మహీధర నళినీమోహన్
వికీపీడియా నుండి
పదిహేనవ ఏటనుండీ కవిత్వ రచనలో ప్రవేశం ఉన్న నళినీ మోహన్ జనరంజక విజ్ఞానంలో దరిదాపు 30 పుస్తకాలు, పిల్లల కోసం 12 పుస్తకాలు, కవితలూ, వ్యాసాలూ వగైరా 10 పుస్తకాల వరకూ రాసీరు. వివిధ పత్రికలలో వీరి రచనలు దరిదాపు 1,000 పైగానే ప్రచురితం అయి ఉంటాయి. 1968లో దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతిని, 1987 లో ఇందిరా గాంధి విజ్ఞాన బహుమతిని అందుకున్నారు.
సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు మహీధర రామమోహనరావు వీరి తండ్రి. బహు గ్రంధకర్త మహీధర జగన్మోహనరావు వీరి పినతండ్రి.
జీవిత కాలం: 1933-1999?; జన్మస్థలం: ముంగండ, తూర్పు గోదావరి జిల్లా

