కాపుగోడెయవలస
వికీపీడియా నుండి
కాపుగోడెయవలస శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఒక చిన్న గ్రామము
వూరి జనాభా షుమారు 2000. వోటర్లు 800. వ్యవసాయమే ప్రధాన వృత్తి. కూరగాయల పెంపకం ఎక్కువగా జరుగుతుంది. వూరిలో ఒక ప్రాధమికోన్నతపాఠశాల ఉంది.
షుమారు 300 సంవత్సరాల క్రితం 'సనగోడయ్యప్ప' అనే వ్యక్తి ఈ గ్రామాన్ని స్థాపించాడని చెబుతారు. ఇంతకుముందు ఈ వూరు చిట్టివలసహుండం అనే పేరుతో కోటబొమ్మాళి సంస్థానంలో భాగంగా ఉండేది. ఆ సంస్థానపు చివరి జమీందారు పి.అచ్యుతనారాయణ కోటబొమ్మాలినుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. ఆయనను మాల్కుదర్ అనేవారు. ఆయన వంశీకులు ఇప్పటికీ ఈవూళ్ళో ఉన్నారు.

