తైత్తరీయోపనిషత్తు

వికీపీడియా నుండి

తైత్తరీయోపనిషత్తు చాలా విషయాల గురించి వ్యాఖ్యానించింది. ప్రధానంగా బ్రహ్మము గురించిన విచారణ చేసింది. ఉపనిషత్‌లలో ఇప్పటికీ సాంప్రదాయకంగా బోధన ఉన్నది దీనికే. అంతేకాక ప్రస్తుత కాలంలోని కర్మ కాండలు (పూజలు)మొదలగు వాటిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.


తైత్తరీయోపనిషత్తులో మూడు భాగాలు ఉన్నాయి

  1. శిక్షావల్లి
  2. ఆనందవల్లి
  3. భృగువల్లి

[మార్చు] శిక్షావల్లి

శిక్షావల్లి ప్రధానంగా విద్యా బోధన గురించి చెప్తుంది (అనంతరకాలంలోని శిక్షా శాస్త్రాలకు ఇదే ఆధారం) బ్రహ్మచర్యంలోని గొప్పతనాల్ని(ఏకాగ్రత సంయమనం, మొదలగు వాటిని గుర్తించి) బోధించింది. స్నాతకుడుగా మారబోతున్న విద్యార్ధికి 'సత్యంవద' (సత్యం చెప్పు) 'ధర్మంచర' (ధర్మంగా ప్రవర్తించు)'మాతృ దేవోభవ'పితృ,,ఆచార్య,,అతిథిదెవోభవ'(తల్లిని,తండ్రిని,గురువుని,అతిథిని,దేవునిగా పూజించాలి) వంటి ఎన్నో సూక్తులు చెప్తుంది. ఆ సూక్తులు శాశ్వతత్వాన్నికలిగి ఉన్నాయి.