పెదపాటివారి గూడెం
వికీపీడియా నుండి
పెదపాటివారి గూడెం, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన ఒక చిన్న గ్రామము. ఇది గోపవరం గ్రామం దగ్గరలో, గోపవరం, వేల్పుచెర్ల మధ్యలో, రహదారికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.
వ్యవసాయం ఇక్కడ ముఖ్యమైన వృత్తి. వూరిలో కొంతభాగం సారవంతమైన 'పాటి నేల' (నల్లటి నేల) అయినందున బహుశా ఈ వూటికి ఈపేరు వచ్చి ఉండవచ్చును. పాటినేలలో పుగాకు బాగా పండుతుంది. ఆ వూరి పుగాకు చాలా నాణ్యమైనదని ఆ వూరివారు చెప్పుకుంటారు. తక్కిన భాగం ఇసుక పొర ఉన్న ఎర్రనేల. ఇక్కడ కూరగాయలు, మామిడి, జీడిమామమిడి, కొబ్బరి పండిస్తారు. కొద్దిపాటి వరి సాగు ఉంది. ఒక చిన్న చెరువు ఉంది కాని భూగర్భజలాలే ప్రధాన నీటివనరు. ఒక ప్రాధమిక పాఠశాల ఉంది.

