వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 14

వికీపీడియా నుండి

< వికీపీడియా:చరిత్రలో ఈ రోజు
  • 1690: జర్మనీలోని న్యూరెంబర్గ్‌కు చెందిన జాన్‌ సి. డెన్నర్‌ 'క్లారినెట్‌' వాద్యాన్ని రూపొందించారు.
  • 1760: ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న పాండిచ్చేరిని బ్రిటిష్‌ కెప్టెన్‌ ఐరీకూట్‌ (Sir Eyre Coote) స్వాధీనం చేసుకున్నాడు.
  • 1761: మరాఠాలూ అఫ్గాన్ల మధ్య మూడో పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అహ్మద్‌షా అబ్దాలీ సేన విజయం సాధించింది.
  • 1857: ఇండియన్ బ్యాంకు, హిందూ పత్రికల వ్యవస్థాపకుల్లో ఒకడైన న్యాపతి సుబ్బారావు జన్మించాడు.
  • 1892: 'గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్‌'గా పేరొందిన దినకర్‌ బల్వంత్‌ దేవధర్‌ జననం. ఆయన పేరు మీదే దేవధర్‌ ట్రోఫీ నిర్వహిస్తారు.
  • 1964: ఇంగ్లండుతో జరిగిన ఓ టెస్టుమ్యాచ్‌లో భారత బౌలర్‌ బాపూనాదకర్ణి వరుసగా 21 మెయిడెన్‌ ఓవర్లు విసిరి రికార్డు సృష్టించాడు. వికెట్లేమీ తీసుకోకున్నా ఆ మ్యాచ్‌లో అతను 32 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
  • 1969: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడు గా మార్చారు.
  • 1987: దూరదర్శన్‌ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాద్‌ నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్‌మిటర్లను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రానికి అనుసంధానించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే హిందీ కార్యక్రమాలనూ హైదరాబాద్‌ కేంద్రం నుంచి రోజులో కొద్దిసేపు మాత్రమే ప్రసారమయ్యే తెలుగు ప్రసారాలనే ప్రేక్షకులు చూసేవారు.
  • 1998: గానకోకిల ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.