తాడేపల్లిగూడెం

వికీపీడియా నుండి

తాడేపల్లిగూడెం మండలం
జిల్లా: పశ్చిమ గోదావరి
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ముఖ్య పట్టణము: తాడేపల్లిగూడెం
గ్రామాలు: 17
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 183.401 వేలు
పురుషులు: 91.896 వేలు
స్త్రీలు: 91.505 వేలు
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 70.34 %
పురుషులు: 74.12 %
స్త్రీలు: 66.54 %
చూడండి: పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు

తాడేపల్లిగూడెం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు చిన్న పట్టణము. ఇది జిల్లాలో ఒక ముఖ్య వాణిజ్య కేంద్రము.

విషయ సూచిక

[మార్చు] తాడేపల్లిగూడెం పట్టణం

ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీలలో తాడేపల్లిగూడెం ఒకటి.పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రధాన పట్టణాలలో ఇది ఒకటి. జిల్లా ముఖ్య పట్టణం అయిన ఏలూరుకి 50 కి.మి. దూరంలో ఉన్న ఈ పట్టణాన్ని ఆనుకుని అనేక పల్లెటూళ్ళు ఉన్నాయి మరియు ఇతర ముఖ్యపట్టణము లకు దగ్గర గా జిల్లా కు నడిబొడ్డున వున్నది .కొస్తా రాజదాని విజయవాడ కు 100 కి.మి ల దూరం లొ వున్నది.ఉభయగోదావరి జిల్లా రాజదాని రాజమండ్రి కి 45 కి.మి ల దూరం లొ వున్నది.

2001 జనభా లెక్కల ప్రకారం

  • మొత్తం జనాభా 102,303
    • మగవారు 49%
    • ఆడవారు 51%
  • సగటు అక్షరాస్యత శాతం 61%.

[మార్చు] వ్యాపారం

తాడేపల్లిగూడెం వ్యవసాయోత్పత్తుల అమ్మకాలు నిర్వహించే కేంద్రంగా కోస్తా జిల్లాల లో పేర్గాంచింది. బెల్లం,పప్పు దినుసుల వ్యాపారానికి మిక్కిలి ప్రసిద్ది చెందింది.వ్యవసాయ ఉత్పత్తులు నిలవ ఉంచే గిడ్డంగులకు కూడా ఈ పట్టణం గుర్తింపు పొందింది. రాస్ట్రంలోనే అతి పెద్ద ధాన్యం నిలువ చేసే ఎఫ్.సీ.ఐ. గిడ్డంగులు ఈ పట్టణంలో ఉన్నాయి.దేశం లొ పలు ప్రాంతాల కు ఉల్లిపాయల ఏగుమతి చేయబడు చున్నది.

[మార్చు] పారిశ్రామికం

పట్టణం లొ గొయంకా వారి ఫుడ్ ఫ్యట్స్ ‍‍‍‍ఫెర్టిలైజర్స్ (3 ఏఫ్) కర్మాగారము మరియ చాక్ పిసుల తయారి,కొవొత్తుల తయరి పరిశ్రమలు యున్నవి.పట్టణానికి దగ్గర గా బెల్లం తయారి ఉన్నవి. పట్టణము లొ 6000 పై రవాణా వాహనము లు వున్నవి. జిల్లా లొ వున్న రైస్ మిల్లు లు లొ పట్టణం లొ లోనే ఏక్కువ రైస్ మిల్లు లు కలవు.

[మార్చు] విశేషాలు

రెండవ ప్రపంచ యుద్దంలో ఈస్ట్ ఇండియ కంపనీ వారు యుద్ధ విమానాలను నిలిపేందుకు అణువుగా 2 కి.మి పొడవున్న విమనాశ్రయాన్ని నిర్మించారు. దీన్ని ప్రస్తుతం ఎవరూ వాడనప్పటికి ఈ నాటికి చెక్కు చెదరకుండా ఉంది.

[మార్చు] ప్రముఖ వ్యక్తులు

  • ఈ పట్టణం నుండి ప్రసిద్ద కళాకారులు జన్మించి ఖ్యాతి నొందారు. సుప్రసిద్ద తెలుగు సినీ హాస్య నటుడు రేలంగి వెంకటేశ్వరరావు అత్తవారి ఊరు. ఇప్పటికీ ఆయన పేరు మీద "రేలంగి" అని ఒక సినిమా దియేటర్ ఈ పట్టణం లో ఉన్నది. ఈ థియేటర్ ఆయన నిర్మించిందే.
  • తాడేపల్లి వెంకన్న అని పద్మశ్రీ గ్రహీత అయిన చిత్ర కారుడు, శిల్పి ఇక్కడి వారే.
  • 48 గంటలు నిర్విరామం గా కూచిపూడి నాట్యం చేసి గిన్నీస్ బుక్ లో పేరు నమోదు చేసుకున్న కిళ్ళాడి సత్యం ఇక్కడి వారే.
  • ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కృష్ణవంశీ తన బాల్యం ఇక్కడే గడిపారు.

[మార్చు] రవాణా

ఈ పట్టణం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రైలు మరియు రోడ్ మార్గాలతొ కలుప బడినది. రైల్వే స్టేషన్ చెన్నై-కొలకత్త రైల్ రూట్ లో ఉంది. నేషనల్ హైవే "ఎన్.హెచ్-5" ఈ పట్టణం నడి బొడ్డు గుండా వెలుతుంది.

[మార్చు] గ్రామాలు

[మార్చు] పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు

జీలుగుమిల్లి | బుట్టాయగూడెం | పోలవరం | తాళ్ళపూడి | గోపాలపురం | కొయ్యలగూడెం | జంగారెడ్డిగూడెం | టి.నరసాపురం | చింతలపూడి | లింగపాలెం | కామవరపుకోట | ద్వారకా తిరుమల | నల్లజర్ల | దేవరపల్లి | చాగల్లు | కొవ్వూరు | నిడదవోలు | తాడేపల్లిగూడెం | ఉంగుటూరు | భీమడోలు | పెదవేగి | పెదపాడు | ఏలూరు | దెందులూరు | నిడమర్రు | గణపవరం | పెంటపాడు | తణుకు | ఉండ్రాజవరం | పెరవలి | ఇరగవరం | అత్తిలి | ఉండి | ఆకివీడు | కాళ్ళ | భీమవరం | పాలకోడేరు | వీరవాసరము | పెనుమంట్ర | పెనుగొండ | ఆచంట | పోడూరు | పాలకొల్లు | యలమంచిలి | నరసాపురం | మొగల్తూరు