రాచకొండ
వికీపీడియా నుండి
రాచకొండ, నల్గొండ జిల్లా, నారాయణపూర్ (నల్గొండ జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామము. నల్గొండ నుండి 64 కి.మీ దూరాన ఉన్న రాచకొండ పర్యాటక ప్రాముఖ్యత గల ప్రదేశం. పట్టాభిగుట్ట దగ్గర ఒక గుహలోకల 'దశావతార' శిల్పాలు, పట్టణంలోని ఐదు దేవాలయాలు కాకతీయుల శిల్పకళకు చక్కటి నిదర్శనాలు. రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా క్రీ.శ.1325 నుండి 1474 వరకు మొత్తము తెలంగాణను పరిపాలించారు.

