అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి.
వికీపీడియా నుండి
| భాషా సింగారం |
|---|
| సామెతలు |
| జాతీయములు |
| --- అ, ఇ, |
| --- ఉ, ఎ, ఒ |
| --- క, గ, చ, జ |
| --- ట, డ, త, ద, న |
| --- ప, బ, మ |
| --- "య" నుండి "క్ష" |
| పొడుపు కధలు
|
| ఆశ్చర్యార్థకాలు |
శ్రీవైష్ణవులు బ్రాహ్మణులలో ఒక తెగ. భ్రాహ్మణులు మాంసం భుజించరు. అందరూ వైష్ణవులే - శాకాహారులే - ఉన్న చోట బుట్టలో ఉన్న రొయ్యలు మాయమయ్యాయి. ఉన్నవాళ్ళలోనే ఎవరో తీసి ఉండాలి, అంటే వారిలో ఎవరో ఒకరో, కొందరో మాంసాహారులై ఉండాలన్న మాట. కానీ ఆ విషయం ఎవరూ ఒప్పుకోరు. అలాగే, ఎక్కడైనా ఒక తప్పు పని జరిగినప్పుడు అక్కడ వున్నవారంతా 'నేను కాదంటే నేను కాదు' అని అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. తప్పు జరిగిపోయింది, అక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు ఆ పని చేసి ఉండాలి. చేసినట్లు ఎవరూ ఎవరూ ఒప్పుకోవడం లేదు - అందరూ శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయ్యలు మాత్రం మాయమయ్యాయి.

