తరిమెల నాగిరెడ్డి

వికీపీడియా నుండి

తరిమెల నాగిరెడ్డి గారు అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఫిబ్రవరి 11, 1917 న జన్మించారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గొప్ప కమ్యూనిస్టు నాయకులలో నాగిరెడ్డిగారు కూడా ఒక్కరు. అందరు నాగిరెడ్డీ గారిని TN అని పిలిచెడివారు.

నాగిరెడ్డిగారు అప్పటి మద్రాసు లోని లయోలా కలాశాల లోనూ, ఆ తరువాత వారణాసి, బనారస్ హిందూ విశ్వ విద్యాలయం లోనూ విద్యనభ్యసించారు. విధ్యార్థిగానే నాగిరెడ్డి గారు మార్క్సిజం వైపు ఆకర్షితులై 1940, 1941 మరియు 1946 లలో జైలు కు వెళ్లారు.

1951 లో రెడ్డిగారు మద్రాసు అసెంబ్లీకి CPI అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 1957 లో అనంతపూరం నియోజకవర్గం నుండి లోకసభకు ఎన్నికయ్యారు. 1962 లో పుత్తూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి CPI అభ్యర్థిగా ఎన్నికయ్యారు. తిరిగి 1967 లో CPI(M) అభ్యర్థిగా అనంతపూరం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

1968 లో రెడ్డిగారు CPI(M) నుండి విడిపోయి Andhra Pradesh Coordination Committee of Communist Revolutionaries ను స్థాపించారు. CPI(M) కార్యకర్తలను ఆకర్షించడంలొ సఫలం అయ్యారు. కొద్ది కాలం APCCCR All India Coordination Committee of Communist Revolutionaries లో కలసివుంది. రెడ్డిగారు 1976 లో తను మరణించేదాకా APCCCR నాయకుడిగా కొనసాగారు.

నాగిరెడ్డిగారి రచనలలో ముఖ్యమైనది India Mortgaged. నాగిరెడ్డిగారు 1976, జులై 28న మరణించారు.

[మార్చు] బయటి లింకులు