అనంతపురం

వికీపీడియా నుండి

అనంతపురం జిల్లా
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ప్రాంతము: రాయలసీమ
ముఖ్య పట్టణము: అనంతపురం
విస్తీర్ణము: 19,130 చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 36.39 లక్షలు
పురుషులు: 18.59 లక్షలు
స్త్రీలు: 17.79 లక్షలు
పట్టణ: 9.2 లక్షలు
గ్రామీణ: 27.19 లక్షలు
జనసాంద్రత: 190 / చ.కి.మీ
జనాభా వృద్ధి: 14.31 % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 56.69 %
పురుషులు: 68.94 %
స్త్రీలు: 43.87 %
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు

అనంతపురం (Anantapur or Anantapuram) దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ఒక జిల్లా మరియు ముఖ్య పట్టణము. అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి యేర్పాటు చేయబడినది. ఈ ప్రాంతము ప్రధానముగా వ్యవసాయ ఆధారితము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు

విషయ సూచిక

[మార్చు] భౌగోళికము

అనంతపురం జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా, తూర్పున కడప జిల్లా, ఆగ్నేయమున చిత్తూరు జిల్లా, మరియు పశ్చిమాన, నైఋతిన కర్నాటక రాష్ట్రము సరిహద్దులుగా కలవు. జిల్లాకు ఉత్తరాన మరియు మధ్యభాగములో పెద్ద పెద్ద గ్రానైటు శిలలమయమైన ఎత్తైన మెలికెలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగము ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు 2600 అడుగుల ఎత్తుకు చేరుకొనును. పెన్నా, చిత్రావతి, వేదవతి, పాపాఘ్ని, స్వర్ణముఖి మరియు తడకలేరు మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతము కురుస్తుంది. రాజస్థాన్ లోని జైసల్మీరు తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.

[మార్చు] జిల్లా విశిష్టతలు

  • జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ముఖ్యంగా మే-సెప్టెంబర్ కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అని అంటారు. అందుచేత పవనయువిద్యుత్తు కేంద్రాలు జిల్లాలో విస్తృతంగా ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం స్థాపక శక్తిలో 75 శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది. రామగిరి, సింగనమల, వజ్రకరూర్ జిల్లాలోని కొన్ని ప్రముఖ పవనవిద్యుత్కేంద్రాలు.
  • జిల్లాలోని వజ్రకరూర్ వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి.
  • శ్రీ సత్యసాయి బాబా గారి అశ్రమము ప్రశాంతి నిలయము అనంతపురం జిల్లా లోని పుట్టపర్తిలో కలదు
  • పారిశ్రామికపరముగా తాడిపత్రి పట్టణంలో గ్రానైటు ను శుద్ది చేయు పరిశ్రమ, సిమెఒటు పరిశ్రమ, ఉక్కు కార్మాగారము మరియు బీడీ ల పరిశ్రమ , ధర్మవరం పట్టు మరియు జవులి పరిశ్రమ బాగా ప్రసిద్ది చెన్దినవి.
  • తాడిపత్రి పట్టణంలో క్రుష్ణ దేవ రాయల వారి అరుదైన కట్టడాల లో ఒకటైన దేవాళయము లు బాగా ప్రసిద్ది
  • రాష్ట్రంలో వైశాల్యము లొ అతి పెద్ద జిల్లా, అక్శ్హర క్రమము లో రె0డవది

[మార్చు] జిల్లా ప్రముఖులు

[మార్చు] గణాంకాలు

[మార్చు] మండలాలు

 అనంతపురం జిల్లా మండలాలు

[మార్చు] పర్యాటక కేంద్రాలు

అనంతపురం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, పెనుకొండ మరియు రాయదుర్గం కోటలు, పుణ్య క్షేత్రమైన పుట్టపర్తి, మరియు లేపాక్షి దేవాలయమునకు ప్రసిద్ధి. గుత్తిలో సముద్రమట్టమునకు 2171 అడుగుల ఎత్తున ఉన్న అద్భుతమైన కోటదుర్గము కలదు. ఇటువంటిదే బెంగుళూరుకు సమాన ఎత్తులో సముద్రమట్టమునకు దాదాపు 3100 అడుగుల ఎత్తునగల ఇంకా పెద్దదయిన కోటదుర్గము పెనుకొండలో కలదు. హైదర్ అలీ ఆక్రమించుకొనేవరకు గుత్తి దుర్గము మరాఠులకు గట్టిపట్టుగా ఉన్నది. 1789లో టిప్పూసుల్తాన్ దీనిని నిజాం వశము చేశాడు. 1800లో నిజాం ఇతర రాయలసీమ(దత్త మండలము) జిల్లాలతో సహా అనంతపురం జిల్లాను బ్రిటిషు వారికి దత్తము చేశాడు.కదిరి సమీపములో ని తిమ్మమ్మ మర్రిమాను ప్రపంచ ప్రఖ్యాతి చెందింది.ఇది సుమారు 5 ఎకరాల విస్తీర్ణం లో వుంది.ఇది గిన్నిస్ రికార్డ్ కూడ.


అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, కదిరి, ధర్మవరం, మరియు రాయదుర్గం. జిల్లాలోని ముఖ్య పట్టణములు. ఆలూరు, చిత్రచేడు, ఎనుమలదొడ్డి, గుత్తి, లేపాక్షి, మరియు పుట్టపర్తి ఇతర ప్రధాన ప్రదేశములు.

[మార్చు] స్వఛ్హంద సేవా సంస్థలు

ఒకప్పుడు పాడి పంటలతో కళకళ లాడిన అనంతపురం ఇప్పుడు నిత్యం కరువు కాటకాలతో సతమతమౌతోంది.జిల్లా లో అధిక విస్తీర్ణం సాగు వర్షాధారం. ఇక్కడ వేరుసెనుగ సాగు చేస్తారు.ఏళ్ళు గడచినా ఇక్కడ ప్రజల జీవన విధానంలో పెద్దగ మార్పు లేదు.ప్రజల లో చైతన్యం తీసుకు వచ్చేందుకు RDT(Rural Development Trust) సేవా సంస్థ చాలా ఏళ్ళుగ కృషి చేస్తొంది.


[మార్చు] బయటి లింకులు


ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు పూర్ణ కుంభం
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు