వికీపీడియా నుండి
* ఈ యేడాది అత్యధికంగా 17 చిత్రాలు విడుదలయ్యాయి.
* నందమూరి, అక్కినేని తొలిసారి కలసి నటించిన బి.ఎ.సుబ్బారావు తొలి చిత్రం పల్లెటూరి పిల్ల,
ఆ ఇద్దరితోనే యల్.వి.ప్రసాద్ రూపొందించిన సంసారం చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
* జెమినీ వారి అపూర్వ సహోదరులు, ఏవీయమ్ వారి జీవితం హిట్స్గా నిలిచాయి.
* చాలా కాలం తరువాత పోటీ చిత్రాలుగా విడుదలైన ప్రతిభావారి శ్రీలక్ష్మమ్మ కథ పరాజయం చవిచూడగా,
శోభనాచల వారి లక్ష్మమ్మ ఆర్థికంగా ముందంజ వేసింది.
* నాగిరెడ్డి, చక్రపాణి 'విజయా సంస్థ'ను స్థాపించి, తొలి ప్రయత్నంగా నిర్మించిన షావుకారు చిత్రం సహజత్వానికి పెద్ద పీట వేసి,
సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిచ్చి తెలుగు సినిమా పోకడను మార్చివేసింది.
* షావుకారు చిత్రం ద్వారా జానకి, జీవితం ద్వారా వైజయంతిమాల పరిచయమయ్యారు.
* సినిమా చరిత్రకారులు ఈ యేడాది నుండే తెలుగు సినిమా 'స్వర్ణయుగం' ఆరంభమైందని పేర్కొంటారు.
యావత్ ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఐదో దశకం 'స్వర్ణయుగం'గా భాసిల్లింది.
- అదృష్టదీపుడు
- అపూర్వ సహోదరులు
- జీవితం
- తిరుగుబాటు
- పరమానందయ్య శిష్యుల కథ
- పల్లెటూరి పిల్ల
- ప్రజారాజ్యం
- బీదలపాట్లు(డబ్బింగ్?)
- మాయా రంభ
- మొదటిరాత్రి
- రాజా విక్రమార్క(డబ్బింగ్?)
- లక్ష్మమ్మ
- వాలి సుగ్రీవ
- శ్రీ లక్ష్మమ్మ కథ ( ప్రతిభ)
- శ్రీ సాయిబాబా
- షావుకారు
- సంసారం
- స్వప్న సుందరి