మార్టేరు

వికీపీడియా నుండి

మార్టేరు, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన గ్రామము


[మార్చు] విశేషాలు

మస్కట్‌లో ముసలయ్య చిత్రించిన అమ్మవారి పటం
మస్కట్‌లో ముసలయ్య చిత్రించిన అమ్మవారి పటం

గల్ఫ్ దేశం ఒమన్ రాజధాని మస్కట్‌లో "ఒమన్ షాపుర్జీ కంపెనీ" అనే కంపెనీవారి కార్మికుల క్యాంపు "ఘాలా" ప్రదేశంలో ఉన్నది. అందులో ఒక చిన్న గుడి ఉంది. దీనిని అమ్మవారి గుడి అంటారు. వినాయకుని విగ్రహం, అమ్మవారి పటం ఉన్నాయి. ఈ అమ్మవారి పటాన్ని చిత్రించిన వ్యక్తి మార్టేరుకు చెందిన "ముసలయ్య". పటంలో "K. Musalayya, Artist. Marteru, tq. Tanuku, W.G.Dist, A.P., India" అని వ్రాసి ఉంటుంది. చాలామంది ఇక్కడ భక్తి, శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రత్యేకంగా భజనలు చేసి, నైవేద్యం పెట్టి, తరువాత ప్రసాదం (భోజనం) పంచుతారు. ముసలయ్య ఇక్కడ పనిచేస్తున్నపుడు ఈ పటాన్ని చిత్రించారని చెప్పారు.