నవవిధభక్తులు
వికీపీడియా నుండి
భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. ఆ శ్లోకం:
-
- శ్రవణం కీర్తనం విష్ణోః
- స్మరణం పాద సేవనం
- అర్చనం వందనం దాస్యం
- సఖ్యమాత్మ నివేదనం
అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
- శ్రవణం: భగవంతుని గూర్చిన గాధలు, భజనలు, కీర్తనలు వినుట - (హరికథ శ్రోతలు),ధర్మరాజు, జనమేజయుడు, శౌనకాది మునులు.
- కీర్తనం: భగవంతుని గుణగణములను కీర్తించుట: రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు,మీరాబాయి - మరెందరో భక్త గాయకులు.
- స్మరణం: భగవంతుని స్మరించుట - నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.
- పాదసేవ: దేవుని పాదముల పూజ సేయుట
- అర్చనం: గుడిలోగాని, ఇంటిలోగాని,హృదయములో గాని విధివిధానములతో అర్చించుట.
- వందనం: ప్రణామం చేయుట
- దాస్యం: భగవంతునకు దాసుడగుట - హనుమంతుడు, రామదాసు
- సఖ్యం: అర్జునుడు
- ఆత్మనివేదనం: తనను పూర్తిగా దేవునకు సమర్పించుకొనుట - గోదాదేవి, మీరాబాయి
పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం
-
- తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
- ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
- బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
- జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!
సంఖ్యానుగుణ వ్యాసములు

