రాష్ట్రకూటుల శాసనాలు
వికీపీడియా నుండి
| తెలుగు శాసనాలు |
| విష్ణుకుండినులు |
| తూర్పు చాళుక్యులు |
| పశ్చిమ చాళుక్యులు |
| రాష్ట్రకూటులు |
| ఇతర వంశములు |
| సామ్రాజ్య చోళులు |
| కాకతీయులు |
| రెడ్డి రాజులు |
| రేచర్ల రెడ్లు |
| రేనాటి చోళులు |
| వైడుంబులు |
| చిందులు |
| తూర్పు గాంగులు |
| గజపతులు |
| కుతుబ్షాహీలు |
| మొఘల్ సామ్రాజ్యము |
| సూచిక I |
| సూచిక II |
28.(ఆ.రి.నెం. 331 1905వ సంవత్సరము)
- ఇటీవల కడప జిల్లా,జమ్మలమడుగు తాలూకా, దనవులపాడు గ్రామములో కనుగొనిన పాడుబడిన జైన మందిరములోని జైన విగ్రహము ముందున్న pedestal చుట్టూ.
- తేదీ నిర్ధారితము కాలేదు.
- నిత్య వర్షుని పరిపాలనా కాలములో ఒక శాంతి అనునతడు శిలాపీఠమును ప్రతిష్ఠించెనని చాటుచున్నది.
29.(ఆ.రి.నెం. 391 1904వ సంవత్సరము)
- కడప జిల్లా, ప్రొద్దుటూరు తాలూకా, మాలెపాడు గ్రామములోని గోపాలకృష్ణస్వామి ఆలయము వెనుక పడి ఉన్న బండ మీద.
- తేదీ నిర్ధారితము కాలేదు.
- నిత్య వర్షుని పరిపాలనా కాలములో, వల్లవరాజ యొక్క పట్టమహిషి మరియు ఇతరులు, ఇంత మొత్తము అని వరి ధాన్యము పండే భూమిని వీరిపర్తికి చెందిన నూటెనిమిది మందికి దానమిచ్చెనని చాటుచున్నది. పలు వ్యక్తుల (ఆడా మరియు మగా) పేర్లు పేర్కొనబడినవి.

