కర్నూలు

వికీపీడియా నుండి

కర్నూలు జిల్లా
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ప్రాంతము: రాయలసీమ
ముఖ్య పట్టణము: కర్నూలు
విస్తీర్ణము: 17,658 చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 35.12 లక్షలు
పురుషులు: 17.87 లక్షలు
స్త్రీలు: 17.24 లక్షలు
పట్టణ: 7.92 లక్షలు
గ్రామీణ: 27.19 లక్షలు
జనసాంద్రత: 199 / చ.కి.మీ
జనాభా వృద్ధి: 18.14 % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 54.43 %
పురుషులు: 67.36 %
స్త్రీలు: 41.07 %
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు

కర్నూలు దక్షిణభారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము చెందిన ఒక నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క మఖ్య పట్టణము. ఒకప్పుడు కందెనవోలు గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఇప్పుడు కర్నూలు గా మారింది. జిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన ప్రపంచంలోకెల్లా పెద్దదైన వన్యమృగ సంరక్షణకేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పక్షి ఇటీవల జిల్లాలోని రాళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు.


మధ్వాచార్యులు అయిన రాఘవేంద్రస్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలోదే. మంత్రాలయం తుంగభద్రానదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం. అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామిని నవరూపాలుగా కొలుస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఈజిల్లాలోదే. ఇక్కడ మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబ దేవాలయాలు ఉన్నాయి. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది.


విషయ సూచిక

[మార్చు] చరిత్ర

ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం 'కందెనవోలు'. 11వ శతాబ్దిలో 'ఆలంపూరు' లో ఆలయం కట్టడానికి బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో ఈ ప్రాంతంలో బండి చక్రాలకు 'కందెన' రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి 'కందెనవోలు' అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది.

బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనంలోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయలి కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడిలోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన 'కొండారెడ్డి బురుజు' అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.

1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్ధీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో నవాబు అయిన హిమాయత్ ఖాన్ 'కర్ణాటక యుద్ధాలు'గా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, వారి హయాంలోనికి వచ్చింది.

1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ 'బుస్సీ' (పిల్లల పాటల్లోని 'బూచాడు') కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో 'టిప్పు సుల్తాన్' మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఇప్పటి రాయలసీమ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు, ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.

18వ శతాబ్ధం లో కర్నూలు అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్‌ నవాబు యొక్క జాగీరు లో భాగముగా ఉండేది. ఈ నవాబు యొక్క వారసున్ని 1838 లో బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది. నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో బనగానపల్లె సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉన్నది.1947లో భారత దేశ స్వాతంత్రానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది.బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.

[మార్చు] ఆర్థిక రంగం

రాష్ట్రం లోని మిగతా ప్రాంతాల లాగే కర్నూలు జిల్లాలో కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి.

[మార్చు] కొన్ని గణాంకాలు

[మార్చు] జిల్లాకు ఖ్యాతి తెచ్చిన ప్రముఖులు

  • కోట్ల విజయభాస్కరరెడ్డి: ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు (1982-83, 1992-94) ముఖ్యమంత్రి.
  • దామోదరం సంజీవయ్య: ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి (1960-62), పూర్వ అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు.
  • పెండేకంటి వెంకటసుబ్బయ్య: పూర్వ కేంద్ర మంత్రి, బీహారు మరియు కర్ణాటక గవర్నరు, ఆరు మార్లు నంద్యాల నియోజకవర్గ లోక్ సభ సభ్యులు.
  • పోతులూరి వీరబ్రహ్మం: యోగి, కాలజ్ఞాన స్రుష్టికర్త.
  • పాములపర్తి వెంకట నరసింహారావు: పూర్వ ప్రధానమంత్రి, రెండు మార్లు నంద్యాల నియోజకవర్గ లోక్ సభ సభ్యులు.

[మార్చు] పేరొందిన ఉన్నత విద్యా సంస్థలు

  • కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు
  • పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలు
  • సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలు
  • కె.వి.ఆర్ డిగ్రీ కళాశాల (కశి రెడ్డి వెంకట రెడ్డి), కర్నూలు
  • రాజీవ్ గాంధీ స్మారక వైజ్ఞానిక సంస్థ, నంద్యాల
  • ప్రభుత్వ వ్యవసాయ కళాశాల, మహానంది

[మార్చు] మండలాలు

భౌగోళికంగా కర్నూలు జిల్లాను 54 రెవిన్యూ మండలములుగా విభజించినారు.

1.కౌతాలం

2.కోసిగి

3.మంత్రాలయము

4.నందవరము

5.సి.బెళగల్‌

6.గూడూరు

7.కర్నూలు

8.నందికోట్కూరు

9.పగిడ్యాల

10.కొత్తపల్లె

11.ఆత్మకూరు

12.శ్రీశైలం

13.వెలుగోడు

14.పాములపాడు

15.జూపాడు బంగ్లా

16.మిడ్తూరు

17.ఓర్వకల్లు

18.కల్లూరు

19.కోడుమూరు

20.గోనెగండ్ల

21.యెమ్మిగనూరు

22.పెద్ద కడబూరు

23.ఆదోని

24.హొలగుండ

25.ఆలూరు

26.ఆస్పరి

27.దేవనకొండ

28.క్రిష్ణగిరి

29.వెల్దుర్తి

30.బేతంచెర్ల

31.పాణ్యం

32.గడివేముల

33.బండి ఆత్మకూరు

34.నంద్యాల

35.మహానంది

36.సిర్వేల్‌

37.రుద్రవరము

38.ఆళ్లగడ్డ

39.చాగలమర్రి

40.ఉయ్యాలవాడ

41.దోర్ణిపాడు

42.గోస్పాడు

43.కోయిలకుంట్ల

44.బనగానపల్లె

45.సంజామల

46.కొలిమిగుండ్ల

47.ఔకు

48.ప్యాపిలి

49.ధోన్

50.తుగ్గలి

51.పత్తికొండ

52.మద్దికేర తూర్పు

53.చిప్పగిరి

54.హాలహర్వి

కర్నూలు జిల్లా మండలాలు

[మార్చు] జిల్లాలో చూడదగిన విశేషాలు

[మార్చు] కర్నూలులో చూడవలసినవి

[మార్చు] బయటి లింకులు

కర్నూలు జిల్లా అధికారిక వెబ్‌సైటు

ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు పూర్ణ కుంభం
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు