భారతీయ వంటకాలు
వికీపీడియా నుండి
![]() |
| ఈ వ్యాసం భారతీయ వంటలు శీర్షికలో భాగం |
| తయారుచేసే పద్ధతులు మరియు వంటసామగ్రి |
|
వంటపాత్రలు |
| ప్రాంతీయ వంటలు |
పంజాబీ – మొఘలాయి – రాజస్థానీ – |
కేరళ – తమిళ – ఆంధ్ర –కర్ణాటక |
బెంగాలీ – అస్సామీ – ఒరియా – |
గోవా – గుజరాతీ – మరాఠీ – |
విదేశీ – చారిత్రక – జైన (సాత్విక) – |
| Ingredients and types of food |
|
ముఖ్యమైన వంటకాలు – తీపిపదార్ధాలు – |
| See also: |
|
Indian chefs |
| మార్చు |
భారతీయ వంటలను ఈ కింది ప్రాంతీయ రకములుగా విభజించవచ్చును. భారత దేశ భౌగోళిక పరీస్థితులవలన, ఉత్తర భారతదేశంలోని పదార్ధాలకు గోధుమ మూలం అయితే దక్షిణ భారతదేశం మరియు తూర్పు భారతదేశం లోని ఆహారాలకు వరి ముఖ్య మూలం.
విషయ సూచిక |
[మార్చు] ముఖ్యమైన పదార్ధాలు మరియు సుగంధ ద్రవ్యాలు
భారతదేశ ఆహారంలో ముఖ్యమైన మూలాలు వరి, గోధుమ పిండి దీనినే ఆట్టా అనికూడా అంటారు, షుమారు 5 డజన్ల రకాల దిణుసులు. వాటిలో ముఖ్యమైనవి శెనగలు (వీటినే బెంగాల్ శెనగలు అని కూడా అంటారు, ఇవి తెల్ల శనగలలాగానే ఉంటాయి కానీ పరిమాణము చిన్నదిగా ఉండి మంచి సువాసనని కలిగిఉంటాయి), కందులు, మినుములు, పెసలు. దిణుసులని పప్పులాగా ఉపయోగిస్తారు, అంటే కందిపప్పు, మినపపప్పు, పచ్చిశనగపప్పు, పెసర పప్పు అలా. కొంతమంది శనగల్ని, పెసలని మొలకెత్తించి ఉపాహారం లా తీసుకుంటారు. శనగల్ని పిండి (శెనగ పిండి)రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు
భారత దేశ ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలు మిరప, నల్ల ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతులు, ధనియాలు, ఇంగువ, వాము. ముఖ్యమైన సుంధ ద్రవ్యాలు లవంగము, యాలుకలు, శొంఠి, దాల్చిన చెక్క, గులాబి రేకులు, నల్ల మిరియాలు, తెల్ల నువ్వులు, గసగసాలు, కంకుమ పూవ్వు, జల్-జీరా, యెండు కొబ్బరి, కర్పూరం మొదలైనవి. వీటిలో కొన్నింటిని పొడిగా చేసి గరం మసాలా అని అంటారు. గరం మసాలా లో ఉండే దిణుసులు - ఎండబెట్టిన లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, ధనియాలు, జాజికాయా, జాపత్రి, ఎండు కొబ్బరి, గసగసాలు మొదలినవి. వీటిలో కొన్నితిని తీపిపదార్ధాల తయారీలో వినియోగిస్తారు. అవి గులాబీ రేకులు, కర్పూరం, తెల్ల నువ్వులు, కుంకుమ పువ్వు మొదలైనవి.
[మార్చు] ప్రాంతీయ ప్రత్యేకతలు
- దోశ - దక్షిణ భారతదేశం నుండి వచ్చింది. దీన్నే అట్టు అనికూడా అంటారు. దోశల్లో రకరకాలు ఉన్నాయి, మసాలా దోశ, 77యం యం దోశ, ఉల్లి దోశ, పెసర దోశ, ఉల్లి-అల్లం-మిర్చి పెసర దోశ, ఉప్మా పెసర అట్టు, కారం దోశ, యంఅల్యే దోశ, కోడిగుడ్డు దోశ, బియ్యపుపిండి తో చేసిన దోశ, గోధుమ పిండి తో చసిన దోశ. పులిసిన అట్టుపిండి తో చేసినదే పుల్లట్టు.
- ఇడ్లీ, కూడా దక్షిణ భారత దేశం నుండి వచ్చిందే.
- కుడుములు, వీటిని వరి (బియ్యం), మినప్పప్పు, కందిపప్పు మొదలైన దిణుసులని కలిపి ఆ పిందిని నానబెట్టి చేస్తారు. బియ్యం మరియు పప్పులను నీళ్ళలో షుమారు 12 గంటలు నానబెట్టి, వాటిని రుబ్బి ముద్దలా చేసి, దాన్ని ఇడ్లీ చేసే రేకులలంటి రేకులలో వేసి, ఇడ్లి తయ్యారు చేసే గిన్నెలో అడుగున కొంచెం నీళ్ళి పోసి, పైన రేకులు పెట్టి మూతపెట్టాలి. ఆ గిన్నలో ఉన్న నీటి ఆవిరికి ఇవి ఉడికి కుడుములులా అవుతాయి. ఇడ్లీ గిన్నె - ఇది ఒక ప్రతేకమైన ఆకారం కలిగి ఉంటుంది. ఇడ్లీ గిన్నె లేకపోతే ప్రెషర్-కుక్కర్ వాడుకోవచ్చు.
- ఉప్మా/ఉప్పిట్టు దక్షిణ భారత దేశం నుండి వచ్చిందే.
ఉప్పిట్టు అనేది ఉప్మా కి కన్నడ రూపాంతరం. దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. గోధుమరవ్వతో చేసేవాళ్ళు కొంతంది, ఉప్మా రవ్వ తో చేసేవాళ్ళు కొంతమంది. గోధుమ రవ్వ లేక ఉమ్పా రవ్వ కూరగాయలతో ఉడికితే వచ్చేదే ఉప్మా
- బోండా
- బజ్జి
బజ్జీలు రకరకాలు. మిరపకాయ బజ్జీ (గుంటూరు దీనికి పెట్టిమ్ది పేరు), ఉల్లిపాయ బజ్జి, బంగాళాదుంప బజ్జి, అరటికాయ బజ్జి ఇలా యెన్నో రకాలు. వీటిని ఎక్కువగా శనగ పిండి తో చేస్తారు.
- బంబిల్ వేపుడు - ఇది ఒక మహారాష్ట్ర వంటాకం. ఇది బోంబాయి బాతు వేపుడు.
- పునుగులు.
- గుంట పునుగులు
- సమోసాలు. హైదరాబాదు వీటికి ప్రసిధ్ధి.
- కోంబ్డీ వడే (ఒక రకము మాల్వానీ కోడి కూర)
- గారెలు దక్షిణ భారత దేశ వంట. వీటినే కొందరు వడలు అని కూడా అంటారు. మినపప్పు (పొట్టు మినపపప్పు ఐతే బాగంటాయి) తో చేసారు. మందుగా (పొట్టు)మినప్పప్పును బాగా నానబెట్టి, కడిగి (పొట్టువి అయితే పొట్టుపోయేలా కడిగి) తగినంత గండ్ల ఉప్పు చేర్చుకొని రుబ్బుకోవాలి. కొంతంది దాంట్లో మిరపకాయలు వేస్తారు, అలానే ఉల్లిపాయలు వేసేవాళ్ళు కొందరు, కర్వేపాకు కూడా వేసుకోవచ్చు. ఒక బాణిలి లో నూనెపోసి బాగా కాగాక ఒక బాదం ఆకు కానీ, లేక అరటి ఆకు కానీ లేక పాల పొట్లం తీసుకొని, తడి చేసి రుబ్బుకున్న పిండిని కొంచెం (మీకు ఎంత పెద్ద వడలు కావాలో ఆ ప్రకారంగా) తీసుకుని, ఆ ఆకు మీద పెట్టి, చెయ్యి తడి చేసుకొనీ దాన్ని చేత్తో కంచెం వత్తి, మధ్యలో బొక్క పెట్టి నూనెలో వేసి వేయించుకోవాలి.
- వడా పావ్ (బర్గర్ కి మహారాష్ట్రా జవాబు)
- పెరుగు ఆవడ పెరుగు, కొంచేం ఆవపిండి, అల్లం కలిపి దాన్లో నానపెట్టిన వడ
- పూరి ఇది ఉత్తరభారతదేశ వంట
- గోళి బజ్జీ (మంగళూరు)
- ఛాట్ తిండి
[మార్చు] పేరొందిన ఇతర భారత దేశ వంటకాలు
- రొట్టె
- కూర
- దమ్ము మేక
- తందూరి కోడి (తందూర్ ఒక మట్టితో చేసిన పొయ్యి)
- విండాలూ
- బిర్యాని
- పులిహోర
- కట్టె పొంగలి
భారతదేశం లొ రకరకాల రొట్టెలు చేసుకుంటారు అవి రోటీ, పోలి, పరాఠా, నాన్ మొదలైనవి.
[మార్చు] కొన్ని తీపిపదార్ధాలు
- గులాబ్ జామ్
- రసగుల్ల
- మైసూరుపాక్
- కొబ్బరి బర్ఫి
- పాలకోవా
- ఫీర్ని
- బొబ్బట్లు
- పాయసం
- మోదక్
- హల్వా
- కుల్ఫీ
- జిలేబి
- శ్రీఖండ్ - ఇది మహారాష్ట్రా వారిది
- బెల్లం ఉండలు
- గొబ్బరి లౌజు
- నూగు జీడీలు
- గవ్వలు
- పేడా
- బాదుషా
- వేరుశనగ ఉండలు
- చిమ్మిరి ఉండలు
- లడ్డు
- తొక్కుడు లడ్డు
- బూందీ
- బూందీ చెక్క
- కళాకండ
- చక్ర పొంగలి
- పాయసం
- పరమాన్నం
- బూరెలు
- కజ్జికాయలు
[మార్చు] విదేశాలలో భారతీయ తిండి
బ్రిటీషు వారు బ్రిటీషు రాజరికం దగ్గరనుంచీ భారతదేశ వంటకాలతో ముడిపడి ఉన్నారు. ఇప్పటికీ కొన్ని భారత భోజనశాలలు సంపన్న లండన్ లో భారతదేశంలో పని చేసి తిరిగివెళ్ళే ఉన్నత ఉద్యోగులకోసం సేవలు చేస్తున్నాయి.
20 వ శతాబ్దం లో పని కోసం బంగ్లాదేశ్ మొదలైన దేశాల నుంచి ప్రజలు లండన్ కి వలసలువెళ్ళటం వలన ఆంగ్లో-భారత వంటల రెండవ దశ నిర్మాణం మొదలైంది. ఇలాంటి భోజనశాలలు మొత్తమొదట తూర్పు లండన్ లోని బ్రిక్ లేన్ లో తెరవబడ్డాయి. ఈ భోజనశాలలు ఇప్పటికీ పేరొందినవిగానే ఉన్నయి.
1960లల్లో, కోడి టిక్కా మసాలా లాంటి భారత వంటకాలు కానివి యెన్నో కొత్తగా పుట్టుకొచ్చాయి. ఐతే ఇప్పుడు ఆ పరీస్థితి వెనక్కి తిరిగింది, ఉపఖండ భోజనశాలలు తమతమ వంటకాలల్లో వ్యత్యాసాలని చూపేదుకు భారత, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల స్వంత వంటలని వడ్డించటానికే మొగ్గు చూపుతున్నై. 20 వ శతాబ్దం లో బర్మింగాం బాల్టి ఇల్లులకి కేంద్ర బిందువు అయింది, ఇక్కడ కొత్త పోకడలతో వంటలని పెద్ద, భాండీ వంటి వంట సామాగ్రితో చేయటం మొదలైంది. ఈ భాండి బాల్టిస్తాన్ నుండి దిగుమతి అయినట్లు ఉన్నా, పోర్చుగీసు బక్కెట్టు లాంటిది.
ప్రస్తుతం భారత వంట ఆంగ్ల వంటకాలల్లో ఇమిడిపోయి ఉన్నది: ఐతే ఆంగ్ల వంటకాలల్లో భారత వంట మిళితమి మాత్రమే ఉన్నదన్న వాదనా లేకపోలేదు.
1970 నుండి దక్షిన ఆసియా ఖండామ్నుంచి అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వలసల వలన అమేరికా లో కూడా భారత వంటలు ప్రఖ్యాతి గాంచాయి, ముఖ్యంగా న్యూయార్కు నగరమ్లోనేకాక ఇతర మహానగరాలల్లో కూడా ఇవి శరవేగంతో అభివృద్ధి చెందాయి.


