భద్రిరాజు కృష్ణమూర్తి

వికీపీడియా నుండి

ఇరవైయవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తి. భాషాతత్వం, భాషా ప్రయోజనం, భాషా వికసనములపై గిడుగు రామమూర్తి వలె వీరికి కూడా చక్కటి అవగాహన ఉంది. భాషా శాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. భాషాశాస్త్ర విజ్ఞానిగా ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ద్రావిడ భాషా తత్వాన్ని గురించి, తెలుగు ధాతువుల ప్రాతిపదిక స్వరూప స్వభావాల గురించి, తెలుగు భాష నవీకరణ గురించి ఎన్నెన్నో పరిశోధనా గ్రంధాలు, వ్యాసాలు రచించాడు.