శ్రీభాష్యం అప్పలాచార్యులు
వికీపీడియా నుండి
మహామహోపాధ్యాయ శ్రీభాష్యం అప్పలాచార్యులు మహావక్త మరియు గొప్ప సాహితీ వ్యాఖ్యాత.
వీరు 6 ఏప్రిల్ 1922 న (శ్రీరామనవమి పుణ్యదినాన) పద్మనాభం గ్రామంలో జన్మించారు.
వీరు విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యాప్రవీణ మరియు భాషాప్రవీణ చేశారు. తరువాత కాశీ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో ఎమ్.ఎ. పట్టా పొందారు.
వీరు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తెలుగు పండితులుగా, చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులుగా పనిచేశారు.
అభిజ్ఞాన శాకుంతలం, మేఘసందేశం వంటి కాళిదాసు మహాకావ్యాలపై యాభై వరకు ఉపన్యాసాలందించారు.
ఉపనిషత్తులు, రామాయణం, తిరుప్పావై, భగవద్గీత, ద్రవిడ ప్రబంధాలపై అమోఘమైన ఉపన్యాసామృతం పంచారు.
ప్రవచన శిరోమణిగా పేరెన్నికగన్న ఆచార్యులవారు ధనుర్మాసంలో ఆకాశవాణిలో అనుదినం ప్రవచనం చేస్తుంటారు.
- పున్నమనేని సీతాదేవి పురస్కారం (1990)
- రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు (1992)
- అంబికా లిటరరీ అవార్డు (1994)
- జగద్గురు పీఠ పురస్కారం (1998)
- గోపాలోపాయనం అవార్డు (1999)
- తెలుగుతల్లి అవార్డు (2000)

