మునిమాణిక్యం నరసింహారావు

వికీపీడియా నుండి

మునిమాణిక్యం నరసింహారావు ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితం లోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది.

జీవిత కాలం: 1898 - 1972. జన్మస్థలం: తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడి. తల్లిదండ్రులు: వెంకాయమ్మ, సూర్యనారాయణ.

మూలం: అక్కిరాజు రమాపతిరావు రాసిన ప్రతిభామూర్తులు, విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991