తిరుపతి వేంకట కవులు

వికీపీడియా నుండి

తిరుపతి వేంకట కవులు తెలుగులో ప్రసిద్ధిపొందిన జంటకవులు. దివాకర్ల తిరుపతి శాస్త్రి మరియు చెల్లపిల్ల వేంకట శాస్త్రి లు ఇద్దరిని కలిపి ఇలా పిలుస్తారు.

వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానము లో వీరు చాలా ప్రముఖులు. ఆంధ్ర దేశము లో ఏన్నో అష్టావధానాలు మరియు శతావధానాలు ప్రదర్శించి ఎంతో గుర్తింపు పొందారు.

ఎందరో జమీందార్లు మరియు రాజులు వీరిని ఆదరించి సహాయము చేశారు.

కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి సుందరరామ్మూర్తి వీరి శిష్యులు.

ఆంధ్ర విశ్వవిద్యాలయము వీరికి కళాప్రపూర్ణ బిరుదు ప్రదానము చేసినది.