కోలవెన్ను రామకోటీశ్వరరావు

వికీపీడియా నుండి

కోలవెన్ను రామకోటీశ్వరరావు
జననం 1894
స్వస్థలం నరసరావుపేట
మరణం 1970
వృత్తి పాత్రికేయులు
తండ్రి వియ్యన్న పంతులు
తల్లి రుక్మిణమ్మ

కోలవెన్ను రామకోటీశ్వరరావు (Kolavennu Ramakoteeswara Rao) బందరు నుండి త్రివేణి అనే సాంస్కృతిక పత్రికను సుమారు నాలుగు దశాబ్దాలు నిర్వహించేరు .

భారత దేశంలో వివిధ రాష్ట్రాల భాషా సాహిత్యాలను, ఇంగ్లీషు అనువాదాల ద్వారా, ఇతర రాష్ట్రాల వారికి పరిచయం చెయ్యటం, భారత జాతీయ జీవనంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించటం త్రివేణి ధ్యేయంగా ఉండేది. 1928లో మొదలయిన త్రివేణిలో రాధాకృష్ణన్, రాజాజీ, నెహ్రూ మొదలైన నాయకులు త్రివేణి లో రచనలు చేసేవారు. మహాత్మా గాంధీ 1934లో బందరు వచ్చినప్పుడు, త్రివేణి బాగుందని మెచ్చుకున్నారు.

[మార్చు] వనరులు