రామ్మోహన్ రాయ్
వికీపీడియా నుండి
రాజా రామ్మోహన్ రాయ్ (Raja Ram Mohan Roy) (మే 22, 1772 – సెప్టెంబరు 27, 1833) బ్రహ్మ సమాజ్, భారతదేశము లో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంబించెను. ఆతని విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్య రంగముల లోనే కాకుండా హిందూ మతము పైన కూడా కనపడుతున్నది. సతీ సహగమనము దురాచారాన్ని రూపుమాపినది ఆతడే.
1828 లో ఇంగ్లాండు కు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్ తో కలసి బ్రహ్మసమాజ్ ను ప్రారంబించెను. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్లమైన ఆధాత్మిక, మత సంస్కరణ ఉద్యమముగా మారి బెంగాల్ లో సాంఘిక , వివేచనాత్మక సంస్కరణ లకు దారి తీసింది.వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ రెనసాన్స్ లో ఒక ముఖ్యుడిగా భావింపబడెను.
విషయ సూచిక |
[మార్చు] బాల్యము విద్యాభ్యాసము
రాయ్ రాథానగర్, బెంగాల్ లో 1772 లో జన్మించెను. కుటుంబములో మతపరమైన వైవిధ్యము(religious diversity) కలదు. తండ్రి రామ్కాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతమునకు చెందినది. రామ్మోహన్ బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలను పదిహేనో యేడు వరకు అభ్యసించెను.
యుక్తవయస్సు లో కుటుంబ ఆచారాముల తో సంతృప్తి పొందక, యాత్రలు సానించడము మొదలు పెట్టెను. ఆ తరువాత కుటుంబ ప్యవహారములు చూసుకోవడానికి తెరిగి వచ్చి కలకత్తా లో వడ్డీ వ్యాపారిగా మారెను. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ లో పని చేసెను.
[మార్చు] సంఘ సంస్కరణలు
భారత సంఘ సంస్కరణల చరిత్ర లో నే రామ్మోహన్ రాయ్ పేరు, సతీసహగమనము ను రూపుమాపడము తో ముడిపడి చిరస్థాయి గా నిలిచిపోతుంది. రామ్మోహన్ రాయ్, హిందూ పూజారుల అధికారమును ధిక్కరించి అ కాలములో సాధారణమఇన బహు భార్యత్వము నేరమని జనులకు నచ్చ చెప్పెను.
[మార్చు] విలువలు
తాను సంకల్పంచిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రాయ్ మానవత్వము నే ప్రధానము గా తీసుకొనెను. జనులకు తన ఉద్దేశ్యము సమాజము లో ఉన్న మంచి సాంప్రదాయములను నిర్మూలించడము కాదని, కేవలము వాటిపై సంవత్సరముల పాటు నిరాధరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివెయ్యడము అని చూపించుటకు కష్టపడెను. ఉపనిషత్తులను గౌరవించి, సూత్రములను చదివెను. విగ్రహారాధనను ఖండించెను. ఆఖండానందమును పొందుటకు, ఆధాత్మిక చింతన, భగవంతుని ధ్యానము ఉన్నత మార్గములని, ఇవి చెయ్యలేనివారికి బలు లు ఇవ్వడము మార్గమని ప్రతిపాదించెను.
వితంతు పునర్వివాహము, మహిళలకు ఆస్థి హక్కు లను సమర్థించెను. బహుభార్యత్వమును ఖండించెను.
అందరికీ విద్య, ముఖ్యముగా మహిళలకు విద్యను సమర్థించెను. అచార సంబంధమైన సంస్కృత విద్య కంటే ఇంగ్లీషు విద్య మఓచిదని భావించి, సంస్కృత పాఠశాల లకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించెను. 1822 లో ఇంగ్లీషు పాఠశాలను ప్రారంబించెను.
తాను కనుగొన్న సామాజిక, మతపరమైన దురాచారములను నిర్మూలించడానికి బ్రహ్మ సమాజమును ప్రారంబించెను. బ్రహ్మ సమాజము వివిధ మతముల లో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతముగా ఎదిగెను
[మార్చు] తరువాత జీవితము
1831 లో మొఘల్ సామ్రాజ్య రాయబారిగా ఇంగ్లండు కు వెళ్ళేను. ఫ్రాన్స్ ను కూడా దర్శించెను.
స్టేపెల్ టన్, బ్రిస్టల్ లో 1833 లో మెదడువాపు వ్యాధి తో మరణించెను.
[మార్చు] కొన్ని అభిప్రాయములు
| రామ్మోహన్ రాయ్, భారతదేశము లో పుట్టినప్పుడు అమావాస్య ఆంధకారము రాజ్యము ఏలుతూ ఉంది. మృత్యువు ఆకాశములో పొంచి ఉంది. రామ్మోహన్ నిద్ర లేచి, బెంగాలీ సమాజము పై దృష్టి సారించేటప్పటికి అది ఆత్మల తో నిండి ఉన్నది. ఆ సమయము లో పురాతన హిందూ సాంప్రదాయ భూతము శ్మశానము తో సమాజము పై తన ఆధిపత్యమును ఉంచెను. దానికి ప్రాణము లేక, జీవము లేక, బెదిరింపులు సాంప్రదాయ సంఖలాలుఇ మాత్రమే కలిగి ఉందేది. రామ్మోహన్ రోజులలో హిందూ సమాజ ఖండములు వేలకొద్దీ గోతుల తో, ఒక్కొక్క గోతిలో జీవములు (మనుష్యులు) తర తరములు గా ఎదుగు తూ మరణిస్తూ, సమాజము ముసలితనము అచేతనము (కదలిక లేకపోవడము) కలిగి ఉండేది. రామ్మోహన్ నిర్భయముగా సమాజముని విషసర్పము వంటి దాస్యము నుండి విముక్తము చెయ్యడానికి ముందుకు సాగాడు. ఈ నాటి కుర్రకారు కూడా నవ్వుతూ అ చచ్చిన పామును తన్నగలుగుతున్నారు. ఇప్పుడు మనము ఆ పాములను చూసి (సాంప్రదాయములు), వాటి విషము వలన భయపడకుండా నవ్వి ఊరుకుంటాము. వాటి అనంతమైన శక్తిని ఆకట్టుకునే కళ్ళనూ, వాటి తోకల విష కౌగిలిని మనము మరిచి పోయాము. అనాటి బెంగాలీ విద్యార్థులు, ఇంగ్లీషు విద్య బలము తో, హిందూకాలేజీ నుండి బయటకు వచ్చి, ఒక రకమైన మత్తును పెంచుకొనిరి. వారు సమాజము హృదయము నుండి కారుతున్న రక్తము తో ఆటలు ఆడుకున్నారు. వారికి హిందూసమాజము లో ఎటువంటి ఆచారము ఉన్నతముగా పవిత్రముగా కనపడలేదు. అటువంటి సమయములో రామ్మోహన్ రాయ్ జన్మించి, మంచి చెడులను నిశిత దృష్టి తో సహనము తో పరిశీలించెను. అజ్ఞానము లో ఉన్న హిందూ సమాజమనకు అన్నిటినీ తగలబెట్టే చితిమంటలు పెట్టక, జ్ఞానమనీ జ్యోతిని మాత్రము వెలిగించెను. అది రాజా రామ్మోహన్ రాయ్ గొప్పదనము"[1] |
[మార్చు] ఇవికూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ Charitra Puja: Rammohun Roy (in Bengali) by Rabindranath Tagore.

