వికీపీడియా నుండి
భారత ఉపఖండంలో ప్రసిద్దమయిన హిమ నది. ఇది హిమాలయాలలో టిబెట్టు లో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధ్ రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్ లో కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో సాగరసంగమం అవుతుంది. సింధు నది దీని ఉపనదులు జీలం, చీనాబ్, రావీ, బియాస్, సట్లెజ్ ప్రవహించే ప్రాంతం అంతా అతి సారవంతమయిన నేల. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా డాము, సుక్కూలారు బ్యారేజ్, భారతదేశంలో పంజాబ్లో సట్లెజ్ నది మీద భాక్రానంగల్ డాము, భారీ డాములు, ఆనకట్టలు కట్టి సాగునేలకు పంట నీటిని అందించి గోధుమ, వరి, చెరకు విరివిగా పండించుటయేగాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సింధు నది పొడవు 2880 కి.మీ. హరప్పా, మొహంజోదారో ప్రాంతాల్లో ఈ సింధు నదీ లోయలో సుమారు 5000 ఏళ్ళ ఉజ్జ్వల నాగరికత వెలసివర్థిల్లింది.