్రధానమంత్రి నెహ్రూ చైనా నాయకుడు మావో ను కలిసాడు.
  • 1970: పూర్వపు సంస్థానాధీశుల ప్రీవీ పర్సులను ప్రభుత్వం రద్దు చేసింది.
  • 1983: ప్రొ.సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ తన 73వ పుట్టినరోజునాడు ఫిజిక్స్ నోబెల్ పురస్కారానికి ప్రొ.విలియం ఫౌలర్ తొ కలిసి ఎంపికయ్యారు.
  • 1983: ముంబై లో 13 జౌళి పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ బొంబాయి జౌళి ప్రిశ్రమల సమ్మె ముగిసింది. ఈ సమ్మెకు దత్తా సామంత్ నాయకత్వం వహించాడు.
  • 1987: అమెరికన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఘోరపతనం. డౌ జోన్స్‌ సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో ఈ పతనం బ్లాక్‌మండేగా ప్రసిద్ధి చెందింది.
  • 2003: మదర్‌ థెరీసా కు పోప్‌జాన్‌పాల్‌- 2 దైవత్వం (బీటిఫికేషన్‌) ఆపాదించిన రోజు.