వరవిక్రయం
వికీపీడియా నుండి
| వరవిక్రయం (1939) | |
| దర్శకత్వం | సి.పుల్లయ్య |
|---|---|
| తారాగణం | పుష్పవల్లి శ్రీరంజని భానుమతి బలిజేపల్లి లక్ష్మీకాంత కవి దైతా గోపాలమూర్తి |
| భాష | తెలుగు |
తెలుగు సినిమా ప్రారంభదశలో సందేశాత్మకంగా వచ్చిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంతో భానుమతి సినీ జీవితం మొదలయ్యింది.
నిర్మాణం: ఈస్టిండియా ఫిలిమ్స్
[మార్చు] కధ
అప్పటి పోస్టరు [1]
వరకట్న వ్యవస్థ అనే సాఁఘిక దురాచారాన్ని ఎత్తిచూపే చిత్రం ఇది.
వరకట్నానికి వ్యతిరేకి అయనా ఒక రిటైర్డ్ ఉద్యోగి కూతురు 'కాళింది'(భానుమతి) పెళ్ళికోసం అప్పు చేస్తాడు. ఆ పెళ్ళికొడుకు లింగరాజు (బలిజేపల్లి లక్ష్మీకాంత కవి) అనే ఒక ముసలి పినిగొట్టు వడ్డీ వ్యాపారి. అప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నవాడు. కట్నానికి వ్యతిరేకి అయిన కాళింది ఆత్మహత్య చేసుకొంటుంది. కాని లింగరాజు కట్నం తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు కాళింది చెల్లెలు కమల (శ్రీరంజని) లింగరాజును పెళ్ళాడి, పెళ్ళి తరువాత తనభర్తను కోర్టుకీడుస్తుంది.
[మార్చు] విశేషాలు
- ఇది భానుమతి మొదటి చిత్రం.
- కాళ్ళకూరి నారాయణరావు రచించిన సాంఘిక నాటకం ఈ చిత్రానికి మూలకధ

