చిత్తూరు
వికీపీడియా నుండి
| చిత్తూరు జిల్లా | |
|---|---|
| రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
| ప్రాంతము: | రాయలసీమ |
| ముఖ్య పట్టణము: | చిత్తూరు |
| విస్తీర్ణము: | 15,152 చ.కి.మీ |
| జనాభా (2001 లెక్కలు) | |
| మొత్తము: | 37.35 లక్షలు |
| పురుషులు: | 18.83 లక్షలు |
| స్త్రీలు: | 18.51 లక్షలు |
| పట్టణ: | 8.10 లక్షలు |
| గ్రామీణ: | 29.25 లక్షలు |
| జనసాంద్రత: | 247 / చ.కి.మీ |
| జనాభా వృద్ధి: | 14.54 % (1991-2001) |
| అక్షరాస్యత (2001 లెక్కలు) | |
| మొత్తము: | 67.46 % |
| పురుషులు: | 78.29 % |
| స్త్రీలు: | 56.48 % |
| చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | |
చిత్తూరు భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక పట్టణము మరియు జిల్లా. జిల్లా, తిరుపతి, కాణిపాకం మరియు శ్రీ కాళహస్తి దేవాలయాలకు ప్రసిద్ధి. చిత్తూరు పట్టణము, ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ప్రాంతములో, పోయిని నది లోయలో,బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉన్నది. ఇది ధాన్యము, చెరుకు, మరియు వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు మరియు బియ్యం మిల్లింగ్ పరిశ్రమలు కలవు.
విషయ సూచిక |
[మార్చు] చిత్తూరు జిల్లా
జిల్లాకు వాయవ్యమున అనంతపురం జిల్లా, ఉత్తరాన కడప జిల్లా, ఈశాన్యమున నెల్లూరు జిల్లా, దక్షిణమున తమిళనాడు రాష్ట్రము మరియు నైఋతి దిక్కున కర్నాటక రాష్ట్రము సరిహద్దులుగా కలవు. రాష్ట్రములో బాగా వెనుకబడి ఉన్న ప్రాంతములలో ఈ జిల్లా ఒకటి. చిత్తూరు పట్టణము చుట్టుపక్కల మామిడి తోటలు మరియు చింత తోపులు విస్తారముగా కలవు. జిల్లా, పశుసంపదకు కూడా ప్రసిద్ధి చెందినది.
పూర్వము ఏనుగు మల్లమ్మకొండ అని పిలవబడిన హార్స్లీ హిల్స్ మదనపల్లె పట్టణానికి సమీపమున ఉన్న ఒక వేసవి విడిది. ఈ ప్రదేశము "ఆంధ్ర ఊటీ" గా పేరు పొందినది. అనేక రకమైన పండ్లు మరియు కూరగాయలు (ప్రత్యేకముగా టమాటాలు) పండించే చుట్టు పక్కల వ్యవసాయ ప్రాంతమునకు మదనపల్లె కేంద్ర స్థానము. హార్స్లీ హిల్స్ వద్దనున్న రిషివ్యాలీ గురుకుల విద్యకు ప్రసిద్ధి.
జిల్లాకు పశ్చిమ భాగమున ఉన్న గుర్రంకొండ ఒక చారిత్రక ప్రదేశము. ఇక్కడ ఒక పాత కోట మరియు రాగినీ మహల్ అనబడే సుల్తాన్ యొక్క ప్యాలెస్ ఉన్నాయి. ఆర్ధ్రగిరి మరియు చంద్ర్రగిరి జిల్లాలోని ఇతర చెప్పుకోదగిన ప్రదేశములు.
- లోక్సభ స్థానాలు (2): చిత్తూరు, తిరుపతి, రాజంపేట (పాక్షికముగా)
- శాసనసభ స్థానాలు (15): సత్యవీడు, పలమనేరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చిత్తూరు, కుప్పం, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, వాయల్పాడు, పీలేరు, చంద్రగిరి, తిరుపతి, వేపంజేరి, నగరి.
- నదులు: సువర్ణముఖి, కాళంగి, పాపాఘ్ని, కౌండిన్య, పాలేరు, అరణి, బహుధా, కల్యాణి.
- దర్శనీయ కేంద్రాలు: శ్రీకాళహస్తి, తిరుపతి - తిరుమల, కాణిపాకం, హార్సిలీహిల్స్, ఆరోగ్యవరం, చంద్రగిరి, నారాయణవనం, కైలాసనాథ కొండ. తలకోన
[మార్చు] మండలాలు
భౌగోళికంగా చిత్తూరు జిల్లాను 66 రెవిన్యూ మండలములుగా విభజించినారు.
![]() |
||
| 1 పెద్దమండ్యం | 23 కె.వీ.పీ.పురం | 45 నగరి |
| 2 తంబళ్లపల్లె | 24 నారాయణవనం | 46 కార్వేటినగర్ |
| 3 ములకలచెరువు | 25 వడమలపేట | 47 శ్రీరంగరాజపురం |
| 4 పెద్దతిప్ప సముద్రం | 26 తిరుపతి గ్రామీణ | 48 పాలసముద్రం |
| 5 బీ.కొత్తకోట | 27 రామచంద్రాపురం | 49 గంగాధర నెల్లూరు |
| 6 కురబలకోట | 28 చంద్రగిరి | 50 పెనుమూరు |
| 7 గుర్రంకొండ | 29 చిన్నగొట్టిగల్లు | 51 పూతలపట్టు |
| 8 కలకడ | 30 రొంపిచెర్ల | 52 ఐరాల |
| 9 కంభంవారిపల్లె | 31 పీలేరు | 53 తవనంపల్లె |
| 10 యెర్రావారిపాలెం | 32 కలికిరి | 54 చిత్తూరు |
| 11 తిరుపతి పట్టణ | 33 వాయల్పాడు | 55 గుడిపాల |
| 12 రేణిగుంట | 34 నిమ్మన్నపల్లె | 56 యడమరి |
| 13 యేర్పేడు | 35 మదనపల్లె | 57 బంగారుపాలెం |
| 14 శ్రీకాళహస్తి | 36 రామసముద్రం | 58 పలమనేరు |
| 15 తొట్టంబేడు | 37 పుంగనూరు | 59 గంగవరం |
| 16 బుచ్చినాయుడు ఖండ్రిగ | 38 చౌడేపల్లె | 60 పెద్దపంజని |
| 17 వరదయ్యపాలెం | 39 సోమల | 61 బైరెడ్డిపల్లె |
| 18 సత్యవీడు | 40 సోదం | 62 వెంకటగిరి కోట |
| 19 నాగలాపురం | 41 పులిచెర్ల | 63 రామకుప్పం |
| 20 పిచ్చాటూరు | 42 పాకాల | 64 శాంతిపురం |
| 21 విజయపురం | 43 వెదురుకుప్పం | 65 గుడుపల్లె |
| 22 నింద్ర | 44 పుత్తూరు | 66 కుప్పం |
[మార్చు] ప్రముఖులు
[మార్చు] సినీ ప్రముఖులు
తొలి తరం తెలుగు హీరోను అందించినది చిత్తూరు జిల్లానే. తెలుగు సినిమాకు తండ్రి వంటి నాగయ్య ఈ నేలలో పుట్టినవారే. దేవిక, టిజి కమలాదేవి, తాళ్ళూరా రామేశ్వరి, జయంతి వంటి హీరోయిన్లదీ ఈ జిల్లానే. అలనాటి నాగయ్య నుంచి ఈతరం విష్ణు, మనోజ్ల దాకా ఈ జిల్లాలో పుట్టిన వారే.
[మార్చు] చిత్తూరు నాగయ్య
తెలుగుసినీ రంగంలో మొట్టమొదట పద్మశ్రీ అవార్డు పొందిన ఈయన గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. కాని చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సినీ రంగంలోకి రాక ముందు తరంలో, చిత్తూరు నాగయ్య తెలుగు సినిమా రంగంలో మొదటి సూపర్స్టార్. 1938లో గృహలక్ష్మి సినిమాతో ఈ రంగంలోకి వచ్చిన ఆయన భక్త పోతన, రామదాసు లాంటి అనేక సినిమాల్లో హీరోగా నటించారు. రేణుకా ప్రొడక్షన్స్ బ్యానర్పై అనేక సినిమాలు కూడా నిర్మించారు. దానం చేయడంలో ఎముక లేని విధంగా వ్యవహరించిన ఈయనను జిల్లా వాసులెప్పటికీ మరవలేరు.
[మార్చు] రమాప్రభ
వాల్మీకిపురానికి (దీనికీ పాతపేరు వాయల్పాడు) చెందిన ఈ నటి చిన్నతనం నుంచే నటన మీద మక్కువతో ఆ వైపు మరలారు. హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడీగా నటించింది.
[మార్చు] దేవిక
చంద్రగిరి ప్రాంతానికిచెందిన ఈమె ఎన్టీ రామారావుతో హీరోయిన్గా రేచుక్క అనే సినిమాలో తొలిసారి నటించారు. అత్త ఒకింటి కోడలే, కంచుకోట, ఆడబతుకు సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఎన్టీ రామారావు నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర సినిమాలో చివరి సారిగా నటించారు. ఈ మె కూతురు కనక తమిళ సినిమాల్లో నటిస్తున్నారు.
[మార్చు] ఉమామహేశ్వరరావు
ఈయన తొలితరం హీరోల్లో ఒకరు. తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన ఈయన ఇల్లాలు సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ నాగయ్య కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యారు. అయితే అప్పట్లో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
[మార్చు] టిజి కమలాదేవి
నటుడు నాగయ్య మరదలు. అసలు పేరు గోవిందమ్మ. సొంతూరు కార్వేటి నగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చిన ఈమె అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలియుగళ గీతానికి హీరోయిన్గా నటించారు. పాతాళ భైరవి, మల్లీశ్వరి లాంటి హిట్ సినిమాల్లో నటించారు. అనేక మంది నటీమణులకు డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించారు. స్నూకర్స్ ఆటలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్రీడా కారిణిగా అవార్డులు అందుకున్నారు. గత 30 సంవత్సరాలుగా చెన్నపురి ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.
[మార్చు] జయంతి
శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి కన్నడంలో రాజ్కుమార్కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీ రామారావుతో నటించిన జగదేక వీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండ వీటి సింహం లాంటి హిట్ సినిమాల్లో నటించారు. దర్శకులు కెవి రెడ్డి, కె. విశ్వనాథ్, కె బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. 1960లోనే 'మిస్ లీలావతి' అనే సినిమాలో స్విమ్మింగ్ పూల్ డ్రస్లో నటించారు. అనూహ్యంగా ఈ సినిమాలోనే ఆమెకు ప్రభుత్వం నుంచి అవార్డు అందింది. కన్నడ, తెలుగు, మళయాలం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
[మార్చు] మోహన్బాబు
ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో పుట్టిన భక్తవత్సలం నాయుడు కళాప్రేమికుడుగా మారి మోహన్ బాబు అయ్యారు. దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన స్వర్గం- నరకం సినిమాలో మోహన్ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. విలన్గా, క్యారెక్టర్ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కళాప్రతిభకు పద్మశ్రీ పురస్కారం లభించింది. రంగంపేటలో శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలు స్థాపించారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు.
[మార్చు] తాళ్ళూరి రామేశ్వరి
తిరుపతికి చెందిన ఈమె నటనలో శిక్షణ తీసుకుని హిందీ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సీతామాలక్ష్మి సినిమాలో నటించి తెలుగులో పేరు తెచ్చుకున్నారు. సూపర్ హిట్ సాధించిన ఈ సినిమాలో ఆమె నటనకు ప్రభుత్వం అవార్డు ఇచ్చి సత్కరించింది. తరువాత ఈమె హిందీ సినిమా రంగంలో స్థిరపడ్డారు.
[మార్చు] రోజా
చిన్నగొట్టి గల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. డాక్టర్ శివప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమ తపస్సు సినిమాలో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సరసన నటించారు. సినీ నిర్మాతగా కూడా మారారు. ప్రస్తుతం తెలుగుదేశం రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. నగరి నుంచి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు.
[మార్చు] శివప్రసాద్
తిరుపతిలో డాక్టర్గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా నటించిన ఈయన ఇటీవల విడుదలైన డేంజర్ సినిమాలో విలన్గా నటించారు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. అనేక సినిమాల్లో ఈయన చిన్న పాత్రల్లో నటించారు.
[మార్చు] రామిరెడ్డి
అంకుశం సినిమాతో విలన్గా పరిచయమైన రామిరెడ్డి వాల్మీకిపురం మండలంయ ఓబులం పల్లె గ్రామానికి చెందిన వారు. బతుకు దెరువు కోసం హైదరాబాద్కు వెళ్ళి కాంట్రాక్ట్ పనులు చేస్తూ సినిమా నటుడిగా మారారు.
[మార్చు] శ్రీరాం
తిరుచానూరుకు చెందిన ఈ నటుడు తెలుగులో రోజాపూలు అనే సినిమాలో హీరోగా నటించారు. ఇక్కడ బోణీ బాగా లేక పోవడంతో తమిళ సినీ రంగం అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తమిళ సినిమాల్లో గుర్తింపు పొందిన నటుడిగా స్థిర పడ్డారు.
[మార్చు] విష్ణు, మనోజ్
విష్ణు, మనోజ్లు మోహన్ బాబు కుమారులు. విష్ణు సినిమాతో పెద్దకుమారుడు విష్ణు సినీ రంగ ప్రవేశం చేశారు. మనోజ్ 'దొంగ-దొంగది' చిత్రంలో హీరోగా చేశారు. ====అనామిక==== తిరుపతికి చెందిన ఈ నటీమణి తెలుగు, కన్నడ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో గుర్తింపు పొందిన పాత్రలో నటించారు.
[మార్చు] షఫి
చంద్రగిరి మండలం చంద్రగిరి కోటలోపల గ్రామం సినీనటుడు షఫి స్వస్థలం. బికాం డిగ్రీ తిరుపతి ఆర్ట్స్ కాలేజిలో చదివి నటనపైన ఉన్న మక్కువతో అంతర్జాతీయ ప్రతిష్టాకరమైన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఢిల్లీ) లో 3 సంవత్సరాల కోర్సు చేశారు.
[మార్చు] వెంకటరమణ
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావుతో ఉన్న సన్నిహిత సంబంధాలు, నటన మీద మమకారంతో అనేక సినిమాల్లో నటించే అవకాశం లభించింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన అనేక సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా నటించారు.
[మార్చు] మూలాలు
| ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు | |
|---|---|
| అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు | |


