నవవిధభక్తులు

వికీపీడియా నుండి

భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. ఆ శ్లోకం:

శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం

అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.

  1. శ్రవణం: భగవంతుని గూర్చిన గాధలు, భజనలు, కీర్తనలు వినుట - (హరికథ శ్రోతలు),ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు.
  2. కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట: రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు,మీరాబాయి - మరెందరో భక్త గాయకులు.
  3. స్మరణం: భగవంతుని స్మరించుట - నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.
  4. పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట
  5. అర్చనం: గుడిలోగాని, ఇంటిలోగాని,హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.
  6. వందనం: ప్రణామం చేయుట
  7. దాస్యం: భగవంతునకు దాసుడగుట - హనుమంతుడు, రామదాసు
  8. సఖ్యం: అర్జునుడు
  9. ఆత్మనివేదనం: తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట - గోదాదేవి, మీరాబాయి

పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం

తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!