వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 18
వికీపీడియా నుండి
< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
- 1922: 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ' (బీబీసీ) ప్రారంభం. కాలక్రమంలో అది 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్'గా మారింది.
- 1954: 'టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్' సంస్థ ట్రాన్సిస్టర్ రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది.
- 1976: ప్రముఖ తెలుగు కవి, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణించాడు. వేయిపడగలు గ్రంధానికై ఆయనకు 1970లో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది.
- 1992: వందలాది పోలీసుల పదఘట్టనలతో మారుమోగిన అమృత్సర్ స్వర్ణదేవాలయం
- 2004: అటవీ బందిపోటు, స్మగ్లరు అయిన వీరప్పన్ ను తమిళనాడు ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు కాల్చి చంపారు.
- 2004: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసాడు.

