పశ్చిమ బెంగాల్

వికీపీడియా నుండి

పశ్చిమ బెంగాల్
Map of India with the location of పశ్చిమ బెంగాల్ highlighted.
రాజధాని
 - Coordinates
కోల్‌కతా
 - 22.82° ఉ 88.2° తూ
పెద్ద నగరము కోల్‌కతా (Calcutta)
జనాభా (2001)
 - జనసాంద్రత
80,221,171 (4వ స్థానం)
 - 904/చ.కి.మీ
విస్తీర్ణము
 - జిల్లాలు
88,752 చ.కి.మీ (13వ స్థానం)
 - 19
సమయ ప్రాంతం IST (UTC +5:30)
అవతరణ
 - గవర్నరు
 - ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
1960-05-01
 - గోపాల కృష్ణ గాంధీ
 - బుద్ధదేబ్ భట్టాచార్య
 - ఒకే సభ (295)
అధికార బాష (లు) బెంగాలీ
పొడిపదం (ISO) IN-WB
వెబ్‌సైటు: www.wbgov.com

పశ్చిమ బెంగాల్ (West Bengal, পশ্চিম বঙ্গ, Pôščim Bôngô) భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాలు, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్ , ఈశాన్యాన అసోం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం సముద్రమూ, వాయువ్యాన ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

క్రీ.శ. 750 నుండి 1161 వరకు బెంగాల్ ను పాలవంశపు రాజులు పాలించారు. తరువాత 1095 నుండి 1260 వరకు సేనవంశపురాజుల పాలన సాగింది. 13వ శతాబ్దమునుండి మహమ్మదీయుల పాలన ఆరంభమైంది. అప్పటినుండి, ప్రధానంగా ముఘల్ సామ్రాజ్యం కాలంలో బెంగాల్ ప్రముఖమైన, సంపన్నకరమైన వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 15వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రూపంలో అడుగుపెట్టిన ఆంగ్లేయులు 18వ శతాబ్దంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అక్కడినుండి క్రమంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం అంతా విస్తరించింది.

1757లో ప్లాసీ యుద్ధంలో గెలిచిన తరువాత బ్రిటీష్ ఈష్టిండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్.
1757లో ప్లాసీ యుద్ధంలో గెలిచిన తరువాత బ్రిటీష్ ఈష్టిండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్.

1947 లో స్వాతంత్ర్యం లభించినపుడు బెంగాల్ విభజింపబడింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో ఒక భాగమై తూర్పు పాకిస్తాన్‌గా పిలువబడింది. తరువాత ఇదే భాగం 1971లో పాకిస్తాన్‌నుండి విడివడి స్వతంత్ర బంగ్లాదేశ్‌గా అవతరించింది.

ఇక పశ్చిమ బెంగాల్ 1947 నుండి స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రమయ్యింది. ఫ్రెంచివారి పాలనలో ఉన్న చందానగర్ 1950లో భారతదేశంలో విలీనమైంది. 1955 అక్టోబరు 2 నుండి అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైనది.

[మార్చు] రాష్ట్రం

బెంగాల్ పులి
బెంగాల్ పులి

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కొలకత్తా నగరం రాజధాని. ఇక్కడ బెంగాలీ ప్రధానమైన భాష.. 1977 నుండి ఈ రాష్ట్రంలో వామపక్షపార్టీలు ఎన్నికలలో నిరంతరాయంగా గెలుస్తూ అధికారాన్ని నిలుపుకొంటూ వస్తున్నాయి.

[మార్చు] విభాగాలు

పశ్చిమ బెంగాల్ లో 18 జిల్లాలు ఉన్నాయి.

రాష్ట్రము. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణము జనాభా (2001) విస్తీర్ణము (కి.మీ.²) జన సాంద్రత (/కి.మీ.²)
WB BI బిర్‌భుం సురి 3012546 4545 663
WB BN బంకుర బంకుర 3191822 6882 464
WB BR బర్దమాన్ బర్దమాన్ 6919698 7024 985
WB DA డార్జిలింగ్ డార్జిలింగ్ 1605900 3149 510
WB DD దక్షిన్ దీనజ్‌పూర్ బలుర్‌ఘాట్ 1502647 2183 688
WB HG హూగ్లి చిన్‌సురాహ్ 5040047 3149 1601
WB HR హౌరా హౌరా 4274010 1467 2913
WB JA జల్పైగురి జల్పైగురి 3403204 6227 547
WB KB కొచ్ బీహార్ కొచ్ బీహార్ 2478280 3387 732
WB KO కోల్‌కత కోల్‌కత 4580544 185 24760
WB MA మల్ద ఇంగ్లీష్ బజార్ 3290160 3733 881
WB ME మిడ్నాపూర్ మిడ్నాపూర్ 9638473 14081 685
WB MU ముర్షిదబాద్ బెరంపూర్ 5863717 5324 1101
WB NA నాదియా కృష్ణానగర్ 4603756 3927 1172
WB PN 24 పరగనాస్ నార్త్ బరసత్ 8930295 4095 2181
WB PS 24 పరగనాస్ సౌత్ అలిపూర్ 6909015 9955 694
WB PU పురూలియ పురూలియ 2535233 6259 405
WB UD ఉత్తర్ దీనజ్‌పూర్ రాయ్‌గంజ్ 2441824 3180 768

[మార్చు] వాతావరణం

డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతములో తీస్తా నది తీరము వెంటా, కాలింపోంగ్ వద్ద మెలికలు తిరుగుతూ సాగుతున్న భారత జాతీయ రహదారి 31A
డార్జిలింగ్ హిమాలయ పర్వత ప్రాంతములో తీస్తా నది తీరము వెంటా, కాలింపోంగ్ వద్ద మెలికలు తిరుగుతూ సాగుతున్న భారత జాతీయ రహదారి 31A

పశ్చిమ బెంగాల్ వాతావరణం ప్రధానంగా ఉష్ణమండలం వాతావరణం. భూభాగం ఎక్కువగా మైదానప్రాతం. ఉత్తరాన హిమాలయ పర్వతసానువుల్లోని డార్జిలింగ్ ప్రాంతం మంచి నాణ్యమైన తేయాకుకు ప్రసిద్ధము. దక్షిణాన గంగానది ముఖద్వారాన్న సుందర్ బన్స్ డెల్టా ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతము. ఇది పశ్చిమ బెంగాల్ లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉన్నది. ప్రసిద్ధమైన బెంగాల్ టైగర్ కు ఈ ప్రాంతంలోని అడవులు నివాస స్థానము.


[మార్చు] సంస్కృతి

పశ్చిమ మిడ్నాపూర్‌లో ఒక గ్రామీణ దృశ్యం. రాష్ట్రములోని 72% జనాభా గ్రామాలలో నివసిస్తారు.
పశ్చిమ మిడ్నాపూర్‌లో ఒక గ్రామీణ దృశ్యం. రాష్ట్రములోని 72% జనాభా గ్రామాలలో నివసిస్తారు.
కలకత్తాలో ఒక వామపక్ష రాజకీయ ప్రదర్శన
కలకత్తాలో ఒక వామపక్ష రాజకీయ ప్రదర్శన
అప్పుడే మొలకెత్తుతున్న వరి నారు. వెనుక దృశ్యములో జనపనార కట్టలు
అప్పుడే మొలకెత్తుతున్న వరి నారు. వెనుక దృశ్యములో జనపనార కట్టలు

భారతదేశపు సాంస్కృతికవేదికలో బెంగాల్ కు విశిష్టమైన స్థానం ఉన్నది. "నేటి బెంగాల్ ఆలోచన. రేపటి భారత్ ఆలోచన" అని ఒక నానుడి ఉన్నది. ఎందరో కవులకు, రచయితలకు, సంస్కర్తలకు, జాతీయవాదులకు, తాత్వికులకు బెంగాల్ పుట్టినిల్లు. వారిలో చాలామంది భారతదేశపు సాంస్కృతిక ప్రస్థానానికి మార్గదర్శకులైనారు.

[మార్చు] ప్రసిద్ధులైన వారు

  • సాహితీ వేత్తలు
    • రొబీంద్రనాధ టాగూరు: భారత దేశానికీ, బంగ్లాదేశ్ కూ జాతీయగీత రచయిత. కవి, చిత్రకారుడు, సంగీతజ్ఙుడు, తత్వవేత్త. 1988 లో నోబెల్ బహుమతి గ్రహీత.
    • కాజీ నజ్రుల్ ఇస్లామ్
    • మైకేల్ మధుసూదన దత్తు
    • శరత్‌చంద్ర ఛటర్జీ
    • బంకించంద్ర ఛటర్జీ
    • బిభూతి భూషణ బందోపాధ్యాయ్
  • సంగీతకారులు
  • విజ్ఙాన వేత్తలు
    • జగదీశ్‌చంద్ర బోస్
    • సత్యేంద్రనాధ బోస్: బోస్-అయిన్ స్టయిన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భాగస్వామి, బోసాన్ సూక్ష్మకణాలు ఈయన పేరుమీద నామకరణం చేయబడినాయి.
    • అమర్త్యసేన్ : 1988 లో నోబెల్ పురస్కారాన్ని అందుకొన్ని ఆర్ధిక శాస్త్రజ్ఙుడు
  • జాతీయోద్యమ నాయకులు
  • రాజకీయ నాయకులు
    • జ్యోతి బసు
  • విప్లవనాయకులు
  • సంఘసంస్కర్తలు
    • రాజా రామమోహన రాయ్
  • తాత్వికులు
    • అరబిందో ఘోష్
  • ఆధ్యాత్మిక గురువులు
    • చైతన్య మహాప్రభు: 15 వ శతాబ్దిలో కృష్ణభక్తిని ప్రబోధించిన అవతారమూర్తి.
    • రామకృష్ణ పరమహంస
    • వివేకానంద
    • భక్తివేదాంత ప్రభుపాద (అంతర్జాతీయ కృష్ణచైతన్యోద్యమ వ్యవస్థాపకులు)
  • కళాకారులు
    • అవనీంద్రనాధ టాగోర్
  • సినిమా కళాకారులు
  • క్రీడాకారులు
    • సౌరవ్ గంగూలీ: క్రికెట్
    • అర్పణరాయ్: టెన్నిస్

[మార్చు] జనవిస్తరణ

ఐ.ఐ.టి ఖరగ్‌పూర్
ఐ.ఐ.టి ఖరగ్‌పూర్

పశ్చిమ బెంగాల్ లో బెంగాలీ ప్రధానమైన భాష. బీహారీలు కూడా రాష్ట్రమంతా నివసిస్తున్నారు. సిక్కిం సరిహద్దు ప్రాంతంలో షెర్పాలు, టిబెటన్ జాతివారు ముఖ్యమైన తెగ. డార్జిలింగ్ ప్రాతంలోని నేపాలీ బాష మాట్లాడేవారు ప్రత్యేకరాష్ట్రంకోసం చాలాకాలం ఉద్యమం సాగించారు. వారికి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనే స్వతంత్రప్రతిపత్తి ఇవ్వబడింది.

[మార్చు] బయటి లంకెలు


భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు Flag of India
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అసోం | బీహార్ | ఛత్తీస్‌గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్ నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్ డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ