కాంచనమాల

వికీపీడియా నుండి

చిత్తజల్లు కాంచనమాల (1923 - 1981) తెలుగు సినీనటి, గాయని.

కాంచనమాల 1935 లో వై.వి.రావు నిర్మించిన శ్రీకృష్ణ తులాభారముతో సినీరంగ ప్రవేశము చేసినది.


అలనాటి అందాల తెలుగు సినిమా తార కాంచనమాల. కాంచనమాల బొమ్మ ఉన్న కాలెండర్లు ఇళ్ళల్లో అలంకరించుకొనేవారు. జెమినీ అధినేత ఎస్.ఎస్.వాసన్ ను తనతో అసభ్యముగా ప్రవర్తించినందుకు తిట్టిందని. ఆ తిట్లన్నీ తన స్టూడియో లో తెలివిగా రికార్డు చేయించి వాసన్ కాంచనమాల పై కోర్టులో కేసు పెట్టాడని, ఈ కీచులాటలే ఆమెకు మతిస్థిమితము తప్పడానికి కారణమయ్యాయని భావిస్తారు. ఆ తరువాత చాలా కాలానికి 1963 లో నర్తనశాల చిత్రంలో విరాట రాజు భార్యగా చిన్న వేషం వేసింది.

[మార్చు] చిత్ర సమాహారము