వేమూరి వేంకటేశ్వరరావు

వికీపీడియా నుండి

వేమూరి వేంకటేశ్వరరావు
జననం 1937(38)
చోడవరం, విశాఖపట్నం జిల్లా
స్వస్థలం తుని, తూర్పు గోదావరి జిల్లా
వృత్తి రచయిత, కంప్యూటర్ సైన్సు ఆచార్యులు
తండ్రి వేమూరి సోమేశ్వరరావు
తల్లి తెన్నేటి సీతారామమ్మ

వేమూరి వేంకటేశ్వరరావు (Vemuri Venkateswararao) వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో ఉన్నారు.


ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. ఈయన 1967 ప్రాంతాలలో కంప్యూటర్ల మీద మొట్టమొదటి తెలుగు 'పుస్తకం' రాసేరు. ఇది తెలుగుభాషాపత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించబడింది. తరువాత ఈయన తెలుగులో జీవరహస్యం (ప్రాణం లేని జడ పదార్ధం నుండి జీవి ఎలా పుట్టిందో చెప్పే కథ), రసగంధాయ రసాయనం (ఇంటింటా, వంటింటా వాడే సాధారణ పదార్ధాల వెనుక ఉన్న రసాయన శాస్త్రం), జీవనది (మన శరీరంలో ప్రవహిస్తూ మనకి ప్రాణాన్ని ఇచ్చే రక్తం కథ) అనే మూడు పుస్తకాలు ప్రచురించేరు. ఈ కాలంలోనే ఈయన సైన్సు ప్రాతిపదికగా కల కథలు కొన్నింటిని, కల్పితకథలని కొన్నిటిని రచించేరు. వీటిలో కొన్నింటిని కించిత్ భోగో భవిష్యతి అన్న మకుటం కింద ఒక పుస్తక రూపంలో ప్రచురించేరు. ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్ని ఈయన ఒక చోట చేర్చి English-Telugu and Telugu-English Dictionary and Thesaurus అని ఒక నిఘంటువుని ప్రచురించేరు. "నా అమెరికా అనుభవాలు" అనే పుస్తకం ఒకటి కొద్ది రోజులలోనే ప్రచురణ కాబోతూంది. ఇంతవరకు ప్రచురణ పొందినవి, ఇంకా ప్రచురణ కానివి అయిన వ్యాసాలు, కథలు, ప్రశ్నోత్తరాలు మొదలైనవి ఈయన వెబ్ సైట్ లో చూడవచ్చు.

ఈయన Eco Foundation (ecofoundation.org) అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడుపుతున్నారు. పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.