చిత్రావతి
వికీపీడియా నుండి
చిత్రావతి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నది అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. జిల్లాలోని తాడిమర్రి వద్ద ఒక బాలెన్సింగు జలాశయాన్ని నిర్మించారు. కర్ణాటక ప్రభుత్వం కోలారు జిల్లా బాగేపల్లి వద్ద నిర్మించిన ఆనకట్ట రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది.

