భీష్మ ప్రతిజ్ఞ
వికీపీడియా నుండి
భీష్మ ప్రతిజ్ఞ పేరుతో తెలుగులో రెండు సినిమాలు వచ్చాయి. వీటిలో మొదటిది తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య 1921లో తీసినది. ఇది ఒక తెలుగు నిర్మాత తీసిన మొదటి చిత్రంగా చరిత్రఅత్మకమైనది..
[మార్చు] భీష్మ ప్రతిజ్ఞ (1921)
| భీష్మ ప్రతిజ్ఞ (1921) | |
| దర్శకత్వం | రఘుపతి ప్రకాష్ |
|---|---|
| తారాగణం | రఘుపతి ప్రకాష్, డి కాస్టెల్లో |
| నిర్మాణ సంస్థ | రఘుపతి వెంకయ్య నిర్మాణం స్టార్ ఆఫ్ ది ఈస్ట్ |
| భాష | తెలుగు |
1921లో తీసిన భీష్మ ప్రతిజ్ఞ తొలి తెలుగు మూగ చిత్రంగా చెప్పబడుతుంది. మాటలు లేవు గనుక "తెలుగు" చిత్రం అనడం కొంత అసంబద్ధం. "తెలుగు వాడు" తీసిన చిత్రం అని చెప్పడం సమంజసం.
రఘుపతి వెంకయ్య తన కుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ను సినిమా నిర్మాణం నేర్చుకోవడానికి విదేశాలు పంపాడు. ప్రకాష్ జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాలు పర్యటించాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు 'సిసిల్ బి డెమిల్లి' (Ceicil B.Demille) 'టెన్ కమాండ్మెంట్స్'(Ten Comamndments) చిత్రాన్ని నిర్మిస్తున్నపుడు ప్రకాష్ ఆయన క్రింద కొంతకాలం పనిచేశాడు.
ప్రకాష్ తిరిగి వచ్చిన తరువాత ఈయన దక్షిణభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'Star of the East' ను స్థాపిచాడు. 1921లో భీష్మప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు . ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో'(De Castello)అనే ఆంగ్లయువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ఈ తండ్రీకొడుకులు "మత్స్యావతార్", "నందనార్", "గజేంద్రమోక్షం" వంటి మరికొన్ని మూగసినిమాలను తీశారు. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
[మార్చు] భీష్మ ప్రతిజ్ఞ (1965)
| భీష్మ ప్రతిజ్ఞ (1965) | |
| నిర్మాణ సంస్థ | శ్రీ చంద్రకాంత్ |
|---|---|
| భాష | తెలుగు |

