చినలింగాయ పాలెం
వికీపీడియా నుండి
చిన లింగాయ పాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం లోని గ్రామము. పొన్నూరు నుండి 14 కి.మీ, గుంటూరు నుండి 28 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. విద్యారంగంలో వాసికెక్కిన ఈ గ్రామం, రాజకీయంగాను చైతన్య వంతమైనది. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటి పాఠశాల ఈ గ్రామంలో ప్రారంభమై, సమీప గ్రామాల నుండి కూడ ఎన్నో మాణిక్యాలని వెలికి తీసింది. కనీస సౌకర్యాలు లేని రొజుల్లోనే, ఎంతో ప్రగతి సాధించిన ఈ గ్రామం సమీప గ్రామాలకు కూడలి. ఆది నుండి ఎందరో ప్రముఖులు చేసిన కృషి ఫలితంగా ఉన్నత పాఠశాల, పశువుల వైద్యశాల, టెలిఫోన్ ఎక్స్ఛేంజి, రక్షిత నీటి సరఫరా వంటి సౌకర్యాలు గ్రామంలో ఎర్పడ్డాయి.
[మార్చు] చినలింగాయ పాలెం గ్రామ దృశ్యాలు
- జనాభ : 1700
- సర్పంచ్ : కాకుమను రామచంద్ర రావు

