లాలూ ప్రసాద్ యాదవ్
వికీపీడియా నుండి
లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుత కేంద్ర(యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఆలయన్స్) రైల్వే శాఖా మంత్రి మరియు రాష్ట్ర జనతా దళ్ ఆధ్యక్షులు. యాదవ్ 7 సంవత్సరముల పాటు బీహార్ ముఖ్యమంత్రి గా కూడా ఉన్నారు. గడచిన రెండు దశాబ్దాలలో బీహార్ రాజకీయాలలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రబలమైన వ్యక్తిగా ఉన్నారు.
విషయ సూచిక |
[మార్చు] వ్యక్తిగతం
లాలూ ప్రసాద్ యాదవ్ పుల్వారియా, గోపాల్గన్ జిల్లా, బీహార్ కు చెందిన ఒక యాదవ్ రైతు కుటుంబము లో జన్మించెను. అతని తల్లి తండ్రులు కుందన్ రాయ్ మరియు మరచ్చియా దేవి. లాలూ పాట్నా యునివర్శిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసెను. జూన్ 1 ,1973 లో రాబ్డీ దేవి ని వివాహమాడెను. రాబ్దీ దేవి కూడా బీహార్ ముఖ్యమంత్రి హోదా లో పని చేసారు.
లాలూ, రాబ్దీ దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు.
[మార్చు] రాజకీయ గమనము
లాలూ రాజకీయ జీవితానికి తొలి మెట్టు పాట్నా యునివర్శిటీ లో విద్యార్థుల సంఘము అధ్యక్షత వహించడము. జయ ప్రకాష్ నారాయణ్ తో ప్రభావిత మైన విద్యార్థుల ఉద్యమానికి 1970 లో లాలూ నాయకత్వము వహించారు. విద్యార్థి నాయకుడైన లాలూ భారతదేశము ఎమర్జెన్సీ లో ఉన్నపుడు ఆనాటి ప్రధాన మంత్రి అయిన ఇందిరా గాంధీ కు ఒక వినతి శాసనాన్ని(charter of demands ) అందించిన ధీశాలి.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి సత్యేంద్ర నారాయం సిన్హా (ఛోటే సాబ్) 1977 లో లాలూను లోక్ సభ స్థానానికి పోటీ చెయించి, లాలూ తరపున ప్రచారము చేసెను. ఫలితంగా 29 సంవత్సరముల పిన్న వయస్సు లో 6వ లోక్ సభ కు ఎన్నిక అయ్యిరి.
కేవలము 10 సంవత్సరముల వ్యవధి లోనే లాలూ బీహార్ లో ఒక ఉజ్జ్వల శక్తి గా ఎదిగెను. 1989 లో బీహార్ లో జరిగిన ఎన్నికలలో, రాష్ట్ర ఎన్నికలలో లాలూ నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వము ను విజయపథమున నడిపించెను. అందువల్ల 1990 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల లో బీహార్ ముఖ్యమంత్రి గా ఎన్నిక అయ్యిరి. ప్రపంచ బ్యాంకు 1990 లో జరిగిన ఆర్ధిక అభివృద్దికి ఆ పార్టీకి ప్రశంసలు అందించెను.
1996 లో బీహార్లో బయటపడిన రూ. 950 కోట్ల పశుగ్రాస కుంభకోణములో లాలూ తో పాటు ఇతర ముఖ్య ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకుల పై కూడా అవినీతి ఆరోపణలు వచ్చినవి. (ఈ దర్యాప్తు ను లాలూ ఆదేశించడము విశేషము). పశుగ్రాస కుంభకోణము వల్ల లాలూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. రాబ్డీ దేవిని ముఖ్యమంత్రి గా నియమించడము జరిగింది.
1997లో లాలూ జనతా దళ్ నుండి విడిపోయి రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ను స్థాపించిరి.
[మార్చు] అంతర్జాతీయ ఖ్యాతి
వివిధ అంతర్జాతియ విశ్వవిద్యాలయము (Harvard and HEC Management School,ఫ్రాన్స్) , దౌత్య కార్యాలయములు శ్రీ. లాలూ జీవిత చరిత్ర పై అసక్తిని వ్యక్త పరిచినవి [1]. కేంద్ర మంత్రి అయిన తరువాత లాలూ కు ఖ్యాతి పెరిగెను. ఆసియా టైమ్స్ ఆన్ లైన్ తో మాట్లాడుతూ లాలూ ఇలా అన్నారు. "ప్రపంచము లో వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఒక ఆవుల కాపరి కొడుకు ఇటువంటి ఖ్యాతిని ఎలా గడించెను. వారికి నాయందు ఉన్న ఉత్సాహము భారత ప్రజాస్వామ్య విజయానికి చిహ్నము "
[మార్చు] వనరులు
- ఎన్వికీ లాలూ ప్రసాద్ యాదవ్ పేజీ
- భారత పార్లమెంటు వెబ్ సైటు లో లాలూ ప్రసాద్ యాదవ్ పేజీ
- ↑ Lalu goes to Harvard. The Times of India/City Supplement (July 8 , 2006). Retrieved on 2006-08-10.

