రామకృష్ణ పరమహంస

వికీపీడియా నుండి

శ్రీ రామకృష్ణ పరమహంస, (పుట్టినప్పుడు పేరు గధాధర్ ఛటోపాధ్యాయ) (ఫిభ్రవరి 18,1836 - ఆగష్టు 16, 1886) ఒక హిందూ మత గురువు. 19 వ శతాబ్దపు బెంగాల్ రెనసాన్స్ లో ఈయన ప్రభావము చాలా ఉంది. ఆయన బోధనలు భగవంతుని గ్రహించుట యే జీవితపు పరమార్థమని, భగవంతుని పట్ల ప్రేమ,భక్తి , సృష్టి లో ఏకత్వము, సర్వమత సౌభ్రాత్వత్వ మును భోదించుచున్నవి.

Sri Ramakrishna Paramahamsa
Sri Ramakrishna Paramahamsa
Born February 18, 1836
Kamarpukur, West Bengal, India
Died 16 August, 1886
Garden House in Cossipore.

విషయ సూచిక

[మార్చు] జీవిత చరిత్ర

భారత దేశము లో మతగురువుల భోదన లకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు ఇతర చిన్న విషయాలకు తక్కువ ప్రాముఖ్యము ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితము లో చాలా విషయములకు చాలా ఆధారములు కలవు. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, అధారములు దొరకందే చాలా విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. [1] ఆతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్ర ను చాలా మటుకు రచించెను.


[మార్చు] బాల్యము

గధాధర్ పశ్చిమ బెంగాల్ లో హుగ్లీ జిల్లా, కామార్కపూర్ గ్రామం లో జన్మించెను. తల్లితండ్రులు ఖుదీరామ్, చంద్రమణి పేదవారు. గధాధరుడు ఆందగాడు, హస్తకళల ల సహజ నైపుణ్యము కలిగి గ్రామములో చాలా పేరు తెచ్చుకొనెను. చదువు మీద కాని, ధన సంపాదన మీద కాని ఆసక్తి చూపించకుండెను. ప్రకృతిని ప్రేమిస్తూ గ్రామము బైట పండ్ల తోటల లో స్నేహితెల తో కలసి సమయాన్ని గడిపేవాడు. పూరీ వెళ్ళే సాధువులు ఆ గ్రామము లో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు చాలా శ్రద్దగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను శ్రద్ద గా వినేవాడు/

ఉపనయనము కాగానే బ్రాహ్మణునిగా మొదటి బిక్ష, ఒక శూద్ర యువతి దగ్గర పొందుతాన ని అడగడము చాలా మందికి ఆశ్చర్యము కలిగించింది. బ్రాహ్మణుని వద్దనే మొదిటి బిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా, ఎంత మంది చెప్పినా, కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పాక ఎటువంటి బ్రాహ్మణుడవుతాడాని ప్రశ్నించెను. చివరికి ఆతని గరిష్టా సోదరుడు రామ్‌కుమార్ తండ్రి మరణాము తరువాత అంగీకరించెను.

ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజు కూ దిగజారుతూ వచ్చింది. రామ్‌కుమార్ కలకత్తా లో సంస్కృత పాఠశాల నడుపు తూ, కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యము చేస్తూ ఉండేవాడు. ఆ కాలము లో రాణీ రాషమొణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్‌కుమార్ ను పురోహితుడు గా ఉండమని కోరింది. రామ్‌కుమార్ దానికి అంగీకరించెను. కొంత ప్రోద్బలము తో గధాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకొనెను. రామ్‌కుమార్ రిటైరయిన తరువాత రామకృష్ణుడు పూజారిగా భాధ్యతలను తీసుకొనెను.

[మార్చు] పూజారి జీవితము

గధాధరుడు దేవతను పూజిస్తూ తాను దేవతను పూజిస్తున్నానా లేక రాతిని పూజిస్తున్నానా అనే ప్రశ్న వేసుకునేవాడు. ఒకవేళా సజీవ దేవత ను పూజిస్తే కనుక దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? ఈ ప్రశ్న ఆతనిని రాత్రి పగలు కలచి వేసింది. ఇంక కాళికా దేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరల తో ప్రార్థించడము మొదలు పెట్టాడు. రాత్రి అడవి లో కూడా కూర్చుని ప్రార్థించేవాడు. చివరికి దైవజ్ఞానము కలిగింది. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంత మంది గురువులు ఆతని దగ్గరకు వచ్చి అన్ని పరమ మతము ల లో పరమ సత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. మాట అన్ని ఊర్లలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రకరకాల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు.

[మార్చు] ప్రారంభము

అద్వైత వేదాంతము ను దకక్షిణేశ్వర్ పట్టణము లో చే ప్రారంబించినది తోతాపురి (నాంగ్తా) అనే సన్యాసి. [2]

[మార్చు] వైవాహిక జీవితము

కామార్కపూర్ లో రామకృష్ణుడు దక్షిణేశ్వర్ లో అత్మ జ్ఞాన అభ్యాసముల టొ పిచ్చివాడై పోయాడని పుకారు వచ్చింది. ఊరివారు రామకృష్ణిని తల్లి తో ఆతనికి వివాహము చెయ్యమని, దానితో సంసారిక భాద్యతల లో పడగలడని చెప్పిరి. వివాహమునకు అభ్యంతరము చెప్పక పోవడమే కాకుండా, మూడు మైళ్ళ దీరము లో ఉన్న జయరాంబతీ గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్ళికూతురు దొరుకుతుందని చెప్పాడు. 5 ఏళ్ళ శారదా దేవి తో ఆతమి పెళ్ళి నిశ్చయమైనది. శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తి గా పూజిఓచడము మొదలు పెట్టాడు.


ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగము వలే శిష్య్లులందరికి ప్రస్ఫుటముగా కనపడేది. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థము చేసుకోలేరని భావించేవారు. చాలా కాలము అమెతో గదిపిన తరువాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు. శిష్యులదరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నపటికీ, ఒకరి దగ్గర ఒకరు ఉన్నపుడు మటుకు ఆధ్యాత్మికత కంటే ఏ ఇతర విషయాల పై మనస్సు పోయేది కాదని భావించేవారు. మతగురువుల జీవితాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధము ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదా దేవి కుడా మతగురువు గా మారెను

[మార్చు] తరువాత జీవితము

ఆ తరువాత కొద్ది కాలములో నే రామకృష్ణు పరమహంస గా పిలవబడెను. ఆయస్కాంతము లాగ భగవంతుని పొందగోరే వారిని అకర్షించేవారని ప్రతీతి. పదిహేను సంవర్సరములు మతముల లో మూల సత్యములను కథలు, పాటలు,ఉపమ అలంకారములు, అన్నిటి కంటే ఎక్కువగా తన జీవిత చరిత్రతో నిర్విరామముగా ప్రభోదించెను.

16 ఆగష్టు 1886 లో గొంతు కేన్సరు తో మహా సమాధి ని పొందెను. అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు స్వామీ వివేకానంద సారధ్యము వహించెను. వివేకానంద ఆ తరువాత మత తత్త్వవేత్త, ఉపన్యాసకుడు గా ప్రసిద్ది పొందెను. రామకృష్ణుని సమకాలికుల లో కేశవ చంద్ర సేన్, పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఆతని అరాధకులు

[మార్చు] భోదనలు

[మార్చు] భగవంతుని తెలియుట

రామకృషుని బోధనల లో ముఖ్యాంశములు.

  • సృష్టి లో ఏకత్వము
  • అన్ని జీవులలో దైవత్వము
  • ఒక్కడే భగవంతుదు, సర్వమత ఐకమత్యము
  • మానవ జీవిత ము లో దాస్య కారకాలు కామము, స్వార్థము
Ramakrishna (1881, Calcutta)
Ramakrishna (1881, Calcutta)

రామకృష్ణుడు జీవితము లో పరమ కర్తవ్యము భగవంతుని తెలియగోరుట అని వక్కణించెను. మతము ఈ కర్తవ్యము ని నిర్వర్తించుటకు మటుకే నని ఆతని అభిప్రాయము. [3]. రామకృష్ణుని భావగర్బిత మైన అత్మజ్ఞానము ను హిందూ మతము లో నిర్వికల్ప సమాధి గా నిర్వచించిరి. నిజానికి 'నిత్య ధ్యానము' (అనగా సృష్టి లో సర్వ వ్యాప్తమైన చేతనను గ్రహించుకొనుట), అతనిని సర్వ మతములు పరమాత్మను తెలుసుకొనుటకు వేర్వేరు మార్గములని, పరమసత్యాన్ని వ్యక్తీకరించడానికి ఏ భాషా చాలదని తెలుసుకోవడానికి దారి తీసింది. ఋగ్వేదము లో నిర్వచించిన సత్యము ఒక్కటే కాని ఋషులు దానిని ఎన్నో నామముల తో పిలిచెదరు అనే నిర్వచనముతో రామకృష్ణుని భోదన ఏకీభవిస్తున్నది. ఈ భావన వలన రామకృష్ణుడు తన జీవితకాలము లో కొంత భాగము తన కు అర్థమైన రీతి లో ఇస్లాం, క్రైస్తవ మతము, హిందూ మతము లోని యోగ, తంత్ర శాస్త్రము లు అభ్యాసము చేస్తూ గడిపేవారు.

[మార్చు] అవిద్యామాయ మరియు విద్యామాయ

చూడండి: en:Avidyamaya and vidyamaya

రామకృష్ణుని నిర్వికల్ప సమాధి వలన మాయకు ఉన్న రెండు వైపులు అవిద్యామాయ, విద్యామాయ ల ను అర్థము చేసుకొన్నారని భావించేవారు. అవిద్యామాయ లో దుష్టశక్తులు (కామము, చెడు భావములు, స్వార్థము, క్రౌర్యము) మానవ జీవితము ను జన్మ, మృత్యువుల కర్మ చక్రము లో బంధించి, చేతన(consciousness) ను క్రిందికి తొక్కుతున్నవి. కర్మ చక్రము లో బందిస్తున్న ఈ శక్తులను పోరాడి జయింపవలెను. విద్యామాయ లో ఉన్నత శక్తులు (అధ్యాత్మిక విలువలు, జ్ఞానోదయమును ప్రసాదించు గుణములు, , దయ, స్వచ్ఛత, ప్రేమ, భక్తి) మానవులను చేతన లో ఉన్నత శిఖరాలకు తీసుకు వెళుతున్నవి. విద్యామాయ సహాయము తో మానవులు అవిద్యామాయను తమకు తామే వదిలించుకుని మాయారహితమైన మాయాతీతుని గా మారవచ్చని భోదించేవారు.

[మార్చు] ఇతర భోధనలు

రామకృష్ణుని నిర్వచనము ఎక్కడ జీవశక్తి ఉండు నో అక్కడ శివుడు ఉండును అతని అద్వైత జ్ఞానము వలన వచ్చెను. దీని వలన మానవుల యందు దయ మాత్రమే చూపించుట వలన కాకుండా వారిని సేవించుట వలన శివుని సేవించవచ్చును.

రామకృష్ణుడు కి పుస్తక జ్ఞానము అంతగా లేకపోయినప్పటికీ , క్లిష్టమైన తత్త్వ శాస్త్ర ఆంశాలను ఒడిసి పట్టుకునే నేర్పు మాత్రము కలదు. .[4]. అతని ప్రకారము బ్రహ్మానందము, కనపడే విశ్వము, కనపడని విశ్వము, అనంత వ్యాప్తమైన బ్రాహ్మన్ నుండి వస్తున్న బుడగలు [5].

ఆది శంకరాచార్యులు వలే రామకృష్ణ పరమహంస, హిందూ మతము లో పేరుకు పోయిన అధిక సాంప్రదాయములు,మూఢ నమ్మకాలను 19 వ శతాబ్దము లో కొంతవరకూ తొలగించి, హిందూ మతముని నవీన శకము లో ఇస్లాం, క్రైస్తవ మతముల సవాళ్ళకు దీటైన పోటీగా నిలబెట్టారు.[6]. అతని వలన భక్తి ఉద్యమము, [అరబిందో] కుడా ప్రభావితమయ్యెను.

[మార్చు] రామకృష్ణుని ప్రభావము

భారతీయ తత్త్వ శాస్త్రము మొత్తం భారతదేశము లో ముఖ్యముగా బెంగాల్ లో సమాజ ఉద్దరణ వలన పుట్టింది. రామకృష్ణుడు, అతని ఉద్యమము ఈ దిశలో ముఖ్య భూమిక వహించి ఆ తరువాత జరిగిన స్వతంత్ర ఉద్యమమును కూడా ప్రభావితము చేసింది.

[మార్చు] హిందుత్వము పై

బెంగాల్ రెనసాన్స్ రామకృష్ణుని జీవితము, ఆతని కృషి వలన పుట్టింది అని చెప్పవచ్చు. బ్ర్హహ్మోసమాజ్,ఆర్యసమాజ్ లు రామకృష్ణ మిషన్ కంటే ముందునుండి ఉన్నపటికీ వాటి ప్రభావము రామకృష్ణుని ముందు సమాజము పై పెద్దగా ఉందేది కాదు. రామకృషుని వలన పరిస్థితి నాటకియంగా మారి పోయింది. రామకృష్ణుడు తన ప్రత్యక్ష శిష్యులకు సన్యాసము ఇవ్వడము ద్వారా [[రామకృష్ణా మిషన్] ను స్వయముగా ప్రారంభించెను.స్వామీ వివేకానంద రామకృష్ణిని సందేశాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపింప చేసెను.

19వ శతాబ్దము లోహిందుత్వము ఒక పాశ్చాత్యులకే గాక హిందువులకు కూడా ఒక పెద్ద మనోసంధమైన సవాలు గా నిలిచింది. విగ్రహారాధన బుద్ది తో కూడుకున్నది కాదని బ్రిటిష్ సామ్రాజ్యము లో బెంగాల్ లో చాలామంది భావించేవారు. ఈ సవాలుకు జవాబుగా యువ బెంగాల్ ఉద్యమము హిందుత్వాన్ని నిరసించి క్రైస్తవ మతము ను నాస్తికత్వము ను ప్రోత్సహించింది. బ్రహ్మోసమాజ్ విగ్రహారాధన ను నిరసిస్తూ హిందూ మతము లో ప్రధాన సిద్దాంతములను, బంకిమ్ చంద్ర చటర్జీ దృడమైన హిందూ జాతీయ భావము తో పాటు ప్రోత్సహించింది.రామకృష్ణిని ప్రభావము వలన ,శతాబ్దముల పూర్వము ఇస్లాం మత ప్రభావము దృడముగా ఉన్నపుడు చైతన్య కృసి వలే, సాంప్రదాయ హిందూమతము మళ్ళీ ఊపిరి పోసుకుంది.[7]

హిందూ మతము పై రామకృష్ణుని ప్రభావము ఇక్కడ వరకూ ఉంది అని ఖచ్చితముగా చెప్పడము కష్టము కావచ్చు కాని కొన్ని ముఖ్యమైన ప్రభావాలను గుర్తించవచ్చును. కాళీ మాత విగ్రహము ను పూజించేటప్పుడు , విగ్రహారాధన లో మూల సిద్దాంతమును రామకృష్ణుడు ప్రశ్నించేవాడు -- పూజించేది నిజము దేవతను అయితే ఆమెఓందుకు పలకడము లేదు? అయనకు ఎన్నో దివ్యనుభూతులు కలిగి కాలీమాత ఉన్నదమి అర్థమైనది.[8][9]. రామకృష్ణుని గౌరవించే వారందరికిఇ దీని వలన శతాబ్దాలు గా ఉన్న విగ్రహారాధన, ఇతర ఆచారముల పై నమ్మకము పెరిగింది. రామకృష్ణుడు సర్వధర్మ సమ్మిళితమైన నినాదము ను ప్రతీ అధిప్రాయము భగవంతుని దర్శనానికి త్రోవ కనుక్కుంటుంది ప్రతిపాదించెనను. అయన స్వయముగా విష్ణుమూర్తి అవతారములైన రాముడు, కృష్ణుడు పేర్లను పెట్టుకొని, కాళీ, దుర్గా మాతల భక్తుడై. ఇస్లాం, క్రైస్తవ మతముల తో పాటు తంత్ర శాస్త్రమును కుడా అభ్యసించెను.

[మార్చు] భారత జాతీయత

పెరుగుతున్న భారత జాతీయత పై రామకృష్ణుని ప్రభావము పరోక్షముగా ఉన్నపటికీ గుర్తించదగినది. ఆ కాలము లో చాలా మంది జ్ఞానులు రామకృష్ణుని తో నిత్యము సంభాషిస్తూ ఉండేవారు. అతని తో కొంతమంది మతపరమైన విషయాలలో ఏకీభవించనప్పటికీ చాలా గౌరవిస్తూ ఉండేవారు. భారతీయ నాగిరికత పై బ్రిటిష్ వారి ఆక్రమణ ను ఎదిరించే శక్తిని అతని లో గమనించేవారు. అమౌరీ దీ రెన్కోర్ (Amoury de Riencourt)ఇలా అన్నారు "20వ శతాబ్దపు గొప్ప నాయకులు వారి జీవనశైలి ఏదైనా కాని, రవీంద్రనాథ్ టేగొర్-కవి రాజకుమారుడు, అరబిందో ఘోష్-గొప గూఢ తత్త్వవేత్త, మహాత్మా గాంధీ-బ్రిటిష్ వారి ఆక్రమణను కూకటి వేళ్ళతో సహా పెకిలించిన మహానీయుడు కూడా వారి వారి ఋణమును రామకృష్ణునికి (భారతీయుల హృదయాన్ని కుదిపేసినందుకు), వివేకానందునకు(భారతీయుల ఆత్మను జాగృతము చేసినందుకు) అంగీకరించారు"."[10] అమ్మతో పోల్చడము వలన రామకృష్ణుని తో పెరిగి జాతీయ ఉద్యమంలో భారతమాత గా భూమిక వహించింది.[11]

[మార్చు] వివేకానంద, రామకృష్ణమఠము, రామకృష్ణ మిషన్

చూడండి: [[[:en:Apostles of Ramakrishna]]]

వివేకానంద రామకృష్ణుని ముఖ్య వారసుడిగా పరిగణించబడతాడు. వివేకానందుడు రామకృష్ణిని సందేశాన్ని ప్రపంచమంతా వ్యాపింపచేసెను. హిందూమతమును పశ్చిమదేశాల లో పరిచయము చేసెను. రరామకృష్ణిను భోదనల మేరకు రెండు సంస్థలను స్థాపించెను. 1. రామకృష్ణ మిషన్‌: రామకృష్ణుని భోదనలను ప్రపంచము లో ప్రచారము చెయ్యుటకు 2. రామకృష్ణ మఠము: సన్యాసుల పరంపరను కొనసాగించుటకు

రామకృష్ణా మిషన్ తమను హిందేతర మైనారిటీ మతముగా గుర్తించవలెనని 1980 లో కోర్టుకు వెళ్ళగా వారి కేసు కలకత్తా హైకోర్టు, సుప్రీం కోర్టుల తీర్పులలో కొట్టివేయడమైనది.[12]. వారు రాజ్యాంగము మైనారిటీ మతములకు ఇచ్చిన సౌకర్యములను పొందడానికి ప్రయత్నించారు. (ఉదః అధికరణము 30.(1)వారి విద్యా సంస్థల పై ఎక్కువ అధికారములుఇ ఇస్తుంది.)

[మార్చు] సమకాలీన ప్రభావం

హిందూమతము పై రామకృష్ణుని ఆలోచనలు(విజన్), హిందూమతము ను ప్రచారము చేసిన క్రిష్టోఫర్ ఇషర్‌వుడ్ లాంటి మతము మార్చుకున్న (కన్వర్ట్స్)పాశ్చాత్య దేశవాసులు, పాశ్చాత్య దేశాల వారి హిందూమతము పై అభిప్రాయాలను ప్రభావితం చేసారు. కొంతమంది అండ్రూ హర్వే మరియు కెన్ విల్బర్ వంటివారు రామకృష్ణుని జీవితముతో కొత్త గ్రహ చేతన వచ్చింది ఆంటారు.

1991 లో నరసింఘ సిల్ రామకృష్ణుని గురించి వ్రాస్తూ రామకృష్ణుని దివ్యానుభూతులు శారిరిక మైనవని బాల్యంలో లైంగిక వేధింపుల వలన వచ్చాయి అన్నాడు. [13] మిగతా పండితులు, ముఖ్యంగా మానసిక శాస్త్రజ్ఞుడు సుధీర్ కాకర్, సిల్ అధ్యయనాన్ని మరీ సరళమై తప్పుదీవ పట్టిస్తాందని నిర్థారించాడు. కాకర్ ఒక మెటా సైకలాజికల్ [14], వ్యాధి సంబంధమైనది కాకుండా (నాన్-పేథొలాజికల్) ఉన్న వ్యాఖ్య, ప్రీ-ఓడిపల్ మరియు లేన్కానియన్ రియల్ తత్త్వము లో ఉండి రామకృష్ణుని నిగూఢమైన noesis ను సృజనాత్మకత తో కలిపే వివరణను కోరారు.

[మార్చు] ప్రవచనాలు

  • జ్ఞానము ఐకమత్యానికి, అజ్ఞానము కలహాలకి దారి తీస్తాయి.
  • మానవుడు ఆలోచనతోనే మనిషిగా మారతాడు
  • భగవంతుని దర్శించడము అందరికీ సాధ్యమే. గృహస్తులు ప్రపంచాన్ని వదిలి చేయనక్కర లేదు కాని వారు శ్రద్దగా ప్రార్థించాలి. శాశ్వతమైన వస్తువులకు క్షణికమైన వస్తువులకు తేడా గమనించే వివేకము కావాలి.

బంధాలను తగ్గించుకోవాలి. దేవుడు శ్రద్దగా చేసే ప్రార్థనలను వింటాడు. భగవంతుని గురించి తీవ్ర వ్యాకులత ఆధ్యాత్మిక జీవితానికి రహస్యము.

  • కామము, అసూయ దేవుని దర్శనానికి రెండు ముఖ్య శత్రువులు.

[మార్చు] References

  1. Gupta, Mahendranath, "Three Classes of Evidences" in Sri Sri Ramakrishna Kathamrita, (Kolkata:Kathamrita Bhavan, 1901,1949- 17th edition),Part I, introductory page
  2. Swami Nikhilananda, The Gospel of Sri Ramakrishna (1972), Ramakrishna-Vivekananda Center, New York
  3. Kathamrita, 1/10/6
  4. Hixon, Lex, Great Swan: Meetings with Ramakrishna, (New Delhi: Motilal Banarsidass, 1992, 2002), p. xvi
  5. Gospel of Ramakrishna, vol. 4
  6. Das, Prafulla Kumar, "Samasamayik Banglar adhymatmik jibongothone Sri Ramakrishner probhab", in Biswachetanay Ramakrishna, (Kolkata: Udbodhon Karyaloy, 1987,1997- 6th rep.), pp.299-311
  7. Mukherjee, Jayasree, "Sri Ramakrishna’s Impact on Contemporary Indian Society". Prabuddha Bharata, May 2004Online article
  8. Swami Saradananda,Sri Sri Ramakrishna Leelaproshongo,(Kolkata:Udbodhon Karyaloy, 1955),Part I, pp.113-125
  9. Gupta, Mahendranath, Sri Sri Ramakrishna Kathamrita, (Kolkata: Kathamrita Bhavan, 1901, 1949 17th edition), Part I, pp. 20-21
  10. de Riencourt, Amaury, The Soul of India,(London: Jonathan Cape, 1961), p.250
  11. Jolly, Margaret,"Motherlands? Some Notes on Women and Nationalism in India and Africa".The Australian Journal of Anthropology,Volume: 5. Issue: 1-2,1994
  12. Koenraad Elst Who is a Hindu? (2001) [1] ISBN 8188388254
  13. Sil, Narasingha, Ramakrishna Paramahamsa. A Psychological Profile, (Leiden, Netherlands: Brill, 1991), p.16
  14. Metapsychology: speculative psychology concerned with postulating the structure (as the ego and id) and processes (as cathexis) of the mind which usually cannot be demonstrated objectively
    Cathexis: investment of mental or emotional energy in a person, object, or idea


[మార్చు] Further reading

  • Gupta, Mahendranath. The Gospel of Sri Ramakrishna (translation from Bengali by Swami Nikhilananda; Joseph Campbell and Margaret Woodrow Wilson, translation assistants - see preface; foreword by Aldous Huxley) (I & II)
  • The Gospel of Sri Ramakrishna (Hardcover) by Swami Nikhilananda (Translator) ISBN 0-911206-01-9
  • C. Rajagopalachari, Sri Ramakrishna Upanishad ISBN B0007J694K
  • Swami Saradananda, Ramakrishna and His Divine Play ISBN 0-916356-65-5
  • Romain Rolland, The life of Ramakrishna ISBN 81-85301-44-1
  • Christopher Isherwood, Ramakrishna and his disciples ISBN 0-87481-037-X
  • Ramakrishna: a biography in pictures ISBN 81-7505-131-0
  • Swami Chetanananda, Ramakrishna as we saw Him ISBN 81-85301-03-4
  • Lex Hixon, Great Swan: Meetings with Ramakrishna ISBN 0-943914-80-9
  • Hans Torwesten, Ramakrishna and Christ, or, The paradox of the incarnation ISBN 81-85843-97-X
  • Paul Hourihan, Ramakrishna and Christ: The Supermystics ISBN 1-931816-00-X
  • Shree Maa and Swami Satyananda Saraswati, Ramakrishna, The Nectar of Eternal Bliss ISBN 1-877795-66-6

[మార్చు] External links

[మార్చు] Links to Ramakrishna organizations