చిమిర్యాల

వికీపీడియా నుండి

చిమిర్యాల గ్రామం, కోదాడ మండలం, నల్లగొండ జిల్లా-508206

నల్గొండ జిల్లా కోదాడ మండలం లోని గ్రామం. కోదాడ నుండి 10 కి.మీ దూరంలొ ఎన్ హెచ్-9 మీద వున్నది. ప్రతి 10 ని|| కు బస్ సౌకర్యం కలదు. కోదాడ నుండి ఆటో సౌకర్యం కలదు. 10 వ తరగతి వరకు పాఠశాల కలదు. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రధానంగా వరి, మిరప, కంది పంటలు పండిస్తారు. వ్యవసాయానికి కావలసిన నీటి వనరు కొరకు సాగరు కాలువ, కొదాడ చెరువు వాగు, బోర్ల మీద ఆధారపడతారు. గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయము, ముత్యాలమ్మ తల్లి దేవాలయములు ఉన్నాయి. కోటి రూపాయల విలువ కలిగిన బ్రిడ్జి చిమిరేల వాగు పై నిర్మించబడింది. దీనివలన చిమిరేల, గోండ్రేల, కొత్తగూడేం, తండ గ్రామ ప్రజల రవాణాకు ఎంతో ఉపయోగం. దీని నిర్మాణానికి జైపాల్ రెడ్డి MP, ఉత్తమ్ కుమార్ రెడ్డి MLA లు ఎంతో కృషి చేశారు.

విషయ సూచిక

[మార్చు] పంచాయతీ చరిత్ర

చాలా కాలం వరకు చిమిరేల గ్రామ పంచాయతీ క్రింద చిమిరేల, నల్లబండగూడెం, మంగలితండ గ్రామాలు వుండేవి. అయితే 1990 సంవత్సరాలలో చిమిరేల, నల్లబండగూడెం గ్రామ పంచాయితీలుగా అవి విడిపొయినవి. ప్రస్తుతం చిమిరేల గ్రామపంచాయితీ క్రింద చిమిరేల, మంగలి తండ గ్రామాలు కలవు.

[మార్చు] జనాభా వివరాలు

గ్రామంలో హిందూ, ముస్లిము, క్రిస్టియన్ మతాలకు చెందిన ప్రజలు ఉన్నారు. జనాభాలో ఎక్కువ మంది కమ్మ, లంబాడ, చాకలి, కుమ్మరి, వడ్ల, మాల, మాదిగ కులాలకు చెందినవారు.

    • మొత్తం జనాభా: 4200
    • పురుషులు  : 2050
    • స్త్రీలు  : 2200
    • ఓటర్లు  : 2950

[మార్చు] గ్రామ విశేషాలు

    • 1974 వ సంవత్సరంలో మొదటిసారి 5 వ తరగతి వరకు పాఠశాల ప్రారంభం అయినది. తరువాత 1988 వ సంవత్సరములో దానిని 7 వ తరగతి వరకు పొడిగించారు. 2004 వ సంవత్సరములో 10 వ తరగతి వరకు చేయడం జరిగింది.
    • చుట్టుప్రక్కల 5 గ్రామాల ప్రజలు మా ఊరి పశువుల ఆసుపత్రి మీద ఆదారపడతారు.
    • ప్రజలకు అవసరమైన ప్ర్రాదమిక వైద్య సేవలను అందించడానికి ఇద్దరు డాక్టర్లు (ఆర్.ఎం.పి) వున్నారు.
    • గ్రామంలో ఎటువంటి గొడవలు గాని, రాజుకీయ కక్షలు గానీ లేవు.
    • ఇంధిరా గాంధీ మరియు గాంధీ విగ్రహములు కలవు.
    • 2 హోటళ్ళు వున్నాయి.
    • ఒక మసీదు, రెండు చర్చిలు వున్నాయి.
    • మంచి నీటిని సరఫరా చేయుటకు 80,000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ టాంకు గలదు.
    • 6 కిరాణా షాపులు, 2 మంగలి షాపులు గలవు.
    • వడ్రంగులు, సుతారిలు కలరు.
    • జనాభాలో 80% అక్షరాస్యులు.
    • పొస్టాపీసు, రైతు సహకార బ్యాంకు కలవు.
    • రైతుల నుండి పాలను సేకరించుటకు 4 పాల కేంద్రములు కలవు

[మార్చు] ప్రముఖులు


[మార్చు] పదవిలో వున్నవారు

    • దారావత్ నాగేశ్వర్రావు - సర్పంచ్
    • దారావత్ బాబూరావు - ఎమ్.పి.టి.సి.
    • డి.నరేంద్ర - సహకార సంఘం అద్యక్షులు

[మార్చు] ప్రభుత్వ భవనములు

  • ప్రభుత్వ పాఠశాల
  • సహకార బ్యాంకు
  • గ్రంధాలయము
  • పశువుల ఆసుపత్రి
  • పాల కేంద్రము

[మార్చు] గతంలో సర్పంచ్ పదవి అలంకరించినవారు

  • ముండ్రా. నాగేశ్వరరావు
  • పుసులూరి సత్యనారాయణ
  • మేకల విజయకుమార్
  • కలకొండ ఆదినారాయణ
  • కొత్తా ఉషారాణి

[మార్చు] గతంలో ఎమ్.పి.టి.సీ. పదవి అలంకరించినవారు

  • కొత్తా బ్రహ్మయ్య
  • కాంపాటి వెంకమ్మ

[మార్చు] గతంలో సొసైటీ అద్యక్ష పదవి అలంకరించినవారు

  • రావూరి వెంకయ్య
  • రావూరి సత్యనారాయణ
  • రావూరి భూషయ్య
  • కొత్తా సత్యం
  • జొన్నలగడ్డ వెంకటయ్య
  • రావూరి రంగయ్య
  • కొత్తా బ్రహ్మయ్య
  • కొత్తా గురవయ్య

[మార్చు] గతంలో గ్రందాలయ అద్యక్ష పదవి అలంకరించినవారు

  • రావూరి సత్యనారాయణ
  • రావూరి రంగయ్య